breaking news
Yadadri District News
-
పోగొట్టుకున్న బంగారం, వెండి బాధితులకు అప్పగింత
పెద్దవూర: ఆటోలో పోగొట్టుకున్న బంగారు, వెండి ఆభరణాలను గంట లోపే పెద్దవూర పోలీసులు గుర్తించి బాధితులకు అప్పగించారు. గురువారం పెద్దవూర ఎస్ఐ వై. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పర్వేదుల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వేముల కనకయ్య, అతడి భార్య సింహాచలం గురువారం మధ్యాహ్నం మిర్యాలగూడలో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లటానికి సిద్ధమయ్యారు. సింహాచలం తన బంగారు, వెండి ఆభరణాలతో పాటు దుస్తులను సంచిలో పెట్టుకుంది. వారు స్వగ్రామంలో ఆటో ఎక్కి పెద్దవూరలో దిగారు. ఆటో దిగే సమయంలో తమ వెంట తెచ్చుకున్న సంచిని అందులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత తమ వెంట తెచ్చుకున్న సంచి లేదని గమనించిన వృద్ధ దంపతులు రోడ్డు పక్కన కూర్చోని విలపిస్తుండగా.. స్థానిక యువకులు గమనించి వారిని పెద్దవూర పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి వృద్ధ దంపతులు పర్వేదుల నుంచి ఎక్కి వచ్చిన ఆటో హైదరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆటో నంబర్ను పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి, చింతపల్లి పోలీస్ స్టేషన్లకు పంపించగా.. చింతపల్లి మండలం మాల్లో అక్కడి పోలీసులు ఆటోను పట్టుకున్నారు. ఆటోను తనిఖీ చేయగా.. సీటు వెనకాల సంచి ఉన్నట్లు గుర్తించారు. వాస్తవంగా ఆటో డ్రైవర్ కూడా ఆ సంచిని గమనించలేదు. పెద్దవూర పోలీసులు చింతపల్లికి వెళ్లి ఆటోను, ఆభరణాలు ఉన్న సంచిని పెద్దవూరకు తీసుకొని వచ్చారు. సంచిలో 15 తులాల వెండి కాళ్ల పట్టీలు, రెండున్నర తులాల బంగారు నాంతాడు, 2 తులాల వెండి మట్టెలు, బంగారు ముక్కుపుడకతో పాటు దుస్తులు ఉండగా.. వాటిని వృద్ధ దంపతులకు అప్పగించారు. గంట వ్యవధిలోనే పోగొట్టుకున్న ఆభరణాలను గుర్తించి బాధితులకు అప్పగించిన హెడ్ కానిస్టేబుల్ ఇద్దయ్య, కానిస్టేబుళ్లు కిషన్నాయక్, లోకేష్రెడ్డి, రాజు, వెంకన్న, శ్రీకాంత్, సైదిరెడ్డి, హుషానాయక్ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని చినవెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు గురువారంతో ముగిశాయి. మూడో రోజు హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు స్వేచ్ఛ అనే నాటిక, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం వారు సంధ్య వెలుగు అనే నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలను భారత ప్రభుత్వ కల్చరల్ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు మారంరాజు రామచందర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తమచారి, పెరుమాళ్ల ఆనంద్, కోమలి కళాసమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, సెక్రటరీ ఎంఎల్. నర్సింహారావు, రఘుపతి, జీఎల్. కుమార్, వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
561 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం నీటి మట్టం గురువారం సాయంత్రానికి 561 అడుగులకు (235 టీఎంసీలు) చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 67896 క్యూసెక్కుల నీరు సాగర్కు విడుదలవుతోంది. గడిచిన 24 గంటల్లో శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 57,103 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సాగర్ నుంచి విద్యుదుత్పాదన ద్వారా 4419 క్యూసెక్కుల నీటిని దిగువన టెయిల్పాండ్లోకి విడుదల చేశారు. తిరిగి 4,630 క్యూసెక్కులను రివర్స్ పంపుల ద్వారా సాగర్ జలాశయంలోకి ఎత్తి పోశారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ కాలనీలో గురువారం ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన కందుకూరి మురళి స్థానిక సాయినగర్ కాలనీలో నివాసముంటున్నాడు. మురళి కుమారుడు మున్నా(24) గతంలో ఓ బాలికతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపణలతో అతడిపై కేసు నమోదైంది. ఆ బాలిక అనుకోని పరిస్థితుల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మున్నాపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతడు జైలు జీవితం గడిపి కొద్దిరోజుల క్రితం బయటకు వచ్చాడు. మనస్తాపానికి గురై మున్నా గురువారం సాయినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సి. వెంకటేశ్వర్లు తెలిపారు. -
‘సుంకిశాల’ పూర్తయ్యేదెన్నడో..!
పెద్దవూర: పెద్దవూర మండలం పాల్తీతండా సమీపంలోని సుంకిశాల గుట్టపై నిర్మిస్తున్న భారీ ఇన్టేక్ వెల్ పంపింగ్ స్టేషన్(సుంకిశాల పథకం) పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 455 అడుగుల లోతు(డెడ్స్టోరేజీ)లో ఉన్నా హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరందించేందుకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్) ఆధ్వర్యంలో రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల గడువు పొడిగించినా పూర్తికావడం లేదు. గత ఏడాదే ఒక సొరంగం పూర్తిచేసి జంటనగరాలకు తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సొరంగంలోకి నీరు రాకుండా కాంక్రీట్ పిల్లర్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్ గతేడాది ఆగస్టు 2న కూలి పంప్హౌస్ నీట మునిగింది. ఇప్పటికీ గేట్లు అమర్చేందుకు నిర్మించాల్సిన కాంక్రీటు పిల్లర్లతో కూడిన నిర్మాణ పనులు ప్రారంభించలేదు. కొనసాగుతున్న శిథిలాల తొలగింపుసాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో గతంలో కృష్ణా బ్యాక్ వాటర్ సొరంగంలోకి నీరు వెళ్లిన ప్రాంతాన్ని పూర్తిగా బంకమట్టి, కంకర, కాంక్రీట్తో నింపి పూడ్చివేశారు. జలాశయం పూర్తిగా నిండినా పంప్హౌస్లో పనులకు ఎలాంటి అవరోధం లేకుండా చర్యలు తీసుకున్నారు. పంప్హౌస్లో 40అడుగుల లోతులో చేరిన నీటిని ఏడు భారీ మోటార్లతో పూర్తిగా తొలగించారు. గతంలో కూలిపోయిన రిటైనింగ్ వాల్ శిథిలాలను భారీ కట్టర్ మిషన్లతో తొలగించే పనులు జరుగుతున్నాయి. మరో వారంలో ఈ పనులు పూర్తికానున్నాయి. ఇప్పటికే 70 శాతం పూర్తయిన రిటైనింగ్ కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. సుంకిశాల నుంచి కోదండపురం వరకు 17 కి.మీ. దూరం, 40 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల్లో నిర్మిస్తున్న పైపులైన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మోటార్లు బిగించే కాంక్రీట్ పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఉద్దేశం ఇదీ..హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణా తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి హయాంలో సుంకిశాల పథకానికి శంకుస్థాపన చేశారు. రైతుల ఆందోళనతో ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక ఆ పనులను పక్కన పెట్టి ఏఎమ్మార్పీ ద్వారా పుట్టంగండి సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్కు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జంటనగరాలకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూ.1,450 కోట్ల అంచనాతో సుంకిశాల పథకాన్ని చేపట్టింది. నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని 2035 నాటికి 47.71 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065 నాటికి 67.71 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందన్న అంచనాతో సుంకిశాల ఇన్టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. దీంట్లో భాగంగా రూ.317.56 కోట్లు పంప్హౌస్ నిర్మాణానికి, రూ.215.77 కోట్లు ఎలక్ట్రో మెకానికల్ పనులకు, రూ.636.5 కోట్లు (సుంకిశాల నుంచి కోదండపురం వరకు 17 కి.మీ. దూరం 40 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల్లో) పైపులైన్ నిర్మాణానికి కేటాయించారు. సొరంగాన్ని మూడు స్టేజీల్లో.. సముద్ర మట్టానికి జలాశయంలో 450 అడుగుల లోతులో ఒకటి, 504 అడుగుల లోతులో రెండోది, 547 అడుగుల లోతులో మూడోది నిర్మిస్తున్నారు. జలాశయం ఉపరితలంపై నీటిని సొరంగం ద్వారా పంప్హౌస్లోకి తరలిస్తారు. మూడు పైపులైన్లను ఒక్కోటి 2.347 మీటర్ల వ్యాసంతో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోపైపు ద్వారా 90ఎంజీవీ(మిలియన్ గ్యాలన్లు), 410 మిలియన్ లీటర్ల నీరు వెళ్లనుంది. మొత్తం 18 మోటార్లను అమర్చి నిత్యం 12 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. సంవత్సరానికి 16.5 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి జంటనగరాలకు నీటిని తరలించేలా డిజైన్ చేశారు. ఈ పనులకు 2022 మే 14న నాటి మంత్రులు కేటీఆర్, హరీష్రావు శంకుస్థాపన చేశారు. ఫ పంప్హౌస్ పనులు ప్రారంభమై నాలుగు సంవత్సరాలు ఫ పూర్తిచేయాల్సింది 2022 డిసెంబర్ నాటికే.. ఫ మళ్లీ 2023 మార్చి వరకు గడువు పొడిగింపు ఫ కూలిన కాంక్రీట్ పిల్లర్ల శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం ఫ పథకం పూర్తికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం సొరంగం పనులకు బ్రేక్ గతేడాది ఆగస్టు 2న సుంకిశాల పంప్హౌస్ నీట మునగడంతో సొరంగం పనులకు బ్రేక్ పడింది. వాస్తవానికి ఈ పనులను 2022 డిసెంబర్ నాటికి పూర్తిచేయాల్సి ఉన్నా.. 2023 మార్చి వరకు పొడిగించారు. అయినా పంప్హౌస్ నీట మునిగే సమయానికి 70 శాతం పనులే పూర్తయ్యాయి. 450 అడుగుల లోతులో నిర్మిస్తున్న మొదటి సొరంగం 650 మీటర్ల పొడవుకు గాను 610 మీటర్లు పూర్తికాగా, ఇంకా 40 మీటర్ల మేర కావాల్సి ఉంది. రెండో దశ సొరంగం పూర్తికాగా, మూడోది 20 మీటర్ల మేర పనులు కావాల్సి ఉంది. పనులు పూర్తికాకముందే సొరంగం నుంచి వచ్చిన నీటి తాకిడికే కాంక్రీటు పిల్లర్లతో కూడిన నిర్మాణం కూలిపోవడంపై పనుల్లో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అరచేతిలో వాతావరణ సూచనలు
త్రిపురారం: రైతులకు ఎప్పటికప్పడు వాతావరణ సమాచారంతో పాటు పిడుగుల హెచ్చరికల కోసం భారత వాతావరణ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా మేఘ్ దూత్, దామిని యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మేఘ్ దూత్ యాప్ ద్వారా రాబోయే ఐదు రోజుల వాతావరణ సమాచారంతో పాటు వారం క్రితం సమాచారం కూడా రైతులు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పంటలకు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రధాన పంటల్లో వచ్చే చీడపీడలు, వాటి నివారణ చర్యలను తెలుసుకోవచ్చు. మేఘ్ దూత్ యాప్ ద్వారా ప్రతి మంగళవారం, శుక్రవారం ఆగ్రో– మెట్ ఫీల్డ్ యూనిట్లు, జిల్లా ఆగ్రో– మెట్ ఫీల్డ్ యూనిట్లు పరస్పరంగా వివిధ పంటల సమాచారాన్ని రైతులకు ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తుంది. అదేవిధంగా ఏటా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడి మూగ జీవాలు, రైతులు, పశువుల కాపరులు ప్రాణాలు కోల్పోతున్నారు. పిడుగులను ముందుగానే పసిగట్టడానికి దామని యాప్ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ 500 మీటర్ల కంటే తక్కువ వ్యాసార్థంలో పిడుగులు పడే పరిధిని గుర్తించి సమాచారం అందిస్తుంది. దీంతో రైతులు ముందుగానే సురక్షిత ప్రాంతాలలకు చేరుకోవచ్చు. యాప్ల డౌన్లోడ్ ఇలా.. ఫోన్లోని ప్లేస్టోర్లోకి వెళ్లి మేఘ్ దూత్(ఇంగ్లిష్లో) అని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సైన్అప్పై క్లిక్ చేసి పేరు, ప్రాంతం, ఫోన్ నంబర్, భాష, రాష్ట్రం, జిల్లా నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తిరిగి లాగిన్పై క్లిక్ చేసి ఫోన్ నంబర్ నమోదు చేసి లాగిన్ కావాలి. యాప్ ఓపెన్ చేసిన తరువాత స్క్రీన్పై వాతావరణం వివరాలు చూపిస్తుంది.అదేవిధంగా ప్లేస్టోర్ నుంచే దామిని యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి మొబైల్ నంబర్, అడ్రస్, పిన్కోడ్ నమోదు చేయాలి. అనంతరం జీపీఎస్ లోకేషన్కు అనుమతి ఇస్తే యాప్ పనిచేయడం ప్రారంభమవుతుంది. పిడుగులను గుర్తించే మార్గాలుమీరు ఉన్న ప్రదేశంలో 7 నిమిషాల వ్యవధిలో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే పసుపు రంగులోకి.. 18 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ నీలం రంగులోకి మారుతుంది.ఫ రైతుల కోసం మేఘ్ దూత్ మొబైల్ యాప్.. ఫ పిడుగులను గుర్తించేందుకు దామిని యాప్ను తీసుకొచ్చిన భారత వాతావరణ శాఖ -
ఎంజీయూ పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణను యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పరిశీలించి మాట్లాడారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, కాపీయింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వీసీ వెంట రిజిస్ట్రార్ అల్వాల రవి, చీఫ్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ ఉపేందర్రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణప్రియ ఉన్నారు. టైరు పేలి లారీ దగ్ధంవలిగొండ: టైరు పేలి నిప్పు రవ్వలు ఎగిరిపడి లారీ దగ్ధమైంది. ఈ ఘటన వలిగొండ మండలం అక్కంపల్లి సమీపంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నుంచి తవుడు లోడుతో తమిళనాడుకు వెళ్తున్న లారీ మార్గమధ్యలో వలిగొండ మండలం అక్కంపల్లి సమీపంలోకి రాగానే టైరు పేలింది. దీంతో నిప్పు రవ్వలు ఎగిరిపడి మంటలంటుకొని లారీకి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో భువనగిరి, రామన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు. లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. రైల్వే స్టాఫ్తో వెళ్తున్న రైలు కోచ్లో పొగలు బీబీనగర్: వరంగల్ నుంచి హైదరాబాద్కు గురువారం రైల్వే స్టాఫ్తో వెళ్తున్న రైలు కోచ్లో పొగలు వ్యాపించాయి. రైల్వే ట్రాక్ పరిశీలనలో భాగంగా బీబీనగర్ రైల్వే స్టేషన్ మార్గంలో రైల్వే స్టాఫ్తో వెళ్తున్న రైలు కోచ్ బ్రేక్ ప్యాడ్స్ పట్టివేయడంతో స్పార్క్ రావడంతో పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది బీబీనగర్ స్టేషన్లో ట్రైన్ను నిలిపివేసి పొగలను అదుపులోకి తెచ్చి బ్రేక్ ప్యాడ్లను సరిచేశారు. అనంతరం ట్రైన్ స్టేషన్ను నుంచి వెళ్లిపోయింది. యువకుడి మృతిపై కేసు నమోదుమర్రిగూడ: మర్రిగూడ మండలం మేటిచందాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందూర్తి గ్రామంలో బుధవారం అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందగా.. గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన బత్తుల సైదులు(25) ఇందూర్తి గ్రామంలో సరిత అనే మహిళ ఇంటి ముందు పురుగుల మందు తాగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి తండ్రి నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అంతకుముందు మృతదేహాన్ని తమకు చూపించాలని మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించగా.. ఎస్ఐ వారికి సర్ధిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
వెదిరె రాంచంద్రారెడ్డికి భారతరత్న ఇవ్వాలి
భూదాన్పోచంపల్లి: వెయ్యి ఎకరాల భూమిని దానం చేసి భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డికి భారతరత్న ఇవ్వాలని అఖిలభారత సర్వోదయ మండలి అధ్యక్షుడు, రాంచంద్రారెడ్డి మనవడు వెదిరె అరవిందారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పోచంపల్లి పట్టణ కేంద్రంలో వెదిరె రాంచంద్రారెడ్డి 128వ జయంత్యోత్సవాలను పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహానికి అరవిందారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినోబాభావే మందిరంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1951లో భూమికోసం సాయుధ పోరాటాలు జరుగుతున్న తరుణంలో ఆచార్య వినోబాభావే కోరిక మేరకు వెయ్యి ఎకరాలు భూమి దానం చేసి వెదిరె రాంచంద్రారెడ్డి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కానీ నేడు కొందరు అక్రమార్కులు భూదాన్ భూములను అన్యాక్రాంతం చేస్తూ భూదాన స్పూర్తికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే భూదాన బోర్డులో పోచంపల్లి స్థానికులకు డైరెక్టర్గా అవకాశం కల్పించుటకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో అఖిలపక్ష పార్టీలతో పాటు పార్టీయేతర ముఖ్యనాయకులతో పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్తాలో భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వెదిరె రాంచంద్రారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు తూపునూరి కృష్ణగౌడ్, వెదిరె రాంచంద్రారెడ్డి కుమారుడు వెదిరె సాగర్రెడ్డి, వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి నాయకులు కొమ్ము లక్ష్మణ్, కరగల్ల కుమార్, మాజీ కౌన్సిలర్ పెద్దల చక్రపాణి, గునిగంటి మల్లేశ్, చేరాల చిన్న నర్సింహ, ఇబ్రహీంపట్నం అంజయ్య, వంగూరి రాజు, ఎర్ర భిక్షపతి, పెద్దల సన్నీ, బాల్నర్సింహ, మల్లేశ్, చేరాల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్ సిబ్బంది సేవలు అభినందనీయం
యాదగిరిగుట్ట: విపత్తులు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చూపే తెగువ అభినందనీయమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కొనియాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గోశాలలో రూ.60 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెస్కూ చేయడం గొప్ప విషయమన్నారు. డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బందిని పెంచామని వెల్ల డించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు తక్షణమే 101కి సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు అగ్నిమాపక పరికరాలు, ఫైరింజన్లను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్ హరినాథ్రెడ్డి, డీసీపీ అక్షాంశ్యాదవ్, జిల్లా అగ్నిమాపక కేంద్ర అధికారి మధసూదన్రావు, ఏసీపీ శ్రీనివాస్నాయుడు, పట్టణ సీఐ భాస్కర్, వివిధ జిల్లాల అగ్నిమాపక అధికారులు అశోక్, ఆవుల వెంకన్న, ధనుంజయరెడ్డి, రెహమాన్బాబు, యాదగిరిగుట్ట ఫైర్స్టేషన్ ఆఫీసర్లు అబ్దుల్ అమీద్, మధుసూదన్రెడ్డి, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్యరెడ్డి, సెఖ్మెట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (దాత) ఉమా గండూరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
మోతె: అన్నదమ్ముల మధ్య నెలకొన్ని భూమి తగాదాలో భాగంగా తమ్ముడు అన్నను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరచిన ఘటన మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ గ్రామానికి చెందిన గునగంటి వెంకన్న, అనసూర్య దంపతులకు ముగ్గురు కుమారులు రమేష్, ఉపేందర్, చంద్రశేఖర్, ఒక కుమార్తె సంతానం. వెంకన్న, అనసూర్య దంపతులకు 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని వెంకన్న తన ముగ్గురు కొడుకులు 5 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. మిగిలిన 6 ఎకరాల భూమిని వెంకన్న తన పేరిటే ఉంచుకున్నాడు. కొంతకాలం నుంచి అన్నదమ్ములు రమేష్, ఉపేందర్ మధ్య గెట్లు పంచాయితీ నడుస్తోంది. ఇదే విషయమై గతంలో వీరు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం గునంటి ఉపేందర్, అతడి భార్య జ్యోతి కలిసి వ్యవసాయ పొలం వద్ద రమేష్తో గొడవపడ్డారు. ఈ క్రమంలో రమేష్ ముఖంపై రాళ్లతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా ఉపేందర్ భార్య జ్యోతి.. రమేష్ భార్య సరితపై దాడి చేయడంతో సరితకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి చిన్న తమ్ముడు గునగంటి చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపేందర్, అతడి భార్య జ్యోతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పెద్దమనుషులు ఉన్నప్పటికీ నోరు మెదపలేదని ఫిర్యాదుదారుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ అన్న, అతడి భార్యపై దాడి చేసిన తమ్ముడు, అతడి భార్య -
సాధారణ కాన్పులు, ఓపీ పెంచితే అవార్డులు
భువనగిరి : ఆగస్టు 15 వరకు సాధారణ కాన్పులు, ఓపీ పెరిగిన ఆస్పత్రులకు అవార్డులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య, ఓపీ ఎక్కువగా ఉంటుందో అక్కడి సిబ్బంది మెరుగైన సేవలందించినట్లు భావిస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు పూర్తి సమయం అందుబాటులో ఉండాలని సూచించారు.బిడ్డ బిడ్డకు మధ్య వ్యవధి ఎక్కువగా పాటించిన దంపతులు, ఓకే బిడ్డతో కుటుంబ నియంత్రణ పద్ధతి పాటించిన దంపతులకు ప్రో త్సాహక బహుమతులు అదజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, శిల్పిని, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఎంఎంటీఎస్ పనులకు మోక్షం
సాక్షి, యాదాద్రి : జిల్లావాసుల ఎంఎంటీఎస్ కల సాకారం కాబోతోంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి స్టేషన్ వరకు పొడిగించిన ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఇప్పటికే రూ. 412 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతలో రూ.100 కోట్లు విడుదల చేసింది. తొమ్మిదేళ్లకు కదలిక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 2016లో కేంద్రం ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్నుంచి యాదాద్రి జిల్లా రాయగిరివరకు 33 కిలో మీటర్లు పొడిగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.330 కోట్లు కాగా.. కేంద్రం తన వాటాగా రూ.220 కోట్లు, రాష్ట్రం రూ.110 కోట్లు భరించాల్సి ఉంది. అయితే రాష్ట్రా వాటా విడుదలలో జాప్యం వల్ల పనులు ముందుకు సాగలేదు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులతో ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేస్తుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి గత అక్టోబర్లో ప్రకటించగా.. తాజాగా కేంద్రం నిధులు కేటాయించింది. ప్రత్యేకంగా ట్రాక్ నిర్మాణం ఎంఎంటీఎస్కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఘట్కేసర్ నుంచిరాయగిరి వరకు ప్రస్తుత ట్రాక్వెంట భూములు సేకరించనున్నారు. భవిష్యత్లో వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పొడిగించే అవకాశం ఉంది. కొనసాగుతున్న భూసేకరణ సర్వే : గత ఏడాది కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటనతో ఇప్పటికే భూ సేకరణ పనులు మొదలయ్యాయి. సుమారు 50 ఎకరాల సేకరణ పూర్తయ్యింది. గుట్ట మండలం వంగపల్లి శివా రు వరకు సర్వే చేయాల్సి ఉంది. గూడూరులో జంక్షన్ ఉన్నందున అక్కడ భూసేకరణ ఎక్కువగా చేయాల్సి ఉంది. ఫ రూ.100 కోట్లు విడుదల చేసిన కేంద్రంఫ బీబీనగర్ నుంచి రాయగిరి రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక ట్రాక్రైల్వే శాఖకు ధన్యవాదాలు ఎంఎంటీఎస్ విస్తరణకు కేంద్రం రూ.421 కోట్లు కేటాయించడం హర్షణీయం. సీఎం రేవంత్రెడ్డితో కలిసి రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ను కలిసి ధన్యవాదాలు తెలిపాం. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జనగామ వరకు పొడిగించాలని ప్రతిపాదన చేశాం. –ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
సరఫరా సాఫీగా..
భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా డిస్కం దృష్టి ఫ పీటీఆర్ల సామర్థ్యం పెంపు, అదనపు డీటీఆర్లు ఏర్పాటు ఫ లోడ్ను తట్టుకునేందుకు ఇంటర్ లింకింగ్ లైన్లు ఫ రూ.47.78 కోట్లు కేటాయింపు ఫ తుది దశకు చేరిన పనులుఆలేరు: విద్యుత్ డిమాండ్ ఊహించని రీతిలో పెరిగిపోతోంది. ఏటా 5 శాతం వినిమయం అధికంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఓవర్ లోడ్ను తట్టుకునేందుకు, భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా పవర్ ట్రాన్స్ఫార్మర్ల (పీటీఆర్) సామర్థ్యం పెంచడంతో పాటు అదనంగా డిస్ట్రిబ్యూషన్ (డీటీఆర్) ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు పాత లైన్లపై భారం పడకుండా కొత్తగా ఇంటర్ లింకింగ్ లైన్లు వేస్తోంది. కేటగిరీల వారీగా కనెక్షన్లు జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించి 3,97,287 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ 2,78,420, వ్యవసాయ 1,18,805, ఇండస్ట్రియల్ కనెక్షన్లు 620 ఉన్నాయి. ఇందులో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. గత నెల అన్ని కనెక్షన్లకు సగటున రోజుకు 6,866 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. వర్షాలు కురువకపోతే ఈనెలలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రధాన సమస్యలు మానవాళి ప్రాథమిక అవసరాల్లో విద్యుత్ కీలకం. జనాభా పెరగడం, కొనుగోలు శక్తి అధికమవడం, విద్యుత్ లైన్లు విస్తరించడంతో కరెంట్ వినియోగం పెరుగుతోంది. తద్వారా ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడి బ్రేక్డౌన్లు, విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, కోతలు, లో ఓల్టేజీకి కారణమవుతోంది. సమస్యలను అధిగమించేందుకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవసరం మేరకు 25, 63,100,160 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పాతవాటి సామర్థ్యం పెంపు, కొత్తవి ఏర్పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 33/11 కె.వీ విద్యుత్ కేంద్రాల్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల (పీటీఆర్) సామర్థ్యాలను పెంచుతున్నారు. జిల్లాలో భువనగిరి, రామన్నపేట విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటి సబ్ డివిజన్ల పరిధిలో చామపూర్, అనాజిపూర్, మో త్కూరు, వేములకొండ, సోలిపేట్, బొమ్మలరామా రం, కోయలగూడెం సబ్స్టేషన్లలో 5 ఎంవీఏ పీటీఆర్ల స్థానాల్లో రూ.7 కోట్లతో కొత్తగా ఏడు 8 ఎంవీఏ పీటీఆర్లు, రూ.40కోట్లతో 768 డీటీఆర్ (డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల)లను ఏర్పాటు చేశారు. లోడ్ విభజనకు ఇంటర్ లింకింగ్ లైన్లు ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య పెంచడం వల్ల విద్యుత్ లైన్లపై లోడ్ భారం పడి, అవి తెగిపోయే ప్రమాదం ఉంది. అలాకాకుండా 11కేవీ, 33కేవీ ఎల్టీ లైన్ల సామర్థ్యాన్ని పెంచారు. పాత విద్యుత్ లైన్లపై లోడ్ను విభజించేందుకు ఆలేరు సబ్ డివిజన్లోని ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల పరిధిలోని శారాజీపేట, సోమారం, రాఘవాపూర్, శ్రీనివాస్పూర్, చొల్లేరు, రఘనాథ్పురం,సైదాపురం,మల్లాపురం, యాదగిరిగుట్ట పట్టణం, రేణిగుంట, పారుపల్లి, వర్టూరు తదితర గ్రామాల్లో, ఇదే మాదిరిగా మిగితా ఐదు సబ్ డివిజన్లలోనూ సుమారు రూ.78 లక్షలతో 26 కి.మీ వరకు ఇంటర్లింకింగ్ లైన్లు వేశారు. ప్రయోజనాలు ఇవీ.. ఉదాహరణకు ఆలేరులోని ప్రభుత్వ ఆస్పత్రికి స్థానిక 11 కేవీ ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఎప్పుడైనా పట్టణ ఫీడర్లో సాంకేతిక సమస్య తలెత్తినా, మరేదైనా కారణంతో ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చు. అత్యవసర సేవలు అందిస్తున్న సమయంలో కరెంట్ నిలిచిపోవడం వల్ల రోగులకు ఇబ్బంది కలిగే ఆస్కారం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలని ఆలేరు పరిధిలోని శారాజీపేట నుంచి మందనపల్లి శివారు రోడ్డు మలుపు వరకు సుమారు 1.5 కి.మీ మేర ఇంటర్లింకింగ్ లైన్ వేసి ఆస్పత్రికి అనుసంధానం చేశారు. పట్టణ ఫీడర్లో సమస్య వచ్చినా ఆస్పత్రికి కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండదు. ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఇంటర్లింకింగ్ లైన్ల ద్వారా ప్రయోజనం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కనెక్షన్లు గృహ 2,78,420 మొత్తం 3,97,845పరిశ్రమలు 620 వ్యవసాయం 1,18,805 సామర్థ్యం పెంచిన పీటీఆర్లు 07కొత్త డీటీఆర్లు 7682023–2025 వరకు రోజుకు సగటున విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో) నెల 2023 2024 2025 జనవరి 6,659 7,566 7,694 ఫిబ్రవరి 8,330 9,446 9,203 మార్చి 8,705 9,406 9,697 ఏప్రిల్ 5,955 5,818 5,886 మే 4,039 4,799 4,670 జూన్ 5,996 6,928 6,866 డిమాండ్ పెరిగినా సమస్య ఉండదు ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ కేటగిరీలకు సంబంధించి 79,569 కనెక్షన్లు పెరిగాయి. భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉలేకపోలేదు. లోడ్ అధికమైనా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పీటీఆర్ల సామర్థ్యం పెంచడంతో పాటు, కొత్త డీటీఆర్లు ఏర్పాటు చేశాం. పనులు పూర్తి కావొచ్చాయి. –ఆర్.సుధీర్కుమార్, ఎస్ఈ -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: పంచనారసింహులు కొలువైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రాకార మండపంలో సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వేడుకను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు.ముఖమండపంలో అష్టోత్తర పూజలు తదితర కై ంకర్యాలు గావించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వారబంధనం చేశారు. -
భువనగిరిలో ఫుడ్ ఫెస్టివల్
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మెప్మా సిబ్బంది, వీధి వ్యాపారులు తినుబండరాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఫెడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. వంటకాలను పరిశీలించి రుచి చూశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీఈ కొండల్రావు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ మొక్కల పంపిణీఆలేరు: హోం ప్లాంటేషన్లో భాగంగా గురువా రం ఆలేరు మున్సిపాలిటీలో ఇంటింటికీ మొ క్కల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా మార్చాలనే ఉద్దేశంతో హోంప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఐదు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి లోని 12వార్డుల్లో 5వేలకుపైగా ఇళ్లు ఉన్నాయని, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయనున్నట్టు మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్ తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, కీర్తి, వార్డు అధికారులు,ఆర్పీలు పాల్గొన్నారు. అడ్మిషన్లు పెంచాలి రామన్నపేట : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని, పూర్వ విద్యార్థులు కూడా తోడ్పాటునందించాలని ఇంటర్బోర్డు ప్రత్యేక అధికారి భీమ్సింగ్ కోరారు.గురువారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. వార్షిక పరీక్షల్లో రామన్నపేట కళా శాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా టాపర్లుగా నిలవడం అభినందనీయం అన్నారు. బస్సు సౌకర్యం లేదని విద్యార్థులు అధికారి దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మోస్తరు వర్షం భువనగిరిటౌన్, మోత్కూరు: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వానాకాలం ఆరంభం నుంచి సరైన వర్షం కురువకపోవడంతో పత్తి విత్తనాలు వాడిపోవడం, మొక్కల ఎదుగుదల నిలిచిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో రైతులకు ఊరట చెందారు. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించింది. వర్షానికి మోత్కూరులో రహదారులు జలమయం అయ్యాయి. వర్షపాతం ఇలా (మి.మీ) సంస్థాన్నారాయణపురంలో 65, వలిగొండ 51, మోత్కూరు 50, భువనగిరి 35, బీబీనగర్ 34, బొమ్మలరామారం 29, ఆత్మకూర్(ఎం) 19, అడ్డగూడూరులో 18 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
రామగిరి(నల్లగొండ) : ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ శివకృష్ణ అన్నారు. బుధవారం నల్లగొండలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులపై సలహాలు ఇస్తామని మోసగాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. సులభంగా డబ్బులు రావనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కోరారు. ఎస్బీఐ బీఓడీ ఏజీఎం ప్రశాంత్ మాట్లాడుతూ.. కస్టమర్లకు ఏమైనా సందేహాలు వస్తే ఎస్బీఐ బ్రాంచ్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జి. వెంకటేశ్వరరావు, బ్యాంకుల మేనేజర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు. -
చదువుల తల్లిని ఆదుకోరూ..
మిర్యాలగూడ: ఉన్నత చదువులు చదివేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థిని దాతల కోసం ఎదురు చూస్తోది. వివరాలు.. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన పానుగోతు సైదానాయక్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. సైదానాయక్ పాలిష్ మిల్లులో వర్కర్గా పనిచేస్తుండగా.. సునీత వ్యవసాయ కూలీ పనులు చేస్తూ నలుగురు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. పిల్లల చదువు కోసం వారికి ఉన్న రెండున్నర ఎకరాలతో పాటు ఇంటి స్థలం సైతం అమ్ముకున్నారు. పెద్ద కూతురు మానసకు రెండేళ్ల క్రితం పంజాబ్ రాష్ట్రంలో ఐఐటీ–రోపర్లో సీటు రాగా.. ఆ అమ్మాయికి దాతలు ఆపన్నహస్తం అందించడంతో ఉన్నత విద్యను కొనసాగిస్తోంది. రెండో కుమార్తె ధనలక్ష్మి ఈ ఏడాది జేఈఈ మెయిన్స్లో ఎస్టీ కేటగిరిలో 3757వ ర్యాంకు సాధించి పుదుచ్చేరి యూనివర్సిటీలో సీటు సాధించింది. అయితే అక్కడకు వెళ్లి చదువుకునేందుకు రూ.3లక్షల వరకు ఖర్చు వస్తుండడంతో తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆమెను అక్కడకు పంపించలేదని తండ్రి సైదా పేర్కొన్నాడు. తమ కుమార్తె కాలేజీకి వెళ్లకుండా ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుందని.. దాతలు ఆదుకుంటే తన రెండో కుమార్తె చదువు కొనసాగించే అవకాశం ఉందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఫ పుదుచ్చేరి యూనివర్సిటీలో సీటు సాధించిన ధనలక్ష్మి ఫ రూ.3లక్షలు ఖర్చువుతుండడంతో డబ్బుల్లేక పంపించని తల్లిదండ్రులు ఫ దాతల సాయం కోసం ఎదురుచూపు -
అటవీ వ్యవసాయం విస్తరించాలి
బొమ్మలరామారం: సుస్థిర ఆదాయం పొందడానికి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అటవీ వ్యవసాయం విస్తరించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత డాక్టర్ రామాంజనేయులు అన్నారు. బొమ్మలరామారం మండలం యావపూర్ గ్రామంలో బుధవారం అటవీ వ్యవసాయ పద్ధతులపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీ వ్యవసాయంలో రైతులు లాభాలు పొందడానికి శ్రీగంధం, మామిడి, మలబారు వేప, కుంకుడు, నీలగిరి, మహాగని, అల్లనేరేడు, వెదురు, సీతాఫలం తదితర మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. అటవీ వ్యవసాయంలో మొక్కలను పెంచడంతో పాటు వాటి మధ్య గల ఖాళీ స్థలంలో పంటలు వేసుకోవడం, పశువులను పెంచడంతో సుస్థిర ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక ఆర్థిక సహాయంలో భాగంగా సీతాఫలం, వెదురు, మహాగని మొక్కలు, స్పేయర్లు, కొమ్మలను కత్తిరించే సెకేచర్లను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రమేష్, విజయలక్ష్మి, శ్రీలత, అనిల్కుమార్, యాదగిరిగుట్ట వ్యవసాయ సహాయ సంచాలకులు శాంతి నిర్మల, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, ఏఓ దుర్గేశ్వరి, రైతులు పాల్గొన్నారు. ఫ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత రామాంజనేయులు -
గానుగ నూనెతో ఆరోగ్యం
రెండు నెలల నుంచి వాడుతున్నా పల్లీ గానుగ నూనెను గత రెండు నెలల నుంచి వాడుతున్నాను. చాలా మంచిగా ఉంది. గతంలో వాడిన నూనె కన్నా ఈ నూనె చాలా తక్కువగా వాడుతున్నాం. ధర ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిగా ఉంది. గానుగ నూనె వాడటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావడం లేదు. – మేకల రాజిరెడ్డి నార్కట్పల్లి కల్తీ నూనె నివారించేందుకే.. కల్తీ వంట నూనె వాడటం వల్ల రోగాల బారిన పడుతున్న ప్రజలకు ఎద్దుతో తయారు చేసే గానుగ నూనెను అందించాలనే ఉద్దేశంతో ఈ గానుగ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పల్లీలు తీసుకొస్తే ఉచితంగా గానుగ పట్టి నూనె తీసి ఇస్తాం. ఎక్కువగా వ్యాపారం చేయడానికి కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశాం. త్వరలో కల్తీ లేకుండా పసుపు, కారం కూడా తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం. – రేగట్టే భూపాల్రెడ్డి, ఎద్దు గానుగ నూనె కేంద్రం నిర్వాహకుడు రోజూ 10 లీటర్లు విక్రయిస్తున్నా రోజుకు రెండు సార్లు పల్లీలు రోలులో పోసి ఎద్దుతో గానుగ తిప్పుతున్నాను. పల్లీలు 10 కిలోల చొప్పున రెండు సార్లు పోయడం వలన 7లీటర్ల పల్లీ నూనె వస్తుంది. నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై వెళ్లే వారు ఎక్కువగా కొంటున్నారు. దాదాపు రోజు 10 లీటర్ల పల్లీ నూనె విక్రయిస్తున్నాం. ఎప్పటికప్పుడు నూనె అమ్ముడవుతూనే ఉంది. నిల్వ ఉండడం లేదు. – గండికోట ఎల్లయ్య, గుమాస్తా నార్కట్పల్లి: ఇంట్లో ప్రతి వంటలో నూనె ఉపయోగిస్తుంటాం. ఈ నూనె కల్తీగా మారితే అనారోగ్యం బారిన పడక తప్పదు. పాత కాలంలో మాదిరిగా ప్రజలకు స్వచ్ఛమైన నూనె అందించాలని సంకల్పించారు నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన సీనియర్ అడ్వకేట్ రేగట్టే భూపాల్రెడ్డి. గత మూడు నెలల నుంచి నార్కట్పల్లి–అద్దంకి రహదారిలో నార్కట్పల్లి సమీపంలో తన వ్యవసాయ భూమిలో ఎద్దులతో గానుగ తిప్పి నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రసుత్తం వర్కర్లు చూసుకుంటున్నారని, ఎద్దు గానుగతో పల్లీ, కొబ్బరి, ఆవాల నూనె తీస్తున్నట్లు పేర్కొన్నారు. 10 కిలోల పల్లీలు గానుగలో పోసి 4గంటల పాటు ఎద్దుతో తిప్పితే మూడున్నర లీటర్ల పల్లీ నూనె వస్తుందని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా 12 కిలోల ఎండు కొబ్బరి గానుగలో పోసి 8గంటల పాటు ఎద్దుతో తిప్పితే 4కిలోల కొబ్బరి నూనె వస్తుందని, 10 కిలోల అవాలు 8గంటల పాటు తిప్పితే 4కిలోల ఆవాల నూనె వస్తుందని చెబుతున్నారు. గానుగ రోలు నుంచి తిసిన నూనెను దాదాపు 5గంటల పాటు ఎండలో పెట్టడం వల్ల మడ్డి అడుగు భాగానికి పోయి తేలిక పాటి నూనె పైకి తేలుతుందని, ఆ నూనెను బాటిళ్లలో పోసి విక్రయిస్తుంటామని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని పేర్కొన్నారు. రోజుకు 10 లీటర్ల పల్లీ నూనె విక్రయిస్తున్నామని, ఎక్కువగా నార్కట్పల్లి, నల్లగొండ, హైదరాబాద్, గుంటూరు వెళ్లే వారు కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫ నార్కట్పల్లి సమీపంలో వెలిసిన ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రం ఫ మంచి స్పందన ఉందంటున్న నిర్వాహకుడు నూనె ధర (లీటరుకు) పల్లీ నూనె రూ.350కొబ్బరి నూనె రూ.600ఆవాల నూనె రూ.600 -
ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు టోకరా
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులో గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, తాను కూడా అందులోనే ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తి అధికార పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిరుద్యోగులకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అతడిని నమ్మి ఏపీలోని విజయవాడకు చెందిన ఐదుగురు, నకిరేకల్, మిర్యాలగూడకు చెందిన మరికొందరు ఫోన్ పే ద్వారా, నగదు రూపంలో సుమారు రూ.20లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం. తీరా ఉద్యోగాలేవి అని నిరుద్యోగులు నిలదీయగా డూప్లికేట్ ఐడీ కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులకు అంటగట్టాడు. వారు వాకబు చేయగా అవి నకిలీవని తేలడంతో మోసపోయామని గ్రహించారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని నిరుద్యోగులు అతడిని ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు వాపోయారు. వైటీపీఎస్ అధికారులను సంప్రదించగా.. సదరు వ్యక్తి వైటీపీఎస్లో ఉద్యోగం చేయడం లేదని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై డీఎస్పీ రాజశేఖర్రాజును వివరణ కోరగా.. ఇప్పటివరకు ఎవరూ దీనిపై ఫిర్యాదు చేయలేదని, బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫ రూ.20లక్షల వరకు వసూలు చేసిన నిందితుడు ఫ బాధితులు డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్న వైనం -
నేలకొండపల్లి సమీపంలో బుద్ధిష్ట్ థీమ్ పార్కు ఏర్పాటు
నాగార్జునసాగర్: ఖమ్మం జిల్లా పరిధిలోని నేలకొండపల్లి బౌద్ధ స్థూపానికి సమీపంలో సుమారు 8 ఎకరాల్లో బుద్ధిష్ట్ థీమ్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఖమ్మం జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి తెలిపారు. రాష్ట్ర ప్రజా సంబంధాల, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు బుధవారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణమైన బుద్ధవనంలోని అన్ని విభాగాలు, జాతక పార్కు, బుద్ధచరితవనం, ధ్యాన వనం, స్థూపపార్కు, మహాస్థూపంపై చెక్కిన శిల్పాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ అధికారి శాసన ఉన్నారు. -
కొనసాగుతున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని చినవెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండో రోజు నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి నాటకాలను ప్రారంభించారు. హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు అమ్మ చెక్కిన బొమ్మ అనే నాటిక, హైదరాబాద్ మిత్రా క్రియేషన్స్ వారు ఇది రహదారి కాదు అనే నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్, ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు జి. వెంకట్రెడ్డి, సెక్రటరీ జెల్లా శ్రీశైలం, కోమలి కళాసమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, సెక్రటరీ ఎంఎల్. నర్సింహారావు, రఘుపతి, జీఎల్ కుమార్, వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక వడీ్డ ఆశ చూపి మోసం
మిర్యాలగూడ అర్బన్: అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి అమాయక ప్రజల నుంచి భారీ మెత్తంలో డబ్బులు వసూలు చేసి ఉడాయించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన బండి సంధ్య 20శాతం, 30శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి పట్టణంలోని తొమ్మిది మంది నుంచి రూ.32లక్షలు వసూలు చేసింది. అదేవిధంగా మిర్యాలగూడలోని సుందర్నగర్ కాలనీకి చెందిన అవిరెండ్ల అఖిల్తో కలిసి ఫ్రెండ్స్ లక్కీ డ్రా స్కీం ఏర్పాటు చేసి ప్రతినెల రూ.1000 15నెలలు కట్టించుకుని ప్రతి నెలా డ్రా తీసి కొంతమందికి రూ.15వేల విలువైన వస్తువులు ఇస్తామని డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారు తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడగగా.. సంధ్య, అఖిల్ తప్పించుకు తిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంధ్య, అఖిల్పై కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వన్ టౌన్ సీఐ మోతీరామ్, టూటౌన్ సీఐ సోమనర్సయ్య, ఎస్ఐ సైదిరెడ్డి, కానిస్టేబుళ్లు తదితరులున్నారు. ఫ రూ.32 లక్షలతో ఉడాయించిన నిందితుల అరెస్ట్ -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
ఫ మర్రిగూడ మండలం ఇందూర్తి గ్రామంలో ఘటన మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని మేటిచందా పురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందూర్తి గ్రామంలో బుధవారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండల పరిధిలోని దామెర గ్రామ పంచాయతీకి చెందిన బత్తుల చంద్రమ్మ, నర్సింహ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. వారి పెద్ద కుమారుడు బత్తుల సైదులు(25) ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించేవాడు. బుధవారం మర్రిగూడ మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో తన బంధువుల ఇంటికి సైదులు వచ్చాడు. ఈ క్రమంలో సైదులు స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు పరిశీలించగా క్రిమిసంహారక మందు తాగి మృతిచెందినట్లు గుర్తించారు. అయితే సైదులుది ఆత్మహత్య కాదని హత్యేనని అతడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మర్రిగూడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు. -
9,23,449 ఎకరాలకు నీరు
ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రణాళిక ఖరారు ఫ సాగర్, మూసీ, ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ, ఎత్తిపోతల పథకాల కింద నీరు ఫ ఆన్ఆఫ్ పద్ధతిలో నీరివ్వాలని సూచించిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఫ ఎస్సారెస్పీ, డిండి కింద ఇన్ఫ్లో ఆధారంగా నీటి విడుదల సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్లో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళికను రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఖరారు చేసింది. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ, ఆసిఫ్నహర్, డిండి, ఎస్సారెస్పీ స్టేజ్– 2, మూసీ, ఎత్తిపోతల పథకాల కింద వానాకాలంలో మొత్తం 9,23,449 ఎకరాల్లో పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిని వృథా చేయకుండా ఆన్అండ్ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లాలోని సాగునీటి పారుదల శాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేసి నీటిని విడుదల చేయనున్నారు. నీటి కేటాయింపలుు ఇలా.. ● నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద నల్లగొండ జిల్లాలో1,44,727 ఎకరాల ఆయకట్టు ఉండగా.. వానాకాలం సాగకు 16.50 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇక ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ కింద 2,76,461 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 28 టీఎంసీల నీటికి ఇవ్వనున్నారు. ● ఆసిఫ్నహర్ కింద 15,245 ఎకరాలకు 1.5 టీఎంసీల నీరు కేటాయించారు. ● డిండి ప్రాజెక్టు కింద 12,975 ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించిన కమిటీ వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయించాలని స్పష్టం చేసింది. నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ● సూర్యాపేట జిల్లాలో సాగర్ ఎడమకాల్వ కింద ఎత్తిపోతల పథకాలతో కలుపుకుని 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉండగా వానాకాలం సాగుకు 18 టీఎంసీల నీటిని కేటాయించింది. ● ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద సూర్యాపేట జిల్లాలో 2,14,080 ఎకరాలకు నీటిని ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది ఖరారు చేయాలని సూచించింది. ● మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు 4.28 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించింది. వరద పెరిగితే 20వ తేదీ నుంచి నీటి విడుదల ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వస్తున్న వరదనీరు (ఇన్ఫ్లో) 60 వేల క్యూసెక్కుల వరకు తగ్గిపోయింది. ఈ నాలుగైదు రోజుల్లో వర్షాలు పెరిగి శ్రీశైలం నుంచి సాగర్కు ఇన్ప్లో ఎక్కువగా ఉంటే ఈ నెల 20వ తేదీ నుంచి ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. -
చివరి దశకు ‘గంధమల్ల’ భూసేకరణ
తుర్కపల్లి: ఆలేరు నియోజకవర్గంలో 65వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. రిజర్వాయర్ నిర్మాణానికి 1,028.83 ఎకరాల భూమి అవసరముండగా తుర్కపల్లి మండల పరిధిలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో అధికారులు సేకరిస్తున్నారు. అయితే పరిహారం విషయంలో ఆయా గ్రామాల రైతులు ఎకరాకు రూ.40 లక్షలు డిమాండ్ చేయగా ప్రభుత్వం ప్రారంభంలో రూ.16 లక్షల నుంచి రూ.18లక్షల వరకు పరిహారం ప్రతిపాదించింది. చివరకు రైతుల ఆందోళనల నేపథ్యంలో మంత్రులతో చర్చించి ఎకరాకు రూ.24.50 లక్షల పరిహారం చెల్లిస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. వేగవంతంగా పనులు పరిహారం ఖరారైన వెంటనే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ముంపునకు గురయ్యే భూముల వారీగా వివరాలు సేకరించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. రెండు రోజుల్లోగా నష్టపరిహారం విడుదల చేయాలని లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. పూడికతీత, భూముల స్థితిగతులు, నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై ప్రాథమిక స్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం రూ.575.75 కోట్లు కేటాయించి, బీకేఎం–నవయుగ–ప్రసాద్ కన్సార్టియం సంస్థతో నిర్మాణ కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గంధమల్ల, వీరారెడ్డిపల్లి రెవన్యూ గ్రామాల్లో దాదాపు 1,028.83 ఎకరాల భూములు ముంపునకు గురవుతుండగా ఇందులో కట్ట నిర్మాణానికి 112 ఎకరాలు, మిగిలినవి పూర్తిగా నీటి మునిగే ప్రాంతాలుగా గుర్తించారు.. ప్రయోజనం పొందే మండలాలు గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని 65 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో తుర్కపల్లి మండలంలో 945 ఎకరాలు, ఆలేరు మండలంలో 10,506 ఎకరాలు, రాజాపేటలో 33,014 ఎకరాలు, యాదగిరిగుట్టలో 14,522 ఎకరాలకు సాగునీరందనుంది. ప్రణాళిక ప్రకారం మల్లన్న సాగర్ నుంచి వచ్చే 2,450 క్యూసెక్కుల నీటిని గంధమల్ల జలాశయానికి తీసుకొస్తారు. ఈ నీటిని కుడి, ఎడమ కాలువలు ద్వారా పంపిణీ చేస్తారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ తొలుత ప్రతిపాదించిన 9.8 టీఎంసీల సామర్థ్యాన్ని ముంపు గ్రామాల ప్రజల నిరసనలతో 4.28 టీఎంసీలకు అనంతరం 1.41 టీఎంసీలకు పరిమితం చేసింది. ఫ ఎకరాకు రూ.24.50 లక్షల పరిహారానికి అంగీకారం ఫ 1,028.83 ఎకరాల సేకరణ దిశగా అడుగులు ఫ పనులు వేగవంతం చేసిన యంత్రాంగం న్యాయమైన పరిహారం ఇవ్వాలి రైతులు భూములతోపాటు బోర్లు, బావులు పశువుల షెడ్లు కోల్పోతున్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే కాదు, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై కూడా న్యాయమైన పరిహారం అందజేయాలి. – వినోద, భూ నిర్వాసితురాలు, గంధమల్ల -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రాజాపేట : అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం రాజాపేట మండలంలోని నెమిల మదిర గ్రామం పిట్టగూడెం, సోమారం, బొందుగుల, పారుపల్లి, బూర్గుపల్లి, కుర్రారం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పారుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు, మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. మండలంలోని గొలుసుకట్టు చెరువుల ద్వారా గోదావరి జిలాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనిత, ఎంపీడీఓ నాగవేణి, ఎంపీఓ కిషన్, ప్రత్యేక అధికారులు, హౌజింగ్ ఏఈ కోటయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సిలివేరు బాలరాజు గౌడ్, మాడోతు విఠల్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 20న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాకబీబీనగర్: బీబీనగర్ పరిధిలోని మహదేవ్పురం గ్రామంలో గల బ్రహ్మకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్లో ఈనెల 20న నిర్వహించనున్న సెమినార్కు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నట్లు బ్రహ్మకుమారీస్ సెంటర్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి, సామరస్యాన్ని పెంపొందించడం, ప్రజా సంబంధాలు అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంమోత్కూరు : జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రెటరీ ఎల్.భీమ్సింగ్ అన్నారు. బుధవారం ఆయన మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని జోగు దీక్షితను సన్మానించారు. కళాశాల కర దీపిక, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ముద్రించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి.ప్రభాజస్టిస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె.నర్సింహారెడ్డి, లెక్చరర్లు సీహెచ్.లింగస్వామి, ఎం.పరశురాములు, వై.నర్సిరెడ్డి, ఎ.హరికృష్ణ, విజయలక్ష్మి, సుజాత, మల్లిఖార్జున్, అంజయ్య, లావణ్య, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం భువనగిరి పట్టణంలోని ఏఆర్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఏ పథకం మొదలుపెట్టినా ముందు మహిళలకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే వంట గ్యాస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నామన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న లోన్లను నూటికి నూరు శాతం చెల్లించినందున మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలను ఆర్థిక బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టించందన్నారు. కరెంటు ఉత్పత్తి చేసేందుకు కూడా సోలార్ పవర్ ప్లాంట్లు ఇచ్చిందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. మహిళలకు పెద్దపీట : కలెక్టర్ కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి సంబరాలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే ఆర్టీసీ బస్సులకు కూడా మహిళలే యజమానులు కాబోతున్నారని కలెక్టర్ తెలిపారు. ఇళ్లు నిర్మించుకునే స్తోమత లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ వివిధ బ్యాంకుల లింకేజీ ద్వారా రూ.39.97 కోట్లు, వడ్డీలేని రుణాల ద్వారా రూ.6.87 కోట్లు అందించామన్నారు. అనంతరం వివిధ రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి, స్టేట్ డీజీఓ ట్రెజరర్ మందడి ఉపేందర్రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, మహిళా సమైక్య అధ్యక్షురాళ్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఫ కలెక్టర్తో కలిసి మహిళా శక్తి సంబరాలకు హాజరు -
‘స్థానిక’ స్థానాలు ఖరారు
జిల్లాలో 178 ఎంపీటీసీలు.. 17 జెడ్పీటీసీలు ప్రధాన పార్టీలకు సవాల్గా.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్గా మారునున్నాయి. పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటీ ఉండనుండగా, కొన్నిచోట్ల బీజేపీతో త్రిముఖపోటీ ఉండనుంది. జిల్లాలో వామపక్షాలు, ఎంఎల్ పార్టీలు కూడా స్థానిక పోరులో కీలకంగా కానున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొందేందుకు పావులు కదుపుతుండగా ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి స్థానిక పోరులో పట్టు సాధించాలని చూస్తున్నాయి. సాక్షి, యాదాద్రి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా స్థానాలను ఖరారు చేసి జాబితాలను వెల్లడించింది. దీంతోపాటు స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు సైతం అందాయి. ఇక.. స్థానిక సమరమే.. స్థానిక సంస్థల స్థానాలు ఖరారు కావడంతో ఇక గ్రామాల్లో ఎన్నికల సమర భేరీ మోగనుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అఽధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్, అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, డీపీవోలు, పోలీస్శాఖకు ఆదేశాలు అందాయి. గతంలో కంటే ఒక ఎంపీటీసీ స్థానం అదనం జిల్లాలో గతంలో కంట ఒక ఎంపీటీసీ స్థానం పెరిగింది. 17 మండలాల్లో ఇప్పటి వరకు 177 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ఐద ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఒక ఎంపీటీసీ స్థానం పెరిగింది. దీంతో మోత్కూరు మండలం పాటిమట్ల ఎంపీటీసీ స్థానం పెరిగింది. దీంతో ఆ మండలంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య నాలుగు నుంచి ఐదుకు చేరింది. ఫలితంగా జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 177 నుంచి 178కి చేరాయి. ఒక జెడీ చైర్మన్, 17 చొప్పున ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. వీటితోపాటు 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులు ఖరారు అయ్యాయి. ఆర్డినెన్స్పై ఉత్కంఠ! స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అర్డినెన్స్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ ఆమోదిస్తారా.. లేక తిప్పిపంపుతారా అన్న చర్చ సాగుతోంది. ఒక వేళ గవర్నర్ ఆమోదిస్తే దాని ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. ఫ 17 ఎంపీపీ, 427 గ్రామ పంచాయతీలు ఫ కొత్తగా పాటిమట్ల ఎంపీటీసీ స్థానం ఫ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఫ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు -
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం
సాక్షి,యాదాద్రి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారకులైన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి స్థానిక డీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ కార్యాలయం గుడి లాంటిదని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాన్నారు. వచ్చేనెల జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పోత్నక్ ప్రమోద్కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్, జనగాం ఉపేంందర్రెడ్డి, బర్రె జహంగీర్ తదితరులు ఉన్నారు. నూతన భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు భువనగిరి ఆర్డీఓ, తహసీల్దార్ నూతన భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భువనగిరికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి విన్నపం మేరకు విడుదల చేస్తునట్లు ప్రకటించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల ప్రక్రియపై కలెక్టరేట్లో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 9,374 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో 6,836 ఇళ్లకు మార్క్ ఔట్ చేశామని, మిగతావి వివిధ దశలో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. అలాగే జిల్లాలో 11,960 రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
వైభవంగా నిత్యకల్యాణోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట క్షేత్రంలో బుధవారం అర్చకులు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను జరిపించారు. ఆలయ ముఖ మండపంపై గల ఉత్తరం దిశలోని మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ద్వార బంధనం చేశారు. -
గురుకులాల్లో ఎందుకిలా..?
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య నాణ్యత లేని భోజనంతో ఆస్పత్రులపాలు గురుకులాలతోపాటు సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపం, అందుబాటులో ఉండకపోవడం, భోజనం నాణ్యతను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. దేవరకొండ, మర్రిగూడ పాఠశాలల్లో ఈ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో భోజనం నాణ్యతను పట్టించుకునే వారే లేరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు మండల కేంద్రంలో విద్యార్థులకు వండి పెడుతున్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని పలుమార్లు హాస్టల్ తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే, జిల్లా అధికారులకు విద్యార్థులు మొర పెట్టుకున్నారు. అయినా భోజనంలో మార్పు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా అంతటా ఉంది. ఫ ఫుడ్ పాయిజన్తో పలువురు ఆస్పత్రిపాలు ఫ పట్టింపులేని సిబ్బంది, అందుబాటులో ఉండని ప్రిన్సిపాళ్లు ఫ కనిపించని ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఫ వరుస సంఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంధ్య(11) పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, అదే రోజు దేవరకొండలోని ఆశ్రమ పాఠశాలలో 40 మంది, మర్రిగూడలోని మోడల్ స్కూల్లోని బాలికల హాస్టల్లో 18 మంది విద్యార్థినులు ఫుడ్పాయిజన్తో ఆస్పత్రి పాలయ్యారు. ఇవే కాకుండా మంగళవారం తెలవారుజామున నడిగూడెంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనూష మహాలక్ష్మి క్లాస్రూమ్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో గురుకులాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే తమ పిల్లల బాగోగులపై ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే కారణమా? తూప్రాన్పేట బీసీ గురుకుల పాఠశాలలో సంధ్య ఆత్మహత్య చేసుకోవడం వెనుక సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతోపాటు భద్రతపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసింది. నాలుగంతస్తులు ఉన్న ఆ భవనంపైకి వెళ్లేందుకు ఉన్న మెట్ల వద్ద కనీసం గేటు కూడా లేకపోవడంతోనే ఆ బాలిక భవనంపైకి కిందకి దూకినట్లు అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. వందల మంది విద్యార్థులు ఉండే గురుకులాల్లో, అందులోనూ బాలికల గురుకులాల్లో కనీస భద్రత చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాత్రి వేళలలో పర్యవేక్షించాల్సిన సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం వల్లే ఆ సంఘటన జరిగినట్లు తెలిసింది. డ్యూటీల సమయంలో మెళకువతో ఉండాల్సి ఉన్నా వారు నిద్రపోవడం వల్లే బాలిక భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు సమాచారం. ఇక నడిగూడెం కేజీబీవీలో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఇదే పరిస్థితి నెలకొంది. పైగా తరగతి గదికి తాళం వేయలేదని, దాంతో బాలిక తరగతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, వార్డెన్లు సరిగ్గా పట్టించుకోకపోవడం, అందుబాటులో ఉండకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది కాలంలో జరిగిన పలు ఘటనలు ఇవీ.. డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గతేడాది జూన్ 3, 4, 5 తేదీల్లో 16 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటికే అవే గదుల్లో విద్యార్థినులు ఉండాల్సి వస్తోంది. గతేడాది దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకులంలో నిద్రిస్తున్న 13 మంది విద్యార్థులను ఎలుకలు కరవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీఏపల్లి మండలంలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో గతేడాది డిసెంబరులో బియ్యం సరిగాలేక, అన్నం సరిగా ఉడకకపోవడంతో విద్యార్థినులు భోజనం చేయలేదు. దీంతో నలుగురు విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్కు అవసరమైన 1,800 పెద్ద, చిన్న బ్యాలెట్ బాక్స్లను సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ కోసం 6,708 మంది సిబ్బంది అవసరమని గుర్తించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్నికల సంఘం రూపొందించిన గుర్తులతో బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. ఓటరు జాబితా ముద్రించి ఆరునెలలు అవుతున్నందున మరోసారి జాబితాను ప్రచురించాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా అనుబంధ ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. సాక్షి, యాదాద్రి : ఇన్నాళ్లూ తమకు సీటు వస్తుందో లేదోనని తర్జనభర్జన పడిన నేతలు ఇప్పుడు రిజర్వేషన్లపై చర్చించుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసిన నేపథ్యంలో ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎంచుకున్న వార్డు, స్థానంలో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఎవరికి రిజర్వ్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపైనే అంతటా చర్చ కొనసాగుతోంది. కేటాయింపు ఇలా.. జిల్లాలో 427 గ్రామ పంచాయతీలకు 3,704 వార్డులు ఉన్నాయి. 17 జెడ్పీటీసీ స్థానాలు, 17 ఎంపీపీలు, 178 ఎంపీటీసీ స్థానాలు, ఆరు మున్సిపాలిటీలు, 104 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం అయితే అన్ని ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. సర్పంచ్ల కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోను 180 వరకు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ వార్డుల్లో 1,600 వరకు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. మండలం యూనిట్గా.. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు మండలం యూనిట్గా ఎంపిక చేయనున్నారు. అలాగే జిల్లా యూనిట్గా ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్గా జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు 50 శాతం రిజర్వుడు గతంలో మాదిరిగానే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అన్ని స్థానాల్లో మహిళలకు ఆయా సామాజిక వర్గాల వారీగా యాబై శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు. చట్టం సవరింపు తప్పదా 2018లో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ స్థానిక సంస్థల చట్టం ప్రకారం పది సంవత్సరాలు పాటు రిజర్వేషన్లు కొనసాగాలి. ఐదేళ్ల కాలానికి రిజర్వు అయిన కేటగిరీ రెండోసారి ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది. అయితే తాజాగా మారనున్న రిజర్వేషన్లతో పంచాయతీ రాజ్ , మున్సిపల్ చట్టాలను మార్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వం సైతం పాత చట్టాలను మార్చక తప్పని పరిస్థితి నెలకొంది. ఆశావహుల్లో గుబులు మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్ల చర్చ జరుగుతోంది. పాత రిజర్వేషన్లు ఉంటాయని భావించి పోటీచేయాలని సిద్ధమవుతున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది. ముందస్తు ప్రణాళిల్లో ప్రధాన పార్టీలు మారనున్న రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు వెలువడనున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు, సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ పార్టీలు అంతర్గత సమావేశాలకు తెరలేపాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు ఎలా కై వసం చేసుకోవాలో ఆయా పార్టీల ముఖ్య నాయకులు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం అమలుకు ప్రభుత్వం సిద్ధం ఫ మండలం యూనిట్గా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల కేటాయింపు ఫ మారనున్న రిజర్వుడు స్థానాలు ఫ ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని చర్చ బీసీలకు రిజర్వు కానున్న స్థానాలు (అంచనా) కేటగిరీ స్థానాలుసర్పంచ్లు 180వార్డులు 1,600ఎంపీటీసీలు 67ఎంపీపీలు 06జెడ్పీటీసీలు 06 -
ఆంజనేయస్వామికి ఆకుపూజ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతో పాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డికి ఉత్తమ అవార్డునల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలోనే మంచి ఫలితాలు సాధించడంతో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంగళవారం హైదరాబాద్లో ఉత్తమ అవార్డు అందజేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే నల్లగొండ డీసీసీబీని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రసంసించారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శంకర్రావు, రవీందర్రావు, సురేంద్రమోహన్, ఉదయభాస్కర్ ఉన్నారు. ఎంఎంటీఎస్ నిధుల మంజూరుకు కేంద్రం సిద్ధంభువనగిరి : ఎంఎంటీఎస్ నిర్మాణ పనులు చేపట్టేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ అన్నారు. భువనగిరి మండలం మాసుకుంట వద్ద జరుగుతున్న ఎంఎంటీఎస్ రైల్వేలైన్ పనులను మంగళవారం ఆయన పలువురు నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, శ్యాంసుందర్రెడ్డి, అచ్చయ్య, సుర్వి శ్రీనివాస్, మహమూద్, శ్రీశైలం, శ్రవణ్, మంగు నర్సింగ్రావు, సంతోష్ తదితరులు ఉన్నారు. ఆలేరు ఏడీఏ పద్మావతికి డీడీఏగా పదోన్నతి ఆలేరు: ఆలేరు సహాయ వ్యవసాయ సంచాలకురాలు(ఏడీఏ) పద్మావతికి డిప్యూటీ డెరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (డీడీఏ)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆమెను నిజామాబాద్ జిల్లా రైతు శిక్షణ కేంద్రాని(ఎఫ్టీసీ)కి బదిలీ చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఆలేరు ఏడీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలేరు, గుండాల, మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడురు మండలాల ఏఓలు, ఏఈలు, ఫర్టిలైజర్ డీలర్లు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఏఓలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఓలు శ్రీనివాస్గౌడ్, పాండురంగాచారి, శ్రీనివాస్, కీర్తి, పూజా, ఫర్టిలైజర్ దుకాణాల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జూరి రవి, యాదాద్రి జిల్లా కోశాధికారి పడిగల రాజు, సిబ్బంది పాల్గొన్నారు. మోత్కూరు సంఘానికి అభివృద్ధి నిధులుమోత్కూరు : ఫార్మర్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మోత్కూరు సింగిల్విండోకు మొదటి విడతలో భాగంగా రూ.3.16లక్షల నిధులు మంజూరయ్యాయి. మంగళవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లుకు నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా చెక్కు అందజేశారు. సంఘం చైర్మన్ మాట్లాడుతూ ఏడాదికి రూ.6లక్షల చొప్పున మూడేళ్లకు రూ.18లక్షలు అందజేస్తారని తెలిపారు. -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు : సీపీ
బీబీనగర్: పోలీస్ విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వంగా ఉండొద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అన్నారు. మంగళవారం ఆయన బీబీనగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. రికార్డులు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అనంతరం ఫిర్యాదుదారులకు అందించాల్సిన సత్వర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, విధుల నిర్వహణ తదితర అంశాల ప్రాముఖ్యతలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏసీపీ రాహుల్రెడ్డి, సీఐ ప్రభాకర్రెడ్డి ఉన్నారు. -
వెల్లంకిలో తమిళనాడు బృందం పర్యటన
రామన్నపేట : తమిళనాడు రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పర్యటించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిధి అనిల్కుమార్, తమిళనాడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి డాలస్ న్యూ బిగిన్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం మెరుగునకు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీలు, ఆరోగ్య కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు. రైతు వేదికలో రైతునేస్తం పోగ్రామ్ను వీక్షించి పలు అంశాలపై రైతులతో చర్చించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య స్థాపించి నిర్వహిస్తున్న ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని సందర్శించారు. ఉన్నత పాఠశాలలో డిజిటల్ పాఠాల బోధన, మధ్యాహ్న భోజన పథకం అమలును తీరును తెలుసుకున్నారు. పల్లెప్రకృతి వనం, గ్రామ నర్సరీలను సందర్శించారు. స్వయం సమృద్ధి విభాగంలో జాతీయ స్థాయి అవార్డుకు పోటీ పడిన వెల్లంకిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బృందం సభ్యులు అధ్యయనం చేశారు. వారివెంట డీఎల్పీఓ ప్రతాప్నాయక్ ఎంపీడీఓ ఎ.రాములు, ఎంపీఓ రవూఫ్అలీ, ప్రత్యేక అధికారి ఆశీష్ రాఘవ, ఏపీఓ పి.వెంకన్న, పంచాయతీ కార్యదర్శి మోహన్ తదితరులు ఉన్నారు. ఫ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా -
సొంత బిడ్డల్లా చూసుకోవాలి
సాక్షి,యాదాద్రి : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం హాస్టల్స్లో చదివే వి ద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని వారిపై ప్రత్యేక శ్రద్ధ చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్సీఓలు, విద్యారాణి స్వప్న, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య , జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి శ్యామ్ సుందర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీఈఓ సత్యనారాయణ, వివిధ హాస్టల్ ప్రిన్సిపాల్స్, స్పెషల్ ఆఫీసర్స్, కేర్ టేకర్లు పాల్గొన్నారు. మాతృ మరణాలను నియంత్రించాలి భువనగిరి : జిల్లాలో మాత్ర మరణాల నియంత్రణకు గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణులకు హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారికి మెరుగైన వైద్యసేవలందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలన్నారు. అనంతరం సీ్త్ర వైద్యనిపుణులు నిర్మల, కవిత.. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత అందించే సేవల గురించి వివరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, పిల్లల వైద్యులు కరణ్రెడ్డి, మోహన్, మత్తు వైద్యనిపుణులు రెహమాన్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ యశోద, శిల్పిని, ఇమ్యూనైనేషన్ జిల్లా అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేడు మహిళా శక్తి సంబరాలు భువనగిరిటౌన్ : ఈ నెల 16న భువనగిరి పట్టణంలోని ఏఆర్ ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు కేంద్రీయ విద్యాలయంలో నాణ్యమైన విద్య భువనగిరి : కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో నాణ్య మైన విద్య అందుతుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. భువనగిరి కేవీలో 2వ తరగతిలో ప్రవేశాల కోసం మంగళవారం కలెక్టరేట్లో లక్కీ డ్రా తీసిమాట్లాడారు. కార్యక్రమంలో కేవీ ప్రిన్సిపాల్ ఎన్.చంద్రమౌళి, ఇన్చార్జి మనిషా శుక్లా, కమిటీ సభ్యులు శ్రీపాద అనందకుమార్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు. -
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
భూదాన్పోచంపల్లి : మండలంలోని దేశ్ముఖిలో గల విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతూ మూడు నెలల క్రితం క్యారీలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన బీటెక్ విద్యార్థి బొడ్డు శ్యామ్చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులు యూనివర్సిటీ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో న్యా యం చేస్తామని కళాశాల సీఈఓ హామీ ఇచ్చి ఇప్పుడు తప్పుడు కేసులు నమోదు చేయించడం తగదన్నారు. దీక్షలో మృతుడి తండ్రి భానుప్రతాప్, చిప్పల నర్సింగ్రావు, బొల్లం రామ్కుమార్, భరత్, లోకదాస్, శివ, అజయ్, యేబురాజు, దేవదాసు, డేవిడ్రాజ్, రాజు, పద్మజ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ హయాంలోనే గోదావరి జలాలు
తిరుమలగిరి (తుంగతుర్తి): పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తుంగతుర్తి నియోజకవర్గానికి అధిక నిధులు, గోదావరి జలాలు పుష్కలంగా వచ్చి సమృద్ధిగా పంటలు పండాయని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు యుగేంధర్రావు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు రజాక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నీళ్లు లేక చెరువులు ఎండి పోతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ల సహకారంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి వ్యక్తిగతంగా దూషణలు చేయడం, స్థాయికి తగ్గట్లుగా మాట్లాడక పోవడం దారుణమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు సంకెపల్లి రఘునందన్రెడ్డి, తాటికొండ సీతయ్య, కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, కల్లెట్లపల్లి శోభన్బాబు, కందుకూరి బాబు పాల్గొన్నారు. -
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి
సూర్యాపేట : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు లీగల్ సెల్ కృషి చేస్తుందని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీసీసీ లీగల్ సెల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అహర్నిశలు పాటుపడుతోందన్నారు. సమాజానికి అండగా ఉంటూ హక్కుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉమాశంకర్, రాష్ట్ర సెక్రటరీ మూమిన్ రోషన్, రాష్ట్ర కన్వీనర్ నిమ్మరబోయిన నవీన్, ఏ ఎల్యూ జిల్లా సెక్రటరీ సీనపల్లి సోమేశ్వర్, మారపాక వెంకన్న, షఫీ ఉల్లా, బత్తిని వెంకటేశ్వర్లు, ఈశ్వర్ కుమార్, టేకులపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఫ ఎల్సీ తీసుకోకుండా ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చిలుకూరు: ఎల్సీ తీసుకోకుండా ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన దాసి గోవర్ధన్(28) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అదే గ్రామానికి చెందిన గండు వెంకన్న పొలంలోని ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయడానికి గోవర్ధన్ వెళ్లాడు. ఎల్సీ తీసుకోకుండా ట్రాన్స్ఫార్మర్కు ఉన్న ఫ్యూజులు తీసివేసి మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్న 11కెవీ విద్యుత్ లైన్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై గోవర్ధన్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. విద్యుత్ సిబ్బంది కూడా ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. మృతుడి బావ శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురభి రాంబాబుగౌడ్ తెలిపారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్
నిందితుల అరెస్ట్ గుంటి సాయికుమార్, స్వాతి, పొట్టెపాక మహేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు భునగిరి డీసీపీ ఆకాంక్ష్యాదవ్ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ శంకర్గౌడ్, మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతడిని కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఈ ఘటనపై అనుమానంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ ఆకాంక్ష్యాదవ్ మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అసలు జరిగింది ఇదీ.. ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేసేవాడు. స్వామి భార్య స్వాతి కూడా భువనగిరి హౌసింగ్బోర్డు కాలనీలో ఎస్ఎన్ మోటార్స్లో పనిచేసేది. ఆ పక్కనే మార్బుల్ దుకాణంలో పనిచేసే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్తో స్వాతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత స్వాతి పనిచేసే ఎస్ఎన్ మోటార్స్ మూతపడింది. ఈ క్రమంలో స్వాతి పల్లెర్ల గ్రామానికి వచ్చి ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల తర్వాత స్వామికి భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో స్వామి తన భార్య స్వాతిని తాను పనిచేసే ట్రాక్టర్ షోరూంలోనే ఉద్యోగంలో చేర్పించాడు. గొడవలు ఇలా.. స్వాతి సోదరుడు మహేశ్కు ఇద్దరు భార్యలు. మహేష్ మొదటి భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహేష్కు తెలియడంతో తన బావ స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామికి వరుసకు సోదరి అయిన తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయాన్ని మహేష్ స్వాతితో చెప్పాడు. దీంతో స్వాతి తన భర్త స్వామిని నిలదీసింది. నన్నే నిలదీస్తావా అంటూ స్వామి స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో స్వామి, స్వాతి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఫిబ్రవరిలో పని నిమిత్తం మోత్కూరుకు వెళ్లిన సాయికుమార్కు అక్కడ స్వాతి కలిసింది. తన భర్త వేధిస్తున్న విషయాన్ని స్వాతి సాయికుమార్కు వివరించింది. సాయికుమార్ స్వాతిని ఓదార్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అక్క స్వాతి, సాయికుమార్ వివాహేతర సంబంధానికి మహేష్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్వాతి, మహేష్ నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు స్వామిని హత్య చేయడానికి సాయికుమార్, స్వాతి, మహేష్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలుగా వాట్సాప్ గ్రూపులోనే మాట్లాడుకుని తర్వాత కాల్స్ డిలీట్ చేసేవారు. స్వాతి తన ప్రియుడు సాయికుమార్ నంబర్ను కూడా సెల్ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు. కారు అద్దెకు తీసుకుని.. ఈ నెల 13న తన భర్త స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేష్కు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై భువనగిరిలో నిఘా పెట్టారు. స్వామిని హత్య చేయడానికి పథకం ప్రకారం సాయికుమార్.. తన స్నేహితుడైన భువనగిరి పట్టణంలోని తాతానగర్కు చెందిన చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును సెల్ప్ డ్రైవింగ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ తన స్నేహితుడు మద్దికుంట వీరబాబుతో కలిసి బైక్పై పల్లెర్ల గ్రామానికి బయల్దేరాడు. స్వామిని సాయికుమార్ కారులో వెంబడించాడు. రాత్రి 11.15 గంటల సమయంలో మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ శివారులోకి రాగానే కారుతో బైక్ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొట్డడంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్పై వెనుక కూర్చున్న వీరబాబుకు గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లి బైక్ను ఢీకొట్టిన అనంతరం కంట్రోల్ కాలేదు. రోడ్డు కిందకు 50 మీటర్ల వరకు దూసుకుపోయింది. అక్కడ ఫెన్సింగ్ కడీలకు తగిలి ముందుకు కదలకుండా ఆగిపోయింది. సాయికుమార్కు స్వల్పంగా గాయాలయ్యాయి. స్వామిని హత్య చేసేందుకు ప్లాన్ అమలు చేస్తున్న సమయంలో మహేష్, స్వాతి, సాయికుమార్ వాట్సాప్ గ్రూప్ కాల్లో మాట్లాడుకున్నారు. వాట్సాప్ కాల్లో స్వామిని కారుతో ఢీకొట్టి చంపేశామన్న విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న స్వాతి తమ్ముడు మహేశ్ ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాయికుమార్, రామలింగస్వామిని బైక్పై ఎక్కించుకుని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. ఆస్పత్రికి వచ్చిన భార్య, బావమరిది ఘటనా స్థలంలో స్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా ఫోన్లో విషయం తెలుసుకున్న స్వాతి, మహేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఫ వేధిస్తున్న భర్తను సోదరుడు, ప్రియుడితో కలిసి కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన భార్య ఫ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం ఫ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో మరొకరు ఫ వివరాలు వెల్లడించిన భువనగిరి డీసీపీ ఆకాంక్ష్యాదవ్ కారుతో.. కదిలిన డొంక రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో ముందు భాగం దెబ్బతినడంతో కారు నంబర్ ఆధారంగా కారు యజమానికి ఫోన్ చేసి విచారించగా.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చాడు. దీంతో సాయికుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. సాయికుమార్ సెల్ఫోన్ చెక్ చేయగా స్వాతి నంబర్ కనిపించింది. దీంతో స్వాతిని తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నిందితులు స్వామి కాళ్లు, చేతులు విరిచి దివ్యాంగుడిని చేయాలనుకున్నారని తెలిసింది. అయితే అదికాస్త వికటించి అతడు మృతిచెందాడు. -
రైళ్లలో గంజాయి రవాణాపై నిఘా
ఆలేరు: రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాల మేరకు మంగళవారం ఆలేరు రైల్వేస్టేషన్లో సివిల్, ఆబ్కారీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మెమూ ఫ్యాంజిర్ బోగిల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనంతరం ప్లాట్ఫారంపై పలువురి ప్రయాణికుల బ్యాగ్లు, సంచులను పరిశీలించారు. రైళ్లలో గంజాయి రవాణాను అరికట్టేందుకే తనిఖీలు చేపట్టామని సీఐ కొండల్రావు చెప్పారు. రైళ్లలో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. రైళ్లలో అనుమానంగా ఉండే వ్యక్తులు, సీట్ల కింద వస్తువులు, ప్యాకెట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆలేరు, యాదగిరిగుట్ట, గుండాల ఎస్ఐలు వినయ్, కృష్ణప్రసాద్, శ్రీరాములు, సైదులు, ఆబ్కారీ సీఐ దీపిక పాల్గొన్నారు. -
చెక్కు బౌన్స్ కేసులో మూడు నెలల జైలుశిక్ష
తుంగతుర్తి: చెక్కు బౌన్స్ కేసులో నిందితుడికి మూడు నెలలు జైలుశిక్షతో పాటు నష్టపరిహారం కింద బాధితుడికి రూ.4లక్షలు అందించాలని తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎండీ గౌస్ పాషా మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన మందడి సోమేశ్వర్రెడ్డి వద్ద 2017 జనవరి 15న నల్లగొండ మండలం దండంపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన వీరయ్య రూ.3లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న సమయంలో వీరయ్య సోమేశ్వర్రెడ్డికి చెక్కు ఇచ్చాడు. కొంతకాలం తర్వాత వీరయ్య అప్పు తిరిగి చెల్లించకపోవడంతో అతడు ఇచ్చిన చెక్కును సోమేశ్వర్రెడ్డి బ్యాంకులో వేయగా అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో 2017 ఆగస్టు 1వ తేదీన సోమేశ్వర్రెడ్డి తుంగతుర్తి కోర్టులో చెక్కు బౌన్స్ కేసు వేశాడు. ఈ కేసు తుది విచారణలో వాదోపవాదాలు విన్న తర్వాత వీరయ్యకు మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.4లక్షలు సోమేశ్వర్రెడ్డికి చెల్లించాలని జడ్జి ఎండీ గౌస్ పాషా తీర్పు వెలువరించారు. అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్యయాదగిరిగుట్ట రూరల్: అప్పుల బాధతో యువకుడు ఉరేసుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన పల్లెపాటి శివ(25) యాదగిరిగుట్ట ఆలయం కొండ పైన కాంట్రాక్ట్ పద్ధతిలో గార్డెన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. శివ గత కొన్నిరోజులుగా అప్పుల బాధతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుఅడ్డగూడూరు: రోడ్డు దాటుతున్న మహిళను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండలం చిన్నపడిశాల గ్రామానికి చెందిన బండారు పుష్ప మంగళవారం హైదరాబాద్లో ఉంటున్న తన బంధువుల వద్దకు వెళ్లేందుకు గాను బస్సు కోసం చౌల్లరామారం గ్రామ స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా.. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెద్ది వీరేష్ బైక్పై హైదరాబాద్ నుంచి తన స్వగ్రామనికి వెళ్తూ పుష్పను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పుష్ప కాలు విరిగింది. వీరేష్ తల, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. లారీ దగ్ధంవలిగొండ: షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని లారీ దగ్ధమైంది. ఈ ఘటన వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ రహీసూల్ ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో చైన్నెకి వెళ్తుండగా.. సోమవారం అర్ధరాత్రి వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామ సమీపంలోకి రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీకి మంటలంటుకున్నాయి. మంటలు లారీ మొత్తం వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు నర్సయ్య కన్నుమూత
పెన్పహాడ్: మండల పరిధిలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు గుండు నర్సయ్య(93) అనా రోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు సంతానం. నర్సయ్య మృతదేహాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్రావు, భూక్య సందీప్రాథోడ్, మామిడి కరుణాకర్, కిన్నెర ఉప్పలయ్య, తదితరులు నివాళులర్పించారు. కౌలు రైతు ఆత్మహత్యకట్టంగూర్: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన మాతంగి యాదయ్య(57) తనకున్న ఎకరం భూమితో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేశాడు. రెండు సంవత్సరాలుగా కాలం కలిసి రాక పంట దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. ప్రస్తుతం పత్తి చేను ఎండిపోవటంతో మనోవేదనకు గురయ్యాడు. వారం రోజులుగా ఇంట్లో కుటుంబ సభ్యులతో అప్పులు పెరిగిపోయాయని చెప్పాడు. మంగళవారం ఇంటి వరండాలోని ఐరన్ పైపునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం యాదయ్య భార్య ఇంటికి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. రూ.6 లక్షలు అప్పు చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ప్రారంభం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని చినవెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ సహకారంతో నల్లగొండ కళాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నాటకోత్సవాలను తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు ప్రారంభించారు. మొదటిరోజు కరీంనగర్ చైతన్య కళాభారతి వారు స్వప్నం రాల్చిన అమృతం అనే నాటిక, హైదరాబాద్ శ్రీ కళానికేతన్ వారు ఈ మంచం నాది కాదు అనే నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్, ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు జి. వెంకట్రెడ్డి, సెక్రటరీ జెల్లా శ్రీశైలం, కోమలి కళాసమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, సెక్రటరీ ఎంఎల్. నర్సింహారావు, రఘుపతి, జీఎల్. కుమార్, వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాల సాయంతో అధిక దిగుబడులు సాధ్యం
త్రిపురారం: రైతులు యంత్రాల సాయంతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాదించవచ్చని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండలం కంపాసాగర్లోని వరి పరిశోధనా స్థానంలో ఉమ్మడి జిల్లాలోని రైతులకు వ్యవసాయంలో నేరుగా పొడి దుక్కిలో వరి విత్తనాలు విత్తే విధానం, దమ్ము చేసిన పొలంలో నేరుగా డ్రోన్ సహయంతో విత్తనాలు చల్లే పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రోజురోజుకు కూలీల కొరత రైతులకు ఇబ్బందిగా మారిందని, వరి విత్తనాలు నేరుగా చల్లడం వలన కూలీల కొరతను అధిగమించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. సకాలంలో వరి విత్తనాలను యంత్రాలతో విత్తుకోవడం వల్ల సమయం కూడా ఆదా అవుతుందన్నారు. శాస్త్రవేత్తల సహాయంతో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా రైతులు సాగు చేపట్టాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవాలని అన్నారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు వరి నారు పెంచడం, రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, వరి సాగులో సస్యరక్షణ చర్యలపై సమగ్రంగా వివరించారు. అనంతరం వరి విత్తనాలు నేరుగా దుక్కిలో విత్తే యంత్రం, డోన్ ద్వారా విత్తే పద్ధతులపై శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో యంత్రాలు చూపించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వరి పరిశోధనా స్థానం ప్రఽ దాన శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్య, హాలియా సహాయ వ్యవసాయ సంచాలకురాలు సరిత, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహాన్, శాస్త్రవేత్తలు సంధ్యారాణి, నళిని, స్వాతి, ఏఈఓ నాగరాజు, వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. ఎకరానికి 6కిలోల విత్తనం సరిపోతుంది..వరి పంటను నేరుగా విత్తేందుకు గాను ఎకరానికి 6కిలోల విత్తనం సరిపోతుందని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్య సూచించారు. యంత్రాల సాయంతో ఎకరం పొలంలో 10 నుంచి 15 నిమిషాల్లో వరి విత్తనాలు విత్తుకోవచ్చన్నారు. వరి పరిశోధనా స్థానం కంపాసాగర్లో గత రెండళ్ల నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో నేరుగా వరి విత్తే పద్ధతి, డ్రోన్ సహాయంతో విత్తే పద్ధతులపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయంతో రైతులు వరిని నేరుగా విత్తుకోవచ్చని, రైతులు యాంత్రీకరణకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫ నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ ఫ ఉమ్మడి జిల్లా రైతులకు వరి విత్తనాలు విత్తే విధానంపై అవగాహన -
‘ఇందిరమ్మ’ బిల్లు మంజూరు చేయాలని ఆందోళన
మర్రిగూడ: ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని మర్రిగూడ మండలం లెంకలపల్లికి చెందిన ఏర్పుల చినమల్లయ్య సోమవారం గ్రామంలో ఆందోళన చేపట్టాడు. గ్రామ పంచాయతీ కార్యదర్శి తన ఇంటి వివరాలను ఫొటో క్యాప్చర్ చేయడం లేదని, తనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు కాకుండా చేశారని, తనకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు చెల్లించాలని, లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో బస్సులు, ఇతర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్రిగూడ పోలీసులు గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై లెంకలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవిని వివరణ కోరగా.. ఏర్పుల చిన్నమల్ల య్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని.. కానీ అతడు గతంలోనే స్లాబ్ లెవల్ వరకు ఇంటిని నిర్మించాడని పేర్కొంది. ఇందిరమ్మ ఇల్లు నిబంధనల ప్రకారం నాలుగో లెవల్ వరకు అతడు ఇల్లు నిర్మించాడని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ముందు ముగ్గు, పిల్లర్లు, బేస్మెంట్ ఇలా అనేక ప్రక్రియలు ఫొటోలు తీసి ఆన్లైన్ చేస్తేనే బిల్లు మంజూరు అవుతుందని ఆమె తెలిపింది. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని వ్యక్తి హల్చల్ -
వరి నాట్లు వేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
గుర్రంపోడు: వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. వరి విత్తనం, నారు ద్వారా సంక్రమించే తెగుళ్లు, నారుదశలో ఆశించే పురుగులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి వివరించారు. నారు మడి తయారీలో.. నారు మడి తయారు చేసేటప్పుడు 2 సెంట్ల నారుమడికి 1 నుంచి 1.5 కిలోల వేప పిండి వేయాలి. నాణ్యమైన విత్తనం ఎంచుకుని విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్భండిజమ్ను కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. నారుమడులైతే లీటరు నీటికి గ్రాము కార్భండిజమ్ మందును కలిపి ఆ ద్రావణంలో కిలో వరి విత్తనాలు 24 గంటలు నానబెట్టాలి. తర్వాత విత్తనాన్ని మళ్లీ 24 గంటలు మండె కట్టాలి. ఇలా మొలకెత్తిన విత్తనాన్ని నారు మడిలో చల్లుకోవాలి. విత్తిన 10 రోజులకు ఒక సెంటు నారుమడికి కార్బోఫూర్యాన్ 3జీ గుళికలు 160 గ్రాముల చొప్పున వేయాలి. ఒక మిల్లీలీటరు క్లోరోపైరిపాస్ 20ఈసీ మందును లీటరు నీటికి కలిపి ఆ ద్రావణంలో నారు వేర్లు మునిగేటట్లు 3గంటల పాటు ఉంచిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. దీని వల్ల కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, సుడిదోమ వంటి పురుగులను అరికట్టవచ్చు. వరి నాటే ముందు నారు కొనలు తుంచి నాటుకోవడం వల్ల కాండం తొలుచు పురుగు బెడద తగ్గించుకోవచ్చు. ప్రధాన పొలంలో.. నాట్లు వేసే ముందు కనీసం పది రోజుల ముందు పొలాన్ని 2–3 దఫాలుగా దమ్ము చేయాలి. నారు తీసేటప్పుడు మొక్కల ఆకులు లేతాకు పచ్చగా ఉంటే త్వరగా కొత్త ఆకులు వస్తాయి. కనీసం నాలుగు, ఆరు ఆకులు ఉన్న నారు నాట్లు వేయడానికి వాడాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. నాటు ౖపైపెగా వేస్తే పిలకలు ఎక్కువగా వస్తాయి. చదరపు మీటరుకు కనీసం 44 మొనలు ఉండేలా చూసుకోవాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీయాలి. జింక్ లోపం నివారణకు నాట్లు వేసే ముందు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలొల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. -
జాతీయ రహదారిపై లారీ బీభత్సం
చౌటుప్పల్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాల పైకి దూసుకెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ కదులుతున్న లారీలో నుంచి బయటకు దూకి పారిపోయాడు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ పలు కార్లు, బైక్లు ధ్వంసమయ్యాయి. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం చౌటుప్పల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోకి రాగానే అతివేగంగా ఉన్న లారీ అదుపుతప్పడంతో డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అదే వేగంతో మరో కారును సైతం ఢీకొట్టాడు. ముందున్న రద్దీని చూసిన లారీ డ్రైవర్ భయాందోళనకు గురై వేగంగా కదులుతున్న లారీలో నుంచి కిందకు దూకేశాడు. దీంతో లారీ అదే వేగంతో ముందు వరుసగా వెళ్తున్న కార్లను, ద్విచక్ర వాహనాలను ఢీకొట్టుకుంటూ విజయవాడ–హైదరాబాద్ హైవే సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లింది. లారీ బీభత్సాన్ని గమనించిన ఇతర వాహనదారులు, హైవే వెంట నిల్చున్న జనం బిగ్గరగా కేకలు వేశారు. కేకలు విన్న ప్రజానీకం అప్రమత్తమై లారీకి దూరంగా వెళ్లారు. అలా సర్వీస్ రోడ్డులో ఉన్న పూలు, అరటిపండ్ల బండ్లను ఢీకొట్టి లారీ ఆగిపోయింది. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదానికి లారీ అతివేగం కారణమా లేదా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనేది తెలియరాలేదు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మొత్తం ఆరు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, పలు పూలు, అరటిపండ్ల బండ్లు ధ్వంసమయ్యాయి. ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాల పైకి దూసుకెళ్లిన లారీ భయంతో రన్నింగ్లోనే లారీ దిగి పారిపోయిన డ్రైవర్ పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం చౌటుప్పల్ పట్టణం కేంద్రంలో ఘటన -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పుప్పాల వెంకటేశ్వర్లు(41) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. విధుల్లో భాగంగా హైదరాబాద్కు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురై పడిపోయారు. వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలానికి చెందిన వెంకటేశ్వర్లు గతేడాది భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతి పట్లు ఇన్స్పెక్టర్ రమేష్కుమార్, ఎస్ఐలు కుమారస్వామి, లక్ష్మీనారాయణ, జయరాజు సంతాపం ప్రకటించారు. -
షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని వస్తువులు దగ్ధం
నకిరేకల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. నకిరేకల్ పట్టణంలోని 2వ వార్డు పద్మశాలీ కాలనీ సమీపంలో సంద సుధీర్ నివాసముంటున్నాడు. సుధీర్ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి సోఫా పక్కన తన సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి బాత్రూంకు వెళ్లాడు. 10 నిమిషాల తర్వాత సుధీర్ బాత్రూంలో నుంచి బయటకు వచ్చేసరికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఇళ్లంతా పొగతో నిండిపోయింది. సుధీర్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బోరు మోటారు నీటితో మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఏసీ, వాషింగ్ మిషన్, ఫ్రిజ్, సోఫాతో ఇతర వస్తువులు కాలిపోయాయి. సుమారు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, 2వ వార్డు కౌన్సిలర్ రాచకొండ సునీల్ బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వం పరంగా నష్టపరిహారం అందజేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. చెరువులో పడి బాలుడు మృతిసూర్యాపేటటౌన్ : ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడు చెరువులో పడి మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన గొబ్బి కనకలక్ష్మి చిన్న కుమారుడు జీవన్కుమార్(15) ఈ నెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి తాళం వేసి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత వెతికినా జీవన్కుమార్ ఆచూకీ లభించకపోవడంతో అతడి తల్లి సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువులో జీవన్కుమార్ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సద్దుల చెరువు వద్దకు చేరుకుని చనిపోయింది జీవన్కుమారే అని నిర్ధారించారు. మృతుడి తల్లి కనకలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సూర్యాపేట పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడు ప్రస్తుతం పదో తరగతి చదువుతుండగా.. అతడి తండ్రి గతంలోనే మృతిచెందాడు. రైస్మిల్లులో కింద పడి ఆపరేటర్ మృతిపెన్పహాడ్: రైస్మిల్లులో పనిచేసే ఆపరేటర్ ప్రమాదవశాత్తు మిషన్ పైనుంచి కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం న్యూబంజారాహిల్స్ తండాలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ ఆంగోతు యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. న్యూబంజారాహిల్స్ తండాలోని శ్రీమహాలక్ష్మి మోడ్రన్ రైస్మిల్లులో గరిడేపల్లి మండలం కుత్బుషాపురం గ్రామానికి చెందిన సలిగంటి సోమయ్య(48) మిల్లు ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్ర సోమయ్య మిల్లులో మిషన్పై పనిచేస్తుండగా ప్రమాదశాత్తు పైనుంచి కిందపడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రైస్మిల్లు యాజమాని ఇస్లావత్ వెంకన్నపై మృతుడి కుమారుడు వినిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే ఉపాధి అవకాశాలు లభిస్తాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం ఎంజీయూ సెమినార్ హాల్లో యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కాంపిటస్ ఫార్మా ట్రైనింగ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీసీ పాల్గొని మాట్లాడారు. నేటి తరం విద్యార్థులకు నైపుణ్యాలే ప్రామాణికమని, నిత్య విద్యార్థులుగా నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కాంపిటస్ ఫార్మా ట్రైనింగ్ సెంటర్ ప్రతినిధి దీపక్వర్మ మాట్లాడుతూ.. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. నైపుణ్యాలు, ఇంటర్వ్యూ విధానం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్సాగర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల, కోఆర్డినేటర్ డాక్టర్ అభిలాష తదితరులు పాల్గొన్నారు.అవగాహన కార్యక్రమానికి హాజరైన వీసీ అల్తాఫ్ హుస్సేన్కు మొక్క అందజేస్తున్న విద్యార్థి ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
స్వాతంత్య్ర సమరయోధురాలు రాధమ్మ మృతి
కోదాడరూరల్: కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్ఆర్ కాలనీలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధురాలు జలగం రాధమ్మ(100) అనార్యోగంతో సోమవారం మృతిచెందింది. 1924లో సూర్యాపేట వద్ద గల నశీంపేటలో జన్మించిన ఆమె స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొంది. రజాకార్లతో జరిగిన పోరాటంలో అడవుల్లో తలదాచుకున్న యువతకు ఆమె కూలి అవతారమెత్తి ఆహారం అందించింది. అంతేకాకుండా 1952 మొదటి జనరల్ ఎలక్షన్ నుంచి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో ఆమె ఓటు హక్కు వినియోగించుకుని రికార్డు సృష్టించింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా.. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్ఆర్ కాలనీలో తన పెద్ద కుమారుడి ఇంట్లో మృతిచెందింది. రాధమ్మ మృతి పట్ల పలువురు నివాళులర్పించారు. 1952 నుంచి 2024 వరకు అన్ని జనరల్ ఎలక్షన్స్లో ఓటు వేసిన రికార్డు ఆమె సొంతం -
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
నల్లగొండ: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. ఈ కేసు వివరాలను సీఐ సోమవారం విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెరిక కరణ్ జయరాజ్, శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ శివశంకర్, వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన మార్బుల్ వర్కర్ పెద్దమాము వీరస్వామి స్నేహితులు. వీరు ముగ్గురు గంజాయికి బానిసై హైదరాబాద్లోని ధూల్పేటలో గంజాయి కొనుగోలు చేసి తాగేవారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో పెరిక కరణ్ జయరాజ్ డబ్బులు పెట్టుబడి పెట్టి శివశంకర్ను హైదరాబాద్కు పంపగా అతడు ధూల్పేటలో కిలో గంజాయి రూ.10వేలకు కొనుగోలు చేసి నల్లగొండకు తీసుకొచ్చేవాడు. వీరు ముగ్గురు కలిసి గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి నల్లగొండలో గంజాయి తాగే వ్యక్తులకు ఒక్కో ప్యాకెట్ రూ.500కు అమ్మేవారు. సోమవారం వీరు ముగ్గురు కలిసి నల్లగొండలో గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మారుస్తుండగా.. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40వేలు విలువ చేసే కిలోన్నర గంజాయి, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్న ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. రూ.40వేల విలువైన గంజాయి, 3 సెల్ఫోన్లు స్వాధీనం -
ఆదర్శ టీచర్లు.. ప్రభుత్వ బడుల్లోనే పిల్లలు
పెన్పహాడ్ : మండలంలోని అనాజిపురం పీఎంశ్రీ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను అదే పాఠశాలలో చేర్చి ఆదర్శంగా నిలిచారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వావిలాల సూర్యగౌడ్ తన కుమార్తె ఆరాధ్యను ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో, కుమారుడు విరాట్ సూర్యను 9వ తరగతిలో చేర్పించారు. మరో టీచర్ ఎ. లింగయ్య తన కుమార్తె రసజ్ఞను 6వ తరగతిలో చేర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ పిల్లలను ఆదర్శ పాఠశాలలో చేర్పించడంతో ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపే ఇతర తల్లిదండ్రులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. -
ఆలేరులో ఒకే రోజు మూడు చోరీలు
ఆలేరు: ఆలేరు పట్టణంలో దొంగలు ఒకే రోజు మూడు చోరీలకు పాల్పడ్డారు. సీఐ కొండల్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన పరత్వం చిన్నా, వస్పరి వెంకటేష్ చిక్కు వెంట్రుకల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం నిమిత్తం చిన్నా నెల రోజుల క్రితం, వెంకటేష్ వారం రోజుల కిత్రం వారి ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు చిన్నా, వెంకటేష్ ఇళ్ల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. చిన్నా ఇంట్లో 15తులాల వెండి, పావు తులం బంగారు పుస్తెలతాడు, వెంకటేష్ ఇంట్లో 3గ్రాముల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. బైక్ చోరీ..అదేవిధంగా ఆలేరు పట్టణంలోని నూనె మిల్లు రోడ్డులో నివాసముంటూ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే మరుపల్లి ప్రవీణ్ ఆదివారం రాత్రి తన పల్సర్ బైక్ను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆదివారం రాత్రి ఇద్దరు దుండగులు బైక్ను అపహరించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించామని సీఐ కొండల్రావు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.చిట్యాలలో..చిట్యాల: చిట్యాల పట్టణంలోని విద్యానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్లో నివాసముంటున్న బత్తిని మహేష్ ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం తన ఇంటికి తాళం వేసి ఆయన ఉద్యోగానికి వెళ్లగా.. ఆయన భార్య స్థానికంగా కుట్టు మిషన్ నేర్చుకునేందుకు వెళ్లింది. వారు సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని బీరువాలో దాచిన రెండు బంగారు లాకెట్లు, మాటీలు, వెండి ప్లేట్తో పాటు కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు మహేష్ చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
పోరుగడ్డకు అండగా ఉంటాం..
ఫ తుంగతుర్తి నియోజకవర్గానికిపూర్తిస్థాయిలో గోదావరి జలాలు తీసుకొస్తాం ఫ రైతును రాజుగా చేస్తేనే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది ఫ కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ స్థాయిలో ఉన్నాం.. ఫ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఫ తిరుమలగిరి సభలో లబ్ధిదారులకుకొత్త రేషన్కార్డుల పంపిణీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ, తిరుమలగిరి (తుంగతుర్తి) : ‘భూమి.. భుక్తి.. విముక్తి కోసం పోరాడిన గడ్డ తుంగతుర్తి.. ఈ గడ్డకు గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, దొడ్డి కొమురయ్య, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచి నల్లగొండ జిల్లాను ఎర్రగొండగా మార్చారు. నల్లగొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర. అలాంటి గడ్డ నుంచే ఈరోజు పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి ముందుగా రూ.34 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేదలకు రేషన్కార్డులు అందజేసి మాట్లాడారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో రావి నారాయణరెడ్డికి దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇక్కడి ప్రజలు తెలంగాణ పౌరుషాన్ని చూపించారని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. రైతు రాజుగా మారినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుందని తెలిపారు. రేషన్కార్డుల పంపిణీ చేయడం అంటే తెలంగాణలోని నాలుగు కోట్ల మంది పేదలకు సన్న బియ్యం వడ్డించడమేనని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహిరంగ సభకు 6 గంటలు ఆలస్యంగా వచ్చినా పెద్ద ఎత్తున జనం తరలివచ్చి కరెంటు లేకున్నా సెల్ఫోన్ లైట్ల వెలుతురులో ఎదురు చూసి మందుల సామేల్కు 60 వేల మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యకర్తల కష్టం వల్లే ఈ రోజు మనం అందరం గెలిచి, ఈ స్థానంలో ఉన్నామని, మనకు పదవులు రావడానికి కార్యకర్తలే కారణమని వారిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అందర్నీ సమన్వయం చేసుకొని కలుపుకు పోవాలన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని గొప్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్కుమార్రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, యశస్వినిరెడ్డి, రామచందర్నాయక్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, అద్దంకి దయాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు రమేష్రెడ్డి, సంకెపల్లి సుధీర్రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తేజస్నందలాల్ పవార్, ఇలా త్రిపాఠి, హన్మంతరావు, సివిల్ సప్లయీస్ కమిషనర్ బిఎస్.చౌహాన్ పాల్గొన్నారు. పదేళ్లు రాచరిక పాలన సాగింది – అడ్లూరు లక్ష్మణ్, జిల్లా ఇన్చార్జి మంత్రి 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో రాచరిక పాలన సాగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ విమర్శించారు. పది సంవత్సరాల్లో ఒక్కరికి కూడా రేషన్కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీలకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ, కులగణన, సన్న బియ్యం పంపిణీ, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, 59 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కాంగ్రెస్కు కంచుకోట – మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తుంగతుర్తి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి కాపాడారని, గతంలో మా తమ్ముడు రాజగోపాల్రెడ్డి, నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచామన్నారు. బిక్కేరు వాగుపై బ్రిడ్జి, నాగారం, అడ్డగూడూరు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆ ఆలోచన బీఆర్ఎస్కు రాలే.. – ఎంపీ చామలకిరణ్కుమార్రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేల్కు 50 వేలకు పైగా మెజార్టీ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు 70 వేలకు పైగా మెజార్టీ వచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సన్న బియ్యాన్ని అత్తగారింట్లో (హుజూర్నగర్లో) ప్రారంభించారని, రేషన్ కార్డులను పుట్టినింటిలో (తుంగతుర్తి నియోజకవర్గంలో) ప్రారంభించేలా చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి – ఎమ్మెల్యే మందుల సామేల్ తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, సమస్యలు పరిష్కరించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో 13 గ్రామాలకు దేవాదుల ద్వారా గోదావరి జలాలు అందివ్వాలని, ఎస్ఆర్ఎస్పీ కాల్వలు అసంపూర్తిగా ఉన్నాయని, లైనింగ్ చేయాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. సామేల్కు హితబోధ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మందుల సామెల్ రూ.50 వేలతో వస్తే.. నియోజకవర్గ ప్రజలు 60 వేల మెజార్టీతో గెలిపించారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. వారిని గుండెల్లో పెట్టుకుని ఎమ్మెల్యేను చేసిండ్రు. అందుకే వారి మంచి చెడుల్లో పాలుపంచుకోవాలి. సోనియాను నమ్మి గెలిపించారు. కడుపులో పెట్టుకోవాలి. ఒకరికి బాధ ఉంటది, ఒకరికి దుఃఖం ఉంటది, ఒకరికి కోపం ఉంటది. ఒకరికి ఆలోచన ఉంటది. మరొకరి ఆశ ఉంటంది.. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా నువ్వే ఓపికతో అన్నీ ఆలోచించి అందరినీ కలుపుకుపోవాలి. ఏదేనా సమస్య ఉంటే ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అవసరమైతే నా దృష్టికి తీసుకురండి మీ సమస్య పరిష్కరిస్తానన్నారు. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్సీలకు అవకాశం వస్తే అందులో నల్లగొండ జిల్లాకే ముగ్గురికి ఇచ్చాను. పీసీసీ అధ్యక్షుడు కూడా నల్లగొండ కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించాలన్నారు. ఇక్కడి ప్రజలకు కోపం వస్తే దాచుకోరని, గట్టిగా కోపంగా మాట్లాడతారని, అయితే, వివరించి చెబితే వింటారని, తనకు ఆ విశ్వాసం ఉందన్నారు. కార్యకర్తలను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం అన్నారు. టార్గెట్.. జగదీష్రెడ్డిఫ గంజాయి మొక్కతో పోల్చిన సీఎం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డిని టార్గెట్ చేసుకొని తిరులమగిరి బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘సూర్యాపేటలో ఉన్న మూడడుగులాయన ఈ సభకు సీఎం ఎట్ల వస్తరని అంటున్నరు. కేసీఆర్ ఉంటే గోదావరి జలాలు మూడు రోజులలో తీసుకువస్తానని అంటున్నరు. మరి పదేళ్లు ఎందుకు తేలేకపోయారు’ అని రేవంత్రెడ్డి దుయ్యబట్టారు. గోదావరి జలాలు తేవడమంటే మందులో సోడా కలిపినట్లు కాదన్నారు. ‘పదేళ్లు దొరగారి దగ్గర ఫామ్హౌస్లో గడ్డి పీకావా.. పదేళ్లలో ఒక్కనాడైనా ఆలోచించావా’ అని ప్రశ్నించారు. ‘మీ ఊరును మండలం చేశావు. మండలానికి అధికారులను తెచ్చుకున్నవు. మీ మండలానికి ఎంఆర్వో ఆఫీస్, పోలీస్ స్టేషన్ కూడా కట్టించుకోలేదు. వాటికి మా మందుల సామేల్ స్థలాన్ని ఇప్పించి కట్టిస్తున్నడు’ అని అన్నారు. తన ఊరికి ఏం చేయలేని ఆయన ముఖ్యమంత్రిని అడ్డుకుంటాడట. కాంగ్రెస్ కార్యకర్తలే ఆయన్ను చూసుకోవాలన్నారు. మా దామన్న ఒక్కడు చాలు. వారి కథకమామిషు ఏందో చూసుకుంటారని అన్నారు. ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఇంకా వారి గురించి ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. పదేళ్లు మంత్రిగా చేసిన ఆయన మొన్న ఎన్నికల్లో తులసి వనంలో గంజాయి మొక్కలా ఒక్కడే గెలిచిండు. ఆ మొక్కను కూడా వచ్చే ఎన్నికల్లో కూకటి వేళ్లతో పీకేయాలన్నారు. -
ఆదాయానికి గండి..!
అనుమతి ఒక్క ఫ్లోర్కు.. అంతకుమించి నిర్మాణాలు దివ్యాంగులకు ఆర్థిక భరోసామున్సిపాలిటీ వారీగా అసెస్మెంట్లు ● జిల్లా కేంద్రం వేగంగా విస్తరిస్తుండటంతో అదే స్థాయిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. రికార్డుల ప్రకారం కమర్షియల్, రెసిడెన్షియల్ 14,885 అసెస్మెంట్లు ఉండగా రూ.8.85 కోట్ల ఆస్తిపన్ను డిమాండ్ ఉంది. ఇందిరమ్మ కాలనీ, సింగనగూడెం, హైవే పక్కన ఉన్న ఇందిరమ్మ కాలనీలో నంబర్లు కేటాయించని నిర్మాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ● మోత్కూర్లో 5,089 నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో 4,921 ఇళ్లకు మాత్రమే నంబర్లు కేటాయించారు.168 నిర్మాణాల అసెస్మెంట్ జరగలేదు.వీటితో పాటు కొత్తగా చేపట్టిన నిర్మాణాలు రికార్డులకెక్కలేదు. ● చౌటుప్పల్లో 8,528 నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు అసెస్మెంట్ చేయలేదు. మరోవైపు కొత్త నిర్మాణాలు సాగుతున్నాయి. ● భూదాన్పోచంపల్లిలో 5,115 నిర్మాణాలకు గాను 4,973 అసెస్మెంట్లను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి ఆస్తిపన్ను నిర్ణయించారు. కొత్తగా వెలిసిన 192 నిర్మాణాలకు ఇంకా అసెస్మెంట్ చేయకపోవడంతో మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతోంది. ● ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 4,777 నిర్మాణాలు రికార్డుల్లో నమోదయ్యాయి. ఇంకా 450 నిర్మాణాలకు సరైన డాక్యుమెంట్లు లేవని నంబర్లు కేటాయించలేదు. సాక్షి, యాదాద్రి : మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. క్షేత్రస్థాయిలో సిబ్బంది సక్రమంగా అసెస్మెంట్ చేపడితేనే ఆస్తిపన్ను ఖరారవుతుంది. కానీ, కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యంతో అసెస్ మెంట్ ప్రక్రియలో పారదర్శకత ఉండడం లేదు. నిర్మాణాలు పూర్తికాగానే కొలతల ఆధారంగా పన్ను నిర్ణయించి వసూలు చేయకపోవడం, కొన్ని భవనాలను ఏళ్లుగా రికార్డుల్లో నమోదు చేయకపోవడం, మరికొన్నింటికి మ్యానవల్ నంబర్లు మంజూరు చేసినా ఆన్లైన్ చేయకపోవడం వంటి కారణాలతో మున్సిపల్ శాఖ ఏటా రూ.కోట్లలో ఆదాయం కోల్పోతోంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అడిగేవారేరి? భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. భువనగిరి పట్టణ పరిధిలో కమర్షియల్ స్థలాల ధర గజం రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోంది. కమర్షియల్ స్థలంలో భవన నిర్మాణ అనుమతి పొందాలంటే రూ.లక్షల్లో ఫీజు ఉంటుంది. కానీ, కొందరు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుండగా మరికొందరు ఒకటి, రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకొని అపైనే నిర్మిస్తున్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ మొదలుకొని బహుళ అంతస్తుల వరకు నిర్మాణాలున్నాయి. మరోవైపు అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించకపోవడం, పూర్తయిన నిర్మాణాలకు అసెస్మెంట్ చేయకపోవడం వల్ల ఆస్తిపన్నుకు గండిపడుతోంది. ఈ విధంగా మున్సిపాలిటీలు రెండు విధాలా ఆదాయం కోల్పోతున్నాయి. అనుమతుల జారీ ఇలా.. హెచ్ఎండీ పరిధిలో బహుళ అంతస్తులతో కూడిన వాణిజ్య భవనాలు, 1,200 గజాల పైబడిన రెసిడెన్షియల్ భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ జారీ చేస్తుంది. 50 నుంచి 1200 గజాల వరకు రెసిడెన్షియల్ నిర్మాణాలకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది. స్థలాన్ని బట్టి అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఇస్తుంది. హెచ్ఎండీఏ అనుతులు జారీ చేయడంతో వచ్చిన ఫీజులో కొంత మొత్తం మున్సిపాలిటీకి బదిలీ చేస్తారు. గత ప్రభుత్వం అదనపు అంతస్తులను క్రమబద్ధీకరించడం, ఫెనాల్టీ వసూలు చేసేది.. వీటిని నూతన మున్సిపల్ చట్టంలో తొలగించడం వల్ల ఆదాయం కోల్పోతున్నాయి. ఫ కమర్షియల్కు బదులుగా రెసిడెన్షియల్గా రికార్డుల్లో నమోదు ఫ నంబర్లు కేటాయించనినిర్మాణాలు వేలల్లో.. ఫ నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు ఫ ఏటా రూ.కోట్లలో ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీలు -
నిర్ణయించిన ధరకే ఇవ్వాలి
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మాలని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఇటుక బట్టీలు, స్టోన్క్రషర్ల యజమానులు, ఇసుక, సిమెంట్ డీలర్లు, మేసీ్త్రలు, స్టీల్, ఐరన్ దుకాణాల నిర్వాహకులతో సమావేశం ఏర్పా టు చేసి ధరలపై సమీక్షించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ప్రభుత్వం చెప్పిన ధరకు అమ్మాలని, అవసరమైతే ఆర్థికంగా లేని లబ్ధిదారులకు ఉద్దెర ఇచ్చి సహకరించాలని కోరారు. నిర్మాణ కూలి వీలైనంత తక్కువగా తీసుకోవాలని మేసీ్త్రలకు సూచించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, మైనింగ్ ఏడీ పాల్గొన్నారు. శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వాఅర్చనతో పాటు ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం,గజ వాహన సేవ, అమ్మవారి నిత్యకల్యాణం, జోడు సేవ నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి : 2025–26 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈనెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఈఓలు, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ నెల 20వ తేది ఆన్లైన్లో దరఖాస్తుచేసుకోవడానికి చివరి గడువుగా ఉందన్నారు. దరఖాస్తు ప్రతులను ఎంఈఓ ద్వారా డీ ఈఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. 16న మత్స్యగిరిలో వేలం పాటలు వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివిధ దుకాణాల నిర్వహణ, స్వా మివారి నిత్యకై ంకర్యాలకు పూజా సామగ్రి సమకూర్చుటకు ఈనెల 16న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మోహన్బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 5,18,28 తేదీల్లో వేలం నిర్వహించగా వివిధ కారణాల వల్ల వాయిదాపడినట్లు పేర్కొన్నారు. అసక్తి, అర్హత కలిగిన కాంట్రాక్టర్లు టెండర్ కం వేలంలో పాల్గొనాలని కోరారు. ఆలేరులో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్ ఆలేరు: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆలేరు పట్టణంలో పోలీసులు సోమవారం సాయంత్రం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. శ్రీకనకదుర్గ దేవాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు, దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సీఐ కొండల్రావు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాపేట, గుండాల,ఆలేరు ఎస్ఐలు అనిల్, సైదులు, వినయ్తోపాటు వందమంది ఆర్ముడ్ రిజ్వర్డు పోలీసులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే తెలంగాణలో స్వర్ణయుగం
చౌటుప్పల్ : బీజేపీతోనే తెలంగాణలో స్వర్ణయుగం వస్తుందని, అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు విజయసంకల్పంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమవారం నల్లగొండకు వెళ్తున్న ఆయన చౌటుప్పల్లో ఆగారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు తిలకందిద్ది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ప్రజలు చరమగీతం పాడేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్తోనే సాధ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. తమ పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సివెల్ల మహేందర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనూరి వీరారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్, ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల, మున్సిపల్ అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పనయాదవ్, నాయకులు శాగ చంద్రశేఖర్రెడ్డి, పోలోజు శ్రీధర్బాబు, కంచర్ల గోవర్ధన్రెడ్డి, రమనగోని దీపిక, ముత్యాల భూపాల్రెడ్డి, రిక్కల సుధాకర్రెడ్డి, కాయితి రమేష్గౌడ్, మునగాల తిరుపతిరెడ్డి, బత్తుల జంగయ్య, ఉబ్బు భిక్షపతి, ఊడుగు వెంకటేశం, గోశిక నీరజ, దిండు భాస్కర్, పబ్బు వంశీ, బుడ్డ సురేష్, ఉష్కాగుల నాగరాజు, కడారి అయిలయ్య, కడవేరు పాండు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు -
ప్రజావాణిలో 70 వినతులు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో వినతులు భారీగా వచ్చాయి. మొత్తం 70 అర్జీలు రాగా.. అత్యధికంగా 57 అర్జీలు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు వినతిపత్రాలు స్వీకరించారు. ● భువనగిరిలో ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చే యాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకులు మహ్మద్ షరీఫ్, లయిఖ్అహ్మద్ కోరారు. ● కొరటికల్లోని నల్లచెరువు అలుగు, కాలువ ఆక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామానికి చెందిన నరహరిగౌడ్ విన్నవించారు. ● భువనగిరిలోని 11వ వార్డు పరిధిలో సర్వే నం. 118లో 68 మందికి ప్లాట్లు కేటాయించి పొజిషన్ చూపలేదని లబ్ధిదారులు అర్జీ అందజేశారు.ఫ అత్యధికంగా భూ సమస్యలపైనే.. -
డెబిట్ కార్డు లేదా.. డోంట్ వర్రీ!
భువనగిరిటౌన్ : డెబిట్ కార్డు ఇంట్లో మరిచిపోయారా? డోంట్ వర్రీ! కార్డు లేకపోయినా చాలా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. చేతిలో ఉన్న ఫోన్లోని ఫీచర్స్ను వాడుకొని క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ తరహా ఏటీఎంను భువనగిరి పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. హితాచీ మనీస్పాట్ ఏటీఎం పేరుతో జగదేవ్పూర్ రోడ్డులో ఆవిష్కరించారు. క్రమంగా వీటిని రద్దీ ఏరియాలు, దర్శనీయ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. క్యాష్ డ్రా చేసే విధానం ఇలా.. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్ను కూడా మనం వాడుకోవచ్చు. ఇందుకోసం మన స్మార్ట్ఫోన్లోని యూపీఐ యాప్ను వాడాలి. తొలుత ఏటీఎం స్క్రీన్పై యూపీఐ కార్డ్లెస్ క్యాష్ ఆప్షన్న్పై క్లిక్ చేసి విత్డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఫోన్లోని బ్యాంకు యూపీఐ ఆధారిత యాప్తో దాన్ని స్కాన్న్ చేయాలి. యూపీఐ పిన్ను తప్పకుండా యాప్లో ఎంటర్ చేయాలి. ఆతరువాత ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. నగడు విత్డ్రా అయినట్లు సెల్ఫోన్కు మెసేజ్ కూడా వస్తుంది. డెబిట్ కార్డు అవసరం లేకుండానే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం నగదును పొందేలా నూతన విధానం తీసుకువచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. యూపీఐ ఫీచర్ ద్వారా క్యాష్ విత్ డ్రాకు అవకాశం ఫ భువనగిరిలో తొలిసారిగా కార్డ్లెస్ ఏటీఎం ఏర్పాటు ఫ త్వరలో మిగతా ప్రాంతాలకు.. -
మొన్న సన్న బియ్యం.. నేడు రేషన్ కార్డులు
సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజా సంక్షేమంలో కీలకమైన పథకాల అమలులో ఉమ్మడి నల్లగొండ జిల్లా వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా హు జూర్నగర్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి.. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్కార్డుల పంపిణీకి కూడా ఆయనే శ్రీకారం చుట్టనున్నారు. నిరుపేద కుటుంబాలకు ఆహారభద్రత కల్పించే ముఖ్యమైన రెండు పథకాల అమలుకు ఉమ్మడి నల్లగొండనే కేంద్ర బిందువు కావడం విశేషం. నెరవేరబోతున్న పేదల కల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా ఆన్లైన్, ఆఫ్లైన్లో, ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించింది. వాటిని పరిశీలించి అర్హులైన వారికి రేషన్కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో రేషన్కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నపేదల కల నెరవేరబోతోంది. గతంలో అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా కార్డు రాకపోవడంతో రేషన్ బియ్యం అందక ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాల్లో అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. సోమవారం సీఎం రేవంత్రెడ్డి రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన తరువాత జిల్లాల్లో పజాప్రతినిధులు లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తారు. మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అయినందున తిరుమలగిరిలో కార్యక్రమం ప్రారంభించేలా సీఎంను ఒప్పించారు. గతంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కూడా తన సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్నుంచే ప్రారంభింపజేశారు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. పేదలకు ఎంతో ఉపయోగపడే రెండు కీలకమైన పథకాలు మన జిల్లా నుంచే ప్రారంభం కావడం జిల్లాకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.నల్లగొండ జిల్లాకు 50,102 కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అత్యధికంగా లభించబోతున్న జిల్లా నల్లగొండ కావడం విశేషం. కార్డులు మంజూరైన పది జిల్లాల్లో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 4,65,998 రేషన్ కార్డులు ఉండగా, ఇప్పుడు మరో 50,102 కొత్త రేషన్ కార్డులు వస్తాయి. జిల్లాలో మొత్తంగా 5,16,100 రేషన్ కార్డుల ద్వారా 16,80,916 మందికి లబ్ధి చేకూరనుండగా, కార్డుల్లో అదనపు పేర్లు చేర్పుల ద్వారా మరో 1,06,559 మందికి లబ్ధి చేకూరనుంది. సూర్యాపేట జిల్లాలో 3,26,057 పాత కార్డులు ఉండగా, ఇప్పుడు 23,870 కొత్త కార్డులు రాబోతున్నాయి. జిల్లాలో మొత్తంగా 3,49,927 కార్డుల ద్వారా 10,57,863 మందికి లబ్ధి చేకూరనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు 2,16,831 రేషన్ కార్డులు ఉండగా, ఇప్పుడు 15,077 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఇలా మొత్తంగా 2,31,908 రేషన్ కార్డుల ద్వారా 7,29,746 మందికి లబ్ధి చేకూరనుంది. న్యూస్రీల్సంక్షేమంలో రెండు కీలక పథకాల అమలు మన దగ్గరి నుంచే.. ఫ ఉమ్మడి జిల్లాకు దక్కిన ప్రాధాన్యం ఫ నేడు తిరుమలగిరి సభలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ఫ రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండకే.. 50వేల మంది జనసమీకరణ ఫ 35 ఎకరాల్లో సభా ప్రాంగణం ఫ 11 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో సోమవారం చేపట్టనున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి 50 వేల మంది జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులు, సమ భావన సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తారని అంచనా వేశారు. జన సమీకరణకు 300 ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వెనక ఉన్న 35 ఎకరాల్లో సభా స్థలి ఏర్పాటు చేశారు. రెండు హెలిపాడ్లు, 11 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్కు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోని పరిసరాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ కటౌట్లతో నింపారు. -
డ్రమ్ సీడర్ పద్ధతితో అధిక దిగుబడులు
అధిక దిగుబడి సాధారణ సాగు కన్నా డ్రమ్ సీడర్ పద్ధతిలో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. సాళ్లలో కోనోవీడర్ ద్వారా కలుపు తీస్తే ఈ కలుపు మొక్కలు పంటకు పచ్చిరొట్ట ఎరువు అవుతుంది. పిలకలు, దుబ్బులు అధికంగా వస్తాయి. విత్తిన తర్వాత పంట కాలంలో రెండు నుంచి మూడుసార్లు కోనోవీడర్ తిప్పితే అధికంగా పంట దిగుబడి వస్తుంది. త్రిపురారం: వానాకాలం సీజన్ ప్రారంభంకావడంతో బోర్లు, బావుల కింద నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నారు పెంపకం చేపట్టారు. కూలీలతో నాట్లు వేయించడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి యేటా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమయం, పెట్టుబడి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కూలీల కొరతను అధిగమించడంతో పాటు పెట్టుబడి తగ్గించుకోవడానికి డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి విత్తనాలు నేరుగా విత్తుకుంటే సమయం ఆదా అవ్వడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచిస్తున్నారు. డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి విత్తనాలు విత్తుకునే పద్ధతిపై ఆయన సలహాలు, సూచనలు.. అనువైన నేలలు సాధారణంగా వరి సాగు చేసుకునే అన్ని రకాల నేలల్లో డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి విత్తనాలను విత్తి సాగు చేసుకోవచ్చు. ముంపునకు గురయ్యే భూములు, చౌడు, క్షారము, ఆమ్ల నేలలు అనుకూలం కాదు. వరి విత్తన మోతాదు వరి రకాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 15 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వేరు వ్యవస్థ ధృడంగా ఉండి కాండం గట్టిగా ఏర్పడి అకాల వర్షాలు, ఈదురు గాలులకు పడిపోకుండా ఉండే అనువైన రకాలను శాస్త్రవేత్తల సూచనలతో ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతి. అవసరమైతే రైతులకు ఇష్టమైన ఏ వరి రకం విత్తనాలనైనా ఎంచుకోవచ్చు. ఈ పద్ధతిలో ఒక్క ఎకరం పొలం విత్తుకోవడానికి ఇద్దరు కూలీలు అవసరమవుతారు. డ్రమ్ సీడర్ లాగడానికి ఒక వ్యక్తి, గింజలు నింపడానికి ఒక వ్యక్తి అవసరమవుతారు. ట్రాక్టర్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేసిన డ్రమ్ సీడర్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రధాన పొలం తయారీ విధానం సాధారణ పద్ధతిలో వరి నాటడానికి పొలాన్ని తయారు చేసుకున్నట్లుగానే డ్రమ్ సీడర్ పద్ధతికి కూడా పొలాన్ని తయారు చేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత చదునుగా చేసుకుంటే ఉత్తమం. చిన్న మడులుగా ఉంటే నీరు పెట్టడానికి విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా ఉంటే చాలు. ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తాలనుకున్న రోజే ఆఖరి దమ్ము చేసి మండె కట్టి విత్తనాలను విత్తుకోవాలి. విత్తుకునే పద్ధతి లీటరు నీటికి గ్రాము చొప్పున కార్భండిజమ్ కలిపిన ద్రావణంలో విత్తనాలు 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండె కట్టాలి. కొద్దిగా కొమ్ము మలిగిన గింజలను డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకోవచ్చు. నారు మడిలో నీటి యాజమాన్యం ఏవిధంగా చేస్తామో వరి మొదటి దశలో అదేవిధమైన పద్ధతిని అవలంబించాలి. డ్రమ్ సీడర్ పరికరానికి అవసరాన్ని బట్టి ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి డ్రమ్ముకు 20 సె.మీ. దూరంలో రెండు చివర్ల వరకు రంధ్రాలు ఉంటాయి. ఈ డ్రమ్ముల్లో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. మొలకెత్తిన గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ములో మూడో వంతు మాత్రమే గింజులు నింపాలి. గింజలను నింపిన డ్రమ్ములను లాగితే 8 వరుసలలో వరుసకు వరుసకు మధ్య దూరం 20సెం.మీ., వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5 నుంచి 8సెం.మీ. ఉంటుంది. ఒక్కో కుదురులో 5 నుంచి 6 గింజలు రాలడం జరుగుతుంది. సన్నగింజ రకం విత్తనాలకు రంధ్రం వదిలి మరో రంధ్రం మూయాలి. ప్రతి 15 వరుసలకు అడుగు వెడల్పు కాలి బాటలు ఉంచాలి. తాడు ఉపయోగించి డ్రమ్ లాగితే వరుసలు బాగా వస్తాయి. కోనోవీడర్ తిప్పడానికి వీలుగా ఉంటుంది. కలుపు నివారణ చర్యలు విత్తిన మూడో రోజున పైరాజోసల్ఫూరాన్ ఇథైల్ 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా బెందియోకార్బ్ 1.25 లీటర్లు లేదా బుటాక్లోర్ + సేఫెసర్ 1.25 ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి విత్తిన 8 నుంచి 10 రోజులలోపు పొలంలో పల్చని నీరు ఉంచి చల్లుకోవాలి. దమ్ము చేసిన పొలంలో మండె కట్టిన విత్తనాన్ని పొలమంత సమంగా నీటి పొర నుంచి వెదజల్లాలి. ఫ కంపాసాగర్ కేవీకే సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ -
1200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
తిరుమలగిరి (తుంగతుర్తి): సీఎం రేవంత్రెడ్డి తిరుమలగిరిలో సోమవారం పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ తెలిపారు. ఆదివారం తిరుమలగిరిలో పోలీస్ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. సీఎం బహిరంగ సభకు 1200 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పునరుద్ధరించాలని ఆదేశించారు. నలుగురు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 33 మంది ఇన్స్పెక్టర్లు, 110 మంది ఎస్ఐలు, 185 మంది హెడ్కానిస్టేబుళ్లు, 650మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవీందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీధర్, శ్రీనివాసరావు, సురేష్కుమార్, మొగులయ్య, రవి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ ప్రదేశాల కేటాయింపు ఫ సూర్యాపేట, తొర్రూరు, జనగామ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, పెద్ద వాహనాలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, సంత నందు ఏర్పాటు చేసి పి6, పి7 ప్రదేశాల్లో నిలుపుకోవాలి. ఫ సూర్యాపేట, తొర్రూరు, జనగామ నుంచి వచ్చే ట్రాక్టర్లు, డీసీఎంలు తిరుమలగిరి క్రాస్ రోడ్డు నుంచి జనగామ వెళ్లే రోడ్డు మార్గంలో ఎడమ వైపున సంత వెనకాల స్థలంలో ఏర్పాటు చేసిన పీ4 పార్కింగ్ స్థలంలో నిలపాలి. ఫ జనగామ, తొర్రూరు, సూర్యాపేట వైపు వచ్చే కార్లు, ఆటోలు, మినీ వ్యాన్లు వలిగొండ రోడ్డులో వచ్చి చెరువుకట్ట మార్గంలో ఉన్న పీ2, పీ11, పీ5 పార్కింగ్ ప్రదేశాల్లో నిలుపుకోవాలి. ఫ తొర్రూరు, సూర్యాపేట, జనగామ వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు వలిగొండ మార్గంలో చెరువు కట్ట రోడ్డులో ఏర్పాటు చేసిన పీ3 స్థలంలో నిలుపుకోవాలి. ఫ వలిగొండ మార్గంలో వచ్చే ఆర్టీసీ బస్సులు, పెద్ద వాహనాలు, అదే మార్గంలో ఉన్న ఐకేపీ సెంటర్లో ఏర్పాటు చేసిన పీ10 పార్కింగ్ ప్రదేశంలో, వెంచర్లో ఏర్పాటు చేసిన పీ8 స్థలంలో వాహనాలు నిలుపుకోవాలి. ఫ వలిగొండ వైపు నుంచి వచ్చే కార్లు, ఆటోలు, మినీ వ్యాన్లు వెంచర్లో ఏర్పాటు చేసిన పీ9 పార్కింగ్ ప్రదేశంలో నిలపాలి. ఫ సూర్యాపేట ఎస్పీ నర్సింహ -
రేషన్కార్డుల పంపిణీకి భారీగా తరలిరావాలి
తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరిలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా చేపడుతున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోరారు. ఆదివారం తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభా స్థలిని పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ప్రమోద్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు నరేష్, వీరేష్, లక్ష్మయ్య, జమ్మిలాల్ పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వలిగొండ: వలిగొండ మండలం ఎం.తుర్కపల్లిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం. తుర్కపల్లి గ్రామానికి చెందిన మాసంపల్లి శ్రీశైలం(45) ఆదివారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడాన్ని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల వెనుక, ఎడమ కంటిపై భాగంలో గాయాలను గుర్తించినట్లు తెలిపారు. శ్రీశైలం భార్య, కుమారుడు బంధువుల దశదిన కర్మకు వెళ్లగా.. వారికి సమాచారం ఇవ్వడంతో వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. జాల గ్రామంలో.. రాజాపేట: రాజాపేట మండలం జాల గ్రామానికి చెందిన వ్యక్తి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జాల గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (55) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఇంట్లో ఒక్కడే నివాసముంటున్నాడు. పాముకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని కాశగూడేనికి చెందిన వ్యక్తి పని కోసం ఇస్మాయిల్ను తీసుకువెళ్దామని ఆదివారం ఉదయం అతడి ఇంటి వద్దకు వచ్చి ఎంత పిలిచినా పలకలేదు. దీంతో కిటికీ లోంచి ఇంట్లోకి తొంగి చూడగా ఇస్మాయిల్ మృతిచెంది ఉన్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో మూడు రోజుల క్రితమే ఇస్మాయిల్ మృతిచెంది ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. -
రేడియోతోనే కాలక్షేపం
టీవీ చూడాలనిపించదుఇంట్లో టీవీ ఉన్నప్పటికి నాకు మాత్రం టీవీ చూడాలనిపించదు. ఎక్కువగా రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలనే వింటుంటాను. నాకు పెళ్లిలో కూడా రేడియో ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే మా ఇంట్లో రేడియో ఉండడంతో రేడియో ఇవ్వమని అడగలేదు. ప్రస్తుతం నా వయస్సు 60సంవత్సరాలకు పైబడినా ఇంకా రేడియోను వాడుతుంటాను. – చింతకుంట్ల సుదర్శన్రెడ్డితిప్పర్తి: 1990ల్లో ప్రసార సాధనాలు లేని సమయంలో వార్తలు వినడానికి గ్రామాల్లో ధనికుల ఇళ్లలో ఎక్కువగా రేడియోలు ఉండేవి. కాలక్రమేణా అవి కనుమరుగై టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు వచ్చాయి. కానీ నేటి తరంలో కూడా రేడియోను వాడుతున్నాడు తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం గ్రామానికి చెందిన రైతు చింతకుంట్ల సుదర్శన్రెడ్డి. తనకు ఊహా తెలిసినప్పటి నుంచి రేడియో వాడుతున్నానని, 50 ఏళ్లుగా రేడియో వింటున్నా.. ఇప్పటికీ తనకు ఇంకా ఆసక్తి తగ్గలేదని సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. పొలం దగ్గర వెళ్లినప్పుడు రేడియోను కూడా వెంట తీసుకెళ్తానని, అందులో పాటలు, జానపద గేయాలు, బుర్రకథలు, వ్యసాయ సమాచారం, అన్నదాతల సందేహాలను వింటానని ఆయన చెబుతున్నారు. గతంలో పాత రేడియో ఉండేదని, ప్రస్తుతం కొత్త రకం రేడియో తీసుకున్నానని వివరించారు. తన తండ్రి దగ్గర ఉన్న రేడియోను తనకు 30 సంవత్సరాలు వచ్చే వరకు వాడానని, ఆ తర్వాత ఆ రేడియో రిపేర్కు రావడంతో మార్చానని, ఇప్పటి వరకు ఐదు రేడియోలను వాడానని పేర్కొన్నారు.ఫ 50 సంవత్సరాలుగా రేడియో వాడుతున్న రైతు -
● ఆలిగా.. అమ్మగా..
మర్రిగూడ: కష్టసుఖా ల్లో తోడుగా ఉంటానని పెళ్లిలో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటోంది మర్రి గూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన భిక్షమమ్మ. ఆదివారం సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన వైద్య శిబిరానికి ఆమె తన భర్త రత్నయ్యను తీసుకొని వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త రత్నయ్యకు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి తినిపించింది. వీరికి ముగ్గురు ఆడపిల్లల సంతానం కాగా.. అందరికీ వివాహాలు చేశారు. వీరు గతంలో మిరపకాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. -
సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు
ఫ సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ తిరుమలగిరి (తుంగతుర్తి) : నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ఆదివారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరం ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, జెడ్పీసీఈఓ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్కుమార్ ఉన్నారు. -
గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్
చౌటుప్పల్: గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చౌటుప్పల్ బస్టాండ్లో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం చాప్రా జిల్లా బనియాపూర్ మండలం హర్పూర్కర్హా గ్రామానికి చెందిన సునీల్ రాయ్, బిట్టు కుమార్ టిప్పర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారిద్దరు తమ ఊర్లో గంజాయిని చాక్లెట్లు రూపంలో మార్చుకొని మూడు రోజుల క్రితం రైలులో బయల్దేరి ఆదివారం హైదరాబాద్కు వచ్చారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారితో మరో వ్యక్తి రావాల్సి ఉన్నందున మార్గమధ్యలో ఆదివారం సాయంత్రం చౌటుప్పల్లో దిగారు. తమ వెంట తెచ్చుకున్న బ్యాగులతో బస్టాండ్లో తిరుగుతుండగా.. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు అటుగా వచ్చారు. పోలీసులను చూసి వారిద్దరు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పోలీసులు వారి వద్దకు వెళ్లి బ్యాగులను తనిఖీ చేయగా.. దుస్తుల నడుమ దాచి ఉంచిన 8 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు, సెల్ఫోన్ లభించాయి. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చిట్యాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. చిట్యాల ఏఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం ఇస్మాయిన్పల్లి గ్రామానికి చెందిన మాద నర్సింహ(50) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ఈ నెల 10వ తేదీన పని నిమిత్తం బైక్పై మునుగోడుకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో చిట్యాల మండలం ఎలికట్టె గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన గూడ్స్ వాహనం నర్సింహ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింహను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఆదివారం మృతుడి కుమారుడు హరిక్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి.. మఠంపల్లి: మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి సాముల కోటిరెడ్డి(45) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కోటిరెడ్డి 22ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసి ఇటీవల రిటైర్డ్ అయ్యారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆటో బోల్తా.. యువకుడి మృతి పెన్పహాడ్: ఆటో బోల్తాపడి గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ హెడ్కానిస్టేబుల్ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన తండ సైదులు(29) ప్లంబర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం శనివారం సూర్యాపేటకు వెళ్లి ఆటోలో తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. అనంతారం గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ సమీర్ రోడ్డుపై గేదెలను తప్పించబోయే క్రమంలో ఆటో బోల్తా పడింది. సైదులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు సైదులు కళ్లను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో..చిట్యాల: ఇంట్లో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం వెలిమినేడులో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన లక్ష్మారెడ్డి వెలిమినేడు గ్రామంలో రాంకీ సంస్థకు చెందిన భూములను పర్యవేక్షిస్తూ గ్రామంలో ఒక్కడే నివాసముంటున్నాడు. ఆదివారం ఉదయం లక్ష్మారెడ్డి ఇంట్లో ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. చుట్టుపక్కల వారు గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
నిషేధిత అల్ఫ్రాజోలం మత్తు పదార్థం పట్టివేత
భూదాన్పోచంపల్లి: కల్లులో కలిపే నిషేధిత అల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థాన్ని ఓ వ్యక్తి అక్రమంగా స్కూటీలో రవాణా చేస్తుండగా శుక్రవారం సాయంత్రం భూదాన్పోచంపల్లి మండలం పిలాయిపల్లి శివారులో ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. భువనగిరి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ పి. నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పిలాయిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని రంగయ్య నిషేధిత అల్ఫ్రాజోలంను స్కూటీలో తరలిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు గ్రామ శివారులో ఎకై ్సజ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని 250 గ్రాముల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. రంగ శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి అల్ఫ్రాజోలం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దీంతో సిద్దగోని రంగయ్యతో పాటు రంగ శ్రీనివాస్పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. రంగయ్యను శనివారం కోర్టులో రిమాండ్ చేశామని, రంగ శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. చెరువులో జారిపడి యువకుడి మృతి కోదాడరూరల్: బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో గురువారం రాత్రి జరిగగా.. శనివారం వెలుగులోకి వచ్చింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాపుగల్లు గ్రామానికి చెందిన కరుణాకర్(33) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. అతడు గురువారం రాత్రి గ్రామ పరిధిలోని చెరువు కట్ట వద్దకు బహిర్భూమికి వెళ్లగా.. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతిచెందాడు. అర్ధరాత్రి అయినా కరుణాకర్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం ఓ వ్యక్తి చెరువు వైపు వెళ్లగా చెరువులో మృతదేహం తేలియాడుతుండటం గమనించి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయగా.. అది కరుణాకర్ మృతదేహంగా గుర్తించారు. మృతుడి తండ్రి నర్సింహరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్ పోలీసులు తెలిపారు. -
నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు
నల్లగొండ: నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్లో చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దండంపల్లి వద్ద రూ.8 కోట్లతో నిర్మించనున్న ఆటోమెటిక్ వెహికిల్ టెస్టింగ్ సెంటర్(ఏటీసీ) భవన నిర్మాణానికి శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వాహనాల వెనుక రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునేలా జీఓ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చేలా ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, వాహనాలకు ఫిట్నెస్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకు ఆటోమెటిక్ వెహికిల్ టెస్టింగ్ స్టేషన్ ఉపయోగపడుతుందన్నారు. రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 17ఆటోమెటిక్ వెహికిల్ టెస్టింగ్ స్టేషన్లను ఒక్కో దానిని రూ.8 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా శాఖ ద్వారా స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చామని, ఏటీసీ వల్ల ప్రతి వాహనం వాహన సారథి పరిధిలోకి వచ్చేలా తెలంగాణ వాహన సారథిలో భాగస్వామ్యం చేశామన్నారు. ట్రాఫిక్ అవేర్నెస్పై క్యాంపుల నిర్వహణ, పాఠశాల విద్యార్థులకు క్లబ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్లో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు ఆటోమెటిక్గా నిర్వహించి ఆ టెస్టులో పాసైతేనే లైసెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ దండంపల్లిలో ఆటోమెటిక్ వెహికిల్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం : మంత్రి కోమటిరెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల గడిచిన 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాకు 70 ఎలక్ట్రికల్ బస్సులు వేయగా.. నార్కట్పల్లికి 10 బస్సులు, మిగతావి ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నట్లు తెలిపారు. నార్కట్పల్లికి 80 కొత్త బస్సులు కావాలని అదేవిధంగా నూతన డిపో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీవాణి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు పాల్గొన్నారు. -
అభినవ గాంధీ ‘దొడ్డా’ కన్నుమూత
ప్రభుత్వం నుంచి రూ.50 వేలు ఆర్థికసాయందొడ్డా నారాయణరావు అంత్యక్రియలకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.50వేలను శనివారం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ దొడ్డా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, చిలుకూరు తహసీల్దార్ ధృవకుమార్, ఎస్ఐ సురభి రాంబాబు, ఆర్ఐ మంత్రిప్రగడ సీతరామచందర్రావు తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు: సీపీఐ సీనియర్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అభినవ గాంధీగా పేరుగాంచిన దొడ్డా నారాయణరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి చిలుకూరులోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. నాటి నిజాం నిరంకుంశ పాలనకు, బేతవోలు ప్రాంతంలోని జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన అనేక పోరాటాలు నిర్వహించి పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. అంతేకాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని సారా ఉద్యమం వరకు తన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు. అన్న స్ఫూర్తితో ఉద్యమంలోకి.. చిలుకూరు గ్రామానికి చెందిన దొడ్డా అప్పయ్య, వెంకమ్మ దంపతులకు ఏడుగురు మగ సంతానం. వారిలో ఆరోవాడు దొడ్డా నారాయణరావు. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య తమ్ముడే దొడ్డా నారాయణరావు. 1941లో చిలుకూరు రావినారాయరెడ్డి కాలనీలో 8వ ఆంధ్ర మహాసభ నిర్వహించడంలో నారాయణరావు అన్న దొడ్డా నర్సయ్య కీలకపాత్ర పోషించారు. ఆనాడు వడ్డీ వ్యాపారులు దొంగ లెక్కలు, పటేల్ పట్వారీ వ్యవస్థ, అక్రమ శిస్తు వసూలు తదితర దోపిడీలకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఆంధ్ర మహాసభ కార్యకర్తలకు దొడ్డా నర్సయ్య నాయకత్వం వహించారు. ఇవన్నీ దొడ్డా నారాయణరావును ప్రభావితం చేశాయి. 1947 కంటే ముందు రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కొన్ని సందర్భాల్లో దొడ్డా నర్సయ్య, వేనేపల్లి అంజయ్య లాంటి వ్యక్తులు అజ్ఞాతంలో వెళ్లారు. ఆ సమయంలో దొడ్డా నారాయణరావు స్థానికంగా ఉంటూ వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండేవాడు. 1948 ప్రారంభంలో చిలుకూరులో ఐదుగురు సభ్యులతో కమ్యూనిస్టు పార్టీ సెల్ ఏర్పాటు చేసి నారాయణరావును కార్యదర్శిగా నియమించారు. స్వాతంత్య్రం అనంతరం పార్టీపై నిర్భందం పెరిగింది. దీనికి తోడు రహస్య జీవితం గడుపుతున్న కొంతమంది దళ సభ్యులకు తను సమాచారం అందిస్తున్నట్లుగా రజాకార్లకు తెలిసి అనుమానం వచ్చి నారాయణరావును ప్రశ్నించారు. బేతవోలు మక్తేదారికి వ్యతిరేకంగా నిర్వహించిన పలు ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. నాలుగు దశాబ్ధాల పాటు ప్రజాప్రతినిధిగా.. చిలుకూరుకు 25 సంవత్సరాలు సర్పంచ్గా, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు చిలుకూరు మండలానికి ఎంపీపీగా, చిలుకూరు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా 5ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన చొరవతోనే చిలుకూరులో గ్రంథాలయం ఏర్పాటైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా వరుసగా రెండు పర్యాయాలు 6ఏళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, పార్టీ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భార్య మృతితో కుంగిపోయి.. దొడ్డా నారాయణరావు భార్య సక్కుబాయమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి ఆయన మానసికంగా కుంగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురై మృతిచెందారు. నారాయణరావుకు ముగ్గురు కుమారులు సంతానం. వారిలో పెద్ద కుమారులు ఇద్దరు రమేష్, సురేష్ తండ్రి బాటలోనే రాజకీయాల్లో కొనసాగుతుండగా.. చిన్న కుమారుడు శ్రీధర్ మాత్రం లాయర్గా పనిచేస్తున్నాడు. ఫ అనారోగ్యంతో మృతిచెందిన దొడ్డా నారాయణరావు ఫ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర ఫ 40ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా, సీపీఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు 16 నెలలు జైలు జీవితం స్వాత్రంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన దొడ్డా నారాయణరావు స్వగ్రామంలోని సమస్యలపై కూడా ఉద్యమాలు చేశారు. అనంతరం 1959లో చిలుకూరు గ్రామ ప్రథమ సర్పంచ్గా దొడ్డా నారాయణరావు ఎన్నికయ్యారు. భారత్, చైనా యుద్ధం సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలులో ఉంచి 16 నెలల అనంతరం విడుదల చేశారు. -
గంజాయి విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
ఫ 4కిలోల గంజాయి స్వాధీనం సూర్యాపేటటౌన్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన గండమల్ల దుర్గాప్రసాద్, సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన చెరుకు దీపక్ ఐదు రోజుల క్రితం బైక్పై ఏపీలోని సీలేరు ప్రాంతానికి వెళ్లి అక్కడ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కిలో రూ.3వేల చొప్పున నాలుగు కిలోలు గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేటకు తీసుకొచ్చి పట్టణంలోని దుర్గాప్రసాద్ రూంలో దాచిపెట్టారు. శుక్రవారం వారిద్దరితో పాటు పట్టణంలోని చర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జానీపాషా కలిసి గంజాయి పంచుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ రూం వద్దకు జానీపాషా వచ్చాడు. వారిద్దరు గంజాయి పంచుకుంటుండగా.. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. చెరుకు దీపక్ను తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుల నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఫ అరుణాచలంలో హత్యకు గరైన విద్యాసాగర్ తండ్రి ఆవేదన -
మంత్రి క్యాంపు కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణంలోని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్తో వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలంకలం సృష్టించింది. నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ల్యాడర్ వాహణానికి ఔట్ సోర్సింగ్ కింద డ్రైవర్గా పనిచేసిన కరుణాకర్ శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏడు నెలల కిత్రం అతన్ని విధుల నుంచి మున్సిపల్ అధికారులు తొలగించడంతో తన ఉపాధి పోయిందని మంత్రిని కలిసేందుకు వచ్చాడు. పెట్రోల్ బాటిల్తో రావడంతో దానిని చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. అతని చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. వెంటనే అతన్ని నల్లగొండ టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అప్పటికి క్యాంపు కార్యాలయానికి మంత్రి చేరుకోలేదు. నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన ముకిరాల కరుణాకర్ కొంతకాలం డ్రైవర్గా ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో పలుమార్లు మద్యం సేవించడం కారణంగా ల్యాడర్పైకి ఎక్కిన ఎలక్ట్రిషన్ కింద పడిపోయినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వీధి దీపాలు, సెంట్రల్ పోల్స్కు లైట్లు బిగించడానికి ల్యాడర్ వాహనం ఉపయోగిస్తారు. ల్యాడర్ బకెట్లో నిలబడి స్తంభానికి లైట్లు మరమ్మతులు, కొత్తవి అమర్చడం లాంటివి చేస్తుంటారు. అయితే, ల్యాడర్ డ్రైవర్ మద్యం తాగి వచ్చిన కారణంగా ఏడు నెలల క్రితం విధుల నుంచి పూర్తిగా తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్అహ్మద్ తెలిపారు. కాగా, స్థానిక నాయకుల కారణంగానే తన భర్తను విధుల నుంచి తొలగించినట్లు బాధితుని భార్య ఆరోపించింది. -
ఆదర్శప్రాయుడు దొడ్డా నారాయణరావు
కమ్యూనిస్టు యోధుడు దొడ్డా నారాయణరావు ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. శనివారం దొడ్డా నారాయణరావు అంతిమ యాత్రలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకప్రాత పోషించిన మహోన్నత వ్యక్తి దొడ్డా నారాయణరావు అని అన్నారు. ప్రతిఒక్కరూ నారాయణరావును ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషిచేయాలని అన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నారాయణరావు మృతి సీపీఐకి తీరని లోటని అన్నారు. ఉమ్మడి జిల్లాలో దొడ్డా నారాయణరావుకు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రముఖులు.. దొడ్డా నారాయణరావు అంతిమ యాత్రలో కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతిరెడ్డి పాల్గొని ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్, ఉజ్జిని యాదగిరిరావు, జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పశ్య పద్మ, వనజ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, బొమ్మగాని ప్రభాకర్, సూర్యాపేట, భువనగిరి జిల్లాల సీపీఐ కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, శ్రీరాములు, సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు ఉజ్జిని రత్తాకర్, పల్లా నరసింహారెడ్డి, ఉస్తెల సృజన, కేవీఎల్, కొండా కోటయ్య, చేపూరి కొండలు, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి మల్లెల ఆదిరెడ్డి తదితరులు దొడ్డా నారాయణరావు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. -
యాదగిరిగుట్టకు తరలివచ్చిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. రెండో శనివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయ పరిసరాలు, ముఖ మండపం క్యూలైన్, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. వివిధ పూజలతో స్వామివారికి నిత్యాదాయం రూ.31,99,413 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
లెక్కల్లోనే మొక్కలు!
పది విడతల్లో 5.26 కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలు సాక్షి,యాదాద్రి : లెక్కల కోసమే మొక్కలు నాటినట్టుగా ఉంది అధికారుల తీరు. నాటడం, పెంపకం లెక్కలు ఘనంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 2016 నుంచి 2024 వరకు పది విడతల్లో 5కోట్ల 26లక్షల మొక్కలు నాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నాటిన మొక్కలన్నింటికీ జియోట్యాగింగ్ చేసినట్లు నివేదికలున్నా 98 శాతం కనిపించడం లేదు. నాటుడు.. నరుకుడు మానవ శ్రేయస్సే లక్ష్యంగా పచ్చదనం పెంపునకు గత ప్రభుత్వం హయాంలో సామాజిక అడువులు పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణకు హరితహారం పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే కార్యక్రమాన్ని ప్రస్తుత సర్కార్ వనమహోత్సవం పేరుతో కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమం కింద పల్లెలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఆవరణలు, ఇళ్లలో, రోడ్ల వెంబడి కోట్లాది మొక్కలు నాటారు. కానీ, కొన్ని శాఖలు ప్రణాళిక లేకుండా మొక్కలు నాటుతుండటంతో లక్ష్యం నెరవేరడం లేదు. ముఖ్యంగా విద్యుత్ లైన్ల కింద నాటిన మొక్కలు ఏపుగా పెరగగానే తీగలకు అడ్డొస్తున్నాయని ఆ శాఖ అధికారులు వాటిని తొలగిస్తున్నారు. అలాగే రహదారుల విస్తరణలో భాగంగా చెట్లను తొలగించాల్సి వస్తుంది. మరోవైపు అటవీప్రాంతాల్లో నాటిన మొక్కలు ఎదగగానే కొందరు వ్యక్తులు కలప కోసం నరికి బొగ్గుబట్టీలు, తమ అవసరాలకు తరలిస్తున్నారు. పెరగని అటవీ విస్తీర్ణం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3,25,500 హెక్టార్లు. ఇందులో 3.80 శాతం అంటే 11,733.706 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిని 33.33 శాతం పెంచాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అటవీ బ్లాక్లలో 884 హెక్టార్లలో 42.821 లక్షల మొక్కలు నాటగా.. అందులో 20 లక్షల మొక్కలను సంరక్షించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పది శాతం కూడా కనిపించడం లేదు. మొక్కలను పెంచడంతో పాటు హెచ్ఎండీ పరిధిలోని 10 ఫారెస్ట్ బ్లాక్లలో అర్బన్ ఫారెస్ట్ పార్క్లు ఏర్పాటు చేశారు. వాటిలో కూడా చాలా మొక్కలు లేవు. రూ.కోట్ల నిధులు వృథా మొక్కల సంరక్షణ చర్యల్లో భాగంగా ట్రీ గార్డులు, మొక్కకు ఊతమిచ్చే కర్రలు, గుంతలు తీయడం, నీరు పోయడం వంటి పనునులకు గ్రీన్ బడ్జెట్, గ్రీన్ఫండ్ పేరుతో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు 10 శాతం నిధులను ఖర్చు చేశాయి. కానీ, ఖర్చు లెక్కల్లో చూపుతున్నా మొక్కలు మాత్రం కనిపించడం లేదు. ఆయా శాఖలు పేరుకే మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. వాటి సంరక్షణ గురించి పట్టించుకోవడం లేదని, ఫలితంగా రూ.కోట్లు వృథా అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇళ్లలో పెంచే మొక్కలు ఇవీ.. హోంప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా కానుగ, సీతాఫలం, అల్లనేరేడు, బహునియా, వేప, గుల్మొహర్, వెలగ, టెకోమా, రావి, నెమలినారా, చింత, చైనాబార్, స్పతోడియా, జామ మొక్కలు పంపిణీ చేస్తారు. వీటిని పట్టణాలకు తరలించారు.11వ విడత లక్ష్యం.. 31.54 లక్షల మొక్కలు 11వ విడత వనమహోత్సవానికి అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 31.54లక్షలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. ఇందుకోసం అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీల పర్యవేక్షణలో జిల్లాలో 428 నర్సరీలు ఏర్పాటు చేశాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు నర్సరీల్లో 1.75 లక్షలు, డీఆర్డీఓ 418 నర్సరీల్లో 28.46 లక్షలు, మున్సిపాలిటీలు ఏడు నర్సరీల ద్వారా 1.33 లక్షల మొక్కలు పెంచుతున్నాయి. వీటిలో పండ్లు, పూలు, నీడనిచ్చే వృక్షజాతి.. ఇలా 40 రకాల మొక్కల్లో నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. ఫ క్షేత్రస్థాయిలో 20 శాతం కూడా కనిపించని దుస్థితి ఫ లోపించిన ప్రణాళిక ఫ నాటుతున్న చోటే నాటుతున్న వైనం ఫ కొందరి జేబులు నింపడానికే కార్యక్రమం అని ఆరోపణలు పోచంపల్లి – ముక్తాపూర్ మధ్య విద్యుత్ తీగలకు తాకుతున్నాయని చెట్లను నరికివేసిన దృశ్యంపది విడతల్లో నాటిన మొక్కలు (లక్షల్లో) 2019 70 2020 49 2021 27 2022 30 2023 22 2024 18 సంవత్సరం మొక్కలు 2015 33 2016 73 2017 114 2018 85 -
మీ సేవ కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరిటౌన్ : సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు నూతనంగా మీసేవ కేంద్రాలు మంజూరయ్యాయని, వీటి ఏర్పాటుకు అర్హులనుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చౌటుప్పల్ మండలంలో జైకేసారం, కొయ్యలగూడెం, చిన్నకొండూరు, తంగడపల్లి సంస్థాన్నారాయణపురం మండంలో మల్లారెడ్డిగూడెం, గుజ్జ గ్రామాలకు మీసేవ కేంద్రాలు మంజూరైనట్లు వెల్లడించారు. డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం, 21నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులన్నారు. రాత, మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. yadadri.telangana. gov.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారం పొందవచ్చన్నారు. దరఖాస్తులను ఈనెల 19వ తేదీ లోగా కలెక్టరేట్లోని ఇన్వార్డ్ లేదా అవుట్వార్డ్ సెక్షన్లో అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం ఫోన్ నంబర్ 9121147135 ను సంప్రదించవచ్చన్నారు. పరిశుభ్రతతోనే డయేరియా నియంత్రణసాక్షి,యాదాద్రి : పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించడం వల్ల డయేరియాను నియంత్రించవచ్చని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, శిశు సంక్షేమ, పంచాయతీ, విద్య, వైద్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటూ డయేరియా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాల విద్యార్థులు, వంట సిబ్బంది విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో డయేరియా నియంత్రణ చర్యలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. డీఏఓ బదిలీభువనగిరిటౌన్ : జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) గోపాల్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి వెంకటరమణారెడ్డి రానున్నారు. జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానంభూదాన్పోచంపల్లి : స్కీమాటిక్ ఇంటర్వెన్షన్స్, ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ జాతీయ అవార్డుకు ఎంపికై న హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ హెడ్ ఆఫీస్ ఫర్ డెవలప్మెంట్ కమిషనర్ అరుణ్కుమార్ను శుక్రవారం పోచంపల్లి టై అండ్ డై ట్రస్ట్ చైర్మన్ తడక రమేశ్ సన్మానించారు. చేనేత రంగం అభివృద్ధితో పాటు నేత కార్మికుల శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. -
డేటా ఎంట్రీ డబ్బులేవీ..?
భువనగిరిటౌన్ : ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేసిన ఆపరేటర్లకు ఎంట్రీ చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. డేటా ఎంట్రీ ముగిసి ఆరు నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ఆపరేటర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద ఆరు గ్యారంటీల అమలుకు ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించింది.మున్సిపాలిటీల్లో 46,441, గ్రామ పంచాయతీల్లో 2,13,431 దరఖాస్తులు వచ్చాయి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పాటు ప్రైవేట్ వ్యక్తులు డేటా ఎంట్రీలో పాల్గొన్నారు. జనవరి 8నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఆన్లైన్ నమోదు కొనసాగింది. మున్సిపాలిటీల్లో 46,441 దరఖాస్తులు జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా 46,441 దరఖాస్తులు వచ్చాయి. 382 మంది డేటీ ఎంట్రీలో పాల్గొన్నారు. ఒక్క దరఖాస్తుకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.7, ప్రైవేట్ ఆపరేటర్లకు రూ.15 చొప్పున చెల్లించాల్సి ఉంది. సుమారు రూ.7 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీల్లో.. గ్రామ పంచాయతీల్లో 2,13,431 దరఖాస్తులు వచ్చాయి. మండల పరిషత్ కార్యాలయాల్లో క్యాంపులు నిర్వహించి డేటీ ఎంట్రీ చేయించారు. 1,500 మంది ఆపరేటర్లకు రూ.21,34,310 రావాల్సి ఉంది. ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడంతో ఆపరేటర్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫ ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేసిన అపరేటర్లు ఫ జనవరి 18న ముగిసిన ఎంట్రీ ఫ రూ.28 లక్షలకు పైనే బకాయి ఫ ఆరు నెలలుగా ఎదురుచూపుల్లోనే.. -
వరదొస్తే.. రాకపోకలు బంద్
ఫ లో లెవల్ వంతెనల పైనుంచి ప్రవాహం ఫ వర్షాకాలంలో ఊరు దాటలేని దుస్థితి ఫ వాగుదాటే క్రమంలో ప్రమాదాలు ఫ ప్రతిపాదనల్లోనే హైలెవల్ బ్రిడ్జీలు ఇక్కడ కనిపిస్తున్న వంతెన రాజాపేట–కుర్రారం మధ్యలోనిది. సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. 2021 ఆగస్టులో ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఇద్దరు యువతులు గల్లంతై మృతి చెందారు. మరికొందరు ప్రమాదాల బారిన పడ్డారు. అయినా హై లెవల్ బ్రిడ్జి నిర్మించడం లేదు. యాదగిరిగుట్ట రూరల్: వానొస్తే ఊరు దాటలేని పరిస్థితి నెలకొంటుంది. పలుదారుల్లో ఉన్న లోలెవల్ వంతెనల పైనుంచి వాగులు ఉధృతంగా పారుతుండటంతో రోజుల తరబడి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. వాగుదాటే క్రమంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొందరు గాయాలతో బయటపడ్డారు. ఎప్పుడో నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా మారాయి. ఆలేరు నియోజకవర్గంలోని దాదాపు 60 గ్రామాల పరిధిలో ఈ సమస్య ఉంది. 11 పాత వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు అధికారులు ప్రతి పాదనలు పంపించారు. అందులో మూడు వంతెనలకు మూడేళ్ల క్రితం నిధులు మంజూరు కాగా.. ఆలేరు–కొలనుపాక బ్రిడ్జికి ఇటీవల మోక్షం లభించింది. రాకపోకలు బంద్ ● ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, మోటకొండూర్, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో 73 లో లెవల్ వంతెనలు ఉన్నాయి. మోస్తరు వర్షం కురిసినా వాగులు, వంకలు పొంగి రోడ్లపైనుంచి నీరు పారుతుంది. ● ఆలేరు–కొలనుపాక మధ్య వాగుదాటే క్రమంలో రాజాపేట మండలం నెమిలె గ్రామానికి చెందిన మంత్రి వెంకటయ్య–అరుణ దంపతులు ద్విచక్రవాహనంతో సహా కొట్టుకపోయారు. స్ధానికులు వారిని రక్షించారు. హెదరాబాద్కు చెందిన దేవదాసు – దేవేంద్ర దంపతులు బైక్పై వెళ్తూ వాగులో పడిపోయారు. స్థానికులు వారిని కాపాడారు. వీరితో పాటు పదుల సంఖ్యలో కొట్టుకుపోయి ప్రాణాలతో బయటపడ్డారు. ● గుండాల–నూనెగూడెం మధ్య కాజ్వే పూర్తిగా ధ్వంసమైంది. ● యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించిన ప్రతీసారి గ్రామస్తులు, రైతులు 15 కిలో మీటర్లు తిరిగి వెళ్తున్నారు. ● దాతర్పల్లి, జంగంపల్లి, రాళ్లజనగాం గ్రామస్తులు యాదగిరిగుట్టకు వచ్చే క్రమంలో గొల్లగుడిసెల వద్ద ఉన్న లో లెవల్ వంతెన దాటలేకపోతు న్నారు. పలువురు వాహనదారులు ప్రమాదాలబారిన పడ్డారు. ● రాజాపేట–కుర్రారం వద్ద వాగుదాటే క్రమంలో గల్లంతై ఇద్దరు యువతులు మృతి చెందారు. -
ఆండాళ్దేవికి సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పర్వాల్లో భాగంగా శుక్రవారం ఆండాళ్దేవిక ఊంజల్సేవ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్దేవిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ చేపట్టారు. ఇక ప్రధానాలయంలో నిత్యారాధనలు యథావిధిగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చన, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ తదితర కై ంకర్యాలు గావించారు. -
కనువిందు చేసేలా శంకు,చక్ర నామాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి శంకు, చక్ర నామాలను దూరం నుంచి వచ్చే భక్తులకు కూడా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో దేవస్థానం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. ప్రస్తుతం మెట్లమార్గంలోని బొర్రబండపై ఉన్న శంకు, చక్ర నామాలను పెయింటింగ్తో తీర్చిదిద్దాలన్నారు. అంతేకాకుండా ప్రసాద విక్రయశాలపై భాగంలోనూ శంకు, చక్ర నామాలు ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేసేలా విద్యుత్ లైట్లు అమర్చాలని కోరారు. సమావేశంలో అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, అధికారులు దయాకర్రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలే టార్గెట్
నల్లగొండ: ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి చెందిన రావిరాల పవన్ లిఫ్ట్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఉంటున్నాడు. అతడి సోదరుడు రావిరాల రాజు డ్రైవర్గా చేస్తున్నాడు. అతను హైదరాబాద్లోని సంగీ టెంపుల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్నారు. ఈ నెల 4న చండూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బాధితురాలు బుచ్చమ్మ మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన వ్యవసాయ భూమి నుంచి ఇంటికి వస్తుండగా నిందితులిద్దరూ ఆమె దగ్గరకు వెళ్లి ఇడికుడకు దారి ఎటు అని అడుగుతూ మాటల్లో పెట్టి బాధితురాలి మెడలో ఉన్న 3 తులాల పుస్తెలతాడు లాక్కుని పరారయ్యారు. ఈ విషయమై బాధితురాలు చండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో చండూరు సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకన్న, కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి నాలుగు టీంగా ఏర్పడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం 7.30కు తాస్కానిగూడెం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వారిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరిద్దరూ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల బంగారు ఆభరణాలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. గొల్లగూడెంలో, వాడపల్లి మండలం కల్లేపల్లి సమీపంలో, పెన్పహాడ్లోని అనాజిపురం లింగాల, దోసపాడు గ్రామాల సమీపంలో, వేములపల్లి మండలం బీరెల్లిగూడెం సమీపంలో, నకిరేకల్ మండలం చందుపట్లలో, మర్రూర్లో రావిరాల పవన్, రావిరాల రాజు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వారి నుంచి 19.5 తులాల 8 బంగారు పుస్తెల తాళ్లు, 2 సెల్ఫోన్లు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ కె. ఆదిరెడ్డి, చండూరు, కనగల్ ఎస్ఐలు వెంకన్న, విష్ణుమూర్తి, ఉపేంద్ర, కార్తీక్, అరుణ్, నగేష్ను ఎస్పీ అభినందించారు. ఫ పుస్తెలతాడు చోరీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల అరెస్టు ఫ రూ.19 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
బీసీ, ఎస్టీలకు కేబినెట్లో చోటు కల్పించాలి
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఇటీవల కేబినెట్ విస్తరణలో భాగంగా బీసీ, మాల, మాదిగలకు మంత్రులుగా చోటు కల్పించడం సంతోషకరమని, ఖాళీగా ఉన్న మరో మూడింటిని కూడా బీసీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతున్నట్లు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం పూర్తి అధికారం సీఎం రేవంత్రెడ్డికి ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే చిన్న వర్గాల వారికి పదవులు ఇవ్వాలన్నారు. తన జన్మదినోత్సవం సందర్భంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు బీర్ల శంకర్, బందారపు భిక్షపతి, ఎరుకల హేమేందర్గౌడ్, శ్రీరాంమూర్తి, దడిగె ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు -
బీసీలకు రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్దే
భువనగిరిటౌన్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ సంపత్కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు.శుక్రవారం భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడంలో అన్ని పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను కై వసం చేసుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఫ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ సంపత్కుమార్ -
ద్రవరూప ఎరువులతో రైతులకు ప్రయోజనం
నానో ఎరువులు మేలైనవి ద్రవరూప యూరియా, డీఏపీల ఉపయోగంపై రైతులకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. గుళికల ఎరువు కంటే నానో ఎరువులు చాలా మేలైనవి. వరి నాటుకు ముందుగా ఒకసారి మాత్రమే నానో డీఏపీని పొలంలో పిచికారీ చేయాలి. అలాగే నానో యూరియాను లీటర్ నీటికి 2మి.లీ. లేదా 4మి.లీ. చొప్పున కలిపి మొదటగా పంట పెరుగుదల దశలో తర్వాత నెలలోపు పూత దశలో రెండోసారి పిచికారీ చేయాలి. దీంతో రైతులకు సుమారు 8 శాతం పంట దిగుబడి పెరుగుతుంది. – పి.సందీప్కుమార్, ఏఓ, పెద్దవూరపెద్దవూర: వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు ఆర్థిక ఇబ్బందులను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. గతంలో పంటలకు వేసే డీఏపీ, యూరియా గుళికల రూపంలో ఉండేది. ఒక్కోటి 50 కిలోల బస్తా మార్కెట్లో అందుబాటులో ఉండేది. ఏళ్ల తరబడి కొన్ని రకాలైన పంటలకు రసాయన ఎరువులను అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. అధికంగా రసాయన ఎరువుల వాడకం మంచిది కాదని తెలిసినా గత్యంతరం లేక రైతులు వీటిని వినియోగిస్తున్నారు. రైతుల ఆరోగ్యానికి సైతం పెద్దముప్పుగా మారిందని భావించిన కేంద్ర ప్రభుత్వం ద్రవరూప యూరియా, డీఏపీలను తీసుకువచ్చింది. దీంతో భూమిలో సారం కోల్పోయి క్రమేణ పంట దిగుబడులు తగ్గుతున్నాయి. మూడేళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్లోకి రాగా గత యేడాది నుంచి ద్రవ రూపంలో ఉండే డీఏపీ సైతం అందుబాటులోకి వచ్చింది. ఘనరూపంలో ఉండే 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350లు, యూరియా బస్తా రూ.266లు ధర మార్కెట్లో ఉంది. కాగా ఇఫ్కో కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన నానో డీఏపీ అర లీటరుకు రూ.600లు, యూరియా అరలీటర్కు రూ.240 ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ద్రవరూప యూరియాపై రూ.26(266–240), డీఏపీపై రూ.750(1350–600) వరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. పోషక విలువలు పెరుగుదల అధికారుల అంచనా ప్రకారం ద్రవరూప ఎరువులతో పంటకు ప్రయోజనం సుమారు 90శాతం ఉంటుందని తెలుపుతున్నారు. అరలీటరు నానో డీఏపీ, యూరియా డబ్బాలు 50 కిలోల బస్తాతో సమానం. ఎకరానికి అరలీటరు నానో డీఏపీ సరిపోతుంది. వరి నాటు వేసేటప్పుడు ఘనరూప డీఏపీ ఎంత విస్తీర్ణంలో వినియోగిస్తామో, అరలీటర్ ద్రవరూప డీఏపీ పొలంలో పిచికారీ చేస్తే సరిపోతుంది. ద్రవరూపంలో పిచికారీ చేయడం వలన అదనంగా పోషకాలు సైతం ఉండటంతో మొక్కలు నత్రజని అవసరాన్ని సమర్థవంతంగా తీరుస్తుంది. దీంతో ఆకులలో కిరణజన్య సంయోగక్రియ పెరుగుతుంది. మొక్క వేర్లలో కణజాలం వృద్దిచెంది, పంట ఉత్పత్తిలో పోషక విలువలు పెంచుతుంది. డీఏపీ, యూరియాల బస్తాలకంటే ద్రవరూప ఎరువుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఘనరూపంలో ఉండే ఎరువుల వినియోగంతో చాలా వరకు మొక్కకు అందకుండా వృథా అవుతుంది. ద్రవరూప ఎరువులు నేరుగా మొక్కపై పిచికారీ చేయడంతో వృథా ఉండదు. ఫ ఎరువుల ఖర్చులను తగ్గించేందుకు ద్రవరూప యూరియా తీసుకువచ్చిన కేంద్రం -
5 లక్షల రేషన్ కార్డులు అందజేస్తాం
ఫ పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్కుమార్తో కలిసి తిరుమలగిరిలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన తిరుమలగిరి (తుంగతుర్తి) : నూతనంగా 5 లక్షల రేషన్ కార్డులు అందజేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ నెల 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. శుక్రవారం తిరుమలగిరిలో సీఎం సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గతంలో 2.80 కోట్ల మందికి రేషన్ అందేదని, ప్రస్తుతం 3.10 కోట్ల మందికి సన్న బి య్యం అందిస్తున్నట్లు చెప్పారు. భారత దేశంలోనే 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి ప్రథమ స్థానం పొందామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా 1.04 లక్షల మంది ఎన్యుమరేటర్ల ద్వారా బీసీ కుల గణన చేశామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. తిరుమలగిరిలో ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు, అదేరోజు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం : మంత్రి అడ్లూరి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. జూలై 14న జరిగే నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె.నరసింహ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, ఆర్థిక సంఘం కమిషన్ సభ్యుడు సుధీర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డీఎస్ఓ సతీష్కుమార్, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు సర్వోత్తమ్రెడ్డి, వేణారెడ్డి, గుడిపాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీల సమస్యలు పరిష్కరించాలని వినతి తిరుమలగిరి (తుంగతుర్తి) : గ్రామీణ వైద్యులుగా శిక్షణ పూర్తిచేసుకున్న వారిని ప్రభుత్వం గుర్తించాలని జిల్లా ఆర్ఎంపీ, బీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తిరుమలగిరికి వచ్చిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్కుమార్లకు వినతి పత్రం అందజేశారు. వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుప్పాల లక్ష్మీనర్సయ్య, కోశాధికారి లక్ష్మణ్గౌడ్, అధికార ప్రతినిధి వెంకన్న, జోనల్ ఇన్చార్జ్ రామచంద్రన్గౌడ్, వెంకన్న, నాగరాజు, శేఖర్, వెంకటేశ్వర్లు, రవి, లక్ష్మి, మహేందర్ ఉన్నారు. -
డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి
క్యాంపస్ సమాచారంనల్లగొండ టూటౌన్: డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలని నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ఆడిట్సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు, సిలబస్, వంటి అంశాలపై చర్చించారు. 20శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సులను వేరే విద్యాలయాలకు బదిలీ చేయాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి డిగ్రీ కళాశాల ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి కళాశాలలో విద్యార్థులకు 75 శాతం హాజరును తప్పనిసరి చేస్తూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్ జయంతి, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఎంఎస్సీ జియాలజీలో ప్రవేశాలకు ఆహ్వానంనల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సీపీజీఈటీ– 2025 ద్వారా ఎంఎస్సీ జియాలజీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. బీఎస్సీ జియాలజీ, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యా థ్స్, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కోర్సులో చేరడానికి సీపీజీఈటీ 2025 ద్వారా ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జియాలజీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ 2011లో ఎంజీ యూనివర్సిటీలో జియాలజీ విభాగం 20 సీట్లతో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 40 సీట్లు ఉన్నాయి. ఆధునిక ల్యాబ్స్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, ప్రతి సెమిస్టర్లో ఫీల్డ్ ట్రైనింగ్, జాతీయ స్థాయి సంస్థలతో ఎంఓల అనుసంధానం, ప్లేస్మెంట్ సౌకర్యాలు ఉన్నాయి. ప్రాక్టికల్ నిర్వహణతో విద్యార్థుల్లో అనుభవ సామర్థ్యం పెంచడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని జీఎస్ఐ, ఎన్ఆర్ఎస్, ఓఎన్జీసీ, ఐబీఎం, ఎన్ఎండీసీ, ఐఎస్ఆర్ఓ, ఎన్ఆర్ఎస్ఈ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ తదితర రంగాల్లో అవకాశాలు లభిస్తాయని యూనివర్సిటీ అధ్యాపక బృందం పేర్కొంటుంది. జియాలజీ కోర్సు పూర్తి చేసి సంబంధిత ఉద్యోగం పొందిన వారికి వార్షిక వేతనం రూ.3.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, ప్రభుత్వం రంగంలో నెలకు రూ.40 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఎంజీయూలోని ఎంఎస్సీ జియాలజీ పూర్తి చేసిన వందలాది మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దక్కాయి. ఫ ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ -
విత్తనాలు సకాలంలో విత్తుకోవడమే మేలు
మిరప మిరప పంటను జూలై 15వ తేదీ వరకు నారు పోసుకుని నాటుకోవచ్చు. నేరుగా సాలు పద్ధతిలోనూ మిరప విత్తనాలను నాటవచ్చు. మిర పంటకాలం 180 రోజులకు కోతకు వస్తుంది. మార్కెట్లో లభించే అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రీడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి. పెద్దవూర: పంటల సాగులో విత్తనాలు విత్తే సమయం అత్యంత కీలకం. వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఈ సీజన్లో ఏఏ పంటలు సాగు చేసుకుంటే మంచిది, ఏ సమయంలో విత్తనాలు వేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అనే విషయాలపై పెద్దవూర మండల వ్యవసాయ అధికారి పి. సందీప్కుమార్ సలహాలు, సూచనలు.. పత్తి ఆశించిన వర్షాలు కురిస్తే జూలై 15వ తేదీ వరకు పత్తి విత్తనాలను వేసుకోవచ్చు. ఆ తర్వాత విత్తుకుంటే దిగుబడిపై ప్రభావం పడుతుంది. పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. పెసర, కంది అంతర పంటలుగా వేసుకుంటే మంచిది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సుమారు 20 సంస్థలకు చెందిన బీటీ–2 పత్తి విత్తనాన్ని మాత్రమే విత్తుకోవాలి. ఎకరానికి సాగు భూమిని బట్టి 8 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. జనవరిలో రెండో పంటగా మొక్కజొన్న, పెసర, కూరగాయలు పంటలను సాగు చేసుకుంటే మంచిది. పంట కాలాన్ని మార్చి వరకు ఎట్టి పరిస్థితుల్లో పొడిగించవద్దు. కంది కంది, మినుము, పెసర పంటలను జులై 15వ తేదీ వరకు విత్తుకోవాలి. కందిని పత్తి, మొక్కజొన్న పంటల్లో కూడా అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ప్రధానంగా కందిలో రుద్రేశ్వర రకం పంటకాలం 160 నుంచి 180 రోజులు కాగా.. ఎకరానికి 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. డబ్ల్యూఆర్జీ 97 కంది రకం పంటకాలం 150–160 రోజులు కాగా ఎకరానికి 6–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వరి వరి సాగు చేసే రైతులు దీర్ఘకాలిక రకాలను ఇప్పటికే నార్లు పోసుకోవాలి. మధ్యకాలిక రకాలు జూలై 10వ తేదీ వరకు నార్లు పోసేందుకు సమయం ఉంది. జూలై 31 వరకు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకునేందుకు అనుకూలం. ఆగస్టు 15 వరకు అన్నిరకాల వరి నాట్లు పూర్తి చేయాలి. సాగుకు ముందు పొలంలో పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము, పెసర విత్తనాలను సాగు చేసి పూతదశలో పొలంలో కలియదున్నితే భూసారం పెరిగి పంటకు మేలు జరుగుతుంది. ఎరువుల ఖర్చు తగ్గుతుంది. నార్లు పోసే సమయంలో తప్పకుండా వరి విత్తనాన్ని శుద్ధి చేయాలి. ఫ దీర్ఘకాలిక సన్నరకాలు: సిద్ధి రకం పంటకాలం 140 రోజులు కాగా దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లు వస్తుంది. వరంగల్ సాంబ పంటకాలం 140 రోజులు కాగా ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి, వరంగల్ సన్నాలు పంటకాలం 135 రోజులు కాగా దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లు, తెలంగాణ సోన రకం పంట కాలం 125–130 రోజులు కాగా ఎకరాకు 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాంబ మసూరి పంటకాలం 150 రోజులు కాగా ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జైశ్రీరాం రకం పంటకాలం 135–140 రోజులు కాగా ఎకరాకు 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఫ దొడ్డు రకం: కూనారం సన్నాలు, బతుకమ్మ, కాటన్దొర రకాల పంటకాలం 120 రోజులు కాగా.. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జగిత్యాల రైస్–1 రకం పంట కాలం 125 రోజులు కాగా ఎకరానికి 32 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మొక్కజొన్న మొక్కజొన్న పంటను జూలై 15 వరకు సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే హైబ్రీడ్ రకాలు సాగు చేసుకోవచ్చు. భూమికి అనుకూలమైనవి ఎంపిక చేసుకోవాలి. మొక్కజొన్నను ఏక పంటగా కాకుండా కందితో కలిపి అంతర పంటగా వేసుకుంటే మంచిది. ఫ పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్కుమార్ సూచనలు -
ప్రపంచ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం
నాగార్జునసాగర్: ప్రపంచ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో గురువారం ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బాలీవుడ్ నటుడు గగన్మాలిక్, వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ రవి బంకర్ తదితరులు హాజరై బుద్ధవనంలో బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఐపీఎస్ అధికారి చారుసిన్హా బహూకరించిన బోధి మొక్కను బుద్ధవనంలోని ధ్యాన మందిరంలో నాటారు. ఆ తర్వాత మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించి బౌద్ధ సంప్రదాయం ప్రకారం చాటింగ్(ప్రార్థన) చేశారు. అనంతరం మహాస్తూపంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ.. సిద్దార్ధుడు గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత ఆషాడ పౌర్ణమి రోజున తన శిష్యులకు మొదటి ఉపన్యాసం ఇచ్చిన రోజును పురస్కరించుకొని ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడి గొప్పతనాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అనంతరంర ఎమ్మెల్యే జైవీర్రెడ్డి మాట్లాడుతూ.. బుద్ధవనాన్ని నాగార్జునసాగర్లో ఏర్పాటు చేయడానికి జానారెడ్డి కృషే కారణమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బుద్ధవనాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. బాలీవుడ్ నటుడు గగన్మాలిక్ మాట్లాడుతూ.. బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ దేశాల్లోని బౌద్ధ కేంద్రాలతో బుద్ధవనాన్ని సమన్వయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం వారు సాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలిగట్టును, నాగార్జునకొండను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ అధికారి శాసన, ఎస్టేట్ అధికారి రవిచంద్ర, ఆర్ట్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, ఇంజనీర్లు శ్రీనివాస్రెడ్డి, నజీష్, దైవజ్ఞశర్శ, సాగర్ సీఐ శ్రీనునాయక్, హాలియా ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్రెడ్డి, జిల్లా నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి -
సాగర్లో విద్యుదుత్పాదన ప్రారంభం
నాగార్జునసాగర్: ఎగువ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తుండడంతో గురువారం ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో అధికారులు విద్యుదుత్పాదన ప్రారంభించారు. ఎగువ నుంచి వరద వస్తుండడంతో విద్యుత్ ఉత్పాదన నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నీరంతా దిగువన టెయిల్పాండ్కు చేరుకుని.. అక్కడి నుంచి పులిచింతల ప్రాజెక్టుకు చేరుతుంది. గత ఏడాది కంటే ముందుగానే ఈ ఏడాది ముందుగానే అధికారులు విద్యుత్ ఉత్పాదనను ప్రారంభించారు. విద్యుదుత్పాదన కేంద్రాలను సందర్శించిన హైడల్ డైరెక్టర్నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని జల విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను టీజీ జెన్కో హైడల్ డైరెక్టర్ బాలరాజు గురువారం సందర్శించారు. ఎడమ కాల్వపై ఉన్న జల విద్యుత్ కేంద్రంలో శుక్రవారం నుంచి విద్యుత్ ఉత్పాదన ప్రారంభిస్తున్న నేపథ్యంలో రెండు టర్బైన్ల స్థితిగతులను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో రూ.7.5 కోట్లతో మరమ్మతులు జరుగుతున్న మొదటి టర్బైన్ను పరిశీలించారు. ఈ నెల 31వ తేదీ నాటికి మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆయనకు జల విద్యుత్ కేంద్రం సీఈ మంగేష్నాయక్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. బైక్ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతికేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండల పరిధిలోని చందుపట్ల గ్రామ పంచాయతీకి చెందిన జిల్లా వెంకన్న(46) సుతారి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురవారం పని నిమిత్తం బైక్పై కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్కు వచ్చిన వెంకన్న స్థానికంగా ఉన్న జంక్షన్ వద్ద హైవే దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ బైక్తో పాటు వెంకన్నను దాదాపు వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో వెంకన్న శరీరభాగాలు నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ సతీష్ తెలిపారు. -
స్వర్ణగిరిలో తిరుప్పావడ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామికి గురువారం స్వామి తిరుప్పావడ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 450 కిలోల అన్నప్రసాదం, లడ్డు, వడ వంటి పిండి వంటలను స్వామివారికి నైవేధ్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం స్వామివారికి సుప్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం 3వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహారతులు సమర్పించారు. గురుపూర్ణిమ సందర్భంగా ఆలయంలో రామానుజచార్యులకు ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులుపాల్గొన్నారు. -
తండ్రి, కొడుకు ఆత్మహత్యాయత్నం
మోత్కూరు: తమ వ్యవసాయ భూమిలోని బోరు సమీపంలోనే పక్క భూమి వ్యక్తి బోరు వేశాడని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి, కొడుకు గురువారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరికుంట్ల శేఖర్రెడ్డి తన ఏడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. పంటల సాగు కోసం తన భూమిలో బోరు వేసినప్పటికీ.. తన పక్కన భూమి ఉన్న వ్యక్తి వాల్టా చట్టానికి విరుద్ధంగా 40 మీటర్ల దూరంలో మరో బోరు వేయించడంతో శేఖర్రెడ్డి బోరు ఎండిపోయింది. ఈ విషయమై ఏప్రిల్ 24న తహసీల్దార్ కార్యాలయంలో శేఖర్రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఆర్ఐ శ్రీనివాసులు బోరును పరిశీలించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన శేఖర్రెడ్డి, ఆయన కుమారుడు హనీష్రెడ్డి మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం వద్దకు పురుగుల మందు, పెట్రోల్ బాటిల్తో వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ జ్యోతి స్పందిస్తూ.. శేఖర్రెడ్డి భూమి పక్కనే వేసిన బోరును శుక్రవారం సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ తమ భూమి పక్కనే బోరు వేశారని మనస్తాపం -
వీవర్స్ సర్వీస్ సెంటర్కు జాతీయ అవార్డు
భూదాన్పోచంపల్లి: దక్షిణ భారతదేశ రీజియన్ పరిధిలో హైదరాబాద్లోని వీవర్స్ సర్వీస్ సెంటర్కు గురువారం కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ 2024–25 సంవత్సరానికి గాను స్కీమాటిక్ ఇంటర్వెన్షన్స్, ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ జాతీయ అవార్డు ప్రకటించింది. ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అవార్డు అందజేయనున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ రీజినల్ హెడ్ ఆఫీసర్ ఎస్.అరుణ్కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రకాల స్కీమ్లను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంతో పాటు నూతన చేనేత డిజైన్ల అభివృద్ధికి కృషి చేసినందుకు దేశంలోనే ఉత్తమ వీవర్స్ సర్వీస్సెంటర్తో పాటు ఉత్తమ అధికారిగా అవార్డు వచ్చిందని తెలిపారు. తెలంగాణలో ఆధునిక టెక్నాలజీతో కూడిన 118 ఎలక్ట్రానిక్ జకాట్ మిషన్లు అందజేసి, నూతన డిజైన్లలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. వందశాతం సబ్సిడీతో 450 మగ్గాలు, 115 వర్క్షెడ్లు, 198 ఆసుమిషన్లు అందజేశామని పేర్కొన్నారు. 630 సమర్ధ్ శిక్షణ తరగతులను నిర్వహించామని చెప్పారు. అంతరించిపోతున్న గద్వాల్ ఒర్జినల్ చీరలతో పాటు కాకతీయుల కాలం నాటి ఆర్మూర్ చీరలను నేయిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ వీవర్స్ సర్వీస్సెంటర్ అందిస్తున్న సేవలను గుర్తించి దేశంలోనే హైదరాబాద్, చైన్నె వీవర్స్ సర్వీస్సెంటర్లు అవార్డుకు ఎంపికయ్యాయని తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెన్పహాడ్: వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన దొంతగాని నాగయ్య(45) తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనారోగ్య సమస్యలతో కిరాణ వ్యాపారి ఆత్మహత్యమోత్కూరు: అనారోగ్య సమస్యలతో కిరాణ వ్యాపారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణంలోని కొత్త బస్టాండ్కు ఎదురుగా గల పద్మశ్రీ కిరాణ దుకాణం యజమాని దోర్నాల నర్సయ్య(54) గురువారం తెల్లవారుజామున తాను నివాసముంటున్న భవనం పైకి వెళ్లి రూములో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజు వాకింగ్కు వెళ్లే నర్సయ్య భవనం పైకి వెళ్లి ఎంతసేపటికీ తిరిగి కిందకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆయన ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతోనే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్తీ పాలు తయారుచేస్తున్న వ్యక్తిపై కేసు భువనగిరి: కల్తీ పాలు తయారుచేస్తున్న వ్యక్తిపై భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామంలో ఓ వ్యక్తి కల్తీ పాలు తయారుచేసి హైదరాబాద్కు తరలించి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అతడి వద్ద 80లీటర్ల కల్తీ పాలు, ఐదు కిలోల మిల్క్ పౌడర్, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాకై ్సడ్, 400 మిల్లీలీటర్ల ఎసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్ ఎస్హెచ్ఓ అనిల్కుమార్ తెలిపారు. -
యాదగిరిగుట్ట సర్కిళ్లలో విగ్రహాల ఏర్పాటుపై సమీక్ష
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండ దిగువన రింగ్లో రోడ్డులోని సర్కిళ్లలో దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుపై ఈఓ వెంకట్రావ్ ఆలయ అధికారులు, స్తపతులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న నాలుగు సర్కిళ్లను పరిశీలించి, ఏ సర్కిల్లో ఏ విగ్రహం ఏర్పాటు చేయాలని చర్చించారు. ఇటీవల నాలుగు సర్కిళ్లలో యాదరుషి, శ్రీ అభయఆంజనేయస్వామి, ప్రహ్లాద, గరుడ దేవుళ్ల పేర్లతో నామకరణం చేశారు. ఆగమ శాస్త్ర ప్రకారం సర్కిళ్లలో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ వెంకట్రావ్ వెల్లడిచారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ఆలయాధికారులు దయాకర్రెడ్డి, రఘు, స్తపతులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో 25శాతం రిజర్వేషన్కు కృషి
సూర్యాపేట: యూత్ కాంగ్రెస్ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 25శాతం రిజర్వేషన్ కల్పించేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి శివచరణ్రెడ్డితో పాటు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర మరువలేనిదని అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వానికి యువత త్వరలో చరమగీతం పాడి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఖాయమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై గత పది సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ నిర్వహించిన పోరాటాల స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించేలా యువజన కాంగ్రెస్ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన సమయంలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. ఐవైసీ యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జవహార్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి, గుర్ర శ్యాంచరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యరెడ్డి, అంబేద్కర్, నవీన్చారి, పట్టణ అధ్యక్షుడు అంజత్ అలీ, మాజీ కౌన్సిలర్లు బైరు శైలేందర్, బాలుగౌడ్, రవి, రెబల్ శ్రీను, చేడే అంబేద్కర్, విజయభాస్కర్, ఏజాజ్, కుమార్, జావిద్, కోరుకొప్పుల నరేష్, అజీం, కుక్కడపు మహేష్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు సాయి తదితరులు పాల్గొన్నారు. ఫ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి -
యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పర్వాల్లో భాగంగా స్వామి, అమ్మవారికి సువర్ణ పుష్పార్చన నేత్రపర్వంగా చేపట్టారు. ఆలయ ముఖ మండపంలోని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి సువర్ణ పుష్పాలతో ప్రజలు చేశారు. అంతకుముందు వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
మూడేళ్లు కష్టపడితే 30 ఏళ్లు ఆదాయం
ఆలేరురూరల్: ఆయిల్పామ్ సాగు చేయడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని, మూడేళ్లు కష్టపడితే 30 ఏళ్ల పాటు ఆదాయం లభిస్తుందని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గురువారం ఆలేరు మండలం కొలనుపాకలో రైతులు నర్రా నారాయణరెడ్డి, సీతారాంరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్పామ్ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. సూక్ష్మ సేద్య పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఓసీ రైతులకు 80 శాతం రాయితీపై ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మదర్ డైయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఆయిల్ఫెడ్ ఓఎస్డీ కరణ్, ఆయిల్ఫెడ్ స్పెషల్ ఆఫీసర్ తిరుమలేష్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లా ఉద్యాన అధికారి సుభాషిణి, ఏడీఏ పద్మావతి, హార్టికల్చర్ ఆఫీసర్లు స్రవంతి, స్నేహిత, ఎంఏఓ శ్రీనివాస్, ఏఈఓలు, ఆయిల్ఫెడ్ జిల్లా మేనేజర్ ఖాజా మొయినొద్దీన్, డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్, ఫీల్డ్ ఆఫీసర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఫ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ప్రభుత్వ విప్ అయిలయ్య -
పదోన్నతుల తర్వాతే సర్దుబాటు!
భువనగిరి : స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించిన తర్వాతనే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. సర్దుబాటు నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. అర్హులు 150 మంది జిల్లాలోఎస్జీటీలు 1,105, స్కూల్ అసిస్టెంట్లు 1,640 మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లలో సీనియార్టీని బట్టి జీహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు అఅర్హులను గుర్తిస్తున్నారు. 2002 డిసెంబర్ నాటికి ఉద్యోగంలో చేరిన వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. 150 మంది జీహెచ్ఎంలు పదోన్నతికి అర్హులుగా గుర్తించారు. సర్దుబాటు ప్రక్రియ మల్టీజోన్–2 ప్రకారం జరగనుంది. ప్రస్తుతం జిల్లాలో 30 జీహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సర్దుబాటు తొలుత స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో, ఆ తర్వాత జిల్లాలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విద్యా శాఖ నిబంధన విధించింది. గతనెల 12 నాటికి సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే బడిబాట కార్యక్రమం అనంతరం సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈనెల 15లోగా సర్దుబాటు పూర్తి చేయనున్నారు. ఒకే దఫా పూర్తిచేయాలి రాజాపేట: బదిలీలతో కూడిన ప్రమోషన్ షెడ్యూల్ విడుదల చేసి ఒకే దఫా ప్రక్రియ ముగించాలని తపస్ రాష్ట్ర కార్యదర్శి సీవి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో గురువారం రాజాపేట మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేయించారు. రాజాపేటలో ఆయన మాట్లాడుతూ ఐదు డీఏలు పెండింగ్ ఉంచడం బాధాకరమన్నారు. పీఆర్సీ అమలు చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం చెల్లించాలని, టైం స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు పలుగుల రాజు, నమిలే భరత్కుమార్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దుడుకు జానయ్య , పున్న సత్యానంద్, కార్యదర్శి బాలరాజు పాల్గొన్నారు. ఫ జిల్లాలో 1,640 మంది స్కూల్ అసిస్టెంట్లు ఫ ఉన్నతాధికారులకు నివేదిక అందజేత -
మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
భువనగిరిటౌన్ : భువనగిరిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని సీఎం రేవంత్రెడ్డిని అడిగిన వెంటనే హెచ్ఎండీఏ నిధులు రూ. 56 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఇందులో రూ.13కోట్లతో భువనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.నల్లగొండ, హైదరాబాద్ రోడ్ల విస్తరణతో పాటు కూడళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, మజహార్, కూర వెంకటేష్, గుర్రాల శ్రీనివాస్, సలావుద్దీన్ పాల్గొన్నారు. ఫ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
జనాభా 1961 తరువాత పెరిగినా, ప్రస్తుతం తగ్గుతోంది
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025ఫ ఉమ్మడి జిల్లాలో 1991 తరువాత నుంచి క్రమంగా తగ్గుదల ఫ సంతాన పరిమితితో తగ్గుతున్న జనాభా శాతంఫ మరో 20 ఏళ్లలో యువత కంటే సీనియర్ సిటిజన్ల సంఖ్యే ఎక్కువకానుంది ఫ 2011 నాటికి క్షీణించిన జనాభా పెరుగుదల రేటుసాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి:ఉమ్మడి జిల్లాలో యువతరం తగ్గిపోతోంది. పెరుగుతున్న పోషణ భారం.. సంతాన పరిమితికి కారణమవుతోంది. 1951లో మొదటిసారిగా జనాభా లెక్కలు చేసిన తరువాత పదేళ్లపాటు పెద్దగా జనాభా పెరుగకపోయినా, ఆ తరువాత 30 ఏళ్ల పాటు అంటే 1971 వరకు జిల్లాలో జనాభా గణనీయంగా పెరిగింది. మళ్లీ 1991 తరువాత నుంచి జనాభా సంఖ్యా పరంగా పెరిగినా, అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే పెరుగుదల రేటు మాత్రం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వచ్చే 20 ఏళ్లలో సీనియర్ సిటిజన్ల సంఖ్యే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాదు ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సూచనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెరిగిన జీవన ప్రమాణాలు, వస్తున్న ఆదాయానికి, చేయాల్సిన వ్యయానికి పొంతన లేకపోవడం, తక్కువ ఆదాయం, ఎక్కువ ఖ ర్చుల కారణంగా పరిమిత సంతానికే నేటి యువత మొగ్గుచూపుతోంది. తక్కువ మందిని కని సక్రమంగా పెంచి, అన్నీ సమకూర్చగలిగితే చాలు అన్నట్లుగా భావిస్తుస్తోంది. సంపన్న వర్గాల నుంచి పేద, మధ్య తరగతి వరకు చిన్న కుటుంబాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా జనాభా పెరుగుదల ఏటేటా తగ్గిపోతోంది. ఒకప్పుడు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఒకప్పుడు జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వమే ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అన్న నినాదాన్ని ప్రజల్లోకి తెచ్చింది. అయితే అదే నినాదం ఇప్పటికీ అమలవుతూనే ఉంది. 1970 తరువాత భారత ప్రభుత్వం దేశంలో జనాభా ఎక్కువ అవుతుందని, ఆహార పదార్ధాల కొరత ఏర్పడుతుందన్న ఆలోచనతో కుటుంబ నియంత్రణను అమల్లోకి తెచ్చింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టింది. రెట్టింపునకు మించి పెరిగిన జనాభా ఉమ్మడి జిల్లాలో 1951లో చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా కంటే ఇప్పుడు జనాభా రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనాభా 15,43,975 ఉండగా, 2011 సంవత్సరం నాటికే అది 34,88,809కు పెరిగింది. ఈ 15 ఏళ్లలో మరో 5 లక్షలకు పైగా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఖ్యాపరంగా పెరిగినా.. పెరుగుదల రేటు మాత్రం క్షీణిస్తోంది. 1951 నుంచి 1961 వరకు 1.97 శాతమే పెరిగింది. ఆ తరువాత పదేళ్లలో 1971 నాటికి 13.45 శాతం పెరిగింది. 1981 నాటికి 20.18 శాతం, 1991 నాటికి 20.07 శాతం జనాభా పెరిగింది. ఇక తరువాత పెరుగుదల రేటు క్షీణిస్తూ వస్తోంది. తరువాత పదేళ్లకు అంటే 2001 నాటికి పెరుగదల రేటు 12.19 శాతానికి పడిపోయింది. 2011 నాటికి జనాభా పెరుగుదల రేటు 6.91 శాతానికి తగ్గింది.ఉమ్మడి జిల్లాలో 120 మందితో సర్వే నిర్వహించగా, వారు వెల్లడించిన అభిప్రాయాలివే.. 1. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఇష్టపడతారా? అవునులేదు ఆలోచిస్తాంఇద్దరు చాలనుకుంటున్నాంనాలుగు నెలల క్రితం వివాహం చేసుకుని ఇటీవల నూతన దాంపత్య జీవితం ప్రారంభించాం. సంతానం ఒక్కరు లేదా ఇద్దరు చాలనుకుంటున్నాం. నిత్యావసరాలు, చదువుల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కరు లేదా ఇద్దరే సంతానం ఉండటం వల్ల ఆర్థికభారం తగ్గుతుంది. సమాజ శ్రేయస్సు కోసం చిన్న కుటుంబానికే మొగ్గు చూపుతాం. –గాజుల శ్రీకాంత్, మహబూబ్పేట, యాదగిరిగుట్ట మండలం ●రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన గోటూరి పాండురంగయ్యశాస్త్రి కుటుంబం నాలుగుతరాలుగా ఉమ్మడిగా జీవిస్తోంది. పాండురంగయ్య శాస్త్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1994లో రిటైర్ట్ అయ్యాడు. భార్య విమల గృహిణి. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె సునంద ఉన్నారు. అందరూ ఉన్నత విద్యనభ్యసించారు. పెద్ద కుమారుడు పౌరోహితం.. రెండు, మూడవ కుమారుడు వ్యవసాయం, నాలుగో కుమారుడు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అందరికీ వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు, ఎనిమిది మంది కుమార్తెలు. వారిలోనూ కొందరి పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పటికీ కుటుంబసభ్యులందరూ పాండు రంగయశాస్త్రి, విమల మాట జవదాటరు. అంతా కలిసిమెలిసి ఉంటున్నారు.25శాతం రిజర్వేషన్కు కృషిస్థానిక ఎన్నికల్లో 25శాతం రిజర్వేషన్ కోసం కృషి చేస్తాననియువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి అన్నారు. -8లోన్యూస్రీల్ఉమ్మడి కుటుంబాలు లేక.. అప్పట్లో జనాభా పెరుగుదలను తగ్గించేందకు తీసుకువచ్చిన కుటుంబ నియంత్రణను ఇప్పటి దంపతులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఒక్కరిద్దరితోనే సరిపెట్టుకుంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యయంతో ఒకరిద్దరు పిల్లలను కనేందుకు నేటి యువత మొగ్గు చూపుతోంది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పుట్టిన బిడ్డను చూసుకునేందుకు ఉమ్మడి కుటుంబంలో నానమ్మ, తాతయ్య, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, అత్తమ్మలు ఇలా చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు బతుకు పోరులో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. మంచి భవిష్యత్ ఇవ్వొచ్చు మాకు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరు లేదా ఇద్దరు సంతానం ఉంటేనే బాగుంటుంది. సంతానం తక్కువ ఉండటం వల్ల కుటుంబంపై ఆర్థికభారం పడదు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం చిన్న కుటుంబాలే బెటర్. –బి.రాకేష్, వలిగొండఉమ్మడి జిల్లాలో ప్రతి పదేళ్లకు జనాభా పెరుగుదల ఇలా.. సంవత్సరం జనాభా పెరుగుదల వృద్ధి శాతం 1951 15,43,975 -- -- 1961 15,74,946 37,971 1.97 1971 18,19,738 2,44,792 13.45 1981 22,79,681 4,59,947 20.18 1991 28,52,092 5,72,407 20.07 2001 32,47,982 2,95,890 12.19 2011 34,88,809 2,40,827 6.91 -
గుట్ట ఆలయ సన్నిధిలో వనమహోత్సవం
యాదగిరిగుట్ట: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని పలు ప్రాంతాల్లో దేవస్థానం, ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం పరిసరాల్లో పనస, కదంబ, వేప, ఉసిరి తదితర మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరారావు, ఆలయ అధికారులు గజివెల్లి రమేష్బాబు, అశ్విని తదితరులు పాల్గొన్నారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంభువనగిరి : పోషకాహారంతో తీసుకోవడం ద్వారా గర్భిణులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎంహెచ్ఓ మనోహర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి ఆధ్వర్యంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లితో పాటు పుట్టుబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులకు పోషకాహారం కిట్లు అందజేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కోరారు. రోటరీక్లబ్ నిర్వాహకులను డీఎంహెచ్ఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, అర్బన్ పీహెచ్సీ వైద్యులు నిరోషా, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పలుగుల ఆగేశ్వర్రావు, కార్యదర్శి తవిటి వెంకటనారాయణతో పాటు పి.రమేష్బాబు, సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగ్ భువనగిరిటౌన్ : 11 మంది ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగ్ ఇస్తూ రాచకొండ సీపీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు వీరబోయిన సైదులు, ఎన్.రూపశ్రీ, భువనగిరి టౌన్ ఉప్పల నరేష్, భువనగిరి రూరల్ ఓరుగంటి సంధ్య, కె.శివశంకర్రెడ్డి, ఆలేరు ఎన్.వినయ్, మోత్కూరు కె.సతీష్, చౌటుప్పల్ కె.ఉపేందర్రెడ్డి, అంజయ్భార్గవ్, బీబీనగర్ గుజ్జ విజయ, పోచంపల్లికి కె.లీలను కేటాయించారు. బదిలీలుహైదరాబాద్ పహాడిషరీప్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు భువనగిరి సీసీఎస్కు, యాదగిరిగుట్ట ఎస్ఐ ఉదయ్కిరణ్ ఎస్బీనగర్ సీసీఎస్, రామన్నపేట ఎస్హెచ్ఓ మల్లయ్య బీఆర్పేట పీఎస్, బీఆర్పేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజును రామన్నపేటకు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి దరఖాస్తునూ పరిష్కరించాలిసాక్షి,యాదాద్రి : రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సమస్యకు పరి ష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేశారు. దరఖా స్తుల పరిష్కారంపై సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసి ఆగస్టు 15 నాటికి పూర్తిగా పరిష్కరించాలని కోరారు. అదే విధంగా చేయూత పథకంపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇళ్లపై స మీక్షించారు. ఇందరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కారణాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పించి పనులు మొదలు చేయించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్, స్వచ్చ సర్వేక్షణ్, వనమహోత్సవం కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పాల్గొన్నారు. -
ముఖ హాజరు వేయాల్సిందే..
లబ్ధిదారుల వివరాలన్నీ యాప్లోనే నమోదు అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ హాజరుశాతం నమోదు చేసి సరుకులు పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం మూడేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నాం. లబ్ధిదారుల వివరాలన్నీ యాప్లోనే నమోదు చేస్తున్నాం. –స్వరాజ్యం సీడీపీఓ, ఆలేరుఆలేరురూరల్: అంగన్వాడీ కేంద్రాల సేవల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం, ఇతర సేవలన్నింటినీ రికార్డుల్లో నమోదు చేసేవారు. గుడ్లు, బాలామృతం, ఇతర పోషకాహార పదార్థాలు సరిగా ఆందడం లేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారని లబ్ధిదారుల నుంచి ఆరోపణలున్నాయి. సేవల్లో పాదర్శకత ఉండేలా ఫేస్ రికగ్నేషన్ విధానం తప్పనిసరి చేసింది. కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు. 901 అంగన్వాడీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 901 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 49,023 మంది ఉన్నారు. వీరందరికీ జూలై 3నుంచి ఫేస్ రికగ్నేషన్ హాజరు ద్వారానే సరుకులు పంపిణీ చేస్తున్నారు.ఫేస్ రికగ్నేషన్ ద్వారా యాప్లో లబ్ధిదారు ఫొటోతో సహా నమోదవుతుంది. లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీపై రాష్ట్ర స్థాయి అధికారులకు పర్యవేక్షణ సులువుకానుంది. ప్రస్తుతం చిన్నారులకే వర్తింపు.. ప్రస్తుతం యాప్ ద్వారా 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు వయసు గల పిల్లలకు బాలామృతం, గుండ్లు, ఇతర పోషకాహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. ఇది విజయవంతంమైతే మిగతా లబ్ధిదారులకు కూడా యాప్లో వివరాలు నమోదు చేసుకుని సరుకులు అందజేస్తామని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ ఫ పౌష్టికాహారం పంపిణీలో పాదర్శకత కోసం నూతన విధానం ఫ జిల్లా వ్యాప్తంగా 901 కేంద్రాల్లో అమలు అంగన్వాడీ కేంద్రాలు 901మూడేళ్లలోపు చిన్నారులు 21,0703–6 ఏళ్లలోపు చిన్నారులు 19,048గర్భిణులు 4,121బాలింతలు 3,883 -
పెద్దఅడిశర్లపల్లి నుంచి ఫిలింనగర్కు..
ఫ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సత్తాచాటుతున్న మేడారం కుర్రాడు ఫ ఇటీవల కుబేర సినిమాకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన అరవింద్ ●అరవింద్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లగా.. వారితో పాటు అతడు కూడా వెళ్తూ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పేపర్బాయ్గా, క్యాటరింగ్ బాయ్గా, రైస్మిల్లు నైట్ షిఫ్ట్ చేస్తూ సొంత ఖర్చులు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా తనకు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, వ్యాసాలు రాస్తుండేవాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అభిరుచి ఏర్పర్చుకొని సినిమాల్లో ప్రవేశం దొరకబుచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై ఆసక్తి.. తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరవింద్ చదువు కొనసాగింది. తమ గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చిన మొదటితరం విద్యార్థి అరవిందే కావడం విశేషం. మాస్ కమ్యూనికేషన్ చదువుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్బాయ్గా పనిచేయడం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ కవితలు, వ్యాసాలు రాశారు. సాహిత్య ప్రచారం.. కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం.. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని భావించిన అరవింద్ ‘ఆలోచనా’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టిపొట్టి జానపద కథల నుంచి దేశభక్తుల జీవితచరిత్ర వరకు పరిచయం చేయడం, చదివించడం చేశారు. హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్స్ పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడంతో ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయా ప్రాంతాల సంస్కృతి, వైవిధ్యం, ఆర్కిటెక్చర్ను కెమెరాల్లో బంధించి వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు. -
బైక్కు నిప్పంటించిన దుండుగులు
అడవిదేవులపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు బైక్కు నిప్పంటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి అడవిదేవులపల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఉద్దండి కోటయ్య తన బైక్ను మంగళవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. బుధవారం ఉదయం లేచి చూడగా బైక్ కనిపించలేదు. గ్రామ సమీపంలోని వ్యవసాయ భూముల్లో బైక్ దగ్ధమవుతుండటం గమనించిన గ్రామస్తులు కోటయ్యకు సమాచారం ఇచ్చారు. కోటయ్య వెళ్లి చూడగా.. బైక్పై గడ్డి వేసి నిప్పంటించినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
నేడు బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవం
నాగార్జునసాగర్: సిద్దార్డుడికి జ్ఞానోదయం అయ్యి గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత మొదటి బోధన చేసిన రోజును స్మరించుకుంటూ గురువారం నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గౌతమి బుద్ధుని జీవితంలో ముఖ్యమైన ఐదు ఘట్టాలలో ఒకటి మొదటి ఉపన్యాసం. దీనిని ధర్మచక్ర పరివర్తన అనిపిలుస్తారు. బౌద్ధులు, బౌద్ధ అభిమానులు ఈ రోజును ప్రత్యేక దినంగా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బుద్ధవనంలో ధర్మచక్ర పరివర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించిన మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీఎస్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగులు తెలిపారు. ఉదయం 11గంటలకు కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమానికి బౌద్ధ సంఘం ప్రతినిధులు, ఇతర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు తరలిరానున్నారు. -
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
● నలుగురి అరెస్ట్నేరేడుచర్ల: కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామ శివారులో బుధవారం జరిగింది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కందులవారిగూడెం గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారయ్యారు. వారి నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ఆర్ఎంపీలపై కేసు నమోదుకొండమల్లేపల్లి: దేవరకొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న పలువురు ఆర్ఎంపీలపై పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు రాము ఫిర్యాదు మేరకు దేవరకొండ పట్టణంలోని సాయిరాం క్లినిక్ నిర్వాహకుడు రాజేశ్వరరావు, అల్ఫా క్లినిక్ నిర్వాహకుడు జహంగీర్, ఆకాశ్ కంటి ఆస్పత్రి నిర్వాహకుడు రమేష్, మారుతీ క్లినిక్ నిర్వాహకుడు సంతోష్పై కేసు నమోదు చేసినట్లు దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపారు. కౌలు రైతు ఆత్మహత్యకనగల్: నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రానికి చెందిన గోనెల చిన్న యాదయ్య(45) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేయటంతో పాటు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటం కుటుంబ ఖర్చులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. భార్య కాశమ్మతో తరచూ గొడవలు రావడంతో వారం రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన చిన్న యాదయ్య బుధవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన యాదయ్య తల్లి లింగమ్మకు కొడుకు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రామయ్య తెలిపారు. -
పంటల సాగులో ఎరువుల వాడకం కీలకం
ఏ దశలో, ఏ సమయంలో ఎరువులు వాడాలంటే.. పంటలకు నత్రజని అవసరం చివరి దశ వరకు ఉంటుంది. నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో రెండు మూడు కీలక దశల్లో వాడుకోవాలి. ఏపుగా పెరిగేందుకు, పూత, మొగ్గ దశ, పంట దిగుబడి పెరిగే దశల్లో ప్రధానంగా వాడుకోవాలి. భాస్వరం ఎరువును విత్తే సమయంలో చివరి దుక్కిలో వేసుకోవాలి. దీంతో ఎరువు భూమిలో నిల్వ ఉండి కొద్దికొద్దిగా పంటకు అందుతుంది. పొటాష్ ఎరువులు మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచటంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తి వచ్చేలా చేస్తాయి.పెద్దవూర: పంటల సాగులో ఎరువుల వాడకం కీలకమని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్ పేర్కొన్నారు. ఏయే దశల్లో ఎంత మోతాదులో ఏయే ఎరువులు వాడాలనే దానిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎరువుల వినయోగానికి సంబంధించి రైతులు పాటించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు. రసాయనిక ఎరువులతో నష్టం రసాయనిక ఎరువుల వాడకం శ్రేయస్కరం కాదు. దీనివల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూసారంలో మార్పులు సంభవిస్తాయి. మరోవైపు పంట ఉత్పత్తుల్లో రసాయనిక అవశేషాలు మిగిలి ఉండి మార్కెట్లో దాని ప్రభావంతో డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. విరివిగా, విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడటం తగ్గించాలి. సేంద్రియ ఎరువులతో ఎంతో మేలు సేంద్రియ ఎరువుల వాడకం మూలంగా అధిక ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువుతో అన్ని రకాల పంటలకు పోషకాలు అందుతాయి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సొంతంగా వాటిని తయారు చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, పచ్చిరొట్ట ఎరువులు, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వాడకం, జీవన ఎరువుల వాడకం ప్రాధాన్యతను గుర్తించాలి. ఎరువుల వాడకంలో పాటించాల్సిన పద్ధతులు ● లోతు దుక్కుల వల్ల భూమి పొరలు గుల్లబారి తేమను బాగా నిల్వ ఉంచుకుంటాయి. వేసిన ఎరువును ఎక్కువ శాతం మొక్కలు తీసుకుంటాయి. ● పంటలో ఉన్న కలుపును పూర్తిగా తొలగించిన అనంతరం తేమ ఉన్న దశలోనే ఎరువులు చల్లుకోవాలి. ● సమస్యాత్మక భూముల్లో ముందుగా ఉన్న సమస్యను సరిచేసుకుని ఆ తర్వాత ఎరువులు వేసుకుంటే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ● అన్ని పోషకాల్లో నత్రజని పోషకం వృథా ఎక్కువగా ఉంటుంది. యూరియాను వేప పిండితో కలిపిగానీ, యూరియా ఎరువుతో వేప నూనె కలుపుకుని గానీ వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలవుతూ వృథా తగ్గుతుంది. ● కోల్థార్తో 2 లీటర్ల కిరోసిన్తో మిశ్రమం చేసి రెండు బస్తాల యూరియాలో కలిపితే మంచి ఫలితాలు వస్తాయి. అర బస్తా యూరియాను ఒక బస్తా తడి, పొడి మట్టితో కలిపి 24గంటలు నీడలో ఉంచి తర్వాత నేలకు అందిస్తే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎరువుల ధరలపై అవగాహన అవసరం ఎరువుల వాడకం ఎంత ముఖ్యమో.. వాటి ధరలపై అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఏయే ఎరువుల్లో ఏ శాతం ఎంత ఉంటుంది. నాణ్యత, ధరలు, నకిలీలు వంటి వాటిని గమనించాలి. దీనికి వ్యవసాయ అధికారులు, అవగాహన ఉన్న రైతుల సలహాలు తీసుకోవాలి. వెదజల్లే పద్ధతి.. ప్రయోజనాలుసాధారణంగా ఎరువులను రెండు పద్ధతుల్లో వేస్తుంటారు. వెదజల్లే పద్ధతిలో మొక్కలు దగ్గర దగ్గరగా ఉంటే మేలు జరుగుతుంది. వరుస క్రమంలో లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకుపోయే పైర్లకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. వరికి కూడా ఈ పద్ధతి మేలు చేస్తుంది. పాదుల్లో ఎరువు వేసే పద్ధతిమొక్కల దగ్గర ఎరువులు వేసే పద్ధతి ద్వారా పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా కూడా తగ్గుతుంది. నిర్ణీత వరుసల్లో మొక్కలు ఉన్నప్పుడు పొలాన్ని 2 అంగుళాల మేర లోతు చేసుకుని తేమ ఉన్నప్పుడు మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు పడేలా వేయాలి. చిన్నపాటి గుంతలు తీసి ఎరువులు వేసిన సమయంలో దానిని మట్టితో కప్పేలా చేసుకోవాలి. 06 హెచ్ఎల్ఏ 205పెద్దవూరలో పత్తి చేనులో ఎరువులు వేస్తున్న రైతులు -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఫ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత తుర్కపల్లి: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత అన్నారు. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాలపై అవగాహన క్పలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చట్ట పరిరక్షణ మద్దతు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగరాజు, పారా లీగల్ వలంటీర్లు హిరాలాల్, మౌనిక, సబ్ ఇన్స్పెక్టర్ తక్కూద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లుగా పైసా ఖర్చు చేయలే!
ఖజానాలో మూలుగుతున్న రూ.15 కోట్లు త్వరగా అభివృద్ధి పనులు చేపట్టాలి నిధులు ఉన్నందున అవసరమైన వార్డుల్లో డ్రెయినేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలి. ఇందుకు మున్సిపల్ కమిషనర్ వెంటనే చొరవ చూపాలి. – సముద్రాల శ్రీనివాస్, బీజేపీ నేత, ఆలేరు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం వార్డుల్లో అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే రూ.15కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టే పనులకు త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తాం. – శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఆలేరు ఫ టీయూఎఫ్ఐడీసీ కింద మంజూరు ఫ పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం ఫ వార్డుల్లో పడకేసిన అభివృద్ధి పనులు ఫ ఇబ్బందుల్లో పట్టణ వాసులు ఆలేరు: తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) నుంచి మంజూరైన కోట్ల రూపాయల నిధులు రెండేళ్లుగా ఆలేరు మున్సిపల్ ఖజానాలో మూలుగుతున్నా అభివృద్ధి పనులకు పైసా ఖర్చు చేయడం లేదు. దీంతో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకమండలి పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. అధికారుల ఉదాసీన వైఖరితో ఆలేరు మున్సిపాలిటీలో అభివృద్ధి పడకేసింది. అధికారులు కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టిసారిస్తూ అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్ నాలాలతో పరేషాన్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉండగా, 22వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో ఓపెన్ నాలాల పరిస్థితి మెరుగుపడడం లేదు. అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు మోక్షం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వానాకాలంలో ఓపెన్ నాలాలతో మురుగునీటి సమస్య వల్ల దోమలు, పందులతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో సమస్యలు ఇలా.. వరదనీటి ప్రవాహం సులువుగా వెళ్లేందుకు పాత పంచాయతీ కార్యాలయ సమీపం నుంచి ప్రధాన రోడ్డులోని మసీదు వరకు స్ట్రామ్ నిర్మించాల్సి ఉంది. మున్సిపల్ ఆఫీస్కు కూతవేటు దూరంలో, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ పక్కన డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలి. ఇక్కడ మురుగునీరు ఏరులై పారుతూనే ఉంది. క్రాంతి నగర్, రైల్వేస్టేషన్ మార్గంలో డబుల్ బెడ్ ఇళ్ల వద్ద తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వలు నిర్మించాలని చాలాకాలం నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సీసీ రోడ్లు కూడా కావాలని పలు వార్డుల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల బీసీ కాలనీ వాసులు కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసిన అభివృద్ధి పనులను చేపట్టడం లేదని స్థానికులు అంటున్నారు. అంతర్గత రోడ్లు అధ్వానం పోచమ్మ గుడి సమీపంలోని శాంతినగర్లో అంతర్గత రోడ్డు అధ్వానంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు. దాదాపు పదేళ్లుగా ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఒక్క శాంతినగర్లోనే కాదు పలు వార్డుల్లోని అంతర్గత రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందనే విమర్శలు ఉన్నాయి. రూ.15 కోట్లతో పనులు ఇలా.. టీయూఎఫ్ఐడీసీ కింద దాదాపు రెండేళ్ల క్రితం ఆలేరు మున్సిపాలిటీకి రూ.15కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో రూ.9కోట్లతో వివిధ వార్డులు, ప్రధాన మార్గాల్లో స్ట్రామ్ల నిర్మాణం చేపట్టాలి. వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. గ్రామ పంచాతీయ కార్యాలయం ఆవరణలో కొత్త మున్సిపల్ భవనం నిర్మాణానికి రూ.3కోట్లను కేటాయించారు. మిగితా రూ.3కోట్లతో ఇతర మౌలిక సదుపాయాలకు వెచ్చించాల్సి ఉంది. కానీ ఇంత వరకు పనుల అతీగతి లేకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
కదంతొక్కిన కార్మికలోకం
సాక్షి, నెట్వర్క్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రమైన భువనగిరితోపాటు ఆలేరు, యాదగిరిగుట్ట, రామన్నపేట, పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్, మోత్కూరు ప్రధాన సెంటర్లతోపాటు మిగతా అన్ని మండల కేంద్రాల్లో కార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టాయి. చౌటుప్పల్లో ఆర్డీఓ, ట్రాన్స్కో డీఈ కార్యాలయాల ఎదుట ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాడ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలి
భువనగిరి : నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలతోపాటు గర్భిణులకు అబార్షన్లు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ల నిర్వాహకులను అరెస్టు చేసి వెంటనే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భువనగిరిలోని రైతు బజార్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్లు, అబార్షన్లు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారికిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్రావు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీమున్సిపల్ చైర్మన్ అంజనేయులు, పార్టీ పట్టణకమిటి అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, రమేష్, సందెల సుధాకర్, కుశంగుల రాజు, ఇట్టబోయిన గోపాల్, భిక్షపతి, భగత్, చౌదరి, పాండు, ముజీబ్, పద్మ, పావని, మధు తదితరులు పాల్గొన్నారు. -
భూ యజమానులకు నోటీసులు జారీ
బీబీనగర్: బీబీనగర్ మండల పరిధిలో రైల్వే డబ్లింగ్ పనుల కోసం భూ యజమానులకు రెవెన్యూ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. బీబీనగర్ మండల గూడూరు గ్రామం నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు వరకు రైల్వే మార్గంలో జరుగనున్న నడికుడి డబ్లింగ్ పనులకు ఇటీవల భూ సేకరణ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా గూడూరు, పగిడిపల్లి, భువనగిరి, నాగిరెడ్డిపల్లి, నందనం, అనాజిపురం, బొల్లేపల్లి గ్రామాల పరిధిలో రైల్వే ట్రాక్ వెంట గల భూ యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులను జారీ చేయడంతో పాటు సర్వే ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో 800 ఎకరాలకుపైగా భూ సేకరణ జరుగనుంది. వయోవృద్ధుల సంక్షేమానికి కృషిభువనగిరిటౌన్ : వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం భువనగిరిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వయోవృద్ధుల కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ నాయకులు మందడి ఉపేందర్ పాల్గొన్నారు. ఆటాపాటలతో చదువు నేర్చుకోవాలిభువనగిరి : దివ్యాంగ విద్యార్థులు ఆటాపాటలతో చదువు నేర్చుకోవాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని భవిత కేంద్రంలో అలింకో సంస్థ సహకారంతో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 66 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా బోధనాభ్యాసన పరికరాలను అందజేసి మా ట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విలీన విద్యా జిల్లా సమన్వయ కర్త పెసరు లింగారెడ్డి, విలీన విద్యా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా నిత్యకల్యాణ వేడుకయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కల్యాణ వేడుకను అర్చకులు నేత్ర పర్వంగా నిర్వహించారు. శ్రీస్వామి వారి ప్రధానాలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేక పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్య కల్యాణం వేడుకను జరిపించారు. అనంతరం ముఖమండపంలో అష్టోత్తర పూజలు చేపట్టారు. రాత్రి శయనోత్సవం జరి పించి, ద్వార బంధనం చేశారు. -
సకాలంలో బస్సులు నడపాలని రాస్తారోకో
రాజాపేట : సకాలంలో బస్సులు నడపాలని కోరుతూ రాజాపేటలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం స్థానిక గాంధీ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని కొండ్రెడ్డిచెరువు, పుట్టగూడెం గ్రామాలకు చెందిన సుమారు 60 మందికిపైగా విద్యార్థులం రాజాపేటలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్నామని తెలిపారు. తాము మా గ్రామాల నుంచి పాఠశాలలకు వచ్చేందుకు ఉదయం 7గంటలకు ఒకసారి, సాయంత్రం 5గంటలకు యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు ఉందని, అది ఉదయం వేళలో సమయానికి బస్సు నడుస్తున్నా సాయంత్రం మాత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని వాపోయారు. స్థానిక నాయకులు చొరవ చూపి యాదగిరిగుట్ట డిపో అధికారులతో మాట్లాడి విద్యార్థులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
అభాగ్యులను ఆదుకునేలా..
కుటుంబ పెద్ద చనిపోతే ‘ఎన్ఎఫ్బీఎస్’ కింద రూ.20 వేల ఆర్థికసాయం సాక్షి, యాదాద్రి : పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం–ఎన్ఎఫ్బీఎస్) అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు సరిపడా నిధులుండడంతో ఐదేళ్లుగా మరుగున పడిన ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్ గతనెలలో జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రైతులు, చేనేత కార్మికులు, వివిధ వృత్తుల వారి ఇంటి పెద్ద చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థికసాయం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ నేతృత్వంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో అర్హత కలిగిన వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ఆర్థిక సహాయం మంజూరు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉంది. మంజూరైన వారికి త్వరలో ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. అర్హతలు ఇవే.. కుటుంబ యజమాని వయసు 18 నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉండాలి. మరణ, వయసు ద్రువీకరణ సర్టిఫికెట్లు, ఆధార్, తెల్ల రేషన్కార్డు జతచేయాలి. అలాగే ఆర్థిక సహాయం పొందగోరె వారి గుర్తింపు పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్తో అనుసంధానం అయిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా నంబర్, పాస్పోర్టు సైజ్ ఫొటోను జతపర్చాలి. మండలాల్లోనైతే తహసీల్దార్, పట్టణాల్లోనైతే మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను విచారణ జరిపి అర్హత ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ ద్వారా సెర్ప్ సీఈఓ కార్యాలయానికి పంపుతారు. అక్కడి పరిశీలన చేసిన అనంతరం లబ్ధిదారులను ఓకే చేసి చనిపోయిన కుటుంబ యజమాని నామినీ ఖాతాల్లో రూ.20వేలు జమ చేస్తారు. దరఖాస్తులు ఇలా.. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో 620 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో బీసీలు 378, ఎస్సీలు 179, ఓసీలు 36, ఎస్టీలు 27 మంది ఉన్నారు. ఈనెలలో భాగంగా బుధవారం నాటికి మరో 225 మంది దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, పోచంపల్లి మున్సిపాలిటీల నుంచి అతి తక్కువగా ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు నుంచి ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైంది. మండలాల్లో మోటకొండూరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, బొమ్మలరామారం మండలాల నుంచి అధికంగా మంజూరయ్యాయి. అయితే దరఖాస్తులకు చివరి తేది అంటూ గడువు లేకపోవడంతో అర్హులు తమ అర్జీలను అందజేస్తూనే ఉన్నారు. ఫ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పక్కాగా అమలుకు సెర్ప్ సీఈఓ ఆదేశం ఫ అర్జీలు స్వీకరిస్తూ ఆర్థికసాయం మంజూరు చేస్తున్న యంత్రాంగం ఫ నామినీ ఖాతాల్లో జమ అవుతున్న నిధులు ఫ జూన్లో 620 కుటుంబాలకు లబ్ధి జూన్లో ఆర్థికసాయం మంజూరు వివరాలు నారాయణపురం 29 పోచంపల్లి 17 రాజాపేట 59 రామన్నపేట 30 వలిగొండ 36 యాదగిరిగుట్ట 46 మున్సిపాలిటీల్లో మంజూరు ఆలేరు 63 భువనగిరి 02 చౌటుప్పల్ 19 మోత్కూరు 20 పోచంపల్లి 02 యాదగిరిగుట్ట 02 మండలం మంజూరైన లబ్ధిదారలు అడ్డగూడూరు 10 ఆలేరు 36 భువనగిరి 21 ఆత్మకూర్(ఎం) 30 బీబీనగర్ 20 బొమ్మలరామారం 34 చౌటుప్పల్ 10 గుండాల 23 తుర్కపల్లి 14 మోటకొండూరు 68 మోత్కూరు 29 అర్హులంతా అర్జీ పెట్టుకోండి 60 ఏళ్లలోపు వయసు ఉన్న కుటుంబ యజమాని చనిపోతే రూ.20 వేల ఆర్థిక సాయం కోసం ఎన్ఎఫ్బీఎస్కు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ నెలలో 620 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పు వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. బుధవారం నాటికి మరో 225 దరఖాస్తులు వచ్చాయి. – వీరారెడ్డి, అదనపు కలెక్టర్ -
లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తే కేసులు తప్పవు
సాక్షి, యాదాద్రి : భువనగిరిలో అనుమతిలేని ఆస్పత్రులు నడవడంతోపాటు లింగనిర్ధారణ పరీక్షలు చేసే సెంటర్లపై విచారణ చేసి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై బుధవారం ఆయన సమీక్షించారు. మూడు రోజుల క్రితం భువనగిరిలో లింగనిర్ధారణ పరీక్షలతో పాటు, ఇద్దరు గర్భిణులకు గర్భస్రావం చేసిన సంఘటపై సీరియస్ అయ్యారు. జిల్లా కేంద్రంలో రెండేళ్ల క్రితం అనుమతి రద్దు చేసిన ఆస్పత్రికి మరో పేరుతో అనుమతి ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మాదాపూర్, వలిగొండ, ఆలేరు, మోత్కూరు ఇలా పలు చోట్ల ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా నడస్తుంటే కఠిన చర్యలు ఎందుకు సిఫార్సు చేయడం లేదని వైద్యారోగ్యశాఖ అధికారిని కలెక్టర్ ప్రఽశ్నించారు. లింగనిర్ధారణ పరీక్షలు, ఆనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నడపడం, అర్హతలేని డాక్టర్లతో వైద్యం చేయడాన్ని అడ్డుకోవడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని సమాచారం. ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి వలిగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని ప్రభుత్వ ఆర్థికసాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏ ఈ కిరణ్, ఏపీఎం జాని, ఏపీఓ పరుశరాములు, కార్యదర్శి తదతరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
పర్యావరణాన్ని కాపాడుదాం
భూదాన్పోచంపల్లి: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. బుధవారం భూదాన్పోచంపల్లి రాంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, డీఎఫ్ఓ పద్మజారాణి, పబ్లిక్హెల్త్ డీఈ మనోహర, ఎంపీడీఓ భాస్కర్, ఎంఈఓ ప్రభాకర్, రాజారెడ్డి, మేనేజర్ నిర్మల, రాజేశ్, నాయకులు తడక వెంకటేశం, పాక మల్లేశ్, భారత లవకుమార్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్రెడ్డి, కరుణాకర్రెడ్డి, రమేశ్, సందీప్, వెంకటేశ్, వాసుదేవ్, బాలకృష్ణ, అనిల్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాడలో వన మహోత్సవం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండకు దిగువన ఉన్న ఆధ్యాత్మిక వాడలో బుధవారం ఆలయ ఉద్యోగులు, మినిస్ట్రీరియల్, మతపర, నాలుగోవ తరగతి సిబ్బంది, నాయీ బ్రాహ్మణులు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, పరిసరాలు, సంస్కృత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ భాస్కర్ శర్మ, ఆలయ ఉద్యోగులు గజివెల్లి రమేష్బాబు, నవీన్కుమార్, రఘు, శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయులు, అర్చకులు పాల్గొన్నారు. -
సాగర్ను సందర్శించిన విదేశీయులు
నాగార్జునసాగర్: భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థలో శిక్షణ పొందుతున్న 24 దేశాలకు చెందిన 37మంది మంగళవారం నాగార్జునసాగర్ను సందర్శించారు. పర్యావరణం, అభివృద్ధి, నీటి సంరక్షణ తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్న వీరు సాగర్ జలాశయం, ప్రధాన డ్యాం, జల విద్యుదుత్పాదన కేంద్రాన్ని పరిశీలించారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం, జలవనరుల వినియోగం తదితర అంశాల గురించి సాగనీటి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సాగునీటి శాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసులు, డ్యాం ప్రత్యేక రక్షణ దళం((ఎస్పీఎఫ్) ఉన్నారు. -
నెమలి, జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
వేములపల్లి: జాతీయ పక్షి నెమలి, జింక మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని వేములపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల రమేష్ కూలీ పనులతో పాటు చేపలు, కుందేళ్లు, అడవి పందుల వేటకు వెళ్తుంటాడు. అతడు తనకు పరిచయమున్న రాజు అనే వ్యక్తి నుంచి జింక, దుప్పి మాంసాన్ని తీసుకొచ్చి ఇంట్లో అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు మార్చి 23న వేములపల్లి ఎస్ఐ అతడి ఇంటిపై దాడి చేయగా పారిపోయాడు. దీంతో రమేష్పై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రెండు ఎయిర్ రైఫిల్స్, 3 కత్తులు, 5 అడవి పందుల వేటకు సంబంధించిన వలలు, 15 కుందేళ్ల వేటకు సంబంధించిన ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, వేములపల్లి ఎస్ఐ డి. వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
బీబీనగర్: వ్యవసాయ బావి వద్ద బోరు మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండలం రావిపహాడ్ తండాలో మంగళవారం జరిగింది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ తండాకు చెందిన రైతు బానోతు నరేష్(25) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి బోరు మోటారు ఆన్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు, గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంమఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని యాదాద్రి టౌన్షిప్లో ముళ్ల పొదల్లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మఠంపల్లి ఎస్ఐ పి. బాబు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి సుమారు 35ఏళ్లు ఉంటాయని, అతడు మఠంపల్లిలో భిక్షాటన చేస్తుండేవాడని స్థానికుల ద్వారా తెలిసిందని ఎస్ఐ పేర్కొన్నారు. అతడు రెండు రోజుల క్రితమే మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మాధవరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణఫ 11మంది బైండోవర్ మునగాల: మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో సోమవారం రాత్రి పీర్ల పండుగ సందర్భంగా ముస్లింలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇరువర్గాలకు చెందిన 11మందిని మంగళవారం మండల తహసీల్దార్ బి. రామకృష్ణారెడ్డి ఎదుట హాజరుపర్చగా వారిని బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బైండోవర్ చేసిన వారిలో గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి, యాకూబ్ పాషా, షేక్ చాంద్పాషా, షేక్ ఇయ్మాల్, షేక్ నాగుల్జానీ, షేక్ సైదా, షేక్ మన్సూర్, షేక్ జానీపాషా, మహ్మద్ అలీ, షేక్ రహీం, షేక్ షఫీ ఉన్నారు. రైలు ఢీకొని వృద్ధుడు మృతి ● ఆలేరు పట్టణంలో ఘటనఆలేరు: రైలు పట్టాలు దాటుతున్న వృద్ధుడు ప్రమాదవశాత్తు పట్టాలపై కింద పడిపోగా.. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలేరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్(70) మంగళవారం సాయంత్రం స్థానిక రైల్వే గేట్ సమీపంలోని మెయిన్రోడ్డు వద్దకు పని మీద వచ్చాడు. కాసేపటికి ఇంటికి తిరిగి వెళ్తూ రైల్వే గేట్ వద్ద పట్టాలు దాటుతుండగా.. పట్టాల మధ్య పడిపోయాడు. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వైపు రైలు వేగంగా వస్తోంది. ఇది గమనించిన వృద్ధుడు కేకలు వేయడంతో స్థానికులు కొందరు గమనించి పట్టాల పైనుంచి వృద్ధుడిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. అప్పటికే రైలు సమీపించడంతో స్థానికులు పక్కకు తప్పుకోవడంతో రైలు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న భువనగిరి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది ఆత్మహత్యా.. లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ కృష్ణారావు తెలిపారు. -
విపత్తు పరిస్థితులపై ఎయిమ్స్లో శిక్షణ
బీబీనగర్: విపత్తు పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేలా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ విభాగం ద్వారా బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలకు అందజేసిన భారత్ హెల్త్ ఇనిషియేటివ్, సహయోగ్ హిత మైత్రి క్యూబ్ల వినియోగంపై మంగళవారం 100మందికి శిక్షణ ఇచ్చారు. కేంద్ర విపత్తు నిర్వహణ సెల్ నుంచి రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ డాక్టర్ తన్మోయ్ రాయ్, బృందం క్యూబ్ల వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంగీత సంపత్, అభిషేక్ ఆరోరా, అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు, భీష్మ్ క్యూబ్స్ నోడల్ అధికారి మహేశ్వర్ లక్కిరెడ్డి, అదనపు నోడల్ అధికారి సిద్దార్థరావు పాల్గొన్నారు. -
భర్త వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య
భువనగిరి: భర్త వేధింపులు భరించలేక ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం భువనగిరి పట్టణంలో జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల కేంద్రానికి చెందిన వంగాల బాబు, నీరటి కవిత(30) 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంఎస్సీ పూర్తిచేసిన కవిత భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించగా.. బాబు ఎలాంటి పనిచేయకుండా ఖాళీగా ఉండేవాడు. ఈ క్రమంలో కవితకు రెండుసార్లు అబార్షన్ సైతం అయ్యింది. దీంతో ఇద్దరు కలిసి కొంతకాలం హైదరాబాద్కు వెళ్లారు. బాబు ఓ బ్యాంకులో ఉద్యోగంలో చేరగా.. కవిత ఇంటి వద్దనే ఉండేది. ఈ క్రమంలో కవిత మరోసారి గర్భం దాల్చింది. దీంతో నెల రోజు క్రితం భువనగిరికి తిరిగి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. బాబు భువనగిరికి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం కవిత నాలుగు నెలల గర్భవతి. బాబు వరకట్నం తీసుకురావాలని కవితను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బ్యాంకు వెళ్లిన బాబు తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా కవిత తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా.. అప్పటికే కవిత చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యాదాద్రి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భర్త వేధించడంతో పాటు అతడే కవితకు ఉరి వేసి హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్ల గొండలోని ఎంజీయూ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఎమ్మెస్సీ విద్యార్థుల పరిశోధన పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చివరి సెమిస్టర్లో విద్యార్థులు చేసిన పరిశోధనలు తమ ఉద్యోగ అవకాశాలను నిర్ణయిస్తాయని గుర్తించాలన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆహార భద్రత విభాగం బాధ్యులు ఎం. సతీష్కుమార్ మాట్లాడుతూ.. ఆహార పదార్థాల్లో ఫంగస్ ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. తినే ఆహార పదార్థాల్లో నాణ్యత, శుభ్రత పాటించాలన్నారు. అనంతరం 21మంది విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. 13మంది విద్యార్థులు తమ పరిశోధనలకు సంబంధించి పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్, తిరుమల, అన్నపూర్ణ, మాధురి, మద్దిలేటి, రూప పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
ఎయిమ్స్లో రక్తదాన శిబిరం
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో మంగళవారం ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్ విభాగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, నర్సింగ్ అధికారులు, పారా మెడికల్ సిబ్బంది, విద్యార్థులు 47మంది రక్తదానం చేశారు. అనంతరం వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్, డీన్ నితిన్ అశోక్జాన్, వైద్యులు సంగీత సంపత్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా తదితరులు పాల్గొన్నారు. -
మూసీపై అన్నదాతల ఆశలు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కాలువల కింద ఇప్పటికే వరినార్లు పోసుకున్న రైతులు మరో పది రోజుల్లో నాట్లకు సమాయత్తమవుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని మూసీ ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగుకు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు మూసీ ప్రధాన కాల్వల ఆధుణీకరణ పనులు పూర్తికాలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయలేదు. దీంతో మూసీ ఆయకట్టులో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో అయోమయం నెలకొంది. 35వేల ఎకరాల ఆయకట్టు.. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 645 అడుగులు(4.46 టీఎంసీలు). ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు 35వేల ఎకరాల్లో పంటలు సాగువుతుంది. ప్రధాన కాల్వలకు మోటార్లు వేయడం ద్వారా అనధికారంగా మరో 15వేల ఎకరాలు సాగవుతుంది. యాసంగి పంట సాగు కోసం ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీ వరకు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదల ముగిసే నాటికి రిజర్వాయర్లో నీటిమట్టం 622 అడుగుల కనిష్ఠ స్థాయికి తగ్గింది. అప్పటి నుంచి వేసవిలో అకాల వర్షాలు, వానాకాలం ప్రారంభంలో తొలకరి వర్షాలతో మూసీ ఎగువ ప్రాంతాలైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వాగుల ద్వారా వరద నీరు మూసీ ప్రాజెక్టుకు వచ్చి చేరింది. అప్పటి నుంచి నిరవధికంగా వస్తున్న ఇన్ఫ్లోతో ప్రస్తుతం నీటిమట్టం 641.65(3.60 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. వానాకాలం ప్రారంభంలోనే మూసీ రిజర్వాయర్లో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆయకట్టు రైతుల్లో వానాకాలం పంట సాగుపై ఆశలు చిగురించాయి. కొనసాగుతున్న కాల్వ కట్ట మరమ్మతు పనులు.. మూసీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వకు నీటి విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ వద్ద కాల్వకు ఇరువైపులా లైనింగ్ దెబ్బతింది. దీంతో కాల్వకు నీటి విడుదల చేసిన సమయంలో నీటి ప్రవాహం ధాటికి ఇరువైపులా మట్టి కట్టలు కోతకు గురయ్యాయి. కోతకు గురైన చోట కాల్వకు ఆధుణీకరణ పనులను కాంట్రాక్టర్ ఇరవై రోజుల క్రితమే ప్రారంభించారు. ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం పనులు సాగితే పూర్తికావడానికి మరో వారం రోజుల సమయం పట్టవచ్చు. ఈ పనులు పూర్తయితేనే కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందుగానే మూసీ ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఈసారి సాగుకు ఎలాగైనా నీరు వస్తుందనే ఉద్దేశంతో రైతులు బోర్లు, బావుల కింద వరినార్లు పోసుకున్నారు. రైతులు మెట్ట దుక్కులు దున్ని వరినాట్లకు పొలాలను సిద్ధ చేశారు. మొదటి విడతలో కాల్వలకు విడుదల చేసిన నీటితోనే దమ్ములు చేసి నాటు వేసేందుకు వీలుగా పొలాలను సిద్ధ చేశారు. కానీ నీటి విడుదలపై అధికారులు ఇంత వరకు షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఎప్పుడు ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రెండు నెలలు వర్షాలు కురిసే అవకాశమున్నందున రిజర్వాయర్లో అందుబాటులో ఉన్న నీటిని ముందస్తుగానే సాగుకు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఫ 641.65 అడుగులకు చేరిన ప్రాజెక్టు నీటిమట్టం ఫ గరిష్ఠ నీటి మట్టానికి మరో మూడు అడుగుల దూరంలో.. ఫ ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని రైతుల విన్నపం -
‘భద్రాచలం’ ఈఓపై దాడిని ఖండిస్తున్నాం
యాదగిరిగుట్ట: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈఓపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజివెల్లి రమేష్బాబు అన్నారు. భద్రాచలం ఆలయ ఈఓపై జరిగిన దాడికి నిరసనగా యాదగిరిగుట్ట వైకుంఠద్వారం వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలతో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని అల్లూరి జిల్లా పురుషోత్తట్నం గ్రామంలో గల భద్రాచలం ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈఓ రమాదేవి, అర్చకులు, సిబ్బందిపై స్థానికులు దాడి చేయడం బాధాకరమన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవలయాల భూములను రక్షించేందుకు ఆలయ ఉద్యోగులు ముందుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు గజివెల్లి రఘు, నవీన్కుమార్, ముద్దసాని నరేష్, దయానంద్, అర్చకులు పాల్గొన్నారు. ఫ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ రమేష్బాబు ఫ యాదగిరిగుట్ట వైకుంఠద్వారం వద్ద ఆలయ ఉద్యోగుల నిరసన -
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న దొంగ
నల్లగొండ: బైక్లు చోరీ చేస్తున్న దొంగను మంగళవారం అరెస్ట్ చేసినట్లు నల్లగొండ టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. నిడమనూరు మండలం బొక్కముంతలపాడ్ గ్రామానికి చెందిన కొండేటి సంతోష్కుమార్ మద్యానికి బానిసై బైక్లు చోరీ చేస్తున్నాడు. గత నెల 25న గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన షేక్ మహబూబ్వలీ తన బైక్ను నల్లగొండ రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేయగా చోరీకి గురైంది. బాధితుడు నల్ల గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లు బైపాస్ రోడ్డులో నల్లగొండ టూటౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సంతోష్కుమార్, మరో బాలుడు కలిసి దొంగిలించిన బైక్పై అనుమానాస్పదంగా వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి హాలియాలో చోరీ చేసిన 2 బైక్లు, మిర్యాలగూడ, వాడపల్లి, నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ మరో మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న టూటౌన్ ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఫ పోలీసుల అదుపులో నిందితుడు -
ప్రసాద వితరణకు ఈవో రూ.లక్ష విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ కోసం దేవస్థానం ఈవో వెంకట్రావ్ తన జీతంలో నుంచి రూ.లక్షను విరాళంగా మంగళవారం అందజేశారు. ప్రతి నెలా తన జీతంలో నుంచి రూ.లక్ష విరాళంగా ఇస్తానని ఇప్పటికే ఈవో ప్రకటించారు. ఆ మేరకు గత నెల రూ.లక్ష తన జీతంలో నుంచి, మరో రూ.2లక్షలు తన పిల్లల పేరుతో ఆలయానికి అందించారు. ఇందులో భాగంగానే ఈ నెల జీతంలో నుంచి రూ.లక్షను విరాళంగా డోనర్ సెల్ వద్ద అందజేశారు. ప్రతి ఆదివారం నుంచి శుక్రవారం వరకు భక్తులకు ఉచితంగా పులిహోర ప్రసాదం, శనివారం లడ్డూ ప్రసాదం అందజేస్తారు. దీనికి ఈ నగదును వినియోగించనున్నట్లు వెల్లడించారు. దాతలు తమకు నచ్చిన రోజుల్లో, తిఽథులలో, నిత్యం వారి పేరున ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వాలని ఆలయ ఈవో కోరారు. ఫ తన జీతం నుంచి ప్రతి నెలా కేటాయిస్తున్న వెంకట్రావ్ -
అర్హత లేకున్నా వైద్యం
ల్యాబ్ను సీజ్ చేయాలని నోటీసులు జిల్లా కేంద్రంలోని గాయత్రి ఆస్పత్రిలో ఈ నెల 6న ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7న విచారణ అనంతరం ఆస్పత్రికి సంబంధించిన డాక్టర్ శివకుమార్ను రిమాండ్కు తరలించగా డాక్టర్ గాయత్రి, ల్యాబ్ నిర్వాహకుడు పాండు, ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఆస్పత్రితో పాటు ల్యాబ్ను సీజ్చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పట్టణ పోలీసులు నోటీసులు పంపించారు. అదేవిధంగా సంజాయిషీ ఇవ్వాలని ఎస్ఎల్ఎన్ఎస్ ల్యాబ్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు. భువనగిరి: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు చాలా వరకు ఆస్పత్రులు ఏర్పాటు చేసే సమయంలో అర్హత ఉన్న వైద్యుల సర్టిఫికెట్స్ పెట్టి అనుమతులు పొందుతున్నారు. అనంతరం వారి స్థానంలో అర్హతలేని వైద్యుల ద్వారా వైద్య సేవలందిస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని గాయత్రి ఆస్పత్రిలో మహిళలకు అబార్షన్లు చేసిన ఘటనపై జరిపిన విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 200 ప్రైవేట్ ఆస్పత్రులు జిల్లా వ్యాప్తంగా సుమారు అనుమతులు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు 200 వరకు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరులో ఉన్నాయి. ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ముందుగా ఏడు శాఖల అనుమతులు తీసుకున్న అనంతరం చివరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉండాలి. అనుమతి తీసుకునే సమయంలో ఎవరి సర్టిఫికెట్స్ పెట్టారో వారు మాత్రమే ఆస్పత్రిలో వైద్య సేవలందించాలి. కానీ ప్రస్తుతం చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి తీసుకున్న వారు కాకుండా అర్హతలేని వైద్యులు వైద్య సేవలందిస్తున్నారు. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు అబార్షన్లు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. తుర్కపల్లి, ఆలేరు, మాదాపూర్, బొమ్మలరామారం ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు గుర్తించి ఆస్పత్రులను సీజ్ చేశారు. కానీ నిర్వాహకులు తిరిగి వక్రమార్గంలో ఆస్పత్రులను తెరిచి సేవలందించడం పరిపాటిగా మారింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీ అండ్ పీఎన్డీటీ ప్రత్యేక బృందం గల అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలను నామమాత్రంగా తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదేబాటలో స్కానింగ్ సెంటర్లు జిల్లాలో ఆస్పత్రులతో పాటు స్కానింగ్ సెంటర్లలో కూడా అర్హత లేని వారిచే స్కానింగ్ పరీక్షలు చేయిస్తున్నారు. స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకునే వారు ల్యాబ్ టెక్నీషియన్ అర్హత కలిగి ఉండాలి. కానీ అర్హత కలిగి ఉన్న వారితో అనుమతి పొందిన తర్వాత అర్హత లేని వారు పరీక్షలు చేస్తున్నారు. అనుమతి లేకున్నా అబార్షన్లు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెసీ (ఎంటీపీ) చట్టం ప్రకారం మహిళలు సురక్షితమైన గర్భస్రావ సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే ఆస్పత్రుల్లో గర్భస్రావం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ సర్టిఫికెట్ 16 ప్రైవేట్ ఆస్పత్రులకు ఉంది. కానీ సర్టిఫికెట్ లేకున్నా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భస్రావాలు చేస్తున్నారు. ఫ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఫ అనుమతులు తీసుకునేది ఒకరు.. వైద్యం చేసేది మరొకరు ఫ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న వైద్యాధికారులు -
ఆగిరెడ్డి భూమిని సందర్శించిన తహసీల్దార్
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో రైతు ఆగిరెడ్డి తనకు గల రెండెకరాల మూడు గుంటల భూమి ఇతరుల పేరున మారిందని సోమవారం కలెక్టర్ చాంబర్లో పెట్రోల్ పోసుకున్నాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాసరావు బాధిత రైతు ఆగిరెడ్డి భూమిని మంగళవారం సందర్శించారు. బాధిత రైతు తన భూమిగా పేర్కొంటున్నా హద్దులు గుర్తించలేకపోతున్నాడని, దీంతో 340, 345, 346 సర్వే నంబర్లలోని భూమిని సర్వే చేయించి తన భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిపారు. బాధిత రైతు విన్నపం మేరకు సదరు సర్వే నంబర్లలోని రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే ప్రక్రియ నిర్వహించనున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఆర్ఐ వెంకట్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస్, రైతులు ఉన్నారు. -
భూ భారతి దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు
యాదగిరిగుట్ట రూరల్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్ లాగిన్లో ఉన్న అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎంపీడీఓతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లు మంజూరై, కట్టుకోని పరిస్థితుల్లో ఉన్నవారికి, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి, ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బేస్మెంట్ లెవల్, పిల్లర్ లెవల్, స్లాబ్ లెవల్లో పనులు పూరైన వారి ఖాతాల్లో ప్రతి సోమవారం డబ్బులు జమవుతాయన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ నవీన్ కుమార్, ఆర్ఐ శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ రాము తదితరులున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి బీబీనగర్: ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత గడువు లోపు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతురావు తెలిపారు. బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండాలని, నాణ్యత ప్రమాణాలతో కట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య
భువనగిరి: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీంసింగ్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను సందర్శించారు. ఆయన వెంట కశాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డి, అధ్యాపకులు ఉన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి యాదగిరిగుట్ట: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. పదో తరగతి సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులను కళాశాలలో అడ్మిషన్ పొందే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు. -
14న అప్రెంటిస్షిప్ మేళా
ఆలేరు: ఆలేరులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఈనెల 14న అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండి, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు జీరాక్స్ ప్రతులో మేళాకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 98668 43920ను సంప్రదించాలని పేర్కొన్నారు. స్కీంలను సద్వినియోగం చేసుకోవాలిబీబీనగర్: ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల అభివృద్ధికి కొత్తగా తీసుకువచ్చిన స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. మంగళవారం బీబీనగర్ మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీబీనగర్ పీహెచ్సీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా బ్రహ్మణపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఏపీఓ చండీరాణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రజావాణి, కార్యదర్శి బాలమణి, ఏపీఎం శ్రీనివాస్ ఉన్నారు. ‘ప్రసాద్ 2.0’కు ఎంపికై న సోమేశ్వరాలయంఆలేరురూరల్: ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీసోమేశ్వర స్వామి ఆలయం ప్రసాద్ 2.0 పథకానికి ఎంపికై ంది. ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంబంధిత శాఖకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారి 163 సమీపంలో ఈ ఆలయం ఉండడంతో పర్యాటక వసతులు, శిల్పాల పరిరక్షణ, సౌందర్యీకరణ, డిజిటల్ మ్యూజియం అభివృద్ధి వంటి అంశాలకు నిధులు లభించనున్నాయి. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలిభువనగిరి : ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మయ్య, రమేష్ పాల్గొన్నారు. -
ఇల్లు ఇప్పించండి సారూ..
ఆలేరురూరల్: అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చెందిన గౌరగండ్ల ప్రమీల పెంకుటిల్లులో కిరాయికి ఉంది. రెండేళ్ల క్రితం వర్షాలకు అద్దె ఇళ్లు కూలిపోవడంతో అదే గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనంలో నివాసం ఉంటుంది. 14 ఏళ్ల క్రితం ఈమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని పోషించుకుంటుంది. ఈమెకు చెవిడు, మూగ. సైగలతోనే సమాధానం చెబుతుంది. ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నా ఇల్లు మంజూరు కాలేదని, అధికారుల చుట్టూ తిరిగినా తన గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈవిషయమై ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ను సంప్రదించగా ప్రమీల పేరు ఆన్లైన్లో చూపించడం లేదని పేర్కొంటున్నారు. ఫ ఇల్లు లేక ఎస్సీ కమ్యూనిటీ భవనంలో నివాసం ఫ అధికారుల చుట్టూ తిరుగుతున్న శర్బనాపురానికి చెందిన మహిళ -
ఎంపీటీసీ సా్థనాలు 178
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానం పెరిగింది. గతంలో 17 మండలాల్లో 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసిన ఎంపీటీసీ స్థానంతో 178 కి చేరింది. ప్రతి మండలానికి ఐదు ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా జాబితా ప్రచురించారు. మోత్కూరు మండలంలో గతంలో ఉన్న నాలుగు ఎంపీటీసీ స్థానాలకు అదనంగా పాటిమట్ల ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. పాటిమట్ల కొత్త ఎంపీటీసీ స్థానం మోత్కూరు మండలంలో గతంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు దాచారం, పొడిచేడు, దత్తప్పగూడెం, ముసిపట్ల ఉండేవి. వీటిలోంచి దాచారం, పాటిమట్ల, సదర్శపురం మూడు గ్రామాలు కలిపి ఉండేవి. ప్రస్తుతం పాటిమట్ల సదర్శపురం రెండు గ్రామాలు కలిపి ఒక ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు నుంచి ఐదు ఎంపీటీసీ స్థానాలు అయ్యాయి. ఆలేరు మున్సిపాలిటీ నుంచి విడిపోయిన నూతన గ్రామ పంచాయతీ అయిన సాయిగూడెంను కొల్లూరు ఎంపీటీసీ పరిధిలో విలీనం చేశారు. భూదాన్పోచంపల్లి మండలంలో సాయినగర్ గ్రామ పంచాయతీ దేశ్ముఖి ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉండేది. ప్రస్తుతం సాయినగర్ గ్రామ పంచాయతీని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈమేరకు ముసాయిదా తయారు చేశారు. అత్యధికంగా వలిగొండలో 17 ఎంపీటీసీ స్థానాలు 2019 ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో 177 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఒకటి పెరగడంతో అవి 178కి చేరుకున్నాయి. జిల్లాలో అత్యధికంగా వలిగొండలో 17 ఎంపీటీసీ స్థానాలు, రామన్నపేటలో 16, భువనగిరి 13, బీబీనగర్లో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో 12 నుంచి 5కు తగ్గకుండా ఉన్నాయి. దాడిని ఖండిస్తున్నాం భద్రాచలం శ్రీసీతారామ ఆలయ ఈఓపై దాడిని ఖండిస్తున్నట్లు యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. - 8లోన్యూస్రీల్ఫ జిల్లాలో పెరిగిన మండల ప్రాదేశిక నియోజకవర్గం ఫ పాటిమట్ల, సదర్శపురం రెండు గ్రామాలు కలిపి పాటిమట్ల ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు ఫ ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు విడుదలైన షెడ్యూల్ ఫ నేడు ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ.. 10, 11న పరిష్కారం ఫ 12న తుది జాబితా ప్రకటన5 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా.. ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా ఎంపీటీసి నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరించేందుకు పంచాయతీరాజ్ శాఖ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా జిల్లా పరిషత్ అధికారులు మంగళవారం అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ నియోజకవర్గాల ముసాయిదా జాబితా ప్రకటించారు. 8, 9 తేదీల్లో ప్రకటించిన జాబితాలో ఎలాంటి అభ్యంతరాలున్నా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. వచ్చిన అభ్యంతరాలన్నింటిని 10, 11వ తేదీల్లో పరిష్కరించనున్నారు. 12వ తేదీన ఎంపీటీసీ నియోజకవర్గాల తుది జాబితాను ప్రకటించనున్నారు. -
కొండమడుగు కార్యదర్శి సస్పెన్షన్
బీబీనగర్: మండలంలోని కొండమడుగు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులు పక్కదారి పట్టడంతో పాటు సుమారు రూ.93,40,377 దుర్వినియోగం తదితర ఆరోపణలపై మూడు నెలల క్రితం డీఎల్పీ విచారణ నిర్వహించారు. నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారించి డీపీఓకు నివేదిక అందజేశారు. అయినా ఇప్పటికే పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ‘నిధులు పక్కదారి – ఏదీ రికవరీ’ శీర్షికతో ఈనెల 6న సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు స్పందించిన కలెక్టర్.. పంచాయతీ కార్యదర్శి అలివేలును సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా గ్రామ ప్రత్యేకాధికారిగా ఉన్న ఏంపీఓ మదీద్కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారు. మదీద్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయాలని డిప్యూటీ సీఈఓ విష్ణువర్దన్రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో నిధుల ఖర్చుపై విచారణ జరపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావుకు సూచించారు. అధికారులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సమగ్ర విచారణ చేయించాలి గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం చూసి కొండమడుగు గ్రామస్తులకు పెద్ద సంఖ్యలో ప్రజావాణికి తరలివచ్చారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయించాలని కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు.ఫ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి మూల్యం ఫ ‘సాక్షి’ కథనంతో స్పందించిన కలెక్టర్ -
భువనగిరిలోని గాయత్రి హాస్పిట్లో లింగ నిర్ధ్ధారణ పరీక్షలు
భువనగిరి : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేసిన ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో వెలుగుచూసింది. పోలీసులు, వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి భువనగిరిలోని గాయత్రి ఆస్పత్రిలో అబార్షన్ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేసి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు గుర్తించారు. ఆస్పత్రి వైద్యుడు హీరేకార్ శివకుమార్ను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. సోమవారం ఉదయం డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, గైనాలజిస్ట్ మాలతి, డెమో అంజయ్య పోలీసుల ఆధ్వర్యంలో ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి వైద్యులు, సిబ్బంది, బాధిత మహిళలను విచారణ చేశారు. పట్టణంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి డయాగ్నోస్టిక్ సెంటర్లో లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించారని తేలడంతో అక్కడా తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు దంతూరి పాండును విచారించారు. జూన్ 30న ఒకరు, ఈనెల 3వ తేదీన మరోకరు స్కానింగ్ కోసం వచ్చినట్లు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలు గాయత్రి ఆస్పత్రి వైద్యులను చికిత్స కోసం వేర్వేరుగా సంప్రదించారు. వారికి చెప్పిన ప్రకారం ఇద్దరు మహిళలకు ఆదివారం అర్ధరాత్రి చికిత్స చేశారు. ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్లో రికార్డులు, కంప్యూటర్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. స్కానింగ్ మిషన్ ల్యాబ్ను సీజ్ చేశారు. గాయత్రి ఆస్పత్రి వైద్యుడు శివకుమార్, డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు దంతూరి పాండుపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు భువనగిరి పట్టణ సీఐ రమేష్ తెలిపారు. అలాగే డాక్టర్ గాయత్రితో పాటు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఫోరెనిక్స్ ల్యాబ్కు పిండాలు అబార్షన్ చేయించుకున్న మహిళ పిండాలను డీఎన్ఏ పరీక్షల నిమితం ఫోరెనిక్స్ ల్యాబ్కు పంపనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద తెలిపారు. డాక్టర్ శివకుమార్ చికిత్స చేయడానికి అర్హత లేదని, సర్టిఫికెట్ ప్రకారం ఆస్పత్రిలో వైద్యులు లేరని వెల్ల డించారు. అబార్షన్ చేయించుకున్న ఇద్దరు మహిళల్లో ఒకరికి ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, మరొకరికి ఇక ఆడ పిల్ల ఉన్నారని పేర్కొన్నారు. -
పాఠశాలను సందర్శించిన జడ్జి
బొమ్మలరామారం : మండలంలోని మల్యాల గ్రామ పరిధిలో గల ఆశీర్ మిషన్ స్కూల్ను బుధవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవీలత సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం తుర్కపల్లి మండలం మాధాపూర్లోని ఆదరణ బాల సంరక్షణ భవన్ను జడ్జి సందర్శించారు. బాలలతో ముఖాముఖి మాట్లాడారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.అనంతరం మల్కాపూర్లో ఇటుక బట్టీలను సందర్శించారు. బట్టీలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి తుర్కపల్లి ఎస్హెచ్ఓకు సమాచారం అందించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ హెయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగరాజు తుర్కపల్లి ఏఏఎస్ఐ బాల్ నర్సింహ పాల్గొన్నారు. గుట్ట శివాలయంలోసంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతసేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం ప్రాకారమండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అందుబాటులో సరిపడా ఎరువులు భువనగిరి : రైతుల అవసరాల మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను ఎరువుల దుకాణంలో అందజేయాలని, విస్తీర్ణణాన్ని బట్టి ఎరువులు ఇస్తారని పేర్కొన్నారు. వానాకాలం సీజన్కు కావాల్సిన ఎరువులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామన్నారు. భువనగిరి రూరల్కు ఇద్దరు కొత్త ఎస్ఐలు భువనగిరి : భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్కు కొత్తగా ఇద్దరు ఎస్ఐలు రానున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాచకొండ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సెప్టెంబర్ 25 నుంచి 2025 జూన్ 30వ తేదీ వరకు శిక్షణ పొందిన కొత్త ఎస్ఐలను పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. ఇందులో భాగంగా భువనగిరి రూరల్కు ఓరుగంటి సంధ్య, కట్ట శివశంకర్రెడ్డి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.బియ్యం ఎగుమతుల్లో వేగం పెంచండిరామన్నపేట : గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి బియ్యం ఎగుమతులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో రామన్నపేట, వలిగొండ మండలాల పరిధిలోని మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీలైనంత త్వరగా సీఎంఆర్ బకాయిలు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, సీనియర్ అసిస్టెంట్ గాలయ్య ఆర్ఐలు శోభ, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
ఏసీబీకీ చిక్కుతున్నా లంచాలు ఆగట్లే
ఉమ్మడి జిల్లాలో నెలకొకరు చొప్పున పట్టుబడుతున్న అధికారులు అవినీతి ఎక్కువగా ఈ శాఖల్లో.. ఉమ్మడి జిల్లాలో పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఎక్కువగా ఏసీబీకి చిక్కుతున్నారు. కేసులు నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత సదరు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తోంది. కొంతమంది ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని పోస్టింగ్ పొందుతున్నారు. కోర్టుల్లో కేసుల విచారణకు సుమారు ఏడాది నుంచి రెండేళ్ల కాలం పడుతుండగా.. కొంత మందికి మాత్రమే శిక్షపడుతోంది. మరికొన్ని కేసులు కోర్టుల్లో నిలబడడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతున్నారు. అవినీతికి పాల్పడుతూ ఉమ్మడి జిల్లాలో నెలకొకరు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. నెలవారీ వేతనాలు వస్తున్నా.. పనుల కోసం తమ వద్దకు వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారిని ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేస్తున్నప్పటికీ అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. గడిచిన రెండేళ్లలో 18 వరకు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. 2024లో 11 మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడుగురు ఏసీబీ వలలో చిక్కారు. జిల్లాలో ఈ ఏడాది కేసులు ఇలా... ● తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పోలీస్స్టేషన్లో జనవరి 12వ తేదీన పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులో లంచం తీసుకుంటూ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు పట్టుబడ్డారు. ఈ కేసులో ఓ వ్యక్తి వద్ద రూ.1.40 లక్షల ముడుపులకు ఒప్పందం కుదుర్చుకొని రూ.70 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ● చౌటుప్పల్లో మార్చి 6వ తేదీన ట్రాన్స్కో ఏడీ శ్యాంప్రసాద్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫార్మా పరిశ్రమకు విద్యుత్ బకాయిలు క్లీయరెన్స్ ఇవ్వడంతో పాటు మీటర్ పునరుద్ధరణకు లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. ● ఏప్రిల్ నెలలో రేషన్బియ్యం అక్రమంగా తరలిస్తున్న కేసులో చింతలపాలెం పోలీస్స్టేషన్లో ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ అంతిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ● సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యుల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి రూ.16 లక్షలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో మే 12వ తేదీన వారిని పట్టుకున్నారు. ● పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో పంచాయతీ కార్యదర్శి సతీష్కుమార్ ఒక వ్యక్తి నుంచి రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడని ఫిర్యాదు రావడంతో జూన్ 26న ఏసీబీ అధికారులు దాడి చేసి సతీష్ను పట్టుకున్నారు. ● గత నెల 28న హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ (అవుట్సోర్సింగ్) విజేతారెడ్డి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా పట్టుబడిన మిర్యాలగూడ సివిల్ సప్లయీస్ డీటీ అత్యధికంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖల్లోనే..కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తూ పట్టుబడి సీజ్ అయిన లారీలను విడిపించేందుకు మిర్యాలగూడ సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ జావెద్ రూ.70 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జావేద్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నల్లగొండ డీఎస్ఓ ఆపీస్ కార్యాలయంలో, జావెద్ ఇంట్లో సోదాలు చేశారు. సోమవారం జావేద్ను కోర్టులో హాజరు పరచనున్నారు. -
అత్యధికంగా భూ సమస్యలపైనే..
సాక్షి, యాదాద్రి: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి వినతిపత్రాలు అందజేశారు. వివిధ సమస్యలపై 48 అర్జీలు రాగా.. అందులో భూ సమస్యలకు సంబంధించి 34 ఉన్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇతర జిల్లా ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్కు అందిన దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వండి ఎస్సీ కమిషన్ చైర్మన్కు ఆయా వర్గాల నుంచి అందిన వినతులకు ప్రాధాన్యమిచ్చి త్వరగా పరిష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని, వనమహోత్సవం కార్యక్రమంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల నుంచి చాలా మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాణ్యమైన విద్య అందించాలన్నారు. పాస్ పుస్తకం ఇప్పించాలని వినతి.. పాస్ పుస్తకం ఇప్పించాలని బొమ్మలరామరం మండల కేంద్రానికి చెందిన ముక్కెర్ల బాలయ్య కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పక్కనే ఉన్న పేలుడు పదార్థాల కంపెనీ యజమాని తన భూమి అమ్మాలని వత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కంపెనీ యజమానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని, తనకు న్యాయం చేయాలని విన్నవించారు. విచారణ చేయాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. ఫ ప్రజావాణికి 48 అర్జీలు ఫ వినతులు స్వీకరించిన కలెక్టర్ -
కడుపులోనే.. కాటికి!
సాక్షి యాదాద్రి : చట్టరీత్యా నేరమని తెలిసినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు కాసులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్నాయి. పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్డా అని స్కానింగ్ ద్వారా ముందే చెప్పేస్తున్నాయి. ఆడపిల్లయితే గర్భంలోనే ఊపిరి తీస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేయడం ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో బట్టబయలైంది. జిల్లాలో లింగ నిర్ధారణకు సంబంధించి గతంలోనూ అనేక కేసులు వెలుగుచూశాయి. సీజ్ చేసినా మరో పేరుతో ఓపెన్ జిల్లాలో పలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కనీస వైద్య అర్హత లేకుండా నిర్వహిస్తున్నారు. గతంలో తుర్కపల్లి మండలం మాదాపూర్లో, చౌటుప్పల్ పట్టణంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి అబార్షన్ చేసినట్లు బట్టబయలు కావడంతో ఆస్పత్రులను సీజ్ చేసి ర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే సదరు వ్యక్తులు మరో పేరుతో ఆస్పత్రులు తెరిచి అమానవీయ దందా నిర్వహిస్తున్నారు. భువనగిరితో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో అవసరమైన చోటకు స్కానింగ్ మిషన్లు తీసుకువెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ్.. జిల్లాలో మెటర్నిటీ నర్సింగ్ హోంలు, స్కానింగ్ సెంటర్లు 41 ఉన్నాయి. ఇందులో స్కానింగ్ పరీక్షలు చేయడానికి 14 నర్సింగ్హోంలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ, ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు పుట్టుగొడుగల్లా పుట్టుకొస్తున్నాయి. జిల్లా వైద్యాధికారి మారినప్పుడల్లా తనిఖీల పేరిట హడావుడి చేయడం.. ఆ తర్వాత మౌనంగా ఉండటం పరపాటిగా మారుతుంది. మూడు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల్లో తనిఖీలు నిర్వహించగా అక్రమాలు వెలుగుచూశాయి. కానీ, ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చి అబార్షన్లు చేయించుకొని పోతున్నట్లు తెలుస్తోంది. అయినా వైద్యారోగ్య శాఖ అధికారుల్లో చలనం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న బ్రూణ హత్యలు ఫ ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే పిండం తొలగింపు ఫ కాసుల కక్కుర్తితో ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు ఫ తనిఖీల్లో వెలుగుచూస్తున్నా కఠిన చర్యలు తీసుకోని వైద్యారోగ్య శాఖ అధికారులులింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు భ్రూణహత్యలు వెలుగుచూడటం బాధాకరం. ఇప్పటికే జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గుతుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యావంతులు, సమాజానికి సేవలందించేవారు కూడా ఆడిపిల్లలపై వివక్ష చూపుతుండటం బాధాకరం. లింగనిర్ధారణ ద్వారా అబార్షన్లు చేయించినా, చేసినా కఠిన చర్యలు తప్పవు. –బండారు జయశ్రీ, మహిళా, శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ -
నృసింహుడి సన్నిధిలో రామచంద్రజీయర్ స్వామిజీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జియర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్రజీయర్ స్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. స్వామీజీకి అర్చకులు వేద పారా యణం చేశారు. అంతకుముందు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రతి ఆలయంలో భగవంతుడు కొలువై ఉంటాడని, కానీ యాదగిరి క్షేత్రంలో భగవంతుడితో పాటు ఆళ్వార్లు సైతం కొలువై ఉండటం ఆలయ విశిష్టత అని వెల్లడించారు. చాతుర్మాసా దీక్ష ప్రారంభమాసంలో శ్రీస్వామి వారిని దర్శించుకుని ధన్యులమైనట్లుగా స్వామీజీ పేర్కొన్నారు. -
మహిళా శక్తి సంబరాలకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, యాదాద్రి : ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. భువనగిరిలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సోమవారం జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళా శక్తి పథకం కింద త్వరలో పెట్రోల్ బంకులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు స్వయం సహాయక సంఘాలు, సీ్త్రనిధి రుణాలు ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా సమాఖ్య భవనం నిర్మిస్తామని చెప్పారు. ఈనెల 10నుంచి 16వ తేదీ వరకు సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, విజిలెన్స్ అధికారి ఉపేందర్రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. భువనగిరి : నిరుద్యోగ యువతీయువకులు తమ విద్యార్హతల వివరాలను డిజిటల్ ఎప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డిజిటల్ ఎప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోర్టల్ పోస్టర్ను అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పరిశ్రమల జిల్లా మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈఓ శోభారాణితో కలిసి ఆవిష్కరించారు. నిరుద్యోగులు పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలు తెలుస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
భూదాన్పోచంపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఇంటర్బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్సింగ్ సూచించారు. సోమవారం భూదాన్పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. విద్యార్థులు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్రెడ్డి, సీనియర్ అధ్యాపకులు హరిప్రసాద్, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు జ్యోతి, సాయివర్థన్, స్టూడెంట్ కౌన్సిలర్ సంతోష్కుమార్, అధ్యాపకులు చందన, శ్రీదేవి, శివశంకర్, స్వాతి, రేణుకదేవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘కూచిపూడి’
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడ వీధిలో ఆదివారం హైదరాబాద్కు చెందిన నృత్య కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యాలతో అలరించారు. రాత్రి ఆలయ ద్వారబంధనం చేసే సమయం వరకు సాంస్కృతి కార్యక్రమాలు కొనసాగాయి.టీకాతో రేబిస్ నియంత్రణ భువనగిరిటౌన్ : శునకాల నుంచి మనుషులకు వ్యాపించే రేబిస్ వ్యాధిని టీకాతో అరికట్టవచ్చని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని పశుసంవర్థకశాఖ కార్యాలయంలో రేబిస్ వ్యాధి నివారణకు కుక్కలకు ఉచిత టీకాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ రేబిస్ ప్రాణంతకమైన వ్యాధి అని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కుక్కలకు టీకా వేయించాలని సూచించారు. అంతకు ముందు రాచకొండ పోలీస్ డాగ్ స్క్వాడ్ అదనపు కలెక్టర్కు గౌరవ వందనం సమర్పించాయి. కార్యక్రమంలో పశువైద్య అధికారి మోతిలాల్, పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గోపిరెడ్డి, సహాయ సంచాలకులు వి.కృష్ణ, శ్రీకాంత్, రాంచంద్రారెడ్డి, సునీత, చైతన్య, ప్రత్యూష, భాస్కర్, గిరి, అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీపై సమీక్షయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫుడ్ సేఫ్టీ (ప్రసాదం), గ్రీన్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్పై ఈఓ వెంకట్రావ్ ఆదివారం హైమ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అదే విధంగా ఎలక్ట్రికల్ వైరింగ్ మేనేజ్మెంట్, ఐఎస్ఓ 14001, 22000 సర్టిఫికెట్ల కోసం దేవస్థానం అర్హత సాధించే విషయాలపై చర్చించారు. గుట్ట గోశాలలో వన మహోత్సవం యాదగిరిగుట్ట: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ గోశాలలో దేవాదాయ వైధిక సలహాదారులు గోవింద హరి మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోఈఓ వెంకట్రావ్, డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్శర్మ తదితరులు పాల్గొన్నారు.