breaking news
Yadadri District News
-
ఇరాన్ సుప్రీం లీడర్ మృతికి సంతాపం
భువనగిరిటౌన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి సంతాప సూచికగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణంలోని షియా ముస్లింల మసీదు పై ఖమేనీ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పాటు, నల్ల జెండా సైతం ఎగురవేశారు. అవమానకరమైన జీవితం కంటే గౌరవంగా మరణించడం మేలు అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలునడిగూడెం : రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ గంధమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సూర్యాపేటకు చెందిన కొప్పుల వెంకటేశ్వర్లు తన కారుతో నడిగూడెం నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడేనికి వెళ్తున్నాడు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన బాణాల భిక్షం తన బైక్పై ఇంటికి వెళ్తుండగా కాగితరామచంద్రాపురంలో కారు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షంకు గాయాలయ్యాయి. బాధితుడు సూర్యాపేట ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల సమాచారంతో బుధవారం బాధితుడి వద్దకు వెళ్లి ప్రమాద వివరాలను తెలుసుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతికోదాడరూరల్ : పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండల పరిధిలోని బీక్యాతండాకు చెందిన బోడ రాజు(45) భార్య ఐదేళ్ల కిందట మృతి చెందింది. కుమార్తెకు మూడేళ్ల కిందట వివాహమైంది. దీంతో ఒంటరిగా ఉంటున్న రాజు మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి కలిగి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలుమునుగోడు: ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలైన సంఘటన మునుగోడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు పట్టణంలోని లక్ష్మిదేవిగూడేనికి చెందిన కొంపల్లి నర్సింహ ఆదివారం రోజు మాదిరిగా చండూరు రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాయితో దాడి.. ఒకరికి గాయాలునడిగూడెం : తన కుటుంబ సభ్యులను తిట్టాడనే కారణంతో ఓ వ్యక్తిపై రాయితో దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గంధమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగితరామచంద్రాపురం గ్రామానికి చెందిన షేక్ షరీఫ్, అదే గ్రామానికి చెందిన షేక్ కరీమ్ కుటుంబ సభ్యులను అసభ్యకరంగా తిట్టాడనే కారణంగా షరీఫ్పై కరీమ్ రాయితో దాడి చేశాడు. దీంతో షరీఫ్ తలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కడసారి చూపు కోసం వస్తూ.. కానరాని లోకాలకు
మునగాల, అనంతగిరి: అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం మునగాల మండలంలోని ఆకుపాముల శివారులో భగత్సింగ్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం మొగలాయికోట గ్రామానికి చెందిన కిన్నెర పుల్లయ్య అనారోగ్యానికి గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన ఆయన సమీప బంధువులు కిన్నెర దావీదు(26), కొండ్రు వంశీ(28) ఇద్దరూ ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటుండగా బుధవారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తన స్నేహితులైన మార్కు బుడిరాజ్కుమార్, పెద్దపండు వెంకట్తో కలిసి మొగలాయి కోట గ్రామానికి కారులో బయలుదేరారు. అతివేగం కారణంగా కారు మునగాల మండలంలోని ఆకుపాముల శివారులో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కిన్నెర దావీదు, కొండ్రు వంశీ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రాజ్కుమార్, పెద్దపండు వెంకట్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదం జరిగిన కారులో ఇరుక్కుపోయిన ఈ నలుగురిని వెలికి తీసేందుకు స్థానికుల సాయంతో పోలీసులు సుమారు రెండు గంటల పాటు శ్రమించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. వంశీ (ఫైల్) దావీదు (ఫైల్) మొగలాయికోటలో విషాదం మృతులు దావీద్, వంశీ ఇద్దరూ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. దావీదు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా అక్క ఉన్నది. ఆమెకు సుమారు 9 నెలల క్రితం వివాహం జరిపించాడు. దావీదు అకాల మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా.. వంశీకి తల్లితో పాటు అక్క ఉండగా ఆమెకు సుమారు 8 నెలల క్రితం విహహం చేశాారు. తల్లిని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వంశీ మృతిచెందడంతో తల్లి ఒంటరిగా మిగిలింది. ఇద్దరి యువకులు మృతిచెందడంతో మొగలాయికోట గ్రామంలో విషాదం చాయలు అలుముకున్నాయి. మృతులను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలకు మొగలాయికోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అదుపుతప్పి కారు బోల్తా ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
కర్ల రాజేష్ మృతిపై విచారణలో జాప్యం
నల్లగొండ టౌన్: కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి డీఎస్పీ రవిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒత్తిడి మేరకే రీ పోస్టుమార్టం నిర్వహించారన్నారు. దాని రిపోర్టు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నెల 8లోగా విచారణ పూర్తి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని, విచారణ ఆలస్యం చేస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, మేడి శంకర్, సునిల్, తరి ఏడుకొండలు, గోపాల్, కమలమ్మ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
బుద్ధవనంలో బోధి మొక్క నాటిన బౌద్ధ భిక్షువులు
నాగార్జునసాగర్ : దమ్మయాత్రలో పాల్గొన్న థాయిలాండ్ బౌద్ధభిక్షువులు బుధవారం బుద్ధవనంలో బోధి (రావి) మొక్క నాటారు. దమ్మయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా థాయిలాండ్ ప్రధాన బౌద్ధభిక్షవు సంఘ సక్ కోవిడో (అజాన్తున్) ఆధ్వర్యంలో స్థూప వనంలోని థాయిలాండ్ స్థూపం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. దమ్మయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావును బౌద్ధభిక్షవులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, సీనియర్ అసిస్టెంట్ రాంకుమార్, బుద్ధవనం ప్రాజెక్టు సిబ్బంది నర్సింహారావు, ప్రజ్ఞానంద్, గగన్మాలిక్ ఫౌండేషన్ మేనేజర్ వికాస్టైడే తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ కాల్వలో కొనసాగుతున్న గాలింపు
హాలియా : హాలియా వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో మంగళవారం గల్లంతైన పెద్దవూర మండలంలోని సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, హాలియా పోలీసులు సాగర్ ఎడమ కాల్వ తూములు, త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు గాలింపు చర్యలు కొనసాగించారు. హాలియా పోలీస్స్టేషన్లో నమోదైన అయిన ఇద్దరి బాలుర మిస్సింగ్ కేసు నేపథ్యంలో బుధవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. కేసు విచారణను వేగవంతం చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ ఉన్నారు. -
నిప్పులగుండంలో పడిపోయిన భక్తులు
కేతేపల్లి: వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వరస్వామి జాతర సందర్భంగా కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన ఏడుగురు భక్తులు అగ్నిగుండంలో పడి తీవ్ర గాయాలపాలయ్యారు. భీమారం గ్రామం సమీపంలోనే ఉన్న ఆమనగల్లు గ్రామంలో జరుగుతున్న జాతరకు గ్రామం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. బుధవారం తెల్లవారుజామున స్వామివారి పల్లకీని నిప్పుల గుండం దాటించే క్రమంలో.. భీమారం గ్రామానికి చెందిన సామగాని నాగరాజు, నాయకం గంగమ్మ, ఏర్పుల సంధ్య, దూబని విజయ, కొరివి సంధ్య, మేకల మత్తమ్మ, మేకల పుష్ప నిప్పుల గుండంలో పడి తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా ఆమనగల్లు గ్రామానికి చెందిన ఉత్తెర్ల కృష్ణయ్య, మారిపెద్ది సాయి, వట్టె మానసలతోపాటు దోసపాడుకు చెందిన సింగం వినోద, మిర్యాలగూడకు చెందిన మేడబోయిన సైదమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు, మాడ్గులపల్లి ఎస్ఐ కృష్ణయ్య సిబ్బందితో అప్రమత్తమై అందరిని బయటకు లాగారు. భీమారం గ్రామానికి చెందిన ఏడుగురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆర్డీఓ అశోక్రెడ్డి, తహసీల్దార్ రమాదేవి క్షతగాత్రుల వివరాలు సేకరించారు. అనంతరం క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నాగరాజు, గంగమ్మ, సంధ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు రిఫర్ చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాద్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కేతేపల్లి మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్యాదవ్, నకిరేకల్ ఏఎంసీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, భీమారం సర్పంచ్ పద్మవెంకన్న క్షతగాత్రులను పరామర్శించారు. అమనగల్లు ఘటనలో భీమారం గ్రామానికి చెందిన ఏడుగురికి గాయాలు -
దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు
పెద్దవూర : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నగూడెం గ్రామ సమీపంలో ఉన్న ప్రతాపగిరి లక్ష్మీనర్సింహాస్వామి (గుండ్లకాడి) కల్యాణ మహోత్సవానికి జస్టిస్ రాజశేఖర్రెడ్డి దంపతులు హాజరయ్యారు. స్వామివారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త, ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం సమీప గ్రామాల ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్రెడ్డి–కళ్యాణి దంపతులను దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్ సన్మానించారు. ఉత్సవాల్లో ఆలయ చైర్మన్ యడవెల్లి మనోహర్రెడ్డి, ఆలయ పూజారులు కందాళ అజయ్కుమార్, లోకాచార్యులు, విజయ్కుమార్, సర్పంచ్ పోశం రమణమ్మకోటిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి -
ఎరువుల సమతుల్యత.. పంటల భద్రత
త్రిపురారం : వివిధ రకాల పంటల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు కీలకమని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొంటున్నారు. ఎరువుల యాజయాన్యం పద్ధతులు ఆయన మాటల్లోనే.. నత్రజని: పంటలపై పురుగులు దాడి చేసి నష్టం కలిగించడానికి.. నత్రజని వాడకానికి ముడిపడి ఉంటుంది. నత్రజని వాడకం పెంచడంతో మొక్కలు ఏపుగా పెరిగి శాఖీయోత్పత్తి బాగా జరిగి ఆకులు, కాండాలు, బిరుసుతనం కోల్పోయి మెత్తగా తయారై పురుగులు అనువుగా తయారవుతాయి. పంటలపై జరిగిన పరిశోధనల్లో సిఫారసు చేయబడిన మోతాదుకు మించి నత్రజని వాడకం వలన పురుగుల బెడద ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నత్రజని నెమ్మదిగా వినియోగంలోకి రావడానికి యూరియాను వేపపిండితో కలిపి లేదా నిమిన్ వంటి వేప సంబంధిత వాటితో కలిపి వాడుకోవచ్చు. భాస్వరం: మొక్కలు భాస్వరాన్ని లవణాల రూపంలో తీసుకుంటాయి. పూలు, విత్తనాలు దుంపలు తదితర ప్రాముఖ్యత గల పంటల్లో విత్తనపు భాగాల్లో ఈ పోషకం అవసరం ఎక్కువగా ఉంటుంది. భూమిలో సేంద్రియ ఎరువులు ఎక్కువగా కుళ్లేందుకు ఉపయోగపడుతుంది. పంట త్వరగా పక్వానికి వస్తుంది. కణ విభజన, పైరు అభివృద్ధి, మొక్క త్వరగా నిలదొక్కుకోవడం, మొక్కలో మాంసకృత్తులు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది. భాస్వరం తగినంత ఉంటే నత్రజని ఎక్కువైన పైర్లకు కలిగే దుష్ఫలితాలను కొంతమేరకు అరికడుతుంది. మొక్కలకు అవసరమయ్యే కిరణజన్య సంయోగక క్రియ జరగడానికి కీలకపాత్ర పోషిస్తుంది. పొటాష్ : చీడపీడల యాజమాన్యంలో పొటాష్ పాత్ర అత్యంత కీలకం. పంటలకు తగినంత పొటాష్ అందించినప్పుడు మొక్కల్లో కొన్ని రకాల ఫినాలిక్ కాంపౌండ్స్ తయారై రక్షణగా ఉంటాయి. కణకవచం గట్టిగా తయారై దండెత్తే పురుగులకు అడ్డుగోడగా నిలుస్తుంది. వరి పైరులో చీడపీడలపై అధిక ప్రభావం చూపి సమర్ధంగా అరికడుతుంది. బాక్టీరియా, బూజు సంబంధిత తెగుళ్లను 70 శాతానికి పైగా అరికడుతుంది. పురుగులు, మైట్స్ దాడి నుంచి 60 శాతానికి పైగా రక్షణగా నిలుస్తుంది. చెరుకు పంటకు తగినంత పొటాష్ వేసినప్పుడు పొలుసు పురుగు, పత్తిలో ముక్కు పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. టమాటా, మిరప, వంకాయ, బంగాళాదుంప వంటి కూరగాయల పంటలకు శాస్త్రవేత్తల సూచనల మేరకు పొటాష్ అందిస్తే పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది.జీవ ఎరువుతో ఉపయోగాలు జీవ ఎరువుల్లో బాసిల్లాస్, సూడోమోనాస్ వంటి సూక్ష జీవులు ఆస్పర్జిల్లడ్, పెన్సిలియం వంటి శీలింద్రాలు భూమిలో కరగని రూపంలో భాస్వరాన్ని కరిగించి మొక్కల లభ్యతను పెంచుతాయి. సిఫారసు చేసిన భాస్వరం మోతాదును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వరకు తగ్గించుకోవచ్చు. మట్టి నమూనాల్లో భాస్వరం విలువ 20 కంటే తక్కువ గల భూములుగా 21 నుంచి 50 వరకు మధ్య భూములుగా పరిగణించబడతాయి. -
చట్టాలపై సర్పంచ్లు అవగాహన పెంచుకోవాలి
భూదాన్పోచంపల్లి: పంచాయతీరాజ్ చట్టాలపై సర్పంచ్లు పూర్తిగా అవగాహన పెంచుకొని పరిపాలనపై పట్టు సాధించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. బుధవారం భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాలుగవ విడతగా చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, బీబీనగర్ మండలాలకు చెందిన నూతన సర్పంచ్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాలలో మౌలిక వసతులకు కల్పనకు ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్రెడ్డి, రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్కుమార్, ఎం.డీ మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ పాల్గొన్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణ వేడుకయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో శ్రీస్వామి వారికి పూజలను ప్రారంభించారు. తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, సహస్రనామార్చన పూజలను చేపట్టారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అర్చకులు విశేషంగా చేపట్టారు. ఇక సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శయనోత్సవంతో ఆలయాన్ని ద్వారా బంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహిస్తాంనల్లగొండ టౌన్ : పాలు, పాల ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తనిఖీలు చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రభాకర్, ఎన్.శివశంకర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025లో ఉమ్మడి జిల్లాలో 24 చోట్ల పాల నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించామని.. అందులో పాలలో నీరు కలపడం, ఫ్యాట్ శాతం నిర్ణయించిన శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. వినియోగదారుల ఆరోగ్యం కాపాడేలా కృషి చేస్తున్నామని తెలిపారు. బీఓఎస్ సభ్యుల నియామకంనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ నూతన సభ్యులను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆధ్వర్యంలో సిలబస్ కూర్పు, పరీక్షల నిర్వహణ విధానం మూల్యాంకనం, వంటి అంశాలను చర్చించి ఆయన ఆమోదించారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) మెంబర్లుగా అలువాల రవి, జక్క సురేష్ రెడ్డి, శ్వేత, వి.అనురాధ, మెంబర్ కన్వీనర్గా లక్ష్మీప్రభ, ఇతర సభ్యులుగా వాస్తవ అపర్ణ, ఏదుళ్ల శ్రీధర్రెడ్డిని నియమించారు. వీరి నియామకం రెండేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
ఎడ్ల బండిపై రామలింగేశ్వర స్వామి ఊరేగింపు
మోత్కూరు : మోత్కూరు పట్టణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రామలింగేశ్వర స్వామి దంపతులను ఊరేగించారు. ఎడ్ల బండిని పూల మాలలతో అలంకరించి గరుత్మంతుడి వాహనంపై రామలింగేశ్వర స్వామి దంపతులను నిల్చోబెట్టి ఊరేగింపును మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్నసోమనర్సయ్య ప్రారంభించారు. మోత్కూరు పట్టణంలోని చెరువు కట్ట, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పోతాయిగడ్డ, పద్మశాలి కాలనీ, డ్రైవర్స్ కాలనీ, వడ్డెర కాలనీ, సుందరయ్య కాలనీ, అంగడి బజార్ తదితర కాలనీలలో స్వామి, అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, దేవాలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్రు, ప్రతినిధులు బుర్ర యాదయ్య, బయ్యని రాజు, ఉయ్యాల అంజయ్య, బుర్ర కృష్ణ, గుండు శ్రీను, మందుల సురేష్, బుర్ర నర్సయ్య, జెనిగల భిక్షం, జెనిగల శ్రీను, బిళ్లపాటి మహేందర్రెడ్డి, వెంకన్న, శేఖరాచారి, పోచం అంజయ్య, బందెల రవి పాల్గొన్నారు. -
అడుగంటుతున్న జలాలు.. ఎండుతున్న పొలాలు
గుండాల: గుండాల మండలంలో రైతులు సాగు చేసిన వరి పొలాలు నీరందక ఎండి పోతున్నాయి. రోజురోజుకూ ముదురుతున్న ఎండలకు బావులు, బోర్లలో నీటి ఊట తగ్గి రైతులు వేసిన వరి పొలాలు ఎండి పోతున్నాయి. బిక్కేరు వాగులలో ఇసుకను యథేచ్ఛగా తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఊట తగ్గి బావులు, బోర్లు ఒట్టి పోతున్నట్లు రైతులు వాపోతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వరి సాగు చేస్తే నీరందక కళ్లెదుటే ఎండి పోతుండటంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. తుర్కలశాపురంలో ఎండిన వరి పొలం -
ఒకేసారి మూడు నెలల బియ్యం
భువనగిరి: మళ్లీ మూడు నెలల రేషన్ బియ్యం ముందస్తుగానే అందనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా బియ్యాన్ని ఒకే సారి ఏప్రిల్లో పంపిణీ చేయనున్నారు. వచ్చే వేసవి కాలం దృష్ట్యా మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పంపిణీని ఈమేరకు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించి నెలాఖరు వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. మూడు నెలలకు సంబంధించి అవరసరమైన 14,883 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాకు కేటాయించే అవకాశం ఉంది. ఈ బియాన్ని స్టాట్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు తరలించనున్నారు. 515 రేషన్ దుకాణాలు జిల్లాలో ప్రస్తుతం మొత్తం 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 2,47,757 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,688 అంత్యోదయ కార్డులకు 381479 యూనిట్లు, 2,34,069 ఆహారభద్రత కార్డులకు 6,92,142 యూనిట్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా సుమారు 4,961 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటాయి. ఇలా మూడు నెలలకు కలిపి సుమారు 14,883 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించనున్నారు. కారణాలు ఇవే.. గత ఏడాది వర్షాకాంలో వరదల ముప్పు, ప్రకృతి విపత్తులను దృష్టి ఉంచుకుని తిండి గింజల నిల్వ రవాణాలో అంతరాయం తలెత్తే అవకాశం ఉండటం వంటి కారణాలతో గతంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటా ఒకే సారి పంపిణీ చేశారు. ఈ సారి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణం శాఖ వేసిన అంచనాను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సమస్యలు పునరావృతం కాకుండా.. గత ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఒకే సారి బియ్యం ఇవ్వడంతో లబ్ధిదారులు, రేషన్ డీలర్లు ఇబ్బందులు పడ్డారు. మూడు నెలల బియ్యం ఒకే సారి పంపిణీ చేయడం ద్వారా రవాణా చార్జీల ఖర్చు తగ్గడంతో పాటు హమాలీలు, డీలర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. కానీ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేక డీలర్లకు సమస్యగా మారింది. ఆ తర్వాత విడతల వారీగా డీలర్లు బియ్యం తీసుకుపోయే అవకాశం కల్పించినా ఇబ్బందులు తప్పలేదు. ఇక మూడు నెలల బియ్యం తీసుకోవాలంటే ఒక కార్డు దారుడు మూడు సార్లు వేలి ముద్ర వేయాలి. ఈ క్రమంలో గతంలో సిగ్నల్తో పాటు సర్వర్ సమస్య, మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో ఒక్కో కార్డు దారుడికి సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయ పట్టింది. దీంతో లబ్ధిదారులకు రేషన్ దుకాణాల వద్ద నిరీక్షణతప్పలేదు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఎక్కడికి తరలించాలి అనే సమస్య అధికారులకు ఎదురుకానుంది. మూడు నెలలకు సంబంధించి ఒకే సారి బియ్యం ఇవ్వడం పై మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఒక వేళ ఆదేశాలు వస్తే అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – హరికృష్ణ, పౌరసరఫరాల సంస్థ మేజేజర్ఫ ఏప్రిల్, మే, జూన్ కోటా రేషన్ ఏప్రిల్1 నుంచి పంపిణీ ఫ రేషన్ షాపులకు తరలనున్న 14,883 మెట్రిక్ టన్నుల బియ్యం ఫ ప్రస్తుతం గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఫ వీటిని ఖాళీ చేయడానికి సమయం పట్టే అవకాశం -
ప్రజల జీవితాలు హరివిల్లుగా మారాలి
బొమ్మలరామారం: ప్రజల జీవితాలు హరివిల్లుగా మారాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బొమ్మలరామారం మండలంలోని గోవింద్ తండాలో బుధవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి రంగులు చల్లుతూ ,సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు. గిరిజనుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంపొందించేలా పనిచేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. బుధవారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్ని విభాగాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది, ఇన్పెషెంట్, అవుట్పెషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు హెల్త్ ప్రొఫైల్ చెక్ చేయాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి భవనం పై కొనసాగుతున్న అదనపు భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి బాలసదనంలోని విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. భువనగిరి పట్టణంలోని మీనానగర్లో ఉన్న బాలసదన్ను తనిఖీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ రాంలింగం, తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, ఆర్బీ కో ఆర్డినేటర్ అనంతలక్ష్మి, యశోద సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి భువనగిరిటౌన్ : ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు నిర్వహించే ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికకు సంబంధించి యాక్షన్ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదికలు తయారు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
భువనగిరిటౌన్ : రంజాన్ పండుగను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ తో కలిసి నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రంజాన్ పండుగను సోదరభావంతో శాంతి భద్రతలకు భంగం కలగకుండా జరుపుకోవాలన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ అధికారులు పండుగ రోజుల్లో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మైనారిటీ సంక్షేమ అధికారిణి జయమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, సంబంధిత శాఖల అధికారులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
ఫ వేపను ఆశించిన డైబ్యాక్ తెగులు ఫ నిలువునా ఎండిపోతున్న చెట్లు ఫ పండుగకు వేప పూత కరువే
వేప చెట్టు పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఉదయం లేవగానే వేప పుల్లతో పళ్లు తోమ్ముకోవడం మాకు అలవాటు. అలాంటి వేప చెట్లు వింత రోగం వల్ల నశిస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. రోడ్డ పక్కన, పొలాల వద్ద ఉన్న వేపచెట్లు ఎండిపోతున్నాయి. ఈనెల 19న ఉగాది పచ్చడికి వేప పూత కరువవుతుంది. శాసీ్త్రయ పరిశోధన చేసి వేప చెట్లను కాపాడాలి. – నారబోయిన వెంకటేశం, అడ్డగూడూరుఅడ్డగూడూరు: తెలుగు సంవత్సరాది పండుగ వచ్చిందంటే ముందుకుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. మామిడి, చింతపండు, వేపపూత, కారం, ఉప్పు, బెల్లం వేసి పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాదీ స్వీకరిస్తారు. ఇందులో ఉండే తీపి, చేతు, వగరు, పులుపు, ఉప్పు, కారం ఈ షడ్రుచులు అనేవి జీవితంలో అన్ని అనుభవాలకు ప్రతీక. ఇలా ఎంతో ప్రధాన్యం కలిగిన పచ్చడి తయారీలో అవసరమైన వేపపూత ఈ సారి దొరకని పరిస్థితి నెలకొంది. వేప చెట్లకు డైబ్యాక్ తెగులు సోకి నిలువుగా ఎండిపోయాయి. ఉగాది పండుగ వేళ వేప పూతతో పచ్చగా కలకలలాడాల్సిన వేప చెట్ల మోడువారి దర్శనమిస్తున్నాయి. ఉనికి కోల్పోతున్న ఆరోగ్య ప్రదాయిని గ్రామీణ జీవనంలో వేప చెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం వృక్షం మాత్రమే కాదు.. ప్రకృతి ప్రసాధించిన అద్భుత ఔషధ గని. పల్లెల్లోని రైతులు, ప్రజలు తెల్లవారు జామున వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి పళ్లు తోముకునే వేపపుల్ల మొదలుకొని ఒంటి నొప్పులు ,చర్మవ్యాధులను సయంచేసే ఆకుల వరకు ఇలా వేప ప్రతిభాగం మానవారోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తోంది. గాలిని శుద్ధి చేస్తూ చల్లని నీడను ఇస్తూ ప్రతి ఇంటిముందు ఒక వైద్యుడిలా కొలువై ఉండే వేపచెట్టు నేడు తన ఉనికిని కాపాడుకోవడానికిపోరాడుతోంది. మొదట ఆకులు రాలి.. ఎప్పుడు ఆరోగ్యంగా కనిపించే వేపచెట్లు నిలువునా ఎండిపోవడానికి డైబ్యాక్ అనే తెగులు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వ్యాధి శీతాకాలం నుంచి ఎండకాలం మారే సమయంలో సోకుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధికి ప్రధాన కారణం ‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ అనే శిలీంధ్రం కారణమని అంటున్నారు. కొమ్మల చివరి నుంచి ఆకులు రాలిపోయి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. పచ్చని ఆకులు కాస్తా నల్లగా మారి నిర్జీవమవుతున్నాయి. వ్యాధి తీవ్రమైతే చెట్టుమొత్తం ఎండిపోయి చనిపోతుందంటున్నారు. ఈ వ్యాధి గాలి వల్ల వ్యాప్తిస్తుండి కాబట్టి పక్కన ఉన్న చెట్లకు కూడా సులువుగా అంటుకుంటుంది. అందువల్లే రహదారుల పక్కన వరుసగా ఉన్న చెట్లకు సోకి ఎండిపోతున్నాయని వారు అంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం కనిపించిన ఈ వ్యాధి ఆ తరువాత కొంత తగ్గుముఖం పట్టింది. మూడునాలుగు నెలలుగా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా మోడువారిన వేప చెట్లే దర్శన మిస్తున్నాయి. ఈ వింత వ్యాధి కారణంగా ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. వేప చెట్లకు సోకిన వ్యాఽధికి తగిన నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వేప పువ్వు లేకుండా.. ఈనెల 19వ తేదీన ఉగాది పండుగ ఉంది. ఆ రోజు ఉగాది పచ్చడి తయారీకి అవసరమైన మామిడి కాయలు, చింతపండు,బెల్లం, ఉప్పు, కారం అందుబాటులో ఉన్నాయి. కానీ వేప పువ్వు లేదు. ఈ సారి వేప పువ్వు లేకుండానే పచ్చడి తయారు చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో సైబర్ నేరగాళ్లు
● కోదాడ నియోజకవర్గ పరిధిలో 162 మందిని గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు ● 30 మందిని అదుపులోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లు సీజ్ ● రిమాండ్కు తరలింపుచిలుకూరు : ఆన్లైన్లో గేమ్ల పేరిట లక్షల రూపాయాలు చెలామణి చేస్తున్న పలువురు సైబర్ నేరగాళ్లను సోమవారం సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కోదాడ, హుజూర్నగర్ నియోజవకర్గ పరిధిలో సుమారు 162 మంది ఉన్నట్లు గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు వారిలో 30 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు, తెల్లబెల్లి, పాలారం, లక్ష్మీపురం, వల్లాపురం, ఆకుపాముల తదితర గ్రామాల నుంచి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడంతో పాటు రిమాండ్కు కూడా పంపినట్లు సమాచారం. అయితే తమ వాళ్లను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు లక్షల రూపాయాలు చెలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారని, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి సెల్ఫోన్లు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. స్థానిక పోలీసుల కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. వీరిలో చాలా మంది అధికార పార్టీ నాయకులు ఉన్నట్లుగా తెలిసింది. -
గంజాయి పట్టివేత
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు గంజాయి పట్టుకున్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపురం గ్రామంలోని పీర్ల గుట్ట, ప్రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో కొంతమంది వ్యక్తులు ఆదివారం రాత్రి గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి గంజాయిని సేవిస్తున్న వ్యక్తులు గంజాయి ప్యాకెట్లు, బైక్లను అక్కడే వదిలి పారిపోయారు. 60 గ్రాముల గంజాయి, రెండు బైక్లను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి తెలిపారు. పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
హయత్నగర్ : నష్టాల్లో ఉన్న నల్లగొండ–రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం(నార్ముల్– మదర్ డెయిరీ)కి పూర్వ వైభవం తీసుకొస్తామని, రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని మదర్ డెయిరీ కార్యాలయంలో ఆయన డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మదర్ డెయిరీలో నెలకొన్న సరిస్థితులను, పదేళ్లుగా వస్తున్న నష్టాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించామని, సమస్యల పరిష్కారానికి తగిన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మదర్ డెయిరీ మాక్స్ చట్టం పరిధిలో ఉన్నందున ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేమని, ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు)తో ఒప్పందం కుదిర్చేందుకు కృషిచేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, నార్ముల్ ప్రతినిధి సామ మహిపాల్రెడ్డితో కూడిన బృందం ఎన్డీడీబీ ప్రతినిధులతో చర్చించినట్లు వెల్లడించారు. రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు తక్షణ సహాయంగా రూ.10 కోట్లు ఇచ్చేందుకు ఎన్డీడీబీ అంగీకరించిందన్నారు. పాల సేకరణను మదర్ డెయిరీ పాలకవర్గం చూసుకోవాలని, ఉత్పత్తుల విక్రయాలు, మార్కెటింగ్ ఎన్డీడీబీ చూసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. మదర్ డెయిరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ మధుసూదన్రెడ్డి -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
మిర్యాలగూడ టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తి యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగపాడు గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ (36) ఆదివారం రాత్రి బైక్పై గ్రామంలోని కిరాణ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ.. జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై యూట ర్న్ తీసుకుంటుండగా త్రిపురారం నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదన్కు తీవ్ర గాయాలు కాగా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి భార్య పగడాల సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● 5 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి వస్తువుల అపహరణ గరిడేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. ఈ ఘటన గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో జరిగింది. వివరాలు.. అప్పన్నపేట గ్రామానికి చెందిన బత్తిని సైదమ్మ నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. వస్తువులు, చీరలు చిందరవందరగా పడేసి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఐదు తులాల బంగారం, 35 తులాల వెండి వస్తువులు, రూ.1,30,000 నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్, ఏఎస్ఐ జగన్మోహన్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలను సేకరించారు. -
ట్రాక్టర్ చోరీ చేసిన నిందితుల అరెస్టు
పెద్దవూర: ట్రాక్టర్ చోరీ చేసిన నిందితులను పెద్దవూర పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర ఎస్ఐ వై. ప్రసాద్తో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన దున్న శ్రీను గత రెండేళ్ల నుంచి పెద్దవూర మండలం పోతునూరు గ్రామ శివారులో దొడ్డి నర్సింహారావు పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత నెల 12న దున్న శ్రీను ట్రాక్టర్తో పొలం దున్ని దానిని అక్కడే వదిలి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో పెద్దవూర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం పెద్దవూర ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి మండలంలోని పొట్టిచెల్మ వై జంక్షన్ సమ్మక్క–సారలమ్మ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుముల గ్రామానికి చెందిన మంద శంకర్, కావేటి భరత్ ట్రాక్టర్పై హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ఆపారు. ట్రాక్టర్కు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరగా అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పోతునూరు సమీపంలో పొలంలో ఉన్న ట్రాక్టర్ను చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి ట్రాక్టర్, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను నిడమనూరు కోర్టులో రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. -
బాల్య వివాహం నిలిపివేత
కేతేపల్లి : కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన బాలికకు బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికా రులు సోమవారం బాలిక ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి పనులు జరుగుతుండటంతో అధికా రులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చా రు. బాల్య వివాహం చేయడం నేరమని, అవగాహన కల్పించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అంగీకరించి రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన వారిలో తహసీల్దార్ రమాదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ కళావతి, అశ్రిత, లక్ష్మణ్, శోభారాణి ఉన్నారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్నకిరేకల్ : నకిరేకల్ పట్ట ణంలో ఆదివారం రాత్రి సంతకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న నకిరేకల్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ యువకుల సహాయంతో సదరు వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం ప్రైవేట్ వాహనంలో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్తో పాన్షాపు దగ్ధంసూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజేత పాన్షాపులో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగామంటలు, పొగ రావడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలా నికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే పాన్షాపులోని సామాను కాలిబూడిదైంది. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రి, ఫర్నీచర్, రూ.35వేల నగదు దగ్ధమైనట్లు షాపు యజమాని తెలిపాడు. -
మరణంలోనూ వీడని స్నేహం
శాలిగౌరారం : చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గుడిసె సైదులు, సరోజన దంపతులకు కుమార్తె, కుమారుడు రవి(20) ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. సైదులు నిమ్మ తోటలు కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సైదులు అనారోగ్యానికి గురికావడంతో భార్య సరోజన, కొడుకు రవి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన నిమ్మ తోట కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం కౌలు పూర్తి కావడంతో ఇటీవలే ఊట్కూరు గ్రామానికి వచ్చారు. 7వ తరగతి నుంచి క్లాస్మేట్స్ సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల వంశీ(20) అమ్మమ్మ ఊరు ఊట్కూరు పక్కనే ఉన్న బండమీదిగూడెం. దీంతో వంశీ 7వ తరగతి నుంచి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఊట్కూరు జెడ్పీహెచ్ఎస్లో రవితో కలిసి చదివాడు. ఇంటర్మీడియట్ కూడా రవి, వంశీ కలిసే చదివారు. ఇద్దరూ ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. దీంతో రవి తల్లిదండ్రులతో కలిసి నిమ్మ తోటలు కౌలు చేస్తుండగా, వంశీ హైదరాబాద్లో ఉంటున్నాడు.సప్లమెంటరీ పరీక్షల కోసం వచ్చి..హైదరాబాద్లో ఉంటున్న వంశీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు రెండు రోజుల క్రితం డి. కొత్తపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం వంశీ బైక్పై ఊట్కూరుకు వచ్చి రవిని వెంట తీసుకుని నల్లగొండలో పరీక్ష రాసేందుకు బయల్దేరాడు. మార్గమధ్యలో నల్ల గొండ మండలం చందనపల్లి వద్ద స్కూల్ బస్సును ఢీకొని ఇద్దరూ మృతిచెందారు. సోమవారం రాత్రి ఊట్కూరులో రవి అంత్యక్రియలు జరిగాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో రవి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో ఊట్కూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం శాలిగౌరారం మండలం ఊట్కూరులో విషాదఛాయలు -
చికిత్స పొందుతూ మృతి
చందంపేట : ఓ వ్యక్తితో ఘర్షణలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలు.. నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన కేతావత్ లచ్చు(30) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కూలీ పనితో పాటు ఊళ్లో చిన్న కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన కేతావత్ శ్రీకాంత్తో లచ్చుకు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కర్రతో దాడి చేయగా లచ్చు, అతడి భార్య అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లచ్చును నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఈ ఘటనతో జోడుబాయితండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ బీసన్న ఆధ్వర్యంలో చందంపేట ఎస్ఐ లోకేష్, డిండి ఎస్ఐ బాలకృష్ణ, నేరెడుగొమ్ము ఎస్ఐ నాగేంద్రబాబు, నాంపల్లి, మర్రిగూడ ఎస్ఐలు, దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి బందోబస్తు చేపట్టారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలుశిక్ష ● మరో నలుగురికి జరిమానా సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. వారిలో ఒకరికి రెండు రోజుల జైలుశిక్ష,, రూ.2300 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4 వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం అర్చకులు చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబందనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని జరిపారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా, క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. -
బ్యాంకులో దోపిడీకి యత్నం
చౌటుప్పల్ : మండల పరిధిలోని ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి యత్నించారు. గ్యాస్ కట్టర్తో బ్యాంకు షట్టర్ను కట్ చేస్తుండగా అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంబావి(పాత కొయ్యలగూడెం) గ్రామంలో హైదరాబాద్–విజయవాడ హైవే సర్వీసు రోడ్డులో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వైపు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి బైక్పై వచ్చారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు కూడా బ్యాంకు వైపు వచ్చారు. ఈ దృశ్యాలు రోడ్డు వెంట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేసి.. అయితే బ్యాంకు వద్దకు మాత్రం ఒకే వ్యక్తి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేశాడు. మిగతా వారు రెక్కీ నిర్వహిస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం బ్యాంకు ప్రధాన ద్వారం వద్ద ఇనుప గ్రిల్ తాళం పగులగొట్టాడు. అనంతరం షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేస్తుండగా.. ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో చుట్టుపక్కల నివాసముండేవారు ఇళ్ల నుంచి బయటకు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బ్యాంకు వద్దకు చేరుకుని.. దుండగులు దోపిడీకి యత్నించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ సందర్శించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. అయితే ఈ దోపిడీకి యత్నించింది ఎంత మంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ముసుగులు ధరించి బైక్లపై వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్తో షట్టర్ కట్ చేస్తుండగా మోగిన అలారం స్థానికులు అప్రమత్తమవ్వడంతో పారిపోయిన దొంగలు చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఘటన -
వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదం
భూదాన్పోచంపల్లి : వినూత్న ఆలోచనలే నూతన ఆవిష్కరణలకు దోహదపడతాయని 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ డాక్టర్ బి. బెనెట్ బోస్కోదాస్ అన్నారు. సోమవారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఎంట్రప్రెన్యూర్షిప్ సెల్(ఈ–సెల్)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ–సెల్ వేదికలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు అద్భుతమైన అవకాశమన్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని, సమాజంలోని సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమన్నారు. అలాగే ఈ–సెల్ విద్యార్థులకు సొంతంగా స్టార్టప్లు స్థాపించడానికి అవసరమైన నైపుణ్యాలు, ప్రోత్సహాన్ని అందించే కేంద్రంగా కూడా పనిచేస్తుందని చెప్పారు. స్టార్టప్ ప్రయాణంలో సమస్యలను ఆధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సమాజానికి దోహదపడేలా ఉండాలన్నారు. ఆ దిశగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. అనంతరం ఈ–సెల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ బెనెట్ బోస్కోదాస్ -
అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారని..
కొండమల్లేపల్లి : తన పేరిట ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్ము వెంకటయ్య(49) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం చింతచెట్టుతండా గ్రామ పంచాయతీ పరిధిలో పూల్సింగ్తండాకు చెందిన నేనావత్ శ్రీనుకు మూడు గుంటల భూమిని వెంకటయ్య విక్రయించాడు. తన పేరిట ఉన్న మరో 17 గుంటల భూమిని కూడా శ్రీను, మరో నలుగురు కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ భూమిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కోరితే బెదిరిస్తున్నారని, దీంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని వెంకటయ్య ఓ పేపర్లో రాసి సోమవారం తన ఇంటి సమీపంలో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనస్తాపంతో బలన్మరణం -
కోఆప్షన్ ఎన్నిక ఎప్పుడో?
రామన్నపేట : గ్రామ పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన నెలరోజుల్లోనే కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ నూతన పాలకవర్గాలు కొలువుదీరి రెండు నెలలుదాటినా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆశావహులకు ఎదుచూపులు తప్పడంలేదు. సర్పంచ్లకు శిక్షణ కూడా.. జిల్లాలో 2025 డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అదే రోజున చాలా గ్రామాల్లో ఉపసర్పంచ్లను ఎన్నుకున్నారు. వివిధ కారణాల వల్ల కొన్ని చోట్ల వాయిదా పడిన ఉపసర్పంచ్ ఎన్నికను మరుసటి రోజు నిర్వహించారు. కొత్త సర్పంచ్లకు భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురంలోని రామానంద తీర్ణ గ్రామీణ సంస్థలో విడతల వారీగా శిక్షణ కూడా ఇస్తున్నారు. అయినా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రం చేపట్టలేదు. ప్రతీ పంచాయతీకి ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల చొప్పున.. పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీకి ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు ఉంటారు. పంచాయతీ పాలకవర్గం వీరిని ఎన్నుకుంటుంది. కో ఆప్షన్ సభ్యులకుసైతం వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. వీరు పాలకవర్గ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా సలహాలు సూచనలు చేయవచ్చు. ఉపసర్పంచ్ల ఎన్నిక, అవిశ్వాస సమయాల్లో ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉండదు. ముగ్గురిలో ఒకరు గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మరొకరు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి, ఇంకొకరు గ్రామాభివృద్ధికి సహకరించే దాత లేదా ఎన్ఆర్ఐ ఉంటారు. ఆశావహులకు తప్పని నిరీక్షణ ఎన్నికలు జరిగిన నెల రోజుల లోపు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలి. వీరి ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన లేదు. అసలు ఎన్నిక ఉంటుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో వార్డుల్లో పోటీలో ఉన్న వారిని విరమింప జేయడం, వివిధ పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా జరిగిన ఒప్పందాలలో కో ఆప్షన్ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు. అలాంటి హామీ పొందిన ఆశావహులు కో ఆప్షన్ పదవికోసం నిరీక్షించక తప్పడం లేదు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంఽధించి కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నిక ప్రక్రియ చేపడతాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. –విష్ణువర్ధన్రెడ్డి, డీపీఓ, యాదాద్రి భువనగిరి ఫ పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి రెండునెలలు ఫ కో ఆప్షన్ ఎన్నికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం ఫ ఎదురు చూస్తున్న ఆశావహులు -
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
చౌటుప్పల్ : పరిశ్రమల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలని పరిశ్రమల శాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి సూచించారు. 55వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ రసాయన ఽపరిశ్రమల ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం క్లస్టర్ నుంచి పోచంపల్లి మండలం దోతిగూడెం క్లస్టర్ వరకు ఉద్యోగులు, కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించొద్దంటే ముఖ్యంగా భద్రత పాటిస్తే సరిపోతుందన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా కంపెనీల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి: సంత్ కబీర్, జాతీయ చేనేత అవార్డు ప్రదానం కోసం ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకంలో భాగంగా ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సంత్ కబీర్ అవార్డు కోసం 50 సంవత్సరాల వయస్సు నిండి చేనేత రంగంలో 20 సంవత్సరాల అనుభవం, జాతీయ చేనేత అవార్డు కోసం 30 సంవత్సరాలు పై బడిన వారు చేనేత రంగంలో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండలని తెలిపారు. అర్హత, ఆసక్తి క లిగిన వారు ఈ నెల 23లోపు దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో అందజేయాలని కోరారు. టోకెన్ విధానంలో ధాన్యం కొనుగోళ్లు సాక్షి,యాదాద్రి : రైతులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ విధానంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. యాసంగి 2025–26 వరిధాన్యం కొనుగోళ్లపై సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఎత్తు, పల్లాలు సరిచూసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ మెషీన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ లు, గన్నీ బ్యాగులు సరిపడా సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం 50 టార్పాలిన్లు అందజేయాలన్నారు. వేసవి దృష్ట్యా రైతులు, నిర్వాహకులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందిలేకుండా తాగునీరు, టెంట్లు, కుర్చీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని పీపీసీ కేంద్రాలవారు మార్చి 15 లోగా తూకపు యంత్రాలు, తేమ యంత్రాలను సంబంధిత అధికారులచే ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 293 మంది గైర్హాజరుభువనగిరి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలో 28 కేంద్రాలలో గణితం–1ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 7,308 మంది విద్యార్థులకు గాను 7,015 మంది హాజరు కాగా 293 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. బీఈడీలో నాణ్యతాప్రమాణాలు మెరుగుపడాలినల్లగొండ టూటౌన్ : బీఈడీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్తో కలిపి కనీసం 10 మంది అధ్యాపకులను విధిగా నియమించాలన్నారు. ఆధార్లింక్తో అధ్యాపకుల నమోదు జరగాలని, 75 శాతం విద్యార్థి హాజరును కచ్చితంగా పాటించేందుకు ఫేస్ రికగ్నిషన్ మెషీన్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ఆకుల రవి పాల్గొన్నారు. ప్రతిపల్లెకూ ఆర్టీసీ బస్సు నడపాలిమునుగోడు : ప్రభుత్వం పత్రి పల్లెకు ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామస్తులు తమకు నల్లగొండ నుంచి మునుగోడు మీదుగా బస్సు నడపాలని ఇటీవల ఎమ్మెల్సీని కలిసి కోరగా.. ఆయన ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి ఆ గ్రామానికి బస్సు ఏర్పాటు చేయించారు. సోమవారం మునుగోడులో బస్సును ప్రారంభించి అదే బస్సులో లింగవారిగూడెం వరకు ప్రయాణించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం నూరుశాతం అమలయ్యేందుకు ప్రతిపల్లెకు బస్సు ఏర్పాటు చేయాలన్నారు. -
సర్పంచ్లు సుపరిపాలన అందించాలి
భూదాన్పోచంపల్లి: సర్పంచ్లు సుపరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్రెడ్డి సూచించారు. సోమవారం భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, బీబీనగర్ మండలాలకు చెందిన నూతన సర్పంచ్లకు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో భువనగిరి డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్రెడ్డి, రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్కుమార్, ఎం.డీ. మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ పాల్గొన్నారు. -
కలెక్టరే కన్నకొడుకులా..
తనయులు పట్టించుకోవడంలేదని, ఆదుకోవాలని కోరుతూ ప్రజావాణికి వచ్చి గోడు వెల్లబోసుకున్న వృద్ధదంపతులను చూసి చలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి వారిని కన్నకొడుకులా ఆదరించి వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ధర్మ సోమిరెడ్డి, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కుమారులు పంచుకొని, వారిని నిర్లక్ష్యం చేయడంతో గతంలోనే కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా వారిలో మార్పురాలేదు. దీంతో ఆ వృద్ధదంపతులు సోమవారం మళ్లీ ప్రజావాణికి వచ్చారు. ‘మాకు ఎవరూ లేరు.. మీరే దిక్కు.. మమ్మల్ని అనాథాశ్రమంలో చేర్పించండి’ అంటూ ఆ వృద్ధదంపతులు కలెక్టర్ను ప్రాధేయపడ్డారు. స్పందించిన కలెక్టర్ వారిని చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. -
పూర్వ వైభవం తీసుకొస్తాం
నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి తెలిపారు. - 8లోమహా శివుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
విశ్వశాంతి కేంద్రంగా బుద్ధవనం
ఫ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫ సాగర్లో ముగిసిన 3వ దమ్మయాత్ర నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో నిర్వహించిన 3వ బుద్ధ దమ్మ యాత్ర ముగింపు వేడుకలకు మంత్రి వెంకటస్వామితో కలిసి ఆయన హాజరయ్యారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం కల్బుర్గిలోని సిద్ధార్థ విహార్ నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర శాంతి సందేశాన్ని చాటుతూ నాగార్జునసాగర్కు చేరుకోవడం సంతోషదాయకమ న్నారు.రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, దూలికట్ట వంటి చారిత్రక బౌద్ధక్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఒక ‘డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మనిషి సాధారణ జీవితం గడిపేందుకు బుద్ధుడి బోధనలు మార్గదర్శకంఅని అన్నారు. కార్యక్రమంలో సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్, పర్యాటక శాఖ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి, గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్, అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హిట్టంబె, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. -
కళాకారుల హక్కుల సాధనకు పోరాటం
భువనగిరిటౌన్ : కళాకారుల హక్కుల సాధనకు పోరాటం చేయనున్నట్లు తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్ద శ్రీనివాస్ పేర్కొన్నారు. కళాకారుల సమస్యల పరిష్కారానికి సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజానాట్య మండలి కళాకారులు అనేక సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా, సరైన పారితోషికం లేకుండా, సామాజిక భద్రత హామీలు లేకుండా దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని, కళాకారుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కళాకారులను ఉపయోగించుకుంటూ, తరువాత వారికి కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డీ ఇమ్రాన్, చిగుర్ల లింగం, జిల్లా సమితి సభ్యులు వెంకటేష్, ప్రజానాట్యం మండలి జిల్లా అధ్యక్షుడు భూషిపాక నరసింహ, ఉపాధ్యక్షులు పిట్టల శంకర్, ఇంజా హేమలత, కట్ల యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శి పోతు ప్రవీణ్, సోమ నర్సయ్య, మొగుళ్ల శేఖర్ రెడ్డి, మూల పోచయ్య, కళాకారులు మనోహర, జాను, శ్రీనివాస్, రాజప్ప, రేణుక, నవనీత, కృష్ణమ్మ, వసంత, కవిత, ఎలేంద్ర, లక్ష్మి పాల్గొన్నారు. -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజల ద్వారా నిత్యాదాయం రూ.42,96,548 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
గాదె శ్రీనివాస్రెడ్డి చూపిన మార్గంలో నడవాలి
మిర్యాలగూడ : భూపోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరజీవి గాదె శ్రీనివాస్రెడ్డి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీనివాస్రెడ్డి 44వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. రైతు, కార్మిక హక్కుల కోసం సాగిన పోరాటంలో శ్రీనివాస్రెడ్డి పాత్ర నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, గాదె పద్మమ్మ, ప్రభాకర్రెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
దప్పిక తీర్చిన సోలార్ బోర్లు
చందంపేట : వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వణ్యప్రాణుల దప్పిక తీర్చడానికి అటవీ శాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 14,719 హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఎండ వేడిమికి తట్టుకోలేక దాహం తీర్చుకునేందుకు జంతువులు జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు గతంలో ట్యాంకర్ల ద్వారా నీటి కుంటలు, సాసర్ పిట్లను నింపేవారు. ప్రస్తుతం సోలార్ విద్యుత్ సహాయంతో ఐదు బోర్ల ద్వారా నీటి కుంటలను నింపుతున్నారు. ఈ చర్యలతో గతంతో పోలిస్తే అటవీ జంతువుల సంఖ్యతో పాటు చిరుత పులులను కూడా గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చందంపేట మండలాన్ని ఆనుకొని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, మను బోతులు, చిరుతపులులు, పులులు, అటవీ కుక్కల సంఖ్య పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నీరు తాగేందుకు కుంటల వద్దకు వచ్చే ఈ జంతువులను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జంతువుల అడుగులను బట్టి వాటిని నిర్ధారిస్తుంటారు. నల్లమల అటవీ ప్రాంతంలో సోలార్ విద్యుత్తో బోర్ల ద్వారా నీటి కుంటలు నింపుతున్న అటవీ అధికారులు వేసవిలో వణ్యప్రాణులకు 24 గంటల పాటు అందుబాటులో నీరు -
గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
నకిరేకల్ : హైదరాబాద్–విజయవాడ హైవేపై నకిరేకల్ పట్టణ పరిధిలోని పద్మానగర్ జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్ జంక్షన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నకిరేకల్ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు సీఐ హరిబాబు తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. -
వాహనదారుడిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలంలో వాహనదారుడిపై దాడి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు ఆదివారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఈ నెల 26న మహబూబాద్ జిల్లా వీఎస్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన ధర్మారం శ్రీశైలం కారులో హైదరాబాద్కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న హెడ్కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగా కారును ఆపారు. కారుపై ఉన్న చలానా కట్టాలని శ్రీశైలంపై ఒత్తిడి చేశారు. తాను తర్వాత కట్టుకుంటానని శ్రీశైలం చెప్పడంతో అతడిపై దాడి చేసి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెడ్కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ లింగాను ఏఆర్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒగ్గు కళాకారుడు మృతిఅర్వపల్లి : ఒగ్గు కథ చెప్పడానికి బైక్పై వెళ్తు న్న ఒగ్గు కళాకారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలు.. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన ఒగ్గు కళా కారుడు కొల్లు యాదయ్య(53) ఆదివారం ఒగ్గు కథ చెప్పడానికి జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం వెళ్తున్నాడు. మార్గమధ్యలో నాగారం మండలం ప్రగతినగర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న వరికోత మిషన్ను పక్క నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదయ్యను స్థానికులు సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. కృష్ణానదిలో మునిగి బాలుడు మృతిమేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు వద్ద ఆదివారం కృష్ణానదిలో మునిగి బాలుడు మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన కాసాని గోపయ్య తన ఇద్దరు కుమారులను తీసుకొని పాత వెల్ల టూరు గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్లాడు. గోపయ్య చిన్న కుమారుడు వరుణ్(7) తన అమ్మమ్మ ఇంటి సమీపంలో కృష్ణానది వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. పెద్ద కుమారుడు వచ్చి తమ్ముడు నదిలో పడిపోయాడని గోపయ్యకు చెప్పడంతో వారు వెళ్లి గంట సేపు వెతికిన తర్వాత కృష్ణానదిలో వరుణ్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు నార్కట్పల్లి : ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై నార్కట్పల్లి పోలీసులు ఆది వారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల పరిధిలోని తొండల్వాయి గ్రామానికి చెందిన బింగి సాయిబాబా ఆరేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు మరో బాలికతో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సదరు యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సాయిబాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. -
‘వయ్యారిభామ’తో పంటకు నష్టం
త్రిపురారం : రైతులు పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ(పార్థీనీయం) కలుపు మొక్కకే. ఎందుకంటే ఈ కలుపు మొక్కకు ఎక్కడైనా పెరిగే లక్షణం ఉంటుంది. ఒక్కో వయ్యారిభామ కలుపు మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు దూర ప్రాంతాలకు సైతం త్వరగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క నివారణ చర్యలు కేవీకే కంపాసాగర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు ఆయన మాటల్లోనే.. వయ్యారిభామ కలుపు మొక్క వల్ల పంటలకే కాకుండా మనుషులు, పశువులకు కూడా ప్రమాదమే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు సోకడంతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు సైతం తలెత్తుతాయి. ఈ మొక్కలు తిన్న పశువులు హైపర్ టెన్షన్కు గురువుతాయి. పశుగ్రాసం పంటకు కూడా నష్టం కలిగిస్తాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కంటే ముందే ఈ మొక్కలు గ్రహించుకుంటాయి. తద్వారా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపి సుమారు 40 శాతం మేర తక్కువ దిగుబడులు వస్తాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పొడి పడడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదం ఎక్కువ. వయ్యారిభామను తొలగించే విధానంపార్థీనీయం మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే రైతులు చేతితోనే తొలగించాలి. మొక్కలు పూత దశకు రాకముందే తొలగించి వాటిని మంటల్లో కాల్చివేయాలి. లేకపోతే ఈ మొక్కలు ముదిరితే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ పూత దశకు చేరుకున్న మొక్కలను తొలగించాలంటే చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్కులు ధరించి తొలగించి కుప్పలుగా వేసి కాల్చివేయాలి. మొక్కజొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకుంటే వయ్యారిభామ కలుపు మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్ పేర్వాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పశుగ్రాసం సాగు చేసుకునే రైతులు పంట వేయక ముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పూతకు రాకముందే తొలగించాలి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలుకంపోస్టుగా కూడా తయారు చేసుకోవచ్చువయ్యారిభామ కలుపు మొక్కలు ఎంతో ప్రమాదకరమైనప్పటికీ వాటిని ఉపయోగించుకొని కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందు కోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేవిదంగా గుంత తవ్వుకోవాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలు వేసి వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి చల్లుకోవాలి. ఈ విధంగా పొరలు పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరల పైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో చేసుకొని అన్ని పంటలకు సేంద్రీయ ఎరువుగా వినియోగించుకోవచ్చు. -
మోత్కూరు వాసికి డాక్టరేట్
మోత్కూరు : మోత్కూరు పట్టణానికి చెందిన దునుక సుదర్శన్, లక్ష్మి దంపతుల కుమార్తె సరితకు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఫార్మసీ విభాగంలో ‘డెవలప్మెంట్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ నానో కారియర్ బేస్డ్ ట్రాన్స్ థర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఆఫ్ సెలెక్టెడ్ డ్రగ్స్’ అనే అంశంపై ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రకటించారు. త్వరలో గవర్నర్ చేతుల మీదుగా ఆమె డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. సరితకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చికిత్స పొందుతూ రైతు మృతి
గుర్రంపోడు : అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందా డు. ఆదివారం గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకా రం.. గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన కన్నెబోయిన గోవింద్(55) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సరైన దిగుబడి లేక నష్టపోయాడు. గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహానికి అప్పు కావడంతో అప్పులు అంతకుఅంత పెరిగిపోయాయి. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఈ నెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి గోవింద్ను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
రెండో పీఆర్సీ అమలు చేయాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదేళ్లు అవుతున్నా రెండో పీఆర్సీ అమలు చేయకపోవడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సోమయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే నివేదికను తెప్పించుకుని 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, ఐదు విడతల పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాస్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆర్. దామోదర్, ఎన్. నాగేశ్వరరావు, బి. ఆడం, వి. రమేష్, ఎస్. సోమయ్య, సీహెచ్. రమేష్, డి. లాలు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమయ్య -
ఆకట్టుకున్న ‘జయ’ సైన్స్ఫెయిర్
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో ఆదివారం జయ సృష్టి–2026 పేరుతో సైన్స్ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన బొమ్మల కొలువు, డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, పీఎస్ఎల్వీసీ 33, 37 నమూనాలు, సోలార్ ఎనర్జీ, ఫుడ్ కోర్టు, స్పేస్ రూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ క్యాంపులో తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సైన్స్ఫెయిర్లో విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాల్లోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత హాజరై సైన్స్ఫెయిర్ను ప్రారంభించి మాట్లాడారు. జయ సృష్టిని ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాసీ్త్రయ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్: నల్లగొండలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐటీయూ ఏర్పడినప్పటి నుంచి దేశంలో కార్మికవర్గ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలకు వ్యతికంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నది సీఐటీయూ మాత్రమే అన్నారు. సీఐటీయూ జిల్లా సభల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన కార్మికుల సమస్యలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఎండీ.సలీం, బాణాల పరిపూర్ణాచారి, డబ్బికార్ మల్లేష్, అవుత సైదులు, దండెంపల్లి సత్తయ్య, చింతపల్లి బయన్న, మల్లు గౌతమ్రెడ్డి, నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, పెంజర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తిచేస్తూ సాగిన మూడవ దమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనానికి చేరుకుంది. 29 రోజుల పాటు సుమారు 403 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రకు బుద్ధవనం వద్ద ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య.. స్థానిక నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ థాయిలాండ్, భారతదేశంలోని భిక్షువులతో కలిసి 403 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి బుద్ధవనం చేరుకున్నారని తెలిపారు. పాదయాత్ర విజయవంతానికి గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్, అక్షయ ఫౌండేషన్ అధ్యక్షుడు కేకే రాజా, బీఎస్ఐ తెలంగాణ అధ్యక్షుడు పరంధాములు ఎంతగానో సహకరించారని తెలిపారు. 29 రోజుల పాటు సాగిన ఈ దమ్మ యాత్రలో ‘సాతి’ అనే శునకం భిక్షువులతో పాటు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనస స్వర్ణ, బుద్ధవనం ఆర్ట్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజాప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, మర్ల చంద్రారెడ్డి, సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ మత్తుయ్య పాల్గొన్నారు. -
‘మధ్యాహ్నం’లో టాప్
భువనగిరి : మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా ముందు వరుసలో నిలిచినందుకు జిల్లాకు ఉత్తమ పురస్కారం లభించింది. కాగా రెండో స్థానంలో వనవర్తి జిల్లా నిలిచింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న హైదరాబాద్లోని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదగా రాష్ట్రంలో రెండు జిల్లాలకు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉత్తమ పురస్కారాలను అందజేశారు. ఈ పురస్కారాని జిల్లా విద్యాశాఖ అధికారికి అందుకున్నారు. అయితే 2025–26 విద్యా సంవత్సరానికి గాను యాదాద్రి జిల్లాకు తొలి పురస్కారం లభించినందుకు యంత్రాగం హర్షం వ్యక్తం చేస్తోంది. 90 శాతానికిపైగా హాజరు జిల్లాలో 2003 జనవరి 2వ తేదీ నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు, 2008–09 సంవత్సరాల కాలంలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 659 పాఠశాలల్లో పథకం కొనసాగుతోంది. ఆయా పాఠశాలల్లో సుమారు 41,254 మంది విద్యార్థులు ఉండగా నిత్యం 31 వేలకు వరకు (90 శాతం మంది) విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్నారు. విద్యార్థులకు వంట చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,220 మంది వంట కార్మికులు పని చేస్తున్నారు. ఈ అంశాల అమలు వల్లే పురస్కారం 2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం అమలులో ఉత్తమ పురస్కారాన్కి ఎంపిక చేసేందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో మధ్యాహ్న భోజనం సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థుల హాజరు, వారానికి మూడుసార్లు గుడ్లు, రాగి జావా అందించడం, వంట కార్మికులకు, ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు, వేతనాలు చెల్లించడం, తాజా కూరగాయాలు వినియోగించడం, పోషకాహారాన్ని అందించడంతోపపాటు పథకం అమలు తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం పథకం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉత్తమ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు పోషకాహారాన్ని అందిస్తాం. – సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారిమధ్యాహ్న భోజనం పథకం అమలులో జిల్లా భేష్ ఫ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన యాదాద్రి భువనగిరి ఫ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్న డీఈఓ -
కాలుష్యం కోరల్లో రంగాపూర్
రంగాపూర్ గ్రామ సమీ పంలో కాలుష్యం వెదజల్లుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్న టైర్ల కంపనీపై తదుపరి చర్యల నిమిత్తం జిల్లా పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)అధికారులకు లేఖ రాశాం. నిబంధనలు పాటించని, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఫ్యాక్టరీలపై చర్యలు తప్పనిసరిగా తీసుకునేలా జిల్లా అధికారులకు నివేదిక అందజేశాం. – రాజాత్రివిక్రమ్, ఎంపీడీఓ బొమ్మలరామారం రంగాపూర్ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్ కంపెనీ రాత్రి వేళల్లో తీవ్రమైన దుర్వాసనతో కూడిన పొగ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దీంతో రాత్రి సమయంలో ఊపిరి తీసుకోలేక పోతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఈ పొగతో సమీపంలోని కూరగాయల పంటలపై నల్లటి బొగ్గులాంటి పదార్థం పేరుకుపోతోంది. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలి. – జూపల్లి లింగం, బొమ్మలరామారం ఫ విషం చిమ్ముతున్న టైర్ల రీసైక్లింగ్ కంపెనీ ఫ అనారోగ్యం బారిన గ్రామస్తులు ఫ కూరగాలయ పంటలపైనా ప్రభావం ఫ పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి ఫ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు విన్నపంబొమ్మలరామారం : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కాలుష్య కారక కంపెనీపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు–పీసీబీ) అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్ గ్రామ సమీపంలో ఉన్న టైర్ల రీసైక్లింగ్ కంపెనీ రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తీవ్ర దుర్వాసనతో కూడిన పొగ కాలుష్యాన్ని వదులుతోంది. దీంతో కళ్లు మండుతున్నాయని, ఊపిరి పీల్చుకోలేక శ్వాస సంబంధిత సమస్యతోపాటు గుండె, ఊపిరితిత్తులు పాడవడం, జలుబు, ఎలర్జీ లాంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని, కూరగాయల పంటలపై కూడా ప్రభావం చూపుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగాపూర్ గ్రామస్తులు ఈనెల 23న ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతరావును కలిసి తమ సమస్యను వివరించారు. ఈ కంపెనీని మూసేయాలని గతంలో చాలాసార్లు అఖిల పక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రం ఆందోళలు చేసి అధికారులకు వినతులు అందజేశామని, అయినా కాలుష్య నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోగా పోగా అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదని విన్నవించారు. ఇప్పటికై నా సదరు కంపెనీపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు అఖిల పక్షం ఆధ్వర్యంలో గ్రామస్తులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనలకు నీళ్లు! రంగాపూర్ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్ కంపెనీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా కాలుష్యాన్ని జనావాసాల్లోకి వదులుతున్నాయనేది బహిరంగ సత్యం. ఈ కంపెనీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకు నెలకొల్పినప్పటికీ జనావాసాలకు సమీపంలో ఏర్పాటు చేయడమేంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్యంతోపాటు వివిధ రకాల పంటలు, కూరగాలయ తోటలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సదరు కంపెనీ ఉత్పత్తులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, ప్రజారోగ్యానికి ముప్పులా దాపురించిన ఈ కంపెనీని మూసివేయాలని బాధిత గ్రామ ప్రజల డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం వేళలో కంపెనీ నుంచి కొద్దిపాటిగా విడుదలవుతున్న పొగ రంగాపూర్ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్ కంపెనీ లోపలి భాగం -
డిగ్రీ అభ్యర్థులకు మరో అవకాశం
రామన్నపేట : వివిధ కారణాలతో 2010–11 విద్యా సంవత్సరం నుంచి నేటి వరకు డిగ్రీ కోర్సు పూర్తి చేయలేక పోయిన విద్యార్థులకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మరో అవకాశం కల్పించిందని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రహత్ఖానం, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పాత విధానం (ఇయర్ వైజ్), ప్రస్తుత సెమిసస్టర్ విధానంలో బ్యాక్లాగ్ పేపర్లు కలిగిన విద్యార్థులు ఈనెల 4వ తేదిలోగా పరీక్ష ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇరాన్పై దాడులు అప్రజాస్వామికంభువనగిరిటౌన్ : ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ మూకుమ్మడి దాడులు చేయడం అప్రజాస్వామికమని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. ఆదివారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. ఒకదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే హక్కు మరే దేశానికి లేదన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరిస్తూ అమెరికా బరితెగించి వ్యవహరిస్తుందని ఆరోపించారు. ట్రంప్ పాలనలో యుద్ధన్మాదం తీవ్ర స్థాయికి చేరిందని ఆరోపించారు. ప్రజలంతా అమెరికా ట్రంప్ చర్యలను ఇజ్రాయిల్ దురాగతాలను వ్యతిరేకించాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలిచౌటుప్పల్ : రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టి పకడ్బందీగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా విస్త్రతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన పాలక ప్రభుత్వమే ప్రైవేటు విద్యా రంగంపై మొగ్గు చూపుతుందన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మమత, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు కల్లూరి మల్లేశం, లావుడియా రాజు, నాగరాజు, రాహుల్, తీగుళ్ల శ్రీనివాస్, జగన్, ఉదయ్, ఇందురాణీ, ప్రకాష్, శ్రవణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకారులు అన్నిరంగాల్లో ఎదగాలి మోత్కూరు : స్వర్ణకారులు అన్నిరంగాల్లో ఎదగాలని స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండపర్తి బాలాచారి అన్నారు. ఆదివారం మోత్కూరు మండల స్వర్ణకార సంఘం ఎన్నికలను స్థానిక ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాగోజు నరసింహాచారి, ఎన్నికల ఇన్చార్జ్ కె.శ్రీనివాసచారి, పూర్ణాచారి, రిటైర్డ్ హెచ్ఎం ఎం.బ్రాహ్మచారి, టి.మనోహరాచారి, సీనియర్ జర్నలిస్టు ఎస్ఎన్.చారి, చేపూరి అనిల్, ఆకవరం శ్రీనివాసాచార్యులు, సంఘ నాయకులు నరసింహాచారి,కొల్లోజు నరేందర్, షణ్ముకచారి, మోత్కూరు నవీన్, మోత్కూరు జగన్, బోగోజు రవి, సజ్జనం మనోహర్ పాల్గొన్నారు. రేణుకాచార్య జయంతి ఉత్సవాలు ఆలేరు రూరల్ : మండలంలోని కొలనుపాక గ్రామంలోని సోమేశ్వరాలయంలో ఆదిజగద్గురు రేణుకాచార్య జయంతోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా రుద్రాభిషేకాలు, చండీ హోమం, లక్ష దీపోత్సవం, శివ పార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వీరశైవ భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వీరశైవ భక్తులు కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వీరశైవ భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
బడికి దూరంగా 290 మంది
ప్రత్యేక సర్వేలో గుర్తించిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాం. గుర్తించిన వారికి సమీపంలో ఉన్న పాఠశాలల్లో చేర్పించాం. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో ఎక్కువ మంది పిల్లలుంటే ఆయా పరిశ్రమల యాజమాన్యం వారికి చదువు చెప్పించాలని సూచించాం. 19 ఏళ్లు నిండిన వారు ఓపెన్ ఇంటర్ చదివేలా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నాం. – సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారిభువనగిరి : ప్రతిఒక్క విద్యార్థి చదుకోవాలనే లక్ష్యంతో విద్యకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కొందరు మాత్రం బడికి దూరంగానే ఉంటున్నారు. విద్యార్థులు బడికి దూరంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా విద్యా శాఖ ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 290 మంది బడికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఇటుక బట్టీలు, పారిశ్రామిక ఏరియాల్లో పనిచేస్తున్న వారి పిల్లలే బడికి దూరంగా ఉన్నట్లు తేల్చారు. ఇందులో బొమ్మలరామారం, తుర్కపల్లి, చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే నివేదిక ఉన్నతాధికారులకు.. జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు కేజీబీవీలు, మోడల్, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ చదువుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా.. ఎంతో మంది పిల్లలు బడికి వెళ్లడం లేదు. వీరిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో జిల్లాలోని 17 మండలాల పరిధిలో 48 క్లస్టర్లలో 51 మంది సీఆర్పీలు ప్రతి ఇంటికి వెళ్లి 6 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగి చదువుకు దూరంగా ఉంటున్నవారి వివరాలను సేకరించి సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. పాఠశాలల్లో అడ్మిషన్ ప్రత్యేక సర్వే ద్వారా జిల్లాకు వలస వచ్చినవారు, జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి చదువుకు దూరంగా ఉన్న 290 మంది వివరాలు సేకరించారు. గుర్తించిన వారిలో సుమారు 200కుపైగా పాఠశాలల్లో చేర్పించగా 15 ఏళ్లు పైబడిన వారికి అవగాహన కల్పించి ఓపెన్ టెన్త్, ఇంటర్లో చేర్పించారు. మరికొందరికి ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేసి చదువు చేప్పేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఫ ఇటుక బట్టీలు, పారిశ్రామిక ఏరియాల్లో పిల్లలే ఎక్కువ ఫ ప్రత్యేక సర్వేలో గుర్తించిన విద్యా శాఖ ఫ 200 మందికిపైగా పాఠశాలల్లో చేర్పించిన యంత్రాంగం ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేత -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
యాదగిరిగుట్ట రూరల్: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జెడ్పీసీఈఓ శోభారాణి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారని, మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. బిల్లులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నిర్మాణాన్ని పూర్తి చేయాలని మేసీ్త్రకి సూచించారు. అదేవిధంగా నర్సరీని పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చూడాలని ఆదేశించారు. జెడ్పీ సీఈఓ వెంట పంచాయతీ కార్యదర్శి నరేష్, ప్రధానోపాధ్యాయులు రవీందర్, సిబ్బంది తదితరులున్నారు. ఫ జెడ్పీసీఈఓ శోభారాణి -
కేసులు పెండింగ్ లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : జిల్లాలో కేసులు పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. శనివారం జిల్లా కోర్టు భవనంలో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం అంశాలపై చర్చించి, త్వరితగతిన కేసుల పరిష్కారం, పెండింగ్ జాప్యాన్ని తగ్గించటం, జైలులో ఉన్న వారి కేసులు పరిష్కారం, న్యాయ సహాయం, సాక్షి రక్షణ పథకం వంటి అంశాలపై చర్చించి తగిన సూచనలు చేశారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవి లత, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ, సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రూ పాల్గొన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి భువనగిరి: పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అఽధిరోహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. శనివారం భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల లింగబసవ గార్డెన్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ విద్యార్థులకు ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఏకాగ్రతతో చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పరీక్షల మధ్య ఉన్న విరామ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల్లో పరీక్షా భయం లేకుండా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాల అభివృద్ధి అధికారి సాహితి, డీఈఓ సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి బొమ్మలరామారం: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బొమ్మలరామారం మండలంలోని యువ డిఫెన్స్ అకాడమీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను శనివారం పరిశీలించారు. కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన గాలి, వెలుతురు ఉండేలా, తాగు నీరు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులు త్వరగా పూర్తిచేయాలిభువనగిరిటౌన్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు పురోగతిపై పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ వేతనాలు, మెటీరియల్ చెల్లింపుల లక్ష్యాలను సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి భువనగిరిటౌన్ : గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ అన్నారు. శనివారం భువనగిరిలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ.30 వేల పెన్షన్, హెల్త్కార్డులు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు, ముష్కె జయపాల్రెడ్డి, మంతపురం వినోద్, సుర్వి శ్రీనివాస్గౌడ్, మాణిక్యమ్మ, బేజాడి కుమార్, కృష్ణ, లక్ష్మణ్, గణేష్, పాండు పాల్గొన్నారు. -
భ్రూణ హత్యలు నివారించాలి
ఫ డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ భువనగిరి: భ్రూణ హత్యలను పూర్తిగా నివా రించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ప్రచారం చేయడం, సహకరించడం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకోక తప్పదన్నారు. గర్భిణుల పర్యవేక్షణ, అల్ట్రాసౌండ్ కేంద్రాల తనిఖీలు, రికార్డుల సమగ్ర పరిశీలన, సీ సెక్షన్ ఆడిట్ నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ ఎల్ యశోధ, వీణ, నిర్మల, శ్రీదేవి, అరుంధతి, ప్రజా సంబంధాల అధికారి నాగరాజు, శివలింగం, తాజోద్దీన్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి ఆపదొస్తే.. అల్లాడాల్సిందే!
పీహెచ్సీల్లో రాత్రి వేళ అందుబాటులో ఉండని వైద్యులు ● ఆత్మకూర్ పీహెచ్సీలో 24 గంటల వైద్యం అందించాలి. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉండాలి. కాని ఒక్కరే డాక్టర్ ఉన్నారు. మరో డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇద్దరు వైద్య సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అందులో హెల్త్ అసిస్టెంట్ మాత్రమే విధుల్లో ఉన్నారు. పోసానికుంట వద్ద తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మోత్కూరు చెందిన రామకృష్ణ తలకు గాయమై చికిత్స కోసం పీహెచ్సీకీ తీసుకువచ్చారు. అక్కడ ఉన్న హెల్త్ అసిస్టెంట్ ప్రాథమిక వైద్యం చేసి భువనగిరికి రిఫర్ చేశారు. ఫ కింది స్థాయి సిబ్బందికి డ్యూటీ వేసి వెళ్లిపోతున్న డాక్టర్లు ఫ అత్యవసర వైద్యం కోసం ప్రైవేట్కు పరుగులు తీస్తున్న రోగులు ఫ 24 గంటల వైద్యం ఉత్తిమాటే ఫ కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సాక్షి, యాదాద్రి: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పరిఽధిలో 24 గంటల వైద్యం మొక్కుబడిగా మారింది. రాత్రి సమయంలో పీహెచ్సీల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఇద్దరు వైద్యులు షిఫ్టుల వారీగా వైద్యం అందించాల్సి ఉన్నా.. జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందికి డ్యూటీ వేసి డాక్టర్లు వెళ్లిపోతున్నారు. దీంతో అర్ధరాత్రి అత్యవసర వైద్యం కోసం రోగులు ఆస్పత్రికి వెళ్తే పట్టించుకునే డాక్టర్లు కరువయ్యారు. శనివారం రాత్రి 8 గంటల అనంతరం 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన పీహెచ్సీలను విజిట్ చేయగా.. పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అత్యవసర సేవలకు అందుబాటులో ఉండాల్సి ఉన్నా.. యాదగిరిగుట్ట, ఆత్మకూర్ (ఎం), నారాయణపూర్, రాజాపేట, బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, మోత్కూరు, తుర్కపల్లి, బొమ్మలరామారం పీహెచ్సీలు 24 గంటల వైద్యం అందించాలి. వీటిల్లో మొత్తం 14 మంది సిబ్బంది ఉండాలి. ఇందులో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండాలి. ఇందులో ఒక మహిళా డాక్టర్ లేదా ఆయూష్ డాక్టర్ ఉంటారు. అత్యవసర సేవలకు డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. స్టాఫ్ నర్సులు, నర్స్– మిడ్ వైప్లు ముగ్గురు ఉండాలి. వీరితోపాటు ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, సపోర్టింగ్ సిబ్బంది ఉండాలి. కాని ఎక్కడా అందుబాటులో ఉండడం లేదు. ● తుర్కపల్లి పీహెచ్సీలో శనివారం రాత్రి 8 గంటలకు విజిట్ చేయగా ఒక ఏఎన్ఎం మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇక్కడ ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లలో ఒకరు రాజాపేట పీహెచ్సీకి డిప్యూటేషన్పై వెళ్లారు. మరో డాక్టర్ సాయంత్రం విధులను పూర్తి చేసుకుని వెళ్లారు. అత్యవసర వైద్యం కోసం ఎవరైన రాత్రివేళ వస్తే వారికి వైద్యం అందదు. ఇటీవల గర్భిణి కడుపు నొప్పితో రాత్రి వేళ వస్తే వైద్యం చేసే డాక్టర్ లేక భువనగిరికి తరలించారు. ● వలిగొండ మండల కేంద్రంలోని పీహెచ్సీలోనూ రాత్రి 8 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ హల్లోపతి, ఆయుర్వేదం డాక్టర్లు ఇద్దరు ఉండాలి. కానీ సాయంత్రం తర్వాత ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ప్రస్తుతం సిస్టర్, ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు. అత్యవసర వైద్యం కోసం రోగులను భువనగిరికి పంపిస్తున్నారు. కోతులు లోపలికి వస్తాయన్న భయంతో ఐరన్ గ్రిల్స్తో ఆస్పత్రి మూసి వేశారు. -
కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
భువనగిరిటౌన్ : పోక్సో కేసులు జాప్యం లేకుండా పరిష్కరించాలని పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ ఆదేశించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా న్యాయమూర్తి జయరాజు సూచనల మేరకు జిల్లా కోర్టు ఆవరణలో పోక్సో కేసుల పరిష్కారం, బాధితుల రక్షణ, పునరావాసం అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీపీ, పోలీసు, చైల్డ్లైన్ శాఖల వారికి పోక్సో కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, జేజేబీ కోర్టు న్యాయమూర్తి స్వాతి, సీడబ్ల్యూసీ అధ్యక్షులు బండారు జయశ్రీ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రెడ్డి, సఖి ఓన్ స్టాఫ్ సెంటర్ సెంట్రల్ అడ్మిన్ విన్ని, భువనగిరి టౌన్ ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. -
ఆన్లైన్లోనూ మార్కెటింగ్ చేసుకోవచ్చు
భూదాన్పోచంపల్లి: సొంత వెబ్సైట్ క్రియేట్ చేసి ఆన్లైన్లో, ఇతర సామాజిక మాధ్యమాల సాయంతోనూ చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసుకోవచ్చని నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం ఆయన పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘంలో అధికారులు, సంఘం పాలకవర్గంతో సమావేశమయ్యారు. సంఘం ద్వారా చేనేత కార్మికులకు కల్పిస్తున్న ఉపాధి, అనుసరిస్తున్న మార్కెటింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాపునర్వి హ్యాండ్లూమ్ను సందర్శించి నూలు, చిటికి కట్టడం, రంగులద్దకం, రీలింగ్ యూనిట్, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. నూలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని, వస్త్రోత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ వస్త్రాల తయారీలో అవలంబిస్తున్న నూతన విధానాలను సాయిని భరత్ కలెక్టర్కు వివరించారు. అలాగే చేనేత కార్మికుడు పెండెం కృష్ణ ఇంటిని కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను నాణ్యతను పాటించాలని సూచించారు. అదేవిధంగా పోచంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆరా తీశారు. జలాల్పురంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతో పాటు పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ను తనిఖీ చేశారు. కాగా.. మున్సిపాలిటీ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న స్మశానవాటికకు నిధులు ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు కలెక్టర్కు విన్నవించారు. ఆయన స్పందించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డీఈఓ సత్యనారాయణ, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, డీఓ బాలమోహన్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, ఎంఈఓ ప్రభాకర్, ఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి, ఎస్ఓ ఇందిర, రుద్ర ఆంజనేయులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
కాలువల పనులు పూర్తిచేయాలి
సాక్షి, యాదాద్రి : భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సాగు నీటి కాలువల ఆధునీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం భువనగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలపై అధికారులు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.485 కోట్లతో బునాదిగాని కాలువ ధర్మారెడ్డి పల్లి కాలువ, పిల్లాయిపల్లి కాలువల పనులు చేపట్టామన్నారు. వచ్చే మూడు నెలల్లోపు కాలువలు పూర్తి చేయాలన్నారు. కాలువల వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పక్కకు తీయడం, బస్వాపూర్ హైలెవల్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బోల్లెపల్లి, భీమలింగం, అలీనగర్ కాలువల పునరనిర్మాణం కోసం కావాల్సిన అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని నీటిపారుదల, రెవెన్యూ అధికారులకు సూచించారు. సమావేశంలో భువనగిరి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్లు తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, తడక వెంకటేశం, నీటి పారుదల శాఖ ఎస్ఈ రవీందర్, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎస్డీసీ (భూసేకరణ) జగన్నాథ రావు, నీటి పారుదల శాఖ ఈఈలు శైలేందర్, ఖుర్షీద్, గ్రంథాలయం చైర్మన్ అవేజ్ చిస్తీ, కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
అభ్యసన సర్వే పూర్తి
అడ్డగూడూరు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వే ముగిసింది. గత నెల 25, 26, 27వ తేదీల్లో మూడురోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. జిల్లా ఎంపిక చేసిన బడుల్లోనే ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా నిర్వహించిన సర్వే బాధ్యతలను ఉపాధ్యాయులకు కాకుండా ప్రస్తుతం బీఈడీ చదువుతున్న విద్యార్థులకు అప్పగించారు. వీరిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. సర్వే నిర్వహణపై ఎంపిక చేసిన వారికి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. మొదటి రోజు తెలుగు భాషపై వివరాలు సేకరించారు. రెండో రోజు గణిత అభ్యసన సామర్థ్యాలపై, మూడో రోజు ఇంగ్లిష్ భాషకు సంబంధించి వివరాలను సేకరించారు. ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో సర్వే అభ్యసన సర్వేను జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో నిర్వహించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం.. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. తరగతుల వారీగా చవదడం, రాయడంతోపాటు, గణితంలో నాలుగు రకాల ప్రాథమిక ప్రక్రియలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 2026– 27 నాటికి విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎఫ్ఎల్ఎన్లో సాధించిన ఫలితాలను బేరీజు వేసేందుకు చేపట్టిన ఈ సర్వే ఈనెల 27తో ముగిసింది. ఫ గత నెల 25, 26, 27వ తేదీల్లో కొనసాగిన ప్రక్రియ ఫ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించిన ఇన్వెస్టిగేటర్లు -
ఆన్లైన్లో రెవెన్యూ సేవలు
భువనగిరిటౌన్ : మీ సేవ కేంద్రాల ద్వారా అందించే రెవెన్యూ సేవల్లో పారదర్శకత, వేగవంతం కోసం ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకువచ్చింది. ధ్రువపత్రాల జారీలో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పాలనా అధికారులకు కొత్తగా జీపీఓ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. పౌరసేవలకు సంబంధించిన దరఖాస్తుల వివరాలపై సిబ్బంది విచారణతో పాటు నివేదిక ప్రక్రియ అంతా ఇక యాప్ సాయంతో ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దీంతో ప్రజలు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి. ఈమేరకు మంగళవారం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, జగన్ మోహన్ ప్రసాద్తో కలిసి మొబైల్ యాప్ పని తీరుపై సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిన విధానాన్ని వివరించారు. ఈమేరకు రెండు నెలల క్రితం భువనగిరి మండలంలోని పెంచికల్పహాడ్, భువనగిరి పట్టణం, బీబీనగర్, కొండమడుగు, మక్త అనంతారం గ్రామాల్లో జీపీఓల ద్వారా పైలట్ దరఖాస్తులపై మొబైల్ యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు పరిశీలించారు. యాప్ ఆచరణలో సాంకేతికంగా తలెత్తుతున్న అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకనుణంగా మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న మొబైల్ యాప్ సాంకేతిక అడ్డంకులన్నీ అధిగమించి పూర్తి స్థాయి అప్లికేషన్ను ఈ నెల 25వ తేది నుంచి జీపీఓలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం జీపీఓ మొబైల్ యాప్ ద్వారా మరణ, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. త్వరలో పూర్తి రెవెన్యూ సేవలు జీపీఓ యాప్ ద్వారా అందించనున్నారు. ఫ ప్రత్యేకంగా జీపీఓ యాప్ తీసుకువచ్చిన ప్రభుత్వం ఫ ధ్రువపత్రాలు జారీ చేయడంలో జాప్యానికి చెక్ -
‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
హుజూర్నగర్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్ అన్నారు. శనివారం హుజూర్నగర్లోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని ఆయన, యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెచ్ఓడీ యాదగిరి కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధర్మానాయక్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం త్వరలో నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివి గ్రూప్–1, 2 ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రామారావుతో పాటు కోఆర్డినేటర్ బాలరాజు, జాక్టో సైదానాయక్ తదితరులు ఉన్నారు. ఫ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్ -
యాదగిరీశుడి సేవలో త్రిపుర గవర్నర్
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కుటుంబ సభ్యులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను దర్శించుకున్న గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, కుటుంబ సభ్యులు.. ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చనమూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
రహదారులపై ‘ఇక్కత్’ పరుగులు
భూదాన్పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ డిజైన్ పోస్టర్ కల్గిన ఆర్టీసీ బస్సు శనివారం పోచంపల్లిలో సందడి చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే ప్రప్రథమంగా జీఐ గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘జీఐ ఆన్ వీల్స్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం నుంచి దిల్సుఖ్నగర్ నుంచి పోచంపల్లికి ప్రత్యేక బస్సు సర్వీస్ను నడిపిస్తోంది. ఇందు కోసం ఆర్టీసీ బస్సుపై పోచంపల్లి ఇక్కత్ డిజైన్కు సంబంధించిన పోస్టర్ను రూపొందించి బస్సు వెనుక ‘పోచంపల్లి నుంచి ప్రపంచానికి’ అనే ట్యాగ్ను రూపొందించింది. తద్వారా పోచంపల్లి ఇక్కత్కు మరింత గుర్తింపును తీసుకరావడంతో పాటు ఉపాఽధి కల్పించడం, అదేవిధంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ ప్రత్యేక బస్సు ప్రతిరోజు దిల్సుఖ్నగర్ నుంచి పోచంపల్లికి నాలుగు ట్రిప్పుల చొప్పున నడుస్తుందని తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డిది చేతకాని పాలన
చౌటుప్పల్ : సీఎం రేవంత్రెడ్డి తన చేతకాని పాలనతో పేదల గుండెల్లో గునపం దింపుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు ధ్వజమెత్తారు. శనివారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొన్నటి వరకు హైడ్రా పేరుతో, నిన్న మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ విగ్రహం ప్రతిష్ఠాపనకు, తాజాగా ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో మంత్రుల భూములకు ధరలు పెరగాలన్న ఆలోచనతో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. మైనింగ్ పేరిట శారదా పీఠాన్ని సైతం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను ఆదివారం ఖమ్మం పర్యటనకు వెళ్తున్నానని, అక్కడి నిర్వాసితులైన నిరుపేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామాలలో శివాజీ మహారాజ్ విగ్రహాల ఏర్పాటుతో యువతలో దేశభక్తి పెరుగుతుందన్నారు. నేటి సంక్షేమ పథకాలను నాడు తన పాలనలోనే శివాజీ మహారాజ్ అమలు చేశారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, స్థానిక సర్పంచ్ కై రంకొండ స్వప్నఅశోక్, బీజేపీ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, ఉప సర్పంచ్ జెల్ల పవన్, నాయకులు దోనూరు వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, శాగ చంద్రశేఖర్రెడ్డి, ఆలె చిరంజీవి, కంచర్ల గోవర్ధన్రెడ్డి, గడ్డం నర్సింహ, పిశికె సంజీవ, నూనె మాధవి, పక్కీరు శ్రీనివాస్రెడ్డి, అశోక్రెడ్డి పాల్గొన్నారు.ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
బౌద్ధ దమ్మయాత్రతో తెలంగాణలో శాంతి
నాగార్జునసాగర్ : ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా సిద్దార్ధ బుద్ధవిహార్ నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్రతో తెలంగాణలో శాంతి, క్రాంతి ఆవిర్భవించనుందని హాలివుడ్ నటుడు, గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్ పేర్కొన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, మహారాష్ట్రకు చెందిన అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిద్ధార్థ హిట్టెంబరిలతో కలిసి శనివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 403 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర ఆదివారం సాయంత్రం నాగార్జునసాగర్ చేరుకోనుందని తెలిపారు. పాదరక్షలు లేకుండా సుదూర ప్రయాణం చేస్తూ బౌద్ధ ధర్మ సందేశాన్ని ప్రజల్లోకి తీసుక వెళ్తున్న బౌద్ధ భిక్షువులకు ఘనస్వాగతం పలుకాలని పిలుపునిచ్చారు. థాయ్లాండ్ నుంచి తీసుకొస్తున్న బుద్ధ ధాతువులను బుద్ధవనం మహాస్థూపంలో మూడు రోజుల పాటు ప్రజల దర్శనార్ధం ఉంచనున్నట్లు తెలిపారు. మార్చి 2న శ్రీబుద్ధునితో నా ప్రయాణంశ్రీ నాటకం, 3వ తేదీన దమ్మ ధ్యానం కార్యక్రమాలు కొనసాగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వెంకటస్వామితో సహా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నుట్లు తెలిపారు. వందమంది బౌద్ధభిక్షువులు పాల్గొంటారని చెప్పారు. పెద్దవూరకు చేరుకున్న పాదయాత్ర.. పెద్దవూర: బౌద్ధ భిక్షువులు చేపట్టిన దమ్మయాత్ర శనివారం పెద్దవూరకు చేరుకుంది. ఈ పాదయాత్రలో కంబోడియా, వియత్నాం, థాయ్లాండ్, భారతదేశాలకు చెందిన 80 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. గౌతమ బుద్ధుడు నడయాడిన నేల నాగార్జునకొండకు బౌద్ధ భిక్షువులు ఎంతో ప్రయాశపడి 450 కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నారని బీఎస్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు తెలిపారు. ఫ గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్ -
అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్ట్
హుజూర్నగర్ : నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్ల ద్వారా వ్యాపారస్తులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తొరక్రుంటపాలెం కాలనీకి చెందిన ముత్యాల గోపీకళ్యాణ్, సిద్ధాపురం కార్తీక్ స్నేహితులు. వీరిద్దరు కలిసి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్ల ద్వారా వ్యాపారస్తులను మోసం చేస్తున్నారు. వీరు గత 10 రోజుల వ్యవధిలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు, మఠంపల్లి, గరిడేపల్లి, హుజూర్నగర్తో పాటు నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, త్రిపురారం ప్రాంతాల్లో వ్యాపారస్తులను మోసం చేసి రూ.2.06 లక్షల కిరాణ సరుకులు తీసుకెళ్లారు. వాటిని తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. శనివారం గరిడేపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పొనుగోడు ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. గోపీకళ్యాణ్, కార్తీక్ కారులో వెళ్తూ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్ల ద్వారా మోసాలు చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.1.26లక్షల నగదు, 2 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఫ రూ.1.26లక్షల నగదు, కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం -
గుండెపోటుతో రైతు మృతి
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన రైతు యలమకంటి అంతయ్య(70) శనివా రం తన వ్యవసాయం పొలం వద్ద గుండెపోటుతో మృతిచెందాడు. పొలం వద్ద బోరు మోటారు పైపులు సరిచేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతయ్య భౌతికకాయానికి డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచారి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్గౌడ్, మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్గౌడ్, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి తదితరులు నివాళులర్పించారు. చదువులో వెనుకబడ్డానని.. ఫ ఉరేసుకుని బాలిక ఆత్మహత్య తిప్పర్తి : చదువులో వెనుకబడ్డానని మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశరాజుపల్లి గ్రామానికి చెందిన కత్తుల వర్షిణి(16) చదువులో వెనుకబడి రెండు సంవత్సరాల క్రితం చదువు మానేసింది. ఇంటి వద్దనే ఉంటున్న ఆమె తనకు చదువు సరిగా రావడం లేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కత్తుల పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లింగయ్య తెలిపారు. వృద్ధురాలి ఒంటిపై బంగారం చోరీ నడిగూడెం : ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో శనివారం జరిగింది. స్థానిక ఎస్ఐ అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాపురం గ్రామానికి చెందిన పందిరి అనసూర్యమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తి శనివారం అనసూర్యమ్మ ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి మెడలో ఉన్న 10 గ్రాముల నల్లపూసల బంగారు తాడు, చెవులకు ఉన్న పావు తులం చెవిదిద్దులను లాక్కోని పారిపోయారు. ఈ ఘటనలో బాధితురాలి చెవికి స్వల్ప గాయమైంది. బాధితురాలి కుమార్తె కట్ల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యభిచార గృహంపై పోలీసుల దాడికోదాడ రూరల్: పట్టణంలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై కోదాడ పట్టణ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పురుషులను, ఒక మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
విజ్ఞాన్స్లో ఆకట్టుకున్న ‘జెనెక్స్–2026’
భూదాన్పోచంపల్లి : మండలంలోని దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘జెనెక్స్–2026’ పేరుతో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకుంది. బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎక్స్పోలో విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించిన నమూనా ప్రాజెక్ట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం ‘ది ప్యూచర్ ఆఫ్ హెచ్ఆర్, ఏఐ డ్రివెన్ వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్’పై నిర్వహించిన సెమినార్లో హైదరాబాద్లోని మోస్చిప్ టెక్నాలజీస్ టాలెంట్ ఆక్విజిషన్ మేనేజర్ జె. కోమలి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఏఐ డేటా ఆధారంగా ఉద్యోగుల అనుభవాన్ని, పనితీరును మెరుగుపరిచే ఒక శక్తివంతమైన సాధనమని వివరించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంబీఏ డిపార్ట్మెంట్ కోఆర్టినేటర్ ఎస్ఎం సయ్యద్, ఆయా విభాగాల డీన్లు, హెచ్ఓడీలు, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు స్వామి, అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో అర్చకులు శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవాదాయ, ధర్మదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బి. సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 108 కలశాలతో.. చివరి రోజు ఆలయ ముఖ మండపంలో అర్చకులు 108 బంగారు, వెండి కలశాలను ఒకే చోటుకు చేర్చి పూజించారు. అనంతరం శుద్ధ నీరు, పంచామృతాలు, ఫల రసాలతో గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు శతఘటాభిషేకం జరిపించారు. అంతకుముందు ముఖ మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచారులు, పారాయణీకులు, అర్చకులు, అధికారులు, సిబ్బందిని సన్మానించారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం రాత్రి స్వామివారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాలు ఆలపించారు. నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభంబ్రహ్మోత్సవాలు ముగియడంతో ఆదివారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభంకానున్నాయి. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు, బ్రహ్మోత్సవం పూజలు తిరిగి ప్రారంభించనున్నారు. యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ముగింపు పలికిన అర్చకులు -
యాదగిరీశుడిని దర్శించుకున్న కలెక్టర్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ .. గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి వారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవానీ శంకర్ లడ్డూ ప్రసాదం, శ్రీస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణసాక్షి, యాదాద్రి : యాదాద్రిభువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్గా వెంకారెడ్డి గురువారం యాదాద్రి కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. శేరిలింగంపల్లిలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై యాదాద్రి జిల్లాకు వచ్చారు. వేసవిలో దొంగతనాల నివారణకు గస్తీ ముమ్మరం ఆలేరు: వేసవిలో దొంగతనాల నివారణకు గస్తీ ముమ్మరం చేయనున్నట్లు ఎస్పీ అక్షాంశ్యాదవ్ వెల్లడించారు. ఆధునీకరించిన ఆలేరు పోలీస్స్టేషన్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఠాణాలో సీఐ,ఎస్ఐ చాంబర్లతోపాటు రిసెప్షన్ కౌంటర్, విజిటర్స్ లాంజ్లను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఠాణాలో నిర్వహించిన అమ్మవారి పూజలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఎస్పీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్నాయుడు, సీఐ యాలాద్రి, ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ ఇయర్ తొలి రోజు 5,709 మంది హాజరు భువనగిరి: జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పేపర్–2 పరీక్షకు మొత్తం 5,858 మంది విద్యార్థులకు గాను 5,709 మంది హాజరు కాగా 149 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ పట్టణంలోని టైమ్స్, శ్రీ చైతన్య కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు తనిఖీ చేశారు. విధి నిర్వహణలో ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు ఆలేరురూరల్: ఆయిల్పామ్ సాగుతో రైతులు లాభాలు ఆర్జించవచ్చని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి మాధవి, డీఏఓ వెంకటరమణారెడ్డి, ఆయిల్ ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శంకర్ పేర్కొన్నారు. ఆలేరు మండలం సాయిగూడెంలో బేతి అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్, మామిడి తోటల సాగుపై రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త హరికాంత్, ఉద్యాన అధికారులు స్నేహిత, కవిత, శ్రీనివాస్, స్వర్ణలత పాల్గొన్నారు. -
హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసుకుందాం
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీని సమష్టి కృషితో హైదరాబాద్ నగరం తరహాలో అభివృద్ధి చేసుకుందామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లుతో పాటు కౌన్సిలర్ల పదవీ బాధ్యతల స్వీకరణ వేడుకల్లో వారు మాట్లాడారు. ఎన్నికల ఘట్టం ముగిసినందున పార్టీలకతీతంగా పట్టణ అభివృద్ధిపై శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటికే రూ.65 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. రహదారుల, చౌరస్తాల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజాపాలన అందించాలని సూచించారు. 35 వార్డులకుగాను కాంగ్రెస్ పార్టీ 22 వార్డుల్లో విజయం సాధించి వివాదాలకు తావు లేకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారని తెలిపారు. విపక్ష వార్డులను కూడా స్వపక్ష వార్డులుగానే పరిగణిస్తూ అన్ని వార్డుల అభివృద్ధికి కాంగ్రెస్ పాలకపక్షం ప్రాధాన్యమివ్వాలన్నారు. నూతన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే మార్గదర్శకంలో పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లను పలువురు ఘనంగా సత్కరించారు. కమిషనర్ జి. రామలింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. అవేజ్ చిస్తి, కిర్తీరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం ఫ భువనగిరి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ -
నూతన కలెక్టర్గా అనురాగ్ జయంతి బాధ్యతలు
సాక్షి,యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్గా అనురాగ్ జయంతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హనుమంతరావు గురువారం రిలీవ్ అయ్యారు. అనురాగ్ జయంతి 2015 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో నిజామాబాద్ జిల్లా బోధన్, ఖమ్మం జిల్లాలో సబ్ కలెక్టర్గా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా, జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా పని చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ జయంతిని కలెక్టర్ గా నియమించింది. ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం కొత్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యముంటుందన్నారు. విద్యా, వై ద్య రంగాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అ ట్టడుగు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానన్నా రు. జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతానన్నారు. దేవాదాయ శాఖ డైరెక్టర్గా బదిలీ కలెక్టర్ హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. దీంతోపాటు గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ గా సైతం అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. అదనపు కలెక్టర్ స్వాగతం కలెక్టర్ అనురాగ్ జయంతికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు స్వాగతం పలికారు. ఆయనకు పూల బొకే ఇచ్చి సత్కరించారు. ఫ దేవాదాయశాఖ డైరెక్టర్గా హనుమంతరావు బదిలీ -
ఎమ్మెల్యే అక్రమాలు, అరాచకాలను ఎండగట్టాలి
ఆలేరు:ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఆలేరు పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిలర్లు కోమల్ల మౌనికాహరీష్,బీజని కళ్యాణిమధు, యాట శివకుమార్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆలేరు,యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలువలేదని..డబ్బే గెలిచిందన్నారు. అన్ని నివేదికలు ఆలేరులో బీఆర్ఎస్ గెలుస్తున్నాయని చెప్పడంతో ఓటమి భయంతో ఎమ్మెల్యే తన అనుచరులతోపాటు పోలీసుల అండతో డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేసి అప్రజాస్వామిక పద్ధతిలో గెలిచారని ధ్వజమెత్తారు. వాస్తవానికి నైతిక విజయం బీఆర్ఎస్దే అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్టమల్లేష్గౌడ్, వస్పరి శంకరయ్య , మొరిగాడి మాధవి, కొలుపుల హరినాథ్, బొట్ల పరమేశ్వర్, మాదాని ఫిలిప్, బేతిరాములు, గ్యాదపాక నాగరాజు, మొరిగాడి వెంకటేష్, అడెపు బాలస్వామి, జల్లి నర్సింహులు పాల్గొన్నారు. -
భువనగిరి మున్సిపాలిటీలో సేకరించిన చెత్తలో అధికంగా ప్లాస్టిక్ కవర్లు
భువనగిరి: భువనగిరి పట్టణంలో ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది. ఇక్కడ నిషేధం జాగ కన్పించడంలేదు. పట్టణంలోని వివిధకాలనీల నుంచి మున్సిపల్ సిబ్బంది సేకరించిన చెత్తలో ముప్పావంతూ ప్లాస్టికే ఉంటోంది. కేవలం 25శాతం మాత్రమే చెత్త, వ్యర్థాలు ఉంటున్నాయి. ఇందులో మట్టి పొడి వ్యర్థాలు 15శాతం వస్తే మరో పది శాతం సీసాలు, మట్టి, గృహవస్తువులు ఉంటున్నాయి. దీంతో బయోమైనింగ్కు ప్రక్రియకు అడ్డంకిగా మారింది. పెరిగిన ప్లాస్టిక్ కవర్ల వినియోగం భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులున్నాయి. వీటి పరిధిలో సుమారు 15వేలకు పైగా గృహాలు, సుమారు 70వేలకు పైగా జనాభా ఉంది. వీరితో పాటు భువనగిరి పట్టణం జిల్లా కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల ప్రజలు పట్టణానికి వచ్చి కూరగాయలు, గృహ అవసరాలకు అవసరమైన సామగ్రిని ప్లాస్టిక్ సంచుల్లోనే తీసుకెళ్లుంటారు. ఇందులో పట్టణ ప్రజలు సైతం ఇంటికీ ప్రతి వస్తువునును ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్తున్నారు. దీంతో కిరణం, కూరగాయల దుకాణాల్లో ప్లాస్టిక్ వాడకం వివరీతంగా పెరిగింది. ఈ కారణంగా మున్సిపల్ సిబ్బందికి ఇచ్చే చెత్తలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటోంది.ఫ నిత్యం 20మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ ఫ అమలుకు నోచని ప్లాస్టిక్ నిషేధం ఫ బయోమైనింగ్కు అడ్డంకి భువనగిరి మున్సిపాలిటీలో.. మొత్తం వార్డులు 35గృహాలు : 15,000జనాభా: 70,000భువనగిరి పట్టణంలో తడిచెత్త, పొడి చెత్త పేరుతో నిత్యం సేకరించిన చెత్తను మున్సిపాలిటీ డపింగ్ యార్డులో నిల్వ చేస్తున్నారు. నిత్యం 20 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో తడి చెత్త 12, పొడి చెత్త 8, మిశ్రమ చెత్త 2 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. అయితే ప్రజలు తమ అవసరాల కోసం ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో సేకరించిన చెత్తలో ప్లాస్టిక్ కవర్లే ఎక్కువగా ఉంటున్నాయి. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ సరిగా అమలు కాకపోవడంతో పాటు వాడకం పెరగటం వల్ల పర్యావణానికి ముంప్పుమారే అవకాశం లేకపోలేదు. ప్లాస్టిక్ పై పట్టణప్రజలకు , వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తాం. అనంతరం వాడుతున్న వారి దుకాణాలు, వ్యాపార సముదాయాల పై దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తాం. ప్లాస్టిక్ నిషేధం విడతల వారీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. – రాంలింగం, మున్సిపల్ కమిషనర్, భువనగిరి -
ఆర్యూబీ పనుల జాప్యంపై ఆందోళన
ఆలేరు: ఆలేరులో రైల్వేఅండర్ బ్రిడ్జి(ఆర్యూబీ) పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక రైల్వేగేట్ సమీపంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రమాణస్వీకారం అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కోమల్ల మౌనికాహరీష్, కళ్యాణిమధు, యాటశివకుమార్లతోపాటు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంద రోజుల్లో కుర్చీ వేసుకొని ఆర్యూబీ పనులను పూర్తి చేయిస్తానని బీర్ల ఐలయ్య హామీ ఇచ్చి రెండేళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు.ఆర్యూబీ పనులు పూర్తి కాకపోవడానికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హయాంలో ఆర్యూబీ పనులు 70శాతం పూర్తయినా, మిగతా పనులు పూర్తి చేయించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్గౌడ్, మాజీ చైర్మన్వస్పరి శంకరయ్య, మాజీ వైస్ చైర్పర్సన్ మొరిగాడి మాధవి, కొలుపుల హరినాథ్,బొట్ల పరమేశ్వర్,మొరిగాడివెంకటేష్,మాదాని ఫిలిప్,బేతి రాములు తదితరులు పాల్గొన్నారు. -
బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటాం
నకిరేకల్ : ప్రభుత్వ నిర్లక్షంతో మృతి చెందిన విద్యార్థి బాల ఆకాష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బంధనాథం బాలఆకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాలఆకాష్ భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 15న పాఠశాల సమీపంలోని ఫాంపాండ్లో స్నానం చేసేందుకు వెళ్లి ఈత రాక మృతిచెందాడు. విద్యార్థి మృతిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేటీఆర్కు సమాచారం ఇవ్వడంతో.. గురువారం రాత్రి కేటీఆర్ రాయపురం చేరుకుని బాలఆకాష్ చిత్రపటం వద్ద పూలుచల్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. అక్కడ నుంచే సంబంధిత మైనారిటీ గురుకుల పాఠశాల సెక్రటరీకి ఫోన్ చేసి మాట్లాడారు. బాలుడి మృతికి బాధ్యులైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని సూచించారు. బాలఆకాష్ తండ్రి అంథోనిరాజుకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. బాలుడి సోదరి మధువన్సీతను అక్కున చేర్చుకుని.. ‘నేను నీకు అన్న అనుకో.. లేక బాబాయి అనుకో నువ్వ ఎంత వరకు చదివితే అంత వరకు నీ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తా’ అని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కంచర్ల భూపాల్రెడ్డి, నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, డాక్టర్ చెరుకు సుదాకర్, ప్రవీణ్కుమార్, నలగాటి ప్రసన్నరాజ్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, కొప్పుల ప్రదీప్రెడ్డి, మారం వెంకట్రెడ్డి, ప్రగడపు నవీన్రావు, రాచకొండ శ్రీనివాస్గౌడ్, బడుగుల శ్రీనివాస్ ఉన్నారు. ఫ మాజీ మంత్రి కేటీఆర్ -
నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో
మోత్కూరు : భూ తగాదాల కారణంగా వదిన గొంతు కోసిన మరిదితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేయాలని బాధితురాలి బంధువులు, గ్రామస్తులు గురువారం మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో వలిగొండ–తొర్రూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాలడుగు గ్రామానికి చెందిన బొంత వెంకటలక్ష్మికి, ఆమె మరిది బొంత అశోక్ మధ్య కొంతకాలంగా భూ తగాదాలు కొనసాగుతుండగా.. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో అశోక్ తన వదినపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని గ్రామస్తులు, బంధువులు ఆరోపించారు. సకాలంలో పోలీసులు స్పందించి సమస్య పరిష్కరిస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. వెంకటలక్ష్మి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. స్థానిక సర్పంచ్ అంతటి భగవంతు బాధితురాలి బంధువులకు, గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిందితులను పట్టుకొని తగిన న్యాయం చేస్తామని ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. భూ తగాదాలో పెద్ద మనుషుల పాత్రపై కూడా విచారించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
యాదగిరీశుడి సేవలో ఉప లోకాయుక్త
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఉప లోకాయుక్త బీఎస్ జగ్జీవన్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ లడ్డూ ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. నిందితుడిపై నాన్ బెయిలెబుల్ వారెంట్ఫ జైలుకు తరలించిన పోలీసులు చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం ఐలాెపురం గ్రామానికి చెందిన చెరుకుపల్లి సైదులు వివిధ కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతుండడంతో సూర్యాపేట కోర్టు సెకండ్ అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ మంచాల మమత అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో గురువారం చివ్వెంల పోలీసులు సైదులును అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నిందితుడి పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలుశిక్ష విధించడంతో పోలీసులు అతడిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం మర్రిగూడ(చింతపల్లి) : చింతపల్లి మండల కేంద్రం శివారులోని చిన్న చెరువులో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు స్థానిక ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు చెరువు వద్దకు పరిశీలించామని, మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. గుబురు గడ్డం కలిగి, ఎరుపు,నీలం రంగు గీతల డిజైన్ కలిగిన ఫుల్ హ్యాండ్ చొక్కా, బూడిద రంగు డ్రాయర్ ధరించినట్లు వివరించారు. అతడి కుడి చేతికి రాగి కడియం, మెడలో తాయత్తు ఉన్నాయని తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే చింతపల్లి పోలీస్ స్టేషన్లో లేదా 87126 70230, 87126 75858 నంబర్లను సమాచారం ఇవ్వాలని సూచించారు. -
చోరీకి పాల్పడిన దొంగ అరెస్టు
కొండమల్లేపల్లి : తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను గురువారం కొండమల్లేపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 12న అర్ధరాత్రి కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని వాసవీ బజారులో నివాసముంటున్న కనుమూరి నాగరాజు ఇంటి తాళాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి బీరువాలోని రూ.67,000 నగదు ఎత్తుకెళ్లారు. మరుసటిరోజు నాగరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అజ్మీరా రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం కొండమల్లేపల్లి చౌరస్తాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. వాసవీ బజారుకే చెందిన ఎస్కే బాబా పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. అతడిని విచారించగా నాగరాజు ఇంట్లో రూ.67,000 నగదు తానే అపహరించినట్లు నిజం ఒప్పుకున్నాడు. ఈ మేరకు ఎస్కే బాబాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
ప్రేమ వివాహం ఇష్టంలేక..
బొమ్మలరామారం : ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్న యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. రామలింగంపల్లి గ్రామానికి చెందిన యువతి, హైదరాబాద్లోని నేరెడ్మెట్ ప్రాంతానికి సాటల అజయ్కుమార్ మూడురోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ఆమెకు సర్దిచెప్పి మంగళవారం రామలింగంపల్లి గ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎలాగైనా అజయ్కుమార్ను హత్య చేయాలని పథకం రచించారు. యువతి కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున అజయ్కుమార్కు ఫోన్ చేసి మాట్లాడుదామని చెప్పి రామలింగంపల్లి గ్రామ శివారులోకి పిలిపించారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులైన గ్యార దయాకర్, కట్టా నర్సింగ్రావు, రంగాపురం మహేందర్, ఉబ్బపెల్లి వేణు, కొమ్ము సాయికిరణ్ అలియాస్ చంటి, కొమ్ము నర్సింగ్రావు, మరో బాలుడు కలిసి అజయ్కుమార్ కళ్లలో కారం చల్లి ఛాతి, మొహం, వీపు, పక్కటెముకలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అజయ్కుమార్ అక్కడే స్పృహతప్పి పడిపోగా.. అతడు మృతిచెందాడనుకుని నిందితులు పారిపోయారు. అజయ్కుమార్ శరీరంపై 14 చోట్ల కత్తిపోట్లు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అజయ్కుమార్ను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ హత్యాయత్నంలో పాలుపంచుకున్న 8 మందిని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశామని ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. ఫ యువకుడిపై కత్తితో దాడి చేసిన యువతి కుటుంబ సభ్యులు ఫ శరీరంపై 14 చోట్ల కత్తిపోట్లు ఫ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలి
భువనగిరిటౌన్ : నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య అన్నారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని జగ్జీవన్రామ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18న కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబానికి చెందిన భార్యాభర్తలపై గ్రామ పెత్తందారులు దాడి చేయగా వారి రెండు నెలల పసిపాప మృతిచెందిందన్నారు. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బలహీన వర్గాలపై కుల దురహంకార దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు. గ్రామ సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఈ చర్యకు పాల్పడితే అధికార పార్టీ అండగా నిలబడటం సరికాదన్నారు. రాష్ట్రంలో కులం, మతం పేరుతో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఈ ఘటనలో ప్రధాన దోషులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని, ఇది సమాజమంతా తల దించుకునే అమానవీయ చర్య అన్నారు. కులం పేరుతో జరిగే హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి సక్రమంగా అమలు చేయాలన్నారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, బొలగాని జయరాములు, బొల్లు యాదగిరి, అవ్వారు రామేశ్వరి, ఎండీ. పాషా, బొడ్డుపల్లి వెంకటేశం, గంగాదేవి సైదులు, ఎంఏ. ఇక్బాల్, వనం ఉపేందర్, గుండు వెంకటనర్సు, కోట రామచంద్రారెడ్డి, మధ్యపురం రాజు, బల్గూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిట్యాల: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని 7 హోటల్ ఎదురుగా హైవేపై సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు నలుపు రంగు స్వెటర్, బూడిద రంగు ప్యాంట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70187 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. నాటు వైద్యం వికటించి.. భువనగిరిటౌన్ : నాటు వైద్యం వికటించి ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన గురువారం భువనగిరి పట్టణంలో వెలుగు చూసింది. పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన వల్లాల శ్రీనివాస్ కొంతకాలంగా భువనగిరి పట్టణంలోని రామ్నగర్లో కుటుంబతో కలిసి నివాసముంటున్నాడు. అతడి కుమార్తె సిరి(18) ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 15న నాటు వైద్యం పేరిట చెట్టు మందు తాగించారు. మందు వికటించి సిరి ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొంతుదూ..చిట్యాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడేనికి చెందిన రుద్రవరం పిచ్చమ్మ(65) ఈ నెల 22న చిట్యాల నుంచి తెలిసినవారి బైక్పై శివనేనిగూడేనికి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనుంచి కిందపడిపోయిన పిచ్చమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలుశిక్ష సూర్యాపేటటౌన్ : డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ గురువారం సూర్యాపేట కోర్టు ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించారు. సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని గురువారం కోర్టులో హాజరుపర్చగా.. అందులో ఒకరికి 4 రోజులు, మరొకరికి 2 రోజుల జైలుశిక్షతో పాటు రూ.2,500 చొప్పున జరిమానా, మరో ఇద్దరికి కలిపి రూ.3,000 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. -
నేడు కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం
కోదాడ : మూడు నెలల క్రితం మృతిచెందిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ మృతదేహానికి శుక్రవారం కోదాడలో రీ పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ తెలిపారు. గురువారం కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీబీనగర్ ఎయిమ్స్కు చెందిన వైద్య బృందంచే రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మూడు నెలలుగా చేస్తున్న పోరాటం వల్లే ప్రభుత్వం దిగి వచ్చి రీ పోస్టుమార్టానికి అంగీకరించిందని, దీని వల్ల రాజేష్ కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపూరి రాజు పాల్గొన్నారు. -
నేత్ర పర్వం.. రథోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దివ్య విమాన రథోత్సవం గురువారం రాత్రి నేత్ర పర్వంగా సాగింది. బుధవారం అర్ధరాత్రి లక్ష్మీదేవిని పరిణయమాడిన నృసింహుడు.. గురువారం ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీమహావిష్ణువుగా రూపుదాల్చి గరుడ వాహనంపై మాడ వీధుల్లో అమ్మవారితో కలిసి విహరించారు. అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట సేవను వేంచేపు చేసి ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు అలంకార విశిష్టతను వివరించారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు బి. సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్మోగిన నారసింహుడి నామస్మరణ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సాయంత్రం నిత్యారాధనలు పూర్తైన అనంతరం చతుస్థానార్చనలు, మండపారాధనలు, మూలమంత్ర జపములు, మండపారాధనలు, ద్వారా తోరణ పూజలు, దివ్య ప్రబంధ పారాయణాలు అర్చకులు జరిపించారు. అనంతరం దివ్య విమాన రథం ఎదుట రథాంగ హోమం, రథబలి జరిపించి స్వామి, అమ్మవార్ల అలంకార సేవను ఊరేగించారు. రాత్రి వేళ దివ్యవిమాన రథంపై ఆసీనులైన కల్యాణమూర్తులు ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజనులను అనుగ్రహించారు. తిరు, మాడ వీధులు నృసింహుడి నామస్మరణతో మార్మోగాయి. స్థానికులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రథోత్సవం ముందు నృత్యాలు చేశారు. కొండపైన ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 9.30గంటలకు మహా పూర్ణాహుతి, అనంతరం చక్రతీర్థం, విష్ణు పుష్కరిణిలో అవబృత స్నానం వేడుకలను అర్చకులు జరిపిస్తారు. రాత్రి 7గంటలకు శ్రీపుష్పయాగం, ద్వాదశ ఆరాధన, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని నిర్వహించేందుకు అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ ఆలయ మాడ వీధుల్లో విహరించిన కల్యాణమూర్తులు ఫ నేడు చక్ర తీర్థ స్నానం, అవబృత స్నానం -
ఆటోను ఢీకొట్టిన కళాశాల బస్సు
కోదాడరూరల్ : మిరపకాయలు కోసేందుకు వెళ్తున్న కూలీల ఆటోను ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామ స్టేజీ వద్ద గురువారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామానికి చెందిన కూలీలు చింతలపాలెంలో మిరపకాయలు కోసేందుకు ఆటోలో వెళ్తున్నారు. మార్గమధ్యలో గణపవరం గ్రామ స్టేజీ వద్దకు రాగానే.. మేళ్లచెరువు నుంచి వస్తున్న అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వనకూరి సావిత్రమ్మ, వసంత, మంద రేణుక, నాగమణి, మంద సుకణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొందరు స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లారు. ఆటో డ్రైవర్ మంద రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపారు. ఫ ఐదుగురు కూలీలకు గాయాలు -
రానికెట్ వ్యాధితో నాటుకోళ్లు మృతి
రామగిరి(నల్లగొండ): రానికెట్ అనే వ్యాధితో నల్లగొండ మండలంలోని కేశరాజుపల్లి గ్రామానికి చెందిన ఆతి మల్లయ్య ఫామ్లో 200 నాటుకోళ్లు మృతిచెందాయి. ఇటీవల ఖాజీరామారంలోనూ ఓ రైతు ఫామ్లో 800 వరకు నాటుకోళ్లు, అప్పాజిపేటలో పెరటి కోళ్లు ఈ వ్యాధితో మృతిచెందాయి. నాటుకోళ్లు, బాయిలర్ కోళ్లకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని వెటర్నరీ డాక్టర్ కోట్ల సందీప్రెడ్డి తెలిపారు. ఆయన కేశరాజుపల్లిలోని రైతు ఫామ్ను గురువారం సందర్శించారు. ప్రస్తుతం రానికెట్ వ్యాధి ప్రభావం ఎక్కుగా ఉందని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా కోళ్లకు లసోటా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. -
ఈ తండ్రి ప్రేమకు సాటిరారు..
మర్రిగూడ : మండలంలోని శివ్నగూడెం గ్రామానికి చెందిన మోర సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కుమార్తె శివాని చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారిన పడడంతో ఆమె రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకుంది. వైకల్యం శివాని చదవుకు అడ్డంకి కాకూడదని భావించిన తండ్రి సత్యనారాయణ ఆమెను విద్యావంతురాలిని చేయాలని దుకు నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం శివాని మర్రిగూడ మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వార్షిక పరీక్షలు ప్రారంభంకావడంతో ప్రతిరోజు సత్యనారాయణ తన కుమార్తెను ఎత్తుకొని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, తోటి విద్యార్థుల తల్లిదండ్రులు సత్యనారాయణకు తన కుమార్తైపె ఉన్న ప్రేమకు ఎవరూ సాటిరారని ప్రశంసిస్తున్నారు. దివ్యాంగురాలైన తన కుమార్తెను ఎత్తుకొని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న సత్యనారాయణ -
మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన లారీ
నార్కట్పల్లి : లారీ అదుపుతప్పి మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నార్కట్పల్లి మండల కేంద్రంలో నల్లగొండ చౌరస్తా వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రానైట్ లోడుతో నల్లగొండ నుంచి నార్కట్పల్లి మండల కేంద్రంలోకి వస్తున్న లారీ నల్లగొండ చౌరస్తా వద్ద రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో అదుపుతప్పి ఎదురుగా ఉన్న మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఫుట్పాత్పై పండ్లు కొనుగోలు చేస్తున్న మాండ్ర గ్రామానికి చెందిన మేడి కృష్ణ(38), పండ్ల వ్యాపారి గౌస్ పాషాని కూడా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ, గౌస్ పాషా లారీ కింద ఇరుక్కుపోయారు. సీఐ నాగరాజు, ఎస్ విష్ణుమూర్తి, స్థానిక సర్పంచ్ భరత్ ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ, క్రేన్ సహాయంతో లారీని బయటకు తీయిస్తుండగా.. కృష్ణ మృతిచెందాడు. పండ్ల వ్యాపారి గౌస్ పాషా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు. ఈ ఘటనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అయితే ఘటనా స్థలానికి పోలీసులు ఆలస్యంగా వచ్చారని, వారు ఆలస్యంగా రావడంతోనే కొన ఊపిరితో ఉన్న మేడి కృష్ణ మృతిచెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. 40 రోజుల క్రితం ఇక్కడే.. 40 రోజుల క్రితం ఇదే చౌరస్తాలో డీసీఎం నల్లగొండ నుంచి అతివేగంగా వస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. నల్లగొండ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు ఫ నార్కట్పల్లి మండల కేంద్రంలో ఘటన -
ఆలయంలో హుండీ అపహరణ
మర్రిగూడ : మర్రిగూడ మంండల కేంద్రంలోని శ్రీశంభు రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఆలయం వద్దకు వచ్చిన అర్చకుడు లోక వెంకటశర్మ చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా సాయంత్రం ఆలయ సమీపంలో హుండీ దొరకగా.. అందులోని నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీతారామాంజనేయ దేవాలయంలో చోరీ.. తిప్పర్తి : మండలంలోని సిలార్మియాగూడెంలో గల సీతారామాంజనేయ దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తులం బంగారం, ఐదు తులాల వెండి వస్తువులు, హుండీలోని సుమారు రూ.50వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ చైర్మన్ యర్రమాద నరేందర్రెడ్డి బుధవారం తెలిపారు. ఆరునెలల క్రితం కూడా ఇదే ఆలయంలో దుండగులు హుండీ ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. -
అర్హత లేకున్నా కంటి వైద్యులుగా చెలామణి
మిర్యాలగూడ అర్బన్: అర్హత లేకున్నా కంటి వైద్యులుగా చెలామణి అవుతున్న ఐదుగురిని మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం డీఎస్పీ రాజశేఖరరాజు విలేకరులకు వివరించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పజ్జూరి వికాస్కుమార్ డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో డిప్లొమా ఇన్ ఆప్తమాలజిస్టు కోర్సు పూర్తి చేసి అక్కడే పలు కంటి ఆస్పత్రుల్లో పనిచేసిన అనుభవం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో మహాలక్ష్మి ఐ క్లినిక్ ఏర్పాటు చేశాడు. అధికారుల తనిఖీల నుంచి బయటపడేందుకు కన్సల్టెంట్ వైద్యుడి పేరు, సర్టిఫికెట్ వాడుకుంటూ అతడే వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. గతేడాది జూన్లో మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన బైరెడ్డి పద్మ కంటి పరీక్షలు చేయించుకునేందుకు వికాస్కుమార్ ఆస్పత్రికి వచ్చింది. వికాస్కుమార్ ఆమెను పరీక్షించిన కుడి కంటిలో శుక్లాలు ఉన్నాయని సర్జరీ చేశాడు. మరుసటి రోజు నుంచి పద్మ కుడి కన్ను సరిగా కనిపించకపోడంతో.. వికాస్కుమార్ను నిలదీయదగా కొన్ని మందులు రాసి ఇచ్చాడు. అయినప్పటికీ ఉన్నచూపు కాస్త మందగించడంతో ఆమె పోలీసులు, వైద్యాధికారులు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వన్టౌన్ సీఐ నాగభూషణం ఎలాంటి అర్హత లేకుండా వికాస్కుమార్ కంటి వైద్యం చేస్తున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఇటీవల మెడికల్ కౌన్సిల్ అధికారుల తనిఖీల్లో డాక్టర్స్ కాలనీలోని శ్రీమహాలక్ష్మి, శాలిని, యశస్విని, అన్నపూర్ణ, రాఫా ఐ క్లినిక్లలో వల్కి శ్రీను, గడ్డం నాగరాజు, బానావత్ శివకోటేశ్వర్రావు, వెంకటేష్ సరైన అర్హతలు లేకున్నా డాక్టర్లుగా చెలామణి అవుతున్నట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వన్టౌన్, టూటౌన్ సీఐలు నాగభూషణం, సోమనర్సయ్య, ఎస్ఐ సైదిరెడ్డి, హెడ్కానిస్టేబుల్ రాజారా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఐదుగురిని అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు -
ట్రాక్టర్ను ఢీకొని యువకుడు మృతి
ఫ మరొకరికి గాయాలు మేళ్లచెరువు : బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు ట్రాక్టర్ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. దొండపాడు గ్రామానికి చెందిన తిరుమల భానుసాయి(18), నన్నెపంగు కిరణ్ బైక్పై గ్రామంలోకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. గ్రామం నుంచి వజినేపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వారిని కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో భానుసాయి మృతిచెందాడు. కిరణ్ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇటుక బట్టీ యాజమాని అరెస్ట్ చివ్వెంల : ఇటుక బట్టీలో పనిచేస్తున్న వ్యక్తి మృతికి కారణమైన యాజమానిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. బుధవారం సీఐ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులోని శ్రీశ్రీనివాస ఇటుక బట్టీలో పనిచేస్తున్న పల్లపు రాజు ఇటుకలు తయారుచేసే మట్టిని ట్రాక్టర్తో తొక్కిస్తుండగా.. ఒక్కసారిగా ట్రాక్టర్ తిరగబడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదని కొంతకాలంగా ఇటుక బట్టీ యాజమాని చల్లా నాగరాజుకు చెబుతున్నా పట్టించుకోలేదని రాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి తోడు ట్రాక్టర్కు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కూడా లేదని పేర్కొన్నారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి రాజు మృతికి కారణమైన ఇటుక బట్టీ యజమాని చల్లా నాగరాజును బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ట్రాక్టర్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ మహేశ్వరం కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా కల్యాణ వేడుక
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. రాత్రి 9గంటలకు అర్చకులు, ఆలయ అధికారులు గజవాహనంపై లక్ష్మీనరసింహస్వామిని, ప్రత్యేక పల్లకీలో లక్ష్మీదేవిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ ఉత్తర మాడ వీధిలోని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆలయాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టువస్త్రాలతో గజవాహన సేవ ముందు నడిచారు. అనంతరం 9.45 గంటలకు కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్లను అధిష్ఠించి తిరుకల్యాణ వేడుకకు శ్రీకారం చుట్టారు. కల్యాణ వేదికపై ఆసీనులైన స్వామి, అమ్మవార్లకు అర్చకులు విష్వక్సేనారాధాన నిర్వహించారు. మంత్రపుష్పం, సంప్రోక్షణ జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రాచార్యులు కంకణధారణ చేసి 11.21 గంటలకు జంజరాధారణ (యజ్ఞోపవీతం) గావించారు. అనంతరం జీలకర్ర బెల్లం తంతు, సింహ లగ్నం ముహూర్తంలో మాంగల్యధారణ గావించారు. ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు. ఉదయం రామావతారంలో.. ఉదయం ఆలయంలో అర్చకులు నిత్యారాధనలు, ప్రభాత భేరీ, విష్ణు సహస్రనామ పారాయణం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని శ్రీరాముడిగా అలంకరించి హనుమంత వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు.. కల్యాణోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అక్షాంశ్యాదవ్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాస్నాయుడు పర్యవేక్షణలో ఒక డీఎస్పీ, 8మంది సీఐలు, 18మంది ఎస్సైలు, 150 మంది పోలీస్ సిబ్బందితో రింగ్రోడ్డు, ఘాట్రోడ్డు, ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక వద్ద బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం 5గంటల నుంచే కొండపైకి వాహనాలను కట్టడి చేశారు. పెళ్లి కూతురుగా ముస్తాబైన లక్ష్మీదేవిగజవాహనంపై లక్ష్మీనరసింహస్వామిగురువారం ఉదయం స్వామివారు మహావిష్ణు అలంకారంలో గరుడ వాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. ఫ గజవాహనంపై ఊరేగిన స్వామివారు ఫ ఉదయం రామావతారంలో హనుమంత సేవ -
నకిలీ బంగారం ముఠా అరెస్ట్
ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన శాలిగౌరారం పోలీసులు నల్లగొండ సీసీఎస్ పోలీసుల సహకారంతో రాజు తీసిన ఫొటో, సెల్ఫోన్ టవర్ ఆధారంగా మాల్యాద్రిపై నిఘా పెట్టారు. బుధవారం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మాల్యాద్రి దంపతులు, అతడి తమ్ముడి కుమారుడు కిషోర్ అటుగా వెళ్తూ పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా.. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. వారి నుంచి నకిలీ బంగారు వడ్డానం, నల్లపూసల గుండ్లు, రూ.50 వేల నగదు, ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. వీరు తెలంగాణలో ఆరు చోట్ల, ఏపీలో ఒక చోట ఇదేవిధంగా మోసం చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ బంగారు వడ్డానం, నల్లపూసల గుండ్లునిందితుల వివరాలు వెల్లడిస్తున్న శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డిశాలిగౌరారం: నకిలీ బంగారం అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను నల్లగొండ సీసీఎస్ పోలీసుల సహకారంతో శాలిగౌరారం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన కర్రెద్దుల మాల్యాద్రి అలియాస్ వెంకటేశ్వర్లు, ఆయన భార్య సుబ్బమ్మ అలియాస్ సుభాషిని, మాల్యాద్రి తమ్ముడి కుమారుడు కిషోర్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముగ్గురు ఈ నెల 6న నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజాపురం గ్రామానికి వచ్చి, తాము బాతులు మేపుకునే వాళ్లమని పరిచయం చేసుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బస చేశారు. ఈ క్రమంలో మాల్యాద్రి, సుబ్బమ్మ గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్న చిలుకూరి రాజుతో పరిచయం పెంచుకున్నారు. మరుసటి రోజు తమ వద్ద 35 తులాల బంగారం ఉందని, ప్రస్తుతం డబ్బులు అవసరం ఉండడంతో తక్కువ ధరకు ఇస్తామని మాల్యాద్రి దంపతులు రాజుకు చెప్పారు. రాజును నమ్మించేందుకు తమ వద్ద ఉన్న మూడు బంగారు నల్లపూసల గుండ్లతో పాటు మరో బంగారం ముక్కను ఇచ్చి పరీక్షించుకోమన్నారు. వారిచ్చిన బంగారాన్ని రాజు బంగారం షాపులో పరీక్షించగా.. అది అసలైన బంగారమే అని తేలడంతో వెంటనే చేతికి ఉంగరం కూడా చేయించాడు. అనంతరం మాల్యాద్రి, సుబ్బమ్మ తమ వద్ద ఉన్న నకిలీ బంగారం అమ్మేందుకు రాజుతో బేరసారాలు చేశారు. 35 తులాల బంగారం.. రూ.7 లక్షలకు కొనుగోలు..తమ వద్ద ఉన్న 35 తులాల నకిలీ బంగారాన్ని రూ.20 లక్షలకు అమ్ముతామని మాల్యాద్రి దంపతులు రాజుకు చెప్పారు. చివరకు రూ.7 లక్షలకు బేరం కుదరడంతో రాజు వెంటనే వారికి డబ్బులు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో రాజు రహస్యంగా తన సెల్ఫోన్లో మాల్యాద్రిని ఫొటో తీశాడు. అనంతరం రాజు మరుసటి రోజు ఆభరణాలు చేయించేందుకు బంగారం దుకాణం వద్దకు వెళ్లగా అది నకిలీ బంగారమని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ నకిలీ బంగారు వడ్డానం, నల్లపూసల గుండ్లు, రూ.50 వేల నగదు, ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం -
తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలి
హుజూర్నగర్ : రైతులు వరిలో అగ్గి, మెడ విరుపు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు సరైన చర్యలు చేపట్టాలని కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం తెలిపారు. బుధవారం హుజూర్నగర్, గరిడేపల్లి, కీతవారిగూడెం గ్రామాల్లో వరి పంటను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త లింగయ్య, సీనియర్ శాస్త్రవేత్త శ్రీధర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అగ్గి తెగులు, ఆకుమచ్చ తెగులు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉందని చెప్పారు. అగ్గి తెగులు పూతదశకు చేరిన పంటల్లో వెన్నుపై ఆశించినట్లయితే మెడ విరుపు తెగులుగా మారి దిగుబడి తక్కువగా ఉంటుందన్నారు. కాబట్టి రైతులు అగ్గి తెగులు, మెడ విరుపు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు ట్రైసైక్లాజోల్, మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ఐసోప్రోతయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. వరిలో కాండం కుళ్లు, తెగులు ప్రధానంగా అధిక తేమ, నత్రజని ఎరువుల వాడకం వల్ల వస్తుందన్నారు. ఆకు తొడుగులపై నల్లటి మచ్చలు, కాండం కుళ్లడం, పిలకలు విరిగిపడటం దీని లక్షణాలని చెప్పారు. దీని నివారణకు ఎకరాకు 200గ్రా. కార్బెండిజం+మాంకోజెబ్ చల్లడం లేదా కార్బెండిజం 1గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని పేర్కొన్నారు. పొట్ట కుళ్లు తెగులు.. ఇది పూతదశకు చేరిన పంటల్లో ఆశించే అవకాశం ఉందని.. ఉష్ణోగ్రతలు 20–28 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ తెగులు ఆశించినప్పుడు పొట్ట పైన నల్లని మచ్చలు ఏర్పడడం, పొట్ట కుళ్లిపోవడం, తాలు గింజలు ఏర్పడటం గమనించవచ్చు తెలిపారు. దీని నివారణకు కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి లేదా ప్రతి ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని పేర్కొన్నారు. వారి వెంట గరిడేపల్లి ఏఓ ప్రీతం కుమర్, హుజూర్నగర్ ఏఈఓ రమ్య, రైతులు ఉన్నారు. -
ఏటీఎంలో నుంచి చిరిగిన నోట్లు
భూదాన్పోచంపల్లి : ఏటీఎం నుంచి ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయగా.. ఎలుకలు కొరికినట్లు ఉన్న రూ.500 నోట్లు వచ్చాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మండల పరిధిలోని కప్రాయిపల్లి గ్రామానికి చెందిన గంగదేవి జంగయ్య బుధవారం సాయంత్రం తన కుమారుడు సుభాష్కు ఏటీఎం కార్డు ఇచ్చి రూ.10 వేలు డ్రా చేసుకొని రమ్మని చెప్పాడు. దీంతో సుభాష్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు వెళ్లి అందులో నుంచి డబ్బులు డ్రా చేయగా.. ఎలుకలు కొరినట్లుగా ఉన్న నాలుగు రూ.500 నోట్లు వచ్చాయి. వెంటనే సుభాష్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చేందుకు బ్యాంకు వద్దకు వెళ్లగా తాళం వేసి ఉండటంతో ఇంటికి వెనుతిరిగి వెళ్లాడు. -
నేడు నృసింహుడి కల్యాణం
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం బుధవారం రాత్రి జరగనుంది. రాత్రి 9గంటలకు గజ వాహనంపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాడ వీధుల్లో ఊరేగుతూ ఉత్తర మాడ వీధిలోని కల్యాణ వేదికకు చేరుకుంటారు. అనంతరం అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణికులు కల్యాణ వేడుకను ప్రారంభిస్తారు. సింహ లగ్నంలో స్వామివారు అమ్మవారికి మాంగళ్యధారణ చేస్తారు. ఈ కల్యాణోత్సవానికి సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర మాడ వీధిలోని కల్యాణ మండపాన్ని పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తులు, వీఐపీలు కల్యాణాన్ని తిలకించేలా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో, బస్టాండ్ ఏరియాలో ఎల్ఈడీ స్క్రీన్లతో కల్యాణం తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణోత్సవానికి గవర్నర్, మంత్రులు..కల్యాణోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పలువురు ఐఏఎస్ అధికారులు రానున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సైతం స్వామివారి కల్యాణానికి వచ్చే అవకాశాలున్నాయని, కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదని ఆలయాధికారులు పేర్కొన్నారు. -
పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ అధికారులు
స్వామివారికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. మంగళవారం రాత్రి టీటీడీ నుంచి ఏఈఓ రత్నం ఆధ్వర్యంలో అధికారులు యాదగిరిగుట్టకు వచ్చారు. స్వయంభూలను దర్శించుకుని ముఖ మండపంలో ఈఓ భవానీ శంకర్కు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారులు గజం నర్మద, నరేంద్ర రెండు ఇక్కత్ కంచిపట్టు చీరలు, పట్టు పంచె, మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన చాట్లా ప్యాట్నీ సెంటర్ నిర్వాహకులు 8 పట్టుచీరలు, 5 పట్టు పంచెలు అందజేశారు. -
న్యాయం చేయాలని బాధితుల ఆందోళన
చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు(శివనేనిగూడెం)కు చెందిన ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్య చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ చిట్యాల పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మంగళవారం చిట్యాల పోలీస్స్టేషన్ ఎదుట బాధితురాలి బంధువులు రాస్తారోకో చేస్తూ ఆందోళనకు దిగారు. ఏఎస్ఐ వెంకటయ్య ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో నిరసన తెలుపుతున్న వారు ఆందోళన విరమించారు. ఈ రాస్తారోకోతో కాసేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఆత్మకూరు(ఎం) : హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇటీవల నిర్వహించిన 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో భాగంగా జూడో మరియు రెజ్లింగ్ పోటీల్లో ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేటకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు కమ్మంపాటి మహేందర్, బి. రాజశేఖర్, కమ్మంపాటి ప్రశాంత్ పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కమ్మంపాటి మహేందర్ జూడో 66 కేజీల విభాగంలో ద్వితీయ బహుమతి, రెజ్లింగ్ 67 కేజీల విభాగంలో కాంస్య పతకం, వుషూలో ద్వితీయ బహుమతి సాధించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి. రాజశేఖర్ జూడో 90 కేజీల విభాగంలో బంగారు పతథకం గెలుచుకున్నారు. గుండాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కమ్మంపాటి ప్రశాంత్ జూడో 73 కేజీల విభాగంలో ద్వితీయ బహుమతి, రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రశాంత్, రాజశేఖర్, మహేందర్ను కోచ్ కమ్మంపాటి సోమరాజు, గ్రామస్తులు అభినందించారు. -
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి శ్రీలక్ష్మీ దేవితో నారసింహుని కల్యాణోత్సవంలో భాగంగా పెళ్లిచూపుల తతంగాన్ని నిర్వహించారు. రాత్రి 8 గంటలకు అశ్వవాహనంపై స్వామిని, ముత్యాల పల్లకీపై అమ్మవారిని అలంకరించి ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పు రాజగోపురం ముందు గల మాడ వీధిలో స్వామి వారిని పశ్చిమ ముఖంగా కూర్చోబెట్టి, అమ్మవారిని తూర్పు ముఖంగా అధిష్ఠించారు. కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు బుధవారం రాత్రి 9.45గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందని.. సరిగ్గా సింహ లగ్నంలో స్వామివారు అమ్మవారిని పరిణయమాడుతారని వెల్లడించారు. జగన్మోహిని అలంకారంలో స్వామివారు.. మంగళవారం ఉదయం జగన్మోహిని అవతారంలో స్వామివారిని అలంకరించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు హోమాది పూజలు, పారాయణాలు నిర్వహించారు. ఆలయంలో నేడు.. బుధవారం ఉదయం 10గంటలకు శ్రీరామ అలంకారం, హనుమంత సేవ, అదేవిధంగా రాత్రి గజవాహన సేవ, 9.45గంటలకు తిరుకల్యాణోత్సవం జరిపించనున్నారు. జగన్మోహిని అలంకారంలో యాదగిరీశుడి దర్శనం -
వదిన గొంతు కోసిన మరిది
మోత్కూరు : భూ తగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన బొంత నర్సింహ, అతడి తమ్ముడు అశోక్కు కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. 6 నెలల క్రితం నర్సింహ అనారోగ్యంతో మృతిచెందాడు. నర్సింహ పేరిట ఉన్న భూమిలో తనకు వాటా వస్తుందని అతడి భార్య లక్ష్మి అలియాస్ వెంకటమ్మతో అశోక్ తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో లక్ష్మి ఇంటిపై మరిది అశోక్ దాడి చేసి ఇంట్లోని సామగ్రి అంతా ధ్వంసం చేశాడు. దీంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కాగా మంగళవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి వస్తుండగా.. అశోక్ తన దగ్గరి బంధువులైన ముగ్గురు వ్యక్తుల సహాయంతో కొబ్బరి బోండాల కత్తితో వదిన లక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పారిపోయారు. అతి కష్టం మీద లక్ష్మి మెడకు టవల్ చుట్టుకొని ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. ఆమెను 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అక్క చంద్రమ్మ ఫిర్యాదు మేరకు అశోక్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. భూతగాదాలతో ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు బాధితురాలి పరిస్థితి విషమం -
వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు
త్రిపురారం : యాసంగి సీజన్లో వరి పంటకు సోకే తెగుళ్లు, చీడపీడలను రైతులు సరైన సమయంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతులకు సకాలంలో యూరియా దొరక్క వరి చేలు గిడసబారిపోతున్నాయి. సాగర్ ఆయకట్టు కింద వరి చేలు ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా.. పలు ప్రాంతాల్లో ఈనిక దశలో ఉన్నాయి. ఈ క్రమంలో వరి పంటకు సోకే చీడపీడలు, వాటి నివారణకు కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు.. ● అగ్గి తెగులు : వరి పంటలో వచ్చే అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 1.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నత్రజని ఎరువులను తగ్గించుకొని, పొలం గట్లపై కలుపును తీసివేయాలి. ● మొగి పురుగు లేదా కాండతొలుచు పురుగు : వరి పంటలో వాతావరణ పరిస్థితులను బట్టి కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రాములు లేదా 0.3 మి.లీ. క్లోరాట్రానిలిపోల్ 18.5 ఎస్పీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ● కాండం కుళ్లు తెగులు : కాండం కుళ్లు తెగులు నివారణకు 2 మి.లీ. హెక్సాకోనాజోల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మి.లీ. టేబుకో నాజోల్ 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు పలకల కింద వరకు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ● ఆకు ముడత తెగులు : వరిలో ఆకు ముడత తెగులు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి చేనుపై పిచికారీ చేసుకోవాలి ● ఉల్లికోడు తెగులు : వరిలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లికోడు తెగులు ఎక్కువగా ఆశిస్తున్నందున దీని నివారణకు నాటిన 10 నుంచి 15 రోజుల కార్బోఫ్యూన్ గులికలు ఎకరాకు 10 కిలోలు లేదా ఫోరేట్ గులికలు 5 కిలోలు ఎకరాకు లేదా ఫిప్రోనిల్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ● ఎండాకు తెగులు : నారుమడి దళ నుంచి గింజ పాలు పోసుకునే వరకు ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. చెట్టు నీడ పడే ప్రదేశంలో ఎక్కువగా ఎండాకు తెగులు ఆశించి మిగిలిన పంటకు వేగంగా వ్యాప్తిస్తుంది. ఈ తెగులు సోకిన ప్రదేశంలో ముదురు ఆకులకు పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కింది అంచుల వెంబడి వ్యాప్తించి ఎండుతూ వస్తాయి. ఉదయం సమయంలో ఆకుల మీద పసుపు రంగు జిగురు ముద్దలు కనబడతాయి. ఎండ వేడిమికి గట్టిపడి రాలిపోతాయి. ఈ ఎండిన బాక్టీరియా ముద్దలు నీటి ద్వారా వెళ్లి మిగిలిన పంటకు వ్యాప్తిస్తుంది. నివారణ చర్యలుఎండాకు తెగులు సోకిన మొక్కల నుంచి మిగతా పంటకు నీరు పారకుండా చూసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో నత్రజని వేయకూడదు. కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు మరియు ప్లాంటోమైసిన్ 4 గ్రాములు లేదా పోషామైసిన్ లేదా స్రైటప్లోసైక్లిన్ 4 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు -
ముగిసిన సీఎం కప్ ఖోఖో పోటీలు
నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు పోటీలు హోరాహోరీగా జరిగాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు, బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో నల్ల గొండ జట్టు ద్వితీయ బహుమతి, బాలుర విభాగంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జట్టు ద్వితీయ బహుమతులు కై వసం చేసుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 33 జిల్లాల నుంచి 450 మంది బాలికలు, 450 మంది బాలురు ఈ ఖోఖో పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. సీఎం కప్ క్రీడాపోటీలతో గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం విజేతలకు మేయర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్ఓ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో విజేతగా ఆదిలాబాద్ జట్టు బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జట్టుకు ప్రథమ బహుమతి -
ప్రత్యేక ఆకర్షణగా డోలు, సన్నాయి కళాకారులు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డోలు, సన్నాయి కళాకారులు వాయించే మంగళ వాయిద్యాల శబ్ధం భక్తులకు ఆధ్యాత్మిక భావంలోకి తీసుకెళ్తున్నాయి. ఆలయంలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి శయనోత్సవం వరకు ప్రతిరోజు దేవుడి సేవలో డోలు, సన్నాయి కళాకారులు పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో సైతం పూజలు, ఉదయం, రాత్రి జరిగే అలంకార సేవ, వాహన సేవలో ఈ డోలు, సన్నాయి బృందం సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సన్నాయిలో నుంచి వచ్చే సంగీతానికి తగినట్లుగా డోలు వాయిస్తుంటే ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.స్వామి సేవకు అంకితమయ్యాను గత 16 ఏళ్లుగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సేవకు అంకితమయ్యాను. దేవుడికి ఆలపించే పాటకు తగ్గట్లుగా డోలు వాయించడం ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. బ్రహ్మోత్సవాలు వస్తే ఆలయానికి వచ్చే భక్తులకు భక్తిని పెంపొందించే విధంగా మా సభ్యులమంతా కృషి చేస్తున్నాం. డోలు వాయిస్తున్నంత సేపు మేము కూడా ఆ స్వామిని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక లోకంలో ముగినిపోతాం. – రాము తిరుపాలి, డోలు కళాకారుడు భక్తి భావాన్ని పెరుగుతుంది స్వామికి సంప్రదాయ పద్ధతిలో మంగళకరమైన వాయిద్యాన్ని మోగిస్తుంటే భక్తి భావం పెరుగుతుంది. బ్రహ్మోత్సవాలతో పాటు ప్రత్యేక రోజుల్లో ఏఏ పాటలను సన్నాయిలో నుంచి తీసుకురావాలనే అంశాన్ని ఆలోచిస్తాం. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే కచ్చితంగా ప్రతిరోజు ఏ సేవ ఉంటుందో ఆ సేవకు తగిన పాటను సన్నాయిలో నుంచి తీసుకురావడం ఎంతో సంతోషాన్నిస్తుంది. – తిరుపతయ్య, సన్నాయి కళాకారుడు -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరణదేవరకొండ: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. ఈ ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండభీమనపల్లి గ్రామానికి బొడ్డుపల్లి శంకరయ్య ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు శంకరయ్య ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం శంకరయ్య హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పోలీసులు నమోదు చేసి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించిన ఎస్పీ చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని మల్లికార్జున్ స్కూల్ సమీపంలో శనివారం రాత్రి దొంగతనం జరిగిన ఇంటిని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్యాదవ్ పరిశీలించారు. చోరీ వివరాలను ఇంటి యజమాని లింగంపల్లి నర్సింహను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇంట్లో దాచిన రూ.22 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. భారీ మొత్తంలో నగదును ఇంట్లో పెట్టి ఊరెళ్లడం సరికాదన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు దారితీస్తాయని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదించాలని స్థానిక పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ తదితరులు ఉన్నారు. అనుమానాస్పద ిస్థితిలో వ్యక్తి మృతి చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో సోమవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. దురాజ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లబండ కాలనీకి చెందిన పల్లపు రాజు(35) వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం అతడు ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ వి. మహేశ్వర్ను వివరణ కోరగా తమకు ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. -
సోలాపూర్ నుంచి పట్టువస్త్రాలు
మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన చాట్లా శారీ సెంటర్కు చెందిన కేశవ్ చాట్లా, ఉమా చాట్లా, కృష్ణాకాంత్ చాట్లా, సోనాలి చాట్లాలు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం యాదగీరిశుడిని దర్శించుకున్న అనంతరం గోవర్ధనగిరిధారి అలంకార సేవ ముందు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తికి వారు పట్టువస్త్రాలు అందజేశారు. 8 పట్టు చీరలు, 5 పట్టు పంచెలను ఆలయాధికారులకు అందించామని, గత 25 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు అందిస్తున్నామని కేశవ్ చాట్లా వెల్లడించారు. -
తైక్వాండో పోటీల్లో బంగారు పతకం
రామగిరి(నల్లగొండ) : హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో అండర్–17 విభాగం పోటీల్లో ఎన్జీ కళాశాలకు చెందిన ఎన్.మనోజ్యాదవ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ సోమవారం మనోజ్యాదవ్ను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, నర్సింగ్ కోటయ్య, వెంకటేశ్, మన్నెం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దొంగతనం కేసులో ఏడు నెలల జైలుశిక్ష నకిరేకల్ : దొంగతనం కేసులో నిందితుడికి ఏడు నెలల జైలుశిక్ష విధిస్తూ నకిరేకల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే ఆరిఫ్ సోమవారం తీర్పు వెలువరించారు. నకిరేకల్ పట్టణంలోని విద్యానగర్లో నివాసముంటున్న ఎస్కే జాఫర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన రమావత్ శంకర్నాయక్పై నేరం రుజువు కావడంతో అతడికి ఏడు నెలల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారని నకిరేకల్ సీఐ హరిబాబు పేర్కొన్నారు. సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి తిరుమలగిరి(సాగర్): నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మొదటి మేజర్ అయిన రాజవరం మేజర్ కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. అల్వాల గ్రామానికి చెందిన బక్కతట్ల వెంకటేశ్వర్లు(38)తో పాటు అతడి బావ, మామ రాజవరం మేజర్ కాలువ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువ వద్దకు మూత్ర విసర్జనకు వెళ్లిన వెంకటేశ్వర్లు కాలు జారి ఒక్కసారిగా కాలువలో పడిపోయాడు. అతని బావ, మామకు ఈత రాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలుచుకొచ్చి వెంకటేశ్వర్లును కాలువ నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం హాలియాకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ దుర్మరణం
కోదాడరూరల్ : విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్చి పాస్టర్ మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కోదాడ రూరల్ ఎస్ఐ సీహెచ్. గోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని నయానగర్కు చెందిన ఉప్పెల్లి సత్యంబాబు(48) చర్చి పాస్టర్గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం కారులో డ్రైవర్ తిరపయ్యను తీసుకొని చిమిర్యాల గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో దోరకుంట గ్రామ శివారులోకి వెళ్లగానే.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు నుంచి వస్తున్న సత్యంబాబు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ తిరపయ్యకు గాయాలుయ్యాయి. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ఉన్న సాయిదుర్గ, గాయత్రి, స్వప్న, మాధవి మురళీకృష్ణతో పాటు డ్రైవర్ నితీష్కు కూడా గాయాలు కావడంతో స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరో ఆరుగురికి గాయాలు -
సీతారామంజనేస్వామి ఆలయంలో చోరీ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెం గ్రామ శివారులోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ ముఖద్వారానికి వేసిన తాళాన్ని రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి లోపలికి వెళ్లి సీతమ్మ అమ్మవారి మెడలో ఉన్న రెండు గ్రాముల బంగారం పుస్తెలతాడు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. మద్యం షాపులో.. సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామ శివారులోని కేటీ అన్నారం క్రాస్ రోడ్లోని జీకే వైన్స్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు షాపు పైకప్పు ఊడదీసి లోపలికి ప్రవేశించి కౌంటర్లో ఉంచిన రూ.14,500 నగదు, ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం వైన్స్ క్యాషియర్ నాగరాజు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. -
నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి
నల్లగొండ టౌన్ : కర్ల రాజేష్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఈ కేసు విచారణ అధికారి, నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా పోలీసులు పనిచేయకపోవడం వల్లే కర్ల రాజేష్ మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్గా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐని అరెస్ట్ చేయకుండా ఈ కేసుతో సంబంధం లేని సీఐని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎస్ఐని కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో అడ్డగూడూరు లాకప్ డెత్ జరిగినప్పుడు ఎస్ఐని సస్పెండ్ చేసిన పోలీసులు చిలుకూరులో మాత్రం సీఐని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ల రాజేష్ మృతదేహానికి ఈ నెల 26న బీబీనగర్ ఎయిమ్స్ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రెండు నెలల క్రితమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ రీపోస్టుమార్టంకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే అది జరగలేదన్నారు. ఇప్పటికై నా న్యాయబద్ధంగా రీపోస్టుమార్టం చేయించాలని కోరారు. నిజాయితీగా పనిచేసే పోలీసులు అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జిల్లా నరసింహ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తరి ఏడుకొండలు, నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోలి జనార్దన్గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
గోవర్ధనగిరిధారిగా అభయమిస్తూ..
● సింహ వాహనంపై ఊరేగిన యాదగిరీశుడు ● నేడు ఎదుర్కోలు ఉత్సవంయాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయంలో నిత్య కై ంకర్యాలు పూర్తిచేసి యాగశాలలో హవన పూజలు జరిపించారు. అనంతరం స్వామివారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి ప్రధానాలయం తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ అలంకార సేవను ఆలయ తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి పారాయణాలు, వేద మంత్రాలు పఠించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం సింహ వాహనంపై.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో అర్చకులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. అనంతరం స్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి పారాయణం పఠించి, స్వామి విశిష్టతను వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ మంగళ, బుధవారాల్లో ఎదుర్కోలు మహోత్సవం, తిరు కల్యాణోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు, తూర్పు మాడ, తిరు వీధులను యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్నాయుడు సోమవారం రాత్రి ఆలయాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు కల్గకుండా తీసుకోవాల్సిన అంశాలను కొండపైన ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్తో ఆయన చర్చించారు. కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్వామి వారి అలంకార సేవ ముందు వెంకట అన్నమాచార్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో పలువురు కళాకారులు కోలాటం, నృత్యాలు చేశారు. దశావతార వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్వాన్లోని విశ్వాంజనేయ భక్త సమాజం, మైలార్గూడెంలోని జై శ్రీరామ భక్త భజన మండలి, భూదాన్ పోచంపల్లికి చెందిన మార్కండేశ్వరస్వామి భజన మండలి, రంగారెడ్డికి చెందిన అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో భజన, భక్తి సంగీత కార్యక్రమాలు కొనసాగాయి. ఆస్థానపరంగా మంగళవాయిద్యం, వైధిక ప్రార్థన జరిపించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ మానస చెన్నప్ప నవవిధ భక్తితత్త్వములు, ప్రహ్లాదుని భక్తిపై ఉపన్యసించారు. పురాణం విజయలక్ష్మి రుక్మిణి కల్యాణం, హరికథా గానం చేశారు. మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్ వాయిద్యం, హైదరాబాద్లోని మంజుల డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం వేళ కచ్చపి కళా క్షేత్రం భక్తి సంగీతం, హైదరాబాద్కు చెందిన భరద్వాజ నాట్యాలయం కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన, లావణ్య లత భక్తి సంగీతం, ఓలేటి రంగమణి సింహనందిని నృత్యం, హరిప్రియ భక్తి సంగీతం కార్యక్రమాలు కొనసాగాయి.బ్రహ్మోత్సవాల్లో నేడు..మంగళవారం ఉదయం స్వామివారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారిని ఊరేగించి ఎదుర్కోలు ఉత్సవం జరిపించనున్నారు. ఆలయ తూర్పు మాడ వీధిలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. -
విద్యార్థినులకు అస్వస్థత
భువనగిరి: భువనగిరి పట్టణంలోని కేజీబీవీలో సోమవారం విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.ఈ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కేజీబీవీకి తాజాగా కొత్త బియ్యం సరఫరా కావడం.. దానితో చేసిన కిచిడీని ఉదయం విద్యార్థినులకు వడ్డించారు. కిచిడీ తిన్న విద్యార్థినుల్లో ముగ్గురు అస్వస్థతకు గురి కావడంతో అందులోని వైద్య సిబ్బంది పరిశీలించి స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు పరిశీలించి చికిత్స అందించిన అనంతరం తిరిగి పాఠశాలకు పంపించారు. ఈ విషయం పై డీఈఓ సత్యనారాయణను వివరణ కోరగా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురి కాలేదని కిడ్నీలో స్టోన్స్ వల్ల కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి సిబ్బంది తీసుకెళ్లారని చెప్పారు. ఆస్పత్రిలో వైద్యులు సైతం కిడ్నీలో స్టోన్స్ సమస్య వల్లనే విద్యార్థినులకు నొప్పి వచ్చిందని చెప్పినట్లు తెలిసింది.నేడు జాబ్ మేళాభువనగిరి: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడంలో భాగంగా ఈ నెల 24వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని అపోలో ఫార్మసీలో 100 పోస్టుల భర్తీకి ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత కలిగినవారు బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్తో హాజరు కావాలని కోరారు. భీమనపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధంభూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలంలోని భీమనపల్లిలో మార్చి1 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ కర్నాటి వరలక్ష్మి వెల్లడించారు. సోమవారం భీమనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డుసభ్యులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామ యువకుల వినతి మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. గ్రామంలో మద్యం అమ్మే బెల్టు షాపులకు నోటీసులు అందజేస్తామన్నారు. ఎవరైనా మద్యం విక్రయిస్తే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఉపసర్పంచ్ గంగదేవి గురవయ్య, వార్డుసభ్యులు కందాడి సత్తిరెడ్డి, సిల్వేరు శేఖర్, ఉపునూతుల రమణమ్మశ్రీశైలం, ఈరటి సునిత మల్లేశం, వల్లం రాణి బాలయ్య, ఉపునూతుల లింగస్వామి, బూరుగు కవిత సంతోష్, కలకుంట్ల రమేశ్, చెక్క సుధాకర్ పాల్గొన్నారు. ఎంజీయూ డిగ్రీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్ లాగ్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ ఉపేందర్రెడ్డి సోమవారం తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలు ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు. ఎంజీయూలో నైపుణ్యాభివృద్ధి కోర్సు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో వినూత్నంగా వివిధ క్రీడాంశాలపై అవగాహన కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కోర్సును ప్రవేశ పెట్టినట్లు వ్యాయామ అధ్యపకులు మురళి, వై.శ్రీనివాస్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో భాగంగా ప్రధాన క్రీడాంశాలు, వాటి విధివిధానాలు పాఠ్యాంశాలుగా బోధించడంతో పాటు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు వాలీబాల్పై అవగాహన కల్పనతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సును అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. -
సాగు, తాగునీటికి నిధులు కేటాయించాలి
భువనగిరిటౌన్ : వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే 2026 – 27 వార్షిక బడ్జెట్లో జిల్లాలో సాగు , తాగునీరు కోసం, మూసీ జల కాలుష్య నివారణకు, విద్య , వైద్యం, రహదారులు , ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు యం.డి. జహంగీర్ డిమాండ్ చేసినారు. బడ్జెట్లో జిల్లాకు తగిన నిధులు కేటాయించాలని కోరుతూ సోమవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ , బట్టుపల్లి అనురాధ, నాయకులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బొలగాని జయరాములు, మాయ కృష్ణ, గంగాదేవి సైదులు, ఎంఏ. ఇక్బాల్, మధ్యపురం రాజు పాల్గొన్నారు. -
అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలి
భూదాన్పోచంపల్లి: సర్పంచ్లు అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని భువనగిరి డీఎల్పీఓ బి. శ్రీకాంత్రెడ్డి సూచించారు. సోమవారం భూదాన్పోచంపల్లి మండలంలోని జలాల్పురం గ్రామంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడో విడతగా భువనగిరి, యాదగిరిగుట్ట, రాజాపేట, మోత్కూర్ మండలాలకు చెందిన 90 మంది నూతన సర్పంచ్లకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టం, ఉపాధిహామీ పథకం, సర్పంచ్ల విధులు, గ్రామపంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు, గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కోఆర్డినేటర్ రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్కుమార్, మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మగువ చేతికి ప్రగతి రథం
మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులుబస్సులను కొనుగోలు చేసిన తర్వాత ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందజేస్తారు. మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఏడేళ్లలో తిరిగి ఇస్తారు. ఒక్కో బస్సుకు ఆర్టీసీ ప్రతి నెలా మొదటి వారంలో అద్దె రూ. 69,468 చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. ప్రతి నెలా చెల్లించే ఈ మొత్తం సెర్ప్ కమ్యూనిటీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ కింద మండల ఖాతాలో జమఅవుతుంది. ఈ మొత్తాన్ని మహిళా సంఘాల్లోని సభ్యుల అభ్యన్నతికి వినియోగిస్తారు. ఫ ఇప్పటి వరకు 12 సంఘాలకు నిధులు మంజూరు ఫ ఒక్కో బస్సుకు రూ.36లక్షల చొప్పున.. ఫ బస్సుల కొనుగోలుకు డీడీలు చెల్లించిన అధికారులు ఫ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక భువనగిరి: మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సులకు యజమానులు కానున్నారు. ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక్కొక్కొ బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల కొనుగోలుకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) వద్ద ఉండే కమ్యూనీటి నుంచి నిధులను విడుదల చేసింది. బస్సుల అద్దె పై ఇప్పటికే ఆర్టీసీతో సెర్ప్ ఒప్పందంకుర్చుకుంది. సెర్ప్ నుంచి రూ.30లక్షలు జిల్లాలో 17 మండలాలకు గాను 17 మహిళా సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో మహిళా సమాఖ్యలో 700 నుంచి 1,100 మంది సభ్యులు ఉంటారు. ఇందులో భాగంగా బస్సుల కొనుగోలు కోసం ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక్కో బస్సు రూ. 36 లక్షల విలువ ఉండటంతో సెర్ప్ నుంచి రూ. 30 లక్షలు, మిగతా రూ. 6 లక్షలను మండల సమాఖ్య నుంచి లేదా బ్యాంకు నుంచి రుణం తీసుకుని చెల్లించనున్నారు. ఇప్పటి వరకు 12సంఘాలకు నిధులు మంజూరయ్యాయి. బస్సుల కొనుగోలుకు గాను డీడీలు కూడా చెల్లించారు. సంస్థ పై తగ్గనున్న ఒత్తిడి ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకుని ఆర్టీసీ నిర్వహిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనంగా బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూరడంతో ఆర్టీసీ పై ఒత్తిడి తగ్గనుంది. ప్రయాణాల్లో మహిళల సంఖ్య అధికంగా ఉండటంతో బస్సుల్లో సీట్లు సరిపోవడంలేదు. కొత్త బస్సులతో ప్రయాణికులకు సైతం సౌకర్యం కలగనుంది. జిల్లాలో ప్రస్తుతం 12 మహిళా సమాఖ్యలకు నిధులు మంజూరు అయ్యాయి. బస్సుల కొనుగోలు కోసం ఇప్పటికే డీడీలు చెల్లించాం. మిగిలిన మహిళా సమాఖ్యలకు రెండో విడతలో నిధులు మంజరయ్యే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల మహిళా సంఘాల సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – నాగిరెడ్డి, డీఆర్డీఓ -
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
భువనగిరి: ‘ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం.. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా వసతుల కల్పనతో పాటు పట్టిష్టమైన చర్యలు చేపట్టాం. ఈ సారి నిమిషం నిబంధనను సడలించారు. సరైన కారణం చూపితే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తాం’ అని డీఐఈఓ రమణి వెల్లడించారు. ఈనెల 25నుంచి మార్చి 18వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సోమవారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ఇంటర్ పరీక్షలకు 28 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ సారి 12,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరంలో 6,550, ద్వితీయ సంవత్సరంలో6,263 మంది విద్యార్థులున్నారు. పరీక్షల నిర్వహణకు కమిటీ ఏర్పాటు పరీక్షల నిర్వహణకు 28 మంది సీఎస్లు, 28 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, వీరితో పాటు డీఈసీ కమిటీ ఏర్పాటు చేశాం. ఇందులో కన్వీనర్గా డీఐఈఓ పాటు సభ్యులుగా మంజుల, రవీందర్ను నియమించాం. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు ప్రతి కేంద్రానికి ఒక సిటింగ్ స్క్వాడ్ను నియమించాం. ఉదయం 8.30 గంటల నుంచే కేంద్రంలోకి.. విద్యార్థులు తప్పనిసరిగా ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రంలో వారికి కేటాయించిన సీట్లో కూర్చుకోవాలి. ఆలస్యానికి సరైన కారణం చూపి ఉదయం 9.05 గంటల వరకు వస్తే అనుమతిస్తాం. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు కేంద్రంలోకి అనుమతించడం ప్రారంభిస్తారు. పరీక్ష గదిలో గోడ గడియారం ఏర్పాటు చేశాం పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. కేంద్రంలోని పరీక్ష గదిలో ప్రత్యేకంగా గోడ గడియారం ఏర్పాటు చేశాం. కాబట్టి విద్యార్థులు వాచ్లు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్లు సైతం కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష కేంద్రానికి వచ్చే క్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టిక్కెట్ను వెంట తెచ్చుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతవాతావరణంలో పరీక్ష రాయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఒక్కో కేంద్రంలో సుమారు 5 నుంచి 6 సీసీ కెమెరాలుంటాయి. ఈ కెమెరాలన్నీ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి ఉంటాయి. ప్రశ్న పత్రాల జారీ నుంచి పరీక్ష ముగిసే వరకు తరచూ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్బోర్డు చర్యలు తీసుకుంది. విద్యార్థుల ఫోన్కు వచ్చిన పోర్టల్ ద్వారా ప్రథమ సంవత్సరం విద్యార్థులైతే పదోతరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులైతే ప్రథమ సంవత్సరం హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చు. ప్రతి కేంద్రంలో నీటి వసతితో పాటు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉన్నతాధికారులు ఆదేశించారు. పరీక్ష జరుగుతున్న క్రమంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి సమస్య, సందేహం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ఫ హాజరుకానున్న 12,813 మంది విద్యార్థులు ఫ డీఐఈఓ రమణి -
సారూ.. మా సమస్యలు పరిష్కరించరూ
భువనగిరిటౌన్ : తమ సమస్యల పరిష్కారం కోసం పలువురు బాధితులు కలెక్టరేట్ గడపతొక్కారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సారూ తమ సమస్యలు పరిష్కరించండి అంటూ కలెక్టర్కు అర్జీలు సమర్పించి మొరపెట్టుకున్నారు. అర్జీలను కలెక్టర్ హనుమంతరావు.. అదనపు కలెక్టర్తో కలిసి స్వీకరించారు. మొత్తం 54 అర్జీలు వచ్చాయి. అర్జీలు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. టైర్ల కంపెనీని మూసేయాలి బొమ్మలరామారం మండలంలోని రంగాపురం గ్రామంలో ఉన్న ఎన్,ఎన్ టైర్ల కంపెనీని వెంటనే మూసివేయాలని కోరుతూ గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. టైర్ల కంపెనీ నుంచి వస్తున్న పొగ, బూడిద వల్ల ఊపిరి ఆడటం లేదన్నారు. వందలాది టైర్లు మిషన్లో వేసి కరిగించడంతో గాలి కాలుష్యం కావడంతో రోగాల బారిన పడుతున్నట్లు కలెక్టర్కు వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శ్మశాన వాటిక ఆక్రమించుకున్నారు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డు బహార్ పేట సర్వేనంబర్ 804 లో దళితుల కు సంబంధించిన శ్మశానవాటిక స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ శ్మశాన వాటికలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు ‘ముగ్గురు కోడళ్లు కలిసి నాతో పాటు నా భర్త పేరిట ఉన్న భూమిని పంచుకొని అనుభవిస్తున్నారు. నన్ను మాత్రం ఇంటి నుంచి వెళ్లగొట్టారు.నన్ను ఆదుకోవాలి’ అని గుండాల మండలం రామారం గ్రామానికి చెందిన మర్రిపెల్లి సుగుణమ్మ అనే వృద్ధులు కలెక్టర్ను ప్రజావాణిలో వేడుకుంది. తనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలని వీరందరికీ పెళ్లిళ్లు కూడా చేసినట్లు తెలిపింది.తన భర్త అంజయ్య 2008లో మరణించగా కాలక్రమేణా ముగ్గురు కొడుకులు కూడా మృతి చెందినట్లు వెల్లడించింది. 12 ఏళ్లుగా కోడళ్లు సరిగా చూసుకోవడం లేదని ప్రస్తుతం కుమార్తెలు, అల్లుళ్లు ఆశ్రయం కల్పించారని తెలిపింది. తన భర్త పేరిట ఉన్న సుమారు 1.22 ఎకరాలు, తన పేరిట ఉన్న 1.32 ఎకరాల భూమికి సంబంధించి భూ భారతి రికార్డుల్లో పేరు నమోదు చేయించి, పాస్ పుస్తకం ఇప్పించాలని కోరింది. కలెక్టర్ వెంటనే గుండాల తహసీల్దార్తో మాట్లాడారు. భర్త పేరున ఉన్న భూమిని వృద్ధురాలు పేరున మార్చాలని, ఆ భూమిని తిరిగి ఎవరూ అమ్ముకోకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ఫ ప్రజావాణిలో కలెక్టర్కు బాధితుల వేడుకోలు -
నిబంధనలు ఉల్లంఘిస్తే తాళం వేస్తాం
భూదాన్పోచంపల్లి: నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే రసాయన కంపెనీలకు తాళం వేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి హెచ్చరించారు. భూదాన్పోచంపల్లి మండలం దోతిగూడెంలోని వీజెసాయి కెమికల్ కంపనీలో నాలుగు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఉద్యోగి సజీవ దహనం అయిన నేపథ్యంలో ఘటనా స్థలాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, బాఽధిత కుటుంబానికి పరిహారం ఇచ్చి ఆదుకొన్నారా లేదా అని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని చిన్న కంపెనీలు నిబంధనలు పాటించకపోవడంతో కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కాలుష్యం ఒకవైపు కంపనీల్లో వరుస పేలుళ్ల ఘటనలు మరో వైపు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూధన్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్ఐ భాస్కర్రెడ్డి, సర్పంచ్ యాట జంగయ్య, ఉపసర్పంచ్ బద్దం వెంకట్రెడ్డి, పాక మల్లేశ్, తడక వెంకటేశ్వర్లు, లవకుమార్, సామ మధు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు
మునగాల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం మండలంలోని నారాయణగూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణగూడెంలో అగ్ర వర్ణాలకు చెందిన వారు మాలలపై విపరీతంగా దాడి చేశారన్నారు. తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా శాయంపేటలో మాలబిడ్డపై దాడి జరిగితే దానిని తీవ్రంగా ఖండించి ఆ బిడ్డకు న్యాయం చేకూర్చినట్లు తెలిపారు. కారంచెడు, చుండూరు, ఈ మధ్య మరియమ్మపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించి వారికి న్యాయం చేసేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాడిందన్నారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసలతో మృతిచెందితే దానిని తీవ్రంగా ఖండించడంతో పాటు దోషులను శిక్షించాలని నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. -
పాలిటెక్నిక్ కళాశాలలో నూతన కోర్సులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా రెండు కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులను కొత్తగా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కోర్సులు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పిస్తాయని వెల్లడించారు. పాలిసెట్ 2026లో ఎక్కుల సంఖ్యలో విద్యార్థులు నమోదు కావాలని ఆకాంక్షించారు. కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి కార్మికుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులుగా పనిచేస్తున్న వారు నేటికీ శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికులకు జీతభత్యాల అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 28న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వరంగల్లో జరగనున్న సభకు కార్మికులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వనాథులు లెనిన్, యాదగిరి, ిసీహెచ్.నిర్మల, పి.ఎల్లమ్మ, పద్మ, రామేశ్వరమ్మ, అన్నపు లింగస్వామి, సందీప్, మధు, సబిత, నిర్మల, ఉషమ్మ, యాదమ్మ పాల్గొన్నారు. ఖోఖో సంబురం నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఔట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఖోఖో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సత్తాచాటి తెలంగాణకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల జట్లు నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికాారి అక్బర్ అలీ, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఆత్మకూర్(ఎస్)మండలానికి చెందిన విద్యార్థి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన ఎస్. శ్రీనాథ్ గతేడాది ఆదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూల్లో 6వ తరగతి చదివాడు. ఈ విద్యాసంవత్సరం 7వ తరగతిలో హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు బదిలీ అయ్యాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం స్కూల్లో శ్రీనాథ్ ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పాఠశాల సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆస్పత్రికి చేరుకొని శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే శ్రీనాథ్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు
నకిరేకల్: అక్రమంగా మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారని రైతులపై పోలీసులు, ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలం గొల్లగూడెం శివారులోని భూపతి కుంటను ఆదివారం చిరుమర్తి లింగయ్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపతి కుంటలో నెల రోజులుగా రోడ్డు పని పేరుతో ఇక్కడి ఎమ్మెల్యే పేరు చెప్పుకుని భారీగా మట్టిని అక్రమంగా తరలించారని ఆరోపించారు. తాజాగా ఇక్కడ రైతులు కుంట సమీపంలో తమ పట్టా భూముల్లో మట్టిని తీస్తుండగా పోలీసులు, ఇరిగేషన్ అధికారులు సందర్శించి కుంట భూమిలో తవ్వకాలు చేస్తున్నారని వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. భూపతి కుంటలో వారు చేస్తున్న మట్టి దందాను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ఒత్తిడితో బీఆర్ఎస్కు చెందిన రైతులపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, కట్టంగూర్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తలారి బలరాం, నాయకులు సూదిని జానకీరెడ్డి, యానాల లింగారెడ్డి, జీడిపల్లి శేఖర్రెడ్డి ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
మున్సిపల్ బడ్జెట్పై కసరత్తు!
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాల కొలువుదీరాయి. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చిలో బడ్జెట్ రూపొందిస్తారు. ఇందులో భాగంగా వార్షిక బడ్జెట్ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చైర్మన్లతో చర్చించి ప్రతిపాదనలు తయారు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రతిపాదనలు అనంతరం బడ్జెట్ ఆమోదించేందుకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బడ్జెట్ రూపకల్పన ఇలా..జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, పోచంపల్లి, మోత్కూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీకి సంబంధించి ఆదాయం, ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వంటి పనుల ఆధారంగా బడ్జెట్ రూపొందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్, టెండర్లకు సంబంధించిన ఈఎండీ (డిపాజిట్లు)ల ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తారు. తర్వాత మున్సిపాలిటీల పరిధిలో రోడ్ల నిర్వహణ, డ్రెయినేజీ, శానిటేషన్ వంటి పనులకు ఖర్చులను లెక్కించనున్నారు. వీటితోపాటు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు, ఆర్థిక సంఘం నిధులు ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకుని 10–20శాతం పెంచి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ఈ బడ్జెట్లో 10శాతం తప్పనిసరిగా గ్రీన్ బడ్జెట్కు కేటాయించాల్సి ఉంటుంది.కలెక్టర్ పరిశీలన.. కౌన్సిల్ ఆమోదం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కలెక్టర్ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది. కలెక్టర్ పరిశీలించడంతో పాటు ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేస్తారు. అనంతరం వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తారు. చైర్మన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను కౌన్సిలర్లు చర్చించి, ఆమోదించిన తర్వాత కలెక్టర్కు పంపిస్తారు. తిరిగి కలెక్టర్ నుంచి మున్సిపల్ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించనున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి మార్చిలో బడ్జెట్ రూపకల్పన చైర్మన్లతో చర్చించి ప్రతిపాదనలు తయారు చేసేందుకు సన్నాహాలు -
పంచాయతీలకు నిధులు
భువనగిరిటౌన్ : రెండేళ్ల నుంచి ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖజానాలు ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరి 2వ తేదీతో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు పాలకులు లేకపోవడంతో ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయి అభివృద్ధి కుంటుపడింది. పంచాయతీల సాధారణ ఖర్చులు, కార్మికుల వేతనాలకు కూడా ఇబ్బందులు ఎదురుకావడంతో కార్యదర్శులు అప్పులు చేసి మరీ గట్టెక్కిస్తూ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి గత డిసెంబర్ 22న పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడంతో జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. నిధుల విడుదల ఇలా..2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.59 కోట్లు విడుదల చేసింది. జనాభా ప్రతిపాదికన ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.48 వేల నుంచి రూ.9.8 లక్షల వరకు జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మార్చి 31లోగా వినియోగించుకునేందుకు అవకాశం60 శాతం నిధులు పారిశుద్ధ్య పనులు, తాగునీటి అవసరాలకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన నిధులను గత అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు, ఇతర బిల్లులు సక్రమంగా ఉన్న వాటికి కూడా వినియోగించేలా అవకాశం కల్పించారు. ఖర్చులు పోనూ ఇంకా మిగిలితే కొత్త పనులు చేపట్టేందుకు కూడా ఉపయోగించవచ్చు. అయితే కేంద్రం విడుదల చేసిన ఈ నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు పాలకవర్గాలు ఈ నిధులను ఖర్చు చేస్తే త్వరలోనే మిగిలిన నిధులు కూడా మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 427 గ్రామ పంచాయతీల ఖాతాల్లో రూ.7.59 కోట్లు జమ 60 శాతం నిధులు పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు -
నాలుగు దశాబ్దాల అ‘పూర్వ’ సమ్మేళనం
మఠంపల్లి : మండల కేంద్రంలోని వీవీ హైస్కూల్లో 1985–86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం బక్కమంతులగూడెం వద్ద మామిడి తోటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఒకేచోట కలుసుకున్నారు. నలభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులుకిష్టపాటి వెంకట్రెడ్డి తాటికొండ సత్యనారాయణరెడ్డి, సామేల్, రాజు, జ్వానిస్, రవికుమార్, సుధాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, కరుణాకర్రెడ్డి, అప్పిరెడ్డి, లక్ష్మీనారాయణ, మీరాసాబ్, అంజయ్య, రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, నగేష్, శంభయ్య, బేత కోటమ్మ, ప్రతాపరెడ్డి, ఇన్నాశమ్మ, విజయమేరి, టేక్లారాణి, సోములమ్మ, వాణిశ్రీ, మంగమ్మ, చంద్రకళ, ఫాతిమా, మేరీ, సుజన, థెరీసా, విజయ, రమణ, పద్మ, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భూముల రీ సరే్వ
సాక్షి, యాదాద్రి: రైతుల భూముల సమస్యలకు చెక్ పెట్టేందుకు మొత్తం భూములను సర్వే చేసి రైతులకు భూధార్కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో రెండు గ్రామాలను పైలట్ గ్రామాలుగా తీసుకుని భూభారతి చట్టం ప్రకారం భూముల రీసర్వే నిర్వహించనున్నారు. ఈమేరకు భువనగిరి మండలం చందుపట్ల, బొమ్మలరామారం మండలం మునిరా బాద్లను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేశారు. సర్వే కోసం ఇప్పటికే గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. సంకారంతి పండుగకే భూదార్కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు రావడంతో సర్వే నిలిచిపోయింది. ఎన్నికలు ముగియడంతో తిరిగి సర్వే ప్రక్రియ చేపట్టనున్నారు. సర్వే ఇలా చేస్తారుఈ రీసర్వేలో భాగంగా భూ భారతి చట్టం ప్రకారం ప్రతి ఇంచు భూమి లెక్క తేల్చనున్నారు. హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూములు, కుంటలు, శిఖం, వక్ఫ్, ఎండోమెంట్, రైతుల పట్టా భూములను ఖాతాల వారీగా సర్వే చేయనున్నారు. తొలి దశలో ఎంపిక చేసిన ఫైలట్ గ్రామాల్లో సర్వే చేస్తారు. సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి, భూమి యజమానితోపాటు చుట్టు పక్కల రైతుల ముందు సర్వే చేస్తారు. రేఖాంశాలు, అక్షాంశాల మధ్యన ఈ భూమి సర్వే జరుగుతుంది. ఇందులో భూమి విస్తీర్ణం, హద్దులు తనిఖీ చేస్తారు. భూమి యాజ మాన్య వివరాలను నమోదు చేస్తారు. వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. ల్యాండ్ పార్సిల్ మ్యాప్ తయారుకచ్చితత్వంతో కూడిన పూర్తి సమాచారం తీసుకుని ల్యాండ్ పార్సిల్ మ్యాప్ను రూపొందిస్తారు. సర్వేకోసం వచ్చిన అధికారులకు రైతులు తమ వద్ద ఉన్న భూమి సమగ్ర వివరాలను అందజేయాలి. అభ్యంతరాలు ఉంటే తెలపాలి. రైతుల సర్వేనంబర్లు, ఖాతా వారీగా టైటిల్ ఆధారాలు తీసుకుని చుట్టు పక్కల రైతులను విచారిస్తారు. భూమిలో తేడాలు, సర్వే నంబర్ల తేడాలు వంటివి గుర్తిస్తారు. ఒక సర్వే నంబర్ రికార్డులో ఉండి, కబ్జా మరో చోట ఉంటే వాటిని సరిచేస్తారు. పాస్బుక్లో ఉన్న రికార్డు ఆధారంగా భూమిని సరిచేస్తారు. రైతులకు భూధార్కార్డులు జారీ చేసేందుకు భూముల సర్వే పైలట్ గ్రామాలుగా చందుపట్ల, మునిరాబాద్ ఎంపిక ఇప్పటికే గ్రామసభలు నిర్వహించిన అధికారులు తీరనున్న భూముల చిక్కులుగ్రామ సభల నిర్వహణ ఎంపిక చేసిన భూ భారతీ ఫైలట్ గ్రామాల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని రైతులను గ్రామ సభకు ఆహ్వానించి భూ ధార్ కార్డుల గురించి వివరిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మునిరాబాద్, చందుపట్లలో గ్రామాల్లో సర్వే ప్రారంభం కానుంది. అనంతరం జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం సర్వే చేపట్టనుంది.గ్రామం మండలం మొత్తం ఎకరాలుమునిరాబాద్ బొమ్మలరామారం 521.3 చందుపట్ల భువనగిరి 2,536 -
చెట్టు పట్టాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
● ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంమర్రిగూడ : మండలంలోని ఖుదాబక్షపల్లిలో పేద రైతులకు సంబంధించిన చెట్టు పట్టాల సమస్య గురించి శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం ఖుదాబాక్షపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖుదాబక్షపల్లిలో 70ఏళ్ల క్రితం గుట్ట ప్రాంతంలో పేద రైతులకు ఇచ్చిన చెట్టు పట్టాలను రద్దుచేయకుండా పోరాడుతానన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అనంతరం రాంరెడ్డిపల్లి పరిధిలోని తానేదార్పల్లికి చెందిన సీపీఐ కార్యదర్శి కర్నాటి అంజయ్య తల్లి చంద్రమ్మ ఇటీవల మృతిచెందగా ఎమ్మెల్సీ ఆ గ్రామానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, మేతరి యాదయ్య, పొట్ట అశోక్, గిరి ముత్తయ్య, ఎరుకల నిరంజన్గౌడ్, అబ్బనగోని కృష్ణయ్య, జాల చంద్రయ్య, పాముల రమేష్, అడమయ్య, కొమురయ్య పాల్గొన్నారు. -
మురళీకృష్ణుడిగా నారసింహుడు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం ఆలయంలో నిత్యారాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని మురళీకృష్ణుడిగా అలంకరించి పల్లకీపై అధిష్టింపజేసి మాడ వీధిలో ఊరేగించారు. ఆ తర్వాత తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి వేద పారాయణం పఠించారు. అనంతరం మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఆలయాధికారులు, అర్చకులు, పారాయణీకులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. అనంతరం స్వామివారిని పొన్న వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో నేడు..వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ నిర్వహించనున్నారు. పొన్న వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు -
బైక్ను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
మఠంపల్లి: ఇంటి బయట పార్కింగ్ చేసిన బైక్కు గుర్తుతెలియని వ్యక్తుల నిప్పుపెట్టడంతో కాలిబూడిదైంది. ఈ ఘటన మఠంపల్లి మండలం లాలితండాలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఆదివారం బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లాలితండాకు చెందిన వార్డు సభ్యుడు భూక్యా కమల్నాయక్ తన బైక్ను శనివారం రాత్రి ఇంటి పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బైక్కు నిప్పుపెట్టి తగలబెట్టారు. ఆదివారం ఉదయం బైక్ తగలబడినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. బాబు తెలిపారు. లారీ ఢీకొని కారు బోల్తాదేవరకొండ: లారీ ఢీకొని కారు పల్టీ కొట్టిన ఘటన దేవరకొండ పట్టణ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట గ్రామానికి కంభంపాటి ఇందిర, కంభంపాటి కుందన ఆదివారం డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసి తమ బాబాయి కిరణ్ కారులో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో దేవరకొండ పట్టణ శివారులోని ఉప్పువాగు సమీపంలోకి రాగానే వెనుక నుంచి లారీ వచ్చి వీరి కారును ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. బైక్పై నుంచి పడి యువకుడి మృతికొడకండ్ల : బైక్పై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల శివారులో తిరుమలగిరి మండలం వెలిశాల హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం జరిగింది. స్థానిక ఎస్ఐ చింత రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్ నెహ్రూ(38) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని నిమిత్తం శనివారం బైక్పై వెలిశాల గ్రామానికి వెళ్లాడు. తిరిగి రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో అదే తండాకు చెందిన గుగులోత్ శంకర్ బైక్పై వెలిశాల హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద అతడికి అడ్డురావడంతో నెహ్రూ బైక్పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతిదేవరకొండ : ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం దేవరకొండ పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మడమడక గ్రామ జీపీఓగా పనిచేస్తున్న ఇరిగి శంకర్ కుమారుడు అన్మోల్(11) పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తండ్రి శంకర్తో కలిసి బాలుడు ముదిగొండ రోడ్డులో వాకింగ్కు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలోని బావిలో పడి అన్మోల్ మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
భూదాన్పోచంపల్లి : మండలంలోని జలాల్పురం గ్రామ సమీపంలో ఆది వారం వేగంగా వెళ్తు న్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఎల్బీనగర్కు చెందిన మనోహర్ పోచంపల్లి పట్టణంలోని ప్రకాశ్నగర్లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేశాడు. ఆదివారం ఇంట్లో మనోహర్ ఉప్పలమ్మ పండగ చేయగా.. హైదరాబాద్ నుంచి బంధువులు, మిత్రులు వచ్చారు. తిరిగి సాయంత్రం కొందరు బంధువులు కారులో హైదరాబాద్కు వెళ్తుండగా.. జలాల్పురం గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకులను వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. కాగా క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. కారు ఢీకొని.. మునగాల: మండలంలోని మాధవరం గ్రామ శివారులో నేలమర్రి రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నేలమర్రి గ్రామానికి చెందిన నాగయ్య, శ్రీను ద్విచక్ర వాహనంపై మాధవరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనానని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారును అక్కడే వదలి డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది స్టాలిన్, నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మహిళా సంఘాలకు సొంత భవనాలు
అడ్డగూడూరు: మహిళా స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకునేవారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు గ్రామాల్లో మహిళా సంఘాల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వీబీ జీ రామ్జీ (జాతీయ ఉపధి హామీ పథకం) నిధులతో ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షలు కేటాయించింది. రూ.10 లక్షలతో భవన నిర్మాణం వీబీ జీ రామజీ పథకం కింద ఒక్కో గ్రామ సమాఖ్య సంఘానికి 200 గజాల స్థలంలో రూ.10 లక్షలతో భవనాలు నిర్మించనున్నారు. ఐకేపీ ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు ఆయా గ్రామాల్లో స్థల పరిశీలన చేయనున్నారు. తీర్మాణాలు చేసి డీఆర్డీఓ ద్వారా కలెక్టర్కు నివేదిక పంపించనున్నారు. మంజూరైన భవన నిర్మాణాలను పలు గ్రామాల్లో ఇప్పటికే ప్రారంభించారు. ఈ భవనాల్లో రైతు వేదికల మాదిరిగానే కుర్చీలు, బల్లలు, ప్రొజెక్టర్, ఇంటర్న్ట్ సదుపాయం, వీడియో కాన్ఫరెన్స్ టీవీ, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే గ్రామ సమాఖ్య సంఘాల భవనాల కోసం ప్రతిపాదనలకు తీర్మానాలు చేయగా, అందులో 186 భవనాలకు ఇప్పటికే అనుమతులు లభించాయి. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన ప్రతిపాదనలపై త్వరలోనే అనుమతులు రానున్నట్లు సమాచారం. 186 భవనాలకు అనుమతులు 200 గజాల స్థలంలో రూ.10 లక్షలతో భవన నిర్మాణం భవనం మంజూరు చేయడం సంతోషంగా ఉంది మాకు ఇప్పటివరకు సమావేశాలు నిర్వహించుకోవడానికి సొంత భవనం లేక ఇబ్బందులు పడ్డాం. ఇళ్లలో సమావేశాలు పెట్టాల్సి వచ్చేది. శిక్షణ సమయంలో కూర్చోవడానికి కూడా సదుపాయాలు ఉండేవి కావు. మహిళా సంఘాలకు సొంత భవనాలు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. – పసునూరి లక్ష్మి, అడ్డగూడూరు -
బుద్ధవనం సందర్శించిన దక్షిణ కొరియా ప్రతినిధులు
నాగార్జునసాగర్: దక్షిణ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యా సాంస్కృతిక ప్రతినిధుల బృందం సభ్యులు కాంగ్సుంగ్, చోయ్ సేంగహో, మిన్ క్యేయోంగ్వూ, కవన్ జిన్ వోక్, శేషు, చిరాగ్ జలది తదితరులు ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. హైదరాబాద్లో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న వీరు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా బుద్ధచరిత వనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనాలను సందర్శించారు. స్థూప వనంలో నిర్మించిన దక్షిణ కొరియా మహాస్థూపాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు వారిని ఘనంగా సత్కరించారు. బుద్ధవనంలో చేపట్టబోయే నూతన నిర్మాణాల గురించి వారికి తెలిపారు. వారి వెంట స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ ఉన్నారు. -
రేచర్ల రెడ్డి రాజుల పాలనకు సాక్ష్యం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : కాకతీయుల కాలంలో పిల్లలమర్రిని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రేచర్ల రెడ్డి రాజులు ఇప్పటి ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ దేవాలయంతో పాటు దాని సమీపంలో మెట్లు, యాగశాలతో కూడిన కోనేరును నిర్మించారు. కాలక్రమేణా ఈ కోనేరు పూర్తిగా పూడిపోయి ఆదరణ కోల్పోయింది. ప్రజాప్రతినిధులు అనేకసార్లు హామీ ఇచ్చినా పునరుద్ధరణకు నోచుకోలేదు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావి చుట్టూ కాకతీయులకు సంబంధించిన స్తంభాలు ఉన్నట్లు గుర్తించారు. కోనేటి అభివృద్ధి కోసం గతంలో అధికారులు నిధులు కేటాయించడంతో కోనేరు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ కోనేరు చుట్టూ వ్యవసాయ భూములకు నీటిని తోడేందుకు మోట బావులు ఉండటం విశేషం. ఇలాంటి కోనేరులను బాగు చేసి భావితరాలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
మృతుడి కుటుంబానికి రూ.80లక్షల పరిహారం
భూదాన్పోచంపల్లి : మండలంలోని దోతిగూడెంలోని వీజె సాయి కెమికల్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు వల్ల మృతిచెందిన ధార పవన్ కుటుంబానికి రూ.80లక్షల పరిహారం చెల్లించేలా కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు శనివారం మృతుడి భార్య సౌజన్యకు ఒప్పంద పత్రాలు అందజేశారు. కాగా పరిహారం చెల్లించే విషయమై మృతుడి బంధువులు, కంపెనీ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు చర్చలు జరిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, సర్పంచ్ యాట జంగయ్య, ఉప సర్పంచ్ బద్దం వెంకట్రెడ్డి, పలువురు గ్రామస్తులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు కంపెనీనీ యాజమాన్యం దిగొచ్చి మృతుడి కుటుంబానికి తక్షణం రూ.5లక్షలతో పాటు మూడు విడతల్లో నెలకు రూ.25 లక్షల చొప్పున పరిహార చెక్కులతో పాటు నెలనెలా రూ.10వేలు పీఎఫ్ చెల్లించేలా ఒప్పందం చేసుకొని పత్రాలు అందజేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కంపెనీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్ఐ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అర్థరాత్రే పోలీసులు పవన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఫ అంగీకరించిన వీజె సాయి కెమికల్ కంపెనీ యాజమాన్యం -
ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి
దేవరకొండ: పట్టణంలోని సంజయ్కాలనీలో గల పీర్ల బావిని రేచర్ల వెలమ రాజుల కాలంలో నిర్మించారు. ఒకప్పుడు పట్టణంలోని చాలా కాలనీల ప్రజలు ఈ బావి నీటినే తాగేవారు. బావిలోకి దిగేందుకు బండరాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి నుంచి దేవరకొండ ఖిలాకు సొరంగ మార్గం ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. బావిలోకి చెలిమె ద్వారా వచ్చే నీటికి ఎంతో రుచి ఉండేదని, దీంతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఈ నీటిని తీసుకెళ్లేవారు. ప్రస్తుతం ఈ బావి నీటి వాడకం తగ్గింది. కానీ ఇప్పటికీ కొందరు తమ ఇంటి అవసరాలకు మోటార్ల ద్వారా ఈ బావి నీటిని వినియోగిస్తున్నారు. ఈ బావి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ బావిని పునరుద్ధరించి గత వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆటోమొబైల్ షాపులో అగ్ని ప్రమాదం
నకిరేకల్ : ఆటోమొబైల్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి కాలిబూడిదయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని శివాజీనగర్కు చెందిన జ్వాల ఉపేందర్ స్థానిక సాయి మందిరం సమీపంలో సాయి విఘ్నేష్ ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. దాని పక్కనే బైక్ రిపేర్ దుకాణం కూడా నడుపుతున్నాడు. ఉపేందర్ రోజుమాదిరిగానే శనివారం ఉదయం తన సతీమణిని ఆటోమొబైల్ షాపులో ఉంచి పక్కన ఉన్న బైక్ మెకానిక్ షాపులో బైక్లు రిపేర్ చేస్తున్నాడు. మధ్యాహ్నం ఉపేందర్ భార్య భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేటనికే ఆటోమొబైల్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. పక్కన బైక్లు రిపేర్ చేస్తున్న ఉపేందర్ బయటకు వచ్చి ఆటోమొబైల్ షాపులోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు. వెంటనే ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. మంటలు బయటకు వ్యాపించడంతో పక్కన షాపుల వారు తమ షట్టర్లును బంద్ చేసి రోడ్డు మీదకు పరుగులు పెట్టారు. ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఫర్నీచర్తో పాటు ఆయిల్ డబ్బాలు, బైక్ స్పేర్ పార్ట్స్ మంటల్లో కాలిబూడిదయ్యాయి. రూ.50లక్షల పైనే నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ఘటనా స్థలాన్ని డిప్యూటీ తహసీల్దార్ యశ్వంత్ సందర్శించి వివరాలు సేకరించారు. సర్వం కోల్పోయాం.. తన పెద్ద కుమారుడు ఫీజు కోసం తెచ్చిన రూ.3లక్షల నగదు, ప్లాట్లు, భూమి డాక్యుమెంట్స్ క్యాష్ కౌంటర్లో పెట్టానని, అవన్నీ కాలిబూడిదయ్యాయని షాపు యజమాని జ్వాల ఉపేందర్ తెలిపాడు. తాను సర్వం కోల్పోయానని బోరున విలపించాడు. ఫ రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడి ఆవేదన -
ఒకే రూపం.. రెండు ప్రాణాలు
నేడు ప్రపంచ కవలల దినోత్సవం ఆర్యన్, కార్తికేయన్ హిమాన్షు, హితాన్ష్ వంశీ తేజ్, వంశీ క్రిష్ సాయి భార్గవి, సాయి కీర్తన సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఆ ఏడుగురు ఎవరు.. ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. కానీ అందులో ఒకే రూపంతో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే అదో గొప్ప అనుభూతే. కవలల మధ్య ఉండే బంధం చాలా విలక్షణమైనది. ఒకే గర్భంలో పెరిగి, ఒకేసారి లోకాన్ని చూసే వీరు చాలా సందర్భాల్లో ఒకరి మనసులో మాటను మరొకరు సులభంగా గ్రహిస్తారు. కవలల జీవితంలో ఎన్నో తమాషా సంఘటనలు జరుగుతుంటాయి. వారు ఒకేలా ఉండటం వల్ల స్కూల్లో టీచర్లు, స్నేహితులు, ఒక్కోసారి బంధువులు కూడా వారిని గుర్తుపట్టడంలో తప్పులు చేస్తుంటారు. ఆదివారం కవలల దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలువురు కవలలను చూద్దాం. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
భవంతిని తలపించేలా..
చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట శివారులో 200 ఏళ్ల క్రితం నిర్మించిన మెట్ల బావి ఉంది. అయితే ఈ బావిని ఎవరు నిర్మాణం చేశారన్న విషయంలో స్పష్టత లేదు. ఈ బావి అసఫ్జాహీల కాలానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. దీనిని 40 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల లోతులో పూర్తిగా రాళ్లతో నిర్మించారు. 30 అడుగుల దిగువన బావిలో మూడు అంతస్తుల్లో 12 గదులు ఏర్పాటు చేశారు. సాగు, తాగునీటితో పాటు స్నానాలు చేసేందుకు అనువుగా ఈ బావిని నిర్మించినట్లు తెలుస్తోంది. బావి చుట్టూ నడిచేందుకు, విశ్రాంతి గదుల వైపు వెళ్లేలా లోపలి భాగంలో రెండు అంతస్తుల్లో అరుగులు నిర్మించారు. బావి ఉత్తర భాగంలో మెట్లు ఏర్పాటు చేశారు. బావిలోని మూడో అంతస్తు పైన నీటిని తోడేందుకు ప్రత్యేక అర ఉంది. -
చరిత్ర కను‘మరుగు’
చిట్యాల: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని రామలింగేశ్వరస్వామి ఆలయం ఎదుట పురాతన కోనేరు(మెట్ల బావి) ఉంది. 1100 ఏళ్ల క్రితం కాకతీయ రాజుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగిందని, కాకతీయుల పట్టపురాణి రాణి ముప్ప మహాదేవి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి జాతరను ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ సమయంలోనే గుట్ట కింద కోనేరు నిర్మించారు. కోనేరు చుట్టూ రాత్రితో గుండ్రటి గుమ్మటాల ఆకారంలో గదులు, కోనేరులోకి దిగేందుకుగాను వీలుగా మెట్లు నిర్మించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ కోనేరు పూర్తిగా కంపచెట్లతో నిండిపోయి ఉండగా.. గ్రామస్తులు కోనేరులో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు అందులోకి నీరు వచ్చి చేరింది. కోనేరు పక్కన నిర్మాణాలు కొంతమేర ధ్వంసం కాగా మరికొన్ని నిర్మాణాలు నేటికీ కనిపిస్తున్నాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఈ కోనేరు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకొస్తే పురాతన కట్టడాన్ని పరిరక్షించి వారసత్వ సంపదను ముందు తరాలకు అందించినట్లవుతుంది. -
చిక్సిత పొందుతూ వ్యక్తి మృతి
చిలుకూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి దేశబోయిన కాశయ్య(43) రెండు రోజుల క్రితం పని నిమిత్తం నేరేడుచర్లకు వెళ్లాడు. అతడు నేరేడుచర్ల పట్టణంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి బొలేరో వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాశయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా చిక్సిత పొందుతూ శనివారం మృతిచెందాడు. -
రాచకొండకే తలమానికం
సంస్థాన్ నారాయణపురం : 400 ఏళ్ల క్రితం రాచకొండను ఎలిన సింగభూపాలుడు రాచకొండ ప్రాంతంలో మూడు మెట్ల బావులు నిర్మించారు. అందులో ఒకటి పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. మరో బావి అటవీ ప్రాంతంలో ఉంది. హజ్రత్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంతంలో ఉన్న మెట్ల బావి 90శాతం మేర బాగుంది. 2024 కంటే ముంది ఈ బావి కూడా పూర్తిగా పూడుకుపోయింది. బావి చుట్టూ ముళ్ల పొదలు, భూమి పైన ఉన్న రాతి కట్టడం ధ్వంసమైంది. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ బావి అభివృద్ధి కోసం రూ.30లక్షలు మంజూరు చేశారు. మెట్ల బావిలో పూడిక తీసి, బావి లోపల రాతి కట్టడాల మధ్య సిమెంట్ పనులు చేయించారు. ఈ పనులు పూర్తికావాల్సిన సమయంలో కలెక్టర్ పమేలా సత్పతి బదిలీపై వెళ్లడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. వానాకాలంలో వర్షాలకు మెట్లబావిలోకి నీరు చేరింది. ప్రస్తుతం బావిలో సగం వరకు నీళ్లు ఉన్నాయి. బావి చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది. -
బావితరాలకు అందిదా్దం..
● ఆనవాళ్లు కోల్పోతున్న పురాతన మెట్ల బావులు ● వాటిని సంరక్షించాలని కోరుతున్న ప్రజలు ఉమ్మడి జిల్లాలో రాజుల కాలంలో నిర్మించిన మెట్ల బావులు శిథిలావస్థకు చేరాయి. కొన్నిచోట్ల కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సహకారంతో పురాతన బావులను పునరుద్ధరించి నప్పటికీ వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఆనవాళ్లు కోల్పోయాయి. పునరుద్ధరించారు.. నిర్వహణ మరిచారు -
నాటి వైభవాన్ని కమ్మేశాయి
రాజాపేట : రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో కాకతీయుల కాలంలో శివాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో మెట్ల బావి (కోనేరు) నిర్మించారు. బావి పైభాగంలో గ్రామంలో ఊర చెరువు నిర్మించారు. ఈ ఊర చెరువులో నీరు ఉన్నంతకాలం మెట్ల బావిలో సమృద్ధిగా నీరు లభిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మెట్ల బావి శిథిలావస్థకు చేరి పిచ్చి మొక్కలతో నిండి కనిపించకుండా పోయింది. శివాలయాన్ని ఆధునీకరణ చేసే క్రమంలో మెట్ల బావిలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి తిరిగి పిచ్చి మొక్కలు పెరిగి కోనేరు కనిపించకుండా శిథిలావస్థకు చేరింది. అధికారులు స్పందించి మెట్ల బావిని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రెండు బైక్లు ఢీ.. వ్యక్తి మృతి
తిరుమలగిరి (తుంగతుర్తి): రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. లాక్యతండాకు చెందిన గుగులోత్ నెహ్రూ(30) బైక్పై వెళ్తుండగా.. వెలిశాల గ్రామంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెహ్రూ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక నడిగూడెం : మండల పరిధిలోని బృందావనపురం గ్రామానికి చెందిన కాసాని సాయి జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పేరెల్లి కోటి, కార్యదర్శి కరుణాకర్ శనివారం తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన కాసాని సాయి చిన్నప్పటి నుంచి కబడ్డీలో రాణిస్తూ జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు వారు పేర్కొన్నారు. సాయి జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. -
సవాళ్లను సాంకేతికతతో అధిగమించాలి
భూదాన్పోచంపల్లి : సామాజిక సవాళ్లకు సాంకేతికత ద్వారా పరిష్కార మార్గాలు చూపాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య అన్నారు. శనివారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో సీఎస్ఈ, ఏసీఎస్ఈ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కిల్–స్ప్రింట్ 2.0 హ్యాకథాన్’ ముగింపు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. సమాజానికి ఉపయోగపడే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ను రూపొందించాలని కోరారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. వినూత్న ఆలోచనలతోనే నూతన ఆవిష్కరణలు జరుగుతాయని అన్నారు. ఆ దిశగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో టీమ్ వర్క్, ప్రాక్టికల్ దృక్ఫథాన్ని పెంపొందించడానికి హ్యాకథాన్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కాగా 24 గంటల పాటు నిరంతరాయంగా నిర్వహించిన హ్యాకథాన్లో విద్యార్థులు సుస్థిర, పర్యావరణంపై ప్రాజెక్ట్లు ప్రదర్శించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ డేటా కంపెనీ డీఎం శివకుమార్, ప్రాక్టీస్ హెడ్ శీరం నాగేశ్వర్రావు, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.ఫ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
భూదాన్పోచంపల్లి : గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలంలోని జలాల్పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండో విడతగా బొమ్మలరామారం, ఆలేరు, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలకు చెందిన నూతన సర్పంచులకు ఇస్తున్న శిక్షణ తరగతుల్లో వారు పాల్గొని మాట్లాడారు. ఆదర్శ పంచాయతీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో ప్రధానంగా తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్యం, విద్యుద్దీపాలతోపాటు వైకుంఠథామాలు, హరితహారంపై దృష్టి సారించాలన్నారు. మంచి పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో భువనగిరి డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్రెడ్డి, రాములు, టీఓటీలు భాస్కర్, నవీన్కుమార్, మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఫ జెడ్పీ సీఈఓ శోభారాణి -
ప్రియురాలి హత్యాయత్నం కేసులో నిందితుడు రిమాండ్
చివ్వెంల(సూర్యాపేట): మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో గురువారం లా విద్యార్థినిపై సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన నిందితుడిని పోలీసులు అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకుని, శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. కొంత కాలంగా తనను దూరం పెడుతుందని, అనుమానం, కక్షతో ప్రియురాలైన స్పందనను బోయిండ్ల మహేష్ సుత్తితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని పేర్కొన్నారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి సూర్యాపేట కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ మహేశ్వర్, కనకరత్నం, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు
ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులకు వార్డుల్లో పలు సమస్యలు స్వాగతం పలికాయి. సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థుల దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు రూ.కోట్లలో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో నిధులు ఉండడం వీరికి కలిసొచ్చే అంశం. ఆ పనులకు త్వరలో శంకుస్థాపనలు చేయనున్నారు. సాక్షి, యాదాద్రి : పట్టణాల అభివృద్ధి.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గాలపై ఉంది. మున్సిపాలిటీల్లో సరిపడా నిధులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇటీవల ప్రభుత్వం పట్టణాలకు నిధులు సమృద్ధిగా కేటాయిస్తుండడంతో పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే అభివృద్ధి పనులు చేసేందుకు మున్సిపాలిటీల్లో నిధులు ఉండడం ఇటీవల కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఊరట కలిగిస్తున్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు తెలంగాణ రైజింగ్ విజన్–2027 పథకంలో భాగంగా రూ.90 కోట్ల నిధులు వచ్చాయి. ఆ నిధులతో 2026 మార్చి నాటికి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్కు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన.. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం యూఐడీఎస్ ద్వారా రూ.90 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు వచ్చాయి. ఈ నిధులు ఖర్చు చేసేందుకు మున్సిపాలిటీల్లో చేపట్టే పనుల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడం దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రత్యేకాధికారుల పాలనలో నిధుల ఖర్చులో జాప్యం జరిగింది. నూతన పాలకవర్గాలకు ఈ నిధులు వరంగా మారాయి. అనుమతి కోసం ఈఎన్సీకి.. అధికారులు కొన్ని డీపీఆర్లను పూర్తిచేసి సాంకేతిక అనుమతి కోసం ఈఎన్సీకి పంపించారు. అక్కడినుంచి అనుమతి రాగానే మున్సిపాలిటీల వారీగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం శంకుస్థాపనలు చేస్తారు. మురుగు నీటి డ్రెయిన్లు, అంతర్గత రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంతాల్లో మౌలిక వసతులు, పార్కులు, ఓపెన్ జిమ్ల అభివృద్ధి, మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేస్తారు. అభివృద్ధి పనులు ఇలా.. ● భువనగిరి మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణానికి రూ. 59.6 లక్షలు కేటాయించారు. సీసీ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.46.4 లక్షలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.45 లక్షలు, పార్కు అభివృద్ధికి రూ.4 లక్షలు, ప్రధాన రహదారులపై బాక్స్ కల్వర్టుల నిర్మాణానికి రూ.కోటి, మున్సిపాలిటీలో రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించారు. ● ఆలేరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులతో హైస్కూల్ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నారు. వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, స్ట్రాం వాటర్ డ్రెయిన్లు, ఒక పార్కు, విలీన గ్రామమైన బహుద్దూర్పేటలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ● భూదాన్ పోచంపల్లిలో రూ.15 కోట్ల నిధుల్లో.. రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, రూ.5 కోట్లతో డ్రెయినేజీలు, పార్కు నిర్మించనున్నారు. నారాయణగిరి వద్ద కల్వర్టు నిర్మాణం, విలీన గ్రామాలైన ముక్తాపూర్, రేవనవల్లిలో శ్మశానవాటికల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ● మోత్కూర్ మున్సిపాలిటీ రూ.15 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నారు. విలీన గ్రామాలైన కొండగడప, బుజ్జిలాపురంలో అభివృద్ధి పనులు చేయనున్నారు. ● చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. ● యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేయడానికి డీపీఆర్లు సిద్ధం చేస్తున్నారు. ఈ పనులకు త్వరలో శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలోనే మంజూరైన నిధులు ఫ ఎన్నికల కారణంగా డీపీఆర్ తయారీలో ఆలస్యంఫ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఫ శివారు కాలనీల్లో అభివృద్ధి పనులు -
అలరించిన సంగీత మహాసభలు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైన ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. మల్లాపురంకు చెందిన శ్రీరామభక్త భజన మండలి, రాయగిరికి చెందిన శ్రీలలిత భక్త భజన మండలి, కాచిగూడకు చెందిన భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి. యాదగిరిగుట్టకు చెందిన పరమేశ్వరి నృత్య బృందం, గౌరిభట్ట సాత్విక ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. హైదరాబాద్కు చెందిన ఫణిబాల వయోలిన్, పసుమర్తి శేషుబాబు కూచిపూడి నృత్య ప్రదర్శన, మంజుల రామస్వామిచే యాదవ నారాయణం భరతనాట్యం, మృధురవళి, దర్బ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, శివచంద్రలహరి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. -
యాదగిరీశుడికి అలంకారోత్సవం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరీశుడికి అలంకారోత్సవాలు, వాహన సేవలకు అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం శుక్రవారం శ్రీకారం చుట్టారు. మత్య్సవతారుడిగా అలంకృతుడై.. శేష వాహనంపై ఆలయ తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి ఉదయం నిత్యారాధనలు పూర్తెన తరువాత పారాయణీకులు వేద పారాయణం పఠించారు. అలంకరించిన మత్స్యావతార అలంకార సేవకు ప్రత్యేక పూజలు చేసి, హారతిని నివేదించారు. అనంతరం ఉత్తర ద్వారం నుంచి మాడ వీధుల్లో ఊరేగుతూ, తూర్పు మాడ వీధిలో మత్స్య అలంకారసేవను అర్చకులు అధిష్టింపచేశారు. వేడుకల్లో ఆలయ ఈఓ భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు ఆచార్యులు పాల్గొన్నారు. ఆలయంలో సాయంత్రం... బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం అర్చకులు నిత్యారాధనలు నిర్వహించారు. రాత్రి వేళ శ్రీస్వామి వారిని శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అలంకార సేవను తూర్పు మాడ వీధిలో అధిష్టింపజేసి వేద మంత్రాలు, పారాయణాలు పఠించారు. వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం, రాత్రి అలంకార సేవలను ఊరేగిస్తారు. ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకారసేవ, రాత్రి7 గంటలకు హంస వాహన అలంకార సేవ నిర్వహించనున్నారు. ఫ విశేష పర్వాలకు శ్రీకారం చుట్టిన అర్చకులు ఫ మత్స్యావతారుడిగా శేష వాహనంపై విహరించిన స్వామివారు


