breaking news
Yadadri District News
-
ఆస్తులపై హక్కులు
సాక్షి, యాదాద్రి: ఏళ్ల తరబడి తమ సొంత ఇళ్లను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు కాక అవస్థలు పడుతున్న వేలాది మంది ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. వివాదాస్పద 22 ఏ (నిషేధిత భూముల) జాబితాలోని ఇళ్లు, ఇళ్ల స్థలాలకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ యంత్రాంగం సమగ్ర సవరణ ప్రక్రియకు తెరతీసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సవరణకు ఉపక్రమించిన ప్రభుత్వం జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీలు, 319 రెవెన్యూ గ్రామాలు, 422 గ్రామ పంచాయతీల్లో 22 ఏ నిషేధిత జాబితాను రూపొందించారు. ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలను అడ్డుకునే లక్ష్యంతో రిజిస్ట్రేషన్ చట్టం 1908, సెక్షన్ 22 ఏ కింద అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇనామ్, అటవీ భూములతో పాటు చెరువులు, రోడ్లను ఇందులో చేర్చారు. అయితే, ఈ క్రమంలో 39,468 ఇళ్లు, 28,549 ఎకరాల వ్యవసాయ భూమి (కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లు, పట్టా భూములు) కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ జాబితాలో చేరాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం సవరణలకు ఉపక్రమించింది. జీఓ నంబర్ 59 తరహాలోనే.. నిషేధిత జాబితాలో ఉండిపోయిన ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రజలకు పూర్తి హక్కులు కల్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 59 తరహాలోనే, కొత్తగా మరో జీఓను తీసుకువచ్చి నామమాత్రపు ధరకు భూమిని అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ నిషేధిత భూముల వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీగా లెక్కలు తీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు, వాటి విస్తీర్ణం, బాధిత రైతుల సంఖ్యను బయటకు తీస్తోంది. గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తాము కూడా అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తూ విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.ప్రభుత్వ ఆదేశాల మేరకు భువనగిరి కలెక్టరేట్లో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది రెండు రోజులుగా సవరణలు చేస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి కుటుంబ యజమాని పేరు, ఇంటి నంబర్లను తొలగించారు. అధికారిక పోర్టల్లో కేవలం సర్వే నంబర్, అందులో ఎంత భూమి ఉందన్న వివరాలు మాత్రమే ఉంచుతున్నారు. దీనివల్ల, గతంలో మాదిరిగానే ఇంటి నంబర్ ఆధారంగా సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు ప్రజలకు కలగనుంది. ఫ నిషేధిత జాబితా నుంచి కుటుంబ యజమాని పేరు, ఇంటి నంబర్ తొలగింపు ఫ ఇకపై కేవలం సర్వేనంబర్, భూమి విస్తీర్ణం వివరాలు మాత్రమే ఫ రాష్ట్రంలోనే తొలిసారిగా యాదాద్రి భువనగిరిలో ప్రయోగాత్మకం -
వ్యక్తి అదృశ్యం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో ఆగస్టు 26న అదృశ్యమైన ఓ వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పట్టణ పోలీసులు సోమవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం రాఘపట్నం గ్రామానికి చెందిన గంట వెంకటరామయ్య (42) రాడ్ బెండింగ్ పనుల నిమిత్తం సూర్యాపేటకు వచ్చి అదృశ్యమయ్యాడు. వెంకటరామయ్య తనకు పరిచయస్తుడైన బుల్ల బాలుతోపాటు మరో తొమ్మిది మందితో కలిసి సూర్యాపేటకు వచ్చి ఉంటున్నారు. గతనెల 26న ఉదయం సుమారు 9.30 గంటలకు తాళ్లగడ్డ ప్రాంతంలో అందరూ కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మిగిలిన వారంతా తమ గదికి తిరిగి వెళ్లగా, వెంకటరామయ్య మాత్రం వారితో వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అతని ఆచూకీ లభించలేదు. పరిచయస్తులు, బంధువులు పరిసర ప్రాంతాలు, తెలిసిన ప్రదేశాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సూర్యాపేట టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వెంకట రామయ్య ఆచూకీ తెలిసిన వారు, ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే సూర్యాపేట టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం కోసం ఫోన్ 9948691481, 8712680134 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
బీఆర్ఎస్ పోరాట ఫలితమే ‘డబుల్’ ఇళ్ల పంపిణీ
భువనగిరి టౌన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలంటూ తమ పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే నేడు గృహప్రవేశాలు సాధ్యమయ్యాయని బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సొంతింటి కల సాకారమైనందుకు కృతజ్ఞతగా లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసీఆర్ ఆలోచన, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి చొరవతో భువనగిరిలో 444 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హులైన నిరుపేదలను లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఎంపిక చేసి పట్టాలు అందజేసినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం చివరకు మొదటి విడత గృహప్రవేశాలు చేయించిందన్నారు. మిగిలిన 10 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, రెండో విడత లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, ఖాజా అజిమోద్దీన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రెండు ఆటోలు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు
కేతేపల్లి : రెండు ఆటోలు ఢీకొనడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం నకిరేకల్ నుంచి ప్రయాణికులతో సూర్యాపేటకు వెళ్తున్న ఆటోను కేతేపల్లి మండలంలోని చీకటిగూడెం శివారులోని 65 జాతీయ రహదారి గల సాయికృష్ణ హోటల్ సమీపంలో వెనకాల వస్తున్న ట్రాలీ ఆటో ఢీకోట్టింది. ఇదే సమయంలో ఆటోల వెనకాలే హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తున్న సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని గ్రహించి బస్సును కుడి వైపుకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్పైకి ఎక్కి నిలిచిపోయింది. ప్రమాదానికి కారణమైన రెండు ఆటోలు రోడ్డు పక్కనే ఉన్న గుంతల్లోకి దూసుకెళ్లి పల్టీకొట్టాయి. ఈప్రమాదంలో ముందున్న ఆటోలో ప్రయాణిస్తున్న ఎన్.సైదులు, మహమ్మద్లకు తీవ్రగాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్టయ్యింది. క్షతగాత్రులను 108 వాహనంలో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేతేపల్లి పోలీసులు ప్రమాద ఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. డివైడర్పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. డివైడర్పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు -
కాలుష్య భూతంపై ‘ఫ్లెక్సీ’తో అవగాహన
భూదాన్పోచంపల్లి : మండలంలోని అంతమ్మగూడెం గ్రామంలో కాలుష్య విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రసాయన కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ పరిఽధిలోని రసాయన కంపెనీలు వెదజల్లుతున్న పలు రకాల కాలుష్య రసాయనాల కారకాలపై పీసీబీ ఇచ్చిన రిపోర్టులను ఫ్లెక్సీలపై ముద్రించారు. అయితే గ్రామంలో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన చుట్టాలు, గ్రామస్తులు ఫ్లెక్సీలను ఆసక్తి తిలకించారు. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
సీనియర్ సిటిజన్లకు అండగా పోలీస్ శాఖ
భువనగిరి: సీనియర్ సిటిజన్లకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవకుల మండల కమిటీల జాబితాను సోమవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగుంట వెంకటేశం, జిల్లా టాస్క్ సభ్యుడు కరిపే నర్సింగ్రావు, నాయకులు సత్యనారాయణరెడ్డి, దశరథ, నర్సింగ్రావు, రవీందర్, లక్ష్మీనారాయణ, రాములు, శ్రీరామ్ సత్తయ్య, రోమన్, రాజిరెడ్డి పాల్గొన్నారు. పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించాలని వినతిచౌటుప్పల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకోవాలని కోరుతూ పలువురు సింగిల్విండోల చైర్మన్లు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది క్రితమే పదవీకాలం ముగియగా ప్రభుత్వం రెండు పర్యాయాలు పొడిగించిందన్నారు. అయితే చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నామినేషన్ ప్రక్రియ ద్వారా పాలకవర్గాలను నియమించి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వెంటనే నామినేషన్ పద్ధతిని నిలిపివేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్లు చింతల దామోదర్రెడ్డి, సుర్కంటి వెంకట్రెడ్డి, జి.బాలచందర్, కందాటి భూపాల్రెడ్డి, వి.లక్ష్మీనర్సయ్య, దౌడ యాదిరెడ్డి, డి.రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలియాదగిరిగుట్ట: బయో సైన్స్లో మెళకువలను విద్యార్థులకు అర్థమయ్యే రితీలో బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సూచించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బయో సైన్స్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బయో సైన్స్ ఉపయోగాలను విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శరత్ యామిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి వెల్లంకిలో మద్యం అమ్మకాలు నిషేధం రామన్నపేట: అఖిలపక్షం తీర్మానం మేరకు మంగళవారం నుంచి వెల్లంకి గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధమని, దీనికి అందరూ సహకరించాలని సర్పంచ్ ఇడెం రాధాశ్రీనివాస్ కోరారు. మద్యం అమ్మకాల నిషేధానికి మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం వెల్లంకిలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్షం నిర్ణయానికి వ్యతిరేకంగా మద్యం అమ్మితే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవనగంటి నాగేష్, బర్ల గణేష్, పాశం సతీష్, నకిరేకంటి నరేందర్, వీఓఏ విజయలక్ష్మి, ఆవనగంటి మల్లేశం, శ్రీనివాస్, మహేష్, తాటిపాముల శ్రీశైలం, నవీన్, చెరుపల్లి శ్రవన్, పాలెం స్వామి పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణి అర్జీలను పెండింగ్ పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 47, సర్వే, ల్యాండ్స్ 5, ఉపాధి కల్పన 3, గ్రామీణాభివృద్ధి 2, పంచాయతీ 2, మున్సిపాలిటీ 2, ఎంపీడీఓలు 2, బీసీ వెల్ఫేర్ 2, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, సంక్షేమ, ఉద్యానవన, ఎల్డీఎం, చేనేత–జౌళి, మార్కెటింగ్, కో–ఆపరేటివ్, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్ పాల్గొన్నారు. హైవేల వెంట భారీ వాహనాలు పార్కింగ్ చేయొద్దు సాక్షి, యాదాద్రి : జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్లో ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. రోడ్డుపై ఆక్రమణలు జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రోడ్లు, భవనాల అధికారి సరిత, జిల్లా రవాణా అధికారి నరేష్, హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్ వర్క్బుక్ రూపకల్పనలో శశికుమార్ ప్రతిభ
మోత్కూరు : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) 8వ తరగతి ఇంగ్లిష్ వర్క్ బుక్ రూపకల్పనలో మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మేకల శశికుమార్ భాగస్వామ్యమై తనదైన ప్రతిభ కనబర్చి ప్రశంసాపత్రం అందుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి రూపొందించిన 8వ తరగతి ఇంగ్లిష్ వర్క్బుక్లో కంటెంట్ డెవలపర్గా ఆయన సేవలందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, అంతర్లీన శక్తులను వెలికి తీసేలా అయన రాసిన డిస్కవరీ ట్రెజరీ విత్ ఇన్ యూ అనే కవిత ఆ వర్క్బుక్లో చోటు దక్కించుకుంది. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ వర్క్బుక్కు కంటెంట్ డెవలపర్గా ఎంపికై పాఠ్యాంశ రూపకల్పనలో తన వంతు కృషి చేసిన మేకల శశికుమార్ను మోత్కూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం డి.అరవిందరాయుడు, సిబ్బంది సోమవారం అభినందించారు. -
చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి
మిర్యాలగూడ టౌన్ : వేర్వేరు చోట్ల చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ ఘటనలు మిర్యాలగూడ, నిడమనూరు మండలాల పరిధిలో పరిధిలో చోటుచేసుకున్నారు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్కు చెందిన కొమెర సైదమ్మ(39) తన భర్త గణేష్ను మద్యం సేవించవద్దని చెప్పినా వినకపోవడంతో మనస్థాపానికి గురై ఆగస్టు 30న పురుగుల మందు తాగింది. గమనించిన భర్త గణేష్, ఆయన కుమారుడు సాయితేజ ఆటోలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి తల్లి పిట్టల జ్యోతి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిడమనూరులో ఒకరు..నిడమనూరు : ఆర్థిక ఇబ్బందులతో వివాహిత తల్లిగారింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల ప్రకారం నిడమనూరు చెందిన గోగుల లింగయ్య కుమార్తె సూజత(37)ను, నార్కట్పల్లి మండల ఎల్లారెడ్డిగూడేనికి చెందిన వరికుప్పల కృష్ణతో 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. ఇటీవల తల్లిగారింటికి వచ్చిన సూజత ఈనెల 28న పేరుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. సూజతకు ఇద్దరు కుతూర్లు ఉండగా ఒకరికి వివాహమైందిది. మృతురాలి తండ్రి గోగుల లింగయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించాలి
భువనగిరిటౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ప్రాజెక్టుల నిధుల సాధనకు ఈనెల 29న చేపట్టిన చలో హైదరాబాద్ పాదయాత్ర సోమవారం ఇందిపార్కు వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురవుతున్న బీఎన్తిమ్మాపూర్, నాయక్ తండా నిర్వాసితులకు రూ.420 కోట్ల నష్టపరిహారానికి రూ.206 కోట్లు మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నారు. గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు కుదించినా నిర్మాణ పనులకు బడ్జెట్ ఇవ్వలేదని, చర్లగూడెం పనులు పదేళ్లుగా సాగుతున్నా అతీగతి లేదని మండిపడ్డారు. రాచకొండ ఎత్తిపోతల పథకానికి వెంటనే డీపీఆర్ ఖరారు చేసి నిధులు మంజూరు చేయాలన్నారు. బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలను త్వరితగతిన పూర్తి చేయాలని, మూసీ ప్రక్షాళన పనులకు డీపీఆర్ ప్రకటించి ఎస్టీపీలు ఏర్పాటు చేసి గోదావరి జలాలను అనుసంధానించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.డీ. జహంగీర్, నాయకులు డీజీ నరసింహారావు, కొండమడుగు నరసింహ, వెంకటరాములు, ఆనగంటి వెంకటేష్, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాస చారి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్ పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఫ ఇందిరాపార్క్ వద్ద ధర్నా -
సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వం
భువనగిరిటౌన్ : పదేళ్లుగా నిలిచిపోయిన పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే నిజం చేసి చూపిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పనులను పూర్తి చేయించి మొదటి విడతలో 120 మందిరి కేటాయించామన్నారు. భువనగిరి నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే 3,000 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై, 1,650 గృహప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి నియోజకవర్గానికి కొత్తగా మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించబోతున్నామని పేర్కొన్నారు. 45 రోజుల్లో భువనగిరిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ శ్రీవాణిరవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఆందోళన గత ప్రభుత్వంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపికై న 444 మందికి ఒకేసారి ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. డబుల్బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ సభ ముగింపు దశకు వచ్చే సమయంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా ఆందోళనకు దిగారు. సభా ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఫ సింగన్నగూడెంలో120 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభం -
సీపీఎస్ రద్దుకు ఉపాధ్యాయుడి దీక్ష
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ నిరసన దీక్ష చేపట్టారు. ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు 40 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవుపల్లి మండలం చిట్యాల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నాగవెల్లి ఉపేందర్ ఆగస్టు 23న మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని గౌరీశంకర్ ఆలయం వద్ద గుండు కొట్టించుకొని పాదరక్షలు లేకుండా నల్ల చొకా వేసుకొని ఈ దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా చలనం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టినట్లు ఉపాధ్యాయుడు ఉపేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల వరకు సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని వారి ఆశలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తన దీక్షతోనైనా ప్రభుత్వ పెద్దల మనస్సు మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గుండుకొట్టించుకొని.. పాదరక్షలు లేకుండా నల్లచొక్కతో విధులకు -
పత్తిలో సమతుల్య పోషకాలు కీలకం
గరిడేపల్లి: వర్షాధారంగా సాగు చేసే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి. పత్తిలో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పత్తిని పొందాలంటే సమతుల్య పోషక యాజమాన్యం ఎంతో కీలకం. మొక్కకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులో, సరైన సమయంలో అందించకపోతే మొక్క ఎదుగుదల, పూత, పిందె, కాయల అభివృద్ధి, పత్తి నాణ్యత, చివరికి దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు ద్వితీయ, సూక్ష్మ పోషకాలపైనా రైతులు శ్రద్ధ చూపాలి. ప్రధాన పోషకాల నిర్వహణ ● పత్తి పంటకు సాధారణంగా ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అందేవిధంగా సిఫార్సు చేసిన ఎరువుల మోతాదును పాటించాలి. నేల పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదులను సర్దుబాటు చేసుకోవడం మరింత సమర్థవంతమైన విధానం. ● భాస్వరం పంట ప్రారంభ దశలోనే వేర్ల అభివృద్ధికి అవసరమవుతుంది. అందువల్ల సిఫార్సు చేసిన మొత్తం భాస్వరం మోతాదును సాధారణంగా చివరి దుక్కిలో లేదా విత్తిన 15 రోజులు లోపు వేయాలి. విత్తిన తర్వాత పైపాటుగా భాస్వరం వేయడం సాధారణంగా అవసరం ఉండదు. ● నత్రజని పత్తి మొక్కలో శాఖల అభివృద్ధి, ఆకుల పెరుగుదల, పూత, పిందె, కాయల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. నత్రజనిని అధికంగా వేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి, పూత–కాయల ఏర్పాటులో సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సిఫార్సు చేసిన నత్రజని మోతాదును ఒకేసారి కాకుండా పంట దశను బట్టి విడతలుగా అందించాలి. ● పొటాష్ మొక్కలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాయల అభివృద్ధి, పత్తి నాణ్యత, నీటి ఎద్దడి వంటి వివిధ ఒత్తిడి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. వర్షాధార పత్తిలో పొటాష్ను నిర్లక్ష్యం చేయకుండా సిఫార్సు చేసిన మోతాదులో అందించడం ముఖ్యం. ● నత్రజని–పొటాష్ను విడతలుగా బీటీ పత్తిలో సిఫార్సు చేసిన నత్రజని, పొటాష్ మోతాదులను 20, 40, 60, 80 రోజులలో నాలుగు విడతలుగా అందించవచ్చు. ఎకరాకు ప్రతి విడతలో సుమారు 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయడం ద్వారా అవసరమైన నత్రజని, పొటాష్ను అందించవచ్చు. ఈ విధంగా విడతలుగా అందించడం వల్ల పోషకాల వినియోగ సామర్థ్యం మెరుగుపడి, మొక్కకు అవసరమైన దశలో పోషకాలు అందే అవకాశం ఉంటుంది. నీటి లభ్యత, నేల స్వభావం, పంట స్థితిని బట్టి ఎరువుల నిర్వహణలో మార్పులు చేసుకోవాలి. ద్వితీయ, సూక్ష్మ పోషకాల లోపాలు, యాజమాన్యం ● జింక్ లోపం ఒకే పంటను పదేపదే సాగు చేయడం, చౌడు ప్రభావం ఉన్న నేలలు, భాస్వరం ఎరువులను అధికంగా ఉపయోగించడం వంటి పరిస్థితుల్లో జింక్ లోపం కనిపించే అవకాశం ఉంటుంది. జింక్ లోపం వల్ల ఆకులు చిన్నవిగా, ముడతలుగా మారి, కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ లోపాన్ని నివారించేందుకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ● మెగ్నీషియం నేలలో పొటాష్ అధికంగా ఉండటం వంటి పరిస్థితుల్లో మెగ్నీషియం అందుబాటు తగ్గి లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ పోషక లోపం వలన ముదురు ఆకుల అంచులు మారుతాయి. తరువాత ఆకులు ఎరబ్రడి ఎండి రాలిపోతాయి. ఆకుల ఈనెలు మాత్రం రంగు మారక ఆకుపచ్చగా ఉంటాయి. దీనిని నివారించేందుకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ ను కలిపి వారం పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ● బోరాన్ సున్నం అధికంగా ఉన్న నేలల్లో, అలాగే నీటి ఎద్దడి లేదా బెట్ట పరిస్థితుల్లో బోరాన్ లోప లక్షణాలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. బోరాన్ లోపం వల్ల పూత, పిందె, చిన్న కాయలు రాలడం, పూలు చిన్నవిగా మారడం, మొక్క ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లోపాన్ని నివారించేందుకు లీటరు నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ కలిపి ఒకటి లేదా రెండు సార్లు 7–10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితుల్లోనూ పోషక యాజమాన్యం ముఖ్యం పత్తిలో పోషకాల లభ్యత, మొక్క వాటిని గ్రహించి వినియోగించే సామర్థ్యంపై వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. నీటి ఎద్దడి, బెట్ట పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమలో మార్పులు వంటి పరిస్థితుల్లో మొక్కలో సహజ శారీరక ప్రక్రియలు దెబ్బతిని పత్తిలో కూడా, పూత, పిందె, చిన్న కాయలు రాలే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా పొలంలో నీటి లభ్యతను మెరుగుపరచడం, సాధ్యమైన చోట రక్షక నీటిపారుదల అందించడం, నేలలో తేమను సంరక్షించే చర్యలు చేపట్టడం ముఖ్యం. దీర్ఘకాలిక బెట్ట పరిస్థితుల్లో పత్తిలో పూత, కాయ రాలడాన్ని తగ్గించేందుకు ప్లానోఫిక్స్ (10 పిపియం) ద్రావణాన్ని 5 లీటర్ల నీటికి ఒక మి.లీ చొప్పున కలిపి 10– 15 రోజులో రెండుసార్లు పిచికారి చేయాలి. ● పూత, పిందె దశలో మొక్కకు తగిన పోషకాలు అందించేందుకు అవసరాన్ని బట్టి యూరియా లేదా ఈఅ్క వంటి నీటిలో కరిగే ఎరువులను 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయవచ్చు. లేదా మార్కెట్లో లభ్యమయ్యే నానో యూరియా, నానో డీఏపీ వంటివి కూడా పిచికారి చేసుకోవచ్చు. ● బెట్ట పరిస్థితుల్లో మొక్కల ఒత్తిడిని కొంతవరకు తగ్గించేందుకు 13:0:45 (పొటాషియం నైట్రేట్) లేదా 19:19:19 వంటి నీటిలో కరిగే ఎరువులను 5 నుండి 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పంట దశ, వాతావరణ పరిస్థితులను బట్టి ఆకులపై పిచికారీ చేయవచ్చు.ఫ పోషక యాజమాన్యంపై కేవీకే శాస్త్రవేత్త సూచనలు -
సాగర్ నుంచి సోమశిలకు ‘పంటు’
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయ తీరంలో రూ.4 కోట్ల వ్యయంతో మొత్తం మూడు పంట్ల (లాంచీ ఎక్కేందుకు వినియోగించేవి) తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిలో రెండు పంట్లను నాగార్జునసాగర్ పర్యాటకుల కోసం కేటా యించగా, వాటిలో ఒకటి నాగార్జునకొండ వద్ద, మరొకటి సాగర్ తీరంలో ఉంటాయని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. మూడో పంటును సోమశిల ప్రాజెక్టు కోసం తయారు చేశారు. ఈ పంటు నిర్మాణం పూర్తి కావడంతో సోమవారం దానిని లారీలో సోమశిల వద్దకు తరలించారు. విశాఖపట్నానికి చెందిన మా తారా మైరెన్ అండ్ షిప్యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇండియన్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) ఈ పంట్ల నిర్మాణానికి ఆర్డర్ ఇచ్చింది. వారు ఈ పనులను కోల్కతాకు చెందిన బ్లూవేస్ మ్యాన్పవర్ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ సిబ్బంది సాగర్ తీరంలోనే ఉంటూ ఒక పంటును పూర్తిచేశారు. మిగిలిన రెండింటిని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అధునాతన సౌకర్యాలతో..ప్రస్తుతం సాగర్లో పర్యాటకులు లాంచీలు ఎక్కేందుకు వినియోగిస్తున్న పంట్ల కంటే, నూతనంగా తయారవుతున్న పంట్లు ఒక్కొక్కటి 6 మీటర్ల వెడల్పు, 24 మీటర్ల పొడవుతో పెద్దగా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఇంజిన్లు కూడా అమర్చనున్నా రు. దీంతో అవసరాన్ని బట్టి కొంత దూరం వరకు నీటిలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. వీటిపై కార్లు, జేసీబీల లాంటి భారీ యంత్రాలను తరలించవచ్చు. ప్రస్తుతానికి పర్యాటకులు లాంచీ ఎక్కేందుకు, దిగేందుకు వీటిని వినియోగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఈ నూతన పంట్లు అందుబాటులోకి వస్తే సాగర్ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.4 కోట్లతో మూడు పంట్ల తయారీకి నిర్ణయం ఇప్పటికే ఒకదాని పనులు పూర్తి మిగతా రెండు తయారైతే సాగర్ జలాశాయానికి కేటాయింపు -
ఎల్నినో ప్రభావంతో 15 మండలాల్లో కరువు ఛాయలు
మూడు నెలల్లో కురవాల్సిన, కురిసిన వర్షం వివరాలు మిల్లీ మీటర్లలో మండలం కురవాల్సింది కురిసింది లోటు వర్షపాతం తుర్కపల్లి 326.4 232.2 –29 రాజాపేట 341.3 202.5 –41 ఆలేరు 390.8 214.9 –45 మోటకొండూరు 386.6 227.1 –41 యాదగిరిగుట్ట 397.9 264.2 –34 భువనగిరి 431.9 221.8 –49 బి.రామారం 359,7 281.2 –22 బీబీనగర్ 390.3 211.8 –46 పోచంపల్లి 386.4 263.2 –32 చౌటుప్పల్ 311.7 211.7 –32 నారాయణపురం 237.5 198.0 –17 రామన్నపేట 379.8 188.3 –50 వలిగొండ 407.5 292.8 –28 ఆత్మకూర్– ఎం 340.6 285.7 –16 మోత్కూరు 435.0 322.4 –28 అడ్డగూడూరు 429.9 309.3 –28 గుండాల 437.3 246.5 –44 మొత్తం 375.9 245.5 –35 సాక్షి, యాదాద్రి: వరుణుడు ముఖం చాటేశాడు. వానాకాలం సీజన్లో మూడు నెలలు దాటినా చినుకు జాడ కన్పించడంలేదు. ఎల్నినో ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సాధారణం కంటే 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 17 మండలాలకు గాను ఏకంగా 15 మండలాలు కరువు జాబితాలోకి వెళ్లాయి. దీంతో పంటలు ఎదిగే దారిలేక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. సాధారణం కంటే పడిపోయిన వర్షపాతం జూన్, జూలై, ఆగస్టు 31 నాటికి జిల్లాలో వర్షపాతం సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోయింది. సాధారణంగా ఈ మూడు నెలల్లో కలిపి 375.9 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 245.5 మి.మీ మాత్రమే కురిసింది. ఈ సీజన్ మొత్తంలో జిల్లాలోని 17 మండలాల్లో కేవలం రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సంస్థాన్ నారాయణపూర్లో (–17శాతం), ఆత్మకూర్–ఎంలో 16శాతం లోటువర్షపాతం ఉంది. ఈరెండు మండలాలను సాధారణ వర్షపాతం పరిధిలో చేర్చారు. తీవ్ర లోటు ఉన్న మండలాలు15 జిల్లాలోని 15 మండలాలు తీవ్ర వర్షాభావంతో లోటు జాబి తాలో చేరాయి. రామన్నపేట మండలంలో అత్యధికంగా 50శాతం లోటు నమోదు అంటే (సాధారణం 379.8 మిమీ కి గాను 188.3 మిమీ మాత్రమే), భువనగిరి మండలంలో 49 శాతం లోటు వర్షపాతం (221.8 మిమీ). బీబీనగర్ 46శాతం, ఆలేరు 45శాతం, గుండాల 44శాతం లోటు వర్షపాతం నమో దైంది. అంటే ఆయా మండలాలు కరువు పరిస్థితుల్లోకి వెళ్లాయి. తీవ్రవర్షాభావ లోటు మెట్ట, తరిపంటలపై ప్రభావం పడింది. పంటల సాగు అంచనాలు తలకిందులు జిల్లాలో ఈ సారి పంటల సాగులో వ్యవసాయ శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. అన్ని పంటలు కలిపి4,66,604 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేయగా 3,80,145 ఎకరాల్లో సాగు చేశారు. వీటిలో వరి 2,03,744 ఎకరాల్లో సాగు అయ్యింది. వీటిలో మూసీ ఆయకట్టులోనే 96,564 ఎకరాలు కాగా మిగతాదంతా వర్షాలు, భూగర్భ జలాలమీదనే ఆధారపడి సాగు చేశారు. పత్తిసాగు మీద వర్షాకాలం ప్రభావం తీవ్రంగా పడింది. 1,12,079 పత్తిసాగైంది. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా కందుల సాగు 16,375 ఎకరాల్లో సాగు చేశారు. చుక్క నీరు లేక చెరువులు వెలవెల జిల్లాలోని 1,155 నీటి వనరుల్లో మూసీ నది పరివాహక ప్రాంతంలోని 90 చెరువులు మినహా మిగిలినవన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలోని చెరువులన్నీ నిండితే 10 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండేది, కానీ ప్రస్తుతం కేవలం 3 టీఎంసీలు అందుబాటులో ఉంది. అలుగులు పోసిన చెరువులు 12, 75శాతం నుంచి వందశాతం నిండినవి 78, 50శాతం నుంచి 75శాతం నిండినవి 178, 25శాతం నుంచి 50శాతం నిండినవి 217, 25శాతం కంటే తక్కువ నిండినవి 670 చెరువులు ఉన్నాయి.ఫ జిల్లాలో 35శాతం లోటు వర్షపాతమే ఫ ఆశలు వమ్ము చేసిన ఆగస్టు ఫ దిక్కుతోచని స్థితిలో రైతాంగం -
ఒకేరోజు మూడిళ్లలో చోరీ
మర్రిగూడ : తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో ఒకేరోజు చోరీలు జరిగాయి. మర్రిగూడ ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాలు.. మర్రిగూడ మండలం శివన్నగూడెం, ఖుదాబక్ష్పల్లి గ్రామాల్లో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు ఒకే రోజు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టామన్నారు. ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తే పోలీసులకు, ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అమరవరంలో మరో ఇంట్లో.. హుజూర్నగర్ : తాళం వేసిఉన్న ఇంట్లో చోరీకి పాల్పడి రూ.15 వేల నగదును అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన సోమవారం హుజూర్నగర్ మండలం అమరవరంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన చేపూరి రామారావు తన ఇంట్లో కిరాణా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. అతను తన కంటి ఆపరేషన్ నిమిత్తం ఈనెల 22న హైదరాబాద్కు వెళ్లి అక్కడ వైద్యం చేయించుకున్నాడు. ఆసుపత్రి నుంచి ఆగస్టు 30న ఇంటికి వచ్చి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వెనకాల ఉన్న తలుపుని తెరిచి గడ్డపారతో ఇనుప బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.15 వేల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. తగ్గని వాహనాల రద్దీచౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం కూడా హైదరాబాద్ మార్గంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. కిలోమీటర్ల మేరకు వాహనాలు బారులుదీరాయి. పట్టణంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో వాహనాలను సర్వీస్ రోడ్ల మీదుగా మళ్లించారు. అయినా అర్ధరాత్రి వరకూ రద్దీ ఏ మాత్రమూ తగ్గలేదు. ఫలితంగా వాహనదారులు, స్థానిక ప్రజానీకం నానా అవస్థలకు గురయ్యారు. -
కారు అద్దం పగులగొట్టి సెల్ఫోన్లు, వెండి ప్లేట్ అపహరణ
● యాదగిరి కొండపై ఘటన యాదగిరిగుట్ట : పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగులగొట్టి అందులోని సెల్ఫోన్లు, చిన్న వెండి ప్లేట్లు అపహరించిన సంఘటన సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన చోటు చేసుకుంది. ఎస్పీఎఫ్ సీఎస్ఓ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కారులో యాదగిరీశుడిని దర్శనానికి వచ్చాడు. శివాలయానికి వెళ్లే దారిలోని ర్యాంప్ సమీపంలో కారును పార్క్ చేశాడు. దర్శనానికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారు వెనక భాగంలో అద్దం పగులగొట్టి, అందులో ఉన్న రెండు సెల్ఫోన్లు, అన్న ప్రాసన చేసే చిన్న వెండి ప్లేట్ను అపహరించారు. ఈ విషయమై బాధితుడు కొండపైన ఈఓ భవాని శంకర్కు తెలిపారు. ఇప్పటికే ఓ వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సీఎస్ఓ పేర్కొన్నారు. జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్యగుర్రంపోడు : మండలంలోని పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి యాదగిరి(43) సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం యాదగిరి పదేళ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో తన అనారోగ్యం గురించి ఆలోచిస్తూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వ్యవసాయం చేయడంతోపాటు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి తమ్ముడు బైరి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రియాక్టర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ మరొకరు మృతిభూదాన్పోచంపల్లి : మండలంలోని దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో ఆగస్టు 21న అర్ధరాత్రి రియాక్టర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వేదుల చెన్నకేశవులు (38) ఆదివారం మృతిచెందాడు. పోస్ట్మార్టమ్ అనంతరం పోలీ సులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా వేదుల చెన్నకేశవులు హెజిలో ఫార్మా కంపెనీలో 2021లో కెమిస్ట్రీగా విధుల్లో చేరాడు. మృతుడికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న చెన్నకేశవులు మృతిచెందడంలో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. కాల్వలోపడి మేకలకాపరి మృతినిడమనూరు : సాగర్ కాల్వ వెంట మేకల మేపుతున్న కాపరి మైనర్ కాల్వలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన కంసాని దుర్గయ్య(59), భార్య అంజమ్మతో కలిసి సాగర్ ఎడమకాల్వ వెంట నారెళ్లగూడెం మేజర్ వద్ద మేకలు మేపుతుండగా మైనర్ కాల్వలో జారిపడ్డాడు. గుర్తించిన భార్య అంజమ్మ సాయమందించే సరికే నీటి ప్రవాహానికి కొట్టుకపోయి, నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దుర్గయ్య కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
దేవుడికి మనసును అర్పించడమే భక్తి..
భక్తి అంటే పూజలు చేయడం, కానుకలు ఇవ్వడం కాదు.. దేవుడి ముందు మనసును ఉంచి ప్రశాంత పరుచుకోవడమే. ఈ ఉద్దేశంతోనే ఆర్గానిక్ కృష్ణ మందిరం ప్రకృతి ఒడిలో ఉండేలా తీర్చిదిద్దాం. శ్రీకృష్ణ భక్తిని పెంపొందించడం, ప్రకృతిని పరిరక్షించడం, సనాతన ధర్మ విలువలను భవిష్యత్తు తరాలకు అందించడమే నా జీవిత లక్ష్యం. ఈ సంకల్పంతోనే మందిరాన్ని ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. – పానుగుళ్ల వెంకటేశ్వర్లు, ఆర్గానిక్ కృష్ణ మందిరం వ్యవస్థాపకుడు -
విస్తృత పరిశోధనలకు చిరునామా
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ అమృత వసంత సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలో ఆలిండిడియా 297వ ర్యాంక్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ హరి పద్మశ్రీ మార్గదర్శకత్వంలో నానో కాంపోజిట్ అంశంపై విస్తృత పరిశోధనలు చేసి 2024లో పీహెచ్డీ పట్టా పొందారు. ఆమె పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పలు జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. తన పరిశోధనలకు గుర్తింపుగా రెండు భారతీయ పేటెంట్లను దాఖలు చేశారు. డిగ్రీ విద్యార్థుల కోసం 5 పాఠ్య పుస్తకాలను, పోటీ పరీక్షల నిమిత్తం మరొక పుస్తకాన్ని ఆమె రచించారు. జనవరి 2026లో నల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో అంతర్జాతీయ సెమినార్లను ఆమె విజయవంతంగా నిర్వహించారు. అలాగే పలు అంతర్జాతీయ, జాతీయ సెమినార్లలో చైర్పర్సన్గా వ్యవహరిస్తూ పరిశోధనా పత్రాలను సమర్పించారు. అమృత వసంత, ప్రభుత్వ మహిళా ఉమెన్స్ కళాశాల, నల్లగొండ -
ఫార్మసీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు
● ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్ : ఫార్మసీ రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం నల్లగొండలోని ఎంజీయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ కోర్సులో చేరిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విషయ పరిజ్ఞానం, ప్రాయోగిక, వృత్తి నైపుణ్యం, పరిశోధనా దృక్పథం పెంపొందించుకున్న విద్యార్థులకు ఫార్మసీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 34 మంది విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ కోర్సులో చేరడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ విభాగాధిపతి జ్యోతి, ఆర్ఎస్.అన్నపూర్ణ, వై.ప్రశాంతి, డి.రమేష్, కళ్యాణి, అమరేందర్, జి.ఉపేందర్, హైమావతి, మద్దిలేటి, శంకరాచారి, శ్రీధర్రావు, తిరుపతి పాల్గొన్నారు. క్రీడా పోటీల క్యాలెండర్ ఆవిష్కరణనల్లగొండ టూటౌన్: నల్లగొండలోని ఎంజీయూలో గురువారం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంతర్ కళాశాల క్రీడా పోటీల క్యాలెండర్ను వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీల క్యాలెండర్ విడుదల చేయడం విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఒక ముందడుగు అన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ పసుపుల మద్దిలేటి, యూనిర్సిటీ సిబ్బంది ఆకుల రవి, శివరాం, శ్రీదేవి, ప్రశాంతిరెడ్డి, ఆర్. మురళి, వై. శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పోటీలకు ఎంపికరామన్నపేట : పాండిచ్చేరిలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న 37వ సౌత్జోన్ జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీలకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థిని తోటకూరి శివాని ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాహత్ఖానం తెలిపారు. ఆగస్టు 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో శివాని 1000 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానం సాధించి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. శివానిని గురువారం ప్రిన్సిపాల్, పీడీ ఎం. రవీందర్రావు అభినందించారు. మహిళ ఆత్మహత్యచిలుకూరు : ఇంట్లో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిలుకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన మంద భాగ్యలక్ష్మి(35)కి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం రాత్రి భర్త, ఇద్దరు పిల్లు ఒక గదిలో నిద్రించగా.. మరో గదిలో నిద్రించిన భాగ్యలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ మోహన్బాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అప్పల రంగయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నడకదారి మూసివేతపై ఆందోళన
చౌటుప్పల్ : చౌటుప్పల్లో అండర్పాస్ నిర్మాణంలో భాగంగా నవోదయ టాకీస్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రారంభ పాయింట్ నుంచి వలిగొండ రోడ్డు వరకు పనులు సాగుతున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్టాండ్, చిన్నకొండూర్ రోడ్డు, తంగడపల్లి రోడ్డు వద్ద జంక్షన్లను మూసివేశారు. ఆ ప్రాంతాల మీదుగా వాహనాలు వెళ్లకుండా సిమెంట్ దిమ్మెలు అడ్డుగా పెట్టారు. ఆర్టీసీ బస్స్టేషన్ వద్ద జనం కాలినడకన రాకపోకలు సాగించేందుకు చిన్నపాటి దారి కేటాయించారు. గురువారం సాయంత్రం కాంట్రాక్టు సంస్థ ఉద్యోగులు అకస్మాత్తుగా ఆ దారిని మూసివేశారు. ప్రజలు నడిచి వెళ్లకుండా అడ్డంగా గొయ్యి తవ్వించారు. తూర్పున వలిగొండ క్రాస్రోడ్డు, పడమర లక్కారం పీయూపీ వద్ద నుంచి రాకపోకలు సాగించాలంటూ కాంట్రాక్టు సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే కొంత మంది మహిళలు, వృద్ధులు, విద్యార్థులు వాటిని దాటేందుకు యత్నించగా కిందపడిపోయారు. బీజేపీ నాయకుల రాస్తారోకో బస్టాండ్ వద్ద తలెత్తిన సమస్య బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి ఆలె చిరంజీవితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంపై కాంట్రాక్టు సంస్థ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులతో కలిసి సర్వీస్ రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ మన్మథ కుమార్ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన వెంకట్రెడ్డి
పెద్దవూర: మండలంలోని ఏనేమీదిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తూడి వెంకట్రెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందుతూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకట్రెడ్డి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రీసోర్స్ పర్సన్గా, పాఠ్య పుస్తకాలు, కరదీపికల రూపకల్పన, వినూత్న బోధన నైపుణ్యాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పొందిన అవార్డుల ఆధారంగా తూడి వెంకట్రెడ్డిని ఏప్రిల్ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్ దేశ పర్యటనకు ఎంపిక చేశారు. ఆలేరురూరల్ : వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ విద్యార్థులు ఆంగ్లభాషలో మంచి నైపుణ్య సాధించేలా కృషిచేసిన ఆలేరు మండలం గొలనుకొండ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ జ్యోతిర్మయి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉద్యాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. విద్యార్థులకు ఫోనెటిక్స్, అక్షరాలు సౌండ్స్తో బోధన, టీఎల్ఎం, ఎచ్టీఎంఎల్ పద్ధతి, ప్లైబేసిడ్, పేంటింగ్ ద్వారా బోధన, సొంతంగా రాయడం, చదవడం ఆటాపాటలతో విద్యాబోధన అందించారు. 2001 సంవత్సరంలో రాజాపేట మండలం రేణుకుంట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయులిగా చేరిన ఆమె అక్కడే 10 సంవత్సరాలు పనిచేశారు. అనంతరం చిన్నకందుకూరు, పటేల్గూడెం నుంచి గొలనుకొండ ప్రాథమిక పాఠశాలలో 2014 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. తనకు వచ్చే జీతంలో ప్రతినెలా విద్యార్థుల అవసరాలకు, విద్యాబోధనలకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. పని చేసిన ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధన అందించారు. క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుండడం వల్లే తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వరించిందని జ్యోతిర్మయి పేర్కొన్నారు. -
విశిష్ట సేవలందిస్తున్న బత్తిని నాగరాజు
రామగిరి (నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న బత్తిని నాగరాజు లైఫ్ సైన్సెస్లో ఆలిండియా 162వ ర్యాంక్ సాధించిన ఆయన, డిసెంబర్ 2011లో ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ విభాగంలో పీహెచ్డీ పరిశోధన చేస్తున్నారు. ఆయన రెండు భారతీయ పేటెంట్లను దాఖలు చేయడమే కాకుండా, డిగ్రీ స్థాయి మైక్రోబయాలజీకి సంబంధించి 6 పాఠ్యపుస్తకాలను రచించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధనా పత్రాలను ప్రచురించడమే కాకుండా 5 జాతీయ సదస్సులలో సెషన్ చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుతం కళాశాలలో అకడమిక్ కోఆర్డినేటర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అకడమిక్ కౌన్సిల్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బత్తిని నాగరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్జీ కాలేజీ -
డిజిటల్ కంటెంట్ తయారీలో దిట్ట
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ బాలుర జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న జి. వేణుగోపాలరావు డిజిటల్ కంటెంట్ అందించడంలో దిట్ట. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి డిజిటల్ కంటెంట్ తయారు చేసి రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలకు అందించారు. దూరదర్శన్లోనూ డిజిటల్ కంటెంట్ అందించారు. ఏఐ ఛాన్సల్కు సంబంధించి జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తున్నారు. జి. వేణుగోపాలరావు, ఫిజిక్స్ లెక్చరర్, కేపీఎం ప్రభుత్వ కళాశాల నల్లగొండ -
నోటీసుల జారీ పకడ్బందీగా నిర్వహించాలి
భువనగిరి: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జారీ చేసిన నోటీసుల విచారణను పకడ్బందీగా నిర్వహించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక సమగ్ర సవరణ పరిశీలకురాలు విజయేంద్రా అన్నారు. గురువారం భువనగిరి మండలం, అనంతారం గ్రామంలో చేపట్టిన సర్ నోటీసుల జారీ విచారణ ప్రక్రియను పరిశీలించారు. అంతకు ముందు గ్రామంలో 11, 12పోలీంగ్ కేంద్రాలను సందర్శించారు. ఆమె వెంట కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, ఏరోప్లేన్ ప్రణయ్కుమార్ తదితరులున్నారు. 10న చలో హైదరాబాద్ భువనగిరిటౌన్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్– ఉద్యోగుల హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి కోరారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట సభ వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు చికూరి జగన్మోహన్ ప్రసాద్, డీఏఓ రమణారెడ్డి, టీజీఓ కార్యదర్శి సీహెచ్ శ్రీనివాస్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు కృష్ణ, డీఎంహెచ్ఓ మనోహర్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఎండీ ఖాదిర్, కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతతభువనగిరి: క్రీడలతో ఉద్యోగులకు మానసిక ప్రశాంతత కలుగుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు అన్నారు. భారత ప్రభుత్వం నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ 2026–27కు సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. -
రూ.114కోట్లతో రోడ్ల అభివృద్ధి
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గంలో రూ.114కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. ఈ రోడ్ల అభివృద్ధితో మునుగోడు నియోజకవర్గం ముఖచిత్రం మారిపోతుందన్నారు. గురువారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆర్అండ్బీ నిధులతో డబుల్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సర్వేల్ గ్రామంలో మూడు ప్రధాన రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. పొర్లగడ్డ తండా నుంచి పీసీ తండా క్రాస్ రోడ్డు వరకు, పొర్లగడ్డ తండా నుంచి గరికగడ్డ తండా వరకు, కేలోతు తండా నుంచి బండలేమునూరు (రంగారెడ్డి జిల్లా)వరకు చేపట్టనున్న రోడ్డు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుడిమల్కాపూర్ నుంచి చల్మెడ వరకు సర్వేల్ మీదుగా డబుల్ రోడ్డు, నారాయణపురం నుంచి సర్వేల్ వరకు, సర్వేల్ నుంచి పలివెల వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా.. పొర్లగడ్డతండాలో ప్రొటోకాల్ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమోద్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరెంటోతు శ్రీనునాయక్, రెడ్యానాయక్, ఎనుముల శంకర్రెడ్డి, జక్కలి ఐలయ్యయాదవ్, కుక్కల నర్సింహ, చిలకరాజు చందన, రాజు, ఉప్పల లింగస్వామి, లోడే రఘు, గుత్త ఉమాదేవి, మన్నే శ్రీనివాస్రెడ్డి, కరెంటోతు భిక్షపతి నాయక్, గడ్డం యాదగిరి, రవి, రాహుల్ తదితరులున్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
పరిశోధనా ప్రావీణ్యుడు మునిస్వామి
రామగిరి (నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో అర్థశాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్న డి. మునిస్వామి బోధన, పరిశోధనల్లో తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్డీ పూర్తిచేసి, యూజీసీ నెట్ సాధించిన మునిస్వామికి బోధనా రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్స్లో 30కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు, భారత ప్రభుత్వం నుంచి సుమారు 10 పేటెంట్లను పొందడం ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనం. యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఉచితంగా కోచింగ్ అందించారు. కళాశాలలో అకడమిక్ కోఆర్డినేటర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పరిశోధనా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ మునిస్వామి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్జీ కాలేజీ -
ఆర్గానిక్ కృష్ణ మందిరం
తాళ్లవెల్లెంలలో ఆకట్టుకుంటున్న పరమాత్మ సన్నిధి చుట్టూ పచ్చదనం, పక్షుల కిలకిలారావాలు.. నగర జీవితంలోని ఉరుకులు పరుగులకు పూర్తిగా భిన్నమైన వాతావరణం. కొద్దిదూరం నడవగానే ప్రకృతి ఒడిలో ఓ చిన్న గోపురం.. లోపలికి వెళ్తే వేణుగోపాలుడి రూపంలో దర్శనమిచ్చే శ్రీకృష్ణుడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామంలోని ఆర్గానిక్ కృష్ణ మందిరం ప్రత్యేకత ఇది. ప్రకృతితో మమేకమై పరమాత్మను స్మరించేలా తీర్చిదిద్దిన ఈ మందిరం వద్ద, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు నచ్చినన్ని రోజులు ఉండే వెసులుబాటు ఉంటుంది. చిట్యాల : తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన పానుగుళ్ల యాదయ్య–జయమ్మ దంపతుల ఏకై క కుమారుడు వెంకటేశ్వర్లుది వ్యవసాయ ఆధారిత కుటుంబం. స్వయంకృషితో ఐఐటీ గువహటిలో మాస్టర్స్ పూర్తి చేసిన ఆయన, ఐఐటీ హైదరాబాద్లో పీహెచ్డీ చేశారు. అనంతరం డీఆర్డీఓ (పుణె)లో, యూఏఈలోని పలు ఇంటర్నేషనల్ విద్యాసంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం నారాయణ కాలేజీలో ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. చదువుకునే రోజుల్లోనే శ్రీకృష్ణుడిపై భక్తిభావం పెరగడంతో ద్వారక, ఉడిపి, పూరీ, మధుర, బృందావన్ లాంటి ఆలయాలను దర్శించారు. భక్తికి వైభవం, ఆర్భాటం కంటే భావం ముఖ్యమనే ఉద్దేశంతో.. ఐఐటీ స్నేహితులు, దాతల సహకారంతో తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పన్నెండేళ్ల క్రితం ఆర్గానిక్ కృష్ణ మందిరాన్ని నిర్మించారు. భక్తులే అర్చకులు.. ఈ మందిరంలో నల్లరాయితో చెక్కిన ముగ్ధ మనోహరమైన కృష్ణుడి విగ్రహంతో పాటు వినాయకుడు, హనుమంతుడు, శివుడు, సుబ్రహ్మణ్యస్వామి, నంది, సరస్వతీదేవి, నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతి నెలా ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. కృష్ణాష్టమి, హోలీ, కార్తికమాసం, ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రణవానంద స్వామి లాంటి ప్రముఖులు ఇక్కడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మందిరంలో ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ అర్చకులు ఎవరూ ఉండరు. భక్తులే స్వయంగా స్వామిని దర్శించుకుని పూజించుకోవచ్చు. దేవుడికి, భక్తుడికి మధ్య ఎవరూ అవసరం లేదని, హృదయంలోంచి వచ్చే ప్రార్థనే అసలైన పూజ అని చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మందిరంలో బస చేయాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆరు గదులతో పాటు భోజన ఏర్పాట్లు చేసే సహాయకులు సైతం అందుబాటులో ఉంటారు. ప్రకృతి మధ్యలో కనువిందు చేస్తున్న ఆర్గానిక్ కృష్ణ మందిరంఫ పూజారుల ప్రమేయం లేకుండా పూజలు చేసుకునే అవకాశం ఫ మందిరాన్ని నిర్మించిన ఐఐటీ పూర్వ విద్యార్థి వెంకటేశ్వర్లు ఫ భక్తులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం -
విద్యాభివృద్ధిలో కీలకపాత్ర
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వై. ప్రశాంతి యూనివర్సిటీలో వివిధ రకాల ప్రాజెక్టులు రూపొందించి విద్యార్థుల విద్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు, పబ్లికేషన్స్, సోషల్ సర్వీస్ చేయడం ద్వారా ఆమెకు ఉత్తమ అవార్డు రావడానికి దోహదపడ్డాయి. యూనివర్సిటీలో ఉద్యోగాల కల్పన కోసం కూడా ఆమె వివిధ కంపెనీలతో మాట్లాడి చొరవ తీసుకోవడంతో ఎంతోమంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. వై. ప్రశాంతి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంజీయూ -
దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలి
ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ నల్లగొండ టౌన్ : దేశ వ్యాప్తంగా జరుగుతున్న జన గణనలో భాగంగా బీసీ కులగణన కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన గణనలో బీసీ కుల గణన కూడా చేపడతామని ప్రధాని మోదీ క్యాబినేట్ సమావేశంలో ప్రకటించారని, కానీ ఇప్పుడు బీసీ కుల గణన నిర్వహించడం లేదన్నారు. బీసీలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జనాభా గణనలో స్పష్టంగా కులం, మతం కాలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జన గణన ప్రశ్నావళిలో బీసీ కులం కాలమ్ ఏర్పాటు చేసిన తర్వాతే జన గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓబీసీ కాలమ్ పెట్టాలని కేంద్రానికి లేఖ రాసిందని గుర్తుచేశారు. బీసీలకు జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఏకమై త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమించి బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ఈ నెల 20న హైదరాబాద్లో జరిగే బీసీల జాతీయ సదస్సులో తమ కార్యచరణను ప్రకటిస్తాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, నాయకులు కంది సూర్యనారాయణ, జాజుల లింగంగౌడ్, నకిరేకంటి కాశయ్యగౌడ్, కేశబోయిన శంకర్ముదిరాజ్, నల్ల మధు తదితరులు పాల్గొన్నారు. -
గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే కిడ్నీ మాయం !
ఆలేరు రూరల్ : గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన మహిళకు గర్భసంచితో పాటు కిడ్నీని కూడా తొలగించారు వైద్యులు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కమలమ్మ 45 రోజుల క్రితం గర్భసంచి సమస్యతో ఆలేరు పట్టణంలోని అర్పిత నర్సింగ్ హోమ్లో చేరింది. గర్భసంచిలో కణితి ఉందని, వెంటనే తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. మూడు రోజుల క్రితం రెగ్యులర్ చెకప్ కోసం తిరిగి ఆ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్ కొన్ని పరీక్షలు, స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. దీంతో జనగామలోని ప్రైవేట్ ల్యాబ్లో కమలమ్మ పరీక్షలు చేయించుకోగా, శరీరంలో కుడి వైపు కిడ్నీ లేదని తేలింది. దీంతో షాక్కు గురైన కుటుంబ సభ్యులు అర్పిత నర్సింగ్ హోమ్కు వచ్చి డాక్టర్ను నిలదీశారు. ఆపరేషన్కు ముందు రెండు కిడ్నీలు ఉన్నట్లు స్కానింగ్ నివేదికల్లో స్పష్టంగా ఉందని, తమకు చెప్పకుండా కిడ్నీని ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నీకి కొవ్వు పేరుకుపోయిందని, దానిని కొవ్వు గడ్డ అనుకుని పొరపాటున తొలగించామని డాక్టర్ తెలిపినట్లు బాధితులు వాపోయారు. కిడ్నీని బయట విక్రయించాలనే దుద్దేశంతోనే ఆస్పత్రి వర్గాలు ఇలా కిడ్నీని మాయం చేశాయని కమలమ్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురువారం ఆస్పత్రి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు ఆస్పత్రి డాక్టర్కు ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. బాధితురాలి వైద్య రికార్డులను పరిశీలించి, అర్పిత నర్సింగ్ హోమ్పై జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఫ ఆస్పత్రి ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యుల ఆందోళన -
30 ఏళ్ల అనుభవజ్ఞుడు
నాంపల్లి : నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న గంధం మోహన్వు 1991 ప్రత్యేక డీఎస్సీలో ఉద్యోగం సాధించి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగంలో చేరారు. పదేళ్లలోనే జూనియర్ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడిగా ప్రమోషన్ పొందారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడి చేరి 2001 నుంచి 2006 వరకు పనిచేశారు. అనంతరం హుజూర్నగర్, నేరేడుచర్లలో 2021 వరకు కామర్స్ అధ్యాపకులుగా పనిచేశారు. 30 సంవత్సరాల అనుభవంతో 2021లో ప్రిన్సిపాల్గా ప్రమోషన్ పొంది నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మోహన్రావు సొంతూరు మిర్యాలగూడ. – గంధం మోహన్రావు, ప్రిన్సిపాల్, నాంపల్లి జూనియర్ కళాశాల -
ఉత్తమ జాబితాపై ఉత్కంఠ
సాక్షి, యాదాద్రి : సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను సముచితంగా గౌరవించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అవార్డుల ప్రదానోత్సవం చేపట్టింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. విద్యాశాఖ రూపొందించిన ఉత్తముల జాబితా ఇప్పటికే కలెక్టర్కు చేరింది. ఆయన సంతకం కాగానే అవార్డు గ్రహీతల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. విశేష సేవలు అందించిన బోధకులను గుర్తించి సత్కరించే ఈ ప్రక్రియలో పారదర్శకంగా నిబంధనలు పాటించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎంపికలో ఆరోపణలు.. మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తులను ఎంఈఓల ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, ముగ్గురి పేర్లను డీఈఓ కార్యాలయానికి పంపించింది. వీటిలో నుంచి జిల్లా స్థాయి కమిటీ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. అయితే, ఈ ఎంపికల్లో లోపాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో కనీస సమన్వయ సమావేశం నిర్వహించకుండానే పేర్లను ఖరారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఈ అవార్డుల ఎంపికపై పలు వివాదాలు చెలరేగాయి. గతేడాది ప్రకటించిన తొలి జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో చాలామంది పేర్లను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఒత్తిళ్ల కారణంగా చివరి నిమిషంలో మరో 15 నుంచి 20 మంది పేర్లను జాబితాలో చేర్చడం వంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కలెక్టర్ ఆమోదమే తరువాయి.. జిల్లా ఎంపిక కమిటీ రూపొందించిన ఉపాధ్యాయుల ప్రతిపాదనలను కలెక్టర్ ముందుంచారు. ఆ యన జాబితాను సమగ్రంగా పరిశీలించి ఆమోదం తెలుపుతారు. బడ్జెట్ పరిమితులు, నిబంధనల దృష్ట్యా ప్రతి కేటగిరీలో (స్కూల్ అసిస్టెంట్, పండితులు, హెడ్ మాస్టర్లు, ఎస్జీటీలు, పీఈటీలు) నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే అవార్డులను ఖరారు చేస్తారు. అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు అవార్డు గ్రహీతల వివరాలను గోప్యంగా ఉంచుతారు. వేడుకలకు అరకొర నిధులు టీచర్స్ డే సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ నిర్వహణకు విద్యాశాఖకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అయితే, మండలాల వారీగా వేడుకలకు రూ.5 వేలు, జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి కేవలం రూ.15 వేలు మాత్రమే మంజూరు చేయడం గమనార్హం. ఫ తుది దశకు చేరిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ఫ కలెక్టర్ ఆమోదం కోసం వేచిచూస్తున్న విద్యాశాఖ ఫ ఎంపికలో ఏఐ, డిజిటల్ బోధన, వందశాతం ఉత్తీర్ణతకు ప్రాధాన్యం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం పలు ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పదో తరగతి, వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత, 9+ జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య, ‘బడిబాట’ ద్వారా విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించడం లాంటివి పరిశీలిస్తున్నారు. అలాగే బోధనలో ఏఐ, డిజిటల్ విద్యా విధానాల వినియోగం, సరళమైన బోధనా సామగ్రి, రూపకల్పన, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి దాతల సాయం తీసుకురావడం, సైన్స్ఫేర్లు, కిచెన్ గార్డెన్ పెంపకం, క్రీడల్లో ప్రోత్సాహం వంటి అంశాలకు మార్కులు కేటాయిస్తున్నారు. -
‘చలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : ఉద్యోగుల హక్కుల సాధనం కోసం ఈ నెల 10న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమంలో పెద్దఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయాలని టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి తదితరులు పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో చలో హైదరాబాద్ కార్యక్రమంపై సూర్యాపేట, నల్లగొండ జిల్లాల టీజేఏసీ ప్రతినిధులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమాలలో అందరూ పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా హక్కులను సాధించుకుందామన్నారు. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్లు చలో హైదరాబాద్ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరినీ తీసుకురావాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ స్కీంను సమదర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్ల మురళి, కన్వీనర్ యాదగిరి, నాయకులు జే. శేఖర్రెడ్డి, చేపూరి నర్సింహాచారి, లక్ష్మయ్య, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఫ టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ -
ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లిష్ జూని యర్ లెక్చరర్ బానోతు వాసు 2005లో స్కూల్ అసిస్టెంట్గా ఎంపికై కొన్నాళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2012లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. పలుచోట్ల పనిచేసిన ఈయన 2024లో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చారు. బోధనతో పాటు విద్యార్థుల సంక్షేమం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. మలబార్ గోల్డ్ సంస్థ, సీఎస్ఆర్ నిధుల ద్వారా కళాశాల విద్యార్థులకు రూ.20 లక్షలకు పైగా ప్రయోజనం చేకూరేలా సంబంధిత సంస్థలతో సమన్వయం చేశారు. బానోతు వాసు, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్, సూర్యాపేట -
సాగునీటికి మరో ఉద్యమం
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని సాగు భూములకు సాగునీటి విడుదల కోసం మరో పోరాటం తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లా పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా వెలుగొందిందని, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిన మిర్యాలగూడ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో చేపట్టిన రైతు మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రా ప్రాంతం వారు నీటిని తరలించుకుపోతున్నా జిల్లా మంత్రులు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఆయకట్టు రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పించిన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు దద్దమ్మలుగా మిగిలిపోయారన్నారు. సాగునీటి విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎడమకాల్వకు నీటి విడుదల చేసేది లేదని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రైతు మహా ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని, అయినా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లిస్తే రైతులు ఆనందంగా పండించుకున్నారని, అలాంటి ఇప్పుడు ఈ ప్రాంత రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ గేట్లను బద్దలు కొటైనా నీటిని తీసుకుంటామన్నారు. కృష్ణా జలాల హక్కుల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నికర జలాలను వాడుకొని 17 పర్యాయాలు రైతుల శ్రేయస్సు కోసం నీటిని విడుదల చేసిన ఘనత నాటి సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, నోముల భగత్కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్, దుర్గంపూడి నారాయణరెడ్డి, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, కడారి అంజయ్య, ఎండి.యూసుఫ్, నిమ్మల నవీన్రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, ఫహీమొద్దిన్, ఇలియాస్,మట్టపల్లి సైదులుయాదవ్, నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, హాతీరాంనాయక్, ఎండి.షోయబ్, మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. ఫ సాగర్ నీటి విడుదల కోసం పోరాటం చేస్తాం ఫ ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’.. ఇప్పుడు ఎడారిగా మారింది ఫ నల్లగొండ జిల్లా మంత్రులు దద్దమ్మలు ఫ సాగునీరు తరలించుకుపోతున్నా పట్టించుకోవట్లేదు ఫ రైతు మహాధర్నాలో కేటీఆర్ -
42 ఏళ్లుగా అంకితభావంతో..
నకిరేకల్ : నలభై రెండేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపునకు ఎంతగానో శ్రమించిన నకిరేకల్ మండలం నోముల జెడ్పీ హైస్కుల్లో బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ముస్కు కవిత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. కవిత 1985లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించి శాలిగౌరారం మండలం రామగిరి ప్రాథమిక పాఠశాలలో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. ఆ తరువాత నకిరేకల్ మండలం నడిగూడెం, చందుపట్ల పాఠశాలల్లో పనిచేశారు. 2005 స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి రావడంతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి జెడ్పీ హైస్కూల్కు బదిలీ అయ్యారు. 2009లో అక్కడ నుంచి నకిరేకల్ జెడ్పీ హైస్కూల్కు బదిలీపై వచ్చారు. 2018లో స్వగ్రామైన నకిరేకల్ మండలం నోముల జెడ్పీ హైస్కూల్లో చేరారు. మరో రెండు నెలల్లో పదవి విరమణ పొందనున్న సమయంలో తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
మద్యం మత్తులో ఉరేసుకుని బలవన్మరణం
సూర్యాపేటటౌన్ : మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో గురువారం జరిగింది. సూర్యాపేట రూరల్ ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోలిపేట గ్రామానికి చెందిన బానోత్ తావూర్య(44) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు వారం రోజులుగా భార్య, కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతున్నాడు. గురువారం ఉదయం ఊరి బయట వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి అతడు కాలువ పక్కన వేప చెట్టుకు లుంగీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి భార్య సైదమ్మ, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. మద్యం మత్తులోనే తావూర్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిచౌటుప్పల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. గురువారం చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై లక్ష్మిదుర్గ హోటల్ సమీపంలో ఆగస్టు 31న గుర్తుతెలియని వ్యక్తిని(45–55 ఏళ్లు) ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్సనిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో లేదా 87126 62744 నంబర్కు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. భక్తుల కార్లే టార్గెట్.. ఫ 11 ఏళ్ల బాలుడు అరెస్ట్ యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కార్లను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల యాదగిరి కొండపైన కారు అద్దాలు పగులగొట్టి సెల్ఫోన్లు, అన్నప్రాసన చేసే వెండి ప్లేట్ చోరీ చేశారు. అలాగే బుధవారం యాదగిరి కొండ కింద వాహనాల పూజలు చేసే ప్రాంతంలో పార్కింగ్ చేసిన కారు అద్దం పగులగొట్టి అర్ధ తులం బంగారం, రూ.6 వేలు అపహరించారు. ఈ ఘటనలపై అనుమానంతో 11 ఏళ్ల బాలుడిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కొండపైన సీసీ కెమెరాలతో పాటు కొండ కింద అనుమానాస్పదంగా కనిపించిన ఆ బాలుడిని విచారించగా.. గులేర్ సహాయంతో కారు అద్దాలు పగులగొట్టి, అందులోని విలువైన వస్తువులు, నగదు తానే అపహరించినట్లు ఒప్పుకున్నట్లు సీఐ వెల్లడించారు. గతంలో పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ డాక్యుమెంట్ కార్యాలయం కిటికీ నుంచి దూకి కూడా ఆ బాలుడు నగదు అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ బాలుడి తండ్రి శ్మశానవాటికలో ఉంటాడని, బాలుడు సైతం రోడ్లపైనే తిరుగుతూ ఇలాంటి చోరీలకు అలవాటు పడినట్లు తెలిపారు. బాలుడిని భువనగిరిలోని చైల్డ్ కేర్ హోమ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
వినూత్న రీతిలో విద్యాబోధన
వలిగొండ : వలిగొండ మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పరుశురాములు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడి అవార్డు ఎంపికయ్యారు. ఈయన మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో జన్మించారు. ఈయన ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీతో పాటు పీహెచ్డీ పూర్తి చేశారు. సుమారు 14 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో తనదైన రీతిలో విద్యాబోధన చేస్తూ వస్తున్నారు. ఆయన సేవలకు ఉత్తమ అధ్యాపకుడి అవార్డు వరించింది. పరశురాములు, సివిక్స్ లెక్చరర్, ప్రభుత్వ కళాశాల వలిగొండ -
ఎన్రోల్మెంట్లో అగ్రస్థానంలో నిలిపి..
కోదాడ : మూడేళ్లుగా వందల సంఖ్య విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచుతూ వినూత్న కార్యక్రమాల ద్వారా కోదాడ ప్రభుత్వ బాలుర పాఠశాలను అగ్రస్థానంలో నిలిపిన ప్రధానోపాధ్యాయుడు, కోదాడ మండల ఇన్చార్జి ఎంఈఓ సలీంషరీఫ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి అవార్డు వరించింది. 1996 డీఎస్పీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన సలీంషరీఫ్ 1998లో మేళ్లచెరువు మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2005లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు. 2014–2024 వరకు కోదాడ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు ఇన్చార్జి ఎంఈఓగా పనిచేశారు. 2023 నుంచి కోదాడ బాలుర పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గడిచిన మూడేళ్లుగా 500 దాటించి స్కూల్ను టెన్త్ ఉత్తీర్ణతలోనూ అగ్రస్థానంలో నిలిపారు. అధ్యాపకులకు అవార్డులు -
బంతి సాగులో మెళకువలు
ఫ కోదాడ ఉద్యానవనశాఖ అధికారి పూసపాటి అనిత సూచనలు బాగా విచ్చుకున్న బంతి పూలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయడం మంచిది. పువ్వులు కోసే ముందు నీరు ఇచ్చినట్లయితే పువ్వులు తాజాగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు పూలు కోస్తుంటే దిగుబడి పెరుగుతుంది. కోసిన తరువాత పువ్వులను తడిపిన గోనె లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డతో కప్పి మార్కెట్కు తరలించాలి. సాధారణంగా ఆఫ్రికన్ రకాలు ఎకరానికి 4–5 టన్నుల పూల దిగుబడినిస్తాయి. నడిగూడెం : బంతి పూలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో సన్న, చిన్నకారు రైతులు బంతి సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో బంతి సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని కోదాడ ఉద్యానవన శాఖ అధికారి పూసపాటి అనిత సూచించారు. రైతులు అనుసరించాల్సిన సాగు విధానం, మెలకువలు ఆమె మాటల్లోనే.. వాతావరణం – నేలలు వాతావరణ పరిస్థితులను బట్టి బంతిని వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. బంతి 14–28 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద బాగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద మొక్క పెరుగుదల తగ్గి, తక్కువ పరిమాణం గల పువ్వులు ఉత్పత్తి అయ్యి దిగుబడి తగ్గుతుంది. నీడ ప్రదేశాలు బంతి సాగుకు అనుకూలం కావు. దీనివల్ల మొక్కలు శాఖీయ దశలోనే ఉండి పూలు సరిగ్గా పూయవు. బంతి సాగుకు గరప నేలలు అత్యంత అనుకూలమైనవి. బరువైన నేలల్లో కూడా మురుగు నీటి వసతి ఉన్నప్పుడు బంతిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక ( ఞఏ) 7.0–7.5 మధ్య గల నేలలు ఎంతో అనుకూలం. రకాలు మన ప్రాంతంలో బంతి సాగు చేసే రైతులు ముఖ్యంగా ఆఫ్రికన్ బంతి రకాలు, ఫ్రెంచి బంతి రకాలు సాగు చేస్తుంటారు. వాణిజ్య పరంగా ఆఫ్రికన్ బంతి రకాలకు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఆఫ్రికన్ బంతి : ఇవి ఏపుగా, ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్కలు. వీటిలో వివిధ రంగులు గల పెద్ద పూల రకాలున్నాయి. పూసా నారింగ గైండా, పూసా బసంతి గైండా, ఈమధ్య విడుదలైన ఆర్కా బంగార (పసుపు) మరియు ఆర్కా అగ్ని (నారింజ) రకాలు మంచి దిగుబడిని ఇస్తున్నాయి. అయితే ఇవి కాండం కత్తిరింపుల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతాయి. ఈ రకాలలో విత్తనాలు ఉండవు. ఇవి కాక ప్రైవేటు సంస్థలు రూపొందించిన హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్రెంచి బంతి : ఈ రకం మొక్కలు పొట్టిగా, దృఢంగా ఉండి సింగిల్ లేదా డబుల్ పూలను కలిగి ఉంటాయి. ఇవి ఆఫ్రికన్ బంతి రకాలకన్నా త్వరగా కోతకు వస్తాయి. నాటే సమయం – దూరం బంతిని అన్ని కాలాల్లో సాగు చేసినప్పటికీ, జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకుంటే అక్టోబర్–ఏప్రిల్ నెలల్లో మార్కెట్కు పువ్వులను సరఫరా చేయవచ్చు. ముఖ్యంగా పండుగ సీజన్కు పూలు వచ్చేటట్లు నాటుకుంటే రైతులు ఎక్కువ లబ్ది పొందవచ్చు. సాధారణంగా పండుగ రోజుకు 60 రోజులు ముందుగా నాటుకోవాలి. సెప్టెంబర్–అక్టోబర్లో నాటుకున్న పంట నుంచి నాణ్యమైన పువ్వులు, విత్తనాలు పొందవచ్చు. ఆఫ్రికన్ రకాలు వరుసకు వరుసకు 60 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 45 సెం.మీ. దూరం ఉండేటట్లు నాటుకోవాలి. ఫ్రెంచి రకాలైతే మొక్కకు మొక్కకు మధ్య 25 సెం.మీ., వరుసకు వరుసకు మధ్య 25 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. 3 లేదా 4 ఆకులు కలిగి 25 రోజుల వయస్సున్న దృఢమైన బంతి నారు నాటడానికి అనుకూలంగా ఉంటుంది. నారు తీయడానికి ఒకరోజు ముందు నారుమడికి నీరు ఇచ్చినట్లయితే మొక్కల వేర్లు దెబ్బతినకుండా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కిలో ఎకరానికి 8–10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వీటితో పాటు ఎకరానికి 30 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం మరియు 30 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను అందించాలి. అంటే 66 కిలోల యూరియా, 185 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 50 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలి. సిఫారసు చేసిన మోతాదులో సగం నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగతా నత్రజనిని నాటిన 30–40 రోజుల తరువాత పైపాటుగా అందించాలి. బంతి మొక్కలకు అన్ని దశల్లోనూ సరిపడనంత తేమ భూమిలో ఉండాలి. మొక్క ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే పెరుగుదల మరియు పూత దెబ్బతింటాయి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి తడులు ఇవ్వాలి. ఆఫ్రికన్ బంతి రకాలలో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూ మొగ్గ ఏర్పడుతుంది. ఆ తర్వాతే పక్క కొమ్మలు వస్తాయి. అందువల్ల మొక్కలను నాటిన 40 రోజులకే తలలు త్రుంచినట్లయితే అనేక పక్క కొమ్మలు తొందరగా ఏర్పడి, మొక్క మంచి ఆకారాన్ని సంతరించుకుని ఎక్కువ మోతాదులో ఒకే పరిమాణంలో పూలు వస్తాయి. హైబ్రిడ్ రకాలలో మాత్రం 20 రోజులకే తలలు తుంచాలి. -
తనిఖీల పేరిట మిల్లర్లను ఇబ్బంది పెట్టొద్దు
నల్లగొండ : ఆక్షన్ ప్యాడీకి సంబంధించి నల్లగొండ జిల్లాలో డిఫాల్ట్ అయిన ఏడు మిల్లుల నుంచి బకాయిలను వెంటనే వసూలు చేసుకోవాలని, అంతేకానీ క్రమం తప్పకుండా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇచ్చే మిల్లుర్లను తనిఖీల పేరిట ఇబ్బందులకు గురిచేయొద్దని జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు అధికారులను కోరారు. బుధవారం నల్లగొండలోని మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రూ. 190 కోట్ల బకాయిలు ఏడు మిల్లులవే.. 2014 నుంచి 2022 వరకు జిల్లాలో కేవలం ఆక్షన్ ప్యాడీకి సంబంధించి ఏడు మిల్లులు మాత్రమే డిఫాల్ట్లో పడ్డాయని వారు వివరించారు. జిల్లాలో మొత్తం రూ.600 కోట్లకు గాను ఇప్పటికే మిల్లర్లు రూ.420 కోట్లు చెల్లించారని, మిగిలిన రూ.190 కోట్లు ఆ ఏడు మిల్లుల నుంచే రావాల్సి ఉందన్నారు. 2023 నుంచి ప్రభుత్వం ఇచ్చే ధాన్యాన్ని తీసుకుని గడువులోగా తిరిగి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే 2025–26 రబీ సీజన్లో తమ మిల్లుల కెపాసిటీని మించి రెట్టింపు ధాన్యాన్ని అధికారులు బలవంతంగా అప్పగించారని తెలిపారు. ఆ సమయంలో రబీలో రా రైస్ ఇస్తే నూకలు వస్తాయని, బాయిల్డ్ రైస్ ఇస్తామని చెప్పడంతో అధికారులు అంగీకరించారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎఫ్సీఐ రా రైస్ మాత్రమే కావాలని మెలిక పెట్టగా, తాము ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు విన్నవించిన అనంతరం బాయిల్డ్ రైస్ తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ రా రైస్ ఇవ్వాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా గడువు ఉంది.. తమకు సీఎంఆర్ చెల్లించేందుకు ఇంకా గడువు ఉందని, ఈలోపు లోటున్న బియ్యాన్ని సొంతంగా ధాన్యం కొనుగోలు చేసి అయినా ప్రభుత్వానికి అప్పగిస్తామని, బకాయిల పేరిట డబ్బులు కట్టాలని ఒత్తిడి తేరాదని కోరారు. అధికారులు తనిఖీల పేరిట వేధిస్తే వచ్చే సీజన్ నుంచి ధాన్యం తీసుకోమని, అవసరమైతే మిల్లులను బంద్ చేసుకుంటామని హెచ్చరించారు. ఏళ్ల తరబడి మిల్లర్లకు రావాల్సిన వర్కింగ్ ఛార్జీలతో పాటు రవాణా ఛార్జీలు, డ్యామేజ్, కస్టోడియన్, హమాలీ తదితర బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు ఇంద్రారెడ్డి, శ్రీను, వీరమల్లు, రమణ, వెంకన్న, విశ్వనాథం, యాదగిరి, శ్రీనివాస్, కేశవరెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఫ డిఫాల్ట్ మిల్లులపై చర్యలు తీసుకోండి ఫ సక్రమంగా ఉన్నవారిని వేధించొద్దు ఫ గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇస్తాం ఫ నల్లగొండ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ -
కారు అద్దం పగులగొట్టి బంగారం, నగదు చోరీ
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కారు అద్దాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. హైదరాబాద్లోని మూసాపేటకు చెందిన కె. అంజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. అక్కడి తులసీ కాటేజీలో విడిది చేసిన వారు బుధవారం ఉదయం కారులో సత్యనారాయణస్వామి వ్రతం చేయించేందుకు వెళ్లారు. కారును వాహన పూజల సమీపంలో పార్కింగ్ చేశారు. వ్రతం పూర్తయ్యాక తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు కారు సైడ్ అద్దం పగులగొట్టి అందులోని అర తులం బంగారు ఆభరణం, రూ.6,000 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడు అంజయ్య వెంటనే 100కు కాల్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సమీప ప్రాంతాల్లో గాలించగా, అంజయ్య కుటుంబ సభ్యులకు చెందిన ఖాళీ పర్సును చెట్ల పొదల్లో పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు చోరీలు జరగడంతో భక్తుల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది. పర్యవేక్షణ లోపమే కారణమా? గతంలో ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుని పార్కింగ్ను పర్యవేక్షించేవారు. కానీ యాదగిరి కొండ దిగువన ఉన్న సెంట్రల్ పార్కింగ్ను ఆరు నెలలుగా దేవస్థానమే స్వయంగా నిర్వహిస్తోంది. అక్కడ ఎలాంటి పర్యవేక్షణ, సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఫ యాదగిరీశుడి సన్నిధిలో మరో ఘటన -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
దేవరకొండ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన దేవరకొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఎండీ బందగీ(41) కొండమల్లేపల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్లో ఆర్టిజెన్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా తన విధుల్లో భాగంగా బుధవారం తన ద్విచక్ర వాహనంపై కందుకూరు నుంచి కొండమల్లేపల్లికి వెళ్తుండగా.. దేవరకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి సోదరుడు రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. కొండముచ్చు దాడి.. భార్యాభర్తలకు గాయాలు ఆత్మకూరు(ఎం) : కొండముచ్చు దాడి చేయడంతో భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లి గ్రామ స్టేజీ వద్ద బుధవారం జరిగింది. మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చెందిన కళ్లెం వెంకన్న, అతడి భార్య సైదమ్మ బుధవారం ఉదయం బైక్పై గజ్వేల్కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా... ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లి గ్రామ స్టేజీ వద్దకు రాగానే రోడ్డు దాటే క్రమంలో కొండముచ్చు ఒక్కసారిగా బైక్పై దాడి చేసింది. దీంతో బైక్ అదుపుతప్పడంతో వెంకన్న, సైదమ్మ దంపతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108 అంబులెన్స్లో మోత్కూరుకు తరలించారు. చికిత్స పొందుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి భూదాన్పోచంపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన యెల్లంకి గోవిందాచారి, రాజమణి దంపతుల కుమారుడు శివప్రసాద్ (24) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 21న రాత్రి బైక్పై ఇంటికి వస్తుండగా.. పోచంపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో బైక్ హ్యాండిల్ కడుపులో గుచ్చుకుంది. శివప్రసాద్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బ్యాంకు రుణం ఎగవేత.. సమన్లు జారీ భువనగిరిటౌన్ : కెనరా బ్యాంకు, భువనగిరి శాఖలో తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో శ్రీమాత మహిళా పొదుపు సంఘం సభ్యులకు హైదరాబాద్లోని డెట్స్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ–2) సమన్లు జారీ చేసింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.21,21,906 బకాయి పడ్డారు. బ్యాంకు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో, ట్రిబ్యునల్ను ఆశ్రయించగా.. ఆగస్టు 20న సంఘం సభ్యులకు సమన్లు జారీ చేసింది. 30 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబర్ 21న ప్రతివాదులందరూ హైదరాబాద్లోని డీఆర్టీ రిజిస్ట్రార్ ఎదుట స్వయంగా లేదా న్యాయవాది ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. -
విద్యార్థుల హక్కులు కాలరాస్తే ఉద్యమం
నల్లగొండ టౌన్ : పాలకులు విద్యార్థుల హక్కులు కాలరాస్తే ఉద్యమాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ హెచ్చరించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు విద్యార్థులను ‘పరాన్నజీవులు’ అనడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. శ్రమజీవుల పిల్లలు పరాన్నజీవులుగా మారాలని కోరుకోరని పేర్కొన్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడి, ఆటపాటలను త్యాగం చేసి చదువుకుంటున్న విద్యార్థుల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆడుకుంటోందని, ప్రభుత్వం సైతం విద్యార్థుల భవిష్యత్ను కార్పొరేట్ వ్యాపారులకు తాకట్టు పెడుతోందని ఆరోపించారు. పోటీ పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీకేజీల వల్ల మనోవేదనకు గురై 22 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సమావేశంలో సంఘం నాయకులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, డి.కిరణ్, ఎం.మమత, ఆకారపు నరేష్, కె.శంకర్, మల్లం మహేష్, కుర్ర సైదానాయక్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్, ఆదిల్, నవదీప్, జగదీష్, జగన్, వీరన్న, ప్రసన్న, యశ్వంత్ పాల్గొన్నారు. ఫ ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
కేయూ క్యాంపస్ : స్నేహితుడిని రక్తదానం చేయించేందుకు తీసుకెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన గుగులోత్ భరత్(21) కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ మూడో సంవత్సరం చదువుతూ అక్కడే కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. భరత్కు హనుమకొండ బస్టాండ్ సమీపంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాహకులతో పరిచయం ఉంది. వారు అర్జెంట్గా రక్తం కావాలని భరత్కు ఫోన్ చేశారు. దీంతో భరత్ తన సేహితుడు సాయినికేతన్తో రక్తదానం చేయించేందుకు అదే కళాశాలకు చెందిన వేరే వ్యక్తి బైక్పై మంగళవారం అర్ధరాత్రి బ్లడ్ బ్యాంక్కు వెళ్లారు. సాయినికేతన్ రక్తదానం చేస్తుండగా కొంత సమయం పడుతుందని భావించిన భరత్.. ఆ బైక్ను సదరు వ్యక్తికి ఇచ్చి వస్తానని అంబేడ్కర్ సెంటర్ రోడ్డు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో పబ్లిక్గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. బుధవారం ఎంజీఎంలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మి తెలిపారు. భరత్ మృతితో తల్లిదండ్రులకు శోకసముద్రంలో మునిగిపోయారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో ఘటన మృతుడు సూర్యాపేట జిల్లావాసి -
హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా ఉన్న ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. వివాహాది శుభకార్యాలు, గ్రామదేవతల పండుగలు, వీకెండ్ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించారు. దీనికి తోడు పలుచోట్ల రోడ్డు పనులు జరుగుతుండటంతో హైవేపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నెలకొంది. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట, ధర్మోజిగూడెం, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా చోట్ల రోడ్డు ఇరుకుగా మారి వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్మోజిగూడెం నుంచి విజయవాడ మార్గంలో చౌటుప్పల్ వరకు ఉన్న కేవలం 5 కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు వాహనాలకు ఏకంగా అరగంట సమయం పట్టింది. చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డు నుంచి మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఉన్న ఎస్ఎంఆర్ ఫంక్షన్హాల్ వరకు వాహనాలు బారులుదీరాయి. ఫ కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు ఫ శుభకార్యాలు, వీకెండ్ తోడవ్వడంతో పోటెత్తిన రద్దీ -
జనంపై భారం పడకుండా చూడాలి
రహదారి నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, సమస్యలు తలెత్తకుండా నిర్మాణం జరగాలి. 800 మీటర్ల దూరం తిరిగి రాకపోకలు సాగించాలంటే రెండు వైపులా కలుపుకుంటే కిలోమీటరున్నర దూరం అవుతుంది. జనంపై ఎలాంటి భారం పడకుండా ఉండేలా ప్రతి ఐదు వందల మీటర్ల ఒకటి పీయూపీ ఇవ్వాలి. వ్యాపారులు, దుకాణాదారుల పొట్టకొట్టొద్దు. – సుర్కంటి రాజిరెడ్డి, వ్యాపారి, చౌటుప్పల్ రహదారి నిర్మాణం చేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు తప్పనిసరిగా స్థానిక ప్రజలు, వ్యాపారుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలి. ఎవరికివారు సొంత ప్లాన్ రూపొందించి నిర్మాణం చేయడం మూలంగా జీవితాంతం ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అందరిని దృష్టిలో ఉంచుకొని అండర్పాస్ను నిర్మించాలి. – బొడ్డు అంజిరెడ్డి, చౌటుప్పల్ -
అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో, భర్తతో విడిపోయి ఏడాది గడిచిన ఒంటరి మహిళలతో పాటు అవివాహిత మహిళలు (గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణాల్లో 35 ఏళ్లు పైబడిన వారు) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దివ్యాంగులు సదరం లేదా యూడీఐడీ పత్రం ద్వారా 40 శాతం (వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం) వైకల్యం ఉండాలని, తలసేమియా, సికిల్ సెల్ డిసీస్, హీమోఫీలియా బాధితులు కూడా అర్హులని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన కల్లుగీత, చేనేత కార్మికులు సంబంధిత శాఖల ధవీకరణ పత్రాలతో, గ్రేడ్–2,3, ఫైలేరియా బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తు ఫారాలను cheyutha.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నింపిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలకు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. సామూహిక గృహప్రవేశాలకు పకడ్బందీ ఏర్పాట్లుభువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో సోమవారం నిర్వహించనున్న సామూహిక గృహప్రవేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు సంబంధిత అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహప్రవేశాల సన్నాహక ఏర్పాట్లు, లబ్ధిదారులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. కాలనీలో నిరంతర తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల అమరికతో పాటు పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, గృహనిర్మాణ శాఖ పీడీ (హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్) అలివేలు, మున్సిపల్, గృహనిర్మాణ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యూజీసీ నెట్–జేఆర్ఎఫ్లో మేస్త్రీ కూతురి సత్తాఫ 98.4 పర్సంటైల్ సాధించిన శ్రీవిద్య మోత్కూరు : మోత్కూరుకు చెందిన బోడ శ్రీవిద్య ఇటీవల వెలువడిన యూజీసీ నెట్–జేఆర్ఎఫ్ ఫలితాల్లో 98.4 పర్సంటైల్ సాధించి విశేష ప్రతిభ చాటింది. మోత్కూరుకు చెందిన మేస్త్రి బోడ శ్రీరాములు కుమార్తె అయిన శ్రీవిద్య ఈ ఘనత సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన ఆమె రాయ్పూర్లోని ఐజీకేవీలో ఎంఎస్సీ పూర్తి చేసింది. సెట్లో 6వ ర్యాంకు సాధించిన ఆమె.. ప్రస్తుతం అదే ఐజీకేవీలో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో పీహెచ్డీ చేస్తోంది. 2025లో ఏఎస్ఆర్బీ నెట్, యూజీసీ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించిన శ్రీవిద్య.. తాజాగా యూజీసీ నెట్ జేఆర్ఎఫ్లో 98.4 పర్సంటైల్ సాధించి సత్తా చాటింది. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిగా ఎంపికై ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని శ్రీవిద్య వెల్లడించింది. ఉపాధ్యాయులు ఆమెకు అభినందనలు తెలిపారు. -
యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం నిత్య కల్యాణ వేడుకతో పాటు సంప్రదాయ పూజలు కొనసాగాయి. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ సంప్రదాయంగా జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధిలో స్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, బస్టాండ్, కల్యాణ కట్ట, పుష్కరిణి, అన్న ప్రసాద కేంద్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. స్వామిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. -
మరో పీయూపీ ఇవ్వాల్సిందే..
ఫ చౌటుప్పల్లో పెడెస్ట్రెయన్ అండర్పాస్ కోసం జనం పోరుబాట ఫ భాస్కర్ టాకీస్ నుంచి వలిగొండ క్రాస్రోడ్డు నడుమ నిర్మించాలని డిమాండ్ ఫ ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న నినాదంతో ఉద్యమం ఫ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసేందుకు సిద్ధమవుతున్న స్థానికులు చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో జరుగుతున్న బ్లాక్స్పాట్ పనులు స్థానిక వ్యాపారులు, నివాసితులకు సమస్యగా మారాయి. నవోదయ టాకీస్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు అండర్పాస్ పనులు ఆరు నెలలుగా కొనసాగుతున్నాయి. భాస్కర్ టాకీస్ వద్ద ఒక పీయూపీ (పెడెస్ట్రెయన్ అండర్పాస్) మంజూరు చేసినప్పటికీ, అక్కడి నుంచి వలిగొండ క్రాస్ రోడ్డు వరకు సుమారు 800 మీటర్ల మధ్య దూరం ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండింటి మధ్య మరొక పీయూపీ ని నిర్మించాలనే డిమాండ్తో ప్రజలు పోరుబాట పట్టారు. వలిగొండ క్రాస్ రోడ్డు వరకు దూరం ఉంటున్నందున.. పట్టణంలో ప్రస్తుతం ఆర్టీసీ బస్స్టేషన్ ఎదుట వీయూపీ (వెహికల్ అండర్పాస్), చిన్నకొండూర్ చౌరస్తా, తంగడపల్లి చౌరస్తాలను కలుపుతూ ఏడు పిల్లర్లతో ఆరు ఓపెన్ వీయూపీలతోపాటు వలిగొండ చౌరస్తాలో మరో వీయూపీ ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా భాస్కర్ టాకీస్ ముందు స్థానిక జనాలు, చిన్నచిన్న వాహనదారులను దృష్టిలో ఉంచుకొని ఒక పీయూపీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి వలిగొండ క్రాస్ రోడ్డు వరకు దూరం ఉంటున్నందున అదనంగా మరో పీయూపీ ఏర్పాటు చేస్తే భవిష్యత్లో సమస్యలు తలెత్తవని ప్రజలు పేర్కొంటున్నారు. భాస్కర్ టాకీస్ నుంచి వలిగొండ క్రాస్రోడ్డు నడుమ మధ్య పాయింట్ చూసుకొని ఎక్కడైనా పీయూపీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈమేరకు ఆయా వర్గాలు కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే పలు శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. పీయూపీ సాధన ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు.తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలు పీయూపీ నిర్మాణం లేకుంటే చాలా రంగాలకు ఇబ్బందిగా మారనుంది. ఈ 800 మీటర్ల మధ్య ప్రాంతంలో ఫైర్ స్టేషన్, కస్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాల, బస్తీ దవాఖానా, పెట్రోల్బంకు, వందలాది దుకాణాలు, వ్యాపార సంస్థలు, నాలుగు బ్యాంకులు, రెండు పాఠశాలలు, ఈఎస్ఐ ఆస్పత్రి, ఎనిమిది కాలనీలు, ప్రభుత్వ హాస్టల్ భవనం, జూనియర్ సివిల్జడ్జి కోర్టు, ఇండోర్ స్టేడియం, వాహనాల మరమ్మతులు, విక్రయాలకు సంబంధించిన ఆటోనగర్, ఫంక్షన్హాల్, శ్రీనివాస్ టాకీస్, ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దశాబ్దాల కాలంపాటు సేవలందించే ఈ రహదారిని ఇప్పుడే ప్రణాళికలతో నిర్మాణం చేయాలని, అందులో బాగంగా అదనంగా మరో పీయూపీ నిర్మించాలని కోరుతున్నారు. -
ప్రశాంతంగా నీట్ పీజీ
ఫ 179 మంది హాజరు నల్లగొండ : నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 180 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 179 మంది హాజరుకాగా ఒకేఒక్క అభ్యర్థి గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తనిఖీ చేశారు. సెంటర్ ఇన్చార్జితో పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు సూపరింటెండెంట్ రమేష్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, పరీక్షల ఇన్చార్జి, ప్రొఫెసర్ ఉపేందర్ ఉన్నారు. -
డబ్బులిస్తే మీసేవ!
కోర్టు కేసుల కారణంగా సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన మీసేవా కేంద్రాల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. అడ్డగూడూరు, మోత్కూరు, ఆత్మకూర్ మండలాలకు సంబంధించిన కోర్టు కేసులు ఇటీవల పరిష్కారమయ్యాయి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం త్వరలోనే ఐదు మండలాల్లోని అభ్యర్థులకు ఒకేసారి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాతపరీక్ష పూర్తయింది. దరఖాస్తుదారులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ఐదు మండలాల్లో ఒకేసారి ఇంటర్వ్యూలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఉద్యోగం, ఉపాధి ప్రకటన ఏది వచ్చినా.. కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామంటూ గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వసూళ్లకు తెగబడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాలతో పాటు కొత్త మీసేవా కేంద్రాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే అదనుగా అక్రమార్కులు నిరుద్యోగులు, అభ్యర్థుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. 8 మీసేవ కేంద్రాల కేటాయింపు పట్టణాలు, పల్లెల్లో పౌరసేవలను మరింత చేరువ చేసేందుకు జిల్లాలోని ఐదు మండలాల్లో 8 నూతన మీసేవా కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. చౌటుప్పల్లో 3, సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, ఆత్మకూర్ (ఎం)లలో ఒక్కో కేంద్రం చొప్పున కేటాయించారు. వీటికి సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయ్యాయి. రూ.4 లక్షల దాకా డిమాండ్ నూతన మీసేవా కేంద్రాల కేటాయింపును ఆసరాగా చేసుకుని అక్రమార్కులు భారీగా దండుకుంటున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు ప్రాంతాల్లో ఒక్కో పోస్టుకు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము అధికార పార్టీ నేతలమని, ఉన్నతాధికారులతో చెప్పించి మీసేవా కేంద్రం మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతూ ముందస్తుగా అడ్వాన్స్లు కూడా స్వీకరించినట్లు తెలుస్తోంది. ఉపాధి లభిస్తుందన్న ఆశతో బాధితులు అప్పులు చేసి మరీ దళారులకు డబ్బులు సమర్పించుకుంటున్నారు. ఫ మీసేవ కేంద్రం మంజూరు చేయిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న దళారులు ఫ ఒక్కో కేంద్రానికి రూ.4 లక్షల వరకు డిమాండ్ ఫ అధికార పార్టీ నేతలమంటూ అడ్వాన్స్ స్వీకరణ -
స్కూల్ పరీక్షల మూల్యాంకనంలో కొత్తవిధానం
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను దిద్ది మార్కులు వేసేవారు. ఇక నుంచి మూల్యాంకన ప్రక్రియ పదో తరగతి తరహాలోనే కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రాల్లో వాల్యుయేషన్ కేంద్రాలు జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 45,296 మంది విద్యార్థులు చదువుతున్నారు. నూతనంగా అమలులోకి రానున్న ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ విధానంలో భాగంగా సమాధాన పత్రాలు దిద్దేందుకు మండల కేంద్రాల్లో వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మండల కేంద్రంలో పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులచే కాకుండా ఇతర ఉపాధ్యాయుల చేత కూడా దిద్దించనున్నారు. 1 నుంచి 9 తరగతులకు ఎస్ఏ–1 (అర్ధవార్షిక) ఎస్ఏ–2 (వార్షిక), పరీక్షలకు పదో తరగతికి ఎస్ఏ–1కు ఇది వర్తించనుంది. అదేవిధంగా 1 నుంచి 5వ తరగతుల సమాధాన పత్రాలను దిద్దేందుకు ఒక్కో పేపరుకు రూ. 2, 6నుంచి 10వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలు దిద్దేందుకు రూ. 3 చెల్లించనున్నారు. అదేవిధంగా ఒక్కో ఎంఆర్సీకి రూ.10వేల చొప్పున ఇవ్వనున్నారు. ఫ సమాధాన పత్రాలు దిద్దేందుకు మండలాల్లో వాల్యుయేషన్ కేంద్రాల ఏర్పాటు -
నెరవేరనున్న సొంతింటి కల
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదల సుదీర్ఘకాల సొంతింటి నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సింగన్నగూడెం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సోమవారం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు అధికారికంగా అందజేయనున్నారు. మౌలిక వసతుల కల్పనతో మార్గం సుగమం గత ప్రభుత్వ హయాంలో 444 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ, కనీస మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రోడ్లు,డ్రెయినేజీ వ్యవస్థలను పట్టించుకోలేదు. దీంతో పంపిణీ నిలిచిపోయి నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల పనులను పూర్తి చేయించి ఇళ్ల పంపిణీకి మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా సర్వే లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం 360 డిగ్రీల సమగ్ర సర్వేను నిర్వహించింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన ఈ విచారణ ద్వారా.. గతంలో అక్రమంగా జాబితాలోకి వచ్చిన అనర్హుల పేర్లను తొలగించారు. నిజమైన నిరుపేదలకు ఇళ్లు దక్కేలా అత్యంత పారదర్శకమైన జాబితాను అధికారులు సిద్ధం చేశారు. రెండు విడతల్లో పంపిణీ సముదాయంలోని మొత్తం 444 ఇళ్లలో మొదటి విడత కింద 408 ఇళ్ల తాళాలను సోమవారం లబ్ధిదారులకు అందజేయనున్నారు. మిగిలిన 36 ఇళ్లను రెండో విడతలో పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏళ్ల తరబడి కాగితాలకే పరి మితమై, నిర్మాణం పూర్తయినా పంపిణీకి నోచుకోని ఇళ్లు ఇప్పుడు లబ్ధిదారుల చేతికి రానుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సొంతింటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు పండుగ వాతావరణంలో గృహప్రవేశాలకు సన్నద్ధమవుతున్నారు. ఫ సింగన్నగూడెంలో నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఫ పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఫ ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి చేతులమీదుగా అందించేందుకు ఏర్పాట్లు -
భూ నిర్వాసితులకు రూ.171కోట్లు విడుదల
సాక్షి యాదాద్రి: జిల్లాలోని బి.ఎన్. తిమ్మాపురం (బస్వాపురం), గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోయినవారితో పాటు హైలెవల్ కెనాల్ కోసం రూ.171కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో బస్వాపురం, వడపర్తి, బి.ఎన్. తిమ్మాపురం పరిధిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు కోల్పోయిన వారి కోసం రూ. 75 కోట్లు మంజూరు చేసింది గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న భూ బాధితుల కోసం రూ. 87 కోట్లు విడుదలయ్యాయి (గతంలో పరిహారం కింద రూ. 27 కోట్లు అందించిన విషయం తెలిసిందే). అలాగే భువనగిరి నుంచి బీబీనగర్ వరకు నీటిని తరలించేందుకు చేపట్టిన హై లెవల్ మెయిన్ కెనాల్ పనుల కోసం రూ. 9 కోట్లు మంజూరయ్యాయి. క్రీడలతో క్రమశిక్షణభువనగిరి: క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, జిల్లా యువజనక్రీడల శాఖ అధికారి కె. ధనుంజనేయులు అన్నారు. శనివారం ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. మేజర్ ద్యాన్ చంద్ను నేటితరం యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆ తర్వాత క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు షీల్డ్, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది జానకిరాము, మురళి, జయ, రేణుక, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపికనల్లగొండ టూటౌన్ : నిజామాబాద్లో సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 1న నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్యా స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్, కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2011 నుంచి 31–12–2012 మధ్య జన్మించిన బాలికలు అర్హులని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 82470 45667, 94403 74027 నంబర్లను సంప్రదించాలన్నారు. యాదగిరి కొండపై పనిచేయని లిఫ్టుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో ఉన్న లిఫ్టు పని చేయడం లేదు. వీఐపీలు, బ్రేక్ దర్శనం భక్తులు, వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రొటోకాల్ కార్యాలయం సమీపంలో రెండు లిఫ్టులను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ 10 రోజులుగా ఈ రెండు లిఫ్టుల్లో ఒక లిఫ్టు పని చేయడం లేదు. దీంతో వీఐపీ ప్రొటోకాల్ దర్శనం కోసం వచ్చే భక్తులు కొండపైకి లిఫ్టులో వెళ్లేందుకు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అధికారులు త్వరితగతిన లిఫ్టును బాగు చేయించాలని కోరుతున్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి భువనగిరి: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రైతు బజార్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలంతో చెలగాటం ఆడుతోందన్నారు. ఎన్నికకు ముందు విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్రెడ్డి, ఏలె చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, నాయకులు పట్నం శ్రీనివాస్, యాదిరెడ్డి, నరసయ్య, కృష్ణ, వేముల నరేష్, మల్లారెడ్డి, కోటేష్, రామకృష్ణ, నరసింహారావు, బలరాం, జగన్మోహన్రెడ్డి, భిక్షపతి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
అక్టోబర్ నాటికి భూ సర్వే పూర్తి
ఫ డిసెంబర్లో రెండో విడతకు సిద్ధం కావాలి ఫ దసరాలోపు తొలి విడత ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయించాలి ఫ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫ సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఫ హాజరైన మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సూర్యాపేట : రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత చేపట్టిన భూముల రీ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చి అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేయాలని, డిసెంబర్లో రెండో విడత సర్వే చేపట్టేందుకు సంసిద్ధం కావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సర్వే, గృహ నిర్మాణ శాఖల సమీక్ష సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. మొదటి విడత 70 గ్రామాల్లో సర్వేను పారదర్శకంగా నిర్వహించి గ్రామ సరిహద్దులు నిర్ధారించడంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యక్షంగా వీటిని పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన సమస్యలను చట్టానికి లోబడి పరిష్కరించాలన్నారు. భూములకు సంబంధించి 45 దరఖాస్తులు తన లాగిన్లోనే ఎక్కువ రోజులు ఉంచుకోవడంపై యాదాద్రి జిల్లా అడ్డగూడూరు తహసీల్దార్ను వివరణ కోరాలని మంత్రి ఆదేశించారు. దసరాలోపు ఇళ్లు పూర్తిచేయించాలి ఇందిరమ్మ పథకంలో మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఉన్న ఇళ్లను దసరాలోపు పూర్తిచేయించాలని, నల్లగొండ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ కింద 500 గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గుర్తించి 15 రోజుల్లో పూర్తిచేయాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లడ్ల మంజూరులో మిగిలిపోయిన, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దసరాలోపే లబ్ధిదారులకు ఇచ్చేలా చూడాలన్నారు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే రెవెన్యూ సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హన్మంతు, గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్ వారి శాఖలకు సంబంధించిన అంశాలను వివరించారు. నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వారి జిల్లాలకు సంబంధించిన పలు విషయాలను మంత్రులకు వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్లో సూర్యాపేటకు మంజూరైన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవన నిర్మాణాలకు మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఫ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ భూభారతి ద్వారా పేదవారి భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఫ ప్రభుత్వ విప్లు, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన ఎల్–3 మస్యలు పరిష్కరించాలన్నారు. ఫ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ శాలిగౌరారం మండలం మాదారం చెరువు శిఖం భూమి ఆక్రమణ, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీలు, తహసీల్దార్లు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఆయా పోస్టుకు రూ.50 వేలు.. టీచర్కు రూ. లక్ష!
సాక్షి, యాదాద్రి : అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దళారుల పైరవీలు కలకలం రేపుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ స్థానిక నాయకులు అమాయక అభ్యర్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పోస్టుకో రేటు నిర్ణయించి దండుకుంటున్నారు. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో.. ఆలేరు, భువనగిరి, మోత్కూరు, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ ఆయా పోస్టులకు రూ. 50వేలు, టీచర్ పోస్టులకు రూ. లక్ష వరకు దళారులు వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు తాము అత్యంత సన్నిహితులం అని నమ్మబలుకుతూ అడ్వాన్సులు సైతం తీసుకుంటున్నారు. మోత్కూరు, గుండాల, ఆలేరు, వలిగొండ, రాజాపేట తదితర మండలాల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. దళారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు ఇటీవల గ్రామ పంచాయతీల్లో అధికారులు ప్రాథమికంగా అర్హుల జాబితాను ప్రదర్శించడంతో ఈ దందా బయటపడింది. స్థానికత లేకపోవడం, వయోపరిమితి వంటి కారణాలతో స్క్రూటినీలో పలువురి పేర్లను తొలగించారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని దళారుల చుట్టూ తిరుగుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన ఆన్లైన్లో అందిన ధ్రువపత్రాల ప్రాథమిక పరిశీలన ముగిసింది. అభ్యర్థి వాస్తవంగా ఆ గ్రామంలోనే నివసిస్తున్నారా లేదా అన్నది నిర్ధారించేందుకు సీడీపీఓల ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతోంది. లోకల్,నాన్–లోకల్ జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు వారం రోజుల సమయం ఇస్తారు. 10 శాతం వెయిటేజీ అభ్యర్థి నియామక ప్రక్రియలో మొత్తం 100 మార్కులు ఉంటాయి. 90 మార్కులు అభ్యర్థి అర్హతలు, కేటగిరీ ఆధారంగా సాఫ్ట్వేరే ఆటోమేటిక్గా లెక్కిస్తుంది. ఇందులో వితంతువులకు 5, వికలాంగులకు 5, అనాఽథలకు 10, మార్కులు కేటాయిస్తారు. ఇందులో ఇంటర్వ్యూలో 10మార్కులు కలుపుతారు. కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీ (డీడబ్ల్యూఓ, డీఎంహెచ్ఓ, డీఆర్డీఓ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ జరుగుతుంది సెప్టెంబర్ రెండో వారంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. కేవలం మెరిట్ ఆధారంగానే పారదర్శకంగా ఎంపిక ఉంటుంది. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. దళారులపై పోలీస్ కేసులు నమోదు చేస్తాం. – చిలుకూరు శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమాధికారిఅంగట్లో అంగన్వాడీ కొలువులు ఫ అధికార పార్టీ నేతల పేరుతో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు ఫ ప్రాథమిక జాబితాల ప్రకటనతో వెలుగుచూసిన అక్రమాలు ఫ అర్హత, మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తామంటున్న అధికారులు -
జాబ్మేళాలో 15మంది ఎంపిక
భువనగిరి: జాబ్మేళాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని జిల్లా ఉపాధికల్పనశాఖ అధికారి పద్మ కోరారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఉదిత ఓకేషనల్ జూనియర్ కళాశాలలో ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 45 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఎంపికై న 15మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో ఫార్మసీ కంపెనీ, నవత కంపెనీల మేనేజర్లు, జిల్లా ఉపాధికల్పన కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ నవనీత, పావం అలివేలు, చేగూరి రమణవాసు, పి. విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వేల్ గురుకులంను దత్తత తీసుకుంటా
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల పాఠశాలను దత్తత తీసుకుని, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్రెడ్డి ప్రకటించారు. తాను చదువుకున్న సర్వేల్ గురుకుల పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వచ్చారు. ‘కలిసి ఎదుగుదాం.. కలిసి సాధిద్దాం’ అనే లక్ష్యంతో శనివారం పాఠశాలలో ‘5ఎస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5ఎస్ కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణ, పరిశుభ్రత, అనవసర వస్తువుల తొలగింపు, పూర్వ విద్యార్థులతో అనుసంధానం, కలిసి ఎదుగుదాం–కలిసి సాధిద్దాం అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన స్పోర్ట్స్ డేలో బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల 1976 ఎస్ఎస్సీ బ్యాచ్ (శ్రీరంగం) విరాళంగా అందించిన 28 ట్యాబ్లు, రెండు ఇన్వర్టర్లను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా, క్రీడా వాతావరణం కల్పించేందుకు పూర్వ విద్యార్థులు మరింతగా ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఉషారాణి.. మహేందర్రెడ్డికి రాఖీ కట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీ.శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ గంగారం, డీఎస్పీ మధుసూదన్రెడ్డి, సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ పాండు, సర్వేల్ సర్పంచ్ చిలకరాజు చందనరాజులు పాల్గొన్నారు. ఫ మాజీ డీజీపీ మహేందర్రెడ్డి -
సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
భువనగిరిటౌన్ : జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు,సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం చేపట్టిన పాదయాత్రను శనివారం భువనగిరి పట్టణంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ చౌరస్తా వద్ద వారు జెండాలు ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ సభలో సీతారాములు మాట్లాడుతూ రూ. 20 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వందల కోట్లకు పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వరుణ యాగాలు చేస్తున్నారని, గోశాలలకు రూ.50 కోట్లు ఇస్తారు కానీ రైతుల సాగునీటికి నిధులు ఇవ్వరని ఎద్దేవా చేశారు. విషపూరిత మూసీ నీటితో ప్రజలు, పశువులు రోగాల పాలవుతుంటే సుందరీకరణ పేరుతో హైదరాబాద్ లో పర్యాటక హంగులు చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన, గోదావరి అనుసంధానం చేస్తే 7 జిల్లాలకు మేలు జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి కలలు కనే ఫ్యూచర్ సిటీపై పెట్టే శ్రద్ధలో సగం ఈ ప్రాజెక్టులపై పెడితే యాదాద్రి ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. సాగు తాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న 9 డిమాండ్లను అసెంబ్లీలో చర్చించాలన్నారు. ఈనెల 31న హైదరాబాద్లో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో 22 ప్రాజెక్టులు, కాల్వలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, నేతలు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి ,ముత్యాలు, అంజిరెడ్డి, వెంకటేశు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య ఫ భువనగిరిలో సీపీఎం పాదయాత్ర ప్రారంభం -
మహిళా ఉపాధికి ఈ–వాహనాలు
ఆలేరురూరల్ : స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ‘సీ్త్రనిధి’ వెన్నుదన్నుగా నిలుస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. పెరుగుతున్న కాలుష్య కారకాలను నియంత్రించేందుకు ప్రభుత్వం పర్యావరణ హితం కోసం ఈ–వాహనాలు (ఈ–ఆటో, ఈ–బైక్లు)అందిస్తోంది. ఇందుకోసం సీ్త్రనిధి ద్వారా రుణాలు విడుదల చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే సభ్యురాలి ఖాతాలో నగదు జమవుతున్నాయి. మంజూరైన ఈ–వాహనాలపై మహిళలు వివిధ రకాల చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 మిల్లెట్ ఈ–వాహనాలను పంపిణీ చేశారు. లక్ష్యం లేకున్నప్పటికీ ఔత్సాహిక మహిళలను ఇటువైపు మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఐదు రకాల రుణాలు జిల్లాలో 14,875 సంఘాల్లో 1,62,546 మంది సభ్యులు కొనసాగుతున్నారు. ఏటా సీ్త్రనిధిలో రూ.60 కోట్లకుపైగా రుణాలు అందిస్తున్నారు. సీ్త్రనిధిలో ఐదు రకాల రుణ సదుపాయం కల్పిస్తున్నారు. సువిదలో రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు, ప్రగతిలో 50వేల నుంచి లక్ష వరకు, అక్షయలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, సౌభాగ్యలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, ఐశ్వర్యలో రూ.5లక్షల వరకు రుణాలు పొందుతున్నారు. అర్హతలు ఇవే..అర్హులైన ప్రతి సభ్యురాలు ఈ–వాహనాల కొనుగోలుకు రుణం పొందే అవకాశం ఉంది. రుణాలు పొందేవారు గతంలో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు చెల్లించకుండా పెండింగ్ ఉండవద్దు. సభ్యుల కుటుంబాల్లోని ఎవరికై నా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎంచుకున్న వాహనాల కొటేషన్ తీసుకుని సీ్త్రనిధి అధికారులకు అందిస్తే మంజూరు చేస్తున్నారు. ఈ–ఆటోకు రూ.3లక్షల రుణం ఉంటే ప్రతినెలా రూ.6,700 కిస్తీ చొప్పున 60 నెలలు, ఈ–బైక్కు రూ.లక్ష రుణం ఇస్తే నెలకు రూ.2,660 కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది. సీ్త్రనిధి ద్వారా మహిళలకు ఈ–వాహనాలకు రుణ సౌకర్యం అందిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 10 మిల్లెట్ ఈ–వాహనాలను అందించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా సంఘాల సభ్యులు దరఖాస్తులు చేసుకుంటే రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. – నాగిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఫ స్వయం సహాయక సంఘాల పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యం ఫ సీ్త్రనిధి రుణాలతో ఈ–ఆటో, ఈ–బైక్లు ఫ ఇప్పటి వరకు పది మిల్లెట్ ఈ–వాహనాలు పంపిణీ ఫ చిరు వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణాలు -
కళతప్పిన రాయగిరి చెరువు
భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి చెరువు పర్యాటక కళను కోల్పోయి బోసిపోతోంది. గడచిన ఐదు నెలలుగా చెరువులో బోటింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం 2025 జూన్ 2న రాయగిరి వద్ద మినీ శిల్పారామాన్ని ప్రారంభించారు. ఇందులో పిల్లల ఆట వస్తువులు, ఫొటో పాయింట్లు, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 18 మంది సామర్థ్యం గల పెద్ద బోటు, స్పీడ్ బోటు, పెడల్ బోట్లను అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతుల్లో పెద్ద బోటు ఐదు నెలల క్రితం 18 మంది ప్రయాణించే పెద్ద బోటు సాంకేతిక లోపంతో మరమ్మతులకు గురైంది. రిపేర్ కోసం హైదరాబాద్ తరలించారు. ఇప్పటివరకు తిరిగి తీసుకురాలేదు. మరోవైపు ఇటీవల చెరువులో నీటిమట్టం బాగా తగ్గడంతో నలుగురు ప్రయాణించే స్పీడ్ బోటు సేవలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కేవలం ఒక్క పెడల్ బోటు మాత్రమే అరకొరగా నడుస్తోంది. కళ తప్పిన శిల్పారామం గతంలో ప్రతి శని, ఆదివారాల్లో పర్యాటకుల కోసం కూచిపూడి, భరతనాట్యం, కథకళి వంటి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. ఈ సంవత్సరం మే 10వ తేదీ తర్వాత నుంచి ఈ ప్రదర్శనలను కూడా నిలిపివేశారు. వారాంతాల్లో రద్దీ ఉన్నా తప్పని తిప్పలు శిల్పారామానికి సాధారణ రోజుల్లో 250 నుంచి 300 మంది, శని, ఆదివారాల్లో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి 500 – 600 మంది వరకు సందర్శకులు వస్తుంటారు. వినోదం కోసం వచ్చిన పర్యాటకులు బోటింగ్, నృత్య ప్రదర్శనలు లేకపోవడంతో కేవలం పిల్లల ఆట స్థలానికే పరిమితమైంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పెద్ద బోటును అందుబాటులోకి తెచ్చి, సాంస్కృతిక ప్రదర్శనలను పునరుద్ధరించాలని సందర్శకులు కోరుతున్నారు.ఫ చెరువులో ఐదు నెలలుగా నిలిచిన బోటింగ్ ఫ మరమ్మతులకు గురైన పెద్ద బోటు.. మూలనపడ్డ స్పీడ్ బోటు ఫ వారాంతాల్లో నృత్య ప్రదర్శనలకూ బ్రేక్ -
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసంతోపాటు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని విశేషంగా అలంకరించిన అర్చకులు భాజాభజంత్రీల నడుమ తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. సేవకు ముందు మహిళలు మంగళ హారతులతో నీరాజనం పలికారు. అనంతరం అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి, పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పూజలు చేసి, హారతినిచ్చారు. అమ్మవారికి ఇష్టమైన నాదస్వరాన్ని వినిపించారు. అమ్మవారి సేవలో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలిచౌటుప్పల్ : అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. శుక్రవారం ఆమె చౌటుప్పల్ మండలం దామెర గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని, వీబీజీ రామ్జీ పథకం కింద నిర్మించిన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో మిగిలిన కొంత రోడ్డు భాగాన్ని పూర్తి చేయించేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. అనంతరం జూమ్ మీటింగ్ నిర్వహించి చౌటుప్పల్, రామన్నపేట, నారాయణపురం మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి మిర్యాలగూడ : కృష్ణా, గోదావరి నదుల జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. నదీజలాల వినియోగంపై ఏర్పాటు చేసిన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ రిపోర్టును బయటపెట్టకుండా కాలయాపన చేస్తున్నారని, రాష్ట్రాల మధ్య జల తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కేంద్రం నాన్చుడు ధోరణి వీడాలన్నారు. ఆయన శుక్రవారం మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని చెరువులు, కుంటలను నింపకపోతే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందన్నారు. సమావేశంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, శ్రీను, రామ్మూర్తి, పాండు, రాంరెడ్డి, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్లులో తనిఖీలు మిర్యాలగూడ : విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద గల శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్లో తనిఖీలు నిర్వహించారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి రూ.80 లక్షల విలువైన కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం పక్కదారిపట్టినట్టు తనిఖీల్లో తేలిందని సమాచారం. విజిలెన్స్ అధికారులు రైస్మిల్లులోని రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. -
డ్యూటీ షిఫ్ట్లు పాటించాల్సిందే..
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విధులు నిర్వహించే హోంగార్డులు డ్యూటీ షిఫ్ట్ల సమయాలను కచ్చితంగా పాటించాలని రిజర్వ్ ఇన్స్పెక్టర్, హోంగార్డ్స్ ఆర్గనైజేషన్, డీఏఆర్ హెడ్ క్వార్టర్స్ జిల్లా అధికారులు సర్క్యులర్ మెమోను విడుదల చేశారు. ఇటీవల హోంగార్డుల విధుల విషయానికి సంబంధించి ఆలయ ఈఓతో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే గుట్టలో విధులు నిర్వహించే 16 పురుషులు, ఏడుగురు మహిళా హోంగార్డులు మొత్తం 23 మంది సకాలంలో హాజరై 8 గంటల డ్యూటీ సమయాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. డ్యూటీ సమయం పూర్తి కాకముందే విధి ప్రదేశం విడిచి వెళ్లడం, ఆలస్యంగా విధులకు హాజరు కావడం, అనుమతి లేకుండా గైర్హాజరు కావడం, షిఫ్ట్ సమయాలను స్వయంగా మార్చుకోవడం పూర్తిగా నిషేధించినట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు. అధికారులు ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో హోమ్ గార్డులను విధుల నుంచి తొలగించడంతో పాటు నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని సర్క్యులర్లో పేర్కొన్నారు. పది రోజుల క్రితమే ఆదేశాలు పది రోజుల క్రితం హోమ్ గార్డులకు ఉదయం 5గంటలకు అభిషేకం సమయం నుంచి విధులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఇంతలోనే సుప్రభాతం సమయం నుంచి విధులకు హోం గార్డులు హాజరు కావాలని సర్క్యులర్ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. అయితే హోం గార్డులందరికీ ఐదు షిఫ్ట్ల్లో డ్యూటీలు ఉంటాయి. అయితే సుప్రభాతం సమయంలో అంటే వేకువజామున 3గంటలకు విధులకు హాజరు కావాలంటే ఇబ్బందిగా ఉంటుందని మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము వేకువజామున 3గంటలకు విధులకు హాజరు కావాలంటే మధ్య రాత్రి ఇంటి నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇంటి దగ్గర తమకు పిల్లలు ఉంటారని, వారిని పాఠశాలకు పంపించే సమయం సైతం తమకు లేకుండా పోతుందని, దీంతో కుటుంబానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమకు కేటాయించిన సమయాల్లో మార్పులు చేయాలని మహిళా హోంగార్డులు కోరుతున్నారు. ఫ ‘గుట్ట’ దేవస్థానంలో హోంగార్డులకు సర్క్యులర్ జారీ ఫ 8 గంటల విధులు తప్పనిసరి ఫ నియమాలు ఉల్లంఘిస్తే డ్యూటీ నుంచి తొలగింపే.. ఫ వేకువజామున 3గంటలకే విధులకు రావాలని ఆదేశాలు ఫ ఆందోళనలో మహిళా హోంగార్డులు -
ప్రయాణికుల కిటకిట
భువనగిరి : రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం భువనగిరి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. మహిళలు, యువతులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల కోసం బస్టాండ్కు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులతో సందడి కనిపించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా బస్సులు నడిపిప్పటికీ సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. ప్రధానంగా భువనగిరి నుంచి నల్లగొండ, మోత్కూరు వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు వందలాదిగా నిరీక్షించారు. వచ్చిన ఒకటి రెండు బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ప్రమాదాల నివారణకే అండర్ పాస్
భువనగిరిటౌన్ : ప్రమాదాల నివారణకే భువనగిరి మండలం సింగన్నగూడెం చౌరస్తా వద్ద నూతనంగా అండర్ పాస్ నిర్మించ తలపెడుతున్నామని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్ పాస్ బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. అంతుకుముందు బహార్పేట్ పాఠశాలలో చెట్టు కొమ్మ కూలి చనిపోయిన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు కూర వెంకటేశ్, అవైస్చిస్తీ, బర్రె జహంగీర్, మహ్మద్ అతహార్, బొంతల నర్సింగ్ రావు, ఈరపాక నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
గోదాముల్లోనే ధాన్యం నిల్వ
సాక్షి, యాదాద్రి : ఈ వానాకాలం ధాన్యం మిల్లులకు ఇవ్వకుండా గోదాముల్లో నిల్వ చేయడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్కు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాకే తదుపరి చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులతో నిండి ఉన్న గోదాములను గడువులోగా ఖాళీ చేయించి కొత్త ధాన్యంం నిల్వకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అయితే మిల్లుల్లో ధాన్యం నిల్వకు చోటు లేలేదని తాము దించుకోలేమని మిల్లర్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు కొందరు మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని చీకటి బజారుకు తరలిస్తున్నారు. కలెక్టర్లకు పూర్తి అధికారాలు ధాన్యం నిల్వకు ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడైనా, ఏ రేటుకై నా గోదాములను అద్దెకు తీసుకునేలా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైస్ మిల్లుల్లోని ప్రైవేట్ గోదాములను సైతం అద్దెకు తీసుకోనున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం మిల్లర్లకు కాకుండా ప్రత్యామ్నాయంగా నిల్వ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే మిల్లుల్లో నిండుగా ధాన్యం ఉండడంతో ప్రైవేట్ గోదాములు, జర్మన్ టెంట్లకింద నిల్వ చేయడానికి పరిశీలిస్తున్నారు. మొత్తంగా మిల్లర్లకు వీలైనంత తక్కువ ధాన్యం ఇచ్చేలా సివిల్ సప్లయ్ శాఖ నిర్ణయించింది. బాయిల్డ్ రైస్ సేకరణలో జాప్యం జిల్లాలో బాయిల్డ్ రైస్ తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఎఫ్సీఐ కేవలం రారైస్ను మాత్రమే తీసుకుంటోంది. దీంతో మిల్లుల్లో ధాన్యం లోడింగ్ ఆలస్యమై రైస్ మిల్లర్లలో ఆందోళన మొదలైంది. ఈ నెలాఖరులోగా ఎఫ్సీఐకి రారైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ సీజన్లో రా రైస్ మిల్లింగ్ చేయడం వల్ల నూకశాతం పెరిగి నష్టం వస్తుందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. తాము కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వగలమని మిల్లర్లు అంటున్నారు. ఇటీవల అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం, నాగిరెడ్డిపల్లి రైల్వే పాయింట్ల వద్ద ఈనెల 24, 25 తేదీల్లో లోడింగ్ ప్రారంభమైంది. నాగిరెడ్డిపల్లి నుంచి రెండు విడతలుగా 2,000 టన్నుల చొప్పున బాయిల్డ్ బియ్యం ర్యాక్ ద్వారా తరలించడంతో ఆయా ప్రదేశాలు ఖాళీ అవుతున్నాయి. ఈ సీజన్లో మిల్లులపై ఆధారపడకుండా కార్యాచరణ ఫ ప్రస్తుతం గోదాముల్లో ఉన్న ధాన్యం వేలం ద్వారా విక్రయం ఫ బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ఈ సారి సీఎంఆర్ ధాన్యం ఫ ప్రత్యామ్నాయంపై ప్రభుత్వ దృష్టిరాష్ట్రస్థాయిలో గోదాముల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ధాన్యం బహిరంగ వేలానికి నిర్ణయించింది. గోదాముల్లో ఇప్పటికే ఉన్న పత్తి, మక్కల తరలింపు, ప్రత్యామ్నాయ నిల్వ మార్గాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో 7.5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉండగా, రైస్ మిల్లుల్లో మరో 10 లక్షల టన్నులతో కలిపి మొత్తం 17.5 లక్షల టన్నులు ఉంది. ఇందులో మన జిల్లాలో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాముల్లో, 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం ఓపెన్ టెండర్ల ద్వారా వేలంలో విక్రయించి గోదాములను ఖాళీ చేయిస్తోంది. సెప్టెంబర్ ఆఖరి నాటికి నిల్వలను పూర్తిగా ఖాళీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా జిల్లాలో ఉన్న గోదాముల్లో సుమారు 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు నిల్వ చేసే సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ సీజన్లో ధాన్యం వివరాలు (మెట్రిక్ టన్నుల్లో..) దిగుబడి అంచనా 4,00,000 కొనుగోలుకు అవకాశం 3,00,000 జిల్లాలో ప్రస్తుత ధాన్యం నిల్వలు గోదాముల్లో 1,30,000 మిల్లుల్లో 13,000 -
విచారణకు ఆదేశించకపోతే ఆందోళన చేస్తాం
సాక్షి యాదాద్రి : నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ భూములను చేర్చడం, నిబంధనలకు విరుద్ధంగా వాటిని తొలగించడం, ఫీనిక్స్ వంటి కార్పొరేట్ సంస్థలతో జరిగిన భూ లావాదేవీలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్ డిమాండ్ చేశారు. జిల్లా వారీగా పూర్తి ల్యాండ్ రికార్డులతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. గురువారం భువనగిరిలో వారు విలేకరులతో మాట్లాడారు. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, అక్రమ ఇసుక రవాణా, 22ఏ భూముల సమస్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మౌనం వహించడాన్ని వారు తప్పుబట్టారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు కాక సామాన్య ప్రజలు తహసీల్దార్, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించకపోతే ప్రజల తరఫున పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సాక్షి యాదాద్రి : జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్, కార్మిక, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి, హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే సెప్టెంబరు 10న లక్షలాది మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సిన ఆరు పెండింగ్ డీఏలను ఏకమొత్తంలో విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ధరణికోట భగత్, అడిషనల్ సెక్రెటరీ జనరల్ కుంట్ల అమరేందర్ రెడ్డి, కో చైర్మన్లు యాదయ్య, చీకూరి జగన్, పదురి శ్రీకాంత్ రెడ్డి, టీఏన్జీఓ జిల్లా కార్యదర్శి ఎండీ ఖదీర్, కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు పెండెం శ్రీనివాస్, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు మోహన్ రెడ్డి, బాలరాజు, అరుణ, శైలజ, ఆనంద్, ఎండీ అజీజ్ అలీ ఖాన్, శ్రీకాంత్, అశోక్ కుమార్, వినోద్ రెడ్డి, మొయిజున్నిసా బేగం, మాటూరి అశోక్, యదాద్రి దేవాలయ జేఏసీ నేతలు సురేంద్ర చార్యులు, రఘు, పరమేష్, శ్రవణ్, లక్ష్మీనరసింహ రెడ్డి, మెహతాబ్ సైదులు, పంచాయత్ సెక్రెటరీ ఫోరం అధ్యక్షుడు గణగాని శశికాంత్ గౌడ్, నరేందర్, శ్రీకాంత్, మెడికల్ ఫోరం అధ్యక్షుడు వెంకట రమణ రెడ్డి, గెజిటెడ్ అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి -
లేటెస్ట్ డిజైన్ల రాఖీలు లభిస్తాయి
నేను గత రెండేళ్లుగా చిట్యాలలోని పీజేఆర్ రాఖీ కేంద్రంలో రాఖీలు కొనుగోలు చేసి మా స్వగ్రామం చౌటుప్పల్ మండలం పంతంగిలోని నా షాపులో విక్రయిస్తున్నాను. అతి తక్కువ ధరలో లేటెస్ట్ డిజైన్లలో రాఖీలు ఈ కేంద్రంలో దొరుకుతున్నాయి. దీంతో దుకాణదారులమంతా ఈ రాఖీ కేంద్రం నుంచే రాఖీలు కొనుగోలు చేస్తుంటాం. – చుక్క సమత, పంతంగి, చౌటుప్పల్ మండలం దుకాణదారులకు అతి తక్కువ ధరలతో, అందుబాటులో ఉండే ధరలతో రాఖీలను తయారు చేసి విక్రయిస్తున్నాము. మా కేంద్రం ద్వారా ఇంటి వద్దే ఖాళీ సమయంలో, ఇంటి పనులు చేసుకుంటూనే రాఖీలు తయారు చేస్తూ 120 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. తక్కువ ధరలలో అధునాతన డిజైన్లతో కూడిన రాఖీలను తయారు చేస్తుండటంతో పలు రాష్ట్రాల నుంచి హోల్సేల్, రిటైల్ దుకాణాదారులు, వ్యాపారులు సైతం ఇక్కడకు వచ్చి రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా సైతం రాఖీలు విక్రయిస్తున్నాం. – ప్రొద్దుటూరి శ్రీనివాసులు, పీజేఆర్ రాఖీ కేంద్రం, చిట్యాల -
నాణ్యమైన విద్య అందించాలి
భువనగిరి: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. గురువారం భువనగిరిలోని కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల భద్రత ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతకు ముందు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతి, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పోలీస్స్టేషన్ తనిఖీభూదాన్పోచంపల్లి: శాంతిభద్రతల విషయంలో పోలీస్సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం పోచంపల్లి పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా పోలీస్సిబ్బంది హాజరు, వారి పనితీరు, స్టేషన్ డైరీ, కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు, పెండింగ్లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ జగన్, మహిళా ఎస్ఐ లైలా, పోలీస్సిబ్బంది తదితరులున్నారు. రేపు జాబ్మేళా భువనగిరి: నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. కనీసం 10వ తరగతి లేదా ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఆధార్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో ఉదిత ఒకేషనల్ జూనియర్ కళాశాలలో హాజరుకావాలని కోరారు. దరఖాస్తులకు ఆహ్వానం భువనగిరి: జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పానాధికారి పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీటీ లేదా ఎంపీటీ చదివి, 43 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్ట్రర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాగు నీరందించాలిఆలేరురూరల్ : అశ్వరావుపల్లి ప్రాజెక్టు నుంచి దేవాదుల కాల్వ ద్వారా సాగునీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. గురువారం ఆలేరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలేరు ప్రాంతానికి సాగునీరు లేక, ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గండంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వరావుపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తే పటేల్గూడెం, గండ్లగూడెం, కందిగడ్డతండా, తూర్పుగూడెం, గొలనుకొండ, శారాజీపేట ఇతర ప్రాంతాలకు, కాలువ ద్వారా పంటలకు సాగునీరు అందుతాయన్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో చలో హైదరాబాద్లో ఇందిరాపార్క్ వద్ద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నినాదంతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఎం.ఎ ఇక్బాల్, మండల అధ్యక్షులు దూపటి వెంకటేష్, తుసలయ్య, పిక్క గణేష్, మిట్ట శంకరయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కరువై యువకుడి ఆత్మహత్య
చౌటుప్పల్ : ఉపాధి కరువై ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్లో బుధవారం రాత్రి జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు(32) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం చౌటుప్పల్కు వచ్చాడు. స్థానికంగా రాంనగర్కాలనీలో అద్దెకు ఉంటూ వెల్డింగ్ పనిచేసేవాడు. జానకిరావుకు గతంలోనే వివాహం కాగా.. 2023లో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇంకా పిల్లలు కలుగలేదు. ఇటీవల భార్యాభర్తల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు నాలుగైదు రోజులుగా ఎటువంటి పనిలేక ఇంట్లోనే ఉంటున్నాడు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన అతడు బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు జోగారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిఆలేరురూరల్ : రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఆలేరులో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాములు(50) మతిస్థిమితం సరిగా లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి గత కొన్ని సంవత్సరాలుగా ఆలేరు పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆలేరు పట్టణంలోని బీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా.. ఆలేరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఆలేరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. -
జాబితా నిండా లోపాలే!
సాక్షి, యాదాద్రి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఎస్ఆర్) తుది దశ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో భారీగా తప్పిదాలు దొర్లడంతో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫొటో ఒకరిది.. పేరు మరొకరిదిగా మారడం, దశాబ్దాలుగా ఓటు హక్కు ఉన్నవారిని కూడా నాన్–మ్యాపింగ్ జాబితాలో చేర్చడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. క్షేత్రస్థాయిలో తప్పులు ఇవే.. ● మోత్కూరు మున్సిపాలిటీ ఆరెగూడెం గ్రామానికి చెందిన బిల్లపాటి మహేందర్ రెడ్డి ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో, చిరునామా (10–20 ఇందిరానగర్ ఎస్సీ కాలనీ) అన్నీ సరిగానే ఉన్నా.. పేరు మాత్రం ‘కృష్ణయ్య మన్నే’ అని తప్పుగా పడింది. తన వివరాలన్నీ సరిగానే ఇచ్చినా పేరు తప్పుగా పడితే ఓటు ఎలా వేయాలని ఆయన ఆవేదన చెందుతున్నాడు. ● ఆలేరు మున్సిపాలిటీ 11వ వార్డు (188 పోలింగ్ కేంద్రం)కు చెందిన తునికి రోశయ్య (82) గత 60 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటేశారు. కానీ, తాజా ప్రక్రియలో 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాలేదంటూ ఆయనను ‘నాన్ మ్యాపింగ్’ జాబితాలో చేర్చి నోటీసు జారీ చేశారు. ● యాదగిరిగుట్ట 6వ వార్డు (144 బూత్)కు చెందిన నక్క మహేష్ ఇటీవల పత్రాలు అందజేసినా ముసాయిదా జాబితాలో పేరు తప్పుగా వచ్చింది. నోటీసు అందుకున్న ఆయన వెంటనే బీఎల్ఓకు ఆధార్, బర్త్, కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సరిచేయించుకున్నాడు. డ్రాఫ్ట్ నోటీసుల పంపిణీ ముసాయిదా ప్రచురణ తర్వాత నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలను అధికారులు సరిచేస్తున్నారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కేటగిరీలకు సంబంధించిన పేర్లను సభల్లో చదివి వినిపించి, అవసరమైన తొలగింపులు, చేర్పులు చేస్తున్నారు. కొత్తగా వచ్చే క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల కోసం ప్రత్యేక సమీక్ష (హియరింగ్) నిర్వహిస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వద్ద ఉన్న ఆధారాలను బీఎల్ఓలకు అందజేస్తే, మ్యాపింగ్ వివరాలను సరిచేస్తారు. యాదగిరిగుట్టలో 503 మందికి దక్కని మ్యాపింగ్ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 6వ వార్డు పరిధిలోని 144, 146 బూత్లలో 161 మంది ఓటర్ల పేర్లలో వ్యత్యాసం రాగా, ఏకంగా 503 మందికి మ్యాపింగ్ కాలేదు. వీరికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు సరైన పత్రాలు చూపి తిరిగి యాప్లో అప్లోడ్ చేయించుకుంటున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన 128 మంది ఓట్లను అధికారులు తొలగించారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు వలస ఓటర్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సుమారు 60 మందికి నోటీసులు ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో ఓట్లు తొలగించారు. సరైన రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ధ్రువీకరణ పత్రాలు చూపించిన వారి ఓట్లను యథావిధిగా ఉంచారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో మొత్తం 97,102 నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 45,602, ఆలేరులో 51,500 నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్లో నోటీసుల జనరేషన్ ఆలస్యం అవుతుండటంతో ఇప్పటివరకు కేవలం వెయ్యి మందికి మాత్రమే అందజేశారు. మిగతావి త్వరలో ఇవ్వనున్నారు. ఫ ఫొటో ఒకరిది.. పేరు మరొకరిది ఫ దశాబ్దాలుగా ఓటు హక్కు ఉన్నవారు కూడా నాన్–మ్యాపింగ్ జాబితాలోకి ఫ పక్క గ్రామానికి మారిన సర్పంచ్ ఓటు ఫ సవరణ కోసం నోటీసులు జారీ యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం సర్పంచ్ తుమ్మల జ్యోతి ఓటు ముసాయిదాలో గల్లంతైంది. ఆమె ఓటును పక్కనే ఉన్న లప్పానాయక్ తండా పోలింగ్ బూత్లో నమోదు చేశారు. గ్రామ సభలో తన ఓటు కనిపించకపోవడంతో ఆమె అధికారులను నిలదీశారు. జ్యోతి పేరుతో గ్రామంలో పలువురు ఉండటం, రెండు గ్రామాల (లప్పానాయక్ తండా, రాళ్లజనగాం) రెవెన్యూ పరిధి ఒకటే కావడంతో బీఎల్ఓ పొరపాటున అక్కడ నమోదు చేశారని, వెంటనే సరిచేస్తామని తహసీల్దార్ గణేష్ నాయక్ తెలిపారు. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
భూదాన్పోచంపల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా ఇంటర్బోర్డు అధికారి సురేశ్రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం భూదాన్పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖేల్ ఇండియా సంవాద్ (ఖేల్కి బాత్ పీఎం మోదీకి సాత్) కార్యక్రమాన్ని తిలకించారు. ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగిస్తూ యువత క్రీడలు, యువ నాయకత్వం ఆవశ్యకత, వికసిత్ భారతత్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాలలో సీజీఏ మొదటి సంవత్సరం చదువుతున్న పిస్టల్ షూటింగ్లో జాతీయస్థాయిలో రాణిస్తున్న తప్పెట పవన్కుమార్ను సన్మానించారు. సమావేశంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ తులసి, క్రీడల ఇన్చార్జ్ శివశంకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సాయివర్ధన్, జ్యోతి, అధ్యాపకులు రాజేశ్వరమ్మ, వెంకట్రెడ్డి, సంతోష్కుమార్, వెంకటేశం, స్వాతి, శ్రీదేవి, జెవీ రావు, మురళీకృష్ణ, ప్రవీణ్కుమార్, అనురాధ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై వాహనాల బారులు
చౌటుప్పల్ నుంచి లక్కారంలోని అండర్పాస్ బ్రిడ్జి వరకు బారులుదీరిన వాహనాలు లక్కారంలోని అండర్పాస్ బ్రిడ్జ్జి వద్ద నెలకొన్న వాహనాల రద్దీచౌటుప్పల్ : రాఖీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వలిగొండ క్రాస్రోడ్డు నుంచి లక్కారం గ్రామంలోని అండర్పాస్ బ్రిడ్జి దాటిన తర్వాత వీవీ రెస్టారెంట్ వరకు వాహనాలు జామ్ అయ్యాయి. జంక్షన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు వాహనదారులు, స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. లక్కారం అండర్పాస్పై ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు సర్వీస్ రోడ్డులోకి తమ వాహనాలను మళ్లించారు. దీంతో అక్కడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
మహిళలకు ఉపాధి.. రాఖీల తయారీ
చిట్యాల : రాఖీ పండుగ వేళ నల్లగొండ జిల్లా చిట్యాలలోని పీజేఆర్ రాఖీ కేంద్రం రాఖీల తయారీ, విక్రయాలతో కళకళలాడుతోంది. వినూత్న డిజైన్లు, వివిధ రకాల మోడళ్లతో కూడిన రాఖీలు కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో ఇక్కడ రాఖీలు లభిస్తుండటంతో.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దుకాణాదారులు, హోల్సేల్, రిటైల్ రాఖీ విక్రయ వ్యాపారులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొనుగోళ్లు ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతుండటం విశేషం. గత నాలుగేళ్లుగా రాఖీలు తయారీ.. చిట్యాల పట్టణానికి చెందిన ప్రొద్దుటూరి శ్రీనివాసులు స్థానికంగా ఓ ఇంట్లో నాలుగేళ్ల క్రితం పీజేఆర్ రాఖీ తయారీ, విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ తయారీ కేంద్రం ద్వారా సుమారు 120 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరిలో కొందరు అక్కడే రాఖీలు తయారు చేస్తుండగా.. చాలా వరకు రాఖీల తయారీకి అవసరమైన మెటీరియల్ను కేంద్రం నుంచి ఇంటికి తీసుకెళ్లి, రాఖీలు తయారుచేసి తిరిగి అప్పగిస్తుంటారు. ఇలా వీరు రోజువారీగా రూ.300 నుంచి రూ.500 వరకు ఇంటి వద్దే ఉంటూ సంపాదిస్తున్నారు. ప్రతి ఏటా జనవరి నుంచి రాఖీ పౌర్ణమి వరకు వారికి ఉపాధి లభిస్తోంది. 40 వేల రకాల డిజైన్లు.. ఈ పీజేఆర్ రాఖీ కేంద్రంలో 40 వేల రకాల డిజైన్ల రాఖీలు లభ్యమవుతున్నాయి. ఇందులో పిల్లలను ఆకట్టుకునే కార్టూన్ రాఖీలు, ముత్యాల రాఖీలు, జరీ, స్టోన్స్, పూసలతో పాటు పలు రకాల రంగుల దారాలతో కూడిన రాఖీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రంలో 5 పైసల నుంచి అత్యధికంగా రూ.130 ధరల వరకు ఒక్కో రాఖీ లభిస్తోంది. తక్కువ ధరల్లో రాఖీలు లభ్యమవుతుండటంతో సామాన్యులతో పాటు దుకాణాదారులు తమ విక్రయ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఫ వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటున్న చిట్యాలలోని పీజేఆర్ రాఖీ విక్రయ కేంద్రం ఫ రాఖీలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్న 120మంది మహిళలు ఫ పెద్దఎత్తున తరలివస్తున్న వ్యాపారులు -
దొంగలనే దోచుకున్నారు !
చండూరు : చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం దొంగతనం కేసులో 11 మందిని రిమాండ్ చేశామని, ఒకరు పరారీలో ఉన్నట్లు చండూరు సీఐ టి. రాము తెలిపారు. ఈ కేసు వివరాలను గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చండూరు పట్టణానికి చెందిన తేలుకుంట్ల శ్రీనివాసులు మరొక భాగస్వామితో కలిసి కనగల్ మండలం కురంపల్లి గ్రామ శివారులో మహవీర్ రైస్ మిల్లు నిర్వహిస్తున్నాడు. వీరు 2025–26 సంవత్సరానికి గాను ఖరీఫ్, రబీ సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంలో 25వేల క్వింటాళ్లు చండూరు మార్కెట్ యార్డులోని గోదాంలో నిల్వ చేశారు. దశలవారీగా ధాన్యాన్ని మిల్లుకు తరలించగా.. ఇంకా 13వేల క్వింటాళ్ల బియ్యం గోదాంలో ఉండాల్సి ఉంది. కానీ ఇటీవల గోదాం నుంచి ధాన్యం బస్తాలు బయటకు గుంజినట్లు ఆనవాళ్లు కనిపించడంతో లెక్క చూడగా 600 నుంచి 700 బస్తాల వరకు బియ్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 22న శ్రీనివాసులు చండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దొంగతనం జరిగిందిలా.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగిళ్ల ఆంజనేయులు మార్కెట్లో ట్రేడ్ లైసెన్స్ హోల్డర్గా ఉంటూ చిరుధాన్యాలు అమ్ముతుంటాడు. అదేవిధంగా హమాలీగా కూడా పనిచేస్తుంటాడు. రెండు నెలల క్రితం నాగిళ్ల ఆంజనేయులుకు గోదాం తాళం దొరకగా.. రాత్రి సమయంలో చండూరుకు చెందిన బొమ్మోజు ప్రకాశ్, మెతరి నాగేష్తో కలిసి గోదాంలోని బియ్యాన్ని బొలేరో వాహనంలో సూర్యాపేటలోని మిల్లులకు అమ్మేవారు. చివరిసారిగా వారు ముగ్గురు ధాన్యం లోడ్ చేస్తుండగా చండూరుకు చెందిన దోటి వెంకన్న, అతడి అనుచరులు వేముల పవన్, దోటి శివ, భీమనపల్లి గణేష్, దోటి నరేష్, గండూరి మల్లేష్, బెత వెంకన్న, గోల్కొండ శేఖర్ కలిసి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఎనిమిది మంది నాగిళ్ల ఆంజనేయులును బెదిరించి రూ.5లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మొత్తం 11మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ విషయం తెలిసిన ఓ మీడియా ఛానల్ ప్రతినిధి నల్ల స్వామి సివిల్ సప్లై అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో అతడిపై కూడా నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ప్రస్తుతం నల్ల స్వామి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి మొత్తం రూ.9.80 లక్షలు రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. గతంలోనూ కేసులు నిందితుల్లో మెతరి నాగేష్పై పోక్సో కేసు ఉందని, అదేవిధంగా వేముల పవన్, గండూరి మల్లేష్పై హత్యాయత్నం కేసులు, భీమనపల్లి గణేష్, దోటి నరేష్పై కొట్లాట కేసులు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ఈ కేసు ఛేదించిన ఎస్ఐ శివకుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందినట్లు సీఐ తెలిపారు. ఫ చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం దొంగతనం చేసిన ముఠా గుట్టురట్టు ఫ 11 మంది రిమాండ్, ఒకరు పరారీ ఫ రూ.9.80 లక్షలు రికవరీ -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం
రామన్నపేట: రైతులు ఏ భూమిలో ఏ పంట సాగు చేస్తున్నారో అత్యంత కచ్చితత్వంతో నమోదు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డిజిటల్ క్రాప్ సర్వేకు జిల్లాలో మంగళవారం శ్రీకారం చుట్టాయి. జియోఫెన్సింగ్, శాటిలైట్ సాంకేతికత ఆధారంగా ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే సిబ్బంది పొలం హద్దుల వద్దకు వెళ్తేనే డిజిటల్ క్రాప్ సర్వే యాప్ పనిచేస్తుంది. సర్వే ఉద్దేశం ఏమిటంటే.. దేశవ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందో ముందే అంచనా వేయడం సులభమవుతుంది. దిగుబడులకు తగినట్లుగా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, మద్దతు ధర నిర్ణయించడానికి అవకాశం కలుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు జరిగిన పంట నష్టాన్ని పక్కాగా నిర్ధారించడానికి వీలవుతుంది. ప్రతి సబ్డివిజన్ ఫొటో నమోదు తప్పనిసరి పంటల నమోదు కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్రాప్ సర్వే యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఎంపిక చేసిన సర్వేయర్లు (వలంటీర్లు) తమ స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తమకు కేటాయించిన సర్వే నంబర్ల (పంటచేల) వద్దకు వెళ్లి ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. గతానికి భిన్నంగా ఈసారి ఒకే సర్వే నంబర్లోని సబ్డివిజన్ల (ఫామ్ ఫీల్డ్స్) వారీగా పంటచేల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన డేటాను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫైనల్ చేస్తారు. ప్రతి ఫొటో నమోదుకు ప్రభుత్వం సర్వేయర్కు రూ. 7 చొప్పున చెల్లిస్తుంది. మ్యాప్ లేని భూములు, ఎన్డీఎస్ ఖాతాల వివరాలను కూడా నేరుగా నమోదు చేస్తున్నారు. అలసత్వం వహిస్తే రైతులకు నష్టం డిజిటల్ క్రాప్ సర్వేలో పంట వివరాలను నమోదు చేయించడంలో రైతులు అలసత్వం వహిస్తే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలన్నా లేదా సీసీఐ ద్వారా పత్తిని సేకరించాలన్నా ఈ సర్వే వివరాలే ప్రామాణికం కానున్నాయి. కాబట్టి రైతులు సర్వేయర్లకు సహకరించి తమ పంట వివరాలు యాప్లో నమోదయ్యేలా చూసుకోవాలి.ఫ ఆధునిక సాంకేతికతతో పంటల నమోదు ఫ ఉపగ్రహ చిత్రాలు, జియోఫెన్సింగ్ ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే ఫ సర్వే నంబర్ల సబ్డివిజన్ల వారీగా ఫొటో తీస్తేనే యాప్లో అప్లోడ్ ఫ వలంటీర్లు అప్లోడ్ చేసే ప్రతి ఫొటోకు రూ.7 చెల్లింపు ఫ సర్వేలో వివరాలు నమోదు కాకపోతే రైతులకు ఇబ్బందులు -
మహిళలకు ఉపాధి..
రాఖీ పండుగ వేళ చిట్యాలలోని పీజేఆర్ రాఖీ కేంద్రం రాఖీల తయారీ, విక్రయాలతో కళకళలాడుతోంది. - 9లోఅండర్19 టీమ్ ఇండియా క్రికెట్కు రాజాపేట యువకుడురాజాపేట : మండల కేంద్రానికి చెందిన యవకుడు యశ్వీర్ గౌడ్ మరోసారి అండర్19 టీమ్ ఇండియా క్రికెట్కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 18, 21 తేదీల్లో గుజరాత్లోని రాజ్కోట్లో ఆస్ట్రేలియాతో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యశ్వీర్ గౌడ్ మరోసారి అండర్19 టీమ్ ఇండియా క్రికెట్కు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
‘వృక్షా’బంధన్
కోదాడ : రాఖీ పండుగను పురస్కరించుకొని గురువారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈకో క్లబ్ ఆధ్వర్యంలో చెట్టుకు రాఖీ కట్టారు. చెట్లను రక్షించుకుంటే అవి మనల్ని రక్షిస్తాయని రక్షాబంధన్ ఉత్సవాలను వృక్షాబంధన్గా మార్చుకోవాలని ఈ సందర్బంగా ఎంఈఓ సలీం షరీఫ్ కోరారు. అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్కు కిరాణ దుకాణం ఉంది. ప్రతి ఏటా సూర్యాపేట–జనగామ హైవే వెంట అర్వపల్లి వైజంక్షన్లో రాఖీలు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆయన సర్పంచ్ అయినప్పటికీ గతంలో మాదిరిగానే రాఖీ దుకాణం ఏర్పాటు చేసి గురువారం రాఖీలు విక్రయించారు. తాను సర్పంచ్ అయినప్పటికీ కుటుంబం కోసం వ్యాపారం చేసుకుంటున్నానని విద్యాసాగర్ తెలిపారు. సర్పంచ్ అయితేనేం.. -
ఆర్థిక స్వావలంబన సాధించాలి
బొమ్మలరామారం: సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటల సాగుతో ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో గురువారం సుక్క గణేష్ వ్యవసాయ క్షేత్రంలోని కూరగాయల సాగు, తిపిరిశెట్టి సత్యనారాయణ, వినయ్ పాలీ హౌస్లలో సాగు చేస్తున్న జెర్బెరా తోటను పరిశీలించారు. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక విధానాలను అవలంబిస్తూ కూరగాయలు, పూలు, ఆయిల్ పామ్ పంటల సాగు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన అధికారి హేమలత, మండల హెచ్ఓ కవిత, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ మౌనిక, ఏఈఓలు మధన్, మంజుల, సర్పంచ్ వేముల శ్రీలత నరేష్ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి వైద్య సేవలదించడంతో పాటు వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య, ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య, అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ మనోహర్ సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
గుట్టలో ప్రసాదం తయారీ విధానం ఎలా ఉంది
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో తయారు చేస్తున్న లడ్డూ, పులిహోర ప్రసాదం కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ శ్రీకనక దుర్గమ్మ ఆలయ ఈఓ సీనా నాయక్ ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. యాదగిరీశుడి ఆలయంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో అధునాత టెక్నాలజీ కలిగిన మిషనరీని లడ్డూ, పులిహోర ప్రసాదం తయారు చేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. విజయవాడ కనక దుర్గమ్మ వారి ఆలయంలోనూ ఈ మిషనరీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈఓ సీనా నాయక్, ఏఈఓలు గంగాధర్, చంద్రశేఖర్, ఈఈ రమాల ఆధ్వర్యంలో పరిశీలించి, మిషనరీ పని తీరుపై గుట్ట దేవస్థానం డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్ శర్మ, అధికారులు మైపాల్రెడ్డి, అశోక్, దాసోజు నరేష్లను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత పులిహోర ప్రసాదం, ఎన్ని లడ్డూలు తయారు చేస్తారని ఆరా తీశారు. అనంతరం కొండకు దిగువన నూతన అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ పరిశీలించిన విజయవాడ కనకదుర్గ ఆలయ బృందం -
కేరళ కుట్టిలా...
● మానసపదహారణాల తెలుగమ్మాయి వారణాసి మానస బుధవారం కేరళ కుట్టిలా మారారు. ఓనమ్ పండగ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా తయారయ్యారు. ఈ పండగకి కేరళ కుట్టీలు కట్టుకున్నట్లు చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబై, కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు మానస. ‘‘ఈ రోజంతా మీకు బంగారంలా మెరిసిపోవాలి. ఓనమ్ విందుని మీరు కడుపు నిండా ఆరగించాలి’’ అంటూ ఇన్స్టా వేదికగా షేర్ చేశారు మానస. కేరళ కుట్టిలా మానస డ్రెసప్ అయిన తీరుకి అభినందనలు దక్కాయి. ‘సూపర్... చాలా అందంగా ఉన్నారు.... దేవకన్యలా ఉన్నారు’... అంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలను షేర్ చేశారు. ఇదిలా ఉంటే... ‘మిస్ ఇండియా 2020’ కిరీటాన్ని గెలుచుకున్న మానస ‘దేవకీ నందన వసుదేవ, కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రాల్లో మెరిశారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ఓ తమిళ సినిమా కూడా మానస డైరీలో ఉంది. -
గమ్యం చేరకుండానే తెల్లారిన బతుకులు
ఫ కోదాడ మండలం దోరకుంట వద్ద డివైడర్పై ఆగిన లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫ గాలిలో కలిసిన ఆరుగురి ప్రాణాలు ఫ రాఖీ పండుగ వేళ విషాదంకోదాడ: స్వగ్రామంలో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అనుకున్న వారి ఆశలు.. జాతీయ రహదారిపైనే రక్తమోడాయి. కష్టపడి చదువుకుని, ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ కొలువుల్లో స్థిరపడుతూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న ఐరుగురితో పాటు మరో మహిళను.. ఒకరి నిర్లక్ష్యం బలితీసుకుంది. గమ్యం చేరడానికి మరో రెండు గంటల సమయం ఉందనగా, గాఢ నిద్రలో ఉన్న వారు అనంతలోకాలకు వెళ్లిపోయారు. పండుగ పూట ఆ ఇళ్లలో మిగిలిన కడుపుకోత ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దోరకుంట వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై ఆగి ఉన్న ట్రాలీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడగా 15మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెదిన యాసరపు చిన్ని, బొల్లిపోగు మేరిజ్యోష్నా, సురవరపు షకీన, చెన్నకేశవుల నాగేంద్రబాబు, పిడికిడి లక్ష్మీతేజ, కొండురు భావనవర్ష ఉన్నారు. -
మిన్నంటిన ఆర్తనాదాలు
కోదాడ, కోదాడ రూరల్ : కోదాడ మండలం దోరకుంట వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురై హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురి మృతదేహాలను, గాయపడిన వారిని స్థానికుల సహాయంతో ఉదయం ఐదున్నర గంటల వరకు కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలని డాక్టర్లు సూచించగా.. వారు సూర్యాపేట, ఖమ్మం, విజయవాడకు వెళ్లారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరుగా కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. ఆరుగురి మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో కోదాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. మృతుల్లో ఐదుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉండగా.. ‘ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివించి, ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్న సమయంలో మాకు ఈ శిక్ష విధించావు ఎందుకు దేవుడా..’ అని వారి కుటుంబ సభ్యులు రోదించడం చూసి ఆస్పత్రికి వచ్చిన వారు సైతం కన్నీరు పెట్టారు. మృతురాలు భావనవర్ష తల్లిదండ్రులు కోదాడకు వచ్చేంత వరకు కూడా ఆమె మృతి చెందిన విషయాన్ని బంధువులు వారికి తెలుపలేదు. వారు మార్చురీ వద్దకు వచ్చి అక్కడ ఉన్న వాతావరణాన్ని పసిగట్టి ‘నా బిడ్డ ఎక్కడ అంటూ..’ గుండెలు పగిలేలా రోదించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మృతుల పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అంబులెన్స్లను కోదాడకు పంపించి మృతదేహాలను తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఇనుప పిల్లర్లు బలంగా గుద్దుకోవడంతో మృతు ల మాంసపు ముద్దలు ఘటనా స్థలంలో పడిపోయాయి. భారీగా ట్రాఫిక్ జాం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన తర్వాత లారీలోని ఇనుప పిల్లర్లు జాతీయ రహదారిపై రెండువైపులా చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో పాటు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపై భారీగా ఆగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన ఇనుప పిల్లర్లను ఒక్కొక్కటిగా క్రేన్ సహాయంలో తొలగిస్తూ నెమ్మదిగా వాహనాలను పంపించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న బస్సు డ్రైవర్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారై.. హైదరాబాద్కు చేరుకుని అక్కడ ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించామని కోదాడ రూరల్ ఎస్ఐ యాకూబ్ తెలిపారు. అదేవిధంగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్ కూడా పరారైనట్లు పేర్కొన్నారు. పక్కనే కూర్చున్నా.. ప్రాణాలు కాపాడలేకపోయా.. ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య పక్క సీట్లోనే కూర్చున్నా.. ఆమెను కాపాడుకోలేకపోయానని మృతురాలు యాసారపు చిన్ని భర్త సుధాకర్ కోదాడ ప్రభుత్వాస్పత్రిలో రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. యాసారపు చిన్ని తండ్రి అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా.. ఆయనను పరామర్శించేందుకు చిన్నితో పాటు ఆమె భర్త సుధాకర్ రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. బుధవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టికెట్ బుక్ చేసుకొని సొంతూరుకు బయల్దేరారు. భార్యాభర్తలిద్దరు డ్రైవర్ వెనుక రెండో సీటులో కూర్చున్నారు. చిన్ని కిటికీ వైపు కూర్చోగా.. సుధాకర్ ఆమె పక్కనే కూర్చున్నాడు. ప్రమాద సమయంలో కిటికీ వైపు ఉన్న చిన్నికి ఇనుప పిల్లర్ బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. సుధాకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం రాత్రి హైదరాబాద్లోనే ఉండమన్నా వినకుండా బయల్దేరామని.. అప్పటి వరకు తన పక్కనే ఉన్న భార్య ప్రాణాలు కోల్పోయిందని సుధాకర్ కన్నీరుమున్నీరయయ్యాడు.ఫ మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో దద్దరిల్లిన కోదాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణం -
డెత్ హైవే!
జాతీయ రహదారిపై ప్రమాదాలకు ప్రధాన కారణాలివే..అతివేగం.. అడ్డగోలుగా పార్కింగ్సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట మృత్యుమార్గంగా మారుతోంది. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, రోడ్డు పక్కన ప్రమాదకరంగా భారీ వాహనాలు నిలిపివేయడం, వీటికి తోడు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ పర్యవేక్షణ లోపాలు వెరసి నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏడాది కాలంలో.. ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పొడవునా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మందికిపైగా మరణించారు. ఈ మూడు నెలల్లోనే 20 మందికిపైగా మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్పేట నుంచి మొదలుకొని కోదాడ వరకు హైవేపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. తూఫ్రాన్పేట, మల్కాపురం జంక్షన్, బొర్రోళ్లగూడెం స్టేజీ, కై తాపురం స్టేజీ, ధర్మోజిగూడెం స్టేజీ, దివీస్ పరిశ్రమ ముందు, పంతంగి గ్రామ స్టేజీ, ఆరెగూడెం క్రాస్రోడ్డు వరకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం, సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి, ఖాసీంపేట, వల్లభాపురం, గుంజలూరు, మునగాల, కోదాడ ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. గతేడాది జూలై 26న చౌటుప్పల్ మండల పరిధిలోని కై తాపురం స్టేజీ వద్ద జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇష్టారీతిన పార్కింగ్తో సమస్యలు హైవే వెంట వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. ఎలాంటి హెచ్చరికలు, సూచికలు ఏర్పాటు చేయకుండా నిలుపుతున్నారు. దీంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అయోమయానికి గురై ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనం ఆగిపోయినా, డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్నా.. వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందస్తు హెచ్చరికలు, తగిన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా లేకపోతే చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారుతోంది. ఏటా వందల మంది మృత్యువాత హైదరాబాద్–విజయవాడ హైవేపై ఒక్క చౌటుప్పల్ప్పల్ మండల పరిధిలోని 28 కిలోమీటర్ల హైవే పరిధిలోనే గతేడాది 129మంది చనిపోయారు. ఈ ఏడాది 8 నెలల్లోనే 156 మంది మరణించారు. నార్కట్పల్లి మండలంలో 17 మంది, చిట్యాల మండలంలో ఏడుగురు మృతిచెందారు. మొత్తంగా చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 200 మందికిపైగా, ఈ ఏడాది ఇప్పటివరకు మరో 200 మందికిపైగా మరణించారు. ఇతర జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ పెద్ద మొత్తంలో మరణాలు సంభవించాయి. రహదారులపై డేంజర్ స్పాట్లు–జోన్ పేజీలోఫ ఎక్కడపడితే అక్కడ లారీల నిలుపుదల ఫ పట్టించుకోని హైవే పెట్రోలింగ్ ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఫ గత ఏడాది కాలంలో 200 మందికిపైగా బలి ఫ ఈ ఎనిమిది నెలల్లోనే అంతకంటే ఎక్కువ మంది మృత్యువాత -
ఉద్యోగుల సమరభేరి
సాక్షి యాదాద్రి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అసంతృప్తి పరాకాష్టకు చేరింది. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా అందాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో హక్కుల సాధనకు ఉద్యమబాట పట్టారు. జాయింట్ యాక్ష న్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం మహాధర్నాకు పిలుపునిచ్చారు. 45 ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చుకునే వరకు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. ● వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకుని రెండవ పీఆర్సీని ప్రకటించాలి. ● నిలిచిపోయిన ఆరు విడతల కరువు భత్యాన్ని బకాయిలతో సహా చెల్లించాలి. ● కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని ఎత్తివేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ● జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, లీవ్ సరెండర్లు, రిటైర్డ్ ఉద్యోగుల తుది సెటిల్మెంట్లకు సంబంధించి రూ. 10,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ● కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి క్యాష్లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ● ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.ఫ అమలు కాని రెండో పీఆర్సీ ఫ పెండింగ్లో ఆరు డీఏలు .. ఫ అస్తవ్యస్థంగా ఈహెచ్ఎస్ విధానం ఫ నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా ఫ హాజరుకానున్న ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగుల సమస్యలన పరిష్కరించాలి. – కె. యశోద, జేఏసీ మహిళా ప్రతినిధి మా హక్కుగా వచ్చేప్రాధాన్యతలను ప్రభుత్వం అమలు చేయాలి. మూడేళ్లు దాటినా పీఆర్సీ అమలు కాకపోవడం చరిత్రలోనే ఇది మొదటి సారి. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలుచేయాలి. ఇంతకాలం ఓపిక పట్టిన ఉద్యోగులు ఇక వేచి చూసే ధోరణి ఉండదు. మా ఉద్యోగుల డిమాండ్ల సాధనకు పోరాటం సాగుతోంది. – అమరేందర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లొస్తూ..
ఫ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం భువనగిరి : స్నేహితుడి అంతక్రియలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన భువనగిరి మండలం వడపర్తి గ్రామం సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం గచ్చుబావి గ్రామానికి చెందిన జెల్ల గణేష్(38) తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామంలో బుధవారం స్నేహితుడి అంతక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లాడు. అంతక్రియలు ముగిసిన తర్వాత సాయంత్రం బైక్పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో భువనగిరి మండలం వడపర్తి ఎక్స్రోడ్ వద్ద భువనగిరి–జగదేవ్పూర్ రోడ్డు మార్గంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న రెడ్మిక్స్ వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆర్థిక భారంలో సగటు ఉద్యోగి
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలు, పిల్లల చదువుల ఫీజులు, వైద్య ఖర్చులతో సగటు ఉద్యోగి కుటుంబంపై తీవ్ర భారం పడుతోంది. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, పీఆర్సీ పెంపు ఆలస్యం కావడం వల్ల ఒక సాధారణ ఉద్యోగి ప్రతి నెలా సగటున రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాడు. మూడేళ్లుగా రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో, ఉద్యోగులు తమ సొంత అవసరాలకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – శ్రీనివాస్, టీజీఏ జిల్లా ఉపాధ్యక్షుడు ఉద్యోగులకు జీతాలు తప్పా ఏ విధమైన ఇతర బిల్లులు పాస్ కాక తీవ్రమానసిక, ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, ఆఫీస్ మెయింటెనెన్స్, పారిశుద్ధ్య నిర్వహణ బడ్జెట్ విడుదల కాలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం.సరెండర్ లీవ్ల బిల్లులు నిలిచిపోయాయి. గ్రామ సేవకుల వేతనాలుమూడు నెలలుగా రాలేదు. –ధరణికోట భగత్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు -
భువనగిరిలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని జలీల్ పుర మసీదు కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జయంతి (ఈద్ మిలాద్–ఉన్–నబీ) వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జలీల్ పుర మసీదు నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్స్కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ముఖ్యులు ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్తో పాటు పోలీసు సిబ్బందిని కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అబ్దుల్ రహీమ్, అవేస్ చిస్తీ, ఇక్బాల్ చౌదరి, ముష్టక్ చౌదరి, ముస్తఫా ఖాద్రి, కార్యదర్శి కాజం అహ్మద్, రహీముద్దీన్, ఇంతియాజ్, సుజావృద్దీన్, ఫహీం, గౌస్, టూఫీక్, ఖాదర్, సైఫుల్లా, అఫ్రోజ్, ఇలియాస్, సమీర్, జలీల్, బుర్హాన్, రామచంద్రయ్య పాల్గొన్నారు. -
ఈ హెచ్ఎస్ సమర్థంగా అమలు చేయాలి
ఈహెచ్ఎస్ లో ఉన్న లోపాలను తొలగించాలి.ఉద్యోగులు సమర్పించిన మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఈహెచ్ఎస్ సమర్థంగా అమలు చేయాలి. ఇందుకోసం అవసరమైన మార్గ దర్శకాలు, సౌకర్యాలుకల్పించాలి. – జగన్మోహన్ ప్రసాద్, టీజీఏ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావొ స్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తక్షణమే చొరవ తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. – ప్రియాంక, రెవెన్యూ అసోసియేషన్ మహిళా ప్రతినిధి -
రోమాంచకం చూస్తున్నప్పుడు నవ్వుకున్నాను
● జాన్వీ, సందీప్ రెడ్డి, వేణుగోపాల్, ప్రణయ్ రెడ్డి, సుమంత్ ప్రభాస్, అనంతిక ‘‘రోమాంచకం’ కథ విన్నాను, ఫస్ట్ కట్ చూశాను. సినిమా కూడా చూశాను... చాలా బాగుంది. ఈ కథ విన్నప్పుడు నేను ఎంతగా నవ్వుకున్నానో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. ఇది సూపర్ హిలేరియస్ మూవీ’’ అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘మా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రాలన్నిటికీ ‘ఎ’ సర్టిఫికెట్స్ వచ్చేవి. రాబోయే ‘స్పిరిట్’ మూవీకి కూడా ‘ఎ’ సర్టిఫికెట్ వస్తుంది. అయితే తొలిసారి మా బ్యానర్లో రూపొందిన ‘రోమాంచకం’ మూవీకి క్లీన్ ‘యు/ఏ’ సెన్సార్ సర్టిఫికెట్ వస్తోంది. ఈ సినిమాకు కుటుంబంతో పాటు రండి’’ అని కోరారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్... ఇలా ఎవరితో చూసినా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అంతేకానీ నిరుత్సాహపడరు’’ అని చెప్పారు. ‘‘మా సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏంటో తెలియాలంటే మా మూవీ చూసేందుకు థియేటర్స్కు రండి’’ అని అనంతిక సనీల్ కుమార్ పేర్కొన్నారు. ‘‘మా మూవీకి వర్క్ చేసిన యంగ్ టీమ్ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రణయ్ రెడ్డి వంగా. ఈ వేడుకలో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, కెమెరామేన్ పవన్ పప్పుల, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన, నటుడు వెంకటేష్ కాకుమాను మాట్లాడారు. – సందీప్ రెడ్డి వంగా -
ఇండికేటర్ వేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదు..
జాతీయ రహదారి డివైడర్పై ఆగి ఉన్న లారీ వెనుక ఇండికేటర్ వేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో నేను అటుగా వెళ్తున్న సమయంలో డివైడర్పై లారీ ఆగడం చూశాను. నేను పెట్రోల్ కొట్టించుకొని తిరిగి వెళ్తుండగా అప్పటికే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. కంటైనర్ లారీని తప్పించే క్రమంలో దానికి గీత పడగా బస్సు డ్రైవర్ వచ్చి ఇండికేటర్లు ఆన్ చేయాలని లారీ డ్రైవర్ను మందలించాడు. ఉదయం 4.45 గంటలకు నేను ఇంటికి వెళ్లిన ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. – బండారు వెంకటనారాయణ, ప్రత్యక్ష సాక్షి -
గంధమల్ల రిజర్వాయర్ పనులు ప్రారంభించాలి
రాజాపేట : గంధమల్ల రిజర్వాయర్ పనులు ప్రారంభించి ఆలేరు ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి గంధమల్ల రిజర్వాయర్ కోసం శంకుస్థాపన చేసి 10 నెలలు గడిచినా నేటికీ భూసేకరణ పూర్తిచేయకపోవడంతో పనులు ప్రారంభించలేదన్నారు. ఆలేరు ప్రాంతానికి సాగునీరు అందించి నీళ్ల ఐలయ్య అని పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, మదర్డెయిరీ డైరెక్టర్ సందిల భాస్కర్గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చామకూర గోపాల్ గౌడ్, సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్, మాజీ సర్పంచ్లు గుంటి కృష్ణ, రామిండ్ల నరేందర్, ధర్మేందర్ సింగ్, గొడుగు రాజు, నాయకులు కొరుకొప్పుల వెంకటేశ్ గౌడ్, రెడ్డబోయిన రాజు, ఠాకూర్ భగత్ సింగ్, పాండవుల లక్ష్మణ్, లక్ష్మణ్నాయక్ పాల్గొన్నారు. బస్సులను యథావిధిగా నడిపిస్తాంభూదాన్పోచంపల్లి: దిల్సుఖ్నగర్ నుంచి పోచంపల్లికి వచ్చే నెల సెప్టెంబర్ నుంచి యథావిధిగా ఆర్టీసీ బస్సర్వీసులను నడిపిస్తామని ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత, దిల్సుఖ్నగర్ డిపోమేనేజర్ సమత, డీఓ కవిత వెల్లడించారు. బస్సుల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పోచంపల్లికి చెందిన పలువురు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ను కలిసి విన్నవించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు బుధవారం ఆర్టీసీ అధికారులు పోచంపల్లికి వచ్చారు. నేతాజీ యువజన సంఘం వద్ద స్థానికులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రద్దు చేసిన బస్సులను వెంటనే పునరుద్ధరించాలని, మెట్రో బస్సుల స్థానంలో ఆర్డినరీ బస్సులను నడిపించాలని కోరగా అందుకు వారు అంగీకరించారు. వచ్చే నెల నుంచి ప్రతి అరగంటకు ఒకటి చొప్పున బస్సు సర్వీసులు నడిపేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సార బాలయ్య, వంగూరి పాండు, ఏలే హరిశంకర్, ముప్పడి శ్రీను, బోడ సత్యనారాయణ, కొంక సౌమ్య, బండి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎంజీయూలో ‘తీజ్’నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో బుధవారం గిరిజన విద్యార్థుల ఆధ్వర్యంలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి గోధుమ బుట్టలు ఎత్తుకుని పాటలు పాడుతూ నృత్యం చేసి ఉత్సాహంగా గడిపారు. అనంతరం గోధుమ బుట్టలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ గిరిజన విద్యార్థులు సతీష్, ఆకాశ్, దేవదాస్ పాల్గొన్నారు. -
ప్రభుత్వం దిగిరాకపోతే ప్రత్యక్ష పోరాటం
సెప్టెంబర్ 1న పెన్షనర్ల విద్రోహదినం, సెప్టెంబర్ 10న చల్లో హైదరాబాద్ కార్యక్రమాలకు ఉద్యోగ జేఏసీ పిలుపు నిచ్చింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుంది. ఉద్యోగులకే అత్యధిక బడ్జెట్ వెళుతోంది అని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ప్రజాప్రతినిధులు, యంత్రాంగం రెండూ కలిస్తేనే పరిపాలన. ప్రజలకు సేవలు అందించేది ఉద్యోగులే. ఉద్యోగులను సమాజంలో శత్రువులుగా చిత్రీకరించడం సమంజసం కాదు. – మందడి ఉపేందర్రెడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రెండునుంచి నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్ల బిల్లులు తక్షణమే క్లియర్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగదు రహిత వైద్యం అన్ని అస్పత్రుల్లో చేయాలి. – బాల్రాజు, టాప్రా జిల్లా అధ్యక్షులు -
అన్నింటికీ అమ్మ శాసీ్త్రయ సంగీతమే
● సుష్మిత, ప్రకాష్రాజ్, అక్షయ్ప్రకాష్రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ను విడుదల చేశారు. ‘ఇదే మన వైకుంఠపురం... ముప్పై ఏళ్ల తర్వాత సంగీత భారతిని నిర్ణయించే సమయం వచ్చింది’ అంటూ తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్తో ట్రైలర్ ప్రారంభమైంది. ‘స్వచ్ఛమైన సంగీతమే నా ఉచ్ఛ్వాసం... నిశ్వాసం. ఎన్ని పాశ్చాత్య సంగీత పిల్ల కాలువలు పుట్టినా.. అన్నింటికీ అమ్మ శాసీ్త్రయ సంగీతమే’.. అంటూ ప్రకాష్రాజ్ చెప్పిన పలు డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ‘జగమే సంగీతం’ని రూపొందించారు. ‘‘కుటుంబం, సంప్రదాయం, ఆత్మశోధనకు సంబంధించిన ఒక హృద్యమైన కథను ఈ సిరీస్ ఆవిష్కరిస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. -
రైలు ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం
మాడుగులపల్లి, ఆత్మకూర్(ఎస్) : బతుకుదెరువు కోసం గొర్రెలను మేపేందుకు వెళ్లిన వ్యక్తి గొర్రెలను రైల్వే ట్రాక్ దాటిస్తున్న క్రమంలో రైలు ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మాడుగులపల్లి మండలం అబంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నెమ్మికల్కు చెందిన బయ్య లింగయ్య, జటంగి మహేష్లతోపాటు వేల్పుల కొమురయ్యలు గొర్రెలను మేపేందుకుగాను మూడు నెలల క్రితం అబంగాపురం గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కొన్ని గొర్రెలు రైల్వే ట్రాక్పై వెళ్తుండగా వాటిని తరిమే క్రమంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు కొమురయ్య(60)ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా గొర్రెల కాపరులు స్టేషన్మాస్టర్కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని కొమురయ్య మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ స్టేషన్ మాస్టర్ మనీష్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య లింగమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హైవేపై వాహనాల బారులుచౌటుప్పల్ : చౌటుప్పల్లోని హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం వాహనాలు బారులుదీరాయి. ఉదయం నుంచి సాధారణంగానే ఉన్న రద్దీ సాయంత్రం తర్వాత ఒక్కసారిగా పెరిగింది. ఇరువైపులా రద్దీ ఉన్నప్పటికీ ప్రధానంగా విజయవాడ మార్గంలో అధికంగా ఉంది. స్థానికులు రోడ్డు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రేషన్ బియ్యం పట్టివేతచౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్రోడ్డు వద్ద మంగళవారం పోలీసులు 25క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మిర్యాలగూడకు చెందిన లావుడ్యా శ్రీనివాస్(30), గుగులోలు అరుణ్(18) సమీప గ్రామాల్లో తిరిగి 25క్వింటాళ్ల బియ్యం సేకరించి హైదరాబాద్కు తరలిస్తున్నారు. వలిగొండ క్రాస్రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
ఇంటర్ ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
రామన్నపేట: మెరుగైన ఫలితాల సాధన ద్వారా జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలపాలని ఇంటర్బోర్డు జిల్లాఅధికారి(డీఐఈఓ) బి.సురేష్రెడ్డి కోరారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్ ఉచితంగా సరఫరా చేసిన నోట్బుక్స్ పంపిణీచేసి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లోనూ త్వరలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి కసరత్తు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ సి.జగదీష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ జానయ్య, అధ్యాపకులు ప్రసూనాదేవి, పున్నారావు, మాల వెంకట్రెడ్డి, మందడి వెంకట్రెడ్డి, కిరణ్, నిర్మల, కవిత, నర్సింహారావు, రాజేశ్వరి, అశోక్కుమార్, శ్రీకాంత్, నాగేష్, అశోక్రెడ్డి, ఉపేందర్రావు, కరుణ, ఉమారాణి, పరశురాం, శ్రవణ్కుమార్, నాగమణి, నాన్ టీచింగ్స్టాఫ్ పుష్పలత, నర్సయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ డీఐఈఓ సురేష్రెడ్డి -
చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
నూతనకల్: ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అకస్మాత్తుగా మంటలు రావడంతో గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్లలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాగంటి ముత్తమ్మ(65) తన మనుమడు జంపన్నతో కలిసి నివాసం ఉంటుంది. ఆదివారం వంట చేసేందుకు గ్యాస్ స్టౌవ్ వెలిగిస్తున్న క్రమంలో గ్యాస్ లీకై ఆకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. యువకుడు అదృశ్యంభువనగిరి: యువకుడు అదృశ్యమైన సంఘటన భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అన్నంపట్ల నరేష్ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు గ్రామంతోపాటు బంధువుల ఇళ్లల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆయన భార్య జానకి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. గత ఐదు నెలల క్రితం కుటుంబ కలహాల కారణంగా నరేష్ భార్య తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతను మానసికంగా బాధపడుతున్నాడు. ఆచూకీ తెలిసిన వారు భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఇంట్లో వెండి, బంగారు ఆభరణాలు చోరీగుండాల: గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో బంగారంతో పాటు, వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన గుండాల మండలంలోని రామారం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అన్రెడ్డి యాదిరెడ్డి, ఆయన భార్య అండాలు ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ప్రహరీ దూకి, ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా పగుల గొట్టి, అందులో ఉన్న పది తులాల వెండితో పాటుగా, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అండాలు పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా.. బీరువా తాళం పగులగొట్టి ఉంది. అందులో వెండి, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారు అక్కడకు చేరుకుని క్లూస్టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. -
పత్తి కొనుగోలులో ఇబ్బందులు రానివ్వొద్దు
నల్లగొండ : ఈ సంవత్సరం పత్తి కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో పత్తి మద్దతు ధర, సేకరణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రభుత్వం పత్తి మద్దతు ధరను క్వింటాలుకు రూ.8,867 వరకు పెంచిందన్నారు. జిల్లాలో రెండు లక్షల 40 వేల హెక్టార్లలో రైతులు పత్తి సాగుచేశారని, సుమారు 14 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. పత్తి కొనుగోలుకు జిల్లాలో 31 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, అక్టోబర్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. పత్తిని పండించిన రైతు పత్తిని అమ్ముకునేందుకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో ముందు నుంచే అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ను ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే పత్తి కొనుగోలుకు అవకాశం ఉందని, 8రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. ప్రైవేటు జిన్నింగ్ మిల్లులు ద్వారా పత్తి కొనుగోలు చేస్తే మద్దతు ధరను మించి కొనుగోలు చేసే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు. ట్రాన్స్పోర్టు చార్జీలు ఎక్కువయ్యాయి గత సంవత్సరం జిల్లాలోని జిన్నింగ్ మిల్లులకు కాకుండా వరంగల్, జనగామ జిన్నింగ్ మిల్లులకు ఎక్కువగా పత్తిని కేటాయించడం వల్ల జిల్లా రైతులు ట్రాన్స్పోరు్ట్ చార్జీలు ఎక్కువగా భరించాల్సి వచ్చిందని జినింగ్ మిల్లుల అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఈ సంవత్సరం ముందుగా జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లులకు పత్తిని కేటాయించిన తర్వాతే ఇతర జిల్లాల కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సమావేశంలో తీర్మానించారు. పత్తి అమ్మిన రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సిసిఐ అసిస్టెంట్ మేనేజర్ దిలీప్ అగర్వాల్, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, పత్తి కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు, పత్తి మార్కెట్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఫ అధికారులకు కలెక్టర్ సూచన ఫ పత్తి మద్దతు ధర, సేకరణపై సన్నాహక సమావేశం -
మద్యం షాపులో చోరీకి పాల్పడిన దొంగల అరెస్ట్
అర్వపల్లి: అర్వపల్లిలోని రిషిత వైన్స్– 1లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాగారం సీఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ మధు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అర్వపల్లిలోని రిషిత వైన్స్– 1లో ఈనెల 22న రాత్రి గుర్తుతెలియని దొంగలు షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి దుకాణంలోని రూ.25వేల నగదు, కొంత మద్యం చోరీ చేశారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలించారు. మంగళవారం అర్వపల్లిలో హైవేపై ఎస్ఐ మధు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారిని విచారించగా వైన్స్లో చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులు సిద్ధిపేట పట్టణానికి చెందిన పిన్నోజు రవి, జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన అనపర్తి దుర్గయ్య, కర్కాని నరేష్లుగా గుర్తించారు. వీరి నుంచి రూ.17,200 నగదు, బైక్, ఖాళీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రవి, దుర్గయ్య ఇద్దరికీ సూర్యాపేట జైలులో పరిచయం ఏర్పడింది. రవిపై తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో 20 కేసులు ఉన్నాయి. దుర్గయ్యపై ఇప్పటికే రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి. ముగ్గురు నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది శ్రీను, లింగయ్య, బాలకృష్ణ, వెంకట్, కృష్ణ పాల్గొన్నారు. -
నల్లగొండ జైలును తనిఖీ చేసిన జైళ్ల శాఖ డీఐజీ
నల్లగొండ: నల్లగొండ జిల్లా జైలును జైళ్ల శాఖ డీఐజీ దుద్దిళ్ల శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కారాగారంలో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసం కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, వారికి అందిస్తున్న ఆహారం, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. అంతకు ముందు డీఐజీకి కారాగారం పర్యవేక్షణ అధికారి కూన ఆనందరావు, జిల్లా ఉప కారాగారాల పర్యవేక్షణ అధికారి శోభన్ బాబు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ.. పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జైలర్లు బాలకృష్ణ, అచ్చయ్య, జైలు సిబ్బంది పాల్గొన్నారు. -
సమాజానికి దర్పణం.. శాంకరీయం
ఆలేరు : తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకు శతాబ్దాల చరిత్ర ఉందని, కవి బండిరాజుల శంకర్ రచించిన నిత్యసత్యాలు శాంకరీయం శతక సంపుటి నేటి సమాజానికి దర్పణంలాంటిదని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు, ప్రముఖ కవి, ఆచార్య మసక చెన్నప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్యులు,కవి బండిరాజుల శంకర్ రచించిన నిత్యసత్యాలు–శాంకరీయం శతక సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సామాన్య పాఠకుడికి సైతం అర్థమయ్యేలా సరళమైన భాష, సులభమైన శైలిలో శతకాన్ని రచించడం శాంకరీయం ప్రత్యేకత అని చెప్పారు. అనంతరం పాఠశాల విద్యార్థిని కాసులబాద నిత్యశ్రీ భరతనాట్యం ఆకట్టుకుంది. ఈకార్యక్రమంలో డాక్టర్ లింగంపల్లి రాంచంద్ర, డాక్టర్ భేరి సునీతారాంమోహన్రెడ్డి, డాక్టర్ పాండాల మహేశ్వర్, డాక్టర్ పోరెడ్డి, రంగయ్య, డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ, పాలకుర్తి రామమూర్తి, ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ ఓయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసక చెన్నప్ప -
బాధిత కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థికసాయం
నల్లగొండ టూటౌన్: నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి జన్మదినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్షాక్తో మృతి చెందిన కేసాని రాజశేఖర్రెడ్డి కుటుంబసభ్యులకు ఆయన రూ.8 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్తో మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. రాజశేఖర్రెడ్డి సతీమణి భవ్యశ్రీ, ఆమె పిల్లల కోసం రూ. 8 లక్షలు ఫిక్స్డ్ చేసి డిపాజిట్ పత్రాలను వారికి అందజేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గ నాయకులు కూడా తగినంత ఆర్థికసాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. అనుముల మండలం కట్టవారిగూడెంలో నిర్వహించిన రాజశేఖర్రెడ్డి అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లిఖార్జున్రెడ్డి, బోనగరి దేవేందర్, రావుల శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సమాచారం ఇవ్వడంలో అప్రమత్తత అవసరం
భువనగిరి: క్షేత్ర స్థాయిలో పనిచేసే బోధనేతర సిబ్బంది పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి మధ్య వారదులుగా ఉండాలని డీఈఓ భిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ కన్వెన్షన్సెంటర్లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఒక రోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. డీఈఓ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంలో బోధనేతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు.కార్యక్రమంలో విలీన విద్య సమన్వయ కర్త పెసరు లింగారెడ్డి, ఏఎంఓ జానీఆఫ్ఘన్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్, స్టేట్ రిసోర్స్ పర్సన్లు రాజేంద్రప్రసాద్, మారుపాక భాస్కర్, సంధ్యారాణి, సీఆర్పీలు, ఎంఐఎస్కో ఆర్డినేటర్లు, ఎల్డీఏలు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో ఆర్జిత సేవలు పునః ప్రారంభంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అర్చకులు మంగళవారం పునః ప్రారంభించారు. పవిత్రోత్సవాల సందర్భంగా రెండు రోజులుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి భక్తులచే జరిపించే పూజలను రద్దు చేసిన విషయం విదితమే. పవిత్రోత్సవాలు సోమవారం ముగియడంతో మంగళవారం తిరిగి ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అర్చకులు ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడికి ఆకుపూజయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు నిర్వహించారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన చేశారు. -
మోత్కూరులో సంగీత శిలలు
మోత్కూరు : సాధారణంగా రాళ్లను కొడితే కర్కశమైన శబ్దాలు వస్తాయి. కానీ మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని రాళ్లు మాత్రం అందుకు భిన్నంగా సంగీత స్వరాన్ని వినిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. మోత్కూరులోని కొంత ఇద్దయ్య వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ‘ఏనె గుండ్లు’ (నల్ల రాళ్లు) స్థానికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గుండ్లలోని ఒక్కో రాయిని చిన్న రాయితో తట్టినప్పుడు లోహపు గంట నాదంలా వస్తోంది. ఈ శబ్దాలకు అనుగుణంగా కొందరు లయబద్ధంగా వాయిస్తుంటే, మరికొందరు తమ సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్గా మారి రోజురోజుకూ సందర్శకుల రద్దీ పెరుగుతోంది. సైన్స్ ఏమంటోంది? రాయి ఆకారం, పరిమాణం, సాంద్రత, అంతర్గత నిర్మాణంలోని భౌతిక లక్షణాల వల్ల కొన్ని శిలలు కంపించి ఇలాంటి ప్రత్యేకమైన ధ్వనులను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి వాటిని ‘సంగీత శిలలు’ అని, వీటితో స్వరాలు పలికించే వాయిద్యాన్ని ‘లిథోఫోన్’ అని పిలుస్తారని పేర్కొంటున్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి ఈ రాళ్లపై అధ్యయనం చేయిస్తే వీటి అంతర్గత నిర్మాణంపై మరింత స్పష్టత వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. అధికారులు ఈ ప్రాంతాన్ని గుర్తించి, రాళ్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఇది మంచి పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఫ భిన్నమైన శబ్దాలతో ఆకట్టుకుంటున్న ‘ఏనె గుండు’ ఫ పెరుగుతున్న సందర్శకుల తాకిడి -
తగ్గిన వరి, పత్తి సాగు
ఎల్నినో దెబ్బకు జొన్న, పప్పుధాన్యాలు సహా ఇతర పంటల సాగు విస్తీర్ణం కూడా పడిపోయింది. అయితే, కందుల సాగు మాత్రం ఆశాజనకంగా ఉంది. వ్యవసాయ అధికారులు కేవలం 5 వేల ఎకరాల్లో కందులు సాగవుతాయని అంచనా వేయగా, వాస్తవానికి 8 నుంచి 12 వేల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భువనగిరి: వానాకాలం సీజన్పై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపింది. వాతావరణ శాఖ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ప్రధాన పంటలైన వరి, పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం చేసిన విస్తృత ప్రచారం ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఆశించిన స్థాయిలో సాగని ఆరుతడి పంటలు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయన్న అంచనాలతో, వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం వివిధ రూపాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు విత్తనాలను సైతం విక్రయించింది. అయినప్పటికీ జిల్లాలో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు ఆశించిన స్థాయిలో మొగ్గు చూపలేదు. లక్ష్యానికి ఆమడదూరంలో వరి, పత్తి జిల్లాలో వానాకాలం సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 3.05లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేశారు. కానీ, ఎల్నినో పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు కేవలం 1.91 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. అదేవిధంగా పత్తి సాగు 1.40 లక్షల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 1.12 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. గత వానాకాలం సీజన్లో వరి 97.08శాతం సాగు చేయగా ఈ సారి 62శాతం మాత్రమే సాగైంది. పత్తి గత వానాకాలం సీజన్లో 99.30శాతం వేయగా ఈ సారి 80శాతమే సాగు చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని విస్తృతంగా ప్రచారం చేశాం. వరి విస్తీర్ణం తగ్గింది, అయితే పత్తి పంట సాగు పెరుగుతుందని ఆశించాం.. కానీ తగ్గింది. – పీవీ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఫ లక్ష్యాన్ని చేరుకోని ప్రధాన పంటల సాగు ఫ ప్రభుత్వం ప్రోత్సహించినా ఆరుతడి పంటలపై ఆసక్తి చూపని రైతులు ఫ అంచనాలకు మించి సాగవుతున్న కందులు పంటల సాగు వివరాలు (ఎకరాల్లో) పంట గత వానాకాలం సాగైంది ఈసారి సాగు సాగైంది అంచనా అంచనా వరి 2,98,711 2.90 లక్షలు 3.05 1.91 పత్తి 1,34,941 1.34 లక్షలు 1.40 లక్షలు 1.12 లక్షలు -
హక్కుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నాగార్జునసాగర్: రాష్ట్ర చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మంగళవారం నాగార్జునసాగర్కు చేరుకుంది. సాగర్లోని విజయవిహార్ అతిథి గృహం వద్ద వీరికి మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభ్యులు స్థానిక బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, గురుకులంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై బీసీ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ స్వప్న, ప్రిన్సిపాల్ రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్రెడ్డి విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలో అందుతున్న వసతులు భోజనం, విద్యా సౌకర్యాలు, ఇతర సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విజయవిహార్ సమావేశ మందిరంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకం కింద నల్లగొండ జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై కమిషన్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్, గోగుల సరిత, మర్రిపల్లి చందన, బండి అపర్ణ, ప్రేమలత అగర్వాల్, పెద్దవూర ఎంఈఓ తరి రాము, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ సతీష్, ఆర్ఐ దండ శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.ఫ చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్రెడ్డి -
పరిష్కారం.. పది శాతమే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్ను తీసుకువచ్చింది. దీనికి ఉమ్మడి జిల్లాలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నందికొండ మున్సిపాలిటీ మినహా మిగతా 18 మున్సిపాలిటీల నుంచి 1,91,187 మంది రూ.19.04 కోట్లు చెల్లించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో 57,554 మంది రూ.5.75 కోట్లు చెల్లించి దరఖాస్తు చేకున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన అప్పట్లో తలెత్తిన న్యాయ వివాదాల కారణంగా పెండింగ్లో పడింది. 2024లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తరువాత రెండుసార్లు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరోసారి క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చింది. నవంబరు 30 వరకు మళ్లీ గడువు పెంచింది. ఆలోగా ఏ మేరకు పరిష్కరిస్తారన్నది వేచిచూడాల్సిందే. పరిశీనలో విఫలం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఆరేళ్ల కిందట ఒక్కొక్కరు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లాలో దాదాపు 1.91 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. వారిలో చాలా మంది వాటి డాక్యుమెంట్స్ సకాలంలో అప్లోడ్ చేయలేదు. ప్రస్తుతం వారు ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ద్వారా (ఆన్లైన్లో) డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాటిని కూడా పరిశీలించి తగిన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రాసెస్ చేసిందీ మూడో వంతే... ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో 1,91,187 మంది ప్రజలు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం మూడో వంతు దరఖాస్తులను మాత్రమే అధికారులు ఇప్పటివరకు ప్రాసెస్ చేయగలిగారు. వాటిల్లో 8వేల దరఖాస్తులను తిరస్కరించిన అధికారులు సరైన డాక్యుమెంట్స్ లేవని మరో 25 వేల దరఖాస్తులను పక్కన పెట్టారు. కేవలం 28,543 దరఖాస్తులను మాత్రమే పూర్తి స్థాయిలో పరిశీలించి ఫీజు చెల్లించాక క్రమబద్ధీకరణకు ఓకే చెప్పారు. మరో 32 వేలకు పైగా దరఖాస్తుదారులు ఫీజులను చెల్లించి ఉన్నా వాటిని ఇంకా పరిష్కరించలేదు. ఫ నందికొండ మున్సిపాలిటీకి ఎల్ఆర్ఎస్ వర్తించదు -
కరివేపాకుతో కలకాలం ఆదాయం
● మొదటి సంవత్సరం ఎకరాకు 100 నుంచి 180 కిలోల దిగుబడి వస్తుంది. ● రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రతి మూడు నెలలకు ఒక కోతలో 700 కిలోల చొప్పున ఏడాదికి 2100 కిలోల కరివేపాకు దిగుబడి వస్తుంది. ● నాలుగవ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక్కో కోతకు 1000 కిలోల చొప్పున 4 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది. ● ఐదవ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కోత ఎకరాకు 2000 కిలోల ఆకు చొప్పున ఏడాదికి 8 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది. త్రిపురారం : ఎల్నినో ప్రభావంతో వాతావరణం పూర్తిగా భిన్నంగా మారింది. సకాలంలో వర్షాలు కురవడం లేదు. జలాశయాల్లో నీరు అశించిన స్థాయిలో లేదు. రైతులు అధికంగా నీటి ద్వారా పండించే పంటలు సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ నికర ఆదాయం వచ్చే పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులు సులభంగా సాగు చేసుకోవడానికి కరివేపాకు అత్యంత అనుకూలంగా ఉంటుందని, మార్కెట్లో కూడా డిమాండ్ అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కరివేపాకు సాగులో రైతులు చేపట్టాల్సిన పలు పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరించారు. ● సువాసిని : మెట్ట ప్రాంతాలకు సువాసిని రకం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేరు మొక్కల ద్వారా మాత్రమే విస్తరించి పెరుగుతుంది. ● డీడబ్ల్యూడీ –01 : ఈ రకం పంట భూమిలో వేరు పిలకల ద్వారా వేనుకొని పెరుగుతుంది. ఆకులు ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటాయి. చలిని ఎక్కువగా తట్టుకోలేదు. రోజువారీ కూరలతో పాటుగా కరివేపాకులను పొడిగా చేసుకొని వినియోగించుకోవచ్చు. ● డీడబ్ల్యూడీ– 02: విత్తనాల ద్వారా పంట రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఆకులు లేత పసుపు రంగులో ఉండడంతో పాటుగా వాసన తక్కువగా ఉంటుంది. ఈ రకం చలిని తట్టుకుంటుంది. తక్కువ సమయంలో పెరుగుదల అధికంగా ఉంటుంది. ● భువనేశ్వర్ : అన్ని రకాల నేలల్లో ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. తుక్కువ నీటి వసతైనా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. మురుగు నీరు పారే ఎర్ర నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఎర్ర నేలలు ఈ రకానికి అధిక దిగుబడులు అందిస్తుంది. అన్ని రకాలను భూమిలో విత్తుకోవడానికి ఎకరానికి 80 నుంచి 100 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. నేల తయారీ విత్తే పద్ధతి ప్రధాన భూమిని 3 నుంచి 4 సార్లు కలియ దున్నుకోవాలి. ఆకరి దుక్కిలో ఎకరాకు సుమారు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. 30.30.30 సెంటీమీటర్ల పరిమాణం గల గుంతలను 1.2 నుంచి 1.5 మీటర్ల దూరంలో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి ముందుగానే గుంతలు తీసుకోవడం ఉత్తమం. గుంతల్లో పశువుల ఎరువు నింపి మధ్యలో మొక్కలు నాటుకోవాలి. 30 సెంటీమీటర్లు ఎత్తు కలిగిన నారుమళ్లను తయారు చేసి నారు పెంచి నాటుకోవచ్చు. నారుమళ్లకు తగినంత పశువుల ఎరువులు వేసిన తరువాత 10 సెంటీమీటర్ల దూరంలో గీత గీసి విత్తనాలు విత్తుకోవాలి. మూడు రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఎరువుల వినియోగం ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఎకరాకు 28 కేజీల నత్రజని, 9 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను కలిపి గుంతలో సమానంగా నింపుకోవాలి. గుంతలను నింపిన వెంటనే వాటిలో మట్టిని తడుపుకోవాలి. మొక్క నాటిన 3 రోజుల తరువాత మరోసారి తడుపుకోవాలి. వారం తరువాత మరోసారి తడి అందివ్వాలి. నీరు అందుబాటులో ఉంటే కాలవలు తవ్వుకొని ఆరుతడిగా తడులు ఇస్తూ ఉండాలి. సస్యరక్షణ చర్యలు గొంగలి పురుగులు చిన్నగా ఉన్నప్పుడు తెల్ల, నలుపు రంగులో ఉంటాయి. తరువాత ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి స్థూలకాయం రూపంలో ఉంటుంది. పురుగుల గుర్తిస్తే తీసీ నాశనం చేయాలి. వేప సంబంధిత క్రిమిసంహార మందులను ఉపయోగించి చీడపీడల నివారణ చేపట్టడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించడం ఉత్తమమైన పద్ధతి. సాగు పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు -
అవినీతి జలగలు..!
కొన్ని ప్రభుత్వ శాఖల్లో సాగుతున్న లంచాల పర్వం సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు అవినీతి జలగల్లా మారారు. పౌర సేవలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా లంచం సమర్పించుకోవాల్సిందే. చేయితడపనిదే ఫైలు కదలని దుస్థితి నెలకొంది. లేదంటే బాధితులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పకుంటున్నారు. జిల్లాలో లంచం తీసుకుంటూ ఎంతో మంది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కి జైలుపాలవుతున్నా ఉద్యోగుల తీరులో మాత్రం మార్పురావడంలేదు. తాజాగా ఆలేరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరకడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బహిరంగంగానే వసూళ్లు జిల్లాలోని అన్ని శాఖల్లోనూ కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలోనే అత్యధికంగా అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ధరణి సమస్యల పరిష్కారం, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, ల్యాండ్ సర్వేలు, మ్యుటేషన్ తదితర పనుల కోసం కొందరు అధికారులు, సిబ్బంది బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారు. కుల, ఆదాయ, వారసత్వ ధ్రువీకరణ పత్రాల కోసం డబ్బులు ఇవ్వాల్సివస్తోంది. భూభారతి పోర్టల్లో సవరణలు చేయడానికి రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్న ఘటనలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. ట్రాన్స్కో, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖల్లోనూ.. రెవెన్యూతో పాటు రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, పోలీస్, రవాణా, కార్మిక, నీటిపారుదల, ట్రాన్స్కో, పౌరసరఫరాలు, మున్సిపల్ తదితర శాఖల్లోనూ లంచాల దందా కొనసాగుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో పర్సంటేజీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో భువనగిరి మున్సిపాలిటీలో ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించడానికి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి పట్టుబడడం దీనికి నిదర్శనం.బాధితుల ఫిర్యాదులతో.. బాధితులు ముందుకు వచ్చి అవినీతి అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆ అధికారులు దాడులు చేసి అవినీతి ఉద్యోగులను పట్టుకోవడం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. వరుస ఏసీబీ దాడులతో అధికార యంత్రాంగంలోని అవినీతిపరుల గుండెల్లో గుబులు మొదలైంది.ఫ చేయితడపనిదే కదలని ఫైళ్లు ఫ రెవెన్యూ శాఖలోనే అత్యధికంగా.. ఫ ఏసీబీకి చిక్కుతున్నా మారని ఉద్యోగుల తీరు ఫ తాజాగా రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు రెవెన్యూ అధికారులు యాదగిరిగుట్ట తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓలు ఏసీబీకి పట్టుబడి జైలు పాలయ్యారు. భువనగిరి ట్రాన్స్కో డీఈ, రూరల్ ఏఈ, లైన్మెన్ లంచం తీసుకుంటూ గతంలో పట్టుబట్టారు. 2018లో మున్సిపాలిటీ ఏర్పాటుకు ముందు చౌటుప్పల్ ఈఓపీఆర్డీ నర్సిరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్, డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి, ఆలేరు పంచాయతీరాజ్ ఏఈ ఎ. రమేష్, మోటకొండూరు లైన్ మన్ పప్పుల రమేష్, చౌటుప్పల్ ట్రాన్స్కో ఏడీ శ్యాంకుమార్ గతంలో పట్టుబడ్డారు. 2025 అక్టోబర్ 30న యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ శాఖ ఈఈ రామారావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 2026 మార్చి12న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఎండీ ఖదీర్ ఏసీబీకి చిక్కారు. తాజాగా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్రావు, కొలనుపాక జీపీఓ షేక్ అహ్మద్ లు రూ. 14 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పెద్దవూర: జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దవూర మండలం, పోతునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఏనేమీదిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్లపల్లి రవీందర్రెడ్డి(52) గతంలో వ్యవసాయ పనులు చేసేవాడు. గత ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమై కోలుకున్నాడు. అప్పటి నుంచి అతడి మానసిక ఆరోగ్య స్థితి సరిగా ఉండేది కాదు. గత పదమూడేళ్లుగా ఆయన భార్య, కుమారుడు, కుమార్తె హైదరాబాద్లో నివసిస్తుండగా.. రవీందర్రెడ్డి మాత్రం తన స్వగ్రామమైన ఏనేమీదిగూడెంలోనే ఉంటున్నాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన గత మూడు రోజుల క్రితం తన ఇంటిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులను పగలగొట్టి చూడగా రవీందర్రెడ్డి మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉంటున్న అతడి భార్య వడ్లపల్లి కవితకు ఫోన్లో సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్రావు తెలిపారు. -
కర్మాగారాల్లో కార్మికుల భద్రతే ముఖ్యం
సాక్షి, యాదాద్రి: కర్మాగారాల్లో కార్మికుల భద్రతే ముఖ్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక , అగ్రిమాపక శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పాల్గొన్నారు . జిల్లాలోని ప్రమాదకర ఫ్యాక్టరీలలో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రసాయన, ఔషధ పరిశ్రమల్లో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రమాదకర కర్మాగారాల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ కన్సల్టెంట్ ద్వారా భద్రత ధ్రువీకరణ పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్యాక్టరీల్లో డ్రైయర్లు, రియాక్టర్లు, పేలుడు ఉపశమన ప్యానెల్స్, భద్రతా వాల్వులు తదితర పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్ పాల్గొన్నారు. పరిహారం చెల్లిస్తున్నాం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో భాగంగా సేకరించిన భూముల యజమానులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
విష జ్వరాలతో విలవిల
ఆలేరు: సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. వర్షాల ప్రభావం, పారిశుద్ధ్య లోపంతో వాతావరణంలో వచ్చిన మార్పులు ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయి. ప్రధానంగా వైరల్ ఫీవర్తో పాటు టైఫాయిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రి (సీహెచ్సీ)తో పాటు ప్రైవేట్ క్లినిక్లు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుకు తోడు వాంతులు, విరేచనాలతో రోజుకు పదుల సంఖ్యలో రోగులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఈనెలలో 237 కేసులుఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గణాంకాల ప్రకారం మే నెలలో 149 వైరల్, 8 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా, జూన్లో 168, జూలైలో 308 మంది చికిత్స పొందారు. ఈనెల సోమవారం నాటికి ఓపీ బాధితుల సంఖ్య 237కు చేరింది. ఇందులో 86 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతుండగా, వీరిలో చిన్నారులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీల్లో దోమల బెడద తీవ్రంగా వేధిస్తోంది. రైల్వేస్టేషన్ ఎదురు వీధి, ఆర్టీసీ బస్టాండ్, మార్కండేయ కాలనీ, సిల్క్నగర్, కాటమయ్యబస్తీ, పాత మున్సిపల్ కార్యాలయం, క్రాంతినగర్, మంతపురి రోడ్డు తదితర కాలనీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యవస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్ నాలాలు, మురుగు కాల్వలు సరిగా శుభ్రం చేయడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ లేక కొన్ని కాలనీల్లో ఇళ్ల మధ్యనే మురుగు నీటి గుంటలు ఏర్పడి వల్ల దోమలతో జ్వరాలు వస్తున్నట్లు జనాలు వాపోతున్నారు. కాలనీల్లో ఫాగింగ్ చేయడంపైనా అధికారులు శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పెరుగుతున్న జ్వరపీడితులు రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకుంటున్నాం. దోమల నివారణకు ఫాంగింగ్ చేస్తాం. మురుగు కాల్వల్లో నీరు నిల్వకుండా చూస్తాం. బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాం. మంగళవారం నుంచి ఆయిల్ బాల్స్ వేస్తాం. – శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్,ఆలేరు వాతావరణ మార్పు వల్ల జలుబు, దగ్గు సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇది చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తే వైరల్ ఫీవర్గా మారి తీవ్ర అస్వస్థతకు గురికావాల్సి ఉంటుంది. కలుషిత ఆహారం, నీరు వల్ల టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే ఫ్రెష్ప్రూట్స్ తినడం, రోజూ కొద్దిసేపు వ్యాయామం చేస్తుండాలి. వేడి ఆహారపదార్థాలను తీసుకోవడం, బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. – స్వప్న రాథోడ్, సూపరింటెండెంట్, సీహెచ్సీ -
ప్రజావాణి అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ఆయన వివిధ ప్రాంతాల బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తుంటారని, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా స్వీకరించిన అర్జీలను సత్వరమే డిస్పోజ్ చేయాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 67 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 46, సర్వే అండ్ ల్యాండ్స్ 5, వైద్య ఆరోగ్య శాఖ 3, డీఎల్పీఓ 3, మున్సిపాలిటీకి 2 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. అలాగే గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, పంచాయతీ, ఎస్సీ వెల్ఫేర్, సహకార, విద్యుత్, స్పెషల్ డిప్యూటీ యూనిట్, విద్యా శాఖలకు ఒక్కో దరఖాస్తు చొప్పున అందినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కతిక, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు -
నిర్దేశించిన గడువులోగా జలసిరి పనులు
యాదగిరిగుట్ట రూరల్: వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా చేపట్టిన జలసరి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. సోమవారం యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో ఫామ్ పాండ్స్పై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి సంఖ్యను పెంచేలా కృషి చేయాలన్నారు. ఫామ్ పాండ్స్, సోక్ పిట్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, బోర్వెల్ రీచార్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు గ్రామానికి ఇద్దరు ఇన్చార్జ్ అధికారుల చొప్పున నియమించుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలో రెండు ఫామ్ పాండ్స్ నిర్మించాలన్నారు. అంతకు ముందు ప్రజావాణి జరుగుతున్న తీరును పరిశీలన చేశారు. ప్రతీ ఒక్కరి సమస్యను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ నవీన్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి సుధారాణి, ఈసీ రాజశేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జర్నలిస్టులు ఇబ్రహీంను స్ఫూర్తిగా తీసుకోవాలి
రామన్నపేట: నేటి తరం జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ ఎండీ ఇబ్రహీంను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. సోమవారం రామన్నపేటలో పాత్రికేయుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు ఎండీ ఇబ్రహీం సంతాపసభలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఇబ్రహీం చిత్రపటానికి నివాళులర్పించారు. బూరుగు వెంకటేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మార్కెట్ వైస్చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ మందడి ప్రభాకర్రెడ్డి, టీయూడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బసవపున్నయ్య, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎలిమినేటి జహంగీర్, వివిధపార్టీల మండల అధ్యక్షులు పున్న జగన్మోహన్, పోచబోయిన మల్లేశం, బొడ్డుపల్లి వెంకటేశం, ఊట్కూరి నర్సింహ, మీర్జా ఫజల్బేగ్, నకిరేకంటి నరేష్, సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, ఉపసర్పంచ్ మోటె రమేష్, ఎండీ జమీరొద్దీన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం -
రక్తదాన శిబిరం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో బ్రహ్మ కుమారీస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 51 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్ వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బరిగె రమ్య, కౌన్సిలర్లు, తదితరులున్నారు. చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దేప రమ్యరాజు, డాక్టర్ చంద్రశేఖర్, స్థానికులు లక్ష్మీపతి, మురళి, వెంకటేశం, సత్యనారాయణ, ఆనంద్, పాండు, ముత్యాలు, రంజిత్, రమేష్, నర్సింహులు, నరేష్, రహీం పాల్గొన్నారు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలిభువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2010లో 163 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తక్షణమే సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిలిగొండ కృష్ణ, నాయకులు దొక్కా నర్సింహ, కాటం, కృష్ణ, దిగంబర్, శివ పాల్గొన్నారు. పీఆర్టీయూ మండల కమిటీ ఎన్నికఅడ్డగూడూరు: మండల కేంద్రంలో సోమవారం పీఆర్ఎటీయూ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కూరాకుల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా కూరెళ్ల యాకస్వామి, అసోసియేషన్ అధ్యక్షుడిగా దూదిగాని నరేష్, మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు స్వప్న, ఉపాధ్యక్షుడిగా మహేష్, మహిళా ఉపాధ్యక్షురాలు బైరెడ్డి సరిత, కార్యదర్శి గొడశాల నాగరాజు, మహిళా కార్యదర్శిగా ఎస్ కవిత ఎన్నికయ్యారు. రైతులు వివరాలు నమోదు చేసుకోవాలియాదగిరిగుట్ట రూరల్: సన్న రకాల విత్తనాలను సాగు చేసే రైతులు తమ వివరాలను వచ్చే నెల 10 లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి సుధారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల సన్న రకాల వరి విత్తనాలను సాగు చేస్తుంటే, ఆ విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. రైతులు ఇతర మార్గాల ద్వారా విత్తనాలు పొంది సాగు చేస్తున్నట్లయితే, సంబంధిత రైతు వేదిక వద్ద స్వయం ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. ఆలయ హుండీ ఆదాయం రూ.2.11 లక్షలుభువనగిరి: పట్టణ శివారులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. మొత్తం 8 నెలల 19 రోజులకు సంబంధించి రూ.2,11,826 వచ్చినట్లు ఆలయ ఈఓ నరేందర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ పరిశీలకులు నిఖిల్, కానిస్టేబుల్స్ గోపి, అయిలయ్య, జూనియర్ అసిస్టెంట్ వీరయ్య పాల్గొన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికపై లైంగిక దాడిఆలేరురూరల్ : ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన చందు అనే యువకుడు ఇన్స్ట్రాగామ్ ద్వారా అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి బాలికను గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని భయబ్రాంతులకు గురిచేశాడు. బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాలిక తల్లి ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్ఓ ఉదయ్కిరణ్ తెలిపారు. నేడు వన మహోత్సవంభూదాన్పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం సామూహిక వన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, యువకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
చదువుకు చేయూత.. ప్రతిభకు ప్రోత్సాహం
ఆలేరు : రంగారెడ్డి జిల్లా షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ తాను చదువుకున్న పాఠశాలలోని విద్యార్థుల ఉన్నత భవిష్యత్కు తనవంతు చేయూత అందిస్తున్నారు. ఆలేరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి రూ.10వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5వేల చొప్పున ప్రతి ఏడాది తన సోదరుడు దివంగత ఎండీ గౌస్ పేరిట స్కాలర్షిప్ అందజేస్తానని వెల్లడించారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన శ్రీరోల్ మోడల్శ్రీ కార్యక్రమంలో అన్వర్ పాల్గొని మాట్లాడారు. తాను చదువుకున్న పాఠశాలకు, ఇక్కడి విద్యార్థులకు తనవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా గతేడాది పది ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన పాఠశాల విద్యార్థిని ఎండీ నమ్రిన్కు రూ.10వేలు ఆయన అందజేశారు. అనంతరం అన్వర్ను పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించింది. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం రావుల సత్యనారాయణరెడ్డి, ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయులు హేమలత, సుజారాణి,శోభ, పరమేశ్వర్, మేఘరాజు, శంకర్రెడ్డి, పూల నాగయ్య, వెంకటేష్యాదవ్, నాగరాజు, సురేష్, బాబా తదితరులు పాల్గొన్నారు. సోదరుడి జ్ఞాపకార్థం టెన్త్ టాపర్లకు ఆర్థికసాయం అందజేస్తున్న తహసీల్దార్ -
ఉత్తరం వైపు కదలిక
రీజినల్ రింగ్రోడ్డు ఉత్తర భాగం భూసేకరణకు అడుగులుఉత్తరభాగంలో భూసేకరణ అవార్డు కేవలం రాయిగిరిలో మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ మొత్తం 100 హెక్టార్ల (సుమారు 250 ఎకరాలు) భూమి సేకరించాల్సి ఉండగా, 30 హెక్టార్లు సేకరించారు. మిగిలిన 70 హెక్టార్ల భూసేకరణను రైతులతో నేరుగా చర్చించి త్వరితగతిన పూర్తి చేయాలని షెడ్యూల్ విధించారు. పరిహారం కోర్టులో డిపాజిట్ చేయడం చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే చూడాలని తీర్మానించారు. సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు.. భూ సేకరణ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్తో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పెండింగ్ అవార్డులు, భూబాధితులకు పరిహారం చెల్లింపులపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలోని కీలక నిర్ణయాలు.. పరిహారం పెంపు 10 నుంచి 15 ఏళ్లుగా భూముల మార్కెట్ ధరల్లో మార్పులేని ప్రాంతాల్లో బేసిక్ వాల్యూ తక్కువగా ఉంటోంది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ‘అనమలీ కమిటీ’ సిఫార్సుల మేరకు నిర్దిష్ట శాతం ప్రకారం పరిహారం ధరలను పెంచి నోటిఫికేషన్ ఇచ్చేలా ఈ సమావేవంలో అధికారులు వెసులుబాటు కల్పించారు. పరిహారంలో భారీ వ్యత్యాసం ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్బిట్రేషన్ డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.తద్వారా భూసేకరణ పరిహారం ఎంత డబ్బు అందిందన్న విషయంలో బాధితులకు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు తుక్కాపూర్ పరిధిలో ఎకరం బేసిక్ వాల్యూ రూ. 7.5 లక్షలు ఉంటే, నిబంధనల ప్రకారం(మూడు రెట్లు వడ్డీలు కలిపి) రూ. 26 లక్షల వరకు పరిహారం లెక్కించారు. అయితే ఆర్బిట్రేటర్లు(మధ్యవర్తులు) రైతుల అభ్యర్థనలను పరిశీలించి ఎర్రబెల్లి గ్రామం వరకు మాత్రం దానిని ఎకరానికి రూ. 50 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతివారం సమీక్ష భూ సేకరణ చేయడమే కాకుండా, భూమి కోల్పోయిన రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి, ‘భూమిరాశి’ ఆన్లైన్ పోర్టల్ ద్వారా నేరుగా పరిహారం జమ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంతమంది రైతులకు డబ్బులు అందాయనే అంశంపై ప్రతి వారం సమీక్ష నిర్వహించనున్నారు. కాంట్రాక్టర్కు సకాలంలో భూమి అప్పగింత ఉత్తర భాగం రోడ్డు నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ త్వరలో టెండర్లు పూర్తి చేయనుంది. బిడ్డింగ్ దక్కించుకున్న కాంట్రాక్టర్లకు భూమిని అప్పగించడంలో ఆలస్యమైతే వారు న్యాయపరమైన చిక్కులు సృష్టించి, నష్టపరిహారం కోరే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలోపే వందశాతం భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ. భాస్కర్రావు, టీఎస్ ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీ కె. గంగాధర్, ఓఏసీడీ సుందర్అబ్నార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వెంకారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ షేఖ్ అహ్మద్, ప్రాజెక్ట్ పీడీ మాధవి, ఆర్డీఓలు క్రిష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, తహసీల్దార్లు జగన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టరేట్లో ఎన్హెచ్ఏఐ అధికారుల ప్రత్యేక సమీక్ష ఫ భూసేకరణ ల్యాప్స్పై ఆరా.. పరిహారం పెంపుపై కీలక నిర్ణయాలు ఫ రాయిగిరిలో పెండింగ్ భూసేకరణపై ప్రత్యేక దృష్టి ఫ ‘భూమిరాశి’ పోర్టల్ ద్వారా రైతుల ఖాతాల్లోకి పరిహారం -
అండర్పాస్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
చౌటుప్పల్ : చౌటుప్పల్లో చేపట్టిన అండర్పాస్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ శేఖర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరు నెలలు గడుస్తున్నా నిర్మాణ పనుల్లో ఏమాత్రం వేగం పెరగలేదన్నారు. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మున్సిపల్ ఫ్లోర్లీడర్ కొయ్యడ శేఖర్, నాయకులు బత్తుల సింహాద్రి, తెలంగాణ భిక్షం, పొట్ట జంగయ్య, గుండు లింగన్న, సుర్వి లింగస్వామి, నలపరాజు రమేష్ తదితరులున్నారు. -
ఆర్మీ కళాశాలలో అంతరిక్ష దినోత్సవం
భూదాన్పోచంపల్లి : మండలంలోని దేశ్ముఖిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ ఫోర్సెస్ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఖగోళశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీరాం ‘స్పేస్ ఆస్ట్రో ఫిజిక్స్ అండ్ సొసైటీ అవర్ ప్లేస్ ఇన్ ది యూనివర్స్’ అనే అంశంపై ప్రసంగించారు. సూర్యుడు, గెలాక్సీలు, సన్ స్పాట్స్, ఖగోళశాస్త్రంలోని ఆసక్తికరమైన అంశాలను ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత, వైస్ ప్రిన్సిపల్ జి. కృష్ణవేణి, భౌతికశాస్త్ర హెచ్ఓడీ కె. స్పందన, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సారంపల్లి మల్లారెడ్డికి నివాళి
భువనగిరిటౌన్ : సీపీఎం సీనియర్ నాయకుడు ఏఐకేఎస్ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆదర్శ కమ్యూనిస్టు అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. భువనగిరిలో సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. భువనగిరి రైతాంగ సమస్యలు, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం, మూసి కాలుష్యం, బునాదిగాని కాలువ సాధన ఉద్యమాల్లో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, లావుడియా రాజు, ఎండీ సలీం పాల్గొన్నారు. కలెక్టర్కు వినతిసంస్థాన్ నారాయణపురం: తాము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చిల్లాపురం గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని చిల్లాపురం గ్రామ శివారులో 107 ఎకరాల భూమిని 32 మంది రైతులు సాగు చేసుకుంటుండగా, వాటిని భూదానం భూములుగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. 1950 సంవత్సరం నుంచే తమ పూర్వీకులు ఈ భూములను కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారని, 1960లో పట్టాలు కూడా పొందినట్లు తెలిపారు. భూదానం జాబితాలో చేర్చడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. భూమి కొనుగోలు పత్రాలు, పాత పహానీలు, పాస్పుస్తకాలను పరిశీలించి 22ఏ నిషేదిత జాబితా నుంచి భూములను తొలగించి 32 మంది రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. వినతిపత్రం అందించిన వారిలో శంకరప్ప, లక్ష్మయ్య, బసవరాజు, వెంకటయ్య తదితరులున్నారు. సమస్యలు పరిష్కరించాలివలిగొండ : ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య కోరారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సభ్యత్వ నమోదు చేపట్టి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని 27న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, వెంకటయ్య, శ్రీనివాస్, సైదారెడ్డి, శ్రీనివాస్, కళ్యాణి పాల్గొన్నారు. -
క్రీడాపోటీల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి పరిధిలోని మలక్పేట మహాత్మా జ్యోతిరావుపూలే , కార్వాన్ బీసీ గురుకుల విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌత్జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14, 17 విభాగాల క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్ టి. శ్వేత తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆమె సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అండర్–17 విభాగంలో 1500 మీటర్ల రన్నింగ్ పోటీలలో శ్రీనాథ్ మొదటిస్థానం, వరుణ్ ద్వితీయ స్థానంతో పాటు 400 మీటర్ల రన్నింగ్ పోటీల్లో సురేందర్ ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. అదేవిధంగా అండర్–14 విభాగంలో 600 మీటర్ల రన్నింగ్ పోటీల్లో సంతోష్ ద్వితీయ స్థానంలో నిలిచి మెడల్ సాధించినట్లు చెప్పారు. ఏటీపీ రవి శేఖర్, జ్యోత్స్న, పీడీలు సతీష్, హేమంత్కుమార్ పాల్గొన్నారు. -
వ్యాపార ధోరణిలో రేవంత్రెడ్డి పాలన
ఆత్మకూరు(ఎం): రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి పాలన వ్యాపార ధోరణిలో సాగుతోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. సోమవారం ఆత్మకూరు.ఎం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో విలువైన భూములను కబ్జా చేయడానికి 20 మంది రిటైర్డ్ అధికారులను నియమించుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ను కార్యాలయంగా ఏర్పాటు చేసుకుని భూఆక్రమణలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూలుస్తున్న ప్రభుత్వం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, బడా నాయకులు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఆమె వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, ఆత్మకూరు(ఎం) సర్పంచ్ బీసు ధనలక్ష్మి, నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరె భిక్షపతి, నాతి రాజు, సోలిపురం అరుణ, హైమద్, కోరె బీరప్ప, గుడ్డెటి శ్రీను, రంగ సత్యనారాయణ ఉన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత -
ఇళ్లు, స్థలాలకు రూ.79కోట్లు
సాక్షి, యాదాద్రి: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ ప్రజలకు పరిహారం చెల్లించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. పునరావాస ప్యాకేజీ(ఆర్అండ్ ఆర్), భూ సేకరణ పరిహారం కోసం ప్రభుత్వం ఇటీవల రూ.206కోట్లు విడుదల చేసింది. వీటిలో రూ.84 కోట్లను కలెక్టర్ ఖాతాలో జమచేసిన విషయం విదితమే. గతంలో కొందరికి పరిహారం అందింది. మిగిలిన 592 మంది బాధితులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం అవసరమైన రూ.79కోట్లను వారిఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో పరిశీలన గతంలో సర్వే చేసి వివరాలు గుర్తించినప్పటికీ, తుది నిర్ధారణకు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఒక్కో బృందంలో ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, ఒక ఆర్ఐ, ఒక జీపీఓ ఉన్నారు. ఈ బృందాలు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వివరాలు, డాక్యుమెంట్లు, సంతకాలు, బ్యాంక్ ఖాతాలను సరిచూస్తున్నాయి. అధికారులు వస్తున్నందున నిర్వాసితులు తమ ఆధార్, బ్యాంక్ ఖాతా పుస్తకం తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి కాగానే బాధితులకు పరిహారం చెల్లించనున్నారు. ఆర్డీఓ ఆఫీస్ ద్వారా నేరుగా ఆర్టీజీఎస్ పద్ధతిలో ఖాతాల్లో నగదు జమ చేస్తారు. గురువారం నాటికి ఈ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బస్వాపూర్ రిజర్వాయర్ ఫ రెండు రోజుల్లో 592మంది బస్వాపూర్ నిర్వాసితుల ఖాతాల్లో జమ ఫ అర్హుల గుర్తింపునకు నాలుగు ప్రత్యేక బృందాలతో పునఃపరిశీలన ఫ పరిహారం అందిన నెల రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేసేందుకు గడువు పరిహారం చెల్లించిన వెంటనే బాధితులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు నెల రోజుల సమయం కేటాయించారు. వీరికి ఇవ్వాల్సిన ప్రథమ ప్యాకేజీ (రూ. 7.5 లక్షలు) అధికారులు ఇప్పటికే చెల్లించారు. గ్రామాన్ని ఖాళీ చేయించిన వెంటనే బస్వాపూర్ రిజర్వాయర్లో 5 నుంచి 9 టీఎంసీల నీటిని నింపాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎయిమ్స్లో ‘ఆక్యుపేషనల్ థెరపీ’ సేవలు ప్రారంభం
భువనగిరి (బీబీనగర్): బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్యుపేషనల్ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ యూనిట్లను హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అమితా అగర్వాల్ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ వంటి రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు, పక్షవాతం, నాడీ సంబంధ రుగ్మతలున్న రోగులకు ఈ యూనిట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎయిమ్స్ వైద్యులు మహేశ్వర్, డాక్టర్ లక్కీరెడ్డి, డాక్టర్ పట్నాయక్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ ఎ.ఎస్. గోవింద్ పాల్గొన్నారు. -
హామీల అమలులో విఫలం
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. గ్రామపంచాయతీ ఎంప్లాయీస్,వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ల గణపతి రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు మాట్లాడుతూ గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా విధుల్లో ఉంటూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న కార్మికుల సమస్యల విషయంలో ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పొట్ట యాదమ్మ, రకరకంటి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ భిక్షం జ్ఞానేశ్వర్, నాయకులు కిష్టయ్య, పరమేష్, కార్మికులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల నిధుల కోసం ‘చలో హైదరాబాద్’
మోత్కూరు : జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పాద యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి.జహంగీర్ తెలిపారు. సోమవారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29, 30, 31 తేదీలలో భువనగిరిలోని డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వరకు పాద యాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. 31న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం బహుళార్థక ప్రాజెక్టులు నిధుల కొరతతో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, బునాదిగాని కాల్వల పనులు నిధుల కొరతతో నిలిచి పోయాయని వివరించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల యాదిరెడ్డి, దడిపల్లి ప్రభాకర్, కూరపాటి రాములు, నర్సింహ పాల్గొన్నారు. -
‘స్కౌట్స్’తో విద్యార్థుల్లో క్రమశిక్షణ
భువనగిరి: స్కౌట్స్తో విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు సేవాభావం ఏర్పడుతుందని పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయం నల్లగొండ ప్రిన్సిపాల్ శ్రీనివా సులు అన్నారు. భువనగిరిలోని పట్టణంలోని కేంద్రియ విద్యాలయంలో సోమవారం కేంద్రియ విద్యాలయ సంఘటన్ హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో స్కౌట్స్ తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ 2026– 27 ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్కౌట్స్ ద్వారా విద్యార్థుల్లో సమయపాలన, దేశభక్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ఈ నెల 26 వరకు స్కౌట్స్ తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో భువనగిరి కేవీ ప్రిన్సిపాల్ చంద్రమౌళి, క్యాంప్ లీడర్ జగన్మోహన్రావు, స్కాట్స్ ఎగ్జామినర్లు, తదితరులు పాల్గొన్నారు. -
పట్టణ అభివృద్ధికి కృషి
భువనగిరిటౌన్ : ప్రజల సమస్యల పరిష్కారానికి, పట్టణ సమగ్ర అభివృద్ధికి పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. భువనగిరి మున్సిపాలిటీలోని 25వ వార్డులో రూ.2లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న మురుగు కాలువపై స్లాబ్ నిర్మాణ పనులకు, 11వ వార్డులో రూ.2లక్షల వ్యయంతో చేపట్టే అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులను ఆమె కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లు బెండె స్వరూప లాల్ రాజ్, గంజి శ్రీవాణి గణేష్లతో పాటు స్థానిక నాయకులు, వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దివ్యాంగ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ
భువనగిరి: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని డీఈఓ భిక్షపతి అన్నారు. సోమవారం భువనగిరిలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులకు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విలీన విద్య సమన్వయ కర్త పెసరు లింగారెడ్డి, స్టేట్ రిసోర్స్పర్పన్ శివరాజ్, జిల్లా రిసోర్స్పర్సన్ రాజేంద్రప్రసాద్, భాస్కర్, సంధ్యారాణి, జంగమ్మ పాల్గొన్నారు. మహాధర్నాను విజయవంతం చేయాలిభువనగిరి: కలెక్టరేట్ ఎదుట ఈ నెల 27న నిర్వహించే మహాదర్నాను విజయవంతం చేయాలని టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి మహ్మద్ ఖాదీర్ కోరారు. భువనగిరి పట్టణంలోని వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో ఉద్యోగులను సోమవారం ఆయన కలిసారు. జిల్లా కోశాధికారి శ్రీకాంత్, తాలుకా అధ్యక్షులు ఆనంద్, శశికాంత్గౌడ్, ఉపేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా వనమహోత్సవ లక్ష్యం పూర్తి
భువనగిరిటౌన్ : గడువులోగా వనమహోత్సవ లక్ష్యం పూర్తి చేయనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. వనమహోత్సవంపై మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సమావేశంలో డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి , అధికారులు పాల్గొన్నారు. నేడు శాంకరీయం శతక సంపుటి ఆవిష్కరణఆలేరు : ఆలేరు శ్రీరామకృష్ణ విద్యాలయం వ్యవహర్త, ప్రధానాచార్య, కవి బండిరాజుల శంకర్ రచించిన శాంకరీయం శతక సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఏర్పాటు చేసినట్లు సోమవారం నిర్వాహకులు తెలిపారు. విద్యాలయం ప్రాంగణంలో సాయంత్రం 4గంటలకు నిర్వహించే ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి , ఓయూ తెలుగు విభాగం పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘ఖేల్కి బాత్ పీఎం మోదీకే సాథ్’కు ఎంపిక భూదాన్పోచంపల్లి: కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల27న మై భారత్ కార్యక్రమంలో భాగంగా ఖేల్కి బాత్ పీఎం మోదీకే సాథ్ కార్యక్రమానికి జిల్లా నుంచి పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపికై నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ తులసి వెల్లడించారు. సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించనున్నట్లు చెప్పారు. క్రీడలు, యువ నాయకత్వం ఆవశ్యకత, వికసిత్ భారత్పై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఈ అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధ్యాపకులు రాజేశ్వరమ్మ, రేణుకాదేవి, స్వాతి, చంన, అనురాధ, శివశంకర్, సంతోష్కుమార్, వెంకట్రెడ్డి, మురళీకృష్ణ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు సాయివర్థన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ‘ఎఫ్ఎల్ఎన్ సెల్’ కోసం దరఖాస్తులుభువనగిరి: ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ )సెల్లో సభ్యులుగా చేరేందుకు దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనంలో భాగంగా ఈ సభ్యులు నిరంతరం పర్యవేక్షించడం, ఉపాధ్యాయులకు విద్యా సంబంధ మద్దతు, బోధన సామగ్రి అందుబాటులో ఉంచడం, తరగతి గదుల పరిశీలన వంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సభ్యులుగా ఎంపిక చేసేందుకు కనీసం 2 సంవత్సరాలు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా అనుభవం ఉండాలని, ఎస్జీటీలు కనీసం 5 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలని కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు 56 సంవత్సరాల వయస్సుకు మించరాదని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. 27న గ్రామ, వార్డు సభలకు ఏర్పాట్లుభువనగిరిటౌన్ : ఈనెల 27 జిల్లాలో గ్రామ, వార్డు సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పలువురు ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టుల సాధనకు సీపీఎం పాదయాత్ర
భువనగిరిటౌన్ : జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మాయ కృష్ణ తెలిపారు. సోమవారం భువనగిరిలోని రైతుబజార్లో పాదయాత్ర వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. బస్వాపురం ప్రాజెక్టు పనులు చేపట్టి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తికాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, గంధమల్ల, బస్వాపురం ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న భువనగిరి అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర 31న హైదరాబాద్ ఇందిరా పార్క్ చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు, మేడపోయిన సుందర్, సలీం పాల్గొన్నారు. పాదయాత్ర వాల్పోస్టర్ ఆవిష్కరణబొమ్మలరామారం: బొమ్మలరామారం, తుర్కపల్లి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాలకు సాగు, తాగు నీరు అందించాలనే డిమాండ్తో చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం కోరారు. ఈమేరకు పాదయాత్ర వాల్పోస్టర్ను బొమ్మలరామారం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆవిష్కరించారు. ఈ నెల 29న భువనగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించి 31న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ముక్కెర్ల పున్నమ్మ, ముద్దం మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ, హరి ప్రసాద్, అనిల్, బ్రహ్మచారి పాల్గొన్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి
భువనగిరి: భువనగిరి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా గౌస్నగర్ గ్రామం నుంచి ఒక దరఖాస్తు స్వీకరించినట్లు ఎంపీఓ దినకర్ తెలిపారు. అడ్డగూడూరు: ప్రజాసమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజావాణి నిర్వహింస్తోదని ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. సోమవారం అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్ శేషగిరిరావు, ఏఓ పాడురంగాచారి, సూపరింటెండెంట్ దేవేందర్రావు, ఏఈ గోపిసింగ్, మండల వైద్యాధికారి భార్గవి పాల్గొన్నారు. రామన్నపేట: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరు రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపైన దరఖాస్తులను సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ.రాములు, తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, ఏఓ ఎజాజ్అలీఖాన్, మండల విద్యాధికారి టి.సురేందర్రెడ్డి, ఏఎస్ఐ సురేందర్ ఏఈలు ఆశీష్రాఘవ, సురేష్ పాల్గొన్నారు. వలిగొండ : మండల స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఎంపీడీఓ నోడల్ అధికారి జలంధర్ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండలో నిర్వహించిన ప్రజావాణిలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పల్లవి, వ్యవసాయ అధికారి అంజనీదేవి, ఎంఈఓ భాస్కర్, వైద్యాధికారి జ్యోతి, ఏఈలు సందీప్ రెడ్డి పాల్గొన్నారు. బొమ్మలరామారం: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి 9 దరఖాస్తులు వచ్చినట్లు ప్రజావాణి నోడల్ అధికారి శ్యామల తెలిపారు. రెవెన్యూ శాఖకు 6, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి 2, బీసీ వెల్ఫేర్ శాఖకు ఒక్క దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ తహసీల్ధారు సునీల్ కుమార్, ఏవో దుర్గేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అశోక్, హౌసింగ్ ఏఈ రోహిత్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి ఐదు ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములు నాయక్ పాల్గొన్నారు. గుండాల : మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఒక్క దరఖాస్తు వచ్చినట్లు ఎంపీడీఓ చండీరాణి తెలిపారు. తహసీల్దార్ హరికృష్ణ, పశు వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష పాల్గొన్నారు. భూదాన్పోచంపల్లి: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 9 అర్జీలను స్వీకరించినట్లు ఎంపీడీఓ విజయ తెలిపారు. మండల పరిషత్ పరిధిలో 4, ఇరిగేషన్ శాఖకు చెందిన 2, రెవెన్యూ శాఖకు చెందిన 3 దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయాధికారిణి శైలజ, ఎంపీఓ శ్రీమాలిని పాల్గొన్నారు. -
స్వచ్ఛంద సేవకులు చిరస్థాయిగా నిలుస్తారు
చౌటుప్పల్ : సమాజ హితం కోరుతూ స్వచ్ఛందంగా సేవచేసే వారు చిరస్థాయిగా నిలుస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి గంగాపురం కిషన్రెడ్డి అన్నారు. సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సంస్థ ద్వారా సామాజిక సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న చౌటుప్పల్ జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సురేందర్ సేవలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వదేశీ సంస్థాన్ ఇండియా సంస్థ గుర్తించి మథర్ ఇండియా అవార్డు–2026కు ఎంపికచేసింది. అనివార్య కారణాలతో విద్యార్థి అక్కడికి వెళ్లలేకపోవడంతో ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంస్థ తరపున అవార్డు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు రవ్వా విజయ్కుమార్, గోశిక విఠలేశ్వర్, గుజ్జుల సురేందర్రెడ్డి, డాక్టర్ యాదగిరి, నీలం సురేష్, జయసూర్య, రామచంద్రవర్ధన్, శ్రీలతారాణి, తదితరులున్నారు. 25, 26 తేదీల్లో ఈద్ మిలాద్ ఉన్ నబీ భువనగిరిటౌన్ : మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 25, 26 తేదీల్లో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జలీల్ పుర మస్జీద్ కమిటీ ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటలకు జలీల్ పుర మస్జీద్ ఆవరణలో ఈద్ మిలాద్ ఉన్ నబీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక జలీల్ పుర మస్జీద్ నుంచి శోభాయాత్రగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భువనగిరి పట్టణంలోని ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను, ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై సర్కారు ఊదాసీనతఆలేరు : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం ఊదాసీనతను ప్రదర్శిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ఆరోపించారు. ఆదివారం ఆలేరు పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండున్నరేళ్లు గడిచినా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్నారు. గతంలో గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్టును 11టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని చెప్పారని, తర్వాత దానిని 6 టీఎంసీలకు, ప్రస్తుతం కేవలం 1.41 టీఎంసీలకు పరిమితం చేశారన్నారు. పటేల్గూడెం, టంగుటూరు తదితర ప్రాంతాల మీదుగా కాలువలు వినియోగంలోకి తెచ్చి దేవాదుల నీటిని ఆలేరు ప్రాంతానికి అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు కల్లూరి మల్లేశం, ఎంఏ ఇక్బాల్, మొరిగాడి రమేష్, వడ్డెమాన్ బాలరాజు,గణగాని మల్లేశం, శాంత, చెన్న రాజేష్ పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి మిర్యాలగూడ అర్బన్ : దళిత సాధికారత కోసం ఎస్సీ కార్పొరేషన్కు తక్షణమే రూ.1,000 కోట్లు కేటాయించి బలోపేతం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఆ సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులు లేకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ తల లేని మొండెంలా తయారైందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (అత్యాచార నిరోధక చట్టం) కేసుల ఎక్స్గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లయ్య, నాయకులు దైద దేవయ్య, బొంగరాల వెంకన్న, రెమడాల పరశురాములు పాల్గొన్నారు. -
రేషన్ దొడ్డు బియ్యానికి మోక్షం
భువనగిరి: జిల్లాలోని రేషన్ దుకాణాల్లో 17 నెలలుగా మూలుగుతున్న దొడ్డు బియ్యాన్ని తరలించేందుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వీటిని సేకరించి వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడో, రేపో జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బేసిక్ ధరగా కిలోకు రూ. 21.60గా నిర్ణయించారు. అయితే ఆయా రేషన్ షాపుల రికార్డుల్లో ఏ మేరకు బియ్యం నిల్వలు నమోదయ్యాయో, అంత మొత్తం వాపస్ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. 773 టన్నుల నిల్వలు.. పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలోని 515 రేషన్ దుకాణాల్లో దాదాపు 773 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ పాత నిల్వల వల్ల దుకాణాల్లో స్థలం లేక, కొత్తగా వచ్చే సన్న బియ్యం బస్తాలను అమర్చుకోవడానికి డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాత బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని డీలర్లు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు పౌరసరఫరాల శాఖ స్పందించి వేలానికి ఆదేశాలిచ్చింది. తరుగుపై డీలర్ల కలవరంచాలా షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ ఉండి ముక్కిపోవడమే కాకుండా రంగు మారాయి. మరికొన్ని చోట్ల పురుగు పట్టి పిండిగా మారగా, ఎలుకలు, పందికొక్కులు బియ్యం బస్తాలను కొరకడంతో భారీగా తరుగు వచ్చింది. ఇప్పుడు రికార్డుల ప్రకారమే బియ్యం వాపస్ ఇవ్వాలని అధికారులు చెప్పడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఆదేశాలు వచ్చాయి రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 29న వేసిన టెండర్లకు సంబంధించి ఓపెన్ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ప్రక్రియ కొనసాగిస్తాం. – హరికృష్ణ, సివిల్ సప్లయ్ మేనేజర్ వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆదేశాలు 29న టెండర్లు ప్రారంభం -
సిరుల కలబంద
మునుగోడు: రైతులు తమ వ్యవసాయ భూమిలో కేవలం ఒకే పంట సాగుచేసి ఆదాయం పొందుతుంటారు. కానీ మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన రైతు జాజుల బుచ్చిరాములు తనకున్న ఏడెకరాల్లో వివిధ రకాల పంటలతోపాటు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కలబంద సాగు చేసి ఆదాయం పొందుతున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం సాగు బుచ్చిరాములు పెద్ద కుమారుడు రాంప్రసాద్ ఎం ఫార్మసీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఉన్న అనుభవంతో తన తండ్రికి కలబంద సాగుచేస్తే బాగుటుందని సూచించాడు. ఈమేరకు ఆయన 2018లో కలబంద మొక్కలను తీసుకొచ్చి నాటాడు. అవి నాటిన ఏడాది తరువాత దిగుబడి రావడంతో వాటిని హైదరబాద్ పట్టణంలోని జ్యూస్ దుకాణాల వారికి కిలో రూ.5 నుంచి రూ.6 చొప్పున విక్రయిస్తున్నాడు. ఏడాదిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలోని కలబంద 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుండగా రూ. 50వేలకుపైగా ఆదాయం వస్తోంది. ఎరువులు, మందుల పిచికారీ అవసరం లేదు కలబంద సాగుకు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు. మొక్కలు నాటే సమయంలో రైతు ఒక్కో మొక్కకు రూ. 3 చొప్పున ఖర్చుతో పాటు మొక్కలు నాటేందుకు కూలీల ఖర్చు మాత్రమే పెట్టాడు. ఆ తరువాత ఎలాంటి ఎరువులు, మందుల పిచికారీ చేయనవసరం లేదు. అంతర పంటగా జామ కేవలం కలబంద మాత్రమే సాగు చేయకుండా అంతర పంటగా జామ మొక్కలను నాటించాడు. ఈ మొక్కల వల్ల ఏడాదికి మరో రూ. 50వేల ఆదాయం పొందుతున్నట్లు రైతు చెబుతున్నాడు. అదేవిధంగా కలబంద మొక్కల మధ్యలో గడ్డి, కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. అవి వృథా కాకుండా 20 గొర్రెలని కొనుగోలు చేసి అందులోని గడ్డిని గ్రాసంగా వినియోగిస్తున్నాడు. దీంతో కలబంద, జామ దిగుబడితో వచ్చే ఆదాయంతో పాటు గొర్రెల పెంపకం ద్వారా మరో రూ.లక్ష అదనపు ఆదాయం వస్తుందని రైతు బుచ్చిరాములు చెబుతున్నాడు. ఒక్కసారి నాటితే నిరంతరం ఆదాయం వినూత్న వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న రైతులు -
వైభవంగా కొనసాగుతున్న పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం ఉదయం స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం, ప్రథమ ప్రకార మండపంలోని యాగశాలలో ద్వార తోరణ పూజ, మూర్తి కుంభారాధన, పవిత్ర ఆరాధన, పవిత్ర ఆదివాసములు జరిపించారు. అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు జరి గాయి. ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలమాలలతో దివ్య మనోహరంగా తీర్చిదిద్దారు. అనంతరం ప్రత్యేక బుట్టలో 108 నూలు ధారాలతో తయారుచేసిన పవిత్ర మాలలను స్వామి, అమ్మవార్ల చెంత పుణ్య జలాలతో సంప్రోక్షించి పూజలు జరిపించారు. పవిత్ర మాలలను పవిత్రేకరించేందుకు శాంతి, హోమ పూజలు జరిపారు. అర్చకులు యాగశాలలో హవన పూజలు చేసి నిత్య పూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు. పవిత్ర మాలలను, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరువీధిలో సేవోత్సవం జరిపించారు. అనంతరం వాటిని స్వామి వారి చెంత పెట్టారు. సాయంత్రం వేళ..పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలో సాయంత్రం నిత్య అర్చనలు, ఆరాధనలు, నిత్య హోమ పూజలు కొనసాగాయి. చతుస్థానార్చనలు, నిత్య హవన పూజలు కొనసాగాయి. రాత్రి వేళ బంగారు విమాన గోపురం, సుదర్శన చక్రమునకు షోడశోపచార ఆరాధన, పవిత్ర ధారణ వంటి పూజలు చేపట్టారు. పవిత్రోత్సవాలు సోమవారం ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తులకు పవిత్ర మాలధారణలతో ముగియనున్నాయి. పాతగుట్టలో..అనుబంధ ఆలయమైన పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో హవనం, హోమం, అర్చన వంటి పూజలు జరిపించారు. ప్రత్యేకంగా నూలు పోగులతో తయారుచేసిన పవిత్రమాలలకు యాగశాలలో పూజలు నిర్వహించారు. లక్ష్మీనరసింహుడికి పవిత్ర మాలలు వేసిన అర్చకులు నేటితో ముగియనున్న ఉత్సవాలు -
మంచి ఆదాయం వస్తోంది
ఎనిమిదేళ్ల క్రితం నాలుగు ఎకరాల్లో కలబంద సాగు చేశాను. వీటిని హైదరబాద్లోని జ్యూస్ దుకాణాల వారికి విక్రయిస్తా. ఏడాదికి నాకు రూ. 50వేల ఆదా యం వస్తుంది. జామ మొక్కలు నాటాను. దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది. – జాజుల బుచ్చిరాములు, కోతులారం సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలపై దృష్టి సారించా. ప్రధానంగా మార్కెట్లో డిమాండ్ ఉండే పంటగా కలబందను పెంచుతున్నా. కలబందను ఫార్మా, జ్యూస్, సౌందర్య సాధనాలలో వినియోగిస్తారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పంటతో ఎలాంటి రిస్క్ ఉండదు. – తేలుకుంట్ల రామ్మూర్తి, పాటిమట్ల -
యాదగిరీశుడి సన్నిధిలో భారీగా భక్తులు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, నిత్య కల్యాణ మండపం వంటి ప్రాంతాల్లో భక్తులు కిటకిటలాడారు. స్వామివారి ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి వారిని 35వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో స్వామి వారికి నిత్యాదాయం రూ.44,71,561 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లక్ష్మీనరసింహస్వామిని అమెరికాలోని డల్లాస్కు చెందిన వ్యక్తి ఆదివారం దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులలో వచ్చిన అతడితో పలువురు భక్తులు ఫొటోలు దిగుతూ కనిపించారు. -
కాలువల్లో చుక్క నీరు లేదు
సాక్షి, యాదాద్రి : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కాలువలు నీరులేక వెలవెలబోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల నిర్వహణ సమస్యల కారణంగా ప్రధాన, పిల్ల కాలువల్లో చుక్క నీరు పారడం లేదు. ఫలితంగా చెరువులు, కుంటలు నిండక, భూగర్భ జలాలు అడుగంటిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎండిపోయిన 70 చెరువులుదేవాదుల ప్రాజెక్టులో భాగంగా నవాబుపేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలంలోకి సాగునీరు అందాల్సి ఉంది. పైనుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో సుమారు 70 చెరువులు ఎండిపోయాయి. దీంతో దాదాపు 50 వేల ఎకరాల వరి ఆయకట్టు తీవ్ర ప్రభావానికి గురవుతోంది. నీరు రాకపోవడంతో కాలువల్లో పూడిక పేరుకుపోయి, పిచ్చి మొక్కలు మొలిచాయి. నవాబుపేట నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఇప్పటికే ఆందోళనలకు దిగారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి బస్వాపూర్ రిజర్వాయర్కు రావాల్సిన నీటి విడుదల నిలిచిపోయింది. తుర్కపల్లి, జగదేవ్పూర్ మండలాల మీదుగా సాగే ఈ కాలువలు ఎండిపోవడంతోపాటు, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి నీరందించే గండి చెరువులోనూ నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. కొండపోచమ్మ కాలువ కింద తుర్కపల్లి, బొమ్మలరామారం, మేడ్చల్–మల్కాజిగిరి ప్రాంతాలు కూడా నీరులేక అల్లాడుతున్నాయి. అడుగంటుతున్న భూగర్భ జలాలునాన్ఆయకట్టు ప్రాంతాల్లో పూర్తిగా భూగర్భ జలాలపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. సాగునీటి కాలువల ద్వారా చెరువులు నిండితే బోర్లలో నీటిమట్టాలు పెరుగుతాయని రైతులు ఆశిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాలువలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. వానాకాలం వరి పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు లేక తగ్గిపోతున్న భూగర్భ జలాలు నీరు పారక దేవాదుల, కాళేశ్వరం కాలువలు దయనీయం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి నీరందించే గండి చెరువులోనూ పడిపోయిన నీటిమట్టం -
పీఆర్సీ అమలు చేయాలి
మూడు సంవత్సరాల పీఆర్సీ, వివిధ బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలి. ఆరోగ్య పథకం సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఆరు డీఏలు పెండింగ్లో ఉండటం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఉద్యోగుల, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తు కార్యాచరణకు దిగుతాం. – మందడి ఉపేందర్రెడ్డి, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ విజయవంతం చేయాలి ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఆరోగ్య పథకం సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేనిపక్షంలో ఉద్యమాలను ఉదృతం చేస్తాం. – భగత్, ఉద్యోగ జేఏసీ జిల్లా జనరర్ సెక్రటరీ, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు -
మరికొన్ని పొట్టిగా!
కొన్ని పొడవు..ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం కొలతల్లో హెచ్చుతగ్గులుప్యాంట్, చొక్కా పొడుగ్గా ఉన్నాయి శరీరానికి తగ్గట్టుగా డ్రెస్ కుట్టలేదు. చొక్కా, ప్యాంటు పొడుగ్గా ఉన్నాయి. లూజు లూజుగా కుట్టారు. విద్యార్థులంతా నా డ్రెస్ చూసి నవ్వుతున్నారు. వస్త్రం కూడా నాసిరకంగా ఉంది. గత సంవత్సరం ఇచ్చిన డ్రెస్ బాగుండే. – ప్రవీణ్, 10 వతరగతి, మోత్కూరు ఈ విద్యార్థి పేరు సిరిపురం అవినాష్. గుండాల మండలం పాచిల్ల ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాం నాణ్యత లేకుండా ఉంది. అంగి పలుచగా ఉండి చినిగిపోయే దశలో ఉంది. నెక్కర్కు కుట్టిన గుండీలు కూడా ఊడిపోతున్నాయి. సాక్షి, యాదాద్రి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం కొలతల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. లాగులు ఊడిపోవడం, చొక్కాలు చిరిగిపోతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నాసిరకం వస్త్రం, అస్తవ్యస్తమైన కొలతలతో కుట్టిన ఈ డ్రెస్సులు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. కొలతలు ముగ్గురివే..మున్సిపాలిటీల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు కుట్టు పని అప్పగించారు. ఆరు మున్సిపాలిటీలకు చెందిన దుస్తులను భూదాన్పోచంపల్లికి చెందిన ఒక వ్యక్తికి ఆర్డర్ ఇవ్వడంతో విద్యార్థుల యూనిఫాంను కుట్టి ఇచ్చారు. విద్యార్థులందరి కొలతలు తీసుకోకుండా క్లాస్కు ముగ్గురు కొలతలు తీసుకుని అందరికీ డ్రెస్లు కుట్టారు. ఫలితంగా చాలా మంది విద్యార్థులకు అంగీలు పెద్దవిగా, నిక్కర్లు, ప్యాంట్లు చిన్నవిగా కొందరికి లూజ్గా అయ్యాయి. ఆత్మకూర్.ఎం మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల నాల్గవ తరగతి విద్యార్థికి ఒక జత యూనిఫాం ఇచ్చారు. కుట్టు సరిగ్గా లేక పోవడంతో సరిచేయాలని టైలర్లను ఆశ్రయిస్తున్నారు. టైలర్ల చుట్టూ తల్లిదండ్రుల ప్రదక్షిణలుప్రభుత్వం ఇచ్చిన యూనిఫాంలు సరిగ్గా సరిపోకపోవడంతో తల్లిదండ్రులు అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. లూజ్గా ఉన్న, కొలతలు తప్పుగా వచ్చిన డ్రెస్లను స్థానిక టైలర్ల వద్దకు తీసుకెళ్లి మళ్లీ కుట్టించుకుంటున్నారు. కుట్లు సరిగా లేని డ్రెస్లను చూసి తోటి విద్యార్థులు నవ్వుతుండటంతో పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు. 33,284 మందికి యూనిఫాం పంపిణీజిల్లాలోని 17 మండలాల్లో సెర్ఫ్ పరిధిలో 589 ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఒక మోడల్ స్కూల్తో కలిపి మొత్తం 590 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 35,363 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున మొత్తం 70,726 జతల యూనిఫాంలు కుట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు 36,226 జతలు కుట్టారు. 33,284 మంది విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. పోచంపల్లి మండలంలో 2,692 జతలకు గాను 37 జతలు మాత్రమే పూర్తికాగా 2,655 జతలు పెండింగ్లో ఉన్నాయి. నారాయణపూర్, రాజాపేట, బొమ్మలరామారం, రామన్నపేటలో కుట్టు పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వలిగొండ మోడల్ స్కూల్లో మాత్రం విద్యార్థులందరికీ డ్రెస్సులు పంపిణీ చేశారు. ఆరు మున్సిపాలిటీల్లో 8157 మంది బాల బాలికలకు ఒక జత యూనిఫాం పంపిణీ చేశారు. విద్యార్థికి పెద్దగా అయిన చొక్కా నాసిరకం వస్త్రం కావడంతో అప్పుడే చినిగిపోతున్న దుస్తులు కొందరికి బిగుతుగా మారిన చొక్కాలు.. మరికొందరికి ఊడిపోతున్న లాగులు సరిచేయించేందుకు టైలర్లను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు -
చికిత్స పొందుతూ మహిళ మృతి
మాడుగులపల్లి : ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందింది. శుక్రవారం పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన నాంపల్లి వెంకన్నకు 2004లో సులోచన(35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకన్న కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవడం, పిల్లలు సరిగా చదువుకోకపోవడంతో సులోచన తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఈ నెల 10న రాత్రి ఇంట్లోని బాత్రూమ్లోకి వెళ్లి బాటిల్లో ఉన్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి సోదరుడు బందారపు వెంకటగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్యాదవ్ తెలిపారు. -
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్
భూదాన్ పోచంపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని హెజెలో లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలి పది మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీలో నైట్ షిఫ్ట్లో 18 మంది పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో బిహార్ రాష్ట్రంతో పాటు చౌటుప్పల్ చెందిన పది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను కంపెనీ యాజమాన్యం అంబులెన్స్లో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగిరెడ్డి అనే కార్మికుడు మృతిచెందాడు. రియాక్టర్ భారీ శబ్దంతో పేలడంతో కార్మికులకు తీవ్ర గాయాలై భయానక వాతావరణం నెలకొంది. చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, స్థానిక ఎస్ఐ జగన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చౌటుప్పల్లోని ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చి ఫైర్ఇంజన్ల ద్వారా కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్నారు. కాగా గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితం ఒకరు మృతి నెల క్రితం ఇదే కంపెనీలో రియాక్టర్ శుభ్రం చేస్తుండగా ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఫార్మసిస్టు మృతిచెందాడు. ఇలా కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతుండంతో కార్మికులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పది మంది కార్మికులకు గాయాలు ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలో ఘటన -
నిషేధిత భూములపై విచారణ జరిపించాలి
భువనగిరిటౌన్ : 22ఏ నిషేధిత భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 22ఏ జాబితాలో తప్పిదాలు జరిగాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంగీకరించిన నేపథ్యంలో జిల్లాలో అక్రమంగా చేర్చిన భూములపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేని, కోర్టు వివాదాలు లేని పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల భూ యజమానులు అమ్మకాలు, బ్యాంక్ రుణాలు పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి, భూభారతి పోర్టల్ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాయ దశరథ, గూడూరు నరోత్తం రెడ్డి, చందా మహేందర్ గుప్తా, రత్నపురం బలరాం, రాళ్లబండి కష్ణచారి, ఫకీరు రాజేందర్ రెడ్డి, దయ్యాల కుమార్, చీర్క సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


