breaking news
Yadadri District News
-
విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
భువనగిరిటౌన్ : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు అన్నారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో జగన్ మోహన్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్కాలర్షిప్స్ రాక విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయిందన్నారు. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. గురుకులాల సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కుక్కుట్ల శివాని, జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్, జగన్ నాయక్, గాయత్రి, సహాయ కార్యదర్శి తిగుళ్ల శ్రీనివాస్ పుట్టల ఉదయ్, హిందూ రాణి, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ నేహాల్, నరేందర్, పూజిత, శ్రావణ్, మహేష్, సతీష్, వెంకటేష్ పాల్గొన్నారు. ఫ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా -
వల్లభాయ్ పటేల్తోనే నిజాం పాలనకు విముక్తి
చౌటుప్పల్ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండతోనే నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు. నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి పర్యటనకు వెళ్తున్న ఆయన మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళా నేతలు తిలకం దిద్ది స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం రాంచందర్రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నైజాం దుర్మార్గపు పాలనకు అనేక సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆనాటి నైజాం బాధితుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మాజీ సర్పంచ్ రమనగోని దీపిక, పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన, నాయకులు దోనూరి వీరారెడ్డి, ముత్యాల భూపాల్రెడ్డి, బత్తుల జంగయ్య, ఊడుగు యాదయ్య, వెంకటేశం, కడారి అయిలయ్య, వనం ధనుంజయ్య, ఊదరి రంగయ్య, ఇటిక్యాల దామోదర్రెడ్డి, బాతరాజు ప్రవీన్, గుండెబోయిన వేణు, బుడ్డ సురేష్, తోకల సాయి, నల్ల శివప్రసాద్, అమృతం దశరథ, పర్నె గాయత్రి, ఊదరి శారద, బత్తిని విజయలక్ష్మి, శేఖర్రెడ్డి, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
నష్టపరిహారం ఇవ్వకుంటే ఉద్యమిస్తాం
భువనగిరిటౌన్ : వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరాజు, కల్లూరి మల్లేశం, పాండు, పెంటయ్య, కృష్ణారెడ్డి, స్వామి, మాయ కృష్ణ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, రాగిరు కిష్టయ్య, గణపతిరెడ్డి పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య -
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
భువనగిరిటౌన్ : వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ, టీజీఎంఎస్ సంక్షేమ హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, హెచ్డబ్ల్యూఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. నాణ్యత కలిగిన వంట సరుకులు, కూరగాయలు వాడాలన్నారు. సమావేశంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి జినుకల శ్యాంసుందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పరంకుశ సాహితీ పాల్గొన్నారు. డిసెంబర్లోపు పూర్తిచేయాలి ఉపాధి హామీ నిధులతో పంచాయతీ రాజ్ విభాగం ద్వారా చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, పాఠశాల ప్రహరీ నిర్మాణ పనుల ప్రగతి, వాటర్షెడ్ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పనుల ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భాస్కర్రావు సమీక్ష నిర్వహించారు. పనులు డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. వన మహోత్సవంలో నాటిన మొక్కలకు వాచ్ వార్డు పర్సన్లను నియమించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలచందర్, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ సురేష్ పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
రేషన్ దుకాణాల్లో నిల్వఉన్న సన్నబియ్యం : 1700 మెట్రిక్ టన్నులు
సాక్షి, యాదాద్రి : రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డుబియ్యం ఐదు నెలలుగా వృథాగా ఉంటున్నాయి. దీంతో చాలా చోట్ల ఈ బియ్యం పురుగులు పట్టి, తుట్టెలు కడుతున్నాయి. వీటికి తోడు వివిధ కారణాలతో సన్న బియ్యం తీసుకోని వారివి కూడా రేషన్ దుకాణాల్లో నిల్వ ఉండడంతో వాటికి కూడా పురుగులు పట్టే పరిస్థితి ఏర్పడింది. కొందరు బియ్యం తీసుకోకపోవడంతో.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 515 రేషన్ దుకాణాల్లో దొడ్డుబియ్యం, సన్న బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యం 1700 మెట్రిక్ టన్నులు, దొడ్డుబియ్యం 700 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. మూడు నెలల అనంతరం బియ్యం తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు వచ్చిన లబ్ధిదారులకు తుట్టెలు కట్టిన, లక్కపురుగులు పట్టిన బియ్యం కనిపించాయి. అయితే జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల బియ్యం జూన్లోనే ప్రభుత్వం రేషన్ దుకాణాలకు సరఫరా చేసింది. అయితే కొందరు లబ్ధిదారులు గ్రామాల నుంచి వలసపోయారు. మరికొందరు వివిధ కారణాలతో బియ్యం తీసుకోలేదు. ప్రధానంగా తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, నారాయణపురం, చౌటుప్పల్, బీబీనగర్ తదితర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్కు వలసపోయారు. వారు నివాసం ఉంటున్న చోటనే ఈ పాస్ ద్వారా అక్కడేరేషన్ తీసుకున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో వారి పేరున వచ్చిన రేషన్ డీలర్ వద్దే మిగిలిపోయింది. దీంతో పాత బియ్యం, కొత్త బియ్యం పురుగుల పాలవుతున్నాయి. జిల్లాలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వేలం వేయడానికి కమిషనరేట్ స్థాయిలో చర్యలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్దుకాణాలు, గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద 1600 మెట్రిక్ టన్నుల దొడ్డుబియ్యం, 1700 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. కమిషనరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దొడ్డు బియ్యం వేలానికి చర్యలు తీసుకుంటాం. – హరికృష్ణ, సివిల్ సప్లై డీఎం ఫ ఐదు నెలలుగా రేషన్దుకాణాల్లో నిల్వ ఉంటున్న దొడ్డు బియ్యం ఫ తుట్టెలు కట్టి పనికిరాకుండా పోతున్న బియ్యం ఫ వేలం వేసేందుకు చర్యలు చేపట్టని అధికారులు ఫ సన్నబియ్యానికి కూడా చేరుతున్న పురుగులు బఫర్ గోదాముల్లో ఉన్న దొడ్డుబియ్యం : 347 మెట్రిక్ టన్నులు రేషన్ దుకాణాల్లో ఉన్న దొడ్డుబియ్యం : 700 మెట్రిక్ టన్నులు ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్న దొడ్డుబియ్యం : 181 మెట్రిక్ టన్నులు దొడ్డు బియ్యం ఖాళీ చేయకుండానే.. జిల్లాలోని రేషన్దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాముల్లో 1600 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆయా చోట్లనుంచి ఖాళీ చేయకుండానే సన్న బియ్యం స్టాక్ పెట్టింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు వస్తున్న సన్నబియ్యంతో అప్పటికే నిల్వ ఉన్న దొడ్డుబియ్యం నుంచి పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయి. -
రోగులకు మెరుగైన సేవలందించాలి
భువనగిరి: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో పల్లె దవాఖానాను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంతకుముందు ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంఎల్హెచ్పీ విజయ, కస్తూరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆత్మకూర్(ఎం)కు అటాచ్
చౌటుప్పల్ : వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని డీజే సౌండ్ సిస్టమ్ను కారణంగా చూపించి ఉత్సవాల నిర్వాహకుల వద్ద పోలీస్ సిబ్బంది డబ్బులు వసూలు చేయడంతో గణేషా... గస్తీ గాడి తప్పింది శీర్షికన మంగళవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి స్పందించారు. అందుకు సంబంధించి విచారణ జరిపించారు. వాస్తవం అని తేలడంతో ఆరోజు సాయంత్రం విధుల్లో ఉన్న హెడ్కానిస్టేబుల్ రాంబాబుతోపాటు కానిస్టేబుల్ వెంకన్నను ఆత్మకూర్(ఎం) పోలీస్స్టేషన్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి కథనం పట్ల వినాయక ఉత్సవాల నిర్వాహకులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రాగిజావ పంపిణీ భువనగిరి: పోషక విలువతో కూడిన రాగిజావను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని బీచ్మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో రాగిజావను ఆయన అందజేశారు. గత సంవత్సరం మాదిరిగానే విద్యార్థులకు రాగిజావ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ లక్ష్మీనారాయణ విద్యార్థులకు గ్లాసులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగవర్ధన్రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సేవలను సద్వినియోగం చేసుకోవాలిభువనగిరి : ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక విద్యా బోధకుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 22మంది ప్రత్యేక విద్యా బోధకులు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రత్యేక విద్యా బోధకులు పనిచేసే ప్రాంతాల్లో ప్రత్యేక అవసరాల విద్యార్థులతో పాటు సంబంధిత కాంప్లెక్స్ పరిధిలోని విద్యార్థులకు ప్రత్యేక విద్యా బోధన చేయనున్నట్లు తెలిపారు. మానసిక సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి భూదాన్పోచంపల్లి : పిల్లల్లో మానసిక సామర్థ్యాలను గుర్తించి వారిని పోత్సహిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మైండ్పవర్ స్పెషలిస్ట్, ప్రముఖ సైకలాజిస్ట్ డాక్టర్ ఎం.ఏ కరీం అన్నారు. మంగళవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జేవీ ఫంక్షన్హాల్లో మనో వైజ్ఞానిక, మానసిక వికాసంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అభ్యసన వైకల్యాల నిరోధానికి వారి మనస్సును మెప్పించే వినోదంతో కూడిన చదువును అందించాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మెజీషియన్ రామకృష్ణ నిర్వహించిన మ్యాజిక్ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం మెమొరీ కాంటెస్ట్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చన యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో స్వామివారిని సింధూరంతోపాటు, పాలతో అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఇక శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు కొనసాగాయి. -
పల్లె ఓటర్ల్లు 5.32లక్షలు
సాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఈ జాబితాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించారు. ఈ జాబితా ప్రకారం.. జిల్లాలోని 17 మండలాల్లో గల 427 గ్రామ పంచాయతీల్లో 5,32,240 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,64,577 మంది ఉండగా.. మహిళలు 2,67,661 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 3,084 మంది అధికంగా ఉన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో 3,704 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా.. గత 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ఈ సారి 1,18,089 మంది ఓటర్లు పెరిగారు. గుండాల మండలంతో కలిపి.. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుండాల మండలం జనగామ జిల్లాలో ఉంది. అప్పుడు జిల్లాలోని 16 మండలాల్లో 401 గ్రామ పంచాయతీలకే ఎన్నికలు జరిగాయి. 3,92,157 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత ప్రభుత్వం గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపింది. 20 గ్రామ పంచాయతీలు కలవడంతో గ్రామ పంచాయతీల సంఖ్య 421కి చేరింది. దీంతో ఓటర్ల సంఖ్య 3,92,157నుంచి 4,14,151కి పెరిగింది. ముసాయిదా కంటే స్వల్పంగా పెరిగిన ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితా కంటే 22 ఓట్లు పెరిగాయి. ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 5,32,218 కాగా ఇందులో పురుషులు 2,64,567, సీ్త్రలు 2,67,649, ఇతరులు ఇద్దరు ఉన్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మొత్తం ఓటర్లు 5,32,240కు చేరింది. మండలాలు : 17గ్రామ పంచాయతీలు : 427 మొత్తం ఓటర్లు : 5,32,240పురుషులు : 2,64,577మహిళలు: 2,67,661ఇతరులు : 02 పోలింగ్ కేంద్రాలు : 3,704 మండలం పురుషులు సీ్త్రలు మొత్తం పోలింగ్ కేంద్రాలు అడ్డగూడూరు 11,320 11,702 23,022 150 ఆలేరు 10,501 11,036 21,537 140 ఆత్మకూర్ 12,890 12,643 25,533 192 భువనగిరి 19,592 20,062 39,654 294 బీబీనగర్ 21,299 21,577 42,876 284 బొమ్మలరామారం 14,631 14,872 29,503 284 పోచంపల్లి 13,733 13,764 27,497 192 చౌటుప్పుల్ 19,096 19,405 38,501 236 గుండాల 13,152 12,917 26,069 182 మోటకొండూరు 10,495 10,608 21,103 170 మోత్కూర్ 6,528 6,687 13,215 88 నారాయణపురం 20,151 19,692 40,113 260 రాజాపేట 14,972 15,264 30,236 206 రామన్నపేట 22,684 22,674 45,358 232 తుర్కపల్లి 13,846 14,131 27,977 266 వలిగొండ 26,030 26,401 52,431 330 యాదగిరిగుట్ట 13,657 13,958 27,615 198 మొత్తం 2,64,577 2,67,661 5,32,240 3704 ఫ గ్రామ పంచాయతీ తుది ఓటరు జాబితా విడుదల ఫ పెరిగిన 1,18,089 మంది ఓటర్లు ఫ పోలింగ్ కేంద్రాలు 3,704 -
ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి
భువనగిరి: గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ నెల 5న గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భువనగిరి పట్టణ శివారులోని పెద్ద చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. చెరువు వద్ద భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు వద్ద తాగు నీరు, వైద్యం, మూత్రశాలలు, శానిటేషన్, లైటింగ్స్, క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ, మత్స్యశాఖ, ఇరిగేషన్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గణేష్ నిమజ్జనం అనంతరం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పట్టణ సీఐ రమేష్, మున్సిపల్ అధికారులు ఉన్నారు. -
తాళం వేసిన ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ
హుజూర్నగర్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని ఏవీఎన్ అపార్ట్మెంట్ సమీపంలో నివాసముంటున్న గాయం వీరభద్రారెడ్డి గత నెల 19న తన బంధువు చనిపోవడంతో ఇంటికి తాళంవేసి హైదరాబాద్కు వెళ్లాడు. వారి ఇంట్లో పనిచేసే పనిమనిషి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఆ ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఆమె ఈ విషయాన్ని వీరభద్రారెడ్డికి తెలియజేసింది. వెంటనే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి చూడగా వంటగది తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి లాకర్లో దాచిన వజ్రాలు పొదిగిన బంగారపు నెక్లెస్, వడ్డాణం, జూకాలు, చెవి బుట్టలు, దిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వాటి విలువ సుమారు రూ.25 లక్షలకు పైగా ఉంటుందని బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, సీఐ చరమందరాజు, ఎస్ఐ మోహన్బాబు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్బాబు తెలిపారు. -
పోగొట్టుకున్న పర్సు అప్పగింత
చిట్యాల: బస్టాప్లో మహిళా ప్రయాణికురాలు పోగొట్టుకున్న పర్సును తిరిగి ఆమె కుమారుడికి ఆర్టీసీ అధికారులు అప్పగించారు. వివరాలు.. మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన వడ్డెపల్లి అంబబాయి తన కుమారుడితో కలిసి మంగళవారం చిట్యాలలో బస్టాండ్ ఎదురుగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల బస్టాప్లో సూర్యాపేట డిపోకు చెందిన బస్సు ఎక్కి హైదరాబాద్కు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తన పర్సును పొగొట్టుకుంది. ఆ పర్సును చిట్యాలకు చెందిన శ్రీకనకదుర్గ ఆలయ డైరెక్టర్ రుద్రారపు లింగస్వామికి దొరకడంతో ఆయన వెంటనే బస్టాప్ వద్ద డ్యూటీలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి జంగయ్యకు అందజేశాడు. జంగయ్య సూర్యాపేట డిపోకు ఫోన్ చేసి బస్సులో ప్రయాణించిన మహిళ పర్సు పోగొట్టుకున్నట్లు సమాచారం ఇచ్చాడు. డిపో అధికారులు బస్సు డ్రైవర్ ద్వారా అందులో ప్రయాణిస్తున్న మహిళకు సమాచారం ఇవ్వగా.. ఆమె కుమారుడికి చిట్యాల ఆర్టీసీ కంట్రోలర్ పీబీ. చారి సమక్షంలో పర్సు తిరిగి అప్పగించారు. -
కాపర్ వైరు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్
కోదాడరూరల్: జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీ చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను మంగళవారం సూర్యాపేట జిల్లా మునగాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన పాలపర్తి వెంకట్రామయ్య పాత ఇనుము వ్యాపారం చేసేవాడు. అతడికి ఒంగోలు పట్టణానికే చెందిన బలిగా శ్రీకాంత్, గుంటకళ్ల ఖాజేశ్వరరావు, బోయపాటి అశోక్కుమార్, దేవరకొండ ఇషాక్ పరిచయమయ్యారు. వీరంతా చెడు వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరు ఈ ఏడాది మార్చి, మే నెలల్లో కారు అద్దెకు తీసుకొని సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు(ఎన్ఎస్పీ) కాల్వపై లిఫ్ట్ మోటార్లకు ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరును చోరీ చేశారు. చోరీ చేసిన కాపర్ వైరును ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లోని పలు ఫ్యాక్టరీలకు కేజీ రూ.400 చొప్పున విక్రయించారు. అదే మాదిరిగా మునగాల మండలం బరాఖత్గూడెం గ్రామ శివారులో ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైరు దొంగతనం చేసేందుకు వచ్చి అనుమానాస్పదంగా కనిపించడంతో పాలపర్తి వెంకట్రామయ్య, గుంటకళ్ల ఖాజేశ్వరరావు, బోయపాటి అశోక్కుమార్, దేవరకొండ ఇషాక్ను మంగళవారం మునగాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మరో వ్యక్తి బలిగా శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.2.50లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకున్న మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్, సీసీఎస్ సీఐ శివకుమార్, ఎస్ఐలు హరికృష్ణ, యాదవేందర్రెడ్డి, పోలీస్ సిబ్బంది రామారావు, కొండలు, మల్లేష్, శివ, ఆనంద్, శ్రీనును సూర్యాపేట ఎస్పీ నరసింహ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. ఫ పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఫ మరొకరు పరారీ ఫ రూ.2.50లక్షల నగదు స్వాధీనం -
జింక్ లోపం నివారిస్తేనే అధిక దిగుబడులు
గుర్రంపోడు: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం తగ్గిపోతుండటం దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రసాయన ఎరువుల్లో ముఖ్య పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఉండటం.. సూక్ష్మపోషకాలు లేకపోవడం వలన దీర్ఘకాలికంగా రసాయన ఎరువుల మీద ఆధారపడి సాగుచేసే నేలల్లో సూక్ష్మపోషకాల లోపాలు ఏర్పడతాయి. తక్కువ పరిమాణంలో అవసరమమ్యే జింక్, బోరాన్, మెగ్నీషియం తదితర పోషకాలు పైరు ఎదుగుదలకు, మంచి దిగుబడులకు దోహదపడతాయి. వరి మాగాణుల్లో ఏర్పడే ముఖ్యమైన జింక్ లోప నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి తెలియజేశారు. వరిలో జింక్ లోపానికి కారణాలు వరిలో జింకు లోపం అధికంగా రావడానికి ముఖ్య కారణం సేంద్రియ ఎరువుల వినియోగం తక్కువగా ఉండటం. వరి సాగుకు ముందు పెసర, అలసంద, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి నేలలో కలియదున్నుతున్నారు. ఇది మినహా సేంద్రియ ఎరువుల వినియోగం వరిలో అత్యధిక విస్తీర్ణంలో లేనట్లే. వరిలో జింక్ లోపం ఏర్పడటానికి మరో ముఖ్య కారణం వరిసాగు చేసే నేలల్లో చౌడు ఉండటం. చౌడు వల్ల నేలల్లో ఉన్న జింకు మొక్కలకు సులభంగా అందుబాటులోకి రాక పైరులో జింకు లోపం ఏర్పడుతుంది. ఈ కారణాలే కాక రసాయనిక ఎరువులు సమతుల్యంగా వాడనప్పుడు, మురుగు నీరు సరిగా బయటకు వెళ్లని నేలల్లో సాగు చేసినప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కూడా వరిలో జింకు లోపం కనిపిస్తుంది. దిగుబడులపై ప్రభావం జింకు లోపం ఉంటే ఏ పంటలోపైనా రసాయన ఎరువులు తీసుకునే శక్తి తగ్గిపోయి వేసిన ఎరువులు వృథా అవుతాయి. వరిలో వచ్చే జింకు లోపం పంట పెరుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జింకు లోపం ఉన్నప్పుడు నాటిన పైరు అనారోగ్యంగా కనిపిస్తుంది. పిలకలు తక్కువగా ఆలస్యంగా వస్తాయి. అంతేగాక వచ్చిన పిలకలు సరిగా పెరగక పైరు నశించినట్లు గిడసబారి కనిపిస్తుంది. లేత ఆకులు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపైరు కళ తప్పి కనిపిస్తుంది. జింకు లోపం తీవ్రత అధికంగా ఉన్న చోట్ల అడుగు ఆకులు ఎండిపోతాయి. ఈ విధంగా పైరు పెరుగుదలకు ఇబ్బంది కలిగి దిగుబడులు తగ్గుతాయి. జింకు ధాతు లోపం ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. కాలక్రమేణా పోషకాల యాజమాన్యంలో వచ్చిన మార్పులు దీనికి కారణం. వరిలో దిగుబడులు తగ్గకుండా ఉండటానికి సరైన జింక్ పోషక యాజమాన్యాన్ని ఆచరించాలి. నివారణ చర్యలు జింకు లోప నివారణకు అన్నింటికంటే మొదట చేయాల్సింది పంటకు అవసరమైన పోషకాల్లో కనీసం 30 శాతం సేంద్రియ ఎరువుల ద్వారా అందించాలి. పశువుల ఎరువును తప్పనిసరిగా తోలించడం, ఇతర జీవన ఎరువులను వాడటం చేయాలి. సేంద్రియ ఎరువులు వినియోగించడానికి వీలు కానప్పుడు వరి నాటడానికి ముందు ఎకరాకు 20 కిలోల వంతున జింకు సల్ఫేట్ దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ జింకు సల్ఫేట్ దమ్ములో వేసినప్పుడు భాస్వరపు ఎరువులలో కలిపి వేయరాదు. జింకు సల్ఫేట్ వేయడానికి ముందు, తర్వాత రసాయన ఎరువులు వేయడానికి నాలుగు రోజల విరామం ఉండాలి. జింకు సల్ఫేట్ను ఖరీఫ్, రబీ పంటలకు కలిపి ఒకసారి వేస్తే సరిపోతుంది. వరి నాట్లు పూర్తయి దమ్ములో జింకు సల్ఫేట్ వేయని పొలాల్లో పైరుపై జింకు సల్ఫేట్ పిచికారీ చేసి కూడా జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. వరి నాట్లు వేసిన తర్వాత జింక్ లోపం కనిపిస్తే చిలేటెడ్ జింక్ రెండు గ్రాములు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే 20రోజుల వ్యవధిలో మరో దఫా ఇదే మోతాదును పిచికారీ చేసుకోవాలి. జింక్ను వరి పొలంలో పిచికారీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగు మందులు లేదా తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. చౌడు నేలల్లో జింకు సల్ఫేట్ను దమ్ములో వేయడం కంటె రెండు దఫాలుగా పిచికారీ చేసుకోవడం లాభదాయకం. ఫ గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచనలు -
ప్రో కబడ్డీ లీగ్ అంపైర్గా కొంపెల్లి వీరస్వామి
సూర్యాపేటటౌన్, గరిడేపల్లి: వివిధ దేశాల క్రీడాకారులు పొల్గొంటున్న ప్రో కబడ్డీ లీగ్లో టెక్నికల్ అఫీషియల్(అంపైర్)గా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి ఎన్నికై నట్లు సూ ర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామా నరసింహరావు మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. వీరస్వామి ఎంపికకు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా నుంచి ప్రో కబడ్డీ లీగ్ అంపైర్గా వీరస్వామి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఇంపాక్ట్ ఉత్తమ ప్రాజెక్టు డైరెక్టర్గా శ్రీలతనేరేడుచర్ల: ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్(ఐసీఐ) ఉత్తమ ప్రాజెక్టు డైరెక్టర్గా నేరేడుచర్లకు చెందిన వీరవెల్లి శ్రీలత ఎంపికయ్యారు. మంగళవారం హైదరాబాద్లోని లక్డీకపూల్లో గల ఐసీఐ కార్యాలయంలో ఆమె అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలతను పలువురు మహిళలు ఘనంగా సత్కరించారు. సన్మానించిన వారిలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షురాలు మాధవి, నారీ సెల్ అడ్వైజర్ నళిని, జాతీయ ఉపాధ్యక్షురాలు రాజేశ్వరీ, యంగ్ అండ్ డైనమిక్ నారీ సెల్ డైరెక్టర్ దేవరపల్లి తబిత, సంధ్యారాంకరణం, సునీత, జగదీశ్వరీ, నవనీత, విజయలక్ష్మి, కీర్తీ శ్రీవాణి తదితరులున్నారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటునకిరేకల్: నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బచ్చుపల్లి ఇషాన్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. బచ్చుపల్లి నవీన్, పావని దంపతుల కుమారుడైన ఇషాన్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇషాన్ తల్లి ఖమ్మంలోనే బ్యాంకులో జాబ్ చేస్తుండగా.. తండ్రి నల్లగొండలో ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ నల్లగొండలోనే నివాసముంటున్నారు. ఇషాన్ కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా 16 దేశభక్తి గీతాలను పియానోపై వాయించి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇషాన్ రికార్డు సాధించడం పట్ల మంగళపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతితిరుమలగిరి (తుంగతుర్తి): యూరియా కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండలం మాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డె కృష్ణ (25) యూరియా కోసం సోమవారం ఉదయం తిరుమలగిరికి వచ్చాడు. తిరిగి రాత్రి సమయంలో మాసిరెడ్డిపల్లికి వెళ్లేందుకు గాను తిరుమలగిరి మండలం కేంద్రంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ప్రతి తప్పుకు ఒక లెక్క ఉంది !
తిరుమలగిరి (తుంగతుర్తి): సాధారణంగా చదువు, ఆటల్లో ఎన్ని ఎక్కువ మార్కులు లేదా పాయింట్లు సాధిస్తే అంత గుర్తింపు ఉంటుంది. కానీ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న ప్రతి పెనాల్టీ పాయింట్కు ఒక లెక్క ఉంది. ఎంత తక్కువ పాయింట్ల ఉంటే అంత జరిమానా నుంచి మినహాయింపు ఉంటుంది. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. వాహనదారులు చేసే తప్పుల నుంచి మే ల్కొనేలా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చలానా చెల్లించినా లెక్క తగ్గదు.. నిబంధనలు అతిక్రమించి జరిమానా కట్టేశాను అని అనుకుంటే సరిపోదు. చేసిన తప్పులకు ఆన్లైన్లో పెనాల్టీ పాయింట్లు కేటాయిస్తారు. ఇది 12 పాయింట్లు దాటితే ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. మరోసారి 12 పాయింట్లు దాటితే రెండు సంవత్సరాల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. మూడోసారి కూడా 12 పాయింట్లు దాటితే శాశ్వతంగా లైసెన్స్ కోల్పోతారు. లెర్నింగ్ లైసెన్స్ ఉన్న సమయంలో 5 పాయింట్ల పరిమితి దాటితే లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాయింట్ల ఇలా.. ● కారులో సీటు బెల్ట్, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ లేకుంటే – 1 పాయింట్ ● సిగ్నల్ జంప్, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే – 2 ● మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపితే – 3 ● మద్యం తాగి కారు, లారీ, గూడ్స్ వాహనం నడిపితే – 4 ● వాహనాలతో రేసింగ్కు పాల్పడితే – 3 ● వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోతే – 2 ఇలా తెలుసుకోవచ్చుగూగుల్లో పబ్లిక్ వ్యూ అని టైప్ చేస్తే తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్, ఈ–చలాన్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి అందులో వాహన రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు నమోదు చేస్తే పాయింట్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఫ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీ పాయింట్ల విధింపు ఫ ఏడాదికి 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు -
ఎన్సీసీ జాతీయ శిబిరానికి ఆలేరు క్యాడెట్లు ఎంపిక
ఆలేరు: నేషనల్ క్యాడెట్ కారప్స్(ఎన్సీసీ) జాతీయ శిబిరానికి ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎన్సీసీ యూనిట్కు చెందిన పది మంది క్యాడెట్లు ఎంపికయ్యారు. వరంగల్ జిల్లాలోని పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ)లో ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’ పేరుతో మంగళవారం ప్రారంభమైన ఎన్సీసీ జాతీయ శిబిరం ఈ నెల 13వ తేదీ వరకు జరుగనుంది. ఆలేరు ఎన్సీసీ యూనిట్ నుంచి 9, 10వ తరగతులకు చెందిన ఐదుగురు విద్యార్థినులు, ఐదుగురులు విద్యార్థులతో పాటు ఎన్సీసీ యూనిట్ అధికారి దూడల వెంకటేష్ ఈ శిబిరంలో పాల్గొననున్నారు. ఈ క్యాంపులో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఘండ్ రాష్ట్రాలకు చెదిన ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారు. 12రోజుల పాటు జరుగనున్న జాతీయ శిబిరంలో ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వంటలు తదితర అంశాలను ఎన్సీసీ క్యాడెట్లు పరస్పరం పంచుకుంటారని ఎన్సీసీ యూనిట్ అధికారి దూడల వెంకటేష్ చెప్పారు. అంతేకాకుండా చారిత్రక కట్టడాలు, వివిధ అంశాలపై క్షేత్రస్థాయి పర్యటనలతో ఎన్సీసీ క్యాడెట్లకు అవగాహన కల్పిస్తారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఎన్సీసీ క్యాడెట్లలో జాతీయ సమైకత్యను పెంపొందించడమే ఈ జాతీయ శిబిరం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. -
యూరియా పంపిణీలో రాష్ట్రం విఫలం
సాక్షి, యాదాద్రి: అవసరాల మేరకు కేంద్రం యూరి యా సరఫరా చేసినా రైతులకు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్ విమర్శించారు. ప్రజా సమస్యలు, యూరియా కొరతను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా చీకటిబజారుకు తరలి పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహిరిస్తుందన్నారు. ఫలితంగా యూరియా కొరత ఏర్పడి రైతులు పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వడంలోనూ జాప్యం చేస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవం చేయాలని, మూసీతోపాటు వాగులపై హైలెవల్ వంతెనలు నిర్మించాలని, గంధమల్ల రిజర్వాయర్ను త్వరితగతిన పూర్తిచేసి ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, మదర్ డైయిరీ రైతులకు పాల బిల్లులు విడుదల చేయాలని, కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారా యణరెడ్డి, నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్రావు, వేముల అశోక్, యెన్నం శివకుమార్, రచ్చ శ్రీనివాస్, గూడూరు జైపాల్రెడ్డి, సుర్వి శ్రీనివాస్, చందామహేందర్గుప్తా, కాదూరి అచ్చయ్య, రత్నపురం బలరాంమాధురిచంద్ర, వైజయంతి, మణికంట, ఉడుత భాస్కర్, బట్టు క్రాంతి,పట్నం కపిల్, ఆకుతోట రా మకృష్ణ, ఎండీ మహమూద్, గంగేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టరేట్ ఎదుట బీజేపీ మహాధర్నా -
పనులొదిలి.. బారులుదీరి
సాక్షి, యాదాద్రి: యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూర్, బొమ్మలరామారం, రాజా పేట, రామన్నపేట, అడ్డగూడూరు, భూదాన్పోచంపల్లి సొసైటీలకు ఆదివారం తెల్ల వారుజాము నుంచే రైతులు తరలివచ్చారు. పోలీస్ పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఎకరాకు బస్తా చొప్పున అందజేశారు. ఇంకా రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే గట్టెక్కుతామని అధికారులు అంటున్నారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా ఒకేసారి పంట చేలకు యూరియా పెడుతుండటంతో డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు. క్యూలో చెప్పులు ఉంచి నిరీక్షణ సొసైటీలకు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. వారం రోజులుగా సరఫరా కాకపోవడం, కొన్ని సొసైటీలకు ఆదివారం సాయంత్రం యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పొద్దస్తమానం నిరీక్షించినా కొందరికే లభించింది. ఆత్మకూర్ సొసైటీకి లారీ లోడ్ రాగా.. అందులో సగం గుండాల సొసైటీకి పంపించారు. అడ్డగూడూరు పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు చెప్పులు, బస్తాలను క్యూలో ఉంచి యూరియా ఇచ్చే వరకు పడిగాపులు కాశారు. పంటల సాగు, వచ్చిన యూరియా జిల్లాలో 4,40,500 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేయగా సెప్టెంబర్ 1నాటికి 4,00,138 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా వరి 2,54,554, ఆ తరువాత పత్తి 1,13,193 ఎకరాల్లో సాగయ్యాయి. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 18,769 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చింది. ఎనిమిది ఎకరాల్లో పంటలు సాగు చేశాం. ప్రస్తుతం పెరిగే దశలో ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో యూరియా అత్యవసరం అయ్యింది. పీఏసీఎస్ కార్యాలయానికి రెండుసార్లు వచ్చినా ఒక్క సంచి కూడా దొరకలేదు. యూరియా వచ్చిందని తెలియడంతో సోమవారం కూడా సహకార సంఘం బ్యాంకుకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో నిల్చున్నా. చివరికి ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిన. –జాగిలాపురం సత్తయ్య, పల్లెపహాడ్ మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన మామిడి నరసయ్య ఎకరంన్నర వరి, తొమ్మిది ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పంట పూత దశలో ఉంది. కొంతకాలంగా వర్షాలు కురుస్తుండటంతో యూరియా కోసం రెండు పర్యాయాలు మోత్కూరు సింగిల్ విండో గోదాముకు వచ్చాడు. వచ్చిన ప్రతీసారి అతనికంటే ముందు సీరియల్లో ఎక్కువ మంది రైతులు ఉండటం, యూరియా తక్కువగా రావడంతో నిరాశతో వెనుదిరిగాడు. ప్రైవేట్గా 10 యూరియా బస్తాలు ఒకటి రూ.300 చొప్పున కొనుగోలు చేశానని వాపోయాడు. యూరియా కోసం సొసైటీల వద్ద రైతుల పడిగాపులుఫ సోమవారం పీఏసీఎస్లకు భారీగా తరలివచ్చిన రైతులు ఫ తెల్లవారుజాము నుంచే క్యూలైన్ ఫ గంటల తరబడి నిలబడితే ఎకరాకు ఒక్కటే బస్తా యూరియా ఫ పోలీస్ పహారాలో పంపిణీ ఫ ఇంకా 2వేల మెట్రిక్ టన్నులు వస్తేనే సమస్యకు పరిష్కారంఆత్మకూర్(ఎం) పీఏసీఎస్కు ఈనెల 29వ తేదీన 220 బస్తాల యూరియా వచ్చింది. పాస్ పుస్తకానికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మొదట వచ్చిన రైతులకే యూరియా లభించింది. సుమారు 50 మంది రైతులకు అందకపోవడంతో నిరాశతో వెళ్లిపోయారు. పోలీసుల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేశారు. యూరియా వివరాలు (మెట్రిక్ టన్నుల్లో) వచ్చిన మొత్తం 18,769 పంపిణీ 18,445 అందుబాటులో ఉన్నది 603 -
బీసీ రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
భువనగిరిటౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. సోమవారం డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో బాణసంచా కాల్చి ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బుద్ధిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పోత్నక్ ప్రమోద్కుమార్, ఈవీ శ్రీనివాస్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీలు గల్లీలో జై, ఢిల్లీలో నై అంటున్నాయని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుతో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. బిల్లుకు చట్టబద్ధత కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు బీసీల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ తంగెళ్లపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
భువనగిరిటౌన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్న్ స్కీం(సీపీఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విధానం అమలు చేయాలని జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో లక్షలాది ఉద్యోగుల భద్రత, కుటుంబాల సంక్షేమాన్ని బలి తీసుకున్న స్కీం సీపీఎస్ అని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించకుండా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఉన్న సీపీఎస్ విధానం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ జగన్మోహన్ప్రసాద్, నాయకులు ఖదీర్, భగత్, మధుసుధన్రెడ్డి, యాదయ్య, శ్రీనివాస్, లక్ష్మీనర్సిహారెడ్డి, కుమార్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి -
వినతులిచ్చి.. ఆదుకోవాలని కోరి..
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజవాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. అధికారులకు గోడు చెప్పుకొని, వినతులు అందజేసి, ఆదుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్ఓ జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్సింగ్ అర్జీలు స్వీకరించారు. 50 వరకు అర్జీలు రాగా వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 40, పంచాయతీరాజ్ శాఖ 4 , సంక్షేమ, మున్సిపాలిటీ , విద్య, సర్వే ల్యాండ్స్, లీడ్ బ్యాంకు తదితర శాఖలకు సంబంధించివి ఒక్కొకటి చొప్పున ఉన్నాయి. అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్లు ఆదేశించారు. పనులు వదులుకొని సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోడ్చి వస్తుంటారని, పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. -
గణేషా.. గస్తీ గాడి తప్పింది!
చౌటుప్పల్ : పెట్రోలింగ్ పోలీసులకు గణేష్ నవరాత్రులు కాసులు కురిపిస్తున్నాయి. నిబంధనల పేరిట అందినకాడికి దండుకుంటున్నారు. మండపాల నిర్వాహకులు చేసేది లేక పోలీసులు అడిగినంత ఇవ్వక తప్పడం లేదు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద, శోభయాత్రలో డీజేలకు పోలీస్ శాఖ అనుమతులు నిరాకరించింది. అయితే జోష్ నింపాలంటే డీజేల తప్పనిసరి కావడంతో నిబంధనలు ఒప్పుకోకున్నా.. ఉత్సవ కమిటీలు డీజేలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇదే అదనుగా పెట్రోలింగ్ పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మండపాల వద్ద, శోభాయాత్రలో డీజేలు ఏర్పాటు చేసినట్లు తెలిసిందే తడవుగా అక్కడికి చేరుకొని కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆ తర్వాత బేరసారాలు మాట్లాడుకుంటున్నారు. అంకిరెడ్డిగూడెంలో హడావుడి చౌటుప్పల్ మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలోని ఈదమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని ఆదివారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. తంగడపల్లికి చెందిన యువకులు డీజే వాహనం ఏర్పాటు చేశారు. డీజే పెట్టారన్న విషయం తెలియడంతో పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమతులు లేవని, కేసులు నమోదు చేస్తామని కాసేపు హడావుడి చేశారు. నిర్వాహకుల నుంచి రూ.5 వేలు వసూలు చేశారు. డీజే నిర్వాహకులనూ వదల్లేదు. వెయ్యి రూపాయలు అడగగా వారు రూ.500 సమర్పించుకున్నట్లు తెలిసింది. దాంతో డీజే సజావుగా కొనసాగింది. ఇదే పరిస్థితి మండల వ్యాప్తంగా ఉన్నట్లు మండపాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. పెట్రోలింగ్ పోలీసులకు కాసుల వర్షం ఫ వినాయక మండప నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ ఫ డీజేలకు అనుమతి లేదంటూ వసూళ్లు -
ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలు
భువనగిరి: ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భువనగిరిలో రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ను బదనాం చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో సాగు నీటి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేయటానికి బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మించారని, గంధమల్ల రిజర్వాయర్కు ఆనాడే ప్రతిపాదనలు రూపొందించారని గుర్తు చేశారు. కేసీఆర్ చరిష్మాను ఎవ్వరూ తగ్గించలేరని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పేరుతో కాంగ్రెస్ చౌకబారు రాద్ధాంతం చేస్తుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేరని పేర్కొన్నారు. అంతకు ముందు బస్వాపురం రిజర్వాయర్ నుంచి తీసుకువచ్చిన నీటితో తెలంగాణతల్లి విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్లరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా కో ఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్రెడ్డి, రచ్చ శ్రీనివాస్రెడ్డి, ర్యాకల శ్రీనివాస్ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫ ఎవరెన్ని చేసినా కేసీఆర్ను తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేరు ఫ మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, భిక్షమయ్యగౌడ్ -
పునరావాసం కలి్పంచండి
గ్రామాన్నీ తీసుకోండి..ప్రభుత్వాన్ని కోరుతున్న బీమరిగూడెం ప్రజలు..‘గంధమల్ల’కు సాగు భూముల సేకరణతుర్కపల్లి: ‘బువ్వ పెట్టే భూమి గంధమల్ల ప్రాజెక్టులో పోతుంది.. ఇక మిగిలింది కేవలం ఊరే. కొద్దోగొప్పో భూమి ఉన్నా దాంతో తమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.. భూములే లేనప్పుడు మేమెట్లా బతికేది.. అంటూ తుర్కపల్లి మండలం భీమరిగూడెం, తెట్టకుంట గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామాన్ని కూడా రిజర్వాయర్కు తీసుకొని మరోచోట పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నారు’. ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. 1.41 టీఎంసీల సామర్థ్యంతో రూ.575.75 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం వివిధ గ్రామాల్లో 2,500 మంది రైతులకు సంబంధించి 994.35 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది. ఇందులో మూడు కిలో మీటర్ల మేర నిర్మించే కట్ట నిర్మాణంలో 112 ఎకరాల భూములు మునిగిపోతున్నాయి. వీటితో పాటు మిగతా భూములు కూడా ముంపునకు గురికానున్నాయి. ముంపు కారణంగా బీమరిగూడెం, తెట్టకుంట గ్రామాల ప్రజలు పూర్తిగా ఉపాధి కోల్పోతున్నారు. బతుకునిచ్చిన భూములు పోతున్నాయి.. ఇళ్లే మిగులుతున్నాయిబీమరిగూడెంలో 50 నుంచి 60 కుటుంబాలు ఉంటాయి. వీరికి వ్యవసాయమే జీవనాధారం. తాతలకాలం నాటినుంచి సేద్యం చుసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో 100 ఎకరాలకు పైగా ఉన్న సాగు భూములు ఉండగా అవన్నీ గంధమల్ల రిజర్వాయర్ ముంపు పరిధిలోకి వస్తున్నాయి. రెవెన్యూ శాఖ సర్వే ప్రకారం కేవలం ఇళ్లు మాత్రమే మిగులుతున్నాయి. ముంపు భూములకు ఎకరాకు రూ.24.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అందుకు గ్రామస్తులు సంసిద్ధత వ్యక్తం చేసి భూములివ్వడానికి అంగీకారం తెలిపారు. భవిష్యత్పై ఆందోళనబీమరిగూడెం వ్యవసాయ భూములన్నీ గంధమల్ల చెరువుకు అనుకుని ఉంటాయి. ఇళ్లు కూడా చాలా వరకు వ్యవసాయ బావుల వద్దనే నిర్మించుకున్నారు. గ్రామం రిజర్వాయర్ పక్కనే ఆనుకొని ఉండటం వల్ల భవిష్యత్లో ఇళ్లలోకి విషపురుగులు, క్రిమికీటకాలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.. తాము ఇక్కడ నివాసం ఉండలేమంటున్నారు. పునరావాసమే ఏకై క మార్గంతమకు జీవనాధారమైన భూములు పోవడం, స్థానికంగా ఉపాధే లేనప్పుడు ఊర్లో ఉండి ఏం చేయాలని గ్రామస్తులు అంటున్నారు. మరోవైపు గ్రామంలో ఉన్న పాఠశాల రెండేళ్ల కిత్రం మూతపడింది. సరైన రవాణా సౌకర్యం కూడా లేదని, జగదేవ్పూర్ నుంచి వెళ్లే కాలువ నీటితో జాలు వస్తుందని, ఇన్ని సమస్యల మధ్య ఉండలేమని.. తమ గ్రామాన్ని కూడా భూసేకరణ కింద తీసుకొని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మరోచోట పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జీవనోపాధి కోల్పోతున్న గ్రామస్తులు మిగిలింది ఊరు మాత్రమే.. ఇప్పటికే మౌలిక సౌకర్యాలు లేక, నీటి జాలుతో అవస్థలు భవిష్యత్లో మరిన్ని సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం గ్రామాన్ని కూడా రిజర్వాయర్లో కలుపుకొని మరోచోట పునరావాసం కల్పించాలని డిమాండ్ -
బ్రిడ్జి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
బ్రిడ్జి పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తుర్కపల్లి, మల్లాపురం వెళ్లే వాహనదారులు వాసవీసత్రం నుంచి తులసీ కాటేజ్ మీదుగా రెడ్డి సత్రం వద్ద తుర్కపల్లి మెయిన్ రోడ్డుకు కలవనున్నారు. తుర్కపల్లి, మల్లాపురం నుంచి యాదగిరిగుట్టకు వచ్చే వాహనాలు రింగ్ రోడ్టులోని యాదవఋషి సర్కిల్ నుంచి గరుడ సర్కిల్ మీదుగా వైకుంఠ్వారం వైపునకు మళ్లిస్తున్నారు. స్కూల్ బస్సులు, లారీలు, ఆర్టీసీ బస్సులు తదితర భారీ వాహనాలను వైకుంఠద్వారం నుంచి యాదవ్ రుషి సర్కిల్ వరకు అనుమతించడం లేదు. వాటిని వైకుంఠద్వారం నుంచి గరుడ సర్కిల్ మీదుగా యాదవ ఋషి సర్కిల్ మార్గంలో మల్లాపురం, తుర్కపల్లి వెళ్లేందుకు వీలు కల్పించారు. -
చేపట్టాల్సిన పనులు ఇవీ..
ప్రస్తుతం బ్రిడ్జి 64 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు పనులు పూర్తి చేయాల్సి ఉంది. బ్రిడ్జి సమీపంలోనే స్టీరింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. లండన్ నుంచి వచ్చిన కేబుల్స్ను బిగించి, ఆ తరువాత క్రేన్ సహాయంతో బ్రిడ్జికి అనుసంధానం చేస్తారు. ఆ తరువాత స్లాబ్ పనులు చేపడతారు. ఈ పనులు పూర్తయ్యేందుకు నాలుగు నెలలకు పైగానే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి పనులు అందుబాటులోకి వస్తే కొండపైకి వాహనాలు వెళ్లేందుకు, దిగేందుకు మార్గం సులువ కానుంది. రూ.4.2 కోట్ల నిధులతో పనులు నిర్వహిస్తున్నారు. -
ఇక ‘స్థానిక’ సమరమే..!
సాక్షి యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో తేదీ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల ముసాయి, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను ఈనెల 6న ప్రచురించనున్నారు. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అదే రోజు కలెక్టర్ అధ్యక్షతన ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా జాబితాలపై చర్చించనున్నారు. 10వ తేదీన తుది జాబితా వెల్లడించనున్నారు. జిల్లాలో 178 ఎంపీటీసీ, 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదం పొందడంతో రాజకీయ పార్టీలు సైతం ఎన్నికలపై దృష్టి సారించాయి. ఆశావహులు రిజర్వేష్ల కోసం ఎదురుచూస్తున్నారు. -
2023లో నిలిచే.. ఇన్నాళ్లకు గుర్తొచ్చే
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపైకి చేరుకునేందుకు చేపట్టిన నెట్వర్క్ అర్చ్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పునఃప్రారంభం అయ్యాయి. 64 మీటర్ల పనుల కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. పనులు పూర్తి కావడానికి నాలుగు నెలల సమయం పట్టవచ్చని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే భక్తులు నృసింహుడి సన్నిధికి సులువుగా చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. 2021లో రూ.32కోట్లతో పనులకు శ్రీకారంఆర్యవైశ్య సత్రంనుంచి మొదటి ఘాట్రోడ్డులోని జీయర్ కుటీర్ వద్ద ఉన్న రోడ్డును అనుసంధానం చేసేందుకు నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 490 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు పనుల కోసం రూ.32 కోట్లు కేటాయించారు. 2021 సంవత్సరం చివరిలో పనులకు శ్రీకారం చుట్టారు. బీకేమ్ సంస్థకు కాంట్రాక్ట్నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి పనులను సీఫైవ్ కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. మొదట్లో పనులను వేగంగా జరిగినప్పటికీ కొంతకాలం తరువాత మందగించాయి. 2023లో పూర్తిగా నిలిచిపోయాయి. నిధుల కొరత, లండన్ నుంచి కేబుల్స్ రావాలనే సాకుతో అప్పట్లో సాకులు చూపారు. నానాటికీ ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో బ్రిడ్జికి ప్రాధాన్యం ఏర్పడింది. కొండపైకి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థ యజమాన్యాన్ని ఆర్అండ్బీ శాఖ పలుమార్లు ఆదేశించినా స్పందన రాకపోవడంతో కాంట్రాక్టు సంస్థను రద్దు చేసింది. తదుపరి బీకేమ్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించగా రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించింది.యాదగిరీశుడి సన్నిధిలో నెట్వర్క్ బ్రిడ్జి పనులు పునఃప్రారంభం 64 మీటర్ల మేర పెండింగ్ పూర్తయ్యేందుకు నాలుగు నెలలకు పైగా సమయం -
ట్రాక్టర్ను ఢీకొని యువకుడి దుర్మరణం
మఠంపల్లి: బైక్పై వెళ్తూ ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మఠంపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి గౌతమ్(17), అతడి స్నేహితులు పవన్, సాయి ఆదివారం రాత్రి బిర్యానీ తెచ్చుకునేందుకు మఠంపల్లి మండల కేంద్రానికి బైక్పై వచ్చారు. తిరిగి బైక్పై చౌటపల్లి వెళ్తుండగా.. మట్టపల్లిలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి మఠంపల్లి మండల కేంద్రంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న గౌతమ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పవన్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. స్వల్ప గాయాలైన సాయి హుజూర్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మఠంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గౌతమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు. -
కుక్కల దాడి.. గొర్రెలు మృతి
చిట్యాల: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన బైకాని లింగస్వామి మేకల దొడ్డిపై, ఏర్పుల రామనర్సింహకు చెందిన గొర్రెల దొడ్డిపై ఆదివారం కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బైకాని లింగస్వామికి చెందిన నాలుగు మేకలు, ఏర్పుల రామనర్సింహకు చెందిన రెండు గొర్రెలు మృతిచెందాయి. మృతిచెందిన మేకలు, గొర్రెల విలువ సుమారు రూ.60వేలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి ఆత్మకూర్(ఎస్): ఆత్మకూర్(ఎస్) మండలం ఎనుబాముల గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ కలకోట్ల శ్రీను(47) శనివారం చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. ఆదివారం స్వగ్రామం ఎనుబాములలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి సీఆర్పీఎఫ్ అధికారులు తమ సిబ్బందితో వచ్చి మృతుడి భార్య మంజులకు జాతీయ జెండాతో పాటు అతడి దుస్తులు, బ్యాడ్జీ రూ.75 వేల నగదు అందజేశారు. శ్రీను భౌతికకాయంపై జాతీయ జెండా కప్పారు. అనంతరం గాల్లోకి 3 రౌండ్లు ఫైరింగ్ చేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఎస్ఎల్ నాయక్, యాదయ్య, సోమయ్య, నాగయ్య, జనిమియా, చంద్రయ్య, సూర్యాపేట మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు. మూసీకి కొనసాగుతున్న ఇన్ఫ్లోకేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో వస్తుండడంతో ఆదివారం అధికారులు నాలుగు క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు 6,525 క్యూసెక్కుల నీరు మూసీ రిజర్వాయర్కు వస్తోంది. క్రస్టు గేట్ల ద్వారా 5,625 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 96 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 144 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 643.80 అడుగుల మేర నీటి మట్టం ఉంది. -
ఎవరా అదృష్టవంతులు..
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో నవయుగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రూ.1.15లక్షలతో 24 క్యారెట్ల బంగారంతో చేసిన చిన్న వినాయక ప్రతిమను ఉంచి నిత్యం పూజలు చేస్తున్నారు. గత 14 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది మొదటిసారి బంగారు ప్రతిమను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లడ్డుకు రూ.116, బంగారు ప్రతిమకు రూ.516తో లక్కీ డ్రా ఏర్పాటు చేశామని, డ్రాలో గెలుచుకున్న వారికి బంగారు వినాయకుడి ప్రతిమ ఇవ్వనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకుడు చిట్టిపోలు మట్టపల్లి, సభ్యులు తెలిపారు. -
వయ్యారిభామతో ప్రమాదమే
వయ్యారిభామ కలుపు మొక్కలు ఎంతో ప్రమాదకరమైనప్పటికి వాటిని ఉపయోగించుకొని కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేవిధంగా గుంత తవ్వుకోవాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలు వేసి వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి చల్లుకోవాలి. ఈ విధంగా పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరలపైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో చేసుకొని అన్ని పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవచ్చు. త్రిపురారం : పొలంలో వచ్చే తెగుళ్లు, చీడపీడలకంటే రైతులు అధికంగా భయపడేది వయ్యారిభామ (పార్థినీయం) కలుపు మొక్కతోనే. ఈ మొక్కలు ఎక్కడైనా పెరిగే లక్షణం ఉంటుంది. ఈ కలుపు మొక్క ప్రధాన పంటలకు తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో పార్థినీయం మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతోపాటు దూర ప్రాంతాలకు సైతం త్వరగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క లక్షణాలు, నివారణ చర్యల గురించి కేవీకే కంపాసాగర్ సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ మాటల్లోనే.. మనుషులు, పశువులకూ హాని.. వయ్యారిభామ కలుపు మొక్క వల్ల పంటలకే కాకుండా మనుషులు, పశువులకు కూడా ప్రమాదమే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు సోకడంతో పాటు చర్మ వ్యాధులు వస్తాయి. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు తలెత్తుతాయి. ఈ మొక్కలు తిన్న పశువులు హైపర్ టెక్షన్కు గురువుతాయి. పశుగ్రాసాల పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. ఇక పంటలకు నీరు పోషకాలు అందకుండా వాటి కంటే ముందే ఈ మొక్కలు గ్రహించుకుంటాయి. తద్వారా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపి సుమారు 40 శాతం మేర తక్కువ దిగుబడులు వస్తాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పడి పడడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదం ఎక్కువ. పార్థినీయం మొక్కను నిర్మూలించడానికి రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య సంరక్షణ చర్యలు చేపట్టాలి. తొలగించే విధానం పార్థినీయం మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే పూత దశకు రాకముందే తొలగించి మంటల్లో కాల్చివేయాలి. లేకపోతే ఈ మొక్కలు ముదిరితే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ పూత దశకు చేరుకున్న మొక్కలను తొలగించాలంటే చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్కులు ధరించాలి. తీసిన మొక్కలను కుప్పగా వేసి కాల్చివేయాలి. రసాయనాలతో మొక్కజొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటర్ నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకుంటే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు లీటర్ నీటికి 2 ఎంఎల్ పేర్వాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పశుగ్రాసాలు సాగు చేసుకునే రైతులు పంట వేయకముందే లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫ ఈ కలుపు మొక్కతో పంటలకు నష్టం ఫ పూత దశకు ముందే తొలగించాలి ఫ రైతులకు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ సూచనలు -
అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక పట్టివేత
కొండమల్లేపల్లి: డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు.. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ బి. సంతోష్రెడ్డి ఆదేశాల మేరకు నల్లగొండ, దేవరకొండ ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా కొండమల్లేపల్లి మండలం చెన్నారం గేట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి దేవరకొండకు డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 60క్వింటాళ్ల నల్లబెల్లం, 100 కిలోల పటికను పట్టుకున్నారు. పట్టుబడిన నల్లబెల్లం, పటికను సీజ్ చేసి దేవరకొండ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, అందులో ఒకరు అరెస్ట్ చేయగా.. ముగ్గురు పరారీలో ఉన్నట్లు దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన నలుగురిలో ఇద్దరు కొండమల్లేపల్లి మండల పరిధిలోని మేఘ్య తండాకు చెందిన వారు కాగా.. మరొకరిది ఏపీలోని గుంటూరు, ఇంకొకరిది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన వారని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్ఐ నరసింహ, కానిస్టేబుళ్లు శేఖర్రెడ్డి, నాగరాజు, అనిల్కుమార్, ఎం. కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నలుగురిపై కేసు నమోదు -
యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ముఖ మండపం క్యూలైన్, మాడ వీధులు, ఆలయ పరిసరాలు భక్తులతో నిండుగా కనిపించాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి వారిని 35వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.26,52,441 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట: కెనడా దేశ రాజధాని ఒట్టావా నగరంలో శనివారం రాత్రి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఆగస్టు 22న కెనడా దేశానికి యాదగిరిగుట్ట ఆలయ విశ్రాంత ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ అధికారి గజివెల్లి రఘు వెళ్లారు. 23న విండ్సర్, 24న టొరంటో నగరంలో కల్యాణ వేడుకలను నిర్వహించారు. శనివారం రాత్రి ఒట్టావా నగరంలో నిర్వహించిన యాదగిరీశుడి కల్యాణోత్సవంలో హిందూ ధర్మ ప్రచారకులు చంద్ర ఆర్య, మాజీ ఎంపీ కరుణాకరరెడ్డి, టీసీఏ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెంతో పాటు భక్తులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ వికటించి బాలుడి మృతి
మర్రిగూడ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించగా.. ఆపరేషన్ వికటించి శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన బల్లెం అబ్బయ్య, స్వరూప దంపతులకు ఇద్దరులు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వారి పెద్ద కుమారుడు బల్లెం ప్రణయ్(11) గత రెండు సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధిలో బాధపడుతున్నాడు. ప్రణయ్కు ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. ఆపరేషన్కు రూ.25లక్షలు అవసరం కాగా.. అందులో రూ.20లక్షలు ప్రభుత్వం ఇవ్వగా.. మరో రూ.5లక్షలు ఇచ్చేందుకు ఇందూర్తి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కుంభం శ్రీనివాస్రెడ్డి ముందుకు రావడంతో ఆపరేషన్ కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం బాలుడికి వైద్యులు ఆపరేషన్ చేయగా.. ఆపరేషన్ వికటించి మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు విలపించారు. బావిలో దూకి వివాహిత ఆత్మహత్య మోత్కూరు: అనారోగ్య సమస్యలు, మానసిక స్థితి సక్రమంగా లేని వివాహిత బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని వెంకన్నకు గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సరిత(35)తో 2010లో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకన్న వ్యవసాయం, కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సరిత ఆదివారం తెల్లవారుజామున తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో భార్య కనిపించకపోవడంతో వెంకన్న గ్రామస్తులతో కలిసి బావి దగ్గరకు వెళ్లి చూడగా సరిత మృతదేహం కనిపించింది. తమ కుమార్తె కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, అంతేకాకుండా ఆమె మానసిక స్థితి సక్రమంగా లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి తండ్రి వల్లందాసు చంద్రయ్య పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ కె. సతీష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్లపొదల్లో నవజాత శిశువు గుర్తింపుమునగాల: మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ ఇంటి ఆవరణలోని చెట్ల పొదల్లో ఆదివారం మధ్యాహ్నం నవజాత మగ శిశువును గ్రామస్తులు గుర్తించారు. గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యురాలి ఇంటి సమీపంలోని చెట్ల పొదల్లో నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా.. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తించారు. పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్ద శిశువుకు ప్రథమ చికిత్స చేయించి హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొక్కిరేణి గ్రామానికి చెందిన ఓ యువతి ప్రసవం కోసం తిమ్మారెడ్డిగూడెంలోని ఆర్ఎంపీ వైద్యురాలి వద్దకు రాగా.. ఆమె అందుబాటులో లేకపోవడంతో సదరు యువతి బిడ్డకు జన్మనిచ్చి అక్కడే వదలి వెళ్లినట్లు తెలిసింది. -
దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలి
నల్లగొండ టౌన్: దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎస్బీఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన చేయూత పింఛన్దారుల సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కనీసం మాట్లాడడం లేదన్నారు. తాను గుడిసెలో పుట్టిన బిడ్డగా పింఛన్దారుల పక్షాన పోరాటానికి ముందుకొచ్చానని తెలిపారు. పింఛన్ల మొత్తం పెరిగేంత వరకు పోరాటం ఆగదన్నారు. ఈ నెల 3న హైదరాబాద్లో జరిగే చేయూత పింఛన్దారుల మహాగర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్నయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుముల జలంధర్, గడ్డం కాశీం, పెరిక శ్రీనివాస్, బకరం శ్రీనివాస్, ఇరిగి శ్రీశైలం, దాసరి లక్ష్మమ్మ, రెడ్డిమాస్ ఇంద్రచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
స్పీడ్గా తపాలా సేవలు
నాగారం: రిజిస్టర్ పోస్ట్ అనేది ప్రజలకు తపాలా శాఖ అందించిన అత్యుత్తమమైన సేవ. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ రావాలన్నా, ఉద్యోగం నియామక పత్రం అందాలన్నా, బంధుమిత్రులకు ప్రధాన వర్తమానం, సంస్థలు, కార్యాలయాలకు ముఖ్యమైన పత్రాలు పంపాలన్నా ఒకప్పుడు రిజిస్టర్ పోస్టే ఆధారం. ఒక రకంగా చెప్పాలంటే రిజిస్టర్ పోస్ట్ అంటే ఓ భరోసా. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని రోజుల్లో ప్రజల జీవితాలతో అది విడదీయరాని బంధాన్ని రిజిస్టర్ పోస్ట్ ఏర్పరచుకుంది. ముఖ్యమైన పత్రాలు, వస్తువులను ఒక చోటు నుంచి మరోచోటుకు సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి ప్రధాన మార్గంగా నిలిచింది. రాఖీలు, చిన్నచిన్న వస్తు సామగ్రి, లీగల్ నోటీసులు, అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్కు సంబంధించిన పత్రాలు ఇలా ఎన్నో విలువైన పత్రాలను పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువులు, పత్రాలు అవతలి వారికి చేరినట్లు రశీదు పొందితే.. హమ్మయ్య అని గుండెలపై చేయి వేసుకునే వారెందరో ఆ రోజుల్లో. అలాంటి సేవలు ఇక నుంచి కాలగర్భంలో కలిసిపోనున్నాయి. సోమవారం నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు భారత తంతి తపాలా శాఖ ప్రకటించింది. దాని స్థానంలో స్పీడ్ పోస్ట్ను అందుబాటులోకి తీసుకురానుంది. కాలానుగుణంగా మార్పులు.. మారుతున్న కాలానికి అనుగుణంగా భారత తంతి తపాలా శాఖ కూడా మారుతోంది. ప్రైవేట్ సంస్థలతో పోటీపడుతూ ఇప్పటికే ఎన్నో సేవలను ప్రవేశపెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న పోస్టల్ శాఖ.. అంతే వేగంగా స్పీడ్ పోస్ట్ విధానానికి శ్రీకారం చుడుతోంది. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్లో కలుపుతున్నట్లు భారత తంతి తపాలా శాఖ ప్రకటించింది. ప్రజలు తాము పంపిన వస్తువులు, పత్రాలు ఎక్కడి వరకూ చేరుకున్నాయనే సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు కల్పించడానికి ట్రాకింగ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ స్పీడ్ పోస్ట్ విధానంతో తంతి తపాలా శాఖ అధునాతన కొరియర్ వ్యవస్థలకు పోటీగా సేవలు అందిస్తుందన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతుతోంది. ఫ నేటి నుంచి నిలిచిపోనున్న రిజిస్టర్ పోస్ట్ -
పటేల్ శ్రీధర్రెడ్డి కృషి అభినందనీయం
సూర్యాపేట: స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి, 25 ఏళ్లుగా నిరక్షరాస్యత నిర్మూలనకు పటేల్ శ్రీధర్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ కవి అందెశ్రీ అన్నారు. సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామానికి చెందిన స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పటేల్ శ్రీధర్రెడ్డి అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆదివారం ఆయనకు సూర్యాపేట పట్టణంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభకు అందెశ్రీతో పాటు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కవి అందెశ్రీ మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్య కేంద్రాలు నెలకొల్పి అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత శ్రీధర్రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం పటేల్ రమేష్రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట నియోజకవర్గంలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఏడేళ్ల పాటు స్కాలర్షిప్ అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. బాలెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, గ్రీన్ బోర్డులు, బెంచీలు అందజేయడంతో పాటు సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, కళావేదిక, వంటగదులు, మోడల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారని, రెండు ఎకరాల ఉచితంగా అందించి క్రీడా స్థలాన్ని, బాస్కెట్బాల్ కోర్టు నిర్మించారన్నారు. శ్రీధర్రెడ్డి సొంత నిధులతో పాటు ప్రభుత్వ సహకారంతో రూ.45 లక్షలతో శిథిలావస్థకు చేరిన సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కవి అందెశ్రీ -
హడలెత్తిస్తున్న శునకాలు
ఏడాదిలో 16,612 కుక్కకాటు కేసులు భువనగిరిటౌన్ : జిల్లాలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎప్పుడు ఏ పక్కనుంచి దాడి చేస్తాయో తెలియడం లేదు. గుంపులుగా సంచరిస్తూ చిన్నారులు, రోడ్లపై ఒంటరిగా వెళ్లే వ్యక్తులు, మూగజీవాలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఈనెల 8వ తేదీ వేకువజామున భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విఘ్నేష్ అనే యువకుడు వాకింగ్ చేస్తుండగా శునకం అకస్మాత్తుగా వచ్చి అతనిపై దాడి చేసింది. గాయాలపాలైన విఘ్నేష్ను తోటి వాకర్స్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి ఘటనలు ఏదో ఒక చోట నిత్యకృత్యం అయ్యాయి. 16,612 మందికి కుక్క కాటు వీధి కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య ఏటా వందల్లో ఉంటుంది. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు 16,624 మంది కుక్కల బారిన పడ్డారు. ఇది కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య మాత్రమే. ప్రైవేట్ ఆస్పత్రులు, హైదరాబాద్కు వెళ్లి చికిత్స పొందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సర్వే ప్రకారం 30వేల శునకాలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక బృందాలు గత ఏడాది సర్వే చేయగా 30 వేల శునకాలు ఉన్నట్లు తేలింది. వీటిలో కేవలం గ్రామ పంచాయతీల్లోనే 27,025 కుక్కలు ఉన్నాయి. అత్యధికంగా సంస్థాన్నారాయణపురంలో 400, ఆ తరువాత ఇదే మండలంలోని పుట్టపాకలో 300 వరకు శునకాలు ఉన్నట్లు గుర్తించారు. అతి తక్కువగా వలిగొండ మండలం నర్సిగూడెంలో 10లోపు ఉన్నట్లు సర్వే బృందాలు తేల్చాయి. ఇక మున్సిపాలిటీల విషయానికొస్తే భువనగిరిలో వెయ్యికి పైగా.. ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, మోత్కూరు పట్టణాల్లో సగటున 400 పైగా కుక్కలు ఉన్నాయని తేల్చారు.రాత్రి, పగలు తేడా లేకుండా గుంపులుగుంపులుగా శునకాలు సంచరిస్తున్నాయి. వీధులు, రహదారులు, హోటళ్లు, ఫంక్షన్హాళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, మాంసం, చికెన్న్ దుకాణాలు.. ఇలా ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో స్వైర విహారం చేస్తున్నాయి.ముఖ్యంగా రాత్రి వేళ, వేకువజామున బయటకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నట్టుండి ఒక్కసారి మనుషులపైకి దాడి చేస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. ఫ వెలుగులోకి రానివి వందల్లో.. ఫ శునకాల నియంత్రణకు మొక్కుబడి చర్యలు ఫ మధ్యలోనే నిలిచిన ‘యానిమల్ బర్త్ కంట్రోల్’ కార్యక్రమం ఫ సర్వే బృందాలు గత సంవత్సరం గుర్తించిన శునకాలు 30 వేలకు పైనే.. ఫ బయటకు వెళ్లాలంటేనేబెంబేలెత్తుతున్న జనం వీధి కుక్కల సంచారం విపరీ తంగా పెరిగింది. ప్రధానంగా చిన్నారులపై దాడిచేసి గాయ పరుస్తున్నాయి. రాత్రి సమ యంలో బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఉంది. –కప్పల వసంత, మోత్కూరుఆలేరులో వీధి కుక్కల బెడత రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాదాచారులతో పాటు వాహనదారులను వదలడం లేదు. రాత్రి సమయంలో వీధుల్లో వెళ్లలేకపోతున్నాం. కుక్కలతో పాటు కోతలు బెడత కూడా ఉంది. –పులగం భాస్కర్, ఆలేరు కుక్కల దాడులను సీరియస్గా తీసుకున్న హైకోర్టు.. వాటి సంతతిని నియంత్రించాలని గతంలో ఆదేశించింది. ఈ మేరకు కుక్కల సంతతి నియంత్రణపై ప్రభుత్వం దష్టి సారించింది. ఇందుకోసం జిల్లా కేంద్రమైన భువనగిరి శివారులో యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ఏర్పాటు చేసింది. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కుక్కల సంతతి నియంత్రణ బాధ్యతలను అప్పగించింది. ఒక్కో శునకానికి రూ.1600 చొప్పున చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సంతతి నియంత్రణ కోసం కొన్ని శునకాలకు చికిత్స చేశారు. కానీ, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో సదరు ఏజెన్సీ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో శునకాల సంతతి నియంత్రణ కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. -
మూడో రోజూ రాకపోకలు బంద్
భూదాన్పోచంపల్లి: మండలంలోని జూలూరు వద్ద శనివారం కూడా లోలెవల్ బ్రిడ్జి పైనుంచి మూసీ ఉధృతి కొనసాగింది. దాంతో భూదాన్పోచంపల్లి నుంచి బీబీనగర్కు మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. భూదాన్పోచంపల్లి మండలం జూలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న బీబీనగర్ మండలం రుద్రవెల్లికి చెందిన 20 మంది విద్యార్థులు వరద కారణంగా మూడు రోజులుగా బడికి వెళ్లలేదు. మూసీ పొంగడం వల్ల ఈ నెలలో 10 రోజులు బడికి గైర్హాజరయ్యారు. రాకపోకలు నిలిచిన కారణంగా బీబీనగర్ ఎయిమ్స్ వెళ్లే రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. పోచంపల్లి మండల ప్రజలు భువనగిరికి పెద్దరావులపల్లి మీదుగా చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి నిలిచిపోయిన హైలెవల్ బ్రిడ్జి పనులను పూర్తి చేయించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. -
భూములిచ్చాం.. ఉపాధి కల్పించండి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూములు ఇచ్చామని.. తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లికి చెందిన బూడిద కులస్తులు శనివారం యాదగిరిగుట్ట ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మకు వినతిపత్రం అందజేశారు. ఆలయంలో టెండర్లు లేకుండా చెప్పులు భద్రపరిచే బాధ్యతలు ఇవ్వాలని, స్వామివారి నిత్యకల్యాణంలో డప్పులు వాయించే అవకాశం కల్పించాలని, దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో తమ కులస్తులను నియమించాలన్నారు. కోరారు. కార్యక్రమంలో నర్సింహ, నాగరాజు, ఐలయ్య, మల్లేశ్, యాదగిరి, అయిలయ్య, దేవేందర్, రాములు, కుమార్, వెంకటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి భువనగిరి: సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ మనోహర్ అన్నారు. శనివారం భువనగిరి మండలం అనంతారం పరిధిలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి, వ్యక్తిగత శుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు. వాహనాల దారి మళ్లింపుయాదగిరిగుట్ట: యాదగిరి కొండపైకి నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. తుర్కపల్లి, మల్లాపూర్ గ్రామాలకు వెళ్లే వాహనాలను పాత వాసవిసత్రం నుంచి తులసి సత్రం మీదుగా రెడ్డి సత్రం దగ్గర తుర్కపల్లి మెయిన్ రోడ్డుకు మళ్లించనున్నారు. తుర్కపల్లి, మల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలను రింగ్ రోడ్డులోని యాదవఋషి సర్కిల్ నుంచి గరుడ సర్కిల్ మీదుగా వైకుంఠ్వారం వైపు మళ్లించనున్నారు. ఇక్కడినుంచి భారీ వాహనాలకు అనుమతి లే దని, వైకుంఠద్వారం నుంచి గరుడ యాదవఋషి సర్కిళ్ల గుండా మల్లాపూర్, తు ర్కపల్లి రావడానికి, పోవడానికి వీలు కల్పించారు. -
పక్కా భవనాలు.. తీరనున్న వెతలు
సాక్షి, యాదాద్రి : భువనగిరి, రామన్నపేట, ఆలేరు కోర్టులకు మహర్దశ పట్టనుంది. అద్దె భవనాల్లో సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న వాటికి శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి రూ.81 కోట్లు, రామన్నపేట కోర్టు నూతన భవనాలు, రెసిడెన్సియల్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ. 34.50 కోట్లు, ఆలేరు కోర్టుకు రూ.18 కోట్లు మంజూరయ్యాయి. కాగా జిల్లా కోర్టు భవన నిర్మాణానికి సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మాస్కుంట గుట్టపై పది ఎకరాలు కేటాయింపు భువనగిరిలో ప్రస్తుతం కోర్టు నిర్వహిస్తున్న అద్దె భవనాలు అనువుగా లేవు. ఇరుకుగా ఉండటం, సౌకర్యాలు సరిగా లేకపోవడంతో కక్షిదారులకు సేవలందించడం, న్యాయమూర్తులు, అడ్వకేట్ల కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను పలుమార్లు రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో నూతన భవనాలను మంజూరు చేసింది. నూతన భవనాన్ని భువనగిరి సమీపంలోని మాస్ కుంట గుట్టపై నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం గుట్టపై సర్వేనంబర్ 742లో ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించింది. ఈ స్థలంలో నాలుగు అంతస్తుల్లో 12 భవనాలు నిర్మిస్తారు. జిల్లా కోర్టులు, న్యాయమూర్తుల క్వార్టర్స్, పరిపాలన భవనాలు, బార్ అసోసియేషన్ భవనం, పార్క్లు, పార్కింగ్ ఏరియా, లాన్స్ రానున్నాయి. తొలుత కోర్టు భవనాలను, చుట్టూ ప్రహరీ, అంతర్గత రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. న్యాయమూర్తుల క్వార్టర్స్, ఇతర నిర్మాణాలను తర్వాత చేపట్టనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తవడంతో గుట్టను చదును చేస్తున్నారు. జిల్లా ప్రధాన జడ్జి జయరాజ్ ఆధ్వర్యంలో ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్ఆండ్బీ అధికారులు శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రామన్నపేట శివారులోని కొమ్మాయిగూడెం మార్గంలో సర్వే నంబర్ 584లో ఐదు ఎకరాల స్థలాన్ని కోర్టు నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. నాలుగు భవనాల నిర్మాణానికి రూ.29 కోట్లు, క్వార్టర్స్కు రూ 5.50కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా కోర్టు భవన నిర్మాణానికి మాస్కుంట గుట్టపై ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. రూ.81 కోట్లు మంజూరు చేయగా పనుల నిర్వహణకు టెండర్లు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. భవన నిర్మాణ పనులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి గుట్టపై ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. –జయరాజ్, జిల్లా ప్రధాన జడ్జి భువనగిరి, రామన్నపేట, ఆలేరు కోర్టులకు శాశ్వత భవనాలు ఫ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ జిల్లా కోర్టు భవన సముదాయానికి సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన ఫ మాస్కుంట గుట్టపై కొనసాగుతున్న ఏర్పాట్లు -
లక్కుంటే.. పట్టుచీర
భూదాన్పోచంపల్లి : పోచంపల్లిలోని కొండాలక్ష్మణ్ బాపూజీ వీవర్స్ మార్కెట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో భక్తులను ఆకర్షించేందుకు నిర్వాహకులు లక్కీ డ్రా కూపన్లు పెట్టారు. రూ.100 చెల్లించి కూపన్ తీసుకొంటే గణేష్ నిమజ్జనం రోజున లక్కీ డ్రా ద్వారా మొదటి బహుమతి కింద రూ.22వేల పోచంపల్లి ఇక్కత్ పట్టుచీర, రెండవ బహుమతి రూ.15వేల పట్టుచీర, మూడవ బహుమతి రూ.7,800 పట్టుచీరతో పాటు మరో 20 మందికి రూ.2వేల విలువ చేసే మస్రైజ్డ్ చీరలను అందజేస్తామని ఏకేఎల్బీ వీవర్స్ మార్కెట్ అధ్యక్షుడు గుండు శ్రీరాములు తెలిపారు. -
మూసీలో చిక్కుకున్న యువకుడు సురక్షితం
రామన్నపేట : ప్రమాదవశాత్తు మూసీనదిలో పడి వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుడు కానుకుంట్ల మత్స్యగిరిని ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది శనివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మత్స్యగిరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో గ్రామం సమీపంలోని మూసీ వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు మూసీనదిలో పడిపోయాడు. వరద ప్రవాహానికి సుమారు మూడువందల మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయాడు. అదృష్ట వశాత్తు చెట్టును ఆసరా చేసుకొని పెద్ద మట్టిదిబ్బపైకి చేరాడు. అక్కడ ఉన్న వారు గమనించి వెంటనే పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు యాదగిరిగుట్ట నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించారు. యువకుడిని రక్షించేందుకు నదిలోకి పడవలో వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందంలోని ఒక సభ్యుడు నదిలో పడిపోగా మిగిలిన సభ్యులు అతడిని చాకచక్యంగా రక్షించారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మత్స్యగిరి ఉన్న ప్రదేశానికి చేరుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. చీకటిగా ఉండడం, నది ప్రవాహం ఉధృతంగా పారుతుండడంతో అతడి వద్దకు చేరుకోలేక పోయారు. రాత్రి 12 గంటల తరువాత సహాయక చర్యలు నిలిపివేశారు. రాతంత్రా వంతెనపైనే కాపాలా.. మత్స్యగిరికి వెలుతురు కనిపించేలా అధికారులు అర్ధరాత్రి ట్రాక్టర్ లైట్లు ఏర్పాటు చేశారు. కుటుంబసభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక యువకులు వంతెనపైనే రాత్రంగా అతడిని గమనిస్తూ కాపాలా కాశారు. స్థానిక గ్రామ పంచాయతీ భవనంలోనే సేదదీరిన ఎస్డీఆర్ఎఫ్ బృందం శనివారం తెల్లవారుజామున 5గంటలకే సహాయక చర్యలను మొదలు పెట్టారు. ఉదయం 6:45 గంటలకు మత్స్యగిరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మత్స్యగిరిని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ హనుమంతరావు రాత్రంతా సహాయక చర్యలను పర్యవేక్షించారు. బయటకు వచ్చిన మత్స్యగిరి కలెక్టర్ ఫోన్లో పరామర్శించారు. ఆర్డీఓ శేఖర్రెడ్డి, ఏసీపీ మధుసూదన్రెడ్డి, డీఎఫ్ఓ మధుసూదన్రావు, ఎస్ఎఫ్ఓ మధుసూదన్రెడ్డిలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. సీఐ ఎన్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యలో ఎస్ఐలు డి.నాగరాజు, యుగంధర్లు సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా బందోబసు ఏర్పాటు చేశారు. ఫ రాత్రంతా నదిలోనే మట్టిదిబ్బపై ఉన్న బాధితుడు మత్స్యగిరి ఫ శనివారం తెల్లవారుజామున ఒడ్డుకు చేర్చిన ఎస్డీఆర్ఎఫ్ బృందం -
ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ పోటీలు
భువనగిరి : భువనగిరి పట్టణంలోని సువాలి ఎస్టేట్లో గల న్యూ డైమెన్షన్ స్కూల్ ఆవరణంలో కొనసాగుతున్న అండర్–18 జూనియర్స్ బాలబాలికల అంతర్జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు శనివారం ముగిశాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆరు రోజుల పాటు పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ముగింపు రోజున జరిగిన ఫైనల్స్లో గెలుపొందిన వారికి మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ అకాడమీ ఉపాధ్యక్షుడు అశోక్కుమార్, తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ మేనేజర్ వైభవ్ పటేల్, ,జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షులు దిడ్డి బాలాజీ, ప్రధాన కార్యదర్శి కలీం అహ్మద్, సంయుక్త కార్యదర్శి పరమేష్కుమార్, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. విజేతలు ఎవరంటే.. బాలుర సింగిల్స్ ఫైనల్లో వ్రజ్ గోహిల్(ఇండియా), డెవ్ విఫుల్ పటేట్ (ఇండియా)పై 6–1, 6–4 తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో స్నిగ్ధకాంత (ఇండియా), ఐశ్వర్య జాదవ్(ఇండియా)పై 5–7, 6–2,6–0 గెలుపొందింది. బాలుర డబుల్స్ ఫైనల్లో ఽథామస్, కాప్పి (ఫ్రాన్స్), ప్రణవ్ మహేష్ సరవణకుమార్ (ఇండియా)లు, హృథిక్ కాటకం(ఇండియా), ప్రకాష్ సారణ్(ఇండియా)పై 6–4, 6–0తేడాతో విజయం సాధించారు. బాలికల విభాగంలో నైనికా నరేందర్రెడ్డి బేండ్రం(ఇండియా), స్నిగ్ధ కాంత(ఇండియా)లు, శ్రీనిత్తి చౌదరి(ఇండియా), హర్షకార్తిక ఊరగంటి(ఇండియా)పై 5–1 తేడాతో రిటైర్డ్ మ్యాచ్లో విజయం సాధించారు. -
శ్రీవాణి తరహాలోనే గరుడ ట్రస్టు
యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసిన విధంగానే యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం శ్రీగరుడ ట్రస్టును ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన విధి విధానాలను శనివారం ఆలయ ఈఓ వెంకట్రావు వెల్లడించారు. గరుడ స్కీంకు వచ్చే విరాళాలలను గరుడ ట్రస్టు పేరుతో అకౌంట్ ప్రారంభించి విద్య, వైద్యం, ప్రసాద వితరణ నిర్వహణకు వినియోగించనున్నారు. ఈ ట్రస్టును ఈ నెల 15న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించగా.. 29వ తేదీన విధి విధానాలను రెవెన్యూ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పరిశీలించి విడుదల చేశారు. మూడు స్లాట్లు.. ప్రత్యేక కూపన్లు.. గరుడ ట్రస్టును మూడు స్లాట్లుగా ఏర్పాటు చేశారు. విరాళాలుగా చెల్లించిన భక్తులకు వసతి కూపన్స్, దర్శనం కూపన్స్ అందజేసి దర్శన సదుపాయాలను కల్పించడంతో పాటు బాండ్ సైతం అందజేయనున్నారు. గరుడ స్కీంలో విరాళాలు సమర్పించే భక్తులు దేవస్థానం సెల్లో విరాళాలు సమర్పించి బాండ్, కూపన్స్ను పొందాలని ఆలయాధికారులు సూచిస్తున్నారు. స్కీం వివరాలు ఇలా.. ఫ రూ.50వేలు విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో రెండు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్పై సంవత్సరంలో రెండు సార్లు ఆరుగురికి లైఫ్ టైమ్ ఉంటుంది. విరాళం చెల్లించిన మొదటిసారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం (కల్యాణ శెల్లా, కనుము) అందజేస్తారు. ఫ రూ.లక్ష విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో నాలుగు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్ పై సంవత్సరంలో నాలుగు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్టైమ్ ఉంటుంది. విరాళం చెల్లించిన మొదటి సారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం అందజేస్తారు. ఫ రూ.2లక్షల విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో మూడు సార్లు ఎనిమిది మంది చొప్పున లైఫ్టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్ పై సంవత్సరంలో 8 సార్లు ఆరుగురికి దర్శనం ఉంటుంది. అంతే కాకుండా కొండ కింద యాదరుషి నిలయంలో డబుల్ బెడ్రూం గదిని సైతం కేటాయిస్తారు. వీటితో పాటు విరాళం చెల్లించిన మొదటి సారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం బహూకరిస్తారు. ఫ ట్రస్టు ద్వారా వచ్చిన సొమ్ము విద్య, వైద్యం, ప్రసాద వితరణకు వినియోగం ఫ దాతలకు ప్రత్యేక దర్శన భాగ్యం ఫ విధివిధానాలు విడుదల చేసిన ఆలయ ఈఓ -
కుక్కకు మత్తు మందు ఇచ్చి ఇంట్లో చోరీ
గరిడేపల్లి : మండల పరిధిలోని ఎల్బీనగర్ గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి కుక్కకు మత్తు మందు ఇచ్చిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. గరిడేపల్లి ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన వల్లభనేని శ్రీనివాసరావు ఆస్పత్రిలో చూపించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్లారు. ఆదివారం ఉదయం పని మనిషి శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్లగా తలుపులు తీసి ఉండడం.. ఇంట్లోని బీరువా తలుపులు తెరిచి ఉండడంతో పక్కనే ఉన్నవారికి తెలియజేశారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలపడంతో గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తన సిబ్బందితో శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి పరిశీలించారు. స్థానికులు ఫోన్ ద్వారా శ్రీనివాసరావుకు తెలపగా ఇంట్లో కొంత నగదు, బంగారం ఉన్నట్లు తెలిసింది. శ్రీనివాసరావు ఇంట్లో కుక్క ఉన్నప్పటికీ దానికి మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్తీదాణా తయారు చేస్తున్న ఇద్దరి అరెస్ట్కేతేపల్లి: కల్తీ దాణాను తయారు చేసి కోళ్ల ఫామ్స్ యజమానులకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను శనివారం కేతేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించి వివరాలను శనివారం కేతేపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి వెల్లడించారు. కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామానికి చెందిన ఆల్దాసు సతీష్, బుద్దె కృష్ణలు సూర్యాపేట పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని రైస్ మిల్లుల నుంచి నూకలు, తవుడు సేకరించి కోళ్ల ఫారాలకు దాణాను విక్రయిస్తున్నారు. వ్యాపార నిర్వహణ కోసం కేతేపల్లిలోని పడావుగా ఉన్న పాత రైస్మిల్ గోదామును కిరాయికి తీసుకున్నారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నూకలు, తవుడుతో కూడిన దాణాలో 30శాతం ఇసుకను కలిపి కల్తీ దాణాను తయారు చేసే దందాకు తెరలేపారు. తయారు చేసిన కల్తీ దాణాను డీసీఎంలో లోడ్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. కోళ్ల కల్తీ దాణా తయారీ దందాపై స్థానిక పంచాయతీ కార్యదర్శి సయ్యద్బాబా చేసిన ఫిర్యాదు మేరకు కేతేపల్లి ఎస్ఐ సతీష్ శనివారం తన సిబ్బందితో కలిసి గోదాముపై దాడి చేశారు. తనిఖీలో గోదాములో నిల్వ ఉన్న రూ.3.30 లక్షల విలువైన 245 బ్యాగుల కల్తీ కోళ్ల దాణా (122.5 క్వింటాళ్లు), 8 టన్నుల ఇసుకను పోలీసులు సీజ్ చేశారు. ఈ దాణా తిన్న కోళ్లతోపాటు వాటిని తిన్న మనుషుల ఆరోగ్యాలకు కూడా ముప్పు పొంచి ఉందని సీఐ తెలిపారు. విచారణ అనంతరం కల్తీ దాణా తయారు చేస్తున్న సతీష్, కృష్ణలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ వివరించారు. వారినుంచి డీసీఎం, టాటా నెక్సాన్ కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సమావేశంలో కేతేపల్లి ఎస్ఐ యు.సతీష్, సిబ్బంది అనిల్రెడ్డి, సతీష్, సైదులు, రాంబాబు పాల్గొన్నారు. -
తరగతి గదులకు తలుపుల్లేవు సార్
ఆలేరు: తరగతి గదులకు కిటీకీలు, తలుపులు లేవు సార్, రాత్రి సమయంలో, వర్షాలు కురిసినప్పుడు విష పురుగులు వచ్చే అవకాశం ఉందని ఆలేరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థినులు కలెక్టర్ హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. శనివారం పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల హాజరు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తరగతి గదులకు కిటికీలు,తలుపులు లేక అసౌకర్యం కలుగుతుందని విద్యార్థినులతో పాటు ప్రిన్సిపాల్ మామిడి వెంకటమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కిచెన్షెడ్ రేకుల కప్పు సరిగా లేక ఇబ్బంది అవుతుందని, పాఠశాలకు సరైన డ్రైయినేజీ వ్యవస్థ లేదని, ప్రహరీగోడకు మరమ్మతులు చేయించాలని కలెక్టర్ను కోరారు. వెంటనే కలెక్టర్ పంచాయతీరాజ్ ఈఈకి ఫోన్ చేసి పెండింగ్ సివిల్ పనులు, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయించాలని ఆదేశించారు. పరిసరాల్లో పిచ్చిమొక్కలు,గడ్డిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్కు సూచించారు. నాణ్యత లేని పప్పుధాన్యాల గుర్తింపు నాణ్యత లేని పప్పుధాన్యాలను కలెక్టర్ గుర్తించారు. వాటిని వెంటనే మార్చాలన్నారు. రేషన్ సరుకులతో పాటు కూరగాయలు నాణ్యమైనవి వినియోగించాలని స్పష్టం చేశారు. తమ జీవిత లక్ష్యాలు ఏమిటని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఫ కలెక్టర్కు విద్యార్థుల ఫిర్యాదు ఫ ఆలేరు రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల తనిఖీ -
పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి
భువనగిరిటౌన్ : పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం సురక్షితమైన వాతావరణం కల్పించాలని కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శనివారం కలెక్టరేట్లో యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లతో నిర్వహించిన ఇంటర్ఫేస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల రక్షణ, అభివృద్ధి, సాధికారత కోసం అనేక చట్టాలు, పాలసీలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోష్ (పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం) యాక్ట్ –2013 క్యాంపేయిన్లో భాగంగా యాక్షన్ ఎయిడ్ సంస్థ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుందని, మన జిల్లాలో కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. పోష్ చట్టం నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని సంస్థల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 150 కమిటీలు పూర్తయినట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, యాక్షన్ ఎయిడ్ కమిటీ సభ్యురాలు యాక్షన్ ఎయిడ్ సంస్థ కార్యక్రమాలపై మాట్లాడారు. కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ సంస్థ కమ్యూనిటీ ట్రైనర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం, డీఎంహెచ్ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, ఆశా కార్యకర్తల నోడల్ ఆఫీసర్ డాక్టర్ వీణ, సీడీపీఓలు శైలజ, జ్యోత్స్న, ఫిర్యాదుల కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ప్రమీళ, డీఎల్ఎస్ఏ అడ్వకేట్లు రాజశేఖర్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలి
యాదగిరిగుట్ట రూరల్: పాఠశాలల అభివృద్ధికి గ్రామపెద్దలు చేయూతనివ్వాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దాతలు కొమ్ము నాగరాజు రూ.1,40,000తో డ్యూయల్ డెస్క్ బేంచీలు, అమర్నాఽథ్రెడ్డి లక్ష రూపాయలతో క్రీడా దుస్తులు బహూకరించగా వాటిని డీఈఓ సత్యనారాయణతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. అందులో భాగంగానే ఆంగ్ల విద్య, నాణ్యతతో కూడిన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని సూచించారు. అనంతరం దాతలను అభినందించారు. అలాగే టెన్త్లో ఉత్తమ ర్యాంకుల సాధించిన గవ్వల రక్షిత, నమిలె శ్రీనిధికి మాజీ సర్పంచ్ కానుగు కవిత బాలరాజ్గౌడ్, డాక్టర్ అమరేందర్ నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శరత్యామిని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
15న ఎంజీయూ స్నాతకోత్సవం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. శుక్రవారం యూనివర్సిటీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హాజరవుతారని పేర్కొన్నారు. పీజీ విద్యార్థులకు 57 బంగారు పతకాలు, 22 మందికి పీహెచ్డీ పట్టాలు అందించనున్నామని వెల్లడించారు. అంతకుముందు బోధన, బోధనేతర సిబ్బందికి విధులు, బాధ్యతలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఈఓ ఉపేందర్రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆలయ ఏఈఓగా పదోన్నతి యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పర్యవేక్షకుడు నాగుల మహేష్ కు ఏఈఓగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రెవెన్యూ, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ శుక్రవారం ఆయనకు ఉత్తర్వులు అందజేశారు.మహేష్ గత సంవత్సరం బదిలీల్లో భాగంగా వేములవాడ రాజరాజేశ్వరిస్వామి ఆలయం నుంచి యాదగిరి క్షేత్రానికి వచ్చారు. ఆలయ పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఆయనకు ఏఈఓగా పదోన్నతి రావడంపై ఆలయ ఉద్యోగులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలి భువనగిరిటౌన్ : సెప్టెంబర్ 1వ తేదీన పెన్సన్ విద్రోహ దినంగా పాటించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి పట్టణంలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానం ఉద్యోగస్తుల పాలిట శాపంగా మారిందన్నారు. 1వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఎదుట వెయ్యి మంది ఉద్యోగులతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు భగత్, ఉద్యోగ సంఘాల నాయకులు మహమ్మద్ కదీర్, అమరేందర్రెడ్డి, యాదయ్య, లక్ష్మీనరసింహారెడ్డి, బోయ రాములు, శ్రీకాంత్, శ్రీనివాస్, నర్సింహ, గణగాని శశికాంత్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కత్తుల కుమార్, శ్రీనివాస్, బాలేశ్వర్, అరుణ, బాలరాజు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల తనిఖీ భువనగిరి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలను శుక్రవారం డీఈఓ సత్యనారాయణ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హెచ్ం, ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాదించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, నిర్ణీత సమయం ప్రకారం విద్యార్థులకు స్లిప్ టెస్ట్లు, ఎఫ్ఏ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగవర్థన్రెడ్డి, హెచ్ఎం నరసింహులు, ఉపాధ్యాయులు యాదమ్మ, రేణుక, రజిత, వీరారెడ్డి, పీడీ జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మాకూ పదోన్నతులు ఇవ్వండి
పీఎస్హెచ్ఎం పోస్టుల్లో అర్హత కల్పించాలంటున్న బీఈడీ ఎస్జీటీలు భువనగిరి: బీఈడీ అర్హత ఉన్న ఎస్జీటీలు ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టుల్లో తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అర్హత, అనుభవం కలిగి, బీఈడీ పూర్తి చేసిన తమను ప్రస్తుతం చేపట్టిన పదోన్నతుల్లో పరిగణలోకి తీసుకోకపోవడంతో వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఈడీ కలిగి ఎస్జీటీలు పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం కొంతకాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. జీఓ 11,12లను సవరించి బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు సైతం పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డిని కలిసి లేఖ అందజేశారు. గతంలోనే నియామకం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008 సంవత్సరం వరకు నిర్వహించిన డీఎస్సీల్లో ఇంటర్, డీఈడీ పూర్తిచేసిన వారితో పాటు డిగ్రీ, బీఈడీ ఉన్న అభ్యర్థులు కూడా ఎస్జీటీలుగా నియమింపబడ్డారు. తర్వాత కాలంలో డీఈడీ చేసిన వారిని మాత్రమే ఎస్జీటీ పోస్టులకు అర్హులని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తర్వాత కాలంలో డీఈడీ చేసిన వారిని మాత్రమే ఎస్జీటీ పోస్టులకు అర్హులుగా పరిగణించారు. దీంతో బీఈడీ అర్హతతో ఎస్జీటీలుగా నియామకమైనా ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల హెచ్ం పదోన్నతికి తిరస్కరణకు గురవుతున్నారు. 2015, 2024 సంవత్సరాలతో పాటు తాజాగా ఈ నెలలో పదోన్నతుల ప్రక్రియ చేపట్టారు. ఆయా సంవత్సరాల్లో బీఈడీ ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ పిండిత్లకు ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా పదోన్నతులు లభించలేదు. బీఈడీ చేసిన ఎస్జీటీలు ఇలా.. జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఇందులో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 1,086 ఎస్జీటీలు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 528 మంది బీఈడీ చేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సీనియార్టీ ఉన్నవారంతా పీఎస్ హెచ్ఎం పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. జీఓ నంబర్ 11,12ను సవరించి పీఎస్ హెచ్ఎం పోస్టులకు డీఈడీ టీచర్లతో పాటు బీఈడీ చేసిన ఎస్జీటీలను కూడా అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ జీఓల వల్ల అర్హత ఉన్నా పదోన్నతుల అవకాశాలను కోల్పోతున్నామని అందోళన చెందుతున్నారు. ఫ ప్రస్తుత ప్రమోషన్లలో చోటుకోసం డిమాండ్ ఫ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇటీవల లేఖ ఫ జిల్లాలో 1,086 మంది ఎస్జీటీలు.. వీరిలో 528 మంది బీఈడీ చేసినవారే -
ఇళ్ల నిర్మాణంలో ఫస్ట్
సాక్షి, యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆగస్టు మాసానికి రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రఽథమ స్థానంలో నిలిచింది. రెండు విడతల్లో 9,495 ఇళ్లు మంజూరు కాగా.. 7,730 ఇళ్లకు మా ర్కింగ్ ఇచ్చారు. ఇందులో బేస్మెంట్ లెవల్ 4,951, రూప్ లెవల్ 833, స్లాబ్ లెవల్ 226 ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.44.94 కోట్లు జమ చేశారు. కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ కలెక్టర్ హనుమంతరావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఇళ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు సహకరించడంతో పాటు సమీక్షలు, క్షేత్ర పర్యటనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఎమ్మెల్యేల ప్రోత్సాహం ఎమ్మెల్యేలు స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దివ్యాంగులు, వితంతువుల ఇళ్ల నిర్మాణాలకు 50 బస్తాల సిమెంట్ ఉచితంగా ఇస్తున్నారు. అదే విధంగా గృహప్రవేశం సమయంలో యజమానులకు మేకపోతు, ఇంటిల్లిపాదికి నూతన వస్త్రాలు అందజేసి ప్రోత్సహిస్తున్నారు. భు వనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి గృహప్రవేశం చేసే వారికి నూతన వస్త్రాలు అందజేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి భువనగిరి ఆలేరు తుంగతుర్తి మునుగోడు నకిరేకల్ మంజూరు 3,280 3,639 573 1,314 689 ప్రారంభం కానివి 628 662 91 239 145 మార్కౌట్ ఇచ్చినవి 2,652 2,977 482 1,075 544 బేస్మెంట్ లెవల్ 1,673 1,974 338 752 214 లెంటల్ 257 352 68 125 26 స్లాబ్.. 65 91 30 21 19 పూర్తయినవి 01 06 01 01 01లబ్ధిదారులకు రుణాలుఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో ఇళ్లు నిర్మించుకోలేకపోతున్న లబ్ధిదారులకు ఆర్థికంగా సహకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల పరిశీలనకు వెళ్లగా పలువురు లబ్ధిదారులు తమ సమస్యలు తెలియజేస్తున్నారు. అటువంటి వారికి స్వయం సహాయక మహిళా సంఘాల నుంచి రుణాలు ఇప్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.14 కోట్ల రుణాలు ఇప్పించారు. ఆగస్టు మాసానికి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం ఫ వివిధ దశల్లో 7,730 గృహాలు ఫ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.44 కోట్లు జమ ఫ ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫ లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సాహం -
నేత్రపర్వంగా స్వాతినక్షత్ర పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వాతినక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున వైకుంఠద్వారం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శ్రీస్వామి వారి పాదాల వద్ద, వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మెట్ల మార్గంలో వెళ్లి శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఆలయ ముఖమండపంలో స్వాతిహోమం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. ఆ తరువాత పంచామృతాలు, శుద్ధ జలాలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో నింపిన బంగారు, వెండి కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం నిర్వహించారు. -
సాదాబైనామా.. సాకారం
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సాదాబైనామా కోసం వచ్చిన పలు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. భూ భారతి చట్టం ప్రకారం వీటికి పరిష్కారం లభిస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు. ఈ రకంగా వాటిలో కొన్ని సాదాబైనామాలకు నోటీస్ ఇచ్చారు. కొన్ని దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. ప్రభుత్వ భూముల నుంచి దరఖాస్తులు వచ్చాయి. సాదా కాగితాల మీద అమ్మిన రైతులు ప్రభుత్వ రికార్డుల్లో లేరు. కొన్ని రికార్డుల్లో సర్వే నంబర్లు వేయలేదు. ఒకటి అంతకంటే ఎక్కువ సార్లు అమ్మకం, గతంలోనే పట్టా సర్టిఫికెట్ జారీ చేయడం, కొన్నిచోట్ల ఇళ్ల స్థలాలు ఉండటం, ఐదు ఎకరాలపైన భూమి ఉండడం, కోర్టు కేసులు, రక్త సంబంధికులకే అమ్మడం వంటివి దరఖాస్తులు వచ్చాయి. సాక్షి,యాదాద్రి: సాదాబైనామాలకు మోక్షం కలగనుంది. లిఖితపూర్వక ఒప్పందంతో కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రికార్డులు లేకపోవడం, పట్టాదారులుగా గుర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను ఈనెల 26న కొట్టివేసింది. 2014 జూన్ 2కు ముందు రైతుల అధీనంలో ఉన్న భూములను ఆధారాల ప్రకారం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. ఆర్ఓఆర్లో పట్టాలు గతంలో భూముల కొనుగోలు సాదా కాగితాలపై జరిగింది. కొనుగోలు చేసిన రైతులకు భూములు అమ్మిన రైతులు కబ్జా ఇచ్చారు. కానీ, పట్టా మార్పిడి కాలేదు. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సాదా కాగితాల మీద కొనుగోలు చేసిన భూములకు పట్టా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాదాబైనామాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాగా సాదాబైనామాలో కొనుగోలు చేసిన భూములకు చట్టబద్ధత కల్పించి పాస్ పుస్తకాలు జారీ చేయాలని గత ప్రభుత్వం 2020 నవంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే ధరణి పోర్టల్లో సాదాబైనామాల రిజిస్ట్రేషన్ కాలమ్ విస్మరించింది. దీంతో కాగితాల మీద కొనుగోలు చేసిన భూములకు ధరణిలో పేర్లు రాలేదు. అమ్మిన రైతుల పేర్లే మళ్లీ వచ్చాయి. దీంతో ధరణి వివాదాలకు కేంద్రమైంది. మండలం దరఖాస్తులు బీబీనగర్ 881 మోటకొండూరు 915 రామన్నపేట 1519 వలిగొండ 1987 ఆత్మకూర్ 460 తుర్కపల్లి 859 మోత్కూరు 1318 పోచంపలి 943 భువనగిరి 1641 బొమ్మలరామారం 1231 గుండాల 2218 యాదగిరిగుట 604 నారాయణపురం 1352 రాజపేట 1355 చౌటుప్పల్ 1043 అడ్డగూడూరు 2905 ఆలేరు 1194 ఫ హైకోర్టు తీర్పుతో తొలగిన అడ్డంకులు ఫ 22,450 దరఖాస్తులకు మోక్షం ఫ క్రమబద్ధీకరణతో భూ హక్కులు వర్తింపు సాదాబైనామాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు అందలేదు. భూ భారతి చట్టం ప్రకారం ముందుకెళ్తాం. చిన్న,సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది. –జి.వీరారెడ్డి, అదనపు కలెక్టర్ గత ప్రభుత్వంలో, తాజాగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 22,425 దరఖాస్తులు వచ్చాయి. హెచ్ఎండీఏ మండలాలతో పాటు మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో కూడా సాదాబైనామాలకు అవకాశం ఇవ్వడం జరిగింది. 2020 అక్టోబర్ నుంచి 2020 నవంబర్ 10 వరకు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకం చట్టం–1971 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్ధీకరించుకోవచ్చని కోర్టు తెలిపింది. -
బోటులో ప్రయాణించి.. సూచనలిచ్చి
భువనగిరి, బీబీనగర్: గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని రాచకొండ సీపీ సుధీర్బాబు శుక్రవారం భువనగిరి పెద్దచెరువు, రాయగిరి చెరువును సందర్శించారు. రాయగిరి చెరువులో బోట్పై ప్రయాణించి పరిశీలించారు. నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. చెరువుల్లో నీరు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బీబీనగర్ పెద్దచెరువును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్కు దగ్గరగా ఉన్నందున నిర్వాహకులు గణేష్ విగ్రహాలను బీబీనగర్కు తరలించే అవకాశం ఉందన్నారు. చెరువు జాతీయ రహదారి పక్కన ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ పోలీస్లకు సూచించారు. ఆయన వెంట డీసీపీ అక్షాంశ్యాదవ్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు రాహుల్రెడ్డి, శ్రీనివాస్నాయుడు, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్, సీఐలు ప్రభాకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ఎస్ఐ రమేష్ ఉన్నారు. ఫ భువనగిరి, రాయగిరి చెరువులను పరిశీలించిన సీపీ సుధీర్బాబు -
ఉన్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్: ఉన్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన మూడు కిలోమీటర్ల పరుగు పందెంలో 70 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. క్రీడాకారులు మరింత రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీకి గుర్తింపు తేవాలని విజేతలకు సూచించారు. అనంతరం స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసిన క్యాలెండర్, పోస్టర్లను వీసీ విడుదల చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, హరీష్ కుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, మురళి, శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ శివశంకర్ పాల్గొన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపుఅనంతగిరి: గోండ్రియాల వద్ద పాలేరు వాగులో గురువారం గల్లంతైన కిన్నెర ఉపేందర్ మృతదేహం కోసం శుక్రవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోండ్రియాల నుంచి కొత్తగూడెం చెక్డ్యాం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వాగులో భారీ రాళ్లు ఉన్న కారణంగా రెస్క్యూ టీం పడవలు వెళ్లలేక కొంత ఇబ్బందులు రావడంతో స్థానిక గజ ఈతగాళ్ల సహకారంతో గాలిస్తున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట కోదాడ రూరల్సీఐ ప్రతాప్ లింగం, అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్, కోదాడ ఫైర్ ఆఫీసర్ ముత్తినేని శ్రీనివాస్, తహసీల్దార్ హిమబిందు, ఆర్ఐ వెంకట నగేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
బంగారం చోరీ కేసులో మరోవ్యక్తి అరెస్టు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయిసంతోషి జ్యుయలరీ షాపులో గత నెల 21న అర్ధరాత్రి జరిగిన భారీ దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. నిందితుడి నుంచి 25తులాల బంగారం, రూ.4,84,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ల ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందం పశ్చిమ బెంగాల్కు వెళ్లి సాంకేతిక ఆధారాలు, నమ్మదగిన సమాచారంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లాకు చెందిన ఏ5 జషిముద్దీన్ను ఈ నెల 26 మాల్దా జిల్లా, రత్వా పోలీస్ స్టేషన్ పరిధి, ఒకేరా చాంద్పరా మండలం అందారు గ్రామంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 25తులాల బంగారు ఆభరణాలు, రూ.4,84,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ చాచల్ కోర్టులో న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టి 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి తీసుకుని నిందితుల రాష్ట్రాల బదిలీ (ట్రాన్సిట్) నిబంధనల ప్రకారం సూర్యాపేటకు తీసుకువచ్చారు. నిందితుడిని జషిముద్దీన్ను విచారించగా నేపాల్కు చెందిన ఏ1 ప్రకాశ్ అనిల్ కుమార్, ఏ2 కడక్ సింగ్ అహుల్ వాలియ, ఏ3 పురన్ ప్రసాద్ జోషి, పశ్చిమబెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లాకు చెందిన ఏ4 మాలిక్ మొల్లతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెక్కీ నిర్వహించి సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో బంగారం, నగదు దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. అనంతరం కిరాయికి తీసుకున్న ఇంటికి వెళ్లి దొంగతనం చేసిన సొత్తును 5 భాగాలుగా పంచుకొని ఈ దొంగతనంలో సహకరించిన ఏ7 యశోద, ఏ6 అమర్ బట్లకు ఖర్చుల కోసం కొంత బంగారం, డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయినట్లు విచారణలో పేర్కొన్నాడు. ఏ6 నిందితుడైన అమర్ బట్ వాటాకు వచ్చిన బంగారం ఏ1 ప్రకాష్ అనిల్ కుమార్ వద్ద ఉంచి ఆ బంగారాన్ని నేపాల్లో తీసుకునేటట్లుగా అనుకున్నారని విచారణలో నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇప్పటివరకు నలుగురు దొంగలు అరెస్టు బంగారం దొంగతనం కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. మొదట అరెస్ట్ చేసిన ఏ7 నిందితురాలు యశోద నుంచి 14 తులాల బంగారం, ఈ నెల 11న వెస్ట్ బెంగాల్లో ఏ4 నిందితుడు మాలిక్ మొల్ల నుంచి సుమారు రూ,55 లక్షల విలువైన 554 (అరకిలో) గ్రాముల బంగారం, రూ.87 వేల నగదు, ఖమ్మంలో అరెస్ట్ చేసిన ఏ6 నిందితుడు అమర్ బట్ నుంచి రూ. శ్రీ5 వేల నగదు, ఏ5 నిందితుడు జషిముద్దీన్ నుంచి రూ.25 లక్షల విలువైన 25 తులాల బంగారం, రూ.4,84,500 నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ సీఐ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ సూర్యాపేట జ్యుయలరీ షాపులో జరిగిన చోరీ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ ఫ ఏ5 నిందితుడి వద్ద 25తులాల బంగారం, రూ.4.80లక్షల నగదు స్వాధీనం -
గణేష్ మండపం వద్ద.. విద్యుదాఘాతంతో బాలుడు మృతి
హాలియా : గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపం వద్ద విషాదం చోటుచేసుకుంది. వినాయక మండపం వద్ద భక్తి పాటలు పెట్టేందుకు యాంపిల్ ఫ్లేయర్ వైరును విద్యుత్ బోర్డులో పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పదకొండేళ్ళ బాలుడు మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని కేవీ కాలనీకి చెందిన దండెం మహేందర్–మౌనిక దంపతుల కుమారుడు మణికంఠ(11) 5వ తరగతి చదువుతున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేవీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తి పాటలు పెట్టేందుకు శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో దండెం మణికంఠ మండపం వద్దకు వెళ్లాడు. యాంపిల్ ఫ్లేయర్ వైర్ను విద్యుత్ బోర్డులో పెట్టేందుకు యత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న వయసులోనే నీకు నూరేళ్ళు నిండాయా నాయన అంటూ కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. ఘటనా స్థలానికి సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ చేరుకొని వినాయక మండపాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు. హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదురామగిరి(నల్లగొండ): మామను హత్య చేసిన కేసులో కోడలికి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ మహిళా కోర్టు జడ్జి కవిత శుక్రవారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన బొబ్బలి పద్మ అదే గ్రామానికి చెందిన ఆవుల వేణు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పద్మ భర్త లింగయ్యకు తెలియడంతో మందలించాడు. మరోసారి జరగనివ్వమని పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నారు. 2017 ఆగస్టు 3న పద్మ మామ భిక్షమయ్య వ్యవసాయ పొలం నుంచి ఇంటి వచ్చే సమయానికి పద్మ తన ప్రియుడు వేణుతో కలిసి ఉంది. దీంతో భిక్షమయ్య ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పద్మ, వేణు ఇద్దరు కలిసి భిక్షమయ్యపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో భిక్షమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పద్మ భర్త లింగయ్య నకిరేకల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ సుబ్బరామిరెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరిపి ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరమణారెడ్డి వాదనలతో ఏకీభవించిన జడ్జి కవిత ఇద్దరు నిందితులు బొబ్బలి పద్మ, ఆవుల వేణుకు జీవిత ఖైదు, రూ.4 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు కానిస్టేబుల్ సుధాకర్, లైజన్ ఆఫీసర్లు నరేందర్, మల్లిఖార్జునన్ లు కోర్టుకు సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంలో సహకరించారు. -
మెరుగైన సౌకర్యాలపై దృష్టి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి కేంద్రీకరించామని దేవాదాయ, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. శుక్రవారం యాదగిరి కొండపైన గల అతిథి గృహంలో వైటీడీఏ సీఈఓ, వీసీ కిషన్రావు, ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులు, టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియా ఫైనలైజేషన్కు సంబంధించి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో శ్రీస్వామి వారి క్షేత్ర మహత్యానికి సంబంధించిన బొమ్మల పుస్తకాన్ని, మాడ వీధిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ను ప్రారంభించారు. గరుఢ ట్రస్టుకు సంబంధించిన ప్రాథమిక విధివిధానాల్లో భాగంగా ఏర్పాటు చేసిన లిస్టును సైతం తెలిపారు. రూ.50వేలకు పైనా విరాళం గరుఢ ట్రస్టుకు ఇస్తే రూ.300 టికెట్పై సంవత్సరంలో ఆరుగురు చొప్పున 2 పర్యాయాలు బ్రేక్ దర్శనం, రూ.150 టికెట్పై ఆరుగురు చొప్పున 2 పర్యాయాలు బ్రేక్ దర్శనం సదుపాయం కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్కు ఈఓ తెలిపారు. అంతే కాకుండా రూ.లక్షకు పైగా గరుఢ ట్రస్ట్కు చెల్లిస్తే బ్రేక్ దర్శనం రూ.300 టిక్కెట్పై ఆరుగురు చొప్పున 4 పర్యాయాలు, రూ.150 బ్రేక్ దర్శనంపై ఆరుగురు 4 పర్యాయాలు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇక రూ.2లక్షలపైన చెల్లిస్తే రూ.300 బ్రేక్ దర్శనంపై ఆరుగురు చొప్పున 8 పర్యాయాలు, కొండ కింద గల యాదరుషి నిలయంలో డబుల్ బెడ్ రూంను కేటాయించనున్నట్లు వివరించారు. తరువాత దేవస్థానం పరిధిలోని గోశాల, లక్ష్మీ పుష్కరిణితో పాటు, వేద పాఠశాల నిర్మాణం పనులను పరిశీలించారు. అంతకు ముందు శ్రీస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, దేవాదాయశాఖ ఉప కమిషనర్లు వినోద్రెడ్డి, కృష్ణ ప్రసాద్, వెంకటేష్, తహసీల్దార్ గణేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి పాల్గొన్నారు. ఫ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఫ యాదాద్రి ఆలయాభివృద్ధి, టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియా ఫైనలైజేషన్పై సమీక్ష -
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
కట్టంగూర్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.105 కోట్ల నిధులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. గతంలో మంజూరైన పనులను మార్చకుండా అక్కడే ఖర్చు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లు వినియోగంలో లేకుండా పోవటంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కట్టంగూర్లో పెద్దవాగుపై రెండు బ్రిడ్జిలు నిర్మించేందుకు రూ.4కోట్లు మంజూరు చేయించానని ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, పోగుల నర్సింహ, గడుసు కోటిరెడ్డి, చెవుగోని జనార్దన్, బెల్లి సుధాకర్, గుండగోని రాములు, మేడిరాములు, దాసరి సంజయ్, మునుగోటి ఉత్తరయ్య పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
నల్లగొండ: నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి కళాశాల వద్ద బుధవారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురికాగా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన షేక్ సిరాజ్ అనే వ్యక్తి హుస్సేన్ దగ్గర లారీ క్లీనర్గా పని చేసేవాడు. నెల క్రితం లారీలో లోడ్తో నల్లగొండ నుంచి వెళ్తున్న క్రమంలో హుస్సేన్తో షేక్ సిరాజ్ గొడవ పడ్డాడు. దీంతో సిరాజ్ను డ్రైవర్ లారీ నుంచి దింపేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సిరాజ్ నల్లగొండ పట్టణంలో ఉంటూ అన్నపూర్ణ క్యాంటిన్ వద్ద రూ.5 భోజనం చేస్తూ చుట్టుపక్కల భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి సమయంలో కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి కళాశాల వద్ద నిద్రపోయేవాడు. దూషించాడన్న కక్షతో.. 15 సంవత్సరాల క్రితం నల్లగొండకు వలస వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ (40) మద్యం మత్తులో ఈనెల 27న రాత్రి సమయంలో సిరాజ్ పడుకునే స్థలం వద్దకు వచ్చాడు. సిరాజ్ నిద్రపోయేందుకు వేసుకున్న పట్టాలో రమేష్ నిద్రించాడు. ఇక్కడ ఎందుకు నిద్రిస్తున్నావని సిరాజ్ అతడిని అడగగా.. రమేష్ మద్యం మత్తులో దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో చంపేస్తానని రమేష్ను సిరాజ్ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత వచ్చి చూడగా.. రమేష్ అక్కడే నిద్రపోయి ఉండడంతో పక్కనే ఉన్న గ్రనైట్ రాయి తీసుకుని అతడి తలపై కొట్టాడు. రాయి దొరకకుండా కళాశాల గోడ వెనుక పడేసి అక్కడ నుంచి పరారయ్యాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని గురువారం ఉదయం పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి, 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు నల్లగొండలోని రహమాన్బాగ్లో నిద్రిస్తున్న సిరాజ్ను వన్టౌన్ పోలీసులు పట్టుకుని విచారణ చేయగా తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాయిని చూపించగా దానిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు వెంకటనారాయణ, ఏఎస్ఐ వెంకట్యాదవ్, సిబ్బంది రబ్బాని, షకీల్, శ్రీకాంత్, శంకర్, జానకిరాములు, సైదులు, తదితరులు పాల్గొన్నారు. ఫ తను నిద్రించే స్థలంలో వేరే వ్యక్తి వచ్చి నిద్రపోవడంతో తలెత్తిన వివాదం ఫ దుర్భాషలాడాడన్న కోపంతో రాయితో కొట్టి హత్య -
‘దివీస్’తో కుమ్మకై ్క అలైన్మెంట్ మార్చారు
చౌటుప్పల్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివీస్ పరిశ్రమతో కుమ్మకై ్క రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. చౌటుప్పల్ మున్సిపాలిటీకి దూరంగా వెళ్లాల్సిన ట్రిపుల్ ఆర్ను నాటి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కలిసి మున్సిపాలిటీలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతులు, నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరతరాలుగా భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలని, భూమికి భూమి లేదంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారంగా పరిహారం ఇప్పించాలని నిర్వాసితులు వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలైన్మెంట్ను నిబంధనలకు విరుద్ధంగా మార్చి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. రైతులకు, నిర్వాసితులకు అన్యాయం చేసిన వ్యక్తులే ఇప్పుడు వారిని రెచ్చగొడుతూ ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసగాళ్లు ఎవరో, మోసం చేసినవారు ఎవరో, మొసలి కన్నీరు కారుస్తున్నవారెవరో తనకు పూర్తిగా తెలుసన్నారు. ఏ ఒక్క శాతం అవకాశం ఉన్నా అలైన్మెంట్ను మార్పిస్తానని, లేనిపక్షంలో అధిక మ్తొతంలో పరిహారాన్ని ఇప్పించేందుకు కృషిచేస్తానని అన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్గరీతో స్వయంగా మాట్లాడి సమస్యపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆర్డీవోకు శేఖర్రెడ్డిని ఫోన్లో అడిగారు. రైతులు అంగీకరిస్తే పరిహారం వారి అకౌంట్లలో జమ అవుతాయని ఆర్డీవో చెప్పారు. పరిహారం విషయం తేలనందున ప్రస్తుతం అన్ని రకాల ప్రక్రియలను ఆపాలని ఆర్డీవోను ఎమ్మెల్యే ఆదేశించారు. ట్రిపుల్ఆర్ సమస్య తనతో పరిష్కారం కాకుంటే.. దేవుడితో కూడా అవ్వదన్నారు. కొందరి మాటలు నమ్మి తనపై అపోహలకు పోవద్దని, తాను ప్రజలందరికీ ఎమ్మెల్యేనన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తాను భరించలేనన్నారు. సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్రెడ్డి, నాయకులు పబ్బు రాజుగౌడ్, ఆకుల ఇంద్రసేనారెడ్డి, వెల్గ రాజశేఖర్రెడ్డి, సుర్వి నర్సింహ, మొగుదాల రమేష్, కాసర్ల శ్రీనివాస్రెడ్డి, ఎండి.హన్నుభాయ్, బొంగు జంగయ్య, నిర్వాసితులు రాములు, ప్రకాష్రెడ్డి, మల్లేష్గౌడ్, ఉపేందర్రెడ్డి, జాల శ్రీశైలం, నాగెల్లి దశరథ, జాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపణ ఫ రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితులతో సమావేశం -
యూరియా కోసం రైతుల బారులు
ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు : ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండల కేంద్రాల్లోని సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. గురువారం ఉదయం ఆత్మకూర్ పీఏసీఎస్కు లారీ లోడ్, అడ్డగూడూరు సొసైటీకి 200 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం అందుకున్న రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీలకు తరలివచ్చి లైన్లో నిల్చున్నారు. స్టాక్ తక్కువగా ఉండటం, రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కో రైతుకు 5నుంచి 10 బస్తాల యూరియా అవసరం ఉన్నప్పటికీ రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. వందలాది మంది రైతులు సాయంత్రం వరకు నిరీక్షించి నిరాశతో వెనుదిరిగారు. వ్యవసాయ పనులు వదులుకొని సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తుందని, సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. -
కేజీబీవీ తనిఖీ
భూదాన్పోచంపల్లి: మండలంలోని జలాల్పురంలోని కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాలను గురువారం జెడ్పీ సీఈఓ శోభారాణి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు విద్యాబోధన చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల ఆవరణలో ఇంకుడుగుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని లబ్ధిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఏపీఓ కృష్ణమూర్తి, ఎస్ఓ ఇందిర, టీఏ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి నరేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ అమృత, కారోబార్ భార్గవి పాల్గొన్నారు.నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలిభువనగిరిటౌన్ : గణేష శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం భువనగిరిలోని క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్, ఆర్అండ్బీ, విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. వినాయకుల నిమజ్జనానికి చెరువుల వద్ద అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం భువనగిరి బైపాస్ లోని అంబేద్కర్ భవన్ను సందర్శించి మౌ లిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ, అధికారులు, నాయకులు ఉన్నారు.ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానంనల్లగొండ: భారత సైనిక దళం (ఆర్మీ)లో అగ్నివీర్ పథకం కింద టెక్నికల్, క్లర్క్ ఉద్యోగాలకు భారత సైనిక విభాగం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జనవరి 2005 నుంచి జూలై 2008 మధ్య జన్మించి, ఇంటర్/డిప్లొమాలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్నంబర్ 78391 26939ను సంప్రదించాలని కోరారు.ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరతభువనగిరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం భువనగిరిలోని బీ ఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తమ కోటా పూర్తిగా విడుదల చేశామని కేంద్రం చెబుతుందని, కానీ, అందులో 60 శాతం బ్లాక్ మార్కెట్కు తరలివెళ్లిందన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించడంతో పాటు సాగు, పంటల దిగుబడి అంచనా వేయడంలో పక్కాగా ఉండేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైదన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా కో ఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు.వేకుజామును సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తరం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను ఆలయంలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. శివాలయంలో గణపతి పూజ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ప్రతిష్ఠించిన వినాయకులకు గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉప ఆలయ మండపంలోని వినాయకుడితో పాటు మట్టి గణపతికి పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అర్చకులు పాల్గొన్నారు. -
ముంచెత్తిన వరద
మూసీకి పోటెత్తిన వరద ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ, బిక్కేరు వాగుల ద్వారా మూసీ ప్రాజెక్టుకు వరద పెరిగింది. - 8లోశుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025- 9లోబోధనలు ఆచరణీయం ఆచార్య నాగార్జునుడి బోధనలు ఆచరణీయమని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ శివనాగిరెడ్డి అన్నారు.- 8లోనాగిరెడ్డిపల్లి వద్ద 24 గంటలు నిలిచిన రాకపోకలుఈనెల 26వ తేదీ రాత్రి నుంచి 27 వరకు ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల భువనగిరి–నల్లగొండ మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు మీదుగా ఉధృతంగా వరద నీరు ప్రవహించింది. దీంతో పోలీసులు సుమారు 24 గంటల పాటు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇరువైపులా సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు త్రీవ ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు కొన్ని వాహనాలను నాగిరెడ్డిపల్లి, ఎర్రంబెల్లి, గౌస్నగర్, తుక్కాపురం మీదుగా రాకపోకలకు అవకాశం కల్పించారు. తిరిగి గురువారం ఉదయం 11 గంటల సమయంలో భారీ వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అలాగే భువనగిరి మండలంలోని అనాజీపురం–బీబీనగర్ మండలంల రావిపహాడ్ గ్రామాల మధ్య చిన్నేటి వాగు ప్రవహించడంతో రాకపోకలునిలిచిపోయాయి. బొల్లేపల్లి గ్రామం మధ్య నుంచి వెళ్లే చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాక్షి,యాదాద్రి : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భువనగిరిలోని జంఖానగూడెంలోఇళ్ల మధ్యకు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వాగులు పొంగిపొర్లుతున్నాయి. నాన్ ఆయకట్టులో చెరువులు అలుగుపోస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద చేరడంతో చెరువులను తలపించాయి. భువనగిరి నియోజకవర్గంలో.. భువనగిరి మండలం అనాజిపురం–బీబీనగర్ మండలం రావిపహాడ్ ఽమధ్య చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బీబీనగర్, భువనగిరి పెద్ద చెరువులు, తీనం చెరువు జలకళను సంతరించుకున్నాయి. బీబీనగర్ వద్ద సర్వీస్ రోడ్డు వెంట చిన్నేటి వాగు వరద ప్రవాహానికి రాకపోకలు నిలిపివేశారు. బీబీనగర్ మండలం అన్నంపట్ల–గూడూరు మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మూసీ బ్రిడ్జిలు సంగెం, రుద్రవెల్లి వద్ద బుధవా రం రాకపోకలను నిలిపివేశారు. తిరిగి గురువారం పునరుద్ధరించారు. ఆలేరు నియోజకవర్గ పరిధిలో.. యాదగిరిగుట్ట పట్టణంలో గండి చెరువు అలుగుపోస్తోంది.అధికారులు చెరువు గేట్లు ఎత్తి యాదగిరిపల్లి ఎస్సీ కాలనీ పక్క నుంచి వంగపల్లి వాగులోకి నీటిని పంపుతున్నారు. వర్షం కారణంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి భక్తుల రాక తగ్గింది. గుండ్లపల్లిలో తోపుగాని చెరువు అలుగుపోస్తుంది. యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు మార్గం కుంగిపోయింది. యాదగిరిగుట్ట నుంచి రాజాపేటకు వెళ్లే మార్గంలోని సైదాపురం వాగు, చొల్లెరు–మర్రిగూడెం మధ్యలో వాగులు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాతారుపల్లిలో చెరువుకట్టపై గండి ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమై పూడ్చివేశారు. ఆలేరు పట్టణ పరిధిలోని పెద్ద వాగు జలకళను సంతరించుకుంది. రాజాపేట మండలం కాల్వపల్లి–పొట్టిమర్రి వద్ద వాగు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేసి, రఘునాథపురం–వెంకటపురం మధ్య మార్గం నుంచి వాహనాలను మళ్లించారు. రాజాపేట మండల పరిధిలో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. తుర్కపల్లి మండలం గంథమల్ల చెరువు నిండి మత్తడి దుంకుతుంది. ఆలేరు మండలం కొలనుపాక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆలేరు నుంచి బచ్చన్నపేట, సిద్ధిపేట వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఆలేరు నుంచి జనగాం మీదుగా వాహనాలు సిద్ధిపేట వైపు వెళ్తున్నాయి. బొమ్మలరామారం మండలం చౌదరిపల్లి మల్లారెడ్డి చెరువు అలుగుపోస్తుండటంతో మర్యాల గ్రామంలో కల్వర్టు ప్రాంతమంతా కోతకు గురైంది. దీంతో అక్కడి నుంచి పలు గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయి గురువారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి.జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం ఫ పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఫ భువనగిరి–చిట్యాల మార్గంలో రోజంతానిలిచిన రాకపోకలు, పునరుద్ధరణ ఫ నాన్ ఆయకట్టులోనూ అలుగుపోస్తున్నచెరువులుజిల్లాలో మూడు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులువర్షాలు కురిసే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. లో లెవల్ బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసింది. 26వ తేదీ రాత్రి నుంచి 27 ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 66.3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అధికంగా భువనగిరిలో 19 సెం.మీ, యాదగిరిగుట్టలో 13 సెం.మీ, తుర్కపల్లిలో 9 సెం.మీ, వలిగొండలో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. 27నుంచి 28వ తేదీ ఉదయం వరకు 27 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజాపేటలో 8 సెం.మీ, తుర్కపల్లి 5 సెం.మీ, ఆలేరు 5 సెం.మీ, భువనగిరిలో 4 సెం.మీ వర్షం కురిసింది. -
ప్రజాప్రభుత్వంలో సొంతింటి కల సాకారం
యాదగిరిగుట్ట: గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు గూడు కల్పించాలన్నది సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమన్నారు. పేదోళ్లు ఇళ్లు నిర్మించుకుంటే బీర్ల ఫౌండేషన్ నుంచి సాయం అందజేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అందజేస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే దిశగా ప్రజాప్రభుత్వం పథకాలను తీసుకువస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్యారెడ్డి, నాయకులు భిక్షపతిగౌడ్, గుండ్లపల్లి భరత్గౌ డ్, ముక్కెర్ల మల్లేశం, ఎరుకల హేమేందర్, శంకర్నాయక్, మహేందర్, నరేష్, హరీష్ పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ముసాయిదా జాబితా విడుదల
మండలాల వారీగా ఓటర్లు మండలం పురుషులు సీ్త్రలు మొత్తం అడ్డగూడూరు 11,3,20 11,702 23,022 ఆలేరు 10,499 11,033 21,532 ఆత్మకూర్ 12,890 12,643 25,533 భువనగిరి 19,592 20,062 39,654 బీబీనగర్ 21,299 21,577 42,876 బి.రామారం 14,631 14,872 29,503 పోచంపల్లి 13,733 13,764 27,497 చౌటుప్పల్ 19,096 19,405 38,501 గుండాల 13,152 12,917 26,069 మొటకొండూరు 10,495 10,608 21,103 మోత్కూర్ 6,528 6,687 13,215 నారాయపురం 20,143 19,953 40,096 రాజాపేట 14,972 15,264 30,236 రామన్నపేట 22,684 22,674 45,358 తుర్కపల్లి 13,846 14,131 27,977 వలిగొండ 26,030 26,401 52,431 యాదగిరిగుట్ట 13,657 13,958 27,615 మొత్తం 2,64,567 2,67,649 5,32,218ఫ మొత్తం ఓటర్లు 5,32,218 మంది ఫ పోలింగ్ కేంద్రాలు 3,704 ఫ ఎంపీడీఓ, పంచాయతీ కార్యాలయాల్లో ఓటరు జాబితాల ప్రదర్శన ఫ నేడు, రేపు అభ్యంతరాల స్వీకరణసాక్షి, యాదాద్రి: పరిషత్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు ముసాయిదా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను పంచాయతీ అధికారులు గురువారం ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు జిల్లాలో నోటిఫై చేయబడిన 427 గ్రామ పంచాయతీల జాబితాలను వార్డుల వారీగా మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు. జాబితాలపై ఈనెల 30వ తేదీ వరకు రెండు రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. కాగా శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఓటరు, పోలింగ్ ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు ఇలా.. ముసాయిదా ప్రకారం 427 గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్ కేంద్రాలు 3,704, ఓటర్లు 5,32,218 మంది ఉన్నారు. పురుషులు 2,64,567, మహిళలు 2,67,649 మంది ఉన్నారు. అంతటా బీసీ రిజర్వేషన్లపైనే చర్చ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటం, ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తి చేయడం వంటి అంశాలు అధికార పార్టీకి సవాల్గా మారాయి. ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లుందన్న దానిపై చర్చ జరుగుతోంది. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలనలో ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఆలేరురూరల్, భువనగిరి : భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం ఆలేరు మండలంలోని కొలనుపాక, గొలనుకొండ, భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపైనుంచి ప్రవహిస్తున వరద నీటిని పరిశీలించారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రోడ్లపైనుంచి వరద నీరు ప్రవహిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజేయులు, డిప్యూడి తహసీల్దార్ ప్రదీప్ తదితరులు ఉన్నారు. -
వృద్ధురాలిపై దాడి చేసి బంగారం అపహరణ
బీబీనగర్: వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చిన ద్విచక్ర వాహనదారుడు మార్గమధ్యలో దింపి ఆమైపె దాడికి పాల్పడి మెడలోని బంగారం అపహరించుకుపోయాడు. ఈ ఘటన బీబీనగర్ మండల పరిధిలో బుధవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండల పరిధిలోని ఇస్రాయిపల్లి కుంటకు చెందిన నెల్లుట్ల భారతమ్మ మంగళవారం తన బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి బుధవారం ఉదయం ఇంటికి వచ్చే క్రమంలో బీబీనగర్కు చేరుకుంది. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గల ఇస్రాయిపల్లి కుంటకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆమె రోడ్డుపై నిల్చోని అటుగా వస్తున్న గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగింది. బైక్పై ఎక్కించుకున్న ద్విచక్ర వాహనదారుడు భారతమ్మను ఇస్రాయిపల్లి కుంట రాకముందే శివారులో దించాడు. అక్కడి నుంచి భారతమ్మ నడుచుకుంటూ వెళ్తుండగా.. సదరు ద్విచక్ర వాహనదారుడు భారతమ్మను రోడ్డు పక్కన చెట్ల పొదల్లో నెట్టివేసి ఆమైపె దాడికి పాల్పడ్డాడు. ఆమె చేతులతో పాటు మూతిని టవల్తో కట్టివేసి నాలుగు తులాల బంగారు చెవి పోగులు, ముక్కుపుడక, గుండ్లను అపహరించకుపోయియాడు. రోడ్డు వెంట వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ప్రభాకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు. -
ఉద్యాన పంటల్లో ‘పండు ఈగ’– నివారణ చర్యలు
గుర్రంపోడు: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలి కాలంలో పండ్ల తోటలు, కూరగాయల తోటలు సాగుచేసే రైతులకు పండు ఈగ పురుగు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉద్యాన పంటల్లో పండు ఈగ పురుగు నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు శ్రీకొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ సురేష్కుమార్ మాటల్లో.. ఫ ఒకప్పుడు వర్షాకాలం మొదలైన తర్వాత కొద్దిరోజులు మాత్రమే మామిడి కాయల్లో పండు ఈగ పురుగు కనిపించేది. ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరమంతా అన్నిరకాల పండ్ల తోటలకు పండు ఈగ పురుగు సోకి 30 నుంచి 50 శాతం వరకు దిగుబడికి నష్టం చేస్తోంది. జామ కాయల్లో ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంది. ఫ పండు ఈగ మామడి, జామ, సీతాఫలం, అరటి, బొప్పాయితో పాటు కాకర, అనప, పొట్లకాయ, దోస లాంటి తీగజాతి కూరగాయల్లో కూడా కనిపిస్తుంది. ఇలా గుర్తించాలి.. పండు ఈగ ఆశించిన కాయలకు ఉన్న రంధ్రాలను(సూదితో గుచ్చినట్లుగా) బట్టి గుర్తించవచ్చు. ఇలాంటి కాయలను కోసి చూస్తే అందులో పిల్ల పురుగుల కనిపిస్తాయి. ఈ కాయలు తర్వాత దశలో శిలీంధ్రం ఆశించి కుళ్లిపోతాయి. పిల్ల పురుగులు కాయల నుంచి బయటకు వచ్చి కోశస్థ దశలో గడుపుతాయి. ఆ తర్వాత ఇవి వ్యాప్తి చెంది కాయలను ఆశించి ఉధృతిని పెంచుకుంటాయి. పండ్ల జాతి పంటల్లో పండు ఈగ నివారణకు మిథైల్ యుజినాల్ ఎరలను, కూరగాయ పంటల్లో క్యూలూర్ అనే ఎరలను ఉపయోగించాలి. పండ్ల తోటల్లో.. గతంలో వర్షాకాలం మొదలైన తర్వాత మామిడి తోటల్లో చెట్టుపైన ఉన్న కాయలకు ఈ పండు ఈగ ఆశించేది. ఈ మధ్యకాలంలో జామ, సీతాఫలంలో ఈ పురుగు ఉధృతి పెరిగింది. జామకాయలు పరిపక్వతకు వచ్చే సమయంలో ఈ పురుగు ఆశించి పదునైన సూది లాంటి పరికరంలో గుచ్చినట్లుగా కాయపై రంధ్రాలు చేసి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు అందులో పొదిగి పరిపక్వత చెంది లోపల మ్యాగట్స్గా అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఇవి పండు లోపల గుజ్జును తినేస్తాయి. పండు ఈగ ఆశించిన పండ్లు తొందరగా మగ్గిపోతాయి. రెండో దశలో పండ్లు రాలిపోయి, వాటిలోని పిల్ల పురుగులు భూమిలోకి వెళ్లి కోశస్థ దశ గడిపి తల్లి ఈగలు బయటకు వచ్చి మరలా వచ్చే కొత్త దిగబడులను ఆశించి ఉధృతిని పెంచుకుంటాయి. పండు ఈగ నివారణకు ప్రధానంగా కలపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పాదులను శుభ్రం చేసి పారతో మట్టిని కదిలించాలి. దీనివలన ఎండకు కోశస్థ దశలోని పురుగులు ఎండకు చనిపోతాయి. ఆ తర్వాత చెట్టుకు 20 నుంచి 40 గ్రాముల కార్భోఫ్యూరాన్ 3జి గుళికలు వేసుకోవాలి. లింగాకర్షణ బుట్టలను ఎకరాకు పది నుంచి 15 అమర్చుకుని పురుగు ఉధృతిని గమనించవచ్చు. ఒక్కో బుట్టలో 40 పురుగులు పడినట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు, 10 నుంచి 15 పురుగులు పడినట్లయితే ఉధృతి మధ్యస్ధంగా ఉన్నట్లు, 4 కంటే తక్కువ పురుగులు పడినట్లయితే ఉధృతి తక్కువగా ఉన్నట్లు గమనించుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మలాథియాన్ 2 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలుపుకుని 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. కూరగాయ పంటల్లో..బీర, కాకర, సోర, దోస, పుచ్చ వంటి తీగజాతి పంటల్లో పిందె రాకముందే నల్లగా మాడిపోయి రాలిపోతాయి. పెరుగుతున్న పిందెలు వంకరగా మారుతాయి. పండు ఈగ నివారణకు ఎకరాకు 8 వరకు లింగాకర్షణ బుట్టలు పెట్టడం వల్ల మగ ఈగలను ఆకర్షించడంతో పాటు వాటి ఉధృతిని తెలుసుకోవచ్చు. ఎరలను పిందె దశ నుంచి ఏర్పాటు చేసుకుంటే దిగుబడి పూర్తయ్యే వరకు పనిచేస్తుంది. భూమిని బాగా దున్నడం వల్ల వాటిలో ప్యూపాలు బయటకు వచ్చి ఎండకు చనిపోవడం, పక్షులు తినడం జరుగుతుంది. దీని వల్ల తర్వాతి తరం పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పండు ఈగ నివారణకు సాయంత్రం పూట మలాథియాన్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి వేప నూనె పది వేల పీపీఎంతో కలిపి పిచికారీ చేసుకోవాలి. -
సాగర్ను సందర్శించిన 23 దేశాల ప్రతినిధులు
నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ను గురువారం నేపాల్, శ్రీలంక, రష్యా, వియత్నాం, జింబాబ్వే, నైజీరియా, ఇథియోపియా, సౌత్సూడాన్తో సహా 23 దేశాల నుంచి 27మంది ప్రతినిధులు సందర్శించారు. ఈ నెల 15 నుంచి హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘నూతన ఆవిష్కరణలు అభివృద్ధి’ అనే అంశంపై శిక్షణ పొందుతున్న వీరు టీం కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్కుమార్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్కు వచ్చారు. సందర్శనలో భాగంగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడ పురావస్తు మ్యూజియం, మాన్యుమెంట్స్ను సందర్శించారు. అనంతరం సాగర్ ప్రధాన డ్యాం, బుద్ధవనంలోని పలు ప్రాంతాలను తిలకించారు. మహాస్థూపంలోని రెండవ అంతస్తులోగల ధ్యామందిరంలోని పంచముఖ బుద్ధుని వద్ద ప్రార్థనలు చేశారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ.. నాగార్జునకొండ చారిత్రక విశేషాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివరాలు, బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరి వెంట డీఆర్డీఓ శేఖర్రెడ్డి, పెద్దవూర మండల తహసీల్దార్ రఘు, సాగర్ సీఐ శ్రీనునాయక్, సాగర్ డ్యాం ఈఈ మల్లిఖార్జున్రావు, ఏఈ కృష్ణయ్య, బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర, ఆర్ఐ దండశ్రీనివాసరెడ్డి, ఎస్ఐ ముత్తయ్య తదితరులు ఉన్నారు. -
ఆచార్య నాగార్జునుడి బోధనలు ఆచరణీయం
నాగార్జునసాగర్: ఆచార్య నాగార్జునుడి బోధనలు నేటికీ ఆచరణీయమని ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. అమెరికాలోని చికాగోలో మిడ్ వెస్ట్ అమితాభ బౌద్ధాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆచార్య నాగార్జునుడి మార్గాలను ఆచరిస్తే ప్రస్తుత సమాజంలోని రుగ్మతలను నిర్మూలించవచ్చని వివరించారు. బుద్ధుడి బోధనలు, నాగార్జునుని తాత్వికతలను ఈ తరానికి అందించి బౌద్ధ సంస్కృతిని పరిరక్షించడానికి నాగార్జునసాగర్లో బుద్ధవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. అనంతరం చికాగో–మిడ్వెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ ప్రధానాచార్యులు పూజ్య గ్యాదోకోనో వారి ప్రచురణలను శివనాగిరెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో చికాగో సాహితీ మిత్రులు సంస్థ కార్యదర్శి జయదేవ్ మెట్టుపల్లి పాల్గొన్నారు. ఫ చికాగోలోని బౌద్ధాలయంలో ప్రసంగించిన ఈమని శివనాగిరెడ్డి -
నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
ఫ కుడి కణతపై కొట్టి చంపినట్లు గుర్తించిన పోలీసులు నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నల్లగొండ వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ (40) 15 సంవత్సరాల క్రితం నల్లగొండకు వలస వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ మద్యానికి బానిస కావడంతో అతడి భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. బుధవారం రాత్రి కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు రమేష్ మృతిచెంది ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డితో పాటు ఎస్ఐలు సత్యనారాయణ, సైదులు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుడి కణతపై బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేపల వేటకు వెళ్లి విద్యార్థి మృతికోదాడరూరల్: స్నేహితులతో కలిసి చెరువులో చేపల వేటకు వెళ్లి విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండలం గణపవరం గ్రామంలో బుధవారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం గ్రామానికి చెందిన కుక్కడపు నాగేశ్వరరావు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య త్రివేణి, కుమారుడు మనోహర్(11) ఉన్నారు. మనోహర్ కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చవుతున్నాడు. బుధవారం వినాయకచవితి సెలవు దినం కావడంతో మనోహర్ నలుగురు స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు గ్రామంలోని చెరువు వైపు వెళ్లారు. అందరూ చేపలు పడుతుండగా.. మనోహర్ కాలకృత్యాల కోసమని వెళ్లి చెరువు వద్ద పంట కాల్వ కోసం ఏర్పాటు చేసిన గూనలో ప్రమాదశాత్తు జారిపడి మృతి చెందాడు. మనోహర్ కనిపించకపోవడంతో అతడి స్నేహితులు గ్రామానికి చేరుకుని విషయాన్ని చెప్పారు. మనోహర్ తల్లిదండ్రులు, గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకొని జేసీబీ సహాయంతో గూనను తవ్వి మృతదేహాన్ని బటయకు తీశారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వినాయక మండపంలో ‘ఆపరేషన్ సిందూర్’
భువనగిరి: భువనగిరి పట్టణంలోని తారకరామనగర్లో శ్రీమణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆపరేషన్ సిందూర్ థీమ్ను పోలిన ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, మృతుల కుటుంబ సభ్యుల రోదనలు, త్రివిధ దళాధిపతుల సమావేశం, భారత్ సైన్యం ఉగ్రవాదులను కాల్చి చంపడం వంటి ప్రతిమలను ఒడిషా రాష్ట్రానికి చెందిన కళాకారులచే 25 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. అదేవిధంగా మండపంలో సుమారు 22 అడుగుల మట్టి వినాయక విగ్రహం ప్రతిష్ఠించారు. సుమారు 20 ఏళ్లుగా ప్రతి ఏడాది సందేశాత్మకంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
రామన్నపేట: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన ఠాకూర్ పుష్ప(68) గ్రామంలో ఒంటరిగా ఉంటుంది. ఆమె పెద్ద కుమారుడు హైదరాబాద్లో నివాసముంటున్నాడు. చిన్న కుమారుడు నెలరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ నెల 26న పెద్ద కుమారుడితో ఫోన్లో మాట్లాడి వినాయకచవితికి హైదరాబాద్కు వస్తానని చెప్పింది. రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. బుధవారం ఉదయం పొద్దుపోయే వరకు తలుపు తీయకపోవడంతో గ్రామానికి చెందిన వ్యక్తి పక్కనే మరో తలుపు వద్దకు వెళ్లి తట్టగా తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూడగా పుష్ఫ ముఖంపై రక్తంతో మృతిచెంది ఉంది. దీంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పుష్ప మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులు ఆమె మెడలో పుస్తెలతాడు, చెవి కమ్మలు లేకపోవడం, ముఖంపై రక్తం ఉండడం చూసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్ఐ డి. నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. క్లూస్టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతురాలి కుమారుడు గిరినాథ్సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మండపంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
భూదాన్పోచంపల్లి: వినాయక మండపానికి టార్పాలిన్ కవర్ కప్పుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని లక్ష్మణ్నగర్ కాలనీలో విజేత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుండగా.. వినాయక మండపం వేయడానికి అంబేద్కర్ నగర్కు చెందిన పోతగల్ల సత్యనారాయణ, గుర్రు కృష్ణ, పెద్దల శ్రీనివాస్ బుధవారం ఉదయం కూలీ పనికి వెళ్లారు. పోతగల్ల సత్యనారాయణ 25 అడుగుల ఎత్తు గల మండపం పైకి ఎక్కి టార్పాలిన్ కవర్ కప్పుతుండగా.. వర్షానికి టార్పాలిన్ కవర్పై కాలుపెట్టగానే జారి కిందపడటంతో తల పగలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శ్రీలత, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా నిరుపేద అయిన పోతగల్ల సత్యనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు గణేశ్ మండపం వద్ద ధర్నా నిర్వహించారు. చివరికి ఇరువర్గాల పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుని.. మృతుడి కుటుంబానికి రూ.4.25లక్షల పరిహారం ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు. -
రావయ్యా.. గణపయ్య
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం నిర్వహకులు వినాయక మండపాలను సిద్ధం చేశారు. జిల్లాలో సుమారు 5వేల వినాయక విగ్రహాలు కొలువుదీరనున్నాయి. మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారుతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. జిల్లాలో ఏర్పాటు కానున్న సుమారు 5వేల వినాయక విగ్రహాల్లో సుమారు 2వేల వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. కిటకిటలాడిన కొనుగోలు కేంద్రాలుజిల్లాలో ఇప్పటికే భారీ గణనాథుడి విగ్రహాలను హైదరాబాద్లో కొనుగోలు చేసి గత నాలుగురోజుల నుంచి తమ ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరితో పాటు జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, వలిగొండ, యాదగిరిగట్టు, ఆలేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల కేంద్రాల వద్ద కొనుగోలు దారులతో సందడి వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాలతో పాటు పూజా సామగ్రి, పండ్ల కొనుగోళ్లతో ఆయా కేంద్రాలు కిటకిటలాడాయి. నేడు కొలువుదీరనున్న గణనాథులు మండపాలను సిద్ధం చేసిన నిర్వాహకులు జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల వినాయక విగ్రహాలు ఏర్పాటుగణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నెల 7న గ్రహణం ఉన్నందున ఆలోపు నిమజ్జనాలు చేసుకుంటే బాగుంటుందని పండితులు సూచించారు. ఆమేరకు నిర్వహించేలా మండపాల నిర్వాహకులకు సూచనలు చేశాం. – రత్నపురం శ్రీశైలం, భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు -
రికార్డు అసిస్టెంట్ సస్పెన్షన్
మోత్కూరు : మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న బుంగ చరణ్ రాజ్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి విచారణ చేసి బాధిత రైతుల నుంచి వాంగ్మూలం సేకరించారు. పూర్తి నివేదికను కలెక్టర్కు సమర్పించారు. ఈమేరకు రికార్డు అసిస్టెంట్ చరణ్రాజ్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ అతడిని సస్పెండ్ చేశారు. వసూళ్లకు పాల్పడిన రికార్డు అసిస్టెంట్ నుంచి రూ.1800 రికవరీ చేసి బాధిత రైతులు గంట శ్రీనివాస్రెడ్డి, బాసోజు అంజయ్యచారికి అందజేశామని తహసీల్దార్ జ్యోతి విలేకరులకు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్ను రాజాపేటకు డిప్యుటేషన్పై పంపిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజాపేటలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లును మోత్కూరుకు నియమించారు. ముగిసిన పదోన్నతుల ప్రక్రియ భువనగిరి: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారం ముగిసింది. జిల్లాలో 1:1 ప్రకారం మొత్తం 100 ఖాళీల పోస్టులకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతుల కోసం ఈ నెల 25న వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు. 96 పోస్టులు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉండగా.. నాలుగు పోస్టులు ఉన్నత పాఠశాలల్లో ఉన్నాయి. పదోన్నతులు పొందిన వారికి మంగళవారం విద్యాశాఖ అధికారులు ఆర్డర్లు జారీ చేశారు. వీరు 15 రోజుల్లో నిర్ణీత పాఠశాలలో చేరాల్సి ఉంటుంది. ముగ్గురి పదోన్నతులు నిలిపివేత ఈ ప్రక్రియలో ముగ్గురికి పదోన్నతులు నిలిపివేశారు. ఇందులో ఒకటి పీఎస్హెచ్ఎం పోస్టు కాగా రెండు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరిలో ఇద్దరు ఉండటంతో ఆ పోస్టును మహిళకు కేటాయించాలని కోరడం, రెండోది అర్హత లేని వారికి పదోన్నతి కల్పించే విషయం, మూడోది సస్పెండ్కు గురైన ఉపాధ్యాయుడికి పదోన్నతి కల్పించడంతో ఈ మూడు పోస్టులను నిలిపివేశారు. పథకాలు ప్రజలకు చేరేలా చూడాలిభువనగిరిటౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మోతి మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈమేరకు కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ డైరెక్టర్ మోతి పాల్గొని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. బాల సదనం సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, సీడీపీఓ విజయలక్ష్మి, అనంతలక్ష్మి ఉన్నారు. -
63 ఏళ్లుగా నవరాత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్కు వెళ్లే దారిలో వైకుంఠద్వారం సమీపంలో ఉన్న హనుమాన్ వీధిలో కాలనీవాసులు 63ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కాలనీలో ఉండే ప్రజలంతా కమిటీ ఏర్పాటు చేసుకొని నవరాత్రులను వైభవంగా జరిపిస్తూ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నారు. కాలనీ అంతా ఏకమై.. యాదగిరిగుట్ట పట్టణంలోని హనుమాన్ వీధిలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద మొదట్లో ఐదారు కుటుంబాలు మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించేవారు. అప్పట్లో సుమారు 3 ఫీట్ల వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు యాదగిరిగుట్ట ఆలయ అర్చకులతో పూజలు నిర్వహించేవారు. ప్రస్తుతం కాలనీ అంతా ఏకమై ఒకే చోట మండపాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కమిటీగా ఏర్పడి పూజలు జరిపిస్తాం నా చిన్ననాటి నుంచే హనుమాన్ ఆలయం వద్ద వినాయక మండపం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మా కాలనీ ప్రజలంతా కమిటీగా ఏర్పడి పూజలు జరిపిస్తాం. మా పెద్దలు ఏ విధంగానైతే పూజల బాధ్యత మా పై పెట్టారో.. అలాగే మా పిల్లలకు నేర్పిస్తున్నాం. – శ్రీధర్రెడ్డి, నిర్వాహకుడు యాదగిరిగుట్టలోని హనుమాన్ వీధిలో 1962కు ముందు నుంచే గణేష్ ఉత్సవాలు -
డిగ్రీ కాలేజీకి జూనియర్ కళాశాల తరలింపు
ఆలేరు: ఆలేరు జూనియర్ కళాశాల భవనం శిథిలమై గదుల పైకప్పుల పెచ్చులూడుతుండటంతో ‘ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు’ శీర్షికన ఈనెల 4న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఉన్నతాధికారులను కదిలించింది. అదేరోజు కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖఅధికారి(డీఐఈఓ) రమణిని ఆదేశించారు. ఈనెల 5న డీఐఈఓ కళాశాలను సందర్శించి కలెక్టర్తోపాటు ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు నివేదిక అందజేశారు. అనంతరం ఇంటర్ బోర్డు కమిషనర్ రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ దేవసేనకు కళాశాల పరిస్థితిని వివరించారు. ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి జూనియర్ కళాశాలను తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన దేవసేన డిగ్రీ కళాశాలకు జూనియర్ కళాశాలను తరలించేందుకు అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జూనియర్ కళాశాలను అధికారులు షిఫ్ట్ చేశారు. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభించారు. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ చూపిన సాక్షి దినపత్రికకు విద్యార్థులు, అధ్యాపకులు కృజ్ఞతలు తెలిపారు. డిగ్రీ కళాశాలలో మొత్తం ఏడు గదులను తమకు కేటాయించినట్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు చెప్పారు. ఉదయం 8గంటల నుంచి ఒంటి గంట వరకు జూనియర్ కళాశాల తరగతులు, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు డిగ్రీ కళాశాల తరగతులు సాగుతాయని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజారామ్ తెలిపారు. -
కిక్కిరిసిన ఎయిమ్స్
బీబీనగర్: బీబీనగర్లోని ఎయిమ్స్లో మంగళవారం రద్దీ ఏర్పడింది. ఓపీ విభాగం వద్ద జనం పెద్దఎత్తున బారులుదీరారు. ఎయిమ్స్లోని వైద్య విభాగాలు రోజు రోజుకు పెరుగుతుండడంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రోజుకు 2000లకు పైగా ఓపీ ద్వారా ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. కానీ ఓపీ కౌంటర్లు 10మాత్రమే ఉన్నాయి. రోగులకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్య లేకపోవడంతో ఓపీ కార్డు పొందేందుకు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
పంచాయతీ పోరుకు సిద్ధం!
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ల వారీగా విడుదల చేయాలని మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు గురువారం గ్రామ పంచాయతీల్లో ముసాయిదా జాబితాను ప్రకటించడానికి జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లాలోని 17 మండలాల్లోని 427 గ్రామ పంచాయతీల్లో 532218 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,64,567 మంది పురుషులు, 2,67,649 మంది సీ్త్రలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు 3,704 ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలి విడతలో 10 మండలాలు, 220 గ్రామ పంచాయతీలు, 1876 వార్డులు, రెండో విడతలో ఏడు మండలాలు, 207 గ్రామ పంచాయతీలు, 1828 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఓటర్ల, పోలింగ్కేంద్రాల ముసాయిదా జాబితా గ్రామ పంచాయతీల్లో ప్రకటించే ముసాయిదాపై అభ్యంతరాలను, సలహాలను అధికారులు స్వీకరిస్తారు. ఇందుకోసం రాజకీయ పార్టీలకు జిల్లా స్థాయి, మండల స్థాయిలో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా వివరిస్తారు. ఓటర్లు, రాజకీయ పార్టీలనుంచి వచ్చిన ఫిర్యాదులు, సలహాలను ఈనెల 31న పరిష్కరిస్తారు. అనంతరం వచ్చేనెల 2న తుది జాబితాను విడుదల చేస్తారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధంఅసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు రూపొందించారు. జనవరి 1న ప్రకటించిన సాధారణ ఎన్నికల జాబితాకు అదనంగా జూలై 7 వరకు వచ్చిన నూతన ఓటర్ల చేరికను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఒకే వార్డు ప్రజలు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. 28న ఓటర్ల, పోలింగ్కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల వచ్చే నెల 2న తుది జాబితా ప్రకటనఓటరు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా ఇలా.. 28న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రచురణ 29న రాజకీయ పార్టీలతో సమావేశం 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం 28 నుంచి 30 వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ 31న అభ్యంతరాల పరిష్కారం వచ్చేనెల 2న తుది జాబితా ప్రకటన -
వినాయకా.. పదవులెవరికి?
సాక్షి, యాదాద్రి : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిసే లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించడంతో ఆశావాహులు పదవి దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడు రూపొందించిన జాబితా అధిష్టానం వద్దకు చేరింది. సామాజిక వర్గాల వారీగా పీసీసీకి చేరిన జాబితాఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజికవర్గ సమీకరణకు పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల వారీగా ఆశావాహుల పేర్లను పీసీసీకి పంపించారు. స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఈ పేర్లు స్వీకరించారు. అయితే డీసీసీ అధ్యక్షుల ద్వారా పీసీసీకి చేరిన జాబితాపై పార్టీ అధిష్టానం క్రాస్ చెక్ చేసింది. ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ సంపత్ గత నెల భువనగిరికి వచ్చిన సమయంలో జాబితాపై విచారణ చేశారు. అర్హులకు ఇచ్చారా.. పార్టీ విధేయులేనా.. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారా.. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చారా అని విచారణ చేశారు. పార్టీ కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ముందుగా డైరెక్టర్ల పదవుల భర్తీ నామినేటెడ్ పదవుల్లో ముందుగా కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి, డైరెక్టర్ల పదవులను పెండింగ్లో ఉంచింది. అయితే చైర్మన్లు ఉన్న ప్రతి కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పదవులను ముందుగా భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు వారం పదిరోజుల్లో శుభవార్త వింటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. నియోజకవర్గానికి రెండు పదవులుప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండేసి పదవుల చొప్పున ఇవ్వనున్నారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల నామినేటెడ్ పదవుల కోసం పేర్లు అధిష్టానానికి పంపించారు. పార్టీలో అంతర్గత విచారణ కూడా పూర్తయింది. దాదాపు ఆయా అభ్యర్థులకు డైరెక్టర్ల పదవులు వరించబోతున్నాయి.కార్పొరేషన్ చైర్మన్లు సైతం పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు నామినేటెడ్ పదవుల్లో ప్రధానమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేయనున్నారు. డైరెక్టర్ల పదవులు భర్తీ కాగానే ఈ ప్రక్రియ జరగనుందని సమాచారం. ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రులు, సీఎం స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ ఎంపికకు ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. పీసీసీ, సీఎం స్థాయిలో ఎంపిక చేసిన వారి వివరాలను ఏఐసీసీకి పంపిస్తారు. అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత పదవుల పందేరం జరగనుంది. జిల్లా నుంచి నాలుగైదు పేర్లు కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిసేలోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయం ముందుగా కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు భర్తీ సామాజిక వర్గ సమీకరణకు పెద్దపీట నేతల్లో చిగురిస్తున్న ఆశలు ఇప్పటికే జాబితాను పీసీసీకి పంపించిన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు -
పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
చౌటుప్పల్ రూరల్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని యాదాద్రి భువనగిరి డీసీపీ అక్షాంశ్ యాదవ్ కోరారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం, పెద్దకొండూర్ చెరువుల వద్ద గణేష్ నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్, తహసీల్దార్ వీరాబాయి, ఎస్సై ఉపేందర్రెడ్డి, ఆర్ఐ బాణాల రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమాదేవి ఉన్నారు. -
విహారం కావొద్దు విషాదం
● సాగర్ను సందర్శనకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని సూచన ● జలాశయంలోకి దిగొద్దని హెచ్చరిక ● సూచిక బోర్డులు, ట్రంచ్ల ఏర్పాటునాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు, యువత భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సాగర్ పరిసర ప్రాంతాల్లో, దయ్యాలగండి పుష్కర ఘాట్ వద్ద జలాశయంలోకి దిగడం వంటివి చేస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా కాలు జారి నీటిలో పడితే బయటకు రావడం కష్టమని రక్షణ సిబ్బంది చెబుతున్నారు. గతంలో పలువురు యువకులు నీటిలో ఈత కొడుతూ, ఫొటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, సెల్ఫీలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో యువత జలాశయం నీటిలో దూకుతూ, లోతైన ప్రదేశాల్లో ఈత కొడుతూ వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్గా మారింది. అనుకోని ఘటన జరిగితే ప్రాణాలనే ప్రమాదమని గుర్తించాలని స్థానికులు, అధికారులు సూచిస్తున్నారు. అధికారుల ఏర్పాట్లు.. పర్యాటకుల భద్రత కోసం సాగర్ తీరం వెంట అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దయ్యాలగండి వద్ద గల పుష్కర ఘాట్ వద్దకు వెళ్లకుండా రోడ్డు వెంట లోతైన ట్రంచ్ కొట్టారు. కొన్ని చోట్ల పోలీసులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఆ సూచనలను పట్టించుకోవడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పవిత్ర మేడమ్ స్ఫూర్తితో..
బోధన తీరుతో స్ఫూర్తి పొందా.. సూర్యాపేటలోని ఎంఎస్ఆర్ బీఈడీ కళాశాలలో చదువుతున్నప్పుడు పవిత్ర మేడమ్ ప్రైవేట్ లెక్చరర్గా మాకు పాఠాలు బోధించేది. ఆమె బోధనా తీరు, ప్రేరణతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ఉద్యోగం టీచర్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం చండూరు మండలం దానుపాముల జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – రాసమళ్ల సికిందర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, దానుపాముల, చండూరు పెన్పహాడ్: పెన్పహాడ్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. మారం పవిత్ర స్ఫూర్తితో ఆమె చదువు చెప్పిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆమె కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. తమలోని భయాలను తొలగించించేందుకు కృషిచేసేదని, చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు వారిలోని ఇతర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేదని విద్యార్థులు చెబుతున్నారు.స్కాలర్షిప్కు ఎంపికయ్యా.. నేను గరిడేపల్లి మండలం గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదువుతున్నాను. పవిత్ర టీచర్ ఇచ్చిన శిక్షణతోనే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రతి సంవత్సరం అకౌంట్లో రూ.12వేలు జమవుతున్నాయి. విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ ఎంతగానో దోహదపడుతుంది. – ఎ. వైష్ణవి, 10వ తరగతి, గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ టీచర్లు, లెక్చరర్లుగా పలువురి ఎంపిక జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లలో పాల్గొని సత్తాచాటుతున్న విద్యార్థులుసంతోషంగా ఉంది ఆంధ్ర, తెలంగాణ అగస్త్య జిజ్ఞాస పోటీల్లో మొదటి బహుమతి రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో పాటు రూ.1500 ప్రైజ్మనీ పొందాను. జీవశాస్త్ర టీచర్ పవిత్ర మేడమ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. – ఎం. మేఘన 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ ప్రాక్టికల్ విధానంలో బోధన చూసి.. మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ఎస్లో ఉన్నప్పుడు పవిత్ర టీచర్ ప్రాక్టికల్ విధానంలో సైన్స్ బోధించడం చూసి.. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం హైదరాబాద్లోని కులీ కుతుబ్షా పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. విద్యార్థులతో ఎలా ఉండాలనే విషయాన్ని పవిత్ర టీచర్ నుంచే నేర్చుకున్నాను. – ప్రవీణ్కుమార్, పాలిటెక్నికల్ లెక్చరర్జిల్లాస్థాయిలో గుర్తింపు లభించింది పవిత్ర గైడెన్స్లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో వీడర్ అండ్ సీడర్ ప్రాజెక్టు ప్రదర్శించడంతో జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. – బి. శ్రీశాంత్, 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా సైన్స్ ఫెయిర్లో అవార్డు దక్కింది నేను తయారు చేసిన క్రాప్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆన్సీజనల్ రెయిన్స్ ప్రాజెక్టుకు జిల్లా సైన్స్ ఫెయిర్లో అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. – శ్వేత 10వ తరగతి, పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ -
ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాం
నల్లగొండ టూటౌన్: ఎన్సీసీ శిక్షణ తరగతుల్లో క్రమశిక్షణ, దేశభక్తి సమ్మిళితమైన ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తామని కల్నల్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడేట్ల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీలో ప్రవేశానికి 60 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వారిలో ఎత్తు, బరువు, ఆరోగ్యం, రాత పరీక్షల ఆధారంగా ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించే విద్యార్థులకు ఎన్సీసీ ద్వారా నేషనల్ డిపెన్స్ అకాడమీ, అగ్నివీర్ లాంటి పథకాల్లో అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఇన్చార్జి డాక్టర్ మశ్చేందర్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్.సుధారాణి, కొమ్ము మల్లయ్య, చంద్రవీర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణచివ్వెంల(సూర్యాపేట): కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీకాంత్పై కొందరు దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలి
కోదాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పకొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు కోరారు. మంగళవారం కోదాడలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్కోడ్లను తీసుకొచ్చిందని, వీటి వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, రాధాకృష్ణ, శ్రీలం శ్రీను, చెరుకు ఏకలక్ష్మి, సోమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు -
మట్టపల్లిలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, రుత్విగ్వరణం , పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కాగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, కంబాల మురళినాయుడు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మోతె: మోతె మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల నుంచి 1.200 కేజీ గంజాయిని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల కేంద్రానికి చెందిన యువకుడు, తన స్నేహితులతో కలిసి భద్రాచలం, ఒరిస్సా ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి మోతె మండలానికి తీసుకొస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ అజయ్కుమార్ తన సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని రత్నాలకుంట ఇద్దరిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 1.200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మేకలు అపహరిస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: రాత్రి వేళ కార్లలో మేకలు అపహరిస్తున్న 16 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు నల్ల గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి శాలిగౌరారం సమీపంలోని బైరవోని బండ ఎక్స్ రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా కారులో వచ్చిన వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో అనుముల మండలం అలీనగర్కు చెందిన సంపంగి వెంకటేష్, సంపంగి శారద, మునుగోడు మండలం గూడపూర్కు చెందిన వేంరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్కుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగా వారిపై గతంలో మేకలు చోరీ చేసిన కేసు ఉన్నట్లు తేలింది. పట్టుబడిన నలుగురిని విచారించి.. వారితో పాటు మేకలు చోరీ చేస్తున్న మర్రిగూడ మండలం శివన్నగూడేనికి చెందిన వరికుప్పల రవి, రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన గండికోట శివకుమార్, ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం ఎస్సీ కాలనీకి చెందిన అమ్ములూరి విజయ్, హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన లింగాల అశోక్, ఉండం కళ్యాణి, భువనగిరి హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన వల్లెపు ప్రసాద్, మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దాయిపల్లికి చెందిన మద్యాల సహదేవ్, సూర్యాపేట జిల్లా మోతెకు చెందిన కోడిసె వంశీకృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్కుమార్, మట్టి సురేష్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరంతా కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడి కార్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళ మేకలను కార్లలో వేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. వీరు నల్లగొండ జిల్లాలో 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబ్నగర్, నాగర్ర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకలు అపహరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దొంగలించిన మేకలను సంతలలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఎస్పీ వివరించారు. వారి నుంచి రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలోని కోటేష్, కనుకుల బేబీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆద్వర్యంలో నిందితులను పట్టుకున్న నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్రెడ్డి, ఎం. నాగభూషణ్, కె. కొండల్రెడ్డి, శాలిగౌరారం ఎస్ఐ, నార్కట్పల్లి సీఐ, పోలీస్ సిబ్బంది, సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి రివార్డు ప్రకటించారు. రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి
కొండమల్లేపల్లి: బొలేరో వాహనం ఢీకొని బాలిక మృతి చెందింది. ఈ ఘటన కొండమల్ల్లేపల్లి మండలం కొల్ముంతల్పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్ముంతలపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్కి చెందిన పీట్ల రాజు, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రాజు కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం బాపూజీనగర్కు వచ్చారు. మంగళవారం ఉదయం రాజు కుమార్తె అక్షర(4) తన నానయమ్మ సుగుణమ్మతో కలిసి బాపూజీనగర్లో రోడ్డు దాటుతుండగా.. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వేగంగా వస్తున్న బొలేరో వాహనం అక్షరను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్షరను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
గుండాల: ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుండాల మండలం అంబాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రగూడెం గ్రామానికి చెందిన చిర్ర బాలరాజు(55) కొంతకాలంగా హైదరాబాద్లోని నేరేడ్మెట్లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే మృతిచెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాలరాజు తన అత్తగారి ఊరైన ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో మైసమ్మ పండుగకు హాజరయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి మోత్కూరులో దిగాడు. అక్కడి నుంచి పారుపల్లి గ్రామంలోని తన అత్తగారి వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడెం, గుండాల మండలం అంబాల గ్రామ శివారులోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వాగులో జారిపడి కొట్టుకుపోయాడు. మంగళవారం అంబాల గ్రామ శివారులో బిక్కేరు వాగు ఒడ్డున బాలరాజు మృతదేహాన్ని స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తేజమ్రెడ్డి తెలిపారు. కుక్కల దాడిలో ఇద్దరికి గాయాలునాగారం: కుక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫణిగిరి గ్రామానికి చెందిన షేక్ షఫీ స్థానిక మేరి మదర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో తుంగతుర్తికి చెందిన జటంగి సతీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం అటెండర్ షఫీ పాఠశాల వెనుక ఉన్న గదిలోకి వెళ్లగా.. అక్కడ కుక్కలు ఉండడంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా కుక్కలు అతడిపై దాడి చేసి తొడ భాగంలో కరిచాయి. అతడు కేకలు వేయగా సమీపంలో ఉన్న ఉపాధ్యాయుడు సతీష్ వచ్చి షఫీని విడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుక్కలు సతీష్పై కూడా దాడి చేసి ఛాతి భాగంలో గాయపరిచాయి. గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, అధికారులు స్పందించి వాటిని ఊరికి దూరంగా తరిమేయాలని స్థానికులు కోరుతున్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీ భేటీ
సాక్షి, యాదాద్రి : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సోమవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వాత్సవతో సికింద్రాబాద్ రైల్వే కార్యాలయంలో సమావేశం అయ్యారు. జిల్లాకు సంబంధించిన పలు ప్రాజెక్టులు, సమస్యలపై ఆయనతో చర్చించారు. ఎంఎంటీఎస్ పనులను వేగవంతం చేసి 2027 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ప్రధానంగా బీబీనగర్ – భువనగిరి మధ్య 52 ఎకరాలు భూ సేకరణ పూర్తి చేస్తేనే మిగతా పనుల్లో వేగం పెరుగుతుందన్నారు. అలాగే భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం వద్ద అండర్పాస్ నిర్మించాలని, రామన్నపేటలో ఫలక్నుమా, శబరి, నారాయణాద్రి, ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉదయనాథ్కోట్ల, ఎంఎంటీఎస్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ సాయిప్రసాద్ పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రాజెక్టులు, సమస్యలపై చర్చ -
మంత్రుల ధ్యాసంతా పైరవీలపైనే ఽ
చౌటుప్పల్ : మంత్రులకు ప్రజా సమస్యలకంటే పైరవీలపైనే ధ్యాస ఎక్కువని, ఎవరికి వారు దుకాణాలు తెరిచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి ఎద్దేవా చేశారు. హామీల అమలు, అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. చౌటుప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని సోమవారం మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందన్నారు. ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. ఎరువులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా సకాలంలో తెప్పించుకోకుండా నిందలు మోపే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతలు పెట్టడం ఖాయమన్నారు. సైనికుల్లా పని చేయాలి స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల, మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు కై రంకొండ అశోక్, కడారి కల్పన, నాయకులు గుజ్జుల సురేందర్రెడ్డి,ముత్యాల భూపాల్రెడ్డి, చినుకని మల్లేష్, ఊడుగు యాదయ్య, కంచర్ల గోవర్ధన్రెడ్డి, రాధారపు సత్తయ్య, కాయితి రమేష్, కడారి అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి -
అధికంగా భూ సమస్యలపైనే..
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 60 అర్జీలు వచ్చాయి. అధికంగా రెవెన్యూ సమస్యలపై 44 వినతులు ఉన్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప.. తప్పనిసరిగా ప్రజవాణికి హాజరుకావాలని, కిందిస్థాయి ఉద్యోగులను పంపవద్దని సూచించారు. ఉన్నతాధికారులను కలిసి తమ బాధలు తెలియజేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోడ్చి ప్రజలు వస్తుంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. ● బొమ్మలరామారం మండలం జలాల్పురం జెడ్పీహెచ్ఎస్ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను సద్దుబాటుపై ఇతర స్కూళ్లకు పంపారని, వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ● ఇస్కాన్, హరేకృష్ణ సంస్థల అధ్వర్యంలో కలెక్టరేట్లో రూ.5కు భోజన కేంద్రం ఏర్పాటు చేయాలని శ్రీశైలం, జేహెచ్ రావు, హర్షవర్ధన్ తదితరులు కలెక్టర్కు విన్నవించారు. కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారిలో ఆర్థిక స్థోమత లేని వ్యక్తులు బయట తినలేకపోతున్నారని, సంస్థ నిర్వాహకులతో మాట్లాడాలని కోరారు. ● నూతన వీఓఏను నియమించాలని యాదగిరిగుట్ట మండలంలోని కాచారం గ్రామ మహిళా సంఘాల ప్రతినిధులు కోరారు. ఆమైపె ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నాలుగు నెలల క్రితం విధుల నుంచి తొలగించారని, మరొకరిని నియమించకపోవడంతో సంఘాల నిర్వహణ, కొత్త సంఘాల ఏర్పాటుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ 104 ఉద్యోగులు కలెక్టర్కు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా 31 మంది విధులు నిర్వహిస్తున్నారని, ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మారయ్య, శ్రీనివాస్, హరి బాబు, స్వామి, సతీష్, శివకుమార్ పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్యవైశ్య సత్రం నుంచి జీయర్ కుటీర్ సమీపం వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం ఆర్అండ్బీ ఏఈఈ భరత్, ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి ఆయా ప్రాంతాలను పరిశీ లించారు. గుట్ట నుంచి మల్లాపురం, తుర్కపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు, యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఎక్కడి నుంచి మళ్లించే అంశంపై చర్చించారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, రాజు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. గుట్ట శివాలయంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఉదయం శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖమండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో వెండిజోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. దూర విద్యతోనూ ఉజ్వల భవిష్యత్ భువనగిరి, ఆలేరు : దూర విద్యతోనూ ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్ అన్నారు. భువనగిరిలోని శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. సైన్స్ ప్రాక్టికల్స్ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలపై యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. అనంతరం ఆయనను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, స్టడీ సెంటర్కో ఆర్డినేటర్ రమేష్ సన్మానించారు. అదే విధంగా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్ను ఆయన సందర్శించారు. ప్రతి కౌన్సిలర్ 50 అడ్మిషన్లు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ బాలయ్య, అధ్యాపకులు బాల్రెడ్డి, కిష్టయ్య, సత్యనారాయణ, సుదా, పాండురంగం, బాలరాజు, అసిఫ్ అలీ, లింగమూర్తి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘పవిత్ర’ వృత్తికి జాతీయ గుర్తింపు
ఫ జీవశాస్త్రం టీచర్ పవిత్రకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఫ రాష్ట్రం నుంచి ఈమె ఒక్కరే ఎంపిక ఫ హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ వర్గాలు సూర్యాపేటటౌన్ : పెన్పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగే కార్యక్రమంలో ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయికి ఆరుగురు దరఖాస్తు చేసుకోగా సూర్యాపేట జిల్లాకు చెందిన మారం పవిత్రకు ఒక్కరికే ఈ అవార్డు రావడం పట్ల పలువురు సైన్స్ టీచర్లు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 45 మంది ఆయా రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా అందులో పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మారం పవిత్ర ఎంపిక కావడం విశేషం. ఎగ్జిబిట్తో విద్యార్థినులు, టీచర్ పవిత్ర -
ప్రశ్నిస్తే మాపైనే కేసులు పెడతారా?
మోటకొండూర్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలం అయ్యారని తేర్యాల గ్రామ రైతులు ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని, ప్రశ్నించిన తమపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమార్కులు ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పరిధినుంచి వెళ్తున్న వాగును ఏళ్ల కాలంగా కాపాడుకుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కోసం అధికారులు పర్మిషన్ ఇవ్వగా ఇదే అదనుగా లూటీ చేస్తున్నారని వాపోయారు. పరిమితికి మించి ట్రాక్టర్ల ద్వారా బ్లాక్ మార్కెట్కు ఇసుక తరలిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులపైనే కేసులు పెట్టి, బైండోవర్ చేయటాన్ని వారు ఖండించారు. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని.. ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగదివ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బాలగాని రాజుగౌడ్, మంత్రి ప్రభాకర్, బొంగు కృష్ణమూర్తి, నల్ల భాషా, నల్ల ఎల్లస్వామి, నల్ల నర్సింహ, కడకంటి నాగాచారి, మరాఠి శ్రీను, బూరెడ్డి సుధాకర్రెడ్డి, బిక్షం, బొట్ల రాంచంద్రు తదితరులు పాల్గొన్నారు.ఫ తేర్యాల గ్రామ రైతుల ధర్నా -
నారసింహ.. నిర్లక్ష్యం వదిలించుమా!
ఇప్పటికైనా జాప్యాన్ని వీడాలిలక్షలాది రూపాయలు వెచ్చించి కృత్రిమంగా వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. నాలుగేళ్ల క్రితమే పనులు పూర్తయినా ఉపయోగంలోకి తేకపోవడంపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటర్ఫాల్స్ను ప్రారంభిస్తే క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆహ్లాదాన్ని పొందేందుకు వీ లుంటుంది. ఆలయ అధికారులు ఇప్పటికై నా జాప్యాన్ని వీడి జలపాతాన్ని ప్రారంభించాలి. – గంగసాని నవీన్, భక్తుడు, యాదగిరిగుట్ట రూ.లక్షలు వెచ్చించి వదిలేశారుభక్తులు చాలామంది మొదటి ఘాట్ రోడ్డు గుండా కాలినడకన కొండపైకి వెళ్తుంటారు. ఇదే మార్గంలో తిరుగు ప్రయాణమవుతుంటారు. లక్షలు వెచ్చింది ఏర్పాటు చేసిన వాటర్ఫాల్స్ను నిరుపయోగంగా ఉంచడం తగదు. కొండపైన భక్తుల సౌకర్యాలపై దృష్టిసారించిన విధంగానే ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన వాటర్ఫాల్స్ను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. – కర్రె ప్రవీణ్, బీజేపీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడుయాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేందుకు మొదటి ఘాట్ రోడ్డులో వాటర్ఫాల్స్ ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితమే పనులు పూర్తిచేసినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక వాటర్ పైప్లైన్ ఏర్పాటు చేసి, కొండ పైనుంచి కిందకు నీళ్లు జారేవిధంగా కృతిమ పద్ధతిలో జలపాతాన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం వైటీడీఏ లక్షలాది రూ పాయలు ఖర్చు చేసింది. భక్తులు తిరుగు ప్రయాణంలో వాటర్ఫాల్స్ చెంత సేదదీరి, ఆహ్లాదం పొందటానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. పలుమార్లు ట్రయల్ రన్ వాటర్ఫాల్స్ను పలుమార్లు విజయవంతంగా ట్రయల్రన్ నిర్వహించారు. కొండపై నుంచి నీళ్లు జాలువారుతూ అద్భుతంగా కనువిందు చేసింది. అంతేకాకుండా ప్రకృతి సిద్ధంగా కనిపించేలా వాటర్ ఫాల్స్కు ఇరువైపులా చెట్లను పెంచారు. మధ్య రంగురంగుల పూల మొక్కలు నాటారు. ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ సేదదీరడంతో పాటు ఫొటోలు దిగుతూ కనిపించేవారు. ప్రధానాలయం పునఃప్రారంభ సమయంలోనే వాటర్ఫాల్స్ను కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. కానీ, వీలు కుదరకపోవడంతో వాయిదా వేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు వాటర్ఫాల్స్ ప్రారంభంపై దృష్టి సారించకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. ఇప్పటికై నా అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు. యాదగిరి క్షేత్రంలో భక్తులకు ఆహ్లాదం పంచని వాటర్ఫాల్స్ నాలుగేళ్ల క్రితం మొదటి ఘాట్ రోడ్డులో ఏర్పాటు ప్రారంభానికి కుదరని ముహూర్తం -
ఖిలా పనుల్లో కదలిక..
భువనగిరి: చారిత్రక భువనగిరి కోట అభివృద్ధికి కీలక అడుగులు పడ్డాయి. తొలిదశ పనులను రెండు ప్యాకేజీల్లో చేపట్టేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. రోప్వే పనులను పశ్చిమ బెంగాల్కు చెందిన ఏజెన్సీ, సివిల్స్ వర్స్ను హైదరాబాద్ కంపెనీ దక్కించుకున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఖిలాపైకి రోప్వే ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా చదును చేశారు. పర్యాటక శాఖ అధికారులు, ఏజెన్సీల నిర్వాహకులు ఇటీవల ఖిలాను సందర్శించి అభివృద్ధి చేసే ప్రాంతాలను పరిశీలించారు. రూ.100 కోట్లతో నాలుగు దశల్లో.. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఎంపికై న భువనగిరి ఖిలాను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం నాలుగు దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.56.81 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ఖిలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ పలుమార్లు భువనగిరి కోటను సందర్శించి అధ్యయనం చేసి డీపీఆర్ రూపొందించి ఫైనల్ చేసింది. దీని ఆధారంగా తొలి విడత పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఇందులో రోప్వే పనులను పశ్చిమ బెంగాల్కు చెందిన ఏజెన్సీ రూ.18 కోట్లకు దక్చించుకోగా.. సివిల్ పనులను హైదరాబాద్ ఏజెన్సీ రూ.30 కోట్లకు దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఈనెల 18న పర్యాటక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో అగ్రిమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం ఏజెన్సీలు వచ్చే ఏడాది నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఫ రెండు ప్యాకేజీలుగా పనులు ఫ రోప్వే టెండర్ దక్కించుకున్న పశ్చిమ బెంగాల్ ఏజెన్సీ ఫ సివిల్ వర్క్స్ హైదరాబాద్ కంపెనీకి ఫ రోప్వే బేస్ క్యాంప్ వద్ద పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు రోప్ వే : ఖిలా నుంచి బైపాస్ సమీపంలోని రోవ్వే బేస్ క్యాంప్ వరకు రెండు కేబుల్ కార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రెండు సిమెంట్ పిల్లర్లు నిర్మించి రోప్వే ద్వారా రావడం, వెళ్లండం కోసం తీగ మార్గం ఏర్పాటు చేస్తారు. రోప్వే బేస్ క్యాంప్, చివరి ప్రాంతంతో పర్యాటకుల కోసం గ్రీనరీ, విశ్రాంతి ప్రదేశాలతో పాటు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. సివిల్ వర్క్స్: కోట ఎంట్రీ వద్ద చారిత్రక కట్టడాల శైలిలో ప్రవేశ ద్వారం నిర్మించనన్నారు. అలాగే క్యాంటీన్, గ్రీనరీ, పార్కింగ్, గోడ, విద్యుత్ దీపాల ఏర్పాటు, భవనాలకు మరమ్మతులు చేయనున్నారు. వీటితో పాటు కోట పైభాగంలో రాణిమహాల్ భవనాన్ని ఆధునీకరించి కొత్త రూపు తీసుకురానున్నారు. అవసరమైన చోట మెట్లు, రెయిలింగ్, తాగునీటి సౌకర్యం, మూత్ర శాలలు ఏర్పాటు చేస్తారు. ఖిలా ప్రవేశ ద్వారం నుంచి రోవ్వే బేస్ క్యాంప్వరకు సీసీ రోడ్డు నిర్మిస్తారు. టెండర్లు పూర్తి కావడంతో ఖిలా అభివృద్ధి పనులను ప్రారంభించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే రోవ్ వే బేస్ క్యాంప్ వద్ద ప్రదేశాలను చదును చేశారు. రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం ఖిలాను సందర్శించి పనులు చేపట్టే ప్రాంతాలను పరిశీలించాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల మంత్రి పర్యటన వాయిదా పడింది. త్వరలో తేదీని ఖరారు చేయనున్నట్లు తెలిసింది. -
పథకాలన్నీ చేనేతకూ వర్తింపజేయాలి
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ చేనేత కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇంచార్జి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్ కోరారు. అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం, తెలంగాణ పద్మశాలి సంఘం సంయుక్తంగా హైదారాబాద్ నుంచి చేపట్టిన చేనేత నేతన్న యాత్ర సంస్థాన్ నారాయణపురం మీదుగా ఆదివారం పుట్టపాకకు చేరుకుంది. సంస్థాన్ నారాయణపురంలో కొండా లక్ష్మణ్బాపూజీ, పుట్టపాకలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. చేనేత వస్త్రాలను పరిశిలించారు. పురుషులు, మహిళలు చేనేత వస్త్రాలు ధరించి ప్యాషన్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. జాతీయ చేనేత అవార్డు గ్రహీతలు గూడ పవన్, గజం నర్మదను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ ఇంచార్జి బొల్ల శివశంకర్ మాట్లాడుతూ రాజకీయ పదవుల్లో పద్మశాలీలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, రాష్ట్రం ప్రకటించినట్లుగా రూ.లక్ష వరకు రుణమాపీ చేయాలని కోరారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ జియో ట్యాగ్ కల్పించాలని, అర్హులందరికీ పింఛన్ ఇవ్వాలని, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత అభివృద్ధికి ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటు, చేనేత సంబంధిత కార్పొరేషన్ పదవులు ఇవ్వాలన్నారు. పద్మశాలి సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు కమర్తపు మురళీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేనేతకు అనేక పథకాలు అమలు చేస్తుందని, రూ.33 కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. రూ.680 కోట్ల విలువైన 1.28 కోట్ల చీరల తయారీకి సిరిసిల్ల పద్మశాలి సంఘానికి అర్డర్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, మహిళాప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచందర్రావు, మహిళా ఆధ్యక్షురాలు గుంటక రూప, బొమ్మ ప్రవళ్లిక, అవ్వారి భాస్కర్, మాచర్ల రామచందర్, జిల్లా ఆధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సామల విజయలక్ష్మి, గజం పుష్పలత, సామల భాస్కర్, గజం హనుమంతు, సత్యనారా యణ, వెంకటేశ్వర్లు, శంకర్, బాలసుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, సమత, తిరుమల, అశ్విత, సునీత, పద్మ, లక్ష్మి, విశ్వరేఖ తదితరలు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఇంచార్జి బొల్ల శివశంకర్ పుట్టపాకకు చేరిన నేతన్న యాత్ర -
సుర్వి బాలరాజుకు భారత్ ఐకాన్ అవార్డు
భూదాన్పోచంపల్లి : మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన సామాజికవేత్త సుర్వి బాలరాజుగౌడ్ భారత్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఆస్పత్రులు, బస్టాండ్ల వద్ద అన్నార్థులకు ఉచితం భోజనం అందిస్తూ వారి ఆకలి, దప్పిక తీర్చుతూ బాలరాజు చేస్తున్న స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి భారత్ ఐకాన్ అవార్డుకు ఎంపిక చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని లోక్కళ మంచ్ ఆడిటోరియంలో ఉజ్వల కల్చరల్ ఫౌండేషన్, శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ సంయుక్తంగా సింధూర్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ ఎల్టికల్నల్ రామ్శంకర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహహోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా ఘ నంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో వెండిజోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. ప్రసాద వితరణకు ఆధునిక పరికరాలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాద పంపిణీ వితరణ కోసం ఆధునిక పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. ఆదివారం ఆలయ ప్రసాద విభాగాన్ని తనిఖీ చేశారు. ప్రసాదం తయారీ, ప్యాకింగ్, అమ్మకాలతో పాటు పరిశుభ్రతను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని, ప్రసాదం పంపిణీ వితరణకు ఆధునిక యాంత్రిక పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అనంతరం క్యూలైన్లలో భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తక్కువ రేట్లతో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భక్తులు ఈ సందర్భంగా ఈఓ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, అధికారులు దయాకర్రెడ్డి, రామావు, శ్రీనివాస్ రెడ్డి, నవీన్కుమార్, ఆర్ఐ శేషగిరిరావు ఉన్నారు. -
100 మందికి పదోన్నతులు
భువనగిరి: ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ కొ లిక్కి వచ్చింది. 100 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పపదోన్నతి లభించనుంది. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు సోమవారం వెబ్ ఆప్షన్ పెట్టుకోనున్నారు. వారికి మంగళవారం డీఈఓ చేతుల మీదుగా ఆర్డర్ కాపీలు అందజేయనున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు పోస్టులకు అర్హతఉపాధ్యాయుల్లో చాలామంది గణితం, భౌతిక శాస్త్రం, ఫిజిక్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. వీరు మూడు పోస్టులకు అర్హత పొందుతున్నారు. 1:3 నిష్పత్తి ప్రకారం సీనియార్టీ జాబితా తయారు చేయడంతో ఇలాంటి సమస్య వచ్చింది. దీంతో అధికారులు ఈనెల 23న వారిని పిలిచి ఒక్కటే ఎంపిక చేసుకోవాలని సూచించి అంగీకార పత్రాలు తీసుకున్నారు.అనంతరం సీనియార్టీ జాబితా ప్రకటించి ఆదివారం అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాలు రాకపోవడంతో తుది జాబితా ప్రకటించారు. పాఠశాలల వారీగా పదోన్నతులుజెడ్పీ, ప్రభుత్వ 163, ప్రాధమికోన్నత 68, ప్రాథమిక పాఠశాలలు 484 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2,939 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో 100 మంది ఎస్టీజీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 76, ప్రాథమిక పాఠశాలల్లో 20, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నలుగురు ఉన్నారు. కొలిక్కి వచ్చిన ఉపాధ్యాయ ప్రమోషన్లు నేడు వెబ్ ఆప్షన్లకు అవకాశం రేపు ఆర్డర్ కాపీలు అందజేత -
విస్తరిస్తున్న ఆయిల్పామ్
జిల్లాలో 6,400 ఎకరాల్లో సాగు.. 700 ఎకరాలకు రిజిస్ట్రేషన్ఆత్మకూరు(ఎం): జిల్లా వ్యాప్తంగా ఆయిల్పామ్ విస్తరిస్తోంది. ప్రస్తుతం 6,400 ఎకరాల్లో సాగవుతుండగా.. మరో 700 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా మూడేళ్ల కిత్రం మొదటి దశలో నాటిన మొక్కలు నేడు ఫలాలనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. గెలలు కోసి మార్కెట్కు తరలించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. శ్రమ, పెట్టుబడి తక్కువ, మంచి లాభాలు, ఒక్కసారి నాటితే మూడేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి, ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలతో ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 2022–23లో ఆయిల్పామ్ సాగు ప్రారంభంయాదాద్రి భువనగిరి జిల్లాలో 2022–23లో అయిల్పామ్ సాగు ప్రారంభించారు. మొదటి విడతలో 1,400 ఎకరాలు లక్ష్యం కాగా.. 285 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని పూర్తిస్థాయిలో మొక్కలు నాటారు. 2023–25 ఆర్థిక సంవత్సరంలో 4,500 ఎకరాలకు గాను పూర్తిస్థాయిలో లక్ష్యం చేరారు. 2025–26లో 3 వేల ఎకరాలు ఆయిల్పామ్ సాగు చేయాలన్నది ఆయిల్ఫెడ్ సంస్థ లక్ష్యం కాగా.. అందులో ఇప్పటి వరకు 500 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయ్యింది. మరో 700 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులు రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. మార్చి 31 వరకు టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు, ఫీల్డ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. వలిగొండ, చౌటుప్పల్, తుర్కపల్లిలో కలెక్షన్ సెంటర్లు మొదటి దశలో నాటిన మొక్కలు నేడు ఫలాలనివ్వబోతున్నాయి. ప్రస్తుతం 170 ఎకరాల్లో తోటలు కోతకు వచ్చాయి. మరో వెయ్యి ఎకరాలు కోతకు రానున్నాయి. జిల్లాలో వలిగొండ, చౌటుప్పల్, తుర్కపల్లిలో కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయిల్పామ్ చేతికొచ్చిన రైతులు కలెక్షన్ సెంటర్లకు లేదా నేరుగా నూనె కర్మాగారాలకు గెలలను తరలించి మార్కెట్ చేసుకోవచ్చు. సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట వద్ద దేశంలోనే అతిపెద్ద నూనె కర్మాగారం నిర్మిస్తున్నారు. దసరా నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇది అందుబాటులోకి వస్తే జిల్లా రైతులకు మేలు చేకూరుతుంది. ఫలితాలివ్వబోతున్న మొదటి విడత మొక్కలు 170 ఎకరాల్లో కోతకు సిద్ధం మార్కెటింగ్ సౌలభ్యం కోసం మూడు కలెక్షన్ సెంటర్లు ఏర్పాటుఆయిల్పామ్ సాగు (ఎకరాల్లో) సంవత్సరం లక్ష్యం సాగు2023–24 1,400 1,400 2024–25 4,500 4,500 2025–26 3,400 500ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు వెళ్లి స్వయంగా ఆయిల్పామ్ సాగుపై అధ్యయనం చేశా. కోతుల బెడద, దళారుల సమస్య ఉండదు. ఆదాయం కూడా మంచిగానే ఉందనిపించింది. ఒక ఎకరం నీటితో నాలుగు ఎకరాల అయిల్పామ్ సాగు చేయొచ్చు. అందుకే గ్రామంలో 15 ఎకరాల్లో అయిల్పామ్ సాగు చేస్తున్నా. ఈ సంవత్సరమే మొక్కలు నాటాను. – మందడి శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల, ఆత్మకూరు(ఎం)2022లో పది ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశా. అప్పటి అయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి దగ్గరుండి మొక్కలు నాటించారు. అంతరపంటగా వక్క తోట సాగు చేశా. ఇటీవల పామాయిల్ కోతకు వచ్చింది. మా ఏరియాకు వలిగొండ సెంటర్ కేటాయించారు. గెలలు కోయగానే వలిగొండకు తీసుకెళ్తా. –మల్లెపూల ఉపేందర్, మోదుగుకుంట, ఆత్మకూరు(ఎం) మండలం -
‘ఇందిరమ్మ’ పేరు.. అక్రమాల జోరు!
మోటకొండూర్ మండల కేంద్రంలో వాగులు లేకపోవడంతో ఇందిరమ్మ ఇంటికి ఇసుక దొరకడం లేదు. దీంతో ట్రాక్టర్కు రూ.3,500 వెచ్చించి ప్రైవేట్గా మూడు ట్రిప్పుల ఇసుక పోయించిన. ఆ తరువాత ఆలేరు వాగు నుంచి ఇసుక రవాణా చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో నాలుగు ట్రిప్పులకు పర్మిషన్ తీసుకున్న. అందులో ట్రాక్టర్ రూ.2,500 చొప్పున రెండు ట్రిప్పులే పోశారు. ఇసుక సరిపోక టన్నుకు రూ.2వేలు చెల్లించి రెండు టన్నులు పోయించుకున్న. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.మోటకొండూర్: ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. వాగులు, వంకల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తోడేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఇంటికి దశలవారీగా 10 ట్రాక్టర్ల ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. కానీ, వ్యాపారులు రెండు,మూడు ట్రాక్టర్లు మాత్రమే లబ్ధిదారులకు పోసి మిగతా ట్రిప్పులను ప్రైవేట్కు అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ఇక్కుర్తి, దిలావర్పూర్, మాటూర్, అమ్మనబోలు, తేర్యాల, బేగంపేట, ఆలేరు, బిక్కేరు.. ఇలా అన్ని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. బ్లాక్లో ట్రాక్టర్ రూ.5వేలకు అమ్మకంమోటకొండూర్ మండలానికి 276 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 236 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో 94 మంది లబ్ధిదారులు ఇసుక కోసం తహసీల్దార్ కార్యాలయంలో పర్మిషన్ పొందారు. ఒక్కో ట్రాక్టర్కు గరిష్టంగా రూ.2వేలకు మించి తీసుకోద్దని రెవెన్యూ అధికారులు ఇసుక వ్యాపారులకు నిబంధన విధించారు. కానీ, లబ్ధిదారుల పేరున పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు అనుమతి పొంది అందులో ఎక్కువ మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.5వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారుల అనుమతితో తరలించిన ఇసుకను లబ్ధిదారులకు చెందకుండా రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళల్లో లారీల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరుగుతున్న ఇసుకదందా వల్ల గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రైతులపైనే కేసులు!స్థానిక వాగుల్లో ఇసుక నిల్వలు సరిపడా లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వేర్వేరు గ్రామాల పరిధిలో ఉన్న వాగుల నుంచి తీసుకెళ్లడానికి అనుమతి పొందుతున్నారు. ఈ క్రమంలోనే మోటకొండూరు మండలం తేర్యాల వాగులో ఇసుక కోసం వేర్వేరు గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులు మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయంలో పర్మిషన్ తీసుకున్నారు. 22,23 తేదీల్లో ఉదయం తేర్యాల వాగు నుంచి ఏకంగా 30 మంది కూలీలతో ట్రాక్టర్ల ద్వారా లబ్ధిదారులు ఇసుక తరలించారు. సమీప రైతులు, గ్రామస్తులు అడ్డుకుని లేబర్ను పంపించారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి ఇసుక తరలించడం ప్రారంభించగా పక్కనున్న ఓ రైతు ఆక్షేపించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ల, రైతుకు ఘర్షణ చోటు చేసుకుంది. సదరు రైతు అన్నదమ్ములు, సమీపంలో ఉన్న కొందరు గ్రామస్తులు గమనించి సంఘటన స్థలానికి వచ్చి డ్రైవర్లతో గొడవకు దిగారు. చివరికి ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. ట్రాక్టర్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఏడుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.వాగులను తోడేస్తున్న వ్యాపారులు అధిక ధరకు బ్లాక్లో ఇసుక విక్రయం తేర్యాల గ్రామంలో అడ్డుకున్న రైతులతో ట్రాక్టర్ డ్రైవర్ల ఘర్షణ ఏడుగురు రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు -
పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
యాదగిరిగుట్ట: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని.. ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం దక్కుతుందన్నారు. 24 గంటలు వైద్యసేవలు అందించేలా వైద్యసిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పావని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోత్నాక్ ప్రమోద్కుమార్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు భిబిక్షపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, నాయకులు గుండ్లపల్లి భరత్గౌడ్, పెలిమెల్లి శ్రీధర్గౌడ్, ముక్కెర్ల మల్లేష్, ఆకుల గణేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ముఖ్య అర్చకుడిగా శ్రీకాంతాచార్యులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖ్య అర్చకుడిగా కలకోట శ్రీకాంతాచార్యులు నియమితులయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు పదవీ విరమణ పొందారు. దీంతో ప్రధానార్చకుడు–2గా ఉన్న ఉప ప్రధానార్చకుడు సురేంద్రచార్యులకు పదోన్నతి వచ్చింది. ఆయన స్థానంలో ముఖ్య అర్చకుడైన మంగళంపల్లి నరసింహమూర్తికి ఉప ప్రధానార్చకులుగా ఈ నెల 15వ తేదీన పదోన్నతి కల్పించారు. ముఖ్య అర్చకుడి పోస్టును అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న కలకోట శ్రీకాంతాచార్యులతో భర్తీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ ఈఓ వెంకట్రావ్, దేవాదాయశాఖ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక భువనగిరి: ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం భువనగిరి పట్టణంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పా శం కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా కె.వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా ఎంఏ సలీం, ఆర్.సవిత, ఎం.ఆనందరావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్.లింగయ్య, సంయుక్త కార్యదర్శులుగా కె.మల్లేష్, వి.శ్యాంసుందర్, ఎన్.సుదర్శన్రెడ్డి, కోశాధికారిగా ఏ.సుధాకర్, మహిళా కార్యదర్శిగా ప్రతిభ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదుల్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కాసం ప్రభాకర్, కోశాధికారి శ్రవణ్కుమార్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్, కేబుల్ టీవీల వైర్లు తొలగింపు భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలో కేబుల్ టీవీలు, ఇంటర్నెట్ సంస్థలు విద్యుత్ స్తంభాల ఆధారంగా ఏర్పాటు చేసిన వైర్లు ప్రమాదకరంగా మారాయి. దీ నిపై ‘మృత్యుపాశాలు’ శీర్షికన శనివారం సాక్షి ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. విద్యానగర్, కిసాన్నగర్లో పలుచోట్ల స్తంభాలకు వేలాడుతున్న వైర్లను తొలగించారు. సమాచారం అందుకున్న కేబుల్ అపరేటర్లు అక్కడికి చేరుకుని గడువు ఇవ్వాలని విద్యుత్ అధికారులను వేడుకున్నారు. అయినా ప్రమాదకరంగా ఉన్న వైర్లను తొలగిస్తుండటంతో ఆపరేటర్లు ఎస్ఈ కార్యాలయానికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గడువు ఇస్తే తామే స్వయంగా సరిచేస్తామని స్పష్టం చేశారు. ఇంటర్నెట్, కేబుల్ టీవీల వైర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని, తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు విద్యుత్ శాఖ ఏడీఈ ఆనంద్రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో వైర్లను సరి చేయాలని, లేనిపక్షంలో తామే పూర్తిస్థాయిలో తొలగిస్తామని హెచ్చరించారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
చివ్వెంల(సూర్యాపేట): భర్తతో పాటు అతడి ఇద్దరి భార్యలపై హత్యాయత్నం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం చివ్వెంల పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మయ్య మొదటి భార్యతో కుడకుడ గ్రామానికి చెందిన దండుగుల శేఖర్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో.. గతంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగగా.. పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకున్నారు. కేసులు పెట్టుకుని రాజీపడ్డారు. కానీ శేఖర్ మాత్రం లక్ష్మయ్య, అతడి మొదటి భార్యపై పగ పెంచుకున్నాడు. సూర్యాపేటలోని సుందరయ్య నగర్కు చెందిన శేఖర్ స్నేహితుడు పల్లపు గోపి ఇంటి నిర్మాణానికి లక్ష్మయ్య వద్ద రాయి కొనుగోలు చేశాడు. రాయికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని లక్ష్మయ్య గోపిని విసిగిస్తుండడంతో.. శేఖర్, గోపితో పాటు వారి స్నేహితులైన టేకుమట్ల గ్రామానికి చెందిన పల్లపు రాము, రాయినిగూడెం గ్రామానికి చెందిన పసుపుల చంటి కలిసి శుక్రవారం చివ్వెంల పోలీస్ స్టేషన్కు బైక్పై వెళ్తున్న అక్ష్మయ్య, అతడి ఇద్దరి భార్యలను కారులో వెంబడించి వారిపై దాడి చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు లక్ష్మయ్య, అతడి భార్యలు బీబీగూడెం గ్రామ శివారులోని మధుర వైన్స్లో వెళ్లి దాచుకున్నారు. దీంతో శేఖర్, గోపితో పాటు వారి స్నేహితులు అక్కడ నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కొండ కింద భక్తులు ఎక్కువగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 30నిమిషాలకు పైగా సమయం పట్టింది. స్వామిని 35వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.32,50,356 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శాస్త్రోక్తంగా యాదగిరీశుడి నిత్యకల్యాణంయాదగిరిగుట్ట ఆలయంలో గురువారం నిత్యకై ంకర్యాల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి గజవాహన సేవలో తీర్చిదిద్ది సేవోత్సవం చేపట్టారు. కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విష్వక్సేనుడి తొలిపూజలతో కల్యాణతంతు పూర్తిచేశారు. ముందుగా ప్రభాతవేళ గర్భాలయంలో స్వామి,అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు.. నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయ మాడవీధిలో ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
పండ్ల రారాజుకు సెలవు
నూతనకల్: నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన, పండ్ల రారాజుగా పేరుగాంచిన దేశ్ముఖ్ జెన్నారెడ్డి శ్యాంసుందర్రెడ్డి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో పూర్తయ్యాయి. శ్యాంసుందర్రెడ్డి తండ్రి జెన్నారెడ్డి ప్రతాప్రెడ్డి నిజాం కాలంలో దేశ్ముఖ్గా పనిచేశారు. ప్రతాప్రెడ్డికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం కాగా.. పెద్ద కుమారుడైన శ్యాంసుందర్రెడ్డి అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసి తనకు ఉన్న 800 ఎకరాల్లో మామిడి, బత్తాయి, సపోట వంటి పండ్ల తోటలు సాగుచేసి భారతదేశంతో పాటు ఆసియా దేశాలకు సైతం పండ్లు సరఫరా చేసి భారత ప్రభుత్వంచే పండ్ల రారాజుగా అవార్డు అందుకున్నారు. ఓపెన్ చానల్ ద్వారా నీటి సరఫరా చేసి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. రాజకీయంగా ఎంతో మందికి అండదండలు అందించి ఉన్నత పదవుల్లో నిలిచేలా కృషిచేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. విద్యావ్యాప్తిలో భాగంగా హైదరాబాద్లో చైతన్య భారతి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సీబీఐటీ, ఎంజీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపనలో పాలుపుంచుకుని ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించే విధంగా కృషిచేశారు. శ్యాంసుందర్రెడ్డి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి స్వయాన బావ. శ్యాంసుందర్రెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్రెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్సింహారెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్లు కొప్పుల వేణారెడ్డి, తీగల గిరిధర్రెడ్డి, గుడిపాటి నర్సయ్య, తిరుమలప్రగడ అనురాధ, పోతు భాస్కర్, నాగం సుధాకర్రెడ్డి, గుంటకండ్ల చంద్రారెడ్డి తదితరులు నివాళులర్పించారు.ఫ ముగిసిన శ్యాంసుందర్రెడ్డి అంత్యక్రియలు ఫ నివాళులర్పించిన ప్రముఖులు -
లైటింగ్ మెరుగుపర్చాలి
ఫ ఈఓ వెంకట్రావ్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట క్షేత్రానికి లైటింగ్ మరింత మెరుగుపర్చాలని ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం రాత్రి ఆయన ఆలయ క్యూలైన్లు, లైటింగ్ ప్రదేశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులను ఆకర్షించే విధంగా లైటింగ్ను మెరుగుపర్చాలన్నారు. అంతేకాకుండా ఆలయ భద్రత, క్యూలైన్ల నిర్వహణ సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ ఉచిత ప్రసాదం తప్పనిసరిగా అందించాలన్నారు. అంతకుముందు భక్తులతో మాట్లాడి వసతి సదుపాయాలు, సౌకర్యాలు, ప్రసాదం ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయన వెంట ఆలయాధికారి కృష్ణ, ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. -
వాహనదారులపై వడ్డన
తిరుమలగిరి (తుంగతుర్తి) : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రవాణా శాఖ సేవా రుసుములు పెంచింది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేస్తూ గత నెల 22న జీఓ నంబర్ 51 విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఆర్టీఏ సర్వర్లో మార్పులు చేశారు. జీఓ విడుదలైన వెంటనే సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ఆర్టీఏ కార్యాలయాల్లో పెంచిన రుసుములతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖ అధికారులు పెరిగిన రుసుముల వివరాలు కార్యాలయం నోటీస్ బోర్డుపై ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంతో రవాణా శాఖకు ఆదాయం, వాహనదారులపై ఆర్థిక భారం పెరిగింది. ప్రతిరోజూ 200 దరఖాస్తులు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజూ సరాసరి 200 దరఖాస్తులు వస్తుంటాయి. రవాణా శాఖ సేవా రుసుము పెంపు నిర్ణయంతో జిల్లా రవాణా శాఖకు ఆదాయం పెరిగింది. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సొంతంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వారికి సేవా రుసుము ఆన్లైన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఏజెంట్ల ద్వారా సేవలు పొందితే మరింత భారం తప్పేలా లేదు. దరఖాస్తు చార్జీల పెంపు రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు సంబంధించి నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్స్, పర్మిట్, సామర్థ్య పరీక్షలతోపాటు ఇతర సేవలపై అదనపు చార్జీలతోపాటు పన్నులను సైతం పెంచింది. వాహనం ఇన్వాయిస్ ధర ప్రకారం నూతన వాహనాల రిజిస్ట్రేషన్ పన్నులు పెంచారు. గతంలో రూ.50 మాత్రమే ఉండగా.. రూ.500 లోపు పన్నుకు రూ.50, రూ.500 కంటే ఎక్కువ ఉంటే రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. పెంచిన చార్జీలు ఇలా.. ఫ లెర్నింగ్ లైసెన్స్ పరిమితి 6 నెలలు కాగా.. గతంలో రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.200 చేశారు. ఫ డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన పీవీసీ స్మార్ట్ కార్డుల సేవా రుసుము ఐదేళ్ల కాల పరిమితికి లైట్ మోటారు వాహనం రూ.200 నుంచి రూ.300కు, 20ఏళ్ల లోపు నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలకు రూ.300 నుంచి రూ.400కు పెంచారు. ఫ వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి పీవీసీ, స్మార్ట్ కార్డులకు నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలకు 0.5 శాతం, ట్రాన్స్పోర్టు వాహనాలకు 0.1 శాతం పన్ను, 3 చక్రాల వాహనాలకు ఏడాదిలోపు రూ.250 నుంచి రూ.300లకు, ఏడాది కంటే ఎక్కువగా ఉంటే రూ.300 నుంచి రూ.500 వరకు అదనపు చార్జీలు విధించారు. ఫ ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు రెండేళ్లలోపు రూ.100 నుంచి రూ.200, రెండేళ్లకుపైన రూ.200 నుంచి రూ.300లకు పెంచారు. ఫ వాహన పర్మిట్ చార్జీలను గతంలో ఉన్న చార్జీల కంటే రూ.100 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. సేవా రుసుములు పెంచిన రవాణా శాఖ ఫ గతంలో కంటే రెట్టింపు చేస్తూ జీఓ జారీ ఫ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఫీజు తక్కువే.. ఫ ఏజెంట్ల ద్వారా వెళ్తే మరింత ఆర్థిక భారం -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
రామన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తుందని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను శనివారం వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిచందన్నారు. రామన్నపేట ఆస్పత్రి అభివృద్ధికి నిధుల కోసం త్వరలో సీఎం రేవంత్రెడ్డిని, వైద్యారోగ్యశాఖ మంత్రిని కలుస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అనంతరం కొమ్మాయిగూడెం ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణపనులకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నూతన కోర్టు భవనాలు నిర్మించే ప్రదేశానికి రోడ్డు, కల్వర్టులు మంజూరు చేయాలని బార్ అసోషియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ చిన్నానాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి, బత్తుల క్రిష్ణగౌడ్, ఎండీ రెహాన్, అక్రం, గోదాసు పృథ్వీరాజ్, జెల్ల వెంకటేశం, గుత్తా నర్సిరెడ్డి, పూస బాలనర్సింహ, తిమ్మాపురం మహేందర్రెడ్డి, పెద్దగోని వెంకటేశం, గంపల రామచంద్రారెడ్డి, మడూరి జ్యోతి, తాటిపాముల శేఖర్, పిట్ట రాంరెడ్డి, ఎర్ర శేఖర్, కూనూరు కృష్ణగౌడ్, బత్తుల నవీన్, నోముల ప్రవీన్, పరమేష్ పాల్గొన్నారు. ఎంపీ చామల, ఎమ్మెల్యే వీరేశం -
పరిష్కారం అరకొరే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో సమస్యలు అరకొరగానే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు.. పరిష్కారానికి పొంతన లేదు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థాయిలో పరిష్కారానికి అనుకూలంగా లేనివే అధికంగా ఉండటంతో వాటి పరిష్కారానికి తహసీల్దార్లు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అధిక దరఖాస్తులు పరిష్కరించిన జిల్లాల్లో నల్ల గొండ ముందు స్థానంలో ఉండటం గమనార్హం. పరిష్కారానికి సిద్ధంగా 8,384 దరఖాస్తులుఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల్లో పావలావంతు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,02,768 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 3,996 దరఖాస్తులను మాత్రమే ఇప్పటి వరకు అధికారులు పరిష్కరించగలిగారు. పరిష్కారానికి సిద్ధంగా మరో 8,384 దరఖాస్తులు ఉన్నాయి. వాటిని తహసీల్దార్లు వారి స్థాయిలో పరిశీలించి.. ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ లాగిన్లకు పంపించారు. వారి లాగిన్ నుంచి అప్లోడ్ చేస్తే ఆయా దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. రాష్ట్రంలో నల్లగొండ మొదటి స్థానంరాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. భూ భారతిలో వాటిని పరిష్కరించే క్రమంలో అధికంగా నల్లగొండ జిలాల్లోనే 2,633 దరఖాస్తులు పరిష్కరించారు. తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం దరఖాస్తులు 61,145 వచ్చాయి. వాటిల్లో పరిష్కారమైంది 99 మాత్రమే. నల్లగొండ జిల్లాలో 43,545 దరఖాస్తులు వస్తే అందులో 2,633 దరఖాస్తులు పరిష్కరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.దరఖాస్తులు ఇలా.. జిల్లా దరఖాస్తులు పరిష్కారంనల్లగొండ 43,545 2,633 సూర్యాపేట 44,741 551 యాదాద్రి 14,482 812 మొత్తం 1,02,768 3,996భూ భారతి దరఖాస్తులకు కలగని మోక్షం కుస్తీలు పడుతున్న తహసీల్దార్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 1,02,768 వాటిలో 3,996 అప్లికేషన్లకే మోక్షం అయినా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువగా పరిష్కారంఎన్నో అడ్డంకులు భూ సమస్యలు పరిష్కరించే విషయంలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లకు తంటాలు తప్పడం లేదు. సాదాబైనామా విషయం కోర్టులో ఉండటంతో ఆ దరఖాస్తులను పక్కన పెట్టారు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (పీఓటీ) పరిధిలో ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. మిగిలిన టీఎం 33 భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు. ఇందులో పౌతిల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా పరిష్కారం కానివి చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం తహిసీల్దార్లు నానా తంటాలు పడాల్సి వస్తోంది. కోర్టు కేసులు, ఇతర భూ సమస్యలకు సంబంధించి మొండి కేసులే అధికంగా ఉండటంతో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కొందరికి భూమి ఉండి కాగితాలు లేవు. అలాంటి వాటి విషయంలో పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది
విజృంభిస్తున్న వ్యాధులు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నీలగిరిలో సందడి చేస్తున్న ఫ్రాన్స్ దేశస్తుడు - 9లోరామగిరి(నల్లగొండ) : నాకు పర్యటనలు అంటే ఎంతో ఇష్టం. ఎంఎస్ కార్పొరేట్ ఫైనాన్స్ పూర్తి చేసిన నేను ఫ్రాన్స్ రైల్వేస్లో డేటా మేనేజర్గా పని చేస్తున్నాను. 2011లో మొదటిసారి ఢిల్లీలోని భీంటెక్ కంపెనీకి స్టడీ ఎక్ఛ్సేంజ్ కార్యక్రమానికి ఇండియా వచ్చాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు ఎంతో నచ్చాయి. ఇప్పటికి ఎనిమిది సార్లు ఇండియాలో పర్యటించాను. నేపాల్ దేశాన్ని కూడా సందర్శించాను. ఇండియాలోని 14 రాష్ట్రాలు తిరిగాను. ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రదేశాలను వీక్షించాను. ఇక్కడి హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, లడక్, టిబెట్ అంటే నాకు ఎంతో ఇష్టం. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఆడ్రిన్ఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వచ్చాను. రాజస్థాన్లోని జైపూర్, లడక్, కార్గిల్ను సందర్శించాను. అమర్నాథ్ యాత్రకు వెళ్లాను. ఆగస్టులో హైదరాబాద్ వచ్చి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ విపాసన ధ్యాన కేంద్రానికి వెళ్లాను. వారం రోజుల పాటు అక్కడ ధ్యానంలో శిక్షణ తీసుకున్నాను. అక్కడికి వలంటీర్గా వచ్చిన నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన నితిన్తో పరిచయం ఏర్పడింది. అతని ఆహ్వానం మేరకు ఆగస్టు 17న కంచనపల్లికి వచ్చాను. ఇండియా గొప్ప దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. అనేక భాషలు మాట్లాడుతారు. పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల వెళ్లిన అమర్నాథ్ యాత్ర ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఇండియాలో నేను ఎక్కువగా నార్త్ ఇండియా సందర్శించాను. ఇప్పుడు మొదటిసారి సౌత్ ఇండియాకు వచ్చాను. ఇండియాలో నేర్చుకున్న ధ్యానం జీవనానికి, ఉద్యోగరీత్యా చాలా ఉపయోగపడుతుంది. హిందూ, బుద్ధిజం అంటే ఇష్టపడతాను. తీరిక సమయాల్లో రామాయణం, భగవద్గీత చదువుతాను. -
తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య
గుర్రంపోడు: తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. మొసంగి గ్రామానికి చెందిన బొంగరాల శ్రీధర్(21) ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుండడంతో అతడి తల్లి వెంకటమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీధర్ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.రైలు కింద పడి..తిప్పర్తి: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 50 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి శుక్రవారం రాత్రి రాయినిగూడెం గ్రామ సమీపంలో చైన్నై ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుడికాలు తొలగించబడి ఉన్నట్లు రైల్వే తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. నల్లగొండ స్టేషన్ మాస్టర్ నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. యువకుడి అదృశ్యం చౌటుప్పల్: ఆఫీస్కి వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. శనివారం చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన గడిపూడి మురారి(30) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. మూడు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగడంతో మురారి భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మురారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్కాలనీలో నివాసముంటున్న తన అక్క కాంచన వద్దకు వచ్చాడు. ఇక్కడే ఉంటూ రోజూ హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్లి తిరిగి రాత్రికి వస్తుండేవాడు. రోజుమాదిరిగానే ఈ నెల 18న ఉదయం మురారి ఆఫీస్కి వెళ్లాడు. అదేరోజు రాత్రి అతడికి తన అక్క ఫోన్ చేయగా.. ఇంటికి వస్తున్నా అని చెప్పాడు. కానీ వెళ్లలేదు. ఆ తర్వాత రెండు రోజులు అతడి ఫోన్ ఆన్లో ఉన్నప్పటికీ.. ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. తన తమ్ముడు హైదరాబాద్లో ఏదైనా పనిమీద ఉన్నాడేమోనని భావించిన కాంచన అంతగా పట్టించుకోలేదు. 21వ తేదీ నుంచి మురారి సెల్ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. దీంతో శనివారం అతడి అక్క కాంచన చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
పిల్లలపై ఓ కన్నేయండి!
సాక్షి,యాదాద్రి: ఆటాపాటలతో గడపాల్సిన బాల్యం నేరాల ఊబిలో చిక్కుకుంటోంది. చెడుస్నేహం, స్మార్ట్ఫోన్లు, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ చివరికి హత్యల వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలను వేధిస్తూ షీటీంలకు చిక్కుతున్న వారిలో మైనర్లు కూడా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహస్ర ఘటనతో పిల్లల నడవడిక తీరు ఆందోళన కలిగిస్తోంది. పిల్లల పెంపకంలో చేసే తప్పులు భవిష్యత్లో వారిని దారి తప్పుదారి పట్టించేలా చేస్తాయని, పర్యవేక్షణ ఉంచి రోజూ కొంతైనా సమయం కేటాయిస్తే వారిని సరిదిద్దుకోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు ఇలా మారుతున్నారంటే..పాఠశాల స్థాయినుంచే సెల్ఫోన్, డ్రగ్స్, మద్యం వంటివి విద్యార్థుల జీవితాల్లో చేరుతున్నాయి. వీటికి బానిసలుగా మారిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా విద్యారుల జీవితంలో చెడు వ్యవసనాలు భాగం అవుతున్నాయి. అరచేతిలో ఉన్న సెల్ఫోన్ వారికిని నేరాల్లోకి నెడుతుంది. తాజాగా హైదరాబాద్లో ఓ బాలుడు క్రికెట్ బ్యాట్ చోరీ చేస్తుండగా చూసిందన్న నెపంతో సహస్ర అనే అమ్మాయిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. సెల్ఫోన్లలో నేర, హింసాత్మక ఘటనలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. పోర్న్, క్రైం, హింస వంటి కంటెంట్ సెల్ఫోన్లలో విచ్చలవిడిగా లభ్యమవుతోంది. వాటిని వీక్షించడం వల్ల కలిగే దుష్ఫలితాలే ఈ నేరాలని మానసికవేత్తలు అంటున్నారు. పాఠశాల దశలోనే చెడు ఆలోచనల వైపు..విద్యార్థులు పాఠశాల దశలోనే మొబైల్ కంటెంట్, మాదకద్రవ్యాలకు అలవాటుపడి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సెల్ఫోన్లలో లైంగిక, హింసాత్మక అంశాలు కౌమార దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారి హార్మోనులను ప్రేరేపించి, మనసును చెడు ఆలోచనల వైపు ప్రేరేపిస్తున్నాయి. ఇవన్నీ చిన్న వయసులోనే నేరస్తులుగా మారుస్తున్నాయి. ఇటువంటి అంశాలను తీవ్రంగా పరిగణించి అరికట్టాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది.పేద, మధ్య తరగతిలో అధికం.. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది.ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పెరుగుతున్న ఖర్చులు, అదనపు ఆదాయ వనరుల కోసం నిరంతరం తల్లిదండ్రులిద్దరూ శ్రమించాల్సిందే. ఉదయం వెళ్లి సాయంత్రం ఇల్లు చేరే దంపతులు ఒత్తిడితో తమ పిల్లలపై పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నారు. వీటికి తోడు పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కలహాలు, ఆలుమగల మధ్య మనస్పర్థలు తలెత్తినప్పుడు గొడవలు జరగడం.. వాటి ప్రభావం పిల్లలపై మరింతంగా చూపుతుందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడి యా పిల్లలను చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు దగ్గర చేస్తోంది. ఇంటర్నెట్, సెల్ఫోన్లతో చెడు ఆలోచనలు దురలవాట్లతోనూ పక్కదారి కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం చిన్నతనంలోనే పెరిగిపోతున్న నేర ప్రవృత్తి పాఠశాలల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్న మానసిక నిపుణులుపిల్లలు చిన్నతనంలోనే పెడదోరణి పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం మండలస్థాయిలో మానసిక వైద్య నిపుణులను నియమించాలి. మానసిక సమస్యలు, ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడు నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.అలాంటప్పుడు వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలి. – పాశం కృష్ణమూర్తి, ఉపాధ్యాయుడు తమ పిల్లల నవవడికపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. ఒంటిరిగా ఉండడం, తలుపులు మూసుకుని టీవీ, సెల్ఫోన్లు చూడడం వంటివి గమనించి అడ్డుకోవాలి. పిల్ల ల మందు తల్లిదండ్రులు ఘర్షణలకు దిగడం, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సమస్యలను ప్రస్తావించొద్దు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను గమనిస్తుండాలి. చెడుమార్గంలో వెళ్తున్న విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి. – కలెక్టర్ హనుమంతరావు -
యూరియా కష్టాలు
తుర్కపల్లి: యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగుపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకుముందే వరి నాట్లేసిన రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద ఎదురుచూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదని వాపోతున్నారు. శనివారం ఉదయం నుంచే తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రైతులు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. గంటల తరబడి నిరీక్షించినా ఎకరానికి ఒక్క బస్తా చొప్పున మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో అగ్ని ప్రమాదం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామ పరిధిలోని ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ పరిశ్రమలో శనివారం రాత్రి 9గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ కెమికల్ పరిశ్రమలో శనివారం రాత్రి 9గంటలకు కార్మికులు డ్యూటీ షిఫ్ట్ మారే సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నగా మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో డ్యూటీలో ఆరుగురు కార్మికులు ఉన్నట్లు తెలిసింది. మంటలను గమనించిన కార్మికులు భయంతో పరిశ్రమ బయటకు పరుగులు తీశారు. కార్మికులు డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. చౌటుప్పల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో రియాక్టర్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భయాందోళనలో జైకేసారం గ్రామస్తులు.. గ్రామ పరిధిలోని ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ కెమికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో జైకేసారం గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్రామానికి సమీపంలో పరిశ్రమ ఉండడంతో మంటల్లో రియాక్టర్లు పేలి దాని తీవ్రత ఎంతగా ఉంటుందోనని భయాందోళనకు గురయ్యారు. సమాయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదే కంపెనీలో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు గాయపడిన ఉదంతాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది -
ఘనంగా మరియమాత ఉత్సవాలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని మరియరాణి చర్చిలో మరియమాత ఉత్సవాలను శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ కరణం ధమన్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దివ్యబలి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసు ప్రభువు తల్లి మరియరాణి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సాయంత్రం మరియరాణి స్వరూపాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బిషప్ గణ గోవింద్ జోజి, విచారణ ఫాదర్ జి. బాలస్వామి, అర్లారెడ్డి, బాలరాజు, చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
రాయితీపై యంత్రం.. సాగుకు ఊతం
చౌటుప్పల్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు యంత్ర పరికరాలు మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు వివిధ యంత్ర పరికరాలు అందించేందకు స్మామ్(సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు సమర్పణ ఇలా.. స్మామ్ పథకం కింద రాయితీ యంత్ర పరికరాల కోసం ఆయా మండలాల్లో రైతుల నుంచి వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు ఉన్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 40 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. చౌటుప్పల్ మండలానికి 103 యంత్ర పరికరాలు మంజూరు కాగా.. ఇప్పటికి 56 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 77 బ్యాటరీ స్ప్రే పంపులు ఉండగా కేవలం 10 మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులు సంబంధిత గ్రామ ఏఈఓలకు లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జీరాక్స్, మూడు ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది. అర్హులకు అందించే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమకానుంది. లబ్ధిదారుల ఎంపిక.. లబ్ధిదారుల ఎంపిక కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయ అధికారి నోడల్ అధికారిగా, తహసీల్దార్, ఎంపీడీఓలు సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ రూ.లక్ష లోపు యంత్రాలు కొనుగోలు చేసే రైతులను ఎంపిక చేస్తుంది. రూ.లక్ష కంటే ఎక్కువ ధర ఉన్న యంత్రాల కొనుగోలు చేసే రైతులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ కన్వీనర్గా, ఆగ్రోస్ రీజనల్ బ్యాంకు ప్రతినిధి సభ్యుడిగా ఉంటారు. వ్యవసాయ సాగులో యాంత్రీకరణ ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ యంత్ర పరికరాలను స్మామ్ పథకంలో భాగంగా అందిస్తోంది. చౌటుప్పల్ మండలానికి 103 యంత్ర పరికరాలు మంజూరయ్యాయి. వీటి కోసం రైతుల నుంచి ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నాం. అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీంతో ఆసక్తి ఉన్న రైతులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. – ముత్యాల నాగరాజు, మండల వ్యవసాయాధికారి, చౌటుప్పల్ స్మామ్ పథకంలో భాగంగా రైతులకు అందజేయనున్న కేంద్ర ప్రభుత్వంఫ ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు -
సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి
రామగిరి(నల్లగొండ): సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ ఏఎస్పీ జి. రమేష్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ యూనిట్స్, ఎన్సీసీ, పీస్ ఫోరం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ రమేష్, సైబర్ క్రైం డీఎస్పీ టి.లక్ష్మీనారాయణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. పి.మద్దిలేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల్లో ఎక్కువగా మొబైల్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు. కార్యక్రమంలో పీస్ ఫోరం ట్రస్ట్ ఫౌండర్ హెచ్. దయానంద, తెలుగుశాఖ అధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, పీస్ ఫోరం సభ్యులు అశోక్వర్ధన్, ఎన్సీసీ కేర్టేకర్ సీహెచ్. సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ నర్సింగ్ కోటయ్య, ఎం. వెంకట్రెడ్డి, డాక్టర్ ఏ. మల్లేశం, డాక్టర్ బొజ్జ అనిల్కుమార్, కె. శివరాణి, ఎం. సావిత్రి, ఎన్ఎస్ఎస్ వలంటీర్స్, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం
చివ్వెంల(సూర్యాపేట): పట్టపగలే భర్త, అతడి ఇద్దరు భార్యలపై కర్రలతో దాడి చేసి హతమార్చేందుకు నలుగురు వ్యక్తులు యత్నించారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగల లక్ష్మయ్యకు 2002లో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పారెపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మతో వివాహం జరిగింది. వారికి సంతానం కలగకపోవడంతో వెంకటమ్మ సోదరి పద్మను 2008లో లక్ష్మయ్య రెండో వివాహం చేసుకన్నాడు. రెండో వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మయ్య మొదటి భార్య వెంకటమ్మ గర్భం దాల్చింది. దీంతో ఇద్దరు భార్యలతో కలిసి వడ్డెర పనులు చేసుకుంటూ లక్ష్మయ్య జీవనం కొనసాగిస్తున్నాడు. 2023లో కుడకుడ గ్రామానికి చెందిన శేఖర్తో వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. శేఖర్ వెంకటమ్మను ఇబ్బందులకు గురిచేయడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కాగా సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన గోపి ఈ నెల 17న లక్ష్మయ్య వద్ద ఇంటి నిర్మాణానికి రాయి తీసుకెళ్లాడు. రాయికి సంబంధించిన రూ.3 వేలు ఇవ్వాలని లక్ష్మయ్య గోపిని అడగగా ఇవ్వకపోవడంతో శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి గోపిని లక్ష్మయ్య అక్కడకు పిలిచాడు. లక్ష్మయ్య మొదటి భార్య వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకున్న శేఖర్ గోపికి స్నేహితుడు కావడంతో అతడు కూడా వచ్చాడు. అక్కడ డబ్బుల విషయం మాట్లాడుతుండగా.. గోపికి స్నేహితుడైన శేఖర్ లక్ష్మయ్యపై దాడి చేశాడు. అనంతరం లక్ష్మయ్య తన ఇద్దరు భార్యలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వస్తుండగా.. మార్గమధ్యలో చింతలచెరువు కాలువ వద్ద గోపితో పాటు శేఖర్, రాఘవ, చంటి కారులో మాటువేశారు. చింతలచెరువు కాలువ వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో లక్ష్మయ్య తన బైక్లో పెట్రోల్ కొట్టిస్తుండగా.. అక్కడే మాటువేసిన గోపి, అతడి స్నేహితులను లక్ష్మయ్య భార్యలు చూసి అతడికి చెప్పారు. దీంతో లక్ష్మయ్య బైక్పై తిరిగి అక్కలదేవిగూడెం వైపు వస్తుండగా కారులో నలుగురు వెంబడించారు. లక్ష్మయ్య, అతడి భార్యలు ప్రాణ భయంతో బీబీగూడెం గ్రామ శివారులో గల మధుర వైన్స్లోకి పరిగెత్తారు. అక్కడ ఉన్న వ్యక్తులు వారికి రక్షణ కల్పించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. బాధితులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని లక్ష్మయ్య పోలీసులను వేడుకున్నాడు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫ ప్రాణ రక్షణ కోసం వైన్స్లోకి పరిగెత్తిన బాధితులు -
నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆలయ తిరు, మాడీ వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజలి సేవోత్సవం నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవ, ఆరాధన, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సమష్రనామార్చాన తదితర పూజలు నిర్వహించారు. -
మూసీకి తగ్గిన ఇన్ఫ్లో
ఫ ఒక గేటు ద్వారా నీటి విడుదల కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతా నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గింది. మూసీ రిజర్వాయర్కు శుక్రవారం 3,498 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఒక క్రస్టు గేటును రెండు అడుగుల మేర పైకెత్తి 1230 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 527 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రం వరకు నీటిమట్టం 643.35 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలుకు గాను ప్రస్తుతం 4.03 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధుడు మృతికొండమల్లేపల్లి(చింతపల్లి): ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చింతపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాపురం గ్రామానికి చెందిన గార్లపాటి రాములు(82) ఇంట్లో ఒంటరిగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి రాములు ఇంట్లో నిద్రించగా.. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలిపోయింది. చుట్టుపక్కల గమనించి జేసీబీని పిలిపించి ఇంటి శకలాలను తొలగించగా రాములు మృతిచెంది ఉన్నాడు. మృతుడి మనవడు ప్రవీణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. దొంగ అరెస్ట్కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొర్రోనితండాలో సోమవారం రాత్రి కొర్ర పట్టి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం సీఐ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రోనితండాకు చెందిన కేతావత్ బద్య సోమవారం రాత్రి అదే తండాకు చెందిన కొర్ర పట్టి ఇంటి తాళాలు పగులగొట్టి కేజీ వెండి, రూ.1.50లక్షల నగదు అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో సీఐ నవీన్కుమార్, ఎస్ఐ అజ్మీరా రమేష్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బద్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకుని, జైలుకు తరలించినట్లు న్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ నవీన్కుమార్, ఎస్ఐ అజ్మీరా రమేష్, క్రైమ్ సిబ్బంది హేమునాయక్, భాస్కర్ను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. -
డీసీసీబీని సందర్శించిన నాబార్డు సీజీఎం
నల్లగొండ టౌన్: నల్లగొండలోని డీసీసీబీని శుక్రవారం నాబార్డు సీజీఎం ఉదయ్భాస్కర్ సందర్శించారు. ఆయన డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నాబార్డు స్కీంలు, డీసీసీబీల అభివృద్ధిలో నాబార్డు పాత్ర వంటి విషయాలపై సీజీఎం మాట్లాడారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాబార్డు అందిస్తున్న అనేక పథకాలు, రీఫైనాన్స్తో డీసీసీబీలు, సొసైటీలు బలోపేతమయ్యాయన్నారు. ఉమ్మడి జిల్లాలో మరో ఆరు కొత్త బ్రాంచీల ఏర్పాటు, ప్రాథమిక సహకార సంఘాలకు గోదాంల నిర్మాణానికి కొత్త స్కీమ్లు ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా సీజీఎంను ఆయన కోరారు. సమావేశంలో డీసీసీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, శంకర్రావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
సాగు జలాలు ఇచ్చే వరకు పోరాడాలి
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం ప్రాంతానికి సాగు జలాలు అందించే ఇక్కడి ప్రజలు పోరాడాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాచకొండ ఎత్తిపోతల పథక సాధన సదస్సును శుక్రవారం సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నాయకుడు పి. ఇంద్రసేనారెడ్డి పాల్గొని రాచకొండ ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎలా తీసుకురావచ్చనే డీపీఆర్ను వివరించారు. ఈ సందర్భంగా సారంపల్లి మాల్లారెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చిన్న చిన్న ప్రాజెక్టులకు రూ.500కోట్ల చొప్పున కేటాయిస్తే పూర్తయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ఇరిగేషన్కు రూ.22,304 కోట్లు కేటాయించి, అందులో రూ.10వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణం కోసం వెచ్చించారని, మిగిలిన బడ్జెట్లో రూ.800 కోట్లు వేతనాలకు, రూ.11,500 కోట్లతో వడ్డీలు చెల్లిస్తున్నారని అన్నారు. మూసీ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం రూ.15వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పి రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు హైదరాబాద్ నుంచి కాలుష్యంకారక కంపెనీ తరలించాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరతకు కారణం వ్యవసాయ శాఖ మందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడమేనని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి నీళ్లు ఎక్కడ నుంచి తెస్తారో తీసుకురావాలి కాని, అలోచనలు మార్చుతూ కాలయాపన చేయొద్దన్నారు. సాగు జలాలు అందించే వరకు దీర్ఘకాలిక పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అరాచక పాలన కొనసాగిస్తున్నాయని అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నాయకుడు పి. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. రాచకొండ ఎత్తిపోతల పథకానికి కృష్ణా, గోదావరి జలాలు అందించే అవకాశాలను వివరించారు. ఈ పథకం నిర్మాణం పూర్తయితే ఎన్ని మండలాలకు సాగు జలాలు అందుతాయని వివరించారు. అంతకుముందు నారాయణపుంర చౌరస్తా నుంచి సదస్సు నిర్వహించే ప్రదేశం వరకు ర్యాలీ నిర్వంచారు. ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, సుర్కంటి శ్రీనివాస్రెడ్డి, గుంటోజు శ్రీనివాస్చారి, దోడ యాదిరెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దొంతగోని పెద్దులు, ఐతరాజు గాలయ్య, మల్లేపల్లి లలిత, చింతకాయల నర్సింహ, రాములు, నరసింహ, యాదవరెడ్డి, శంకరయ్య, భిక్షం, నిర్మాల, అమరేందర్ తదితరులున్నారు. రాచకొండ ఎత్తిపోతల డీపీఆర్ను వివరిస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం నేత ఇంద్రసేనారెడ్డి ఫ అఖిల భారత రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి -
మునగాలలో క్లినిక్ సీజ్
మునగాల: మండల కేంద్రంలోని ఆర్ఎంపీ చంద్రమౌళి నిర్వహిస్తున్న క్లినిక్ను శుక్రవారం జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సీజ్ చేశారు. ఆర్ఎంపీ చంద్రమౌళి చేసిన వైద్యం వికటించడంతోనే ఈనెల 5న మునగాల మండలంలోని బరాఖత్గూడెం గ్రామానికి చెందిన గోవింద వెంకటేశ్వర్లు మృతి చెందాడని బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ జయమనోహరి క్లినిక్తో పాటు అనుబంధంగా ఉన్న అమ్మ రక్తపరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరిమితికి మించి వైద్యం చేయొద్దని, అనవసరంగా యాంటిబయాటిక్ మందులు వినియోగించొద్దని హెచ్చరించారు. అయినా చంద్రమౌళి క్లినిక్లో యథావిధిగా వైద్యం చేస్తున్నాడని సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి క్లినిక్ను సీజ్ చేయడంతో పాటు అమ్మ రక్తపరీక్ష కేంద్రం నిర్వాహకుడికి నోటీసు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి వెంట సూర్యాపేట డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, కోదాడ డిప్యూటీ డీఎంహెచ్ఓ జయమనోహరి, స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రవీందర్, వైద్య సిబ్బంది ఉన్నారు. -
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి
ఫ పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ రవీందర్రావు మునుగోడు: రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఇళ్లలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ అదనపు కమిషనర్ డి.రవీందర్రావు అన్నారు. ఉపాధిహామీ పథకం పనుల జాతర కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం మునుగోడు మండలం కొంపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి నిధులు వినియోగించుకోవాలన్నారు. ఇంకుడు గుంత నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. ఇళ్లతోపాటు మురుగు కాల్వల ఎండింగ్, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో విధిగా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ కార్యాలయయంలో నూతన మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శుక్రవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. వ్రతాలకు కావల్సిన పూజా సామగ్రిని హుజూర్నగర్కు చెందిన బూర్లె ప్రతాప్ దంపతులు, సీహెచ్ ఆనంద్ దంపతులు, మేళ్లచెరువుకు చెందిన వంగవేటి సాయిబాబా దంపతులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ పాల్గొన్నారు. -
రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
కట్టంగూర్: రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకొని వ్యవసాయంలో అధిక లాభాలు గడించాలని నాబార్డు తెలంగాణ రీజియన్ చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(ఎఫ్పీఓ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ను, ఆఫ్గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం గంగదేవిగూడెంలోని ఎఫ్పీఓలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. సోలార్ ప్యానల్తో విద్యుత్ను స్టోరేజీ చేసి ఆదాయం సంపాదించేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్పీఓలు రైతులకు అన్నిరకాల సౌకర్యాలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నాని తెలిపారు. ఎఫ్పీఓ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించబోయే కృషి వికాస్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం నిరుద్యోగ యువతకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాణధార ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని రైతులకు డైరెక్ట్ సీడ్ రైస్(డీఆర్ఎస్) పద్ధతిపై సూచనలు, సలహాలు అందించారు. రాబోయే రబీ సీజన్లో డీఆర్ఎస్ పద్ధతిలో 100 ఎకరాలు సాగు కోసం అవసరమైన మిషన్లు ఉచితంగా అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డు నల్లగొండ డీడీఎం వినయ్కుమార్, సూర్యాపేట డీడీఎం రవీందర్నాయక్, ఎఫ్పీఓ అడ్వైజర్ నంద్యాల నర్సింహారెడ్డి, ఎఫ్పీఓ చైర్మన్ చెవుగోని సైదమ్మ, ఐఆర్డీఎస్ అధ్యక్షుడు రమేష్, స్వచ్ఛ శక్తి సుధాకర్, శేఖర్ ఉన్నారు. ఫ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ -
అర్ధరాత్రి చోరీకి యత్నం
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రలో నివాసముంటున్న డ్రైవర్ నాగయ్య ఇంట్లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. రాత్రి ఒంటి గంట సమయంలో నాగయ్య మూత్రవిసర్జనకు వెళ్లేందుకు తలుపు తీయగా.. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. నాగయ్య మనవరాలి చెవికి ఉన్న బంగారంతో పాటు ఇంట్లోని బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. ఈలోగా నాగయ్య ఇంట్లోకి రావడంతో దొంగ పరారయ్యాడు. అంతకుముందే నాగయ్య ఇంటి సమీపంలోని మరో ఇంట్లో ఆ దొంగ చొరబడి సెల్ఫోన్ చోరీ చేశాడు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగయ్య ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగ ఆటోలో పరారైనట్లు గుర్తించారు. తాళం వేసిన ఇంట్లో చోరీఆలేరురూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శక్రవారం ఆలేరు మండలం మంతపురి గ్రామంలో చోటుచేసుకుంది. ఆలేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంతపురి గ్రామానికి చెందిన సొప్పోజు కృష్ణచారి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలోని రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగొచ్చిన కృష్ణచారి, కుటుంబ సభ్యులు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాలాద్రి తెలిపారు. మోటారు కేబుల్ వైర్లు.. తిప్పర్తి: తిప్పర్తి మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ సమీపంలో రైతుల పొలాల వద్ద బోరు మోటార్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని అపహరించారు. సుమారు 30మంది రైతులకు సంబంధించిన కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు శుక్రవారం తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అస్తమించిన ఎర్ర సూరీడు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా సీపీఐ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సురవరం సుధాకర్రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్యాస విడిచారు. సురవరం పుట్టిపెరిగింది నాగర్కర్నూల్ జిల్లా అయినా.. ఆయన ఉద్యమ ప్రస్తానం నల్లగొండ జిల్లాతో ముడిపడి ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో, పార్టీ విస్తరణకు ఆయన కృషిచేశారు. నల్లగొండ జిల్లా నుంచే రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. రైతు, కూలీల సమస్యలు, భూస్వామ్య వ్యవస్థ, బానిసత్వం అంశాలపై సీపీఐ తరఫున ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు జరిగిన కార్యక్రమాల్లో ఆయన ముందున్నారు. ఆయన నల్లగొండ లోక్సభ స్థానం నుంచి 1998, 2004లో గెలుపొందారు. ఎంపీగా పనిచేసిన కాలంలో జిల్లా సమస్యలు, ముఖ్యంగా సాగునీటి సమస్యలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించారు. కాగా, సురవరం సుధాకర్రెడ్డి మృతికి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంతో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఫ అనారోగ్యంతో సురవరం సుధాకర్రెడ్డి కన్నుమూత ఫ రెండుసార్లు నల్లగొండ ఎంపీగా సేవలు ఫ కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి -
హైలెవల్ కష్టాలు
లోలెవల్ వంతెనలు.. సాక్షి, యాదాద్రి: భారీ వర్షాలు కురిసినప్పుడలా జిల్లాలోని పలు మార్గాల్లో అవస్థలు తప్పడం లేదు. లోలెవల్ వంతెనలు, కాజ్వేలు విస్తరణకు నోచుకోక రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వరద ఉధృతిలోనే ప్రయాణం సాగిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినా కాజ్వే కష్టాలు తీరడం లేదు. మూసీ, ఆలేరు, బిక్కేరు. చిన్నేరు, శామీర్పేటతో పాటు పలు స్థానిక వాగులపై సుమారు 60 వరకు కల్వర్టులు, కాజ్వేలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇందులో కొన్ని చోట్ల పనులు మొదలై వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని కాజ్వేలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. లో లెవల్ బ్రిడ్జిలున్న మార్గాలు ఇవీ.. మూసీపై రుద్రవెల్లి–జూలూరు, బొల్లెపల్లి–సంగెం వద్ద లో లెవల్ వంతెనలున్నాయి. వీటితో పాటు నలగొండ రోడ్డులో నాగిరెడ్డిపల్లి, పల్లెర్ల, నర్సాపూర్, తుమ్మలగూడెం, లోతుకుంట, నర్సాయిగూడెం. వేములకొండ, మల్లేపల్లి– వేములకొండ, మల్లేపల్లి–వెల్వర్తి, జాలుకాలువ, రెడ్లరేపాక రోడ్లు, బీబీనగర్ మండలం రాఘవాపూర్, జైనంపల్లి రోడ్డు, జైనపల్లి – అనంతారం రోడ్డు, అవుషాపూర్ – రాయరావుపేట, చీకటిమామిడి–మాచన్పల్లి, మర్యాల – వడపర్తి, ఫకీర్గూడెం – తాజ్పూర్, రామలింగంపల్లి–తూముకుంట, గంధమల్ల –రాజాపేట, కోనాపూర్ రోడ్డు, పాముకుంట, రాజాపేట, పారుపల్లి –రాజాపేట, నెమిల – రాజాపేట, దూదివెంకటాపూర్ – రాజాపేట, పొట్టిమర్రి–కాల్వపల్లి, బేగంపేట–రేణికుంట, ఆలేరు – కొలనుపాక, కాలనుపాక జంగాలకాలనీ, కొలనుపాక పీతాంబర్ వాగు, ఆలేరు సిల్క్నగర్ వాగు, మంతపురి–దిలావర్పూర్, శారాజీపేట, గొలనుకొండ – అమ్మనబోలు, శర్బనాపురం, బండకొత్తపల్లి – వస్తాకొండూరు, వస్తాకొండూరు–పెద్దపడిశాల, మరిపడి – సీతారాంపూర్, వెల్మజాల – కొమ్మాయపల్లి, తంగెడిపల్లి, చౌటుప్పల్ –తంగెడిపల్లి, మోత్కూరు–గుండాల మార్గాల్లో లోలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు ఉన్నాయి. ఆయా మార్గాల్లో స్థానిక వాగులు, బిక్కేరు, శామీర్పేట, ఆలేరు వాగులు ఉధృతంగా ప్రవహించినప్పుడు వంతెనల పైనుంచి రాకపోకలు స్తంభించిపోతాయి. కొట్టుకుపోయిన కారు చౌటుప్పల్ మండలం నేలపట్ల–వర్కట్పల్లి మధ్య వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఈ మార్గంలో వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్థానికులతో సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. నిధులున్నా పనులేవీ? ఆలేరు మండలం కొలనుపాకకు రెండు వైపులా సిద్ధిపేట మార్గంలో ఉన్న కాజ్వేలపై హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కావడంలేదు. గంధమల్ల చెరువు అలుగుపోస్తే కొలనుపాక వాగులోకి చేరుతుంది. ఈ సమయంలో ప్రయాణికులను రోడ్డు దాటనీయదు. దీంతో బచ్చన్నపేట, చేర్యాల, సిద్ధిపేట, రాజాపేట మార్గంలో వెళ్లే వాహనాలు చుట్టూ తిరిగిపోవాలి. ధైర్యం చేసి వాగు దాటడానికి ప్రయత్నించిన సందర్భంలో పలువురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోగా మరికొందరు స్థానికుల సాయంతో బయటపడ్డారు. భువనగిరి మండలం బొల్లేపల్లి, వలిగొండ మండలం సంగెం వద్ద, బీబీనగర్ మండలం రుద్రవెల్లి–భూదాన్పోచంపల్లి మండలం జూలురు మధ్య మూసీపై లోలెవల్ వంతెనలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో, హైదరాబాద్లో భారీ వర్షం కురిసిందంటే లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వరద ఉధృతి తగ్గినన్ని రోజులు రాకపోకలు నిలిచిపోతాయి. రుద్రవెల్లి–జూలూరు లోలెవల్ బ్రిడ్జికి సమీపంలోనే ఏడేళ్ల క్రితం చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలో మూసీ పునరుజ్జీవన యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సంగెం బిడ్రిని సందర్శించారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రమాదకరంగా లోలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు ఫ భారీ వర్షాలు కురిసిన ప్రతీసారివంతెనల పైనుంచి వరద ఫ స్తంభిస్తున్న రాకపోకలు ఫ అత్యవసర సమయంలో వాగులు దాటే క్రమంలో ప్రమాదాలు గత ఏడాది వానాకాలంలో ఓ ప్రయాణికుడు ఆలేరు రోడ్డుపై కొలనుపాక వాగు దాటుతున్న క్రమంలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి సదరు వ్యక్తిని కాపాడారు. ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా రక్షణ చర్యలు తీసుకోకపోవడం సంబంధిత శాఖల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మోత్కూర్–గుండాల మధ్య బిక్కేరు వాగుపై హైలెల్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో వాహనదారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన కావడంతో శిథిలావస్థకు చేరింది. వరదలు వచ్చినప్పుడు రోడ్డు దాటడానికి వీలుండదు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు హామీలిచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈ వంతెనను విస్తరిస్తే ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు 50 కిలోమీటర్ల దూరభారం తగ్గడమే కాకుండా వరదలు వచ్చినా ప్రయాణానికి ఆటంకాలు ఉండవు. -
భోజనం వడ్డించి.. సమస్యలు తెలుసుకొని
బీబీనగర్: విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి రుచి, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.. కలెక్టర్ హనుమంతురావు. బీబీనగర్ మండలం కొండమడుగు జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు తానే భో జనం వడ్డించారు. సమస్యలపై ఆరా తీశారు. మోనూ ప్రకారం భోజనం అందజేయాలని సిబ్బందికి సూచించారు. అడ్మిషన్లు పెరిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. తప్పులు లేకుండా 12వ గుణితం చెప్పిన అవినాష్ అనే విద్యార్థిని కలెక్టర్ అభినందించారు. అనంతరం పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేసి రోగులు పొందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యులు, సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. -
నానో ఎరువు.. దిగుబడి మెరుగు
త్రిపురారం : మార్కెట్లో నానో యూరియా, డీఏపీ అందుబాటులోకి వచ్చాయి. ఇది సంప్రదాయ గుళికల యూరి యాకు బదులుగా వాడే ద్రవరూప ఎరువు. మొక్కలకు నానో యూరియా అధిక నత్రజనిని అందిస్తుంది. నానో టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ఈ ఎరువు 20 నుంచి 50 మిల్లీ మైక్రాన్ల పరిమాణంలో నత్రజని కణాలు ఉంటాయి. దీన్ని మొక్కలు సులభంగా గ్రహిస్తాయి. ద్రవరూపంలోని నానో యూరియా తక్కువ మోతాదులో వాడినా మొక్కలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాదు పంట దిగుబడిని పెంచి, పర్యావరణానికి మేలు చేస్తుంది.ది గుబడి, రైతుకు ఆదాయం పెంచుతుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. నానో యూరి యాను సులభంగా నిల్వ, రవాణా చేయవచ్చు. ధరలు ఇలా.. నానో యూరియాను అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ఒక్క బాటిల్ (500 మి.లీ.) వినియోగిస్తే 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని అధికారులు చెబుతున్నారు. 45 కిలోల యూరియా బస్తా రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.220, డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా, అర లీటర్ నానో డీఏపీ రూ.600కు లభిస్తుంది. వినియోగించే పద్ధతులు ● 500 ఎంఎల్ ద్రవరూప నానో యూరియాను ఎకరం పొలానికి వినియోగించుకోవచ్చు. ● 125 నుంచి 130 లీటర్ల నీటిలో 500 ఎంఎల్ నానో యూరియాను బాగా కలిపి పంటలకు పిచికారీ చేసుకోవాలి. ● ఇతర పురుగుమందులు కలిపి పిచికారీ చేయొద్దు. ● నానో యూరియా వాడకం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. ● సాధారణ యూరియతో పోల్చితే నానో యూరియా ప్రభావం మొక్కలపై ఎక్కువ రోజులు ఉంటుంది. ● 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు నానో యూ రియాను పిచికారీ చేయాలి. ● యూరియా వేసే ప్రతి పంటలకు నానో యూరియాను వినియోగించుకోవచ్చు.రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు మార్కెట్లోకి ద్రవరూప యూరియా, డీఏపీ ఫ సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా.. ఫ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
యాదగిరిగుట్ట: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్నా యుడు, తహసీల్దార్ గణేష్నాయక్ సూచించారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం గణేష్ మండప నిర్వాహకులు, ముస్లింలు, వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గణేష విగ్రహాలను తీసుకువచ్చేటప్పుడు, శోభాయాత్ర రోజు విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలన్నారు. సోదరభావంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో సీఐ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, వైద్యాధికారి పావణి, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ట్రాన్స్కో ఏఈ సురేంద్రనాయుడు, ఎంపీడీఓ నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు బస్టాండ్లో తప్పిన ప్రమాదం ఆలేరు: పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఽశుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఉన్నట్లుండి వేప చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఎగ్జిట్ పాయింట్ సమయంలో ఉన్న వేప చెట్టు కింద అప్పటి వరకు పలువురు మాట్లాడుకుంటున్నారు. చెట్ల కొమ్మలు విరిగిపడుతుండగా గమనించి అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచండిభువనగిరి: ఓపెన్ స్కూళ్లలో ప్రవేశాలు పెంచా లని అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. గురువారం తన చాంబర్లో ఓపెన్ స్కూల్ విద్యకు సంబంధించిన పోస్టర్ను విద్యాశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. స్వయం సహాయ సంఘాలు, ఉపాధి హామీ కూలీలు, ఆశ కార్యకర్తలు మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కో ఆర్డినేటర్ సత్తమ్మ, జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్రెడ్డి, సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, వయోజన విద్యా ప్రాజెక్టు అధికారి మమత, సహాయ ప్రాజెక్టు అధికారి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
మృత్యుపాశాలు..
ఇంటర్నెట్, కేబుల్ టీవీల తీగలు వేయడానికి స్తంభాలను ఉపయోగించినప్పుడు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్తంభం చొప్పున నిర్దేశిత రుసుము చెల్లించాలి. కానీ, చాలా చోట్ల అమలు కావడం లేదు. కొందరు యజమానులు విద్యుత్ సిబ్బందితో కుమ్మకై ఇష్టారాజ్యంగా వైర్లు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. భువనగిరి టౌన్: ప్రైవేట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ స్తంభాలను తమ సొంతానికి వాడుకుంటున్నాయి. విద్యుత్ సరఫరా కోసం రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్తంభాల ద్వారా ఇంటర్నెట్, కేబుల్ టీవీ సంస్థలు ఇష్టారాజ్యంగా కేబుళ్లను అనుసంధానిస్తున్నాయి. ఫలితంగా ఈ వైర్లు తెగి కరెంటు లైన్లు, స్తంభాలపై పడినప్పుడు విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా స్తంభాలపై ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ట్రాన్స్కో సిబ్బంది మరమ్మతులు చేయలేకపోతున్నారు. ఇటీవల హైదరాబాద్లో టీవీ, ఇంటర్నెట్ కేబుల్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కేబుల్స్ తొలగించాలని విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఏ స్తంభానికి చూసినా గుట్టలుగా కేబుల్స్ ప్రైవేటు సంస్థల కేబుల్ విస్తరణ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. భువనగిరి పట్టణంలో త్రీ ఫేజ్, టూఫేజ్, చివరికి హైటెన్షన్ స్తంభాలను కూడా అనధికారికంగా వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 15 అడుగుల ఎత్తులో కేబుల్స్ ఉండాలి. కానీ, తక్కువ ఎత్తులో లాగడంతో కిందకు వేలాడుతున్నాయి. అంతేకాకుండా వైర్లను కుప్పలుగా స్తంభాలకు చుట్టేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇష్టారాజ్యంగా స్తంభాలను కేబుళ్ల కోసం వాడుకుంటున్నారు. వాహనాలు వెళ్లిన సమయంలో ప్రమాదాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని కాలనీల్లో చిన్నచిన్న రోడ్లపై ఒకవైపు ఇళ్ల నుంచి మరోవైపున ఉన్న నివాసాలకు కేబుళ్లను రోడ్డుకు అడ్డంగా లాగుతున్నారు. ఇవి తక్కువ ఎత్తులో ఉంటే వాహనాలు వెళ్లిన సమయంలో వాటికి తగిలి తెగిపోతున్నాయి. విద్యుత్లైన్లు, స్తంభాలపై పడి వేలాడుతున్నాయి. నోటీసులతోనే సరిపెట్టారు.. టీవీలు, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలని ఆయా సంస్థల యజమానులకు ఏడాది క్రితం విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత వాటి గురించే మరిచిపోయింది. ఈనెల 27నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఆ తరువాత దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు వరుసగా రానున్నాయి. నిర్వాహకులు భారీ విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు సిద్ధమవుతున్నారు. నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. ఈ తరుణంలో కిందకు వేలాడుతున్న తీగల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. తక్షణమే కేబుల్ టీవీలు, ఇంటర్నెట్ సంస్థల కేబుల్స్ను తొలగించాలని ప్రజలు, ఉత్సవ మండపాల నిర్వాహ కులు కోరుతున్నారు. విద్యుత్ స్తంభాల ద్వారా ఇంటర్నెట్, కేబుల్ టీవీ సంస్థలు వైర్లు లాగాలంటే అనుమతి తప్పనిసరి. ఒక్కో స్తంభానికి రూ.50 నుంచి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 15 అడుగుల ఎత్తులో కేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలి. సపోర్టింగ్ వైర్, కేబుల్ బరువు మీటరుకు గరిష్టంగా 200 గ్రాములు మించవద్దు. తీగ పొడవు స్తంభానికి, స్తంభానికి మధ్య 50 మీటర్లు మించకుండా ఉండాలి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసినవి, తక్కువ ఎత్తులో ఉన్నవి, ప్రమాదకరంగా ఉన్న తీగలను అధికారులు ఎప్పటికప్పుడు తొలగించాలి. కరెంట్ పోల్స్కు ఇష్టారాజ్యంగా ఇంటర్నెట్, కేబుల్ టీవీల వైర్లు ఫ తక్కువ ఎత్తులో అడ్డదిడ్డంగాఏర్పాటు చేస్తున్న ఆపరేటర్లు ఫ పొంచి ఉన్న ప్రమాదాలు.. స్తంభాలపై సమస్య తలెత్తినా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఫ తొలగించాలని గతంలోనే ఉన్నతస్థాయి ఆదేశాలు ఫ హైదరాబాద్ ఘటనతోనూ మేల్కోని యంత్రాంగం -
విద్యార్థికి అండగా ఉంటా
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని శేరిగూడేనికి చెందిన విద్యార్థి భరత్చంద్రచారికి ఇచ్చిన హామీ మేరకు కలెక్టర్ హనుమంతరావు గురువారం అతడి ఇంటిని సందర్శించారు. విద్యార్థి కుటుంబానికి రూ.5వేలు నగదు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఇంటర్ ఎలా చదువుతున్నావని ఆరా తీశారు. ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏ అవసరం వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చదువు విషయంలో ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. భవిష్యత్లో స్థిరపడే వరకు అండగా ఉంటానని పేర్కొన్నారు. విద్యార్థి బలహీనంగా ఉండటంతో మండల వైద్యాధికారికి ఫోన్ చేసి అతడికి రక్త పరీక్షలు నిర్వహించి, తగిన వైద్యం అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి, నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా.. గ్రామస్తులు బస్సు లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, నల్లగొండ డీఎంతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు చిమిర్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ ప్రమోద్కుమార్, ఎంపీఓ నర్సింహరావు తదితరులున్నారు. -
యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు అర్చకులు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. గురువారం ఉదయాన్నే క్షేత్రాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేపట్టారు. ఇక ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజలు చేసి హారతినిస్తున్న అర్చకుడు -
సాంకేతిక నైపుణ్యం.. ఉపాధి మార్గం
ఆలేరు: గ్రామీణ యువతలో శిక్షణ నైపుణ్యాలు పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు, భువనగిరిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ల నిర్మాణాలు చేపట్టింది. ఆలేరులోని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ఆవరణలో, భువనగిరిలో మిషన్ భగీరథ కార్యాలయం సమీపంలో ఒక్కొక్కటి 13వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గతేడాది ఈ పనులు మొదలుపెట్టారు. ఒక్కో ఏటీసీ నిర్మాణానికి రూ.35కోట్ల చొప్పున మొత్తం రూ.70కోట్ల నిధులతో నిర్మించారు. ఇందులో 85శాతం నిధులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీటీఎల్)సమకూర్చగా, ఏటీసీల నిర్మాణం, విద్యుద్దీకరణ తదితర పనులకు మిగతా 15శాతం నిధులను ప్రభుత్వం వ్యయం చేసింది. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి కావడంతో వచ్చే నెలలో వీటిని ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు సెంటర్లలో 344 సీట్లు ఏడాది, రెండేళ్ల కాలపరిమితికిగాను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సుల్లో ఒక్కో సెంటర్లో 172 సీట్ల చొప్పున 344 సీట్లు ఉన్నాయి. ఏటీసీల్లో లక్ష్యం మేరకు ప్రవేశాల పూర్తికి కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ విషయమై దృష్టిసారించాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆలేరులో 64, భువనగిరిలో 72 అడ్మిషన్లు జరిగాయి. ప్రవేశాల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 28తో గడువు ముగియనుంది. ఏటీసీల్లో సంవత్సరం, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాటా, టాటా నెల్కో, టెక్ ఎక్స్పర్ట్, డెల్, ఇన్ఫోసిస్ తదితర నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో అధికారులు చర్చలు చేస్తున్నారు. అదేవిధంగా ‘టీగేట్’ (తెలంగాణ గేట్వే అడాప్ట్ ట్రైనింగ్ ఎంప్లాయిమెంట్) వివిధ పారిశ్రామికవేత్తలతో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయమై చర్యలు జరుపుతోంది. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా టీగేట్ చర్యలు తీసుకుంటుంది. ఆలేరు, భువనగిరిలోని ఏటీసీల్లో శిక్షణ కోసం అన్ని ఆధునాతన సాఫ్ట్వేర్ పరికరాలు వచ్చాయి. విద్యార్థులకు వివిధ కోర్సుల్లో శిక్షణ, సిలబస్ బోఽధించేందుకు ఎనిమిది మంది ప్రత్యేక నిపుణులను టీటీఎల్ నియమించింది. ఆయా యంత్రాలను ఏటీసీల్లో సాంకేతిక బృందం బిగిస్తోంది. – హరికృష్ణ, ఐటీఐ జిల్లా కన్వీనర్ ఫ ఆలేరు, భువనగిరిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు సిద్ధం ఫ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ల ఏర్పాటు ఫ శిక్షణ తర్వాత ఉద్యోగాలకు మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందం ఫ వచ్చే నెలలో ప్రారంభానికి ఏర్పాట్లుపదో తరగతి పాసై, 22ఏళ్లలోపు ఉన్న విద్యార్థులు హెచ్టీటీపీఎస్//ఐటీఐ.తెలంగాణ. జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత పదో తరగతి మెమో, కుల ధ్రవీకరణ పత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్, టీసీతోపాటు ఆధార్కార్డు ఒరిజినల్ ధ్రువపత్రాలతో స్థానిక ఐటీఐ కళాశాలల్లో సంప్రదించాలి. కోర్సులు, సీట్ల వివరాలు (కాలపరిమితి ఏడాది) కోర్సు సీట్లు మానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ 40ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ 40ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ 20 బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫయర్(మెకానికల్) 24అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్ 24మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 24 -
ఉత్సవం.. సన్నద్ధం
శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఉపాధ్యాయుల పదోన్నతుల రీషెడ్యూల్ విడుదలభువనగిరి: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన రీ షెడ్యూల్ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ మొదటగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం ఈనెల 11న పూర్తికావాల్సి ఉంది. 2002 నవంబర్లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు సీనియార్టీ విషయంలో కోర్టులో పిటిషన్ వేసిన కారణంగా పదోన్నతుల ప్రక్రియ వాయిదా పడింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసిన కారణంగా తిరిగి ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి రీ షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో పాటు వెంటనే మల్టీజోన్–2 పరిధిలో జరిగే జీహెచ్ఎంల పదోన్నతుల జాబితాను ప్రకటించింది. ఈమేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న 34 జీహెచ్ఎం పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ కానున్నాయి. అనంతరం జిల్లాలో సుమారు 100 వరకు స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్హెచ్ఎంలకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే తయారు చేసిన సుమారు 300 మది సీనియార్టీలకు సంబంధించిన సర్టిఫికెట్స్ పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు జరగనుంది. ఈ నెల 25న వెబ్ ఆప్షన్, పదోన్నతులు పొందిన వారికి 26న ఆర్డర్లు జారీ చేయనున్నారు. జీహెచ్ఎంల పదోన్నతులకు సంబంధించి కూడా ఆర్డర్లు జారీ చేశారు. యూరియా కోసం ఆందోళన చెందొద్దు ఆలేరురూరల్: యారియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఇప్పటివరకు జిల్లాకు 17వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. దుకాణ యాజమానులు రైతులకు అవసరం ఉన్న ఎరువులు ఇవ్వాలని, వేరే వాటిని అంటకట్టొద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అమ్మాలని, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మందనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, ఎంపీఓ అనురాధ, ఏఓ శ్రీనివాస్, ఏఈఓ మండల అధికారులు తదితరులున్నారు. బంగారు భవిష్యత్ను నిర్మించుకోవాలి చౌటుప్పల్ : విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసంతో బంగారు భవిష్యత్ను నిర్మించుకోవాలని రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ప్రధాన కార్యదర్శి రమణకుమార్ అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, హాస్టల్ భవనం, గురుకుల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్లో ఉన్నత స్థాయిలో ఉండొచ్చన్నారు. ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధించడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ స్మిత, ఉపాధ్యాయులు ఉన్నారు. సాక్షి, యాదాద్రి : గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరగడానికి పలు జాగ్రత్తలు రూపొందించారు. ఈనెల 27న వినాయక చవితి పండుగ రోజు నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ సబ్ డివిజన్ పరిధిలో గల ఆరు మున్సిపాలిటీలు, 17 మండలాల్లో ఈసారి సుమారు నాలుగు వేల వినాయక మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం 3,600కు పైగా మండపాలు ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో.. విద్యుత్ శాఖ, నీటిపారుదల, ఆర్అండ్బీ పంచాయతీ రాజ్, మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అధికారులందరినీ సమన్వయం చేస్తున్నారు. శోభాయాత్రకు అడ్డంకిగా రహదారుల వెంట ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లకు మరమ్మతులు వంటి పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ప్రతి మండపం నిర్వాహకులు డీడీ చెల్లిస్తే విద్యుత్ శాఖ సిబ్బంది కరెంట్ పోల్ నుంచి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అనుకోని పరిస్థితిలో ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖ నుంచి పరిహారం అందుతుంది. ఇందుకోసం 250 కిలో వాట్స్కు రూ.500, 500కిలో వాట్స్కు రూ.1000, 1000 కిలో వాట్స్ వరకు రూ.1500తోపాటు ప్రతి కిలోవాట్స్కు రూ.750 చెల్లించాలి. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా కిందికి వేలాడే కరెంటు తీగలు, వంగి ఉన్న చెట్ల కొమ్మలు ఉంటే తొలగించనున్నారు. అయితే విగ్రహాల ఎత్తు సమాచారం ముందుగానే తీసుకుంటారు. అందుబాటులో గజ ఈతగాళ్లు వినాయక నిమజ్జనోత్సవం కోసం చెరువుల వద్ద గజఈత గాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. క్రేన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, బారికేడ్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు ఆయా శాఖలు చేపట్టనున్నాయి. ప్యాచ్ వర్క్ చేపట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలను మూసివేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువుల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు పర్యవేక్షణ కొనసాగనుంది. చెరువుల వద్ద భద్రత ఏర్పాట్లు ప్రతి మండపానికి అనుమతి తప్పనిసరి. ఇందుకోసం poiceportal.tspoice.gov.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనిపించే విధంగా ప్రదర్శించాలి. ప్రతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేయనున్నారు. డీజేలకు అనుమతి లేదు. అనుమతి ఇచ్చిన మేరకు రాత్రి పది గంటల లోపు మైక్లు కట్టేయాలి. ప్రతిరోజు ప్రతి మండపాన్ని బ్లూకోట్స్ పోలీస్లు, పెట్రో మొబైల్ కానిస్టేబుళ్లు విజిట్ చేస్తారు. అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుని పరిష్కరిస్తారు. మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. నిమజ్జనానికి అవసరమైన రూట్మ్యాప్ను ముందుగానే పోలీస్ శాఖకు అందివ్వాలి. నిమజ్జనం కోసం భువనగిరి పెద్ద చెరువు, బీబీనగర్ చెరువు, యాదగిరిగుట్ట, గోధుమకుంట, చౌటుప్పల్ చెరువులతో పాటు స్థానిక చెరువుల వద్ద భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఫ మంజూరైనవి 1,764.. నిర్మాణం పూర్తయినవి12 ఫ వానాకాలానికి ముందే పూర్తిచేయాల్సి ఉండగా నీరుగారుతున్న లక్ష్యం ఫ గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ప్రణాళిక ఫ ప్రతి మండపానికి అనుమతి తప్పనిసరి ఫ రాత్రి పది గంటల లోపు మైక్లు కట్టేయాలి ఫ మండపాలను విజిట్ చేయనున్న పోలీసులు, పెట్రో మొబైల్ కానిస్టేబుళ్లు ఫ డీడీ చెల్లిస్తే మండపాలకు విద్యుత్పోల్ నుంచి కనెక్షన్ గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా ప్రజలు సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం. నిమజ్జనం చేసే ముందు పోలీసులకు సమాచారం ఇస్తే ఏర్పాట్లు చేస్తారు. – అక్షాంశ్ యాదవ్, డీసీపీ ప్రతి మండపానికి ఒక లైన్ ఇన్స్పెక్టర్, ఒక లైన్మన్తోపాటు ఇద్దరు ఆర్టిజన్ సిబ్బందిని బాధ్యులను చేశాం. ప్రతిరోజు విద్యుత్ అధికారులు మండపాన్ని సందర్శించాలి. డీడీ చెల్లిస్తే విద్యుత్పోల్ నుంచి కనెక్షన్ ఇస్తాం. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ట్రిప్ అయి ప్రమాదం జరగకుండా ఎంసీపీ ఏర్పాటు చేస్తాం. – సుధీర్కుమార్, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి గణేష్ ఉత్సవాలు, మిలాద్– ఉన్– నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మతపెద్దలు, మండపాల నిర్వాహకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఏఎస్పీ రాహుల్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, రెవెన్యూ డివిజనల్ అధికారి మాలి కృష్ణారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, ఏసీపీలు పటోళ్ల మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంకుడు గుంతలు మరిచారు!
ఆలేరురూరల్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల వృద్ధికి ప్రభుత్వం చొరవ చూపుతున్నా క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. వర్షాకాలానికి ముందే ఇంకుడు గుంతల తవ్వకాలు పూర్తి చేయాలని ఆదేశాలున్నా ఆచరణలో పెట్టడం లేదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 12 ఇంకుడు గుంతల నిర్మాణాలే పూర్తవడం అందుకు నిదర్శనం. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1,764 ఇంకుడు గుంతలు మంజూరు ఉపాధిహామీ పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 1,764 ఇంకుడు గుంతలు మంజూరయ్యాయి. ఇందులో కేవలం 12 గుంతలు మాత్రమే పూర్తి కాగా.. 87 ఇంకుడు గుంతలు పురోగతిలో ఉన్నాయి. మిగతావి పనులు మొదలుకాలేదు. ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.1.05 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటి వరకు రూ.74,400 ఖర్చు చేశారు. ఒక్కో ఇంకుడు గంతకు ప్రభుత్వం రూ.6,200 చెల్లిస్తుంది. వృథా అవుతున్న వర్షపు నీరు వర్షపు నీటిని భూమిలోనికి ఇంకించేందుకు అవసరమైన రీచార్జి ఫిట్స్ తగినన్ని లేకపోవడంతో భూగర్బ జలనిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7,39,448 జనాభా ఉండగా, చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,80,677 కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో 3,082 చదరపు కిలో మీటర్ల భౌగోళిక విస్తీర్ణం ఉండగా ఏటా 2,31,150 కోట్ల లీటర్ల వర్షం కురుస్తుంది. ఈ నీళ్లన్నీ భూమిలో దాచుకుంటే ఒక్కొక్కరికి రోజుకు 4000 లీటర్లు అందుబాటులో ఉంటాయి. ఇళ్ల పైకప్పులపై, ఆవరణలో కురిసే వర్షాన్ని నేలలోకి ఇంకింపజేస్తే నీటి కరువే ఉండదని నిపుణుల అభిప్రాయం. ఇంకుడు గుంతల నిర్మాణం ఇలా.. ఇంకుడు గుంత 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు 1.8 మీటర్ల లోతు ఉండాలి. అడుగు భాగంలో ఫీటున్నర మందం రాళ్లు, దానిపై ఫీటున్నర 40 ఎంఎం కంకర, వాటిపైన 3ీఫీట్ల రింగ్ అమర్చాలి. దానిపై మూత ఏర్పాటు చేసి ఐదు మీటర్ల పైపును బిగించాలి. ఇరుపక్కల 20ఎంఎం కంకర నింపాలి. వర్షం కురిసినప్పుడు ఇతర సమయంలో వృథాగా పోయే నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించాలి. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జల సంరక్షణ ఏవిధంగా సాధ్యమవుతుందో ప్రజలకు వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇస్తామని కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలి. గతంలో నిర్మించిన ఇంకుడు గుంతలు శుభ్రం చేయడంతో పాటు లేని ఇళ్లలో కొత్తవి నిర్మించి వాన నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధిహామీ పథకంలో జలసంరక్షణ పనులు చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఇళ్లలో ఇంకుడు గుంతలు, గొట్టపు బావుల చుట్టూ నీటిని రిచార్జి చేసే కందకాల నిర్మాణం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైనవారు పంచాయతీ కార్యదర్శులను సంప్రదించవచ్చు. – నాగిరెడ్డి. డీఆర్డీఓ ఇంకుడు గుంతల వివరాలు మంజూరైనవి : 1764పురోగతిలో ఉన్నవి : 287పూర్తయినవి : 12ఒక్కో ఇంకుడు గుంతకు చెల్లిస్తుంది : రూ.6,200జిల్లాలో గృహాలు : 1,59,745 -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
బొమ్మలరామారం: ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి జానీ అఫ్గాన్ అన్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం నిర్వహించిన మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్య సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీఎంవో లింగారెడ్డి, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, ఎంఈఓ రోజారాణి, పీఈటీ నర్సింహ పాల్గొన్నారు. -
వచ్చే నెలలో చేనేత రుణమాఫీ
భూదాన్పోచంపల్లి: లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే వచ్చే నెలలో చేనేత కార్మికుల ఖాతాల్లో చేనేత రుణమాఫీ డబ్బులు జమవుతాయని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. భూదాన్పోచంపల్లిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాస్టర్ వీవర్, నేషనల్ మెరిట్ అవార్డు గ్రహీత తడక రమేశ్ ఏర్పాటుచేసిన పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ షోరూంను వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్తో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చేనేత రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, కొన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల తీర్మానాలు పూర్తి కాలేదన్నారు. జిల్లాల వారీగా వచ్చిన బ్యాంకర్ల తీర్మానాలు రాష్ట్రస్థాయిలో పూర్తిచేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు. త్రిఫ్ట్ పథకంలో కొత్త పేర్లు మార్పులు, చేర్పులతో కాస్త ఆలస్యమైందని, జూన్ నెలకు సంబంధించి రూ.7 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెస్కో కొనుగోలు చేసిన పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కులో నెల రోజుల్లో నేచురల్ డై యూనిట్ను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. పర్యావరణహితమైన నేచురల్ డై విధానం అందుబాటులోకి వస్తే పోచంపల్లి ఇక్కత్కు మరింత గుర్తింపువస్తుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఐఐహెచ్టీని పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారని, శిథిలావస్థకు చేరిన హ్యాండ్లూమ్ పార్కును పునర్నిర్మించి వచ్చే రెండేళ్లలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇక్కడే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఐఐహెచ్టీని హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ తెలంగాణలోనే మొదటి పైలెట్ ప్రాజెక్ట్ అని అన్నారు. చేనేత వస్త్రోత్పత్తులు, ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడ్యూసర్ కంపెనీలను ప్రోత్సహిస్తోందని అన్నారు. షోరూమ్లో తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్, గద్వాల, సిద్దిపేట గొల్లభామ వస్త్రాలతో పాటు దేశంలో పేరెన్నికగన్న అనేక వస్త్రాల వైరెటీలను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా డూప్లికేట్ చేనేత వస్త్రాలను అరికట్టేందుకు తెలంగాణ అథెంటిక్ లోగోలను అందజేస్తుందని, ఈ లోగోలను అతికించడం ద్వారా చేనేత వస్త్రాల నాణ్యత, వినియోగదారులకు నమ్మకం పెరిగి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు. 62 మంది అవార్డు గ్రహీతలకు పింఛన్లు మంజూరు.. 65 సంవత్సరాలు దాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.8వేలు పింఛన్ ఇస్తున్నామని, ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి 62 మందికి పింఛన్ మంజూరైందని వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్ అన్నారు. అవార్డు గ్రహీతల పిల్లలు హ్యాండ్లూమ్కు సంబంధించి కోర్సులు అభ్యసిస్తే వారికి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు నెలకు రూ.5వేల స్కాలర్షిప్ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అంతేకాక 90శాతం సబ్సిడీతో ఎలక్ట్రానిక్ జకాట్ మిషన్లు, మగ్గాలు, ఆసు యంత్రాలు, హ్యాండ్లూమ్ ఎక్విప్మెంట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రంలో మరో 42 షోరూలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖతతో ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా 12మంది చేనేత కళాకారులను విదేశాలకు పంపించి అక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. కొత్తగా బున్కర్ దీదీ పథకం కింద మహిళా చేనేత కార్మికులకు ముద్ర రుణాలు ఇప్పించడంతో పాటు వారికి నూలు అందించడం, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. చేనేత కార్మికుల వార్షిక ఆదాయం రూ.10లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణను ఎంపిక చేయగా.. అందులో ఉమ్మడి జిల్లాను ఎంపిక చేశామని త్వరలో ఆ పథకాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. యునెస్కో చేత అంతర్జాతీయ అవార్డు పొందిన పోచంపల్లిలో ఉత్సవాలను నిర్వహించాలని, పోచంపల్లిలో నూలు డిపో ఏర్పాటు చేసి కేంద్రం ఇచ్చే సబ్సిడీని అమలు చేయాలని పోచంపల్లికి చెందిన చేనేత నాయకులు తడక వెంకటేశం తదితరులు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఉత్సవాల డీపీఆర్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్రావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ వెంకట్రెడ్డి, డీఓ రాజేశ్వర్రెడ్డి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
వరిలో కొత్త రకం కలుపు మొక్కలు
చిలుకూరు: ఈ ఏడాది వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేసిన రైతులకు కలుపు మొక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో వివిధ రకాల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. ఏ మందులు పిచికారీ చేసినా కలుపు మొక్కలు చనిపోయే పరిస్థితి లేదు. వరి విత్తనాలు వెదజల్లిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలో రైతులు ఒకసారి కలుపు మందులు పిచికారీ చేశారు. అయినా కలుపు మొక్కలు చనిపోలేదు. మరోసారి పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని రైతులు చెబుతున్నారు. గతంలో లేని విధంగా ఈసారి కొత్త రకం కలుపు మొక్కలు పుట్టుకొస్తున్నాయని రైతులు అంటున్నారు. కొత్త రకం కలుపుతో తంటాలు వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి పొలాలను ప్రారంభంలో ఆరబెట్టడం, నీళ్లు పెట్టడం చేయడం వలన సాధారణంగానే కలుపు మొక్కలు మొలకెత్తుతాయి. గతంలో తుంగ, వంజ, నక్కలతోకల గడ్డి, దారక లాంటి కలుపు మొక్కలు కనిపించగా.. మొదటి 20 రోజుల్లో మందులు పిచికారీ చేయడం వల్లన వాటిని నివారించేవారు. ఈ ఏడాది కొత్తగా నకిలి వరి, గోధుమ రంగులో వంజ, ఎర్ర, తెల్ల వంజలు మొలకెత్తాయని రైతులు వాపోతున్నారు. ఇవి ఏ మందులు కొట్టినా చనిపోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వంజ రకం కలుపు విపరీతంగా పెరిగి అసలు వరి పైరు కనబడటం లేదని రైతులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక చిలుకూరులో కొంతమంది రైతులు 30 నుంచి 35 రోజుల క్రితం వెదల్లే పద్ధతిలో సాగు చేసిన పొలాలను ట్రాక్టర్తో దున్ని మళ్లీ నాట్లు వేస్తున్నారు. దీని వల్లన రైతులు ఒక్కో ఎకరానికి రూ. 20వేలకు పైగా నష్ట్రపోతున్నారు. చిలుకూరు నుండి దూదియాతండా రోడ్డులో చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. చిలుకూరు మండల వ్యాప్తంగా 70 శాతం మంది రైతులు ఈ ఏడాడి వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేశారు. ఇప్పటికై నా వ్యవసాయాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాను. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మొదటి 20 రోజులకు కలుపు మందులు పిచికారీ చేశా. అయినా అవి చనిపోలేదు. మళ్లీ వెంటనే రెండోసారి కూడా కలుపు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు. పొలంలో విపరీతంగా కొత్త రకం వంజ పుట్టింది. పొలం మొత్తం కమ్మేసింది. ఏమి చేయాలో అర్ధంకాక పొలం మొత్తం మళ్లీ దమ్ము చేసి నాట్లు వేస్తున్నా. – గుండు శ్రీను, కౌలు రైతు, చిలుకూరు ఫ పొలం చెడగొట్టి మళ్లీ దమ్ము చేస్తున్న రైతులు ఫ వ్యవసాయాధికారులు సూచనలు ఇవ్వాలని కోరుతున్న అన్నదాతలు -
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
మోతె: బంధువు సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన యువకుడు గడ్డిమందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. వివరాలు.. మోతె మండలం విభళాపురం గ్రామానికి చెందిన నిమ్మల పెదలచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అందరికీ వివాహాలు చేశారు. నలుగురు కుమారులకు ఒక్కొక్కరికి ఆరెకరాల వ్యవసాయ భూమి, 3 గుంటల ఇంటి స్థలం పంచి ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు కుమారులు పట్టించుకోవడం లేదని పెదలచ్చయ్య, లచ్చమ్మ దంపతులు పలుమార్లు తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సోమవారం ఆ వృద్ధ దంపతులు తమ మనమడు నిమ్మల రాము(22)తో కలిసి సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వారి బంధువు నిమ్మల రాజశేఖర్ సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైన రాము మంగళవారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు నిమ్మల రాజశేఖర్, వృద్ధ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అజయ్కుమార్ తెలిపారు.