breaking news
Yadadri District News
-
సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
హుజూర్నగర్ : బైక్పై సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ ఎస్ఐ దివ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం అలింగాపురం గ్రామానికి చెందిన మట్టపల్లి సైదులు తన బైక్పై సారా తరలిస్తుండగా.. వాహనాల తనిఖీల్లో భాగంగా ఎకై ్సజ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి నుంచి 8 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేసినట్లు ఎకై ్సజ్ ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారుతిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులో 365బీ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన వ్యక్తి కారులో తిరుమలగిరి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన సదరు వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంబొమ్మలరామారం : మండలంలోని మర్యాల గ్రామం ఎస్సీ కాలనీలో నివాసముంటున్న సంగి స్వామి ఇంట్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంట్లోని సామగ్రి, నిత్యావసర వస్తువులతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పుగా తీసుకొచ్చిన రూ.2.50లక్షల నగదు కాలిపోయాయనని బాధితుడు స్వామి బోరున విలపించాడు. తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. ఎస్ఐ కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థికసాయంచిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసరలో ఎస్ఐగా పనిచేస్తూ అకాల మరణం చెందిన గుండెపంగు వెంకటనారాయణ కుటుంబానికి ఆదివారం తోటి ఉద్యోగులు రూ.25 లక్షల ఆర్థికసాయం చేశారు. ఈ మేరకు చిలుకూరు ఎస్ఐ మోహన్బాబు ఆధ్వర్యంలో 50 మందికి పైగా ఎస్ఐలు కలిసి చెక్కును వెంకటనారాయణ కుటుంబ సభ్యులకు అందజేశారు. -
వాణిజ్య ఒప్పందంతో రైతుల ఆత్మహత్యలు
యాదగిరిగుట్ట : భారత్– అమెరికా దేశాల వాణిజ్య ఒప్పందాలతో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆరోపించారు. యాదగిరిగుట్టలో రాష్ట్ర రైతు సంఘం శిక్షణ శిబిరం ఆదివారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశంలోని 14 కోట్ల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాణిజ్య ఒప్పంద నిర్ణయాన్ని ప్రధాని మోదీ ఉపసంహరించుకోవాలన్నారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి నీటిని పంప్ చేయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. సాగు నీటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత తీసుకోవాలన్నారు. ఈనెల 28న ఢిల్లీలో జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భారత్– అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత రైతాంగానికి ఎంత ప్రమాదం ఏర్పడుతుందనే దానిపై చర్చ ఉంటుందన్నారు. 29న కార్మిక, రైతు సంఘాలు సంయుక్త కార్యక్రమాలపై జాతీయ స్థాయి సదస్సు ఉంటుందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు శరత్ బాబు, సాగునీటి నిపుణులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడు కొల్లూరి రాజయ్య పాల్గొన్నారు. -
వన్నె తరగని విద్యా వృక్షం
రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా పేరొందిన నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) మరో అపూర్వ ఘట్టానికి వేదిక కాబోతోంది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ కళాశాల స్నాతకోత్సవాన్ని(కాన్వొకేషన్ డే) ఈ నెల 22న నిర్వహించనున్నారు. 1956లో ప్రారంభం..1956 జూలై 22న అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చేతుల మీదుగా ఈ కళాశాల ప్రారంభమైంది. అప్పట్లో హైదరాబాద్లో నిజాం కళాశాలతో పాటు ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, నల్లగొండలో కలిపి కేవలం ఐదు ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉండగా.. అందులో ఎన్జీ కళాశాల ఒకటి కావడం విశేషం. ఆచార్య నాగార్జునుడి స్ఫూర్తితో 29 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ప్రారంభమైన ఈ కళాశాల వేలాది మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి అగ్రగామిగా నిలిచింది. ఈ కళాశాలలో సీటు వస్తే గొప్ప వరంగా విద్యార్థులు భావిస్తారు. అత్యుత్తమ బోధనా ప్రమాణాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అధునాతన ల్యాబ్లు ఉండటమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఎన్జీ కళాశాల సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడ చదివిన వారిలో ఇప్పటివరకు 25 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. ఎంతో మంది శాస్త్రవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, ఉన్నతాధికారులుగా స్థిరపడ్డారు. స్వయం ప్రతిపత్తితో ఉన్నత శిఖరాలకు..2004 ఫిబ్రవరి 16న మొదటిసారి యూజీసీ న్యాక్ శ్రీబిశ్రీ గుర్తింపు పొందిన ఈ కళాశాల 2007–08 విద్యాసంవత్సరం నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదాను దక్కించుకుంది. సిలబస్ రూపకల్పన, అకడమిక్ షెడ్యూల్, పరీక్షల నిర్వహణ తదితర విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ విద్యా ప్రమాణాలను మరింత పెంచింది. ప్రస్తుతం కళాశాలలో 18 యూజీ కోర్సులు, 6 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 4500 పైచిలుకు విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ సదుపాయం కలదు. గ్రంథాలయంలో వేల కొలది పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. 23 మందికి బంగారు పతకాలు..2024–25 విద్యా సంవత్సరంలో ఐదు పీజీ కోర్సులు, 2025–26 విద్యా సంవత్సరంలో 18 యూజీ కోర్సుల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి, అకడమిక్ విభాగాల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన 23 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. సుమారు 400 మంది విద్యార్థులు కాన్వొకేషన్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తల చేతులమీదుగా బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవంలో పాల్గొనే విద్యార్థుల కోసం కళాశాల యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పట్టాలు స్వీకరించే విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులను కూడా ఈ వేడుకకు అనుమతిస్తారు. 22న ఎన్జీ కళాశాల 70వ వ్యవస్థాపక వేడుకలు అదే రోజు స్నాతకోత్సవం బంగారు పతకాలు అందుకోనున్న 23 మంది టాపర్లుఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఎన్జీ కళాశాలకు ఉంది. ఈ కళాశాలను ప్రారంభించిన రోజునే స్నాతకోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంది. కష్టపడి చదివిన విద్యార్థులకు, వారిని చదివించిన తల్లిదండ్రులకు ఈ కాన్వొకేషన్ వేడుక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలన్నదే మా సంకల్పం. అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఈ వేడుకకు సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. – సముద్రాల ఉపేందర్, ప్రిన్సిపాల్ -
విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణ అవసరం
భూదాన్పోచంపల్లి : విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ అవసరమని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. ఆదివారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓరియేంటేషన్ డేలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంమ, ప్లానింగ్, ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సీఆర్టీ తరగతులు, బోధనా పద్దతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చదువుకున్న 85శాతం విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. అధ్యాపకులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ విద్యార్థుల సర్వతోముఖావృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. యూన్సివర్సిటీ అడ్వెయిజర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ కృష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, యూనివర్సిటీ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర్రావు, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య -
వైభవంగా జగన్నాథ రథయాత్ర
ఆలేరు : ఆలేరు పట్టణంలో ఆదివారం రాత్రి జై జగన్నాథ నినాదాలు.. వేద పండితుల మంత్రోచ్ఛరణలు..భక్తుల సంకీర్తనలతో శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, కౌన్సిలర్లు జూకంటి సంపత్, జెట్ట నీరజ పాల్గొని రథయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బంగారు చీపురులతో రథం ముందు శుభ్రం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం సంప్రదాయబద్ధంగా జగన్నాథ స్వామి రథాన్ని తాడుతో లాగి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేస్తూ రథాన్ని లాగుతూ ముందుకుసాగటంతో పట్టణ వీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో విద్యావేత్త బండిరాజుల శంకర్, ఇస్కాన్ ప్రతినిధులు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగేష్, న్యాయవాది సీసా రవి, రంగనాయకుల దేవాలయం అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
బీబీనగర్ ఎయిమ్స్లో భవన నిర్మాణాల్లో తీవ్ర జాప్యం
బీబీనగర్ ఎయిమ్స్పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేదు. పనులు ఆలస్యమవుతున్న విషయాన్ని గుర్తించాం. ఈ సంవత్సరం చివరి నాటికి క్యాంపస్లో నిర్మాణాలు పూర్తవుతాయి. ఇక్కడ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం లభిస్తుంది. క్యాంపస్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతానని ఇటీవల ఎయిమ్స్ సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. సాక్షి, యాదాద్రి : బీబీనగర్లోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో అద్భుతమైన వైద్యసేవలు, పరిశోధనల్లో ఎన్నో మైలురాళ్లను చేరుకుంటున్నా భవన నిర్మాణ పనుల్లో జాప్యం.. మౌలిక వసతుల లేమి, సిబ్బంది కొరత కారణంగా రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడ ం లేదు. ముఖ్యంగా భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తేనే ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది. నత్తనడకన భవన నిర్మాణాలు రూ.1,000 కోట్లకుపైగా నిధులతో 201 ఎకరాల విస్తీర్ణంలో 750 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు 85 శాతం పూర్తయ్యాయి. సైట్లో కార్మికుల కొరత వల్ల పనుల పూర్తికి గడువులు మారుతూ వస్తున్నాయి. 2025 నాటికే పూర్తి కావాల్సిన ఈ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని ఇటీవల ఎయిమ్స్ సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఆడిటోరియం, రెసిడెన్షియల్ క్వార్టర్స్, కొత్త ఆస్పత్రి బ్లాక్ పనులు సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది. వేధిస్తున్న ఫ్యాకల్టీ, డాక్టర్ల కొరత ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 902 మంది వైద్య విద్యార్థులున్నారు. వీరికి విద్యాబోధన, రోగులకు చికిత్స అందించే నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. మంజూరైన 183 ఫ్యాకల్టీ పోస్టులకు 131 మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రొఫెసర్ పోస్టులలో ఏకంగా 65 శాతం ఖాళీలున్నాయి. 186 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 101 భర్తీ కాగా, 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కరే డాక్టర్ ఉండడంతో పనిభారం పెరుగుతోంది. అత్యవసర కేసులను సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైర్ స్టేషన్, ట్రామా కేర్ ఏవీ? క్యాంపస్లో 18 నుంచి 23 అంతస్తుల భవనాలు ఉన్నాయి. 1,000 మందికి పైగా విద్యార్థులు నివసిస్తుండగా, ఈ సంఖ్య త్వరలో 1,500కి చేరనుంది. అయినా ఇక్కడ పూర్తిస్థాయి ఫైర్ స్టేషన్ అందుబాటులోకి రాలేదు. భవనం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొలిక్కి రాలేదు. అలాగే జాతీయ రహదారి పక్కనే ఉన్నా ఎమర్జెన్సీ వార్డులో కేవలం 13 బెడ్లు మాత్రమే ఉండడం ఆందోళనకరం. ట్రామా కేర్ సెంటర్, రోగుల సహాయకుల కోసం ‘విశ్రామ్ సదన్’ ఏర్పాటుతో పాటు గ్రీన్ క్యాంపస్గా (సోలార్ ప్యానెళ్లు, ఈవీ చార్జింగ్) మార్చాల్సిన అవసరం ఉంది. పరిశోధనలకు పెద్దపీట ఐదు సంవత్సరాలల్లో ఎయిమ్స్ పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి క్యాన్సర్, వైరల్ వ్యాధులు, క్షయ, పోషకాహారం తదితర అంశాలపై పరిశోధనలు కేంద్రీకరించింది. మొత్తం గా ఎయిమ్స్లో 1,156 ప్రచురణలు చేయగా, 64 కోట్ల రూపాయలు పరిశోధనలకే కేటాయించారు. ఇందులో 129 ప్రాజెక్టులకు నిధులు దక్కగా, 6 పేటెంట్లు, కాపీరైట్లను సంస్థ సాధించింది. ఫ ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచిన కేంద్రం ఫ వేధిస్తున్న ఫ్యాకల్టీ, డాక్టర్ల కొరత ఫ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితేనే కార్పొరేట్ స్థాయి వైద్యం సమస్యలున్నప్పటికీ ఓపీడీ సేవలు మెరుగుపడ్డాయి. 2020–21లో 7,116గా ఉన్న ఓపీడీ రోగుల సంఖ్య, 2025–26 నాటికి 5,09,299కి చేరుకుంది. ఇప్పటివరకు 16,83,121 మందికి వైద్యసేవలు అందించగా, సగటున రోజుకు 1,800 మంది వస్తున్నారు. 2025–26లో ఇన్–పేషెంట్ల (ఐపీ) సంఖ్య 10,883కు చేరింది. ‘ఈ–సంజీవని’ ద్వారా ఇప్పటివరకు 1,53,408 టెలిమెడిసిన్ కన్సల్టేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2019–20లో 2,665 ఉండగా, 2025–26 నాటికి 10,44,167కు పెరిగింది. క్యాథ్ ల్యాబ్, లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ వంటి అత్యాధునిక పరికరాలను అమర్చుతున్నారు. -
సిరిపురంలో ఈటీపీ రెడీ
రామన్నపేట : చేనేత వస్త్రాల రంగుల అద్దకం ద్వారా వెలువడే రసాయన జలాల కాలుష్యానికి ఇక తెరపడనుంది. ఇందుకు రామన్నపేట మండలం సిరిపురం గ్రామం వేదికగా నిలిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) ఆర్థిక సహకారంతో హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మించిన ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ట్రయల్ రన్ విజయవంతమైంది. ‘సిరిపురం మోడల్ ప్లాంట్’గా పిలిచే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఐఐసీటీ డైరెక్టర్ డి. శ్రీనివాస్రెడ్డిల చేతుల మీదుగా గ్రామ పంచాయతీకి అప్పగించనున్నారు. దేశంలోనే తొలి ప్లాంట్.. సిరిపురం మోడల్ సిరిపురం గ్రామం బెడ్షీట్లు, మెర్సైరెజ్డ్ (మస్రస్) చీరల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సగానికి పైగా కుటుంబాలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వస్త్రాల తయారీలో వివిధ డిజైన్ల కోసం రసాయన రంగులను వినియోగిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో డైయింగ్ యూనిట్ ఉండటంతో.. అద్దకంలో వాడిన రసాయన జలాలు మురుగు కాలువల ద్వారా సమీపంలోని ఊరకుంటకు చేరి తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్నాయి. గతంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నదీ జలాల కాలుష్యానికి కారణమవుతున్నాయంటూ పలు డైయింగ్ యూనిట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కాలుష్య కారక రసాయన జలాలను సహజసిద్ధంగా శుద్ధి చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆర్థిక సాయంతో హైదరాబాద్లోని ఐఐసీటీ దేశంలోనే ప్రప్రథమంగా సిరిపురంలో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. సుమారు రూ.2 కోట్లకు పైగా నిధులతో దీనిని నిర్మించారు. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట అండర్గ్రౌండ్ డ్రైన్ను నిర్మించి ఇళ్ల నుంచి వచ్చే రసాయన, మురుగు నీరు నేరుగా ప్లాంట్కు చేరేలా డిజైన్ చేశారు. రసాయన నీటి శుద్ధి ఇలా.. ప్లాంట్కు చేరిన మురుగునీటిలోని వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారాన్ని మొదటి దశలో వేరుచేసి నీటిని సంపులోకి పంపుతారు. ఆ తర్వాత బ్యాక్టీరియా సహకారంతో పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో కాలుష్య కారకాలను, రసాయనాలను వివిధ దశల్లో శుద్ధి చేస్తారు. ఆఖరి దశలో నీటి నాణ్యతను పరీక్షించి, ప్రమాణాల మేరకు శుద్ధి అయితేనే బయటకు వదులుతారు. నాణ్యత లోపిస్తే మళ్లీ రీ–ట్రీట్ చేస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటిని వ్యవసాయం, చెట్ల పెంపకం, గృహ నిర్మాణాలకు వినియోగించుకునేలా పైప్లైన్ ఏర్పాటు చేశారు.సిరిపురం చేనేతకు దక్కనున్న ‘ఎకో లేబుల్’ దేశంలో రసాయన జలాల శుద్ధి కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ఇది విజయవంతం కావడంతో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేసినా వాటికి ‘సిరిపురం మోడల్ ట్రీట్మెంట్ ప్లాంట్’ గానే నామకరణం చేస్తామని ఐఐసీటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కాలుష్యరహిత విధానాలను పాటించడం వల్ల సిరిపురం గ్రామానికి ప్రభుత్వం ‘ఎకో లేబుల్’ ఇచ్చే అవకాశం ఉందని, తద్వారా ఇక్కడి చేనేత ఉత్పత్తుల ఎగుమతులకు అంతర్జాతీయంగా మరింత డిమాండ్ పెరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం నేడు గ్రామ పంచాయతీకి అప్పగింతగతంలో నేను సర్పంచ్గా ఉన్న సమయంలో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్లాంట్ నిర్మాణానికి శాస్త్రవేత్తలు, కాంట్రాక్టర్ ఎంతో శ్రమించారు. అందరి కృషితో నిర్మాణం పూర్తయి, ట్రయల్ రన్ విజయవంతమైంది. సిరిపురం గ్రామంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఐఐసీటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. – అప్పం లక్ష్మీనర్సు, సిరిపురం మాజీ సర్పంచ్ -
ఆటోను ఢీకొట్టిన కారు
మర్రిగూడ(చింతపల్లి) : ఆటోను కారు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జింకల లింగస్వామి తన ఆటోలో గ్రామానికి చెందిన పలువురు మహిళలను ఎక్కించుకుని నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం వావిల్కోల్ గ్రామానికి బయల్దేరాడు. మధ్యాహ్నం వీరు నల్లగొండ జిల్లా చింతపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే ప్రయాణికులకు దాహం వేయడంతో లింగస్వామి ఆటోను రహదారి పక్కన నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళలతో పాటు ఆటో పక్కనే నిలబడిన వారు రోడ్డుపై పడిపోయారు. కొల్కులపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి ఇంద్రమ్మ, పడాల లక్ష్మమ్మ, పడాల మైసమ్మ, పడాల జంగమ్మ, పాలె నర్సమ్మ, పడాల వసంత, పడాల కాశమ్మ, పడాల యాదమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కృష్ణయ్యపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్ లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.● ఎనిమిది మంది మహిళలకు గాయాలు -
రెడ్డి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించాలి
నల్లగొండ టౌన్ : ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రెడ్డి జాగృతి విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు ఎంరెడ్డి నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రముఖ నాయకులు నీరుడు దయాకర్ రెడ్డి, యానాల ప్రభాకర్ రెడ్డి, మందడి వెంకట్రెడ్డి, వంగాల నరేందర్రెడ్డి, పైళ్ల మధుసూదన్రెడ్డి, మారెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బస్వాపురం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలి
భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసి ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపి సాగు నీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి భూ నిర్వాహసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కట్టపై చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులకు ఉపయోగపడే బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం నిధుల విడుదలలోనూ ప్రభుత్వం వివక్ష చూపడం తగదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి విడుదల చేయని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరాజు, నాయకులు దయ్యాల నర్సింహ, అంజయ్య, ఈర్లపల్లి ముత్యాలు, అన్నంపల్ల కృష్ణ, కొండ అశోక్, మాతయ్య, ఎల్లయ్య, వెంకటేష్, బాబు, చంద్రయ్య, దేవేందర్ పాల్గొన్నారు. -
వైటీడీ పాలకమండలి సభ్యుడిగా విజయేందర్ ప్రమాణ స్వీకారం
యాదగిరిగుట్ట : వైటీడీ పాలకమండలి సభ్యుడిగా తూళ్ల విజయేందర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 11న పాలకమండలి చైర్మన్ ఎం. సత్యనారాయణరెడ్డితో పాటు 8 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, తూళ్ల విజయేందర్ ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఆదివారం తూళ్ల విజయేందర్ తన సతీమణి, కుమార్తెతో వచ్చి గర్భాలయ బంగారు వాకిలి వద్ద ఈఓ భవానీ శంకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈఓ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. అనంతరం తూళ్ల విజయేందర్ మాట్లాడుతూ.. వైటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించినందుకు సీఎం రేవంత్రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల తిరుపతి స్థాయిలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. -
బీసీలకు అడుగడుగునా అన్యాయమే..
యాదగిరిగుట్ట : బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం నిర్వహించిన బీసీ హక్కుల సాధన సమితి మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు మాత్రం ఇప్పటి వరకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేవలం విద్యా, ఉద్యోగ రంగాల్లో మాత్రమే 27 శాతం రిజర్వేషన్లు లభించిందని పేర్కోన్నారు. కనీసం బీసీ సబ్ ప్లాన్, రక్షణ చట్టాలు కల్పించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అడగకుండానే 13వ రాజ్యాంగ సవరణతో అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ బిల్లులను పెండింగ్లోనే పెట్టడం శోచనీయమన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, రైతు సంఘం నాయకులు పేరబోయిన పెంటయ్య, బొదాసు జగన్, పాకాలపాటి రాజు, పబ్బాల స్వామి, కోనేరు శీను, అనంతుల నరసింహ, శెట్టి నరసింహ, సత్యం, మహేష్ పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. సాయంత్రం వేళ అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు. మత్తుకు బానిస కావొద్దు సూర్యాపేటటౌన్ : సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువత వా టికి బానిస కాకుండా ఉండేందుకు పోలీసులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో యువత, తల్లిదండ్రులు, ప్రతి వర్గం అంతే బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
నెలాఖరు వరకే ఇ–కేవైసీ
భువనగిరి : రేషన్ కార్డుల ఇ–కేవైసీకి పౌరసరఫరాల శాఖ ఈ నెల 31 వరకు తుది గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్డులోని సభ్యులంతా తమ పరిధిలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితమే కార్డు కారులందరూ ఇ–కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొన్ని నెలలు వేగంగా కొనసాగి ఆ తర్వాత కాస్త మందగించింది. ప్రస్తుతం నకిలీ కార్డులను ఏరివేయడానికి ఈకేవైసీలో వేగం పెంచారు. 82 శాతం పూర్తి జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 2,52,187 కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 2,38,260, అంత్యోదయ కార్డులు 13,727 కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 82 శాతం ఇ–కేవైసీ ప్రక్రియ పూర్తయింది. ఇ–కేవైసీకి సూచనలు.. ఫ కార్డుదారులు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి అక్కడ డీలర్ చెప్పినట్లుగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటే ఇ–కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఫ కార్డులోని ప్రతి సభ్యుడు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పూర్తి చేయించుకోవాలి. ఫ ఇ–కేవైసీకి నెలవారి సరుకుల పంపిణీకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడైనా వెళ్లి చేయించుకోవచ్చు. ఫ రేషన్ దుకాణానికి వెళ్లలేని వృద్ధులు కదల్లేనివారు, దివ్యాంగుల మినహాయింపు కోసం రేషన్ డీలర్ లేదా తహసీల్దార్ను సంప్రదించాలి. ఫ బయోమెట్రిక్ వేలిముద్రలు రాకుంటే ఆధార్ సేవలో అప్డేట్ చేయించుకోవాలి. జిల్లాలో రేషన్కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయించాలని ఆదేశాలు వచ్చాయి. దుకాణాల వారీగా కేఈవైసీ చేయించుకోని వారిని గుర్తించి పూర్తిచేయించాలని తహసీల్దార్లకు సైతం సూచించాం. ఈకేవైసీ చేయించుకోకపోతే భవిష్యత్లో రేషన్ కార్డులో పేరు తొలగించబడుతుంది. ఆహార ధాన్యాల కేటాయింపు ఉండదు. కార్డులో పేరున్న వారందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. – రోజా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఫ రేషన్ కార్డుదారులకు చివరి అవకాశం ఫ 31 నాటికి తుది గడువు విధించి పౌరసరఫరాల శాఖ ఫ ఇప్పటి వరకు 82 శాతం పూర్తి -
కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ పోరాటం
గుర్రంపోడు : కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధనకు దేశంలో మొట్టమొదట ఏర్పడిన సంఘం ఏఐటీయూసీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికలోకం పోరాటాన్ని తీవ్రతరం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పేద వారు మరింత పేదవారుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31 ఆవిర్భవించిన కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే కార్మిక చట్టం, పారిశ్రామిక విధానాల చట్టం, బిట్రీష్ సామ్రాజ్యవాదుల నుంచి భారతదేశాన్ని విముక్తి కోసం పోరాటాలు చేసిన గొప్ప సంఘమని చెప్పారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు మారలేదన్నారు. మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఎం.నర్సింహ, ఉజ్జిని రత్నాకర్రావు, ఎండీ ఇమ్రాన్, పల్లా దేవేందర్రెడ్డి, రామస్వామి, నాయకులు కేఎన్.రెడ్డి, నూనె వెంకటేశ్వర్లు, వెంకట్రావ్, వెంకన్న, రేపాక లక్ష్మీపతి, ఎస్కే అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
సొసైటీల్లోనూ యూరియా ధర భారమే!
రామన్నపేట : ఇప్పటికే వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యాప్ ద్వారా యూరియా బుక్ చేసి కొనుగోలు చేయడానికి అవస్థలు పడుతున్న రైతులకు ధర భారంగా మారనుంది. రవాణా చార్జీలు సొసైటీలే భరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 391 జీఓ జారీ చేసింది. పీఏసీఎస్, ఎన్డీసీఎంఎస్ల్లో ఇప్పటి వరకు తక్కువ ధరకే లభించిన యూరియా బస్తా ఒక్కంటికి రూ.30 వరకు పెరగనుంది. యాప్తో మొదలైన కష్టాలు యూరియా కృత్రిమ కొరతను అరికట్టడంతోపాటు మోతాదుకు మించి వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఫర్టిలైజర్ యాప్ను తీసుకొచ్చింది. యాప్ డౌన్లోడ్ చేసి పట్టాదారు పాసు పుస్తకం నంబర్ను ఎంట్రీ చేస్తే భూ వివరాలు వస్తాయి. భూమి ఆధారంగా ఎకరాలకు రెండు బస్తాల చొప్పున 20 రోజుల వ్యవధిలో రెండు విడతల్లో యూరియా బుకింగ్ అవుతుంది. గతంలో రైతులు యూరియాతో పాటు విత్తనాలు ఎరువులు, పురుగు మందులు ఒకే ఫరిలైజర్ షాపులో కొనుగోలు చేసేవారు. యాప్ రాకతో యూరియా ఏ సొసైటీ, ఏ షాపు, ఏ గ్రామంలో దొరుకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు సొసైటీ, సీఎంఎస్లలో తక్కువ ధర రూ.267కు దొరికేది. అదే షాపుల్లో అయితే రూ.310 నుంచి రూ.320 పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చేది. సొసైటీలకు యూరియా సరఫరా చేస్తే రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. దుకాణాదారులు మార్క్ఫెడ్ నుంచి యూరియాను తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతో బస్తాకు రూ.30 నుంచి రూ.40 ఎక్కువకు విక్రయించాల్సి వచ్చేది. ఇకపై సొసైటీల్లోనూ అధిక ధరే.. ఈ వానాకాలంలో వర్షాలు కురిసి, కాలువలకు నీళ్లు వదిలితే సుమారు 4.75లక్షల ఎకరాల విస్తీర్ణంలో అన్నిరకాల పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం సీజన్కు 37,766 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే రైతులు నలభైశాతం మేర యూరియాను కొనుగోలు చేశారు. ఇకపై సొసైటీలకు సరఫరా చేసే యూరియా రవాణా ఖర్చులను ప్రభుత్వం చెల్లించదు. సొసైటీలే భరించాల్సి ఉంటుంది. దీంతో సొసైటీల్లో కూడా మిగిలిన దుకాణదారుల వలే రూ.300 నుంచి రూ.320లకు అమ్మాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంచనా ప్రకారం పంటలసాగు అయితే జిల్లాలోని రైతులపై సుమారు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షల భారం పడనుంది. ఫ యూరియా రవాణా చార్జీలు సంఘాలే భరించాలని ఆదేశాలు ఫ ఇటీవలే జీఓ జారీ చేసిన కేంద్రం ఫ ఒక్కో బస్తాపై రూ.30 వరకు ధర పెంచి అమ్మనున్న సంఘాలు -
చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి
ఆలేరు : చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణంలో హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సొసైటీ చైర్మన్గా దాసి శంకర్, డైరెక్టర్లుగా చింతకింది రంగ, గాడిపెల్లి రమేష్,ఎలగందుల ఉమాబుషి, బింగి నర్సింహులు, అంకం మల్లేశం, అందె రామలు, ఎలగందుల పద్మతో చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆలేరు సొసైటీ చైర్మన్ దాసి శంకర్కు టెస్కో డైరెక్టర్ పదవి వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.25లక్షల నిధులు మంజూరు చేస్తానన్నారు. చేనేత ఉత్పత్తులు ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో చేనేతలకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ మాజీ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్, జెట్ట నీరజ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
నేటి నుంచి ‘మిషన్ ఇంద్రధనస్సు’
భువనగిరి : ఐదు సంవత్సరాల ్లలోపు వయస్సు కలగిన చిన్నారులు, గర్భిణుల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధుల నిరోధానికి టీకాలు ఇచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనస్సు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీకాలు వేయించుకోని లేదా పాక్షికంగా టీకాలు వేయించుకున్న గర్భిణులు, 5 సంవత్సరాల లోపు పిల్లలకు 100 శాతం రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం ద్వారా మీజిల్స్ రూబెల్లా (ఎంఆర్) టీకాను ఇవ్వనున్నారు. నిరోధించే వ్యాధులు ఇవే.. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం ద్వారా ఎంఆర్ టీకాలు వేయడంతో డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, హెపటైటిస్–బి, తట్టు, రుబెల్లా, మెనింజైటిస్, నిమోనియా, జపనిస్ ఎల్సెఫలేటిస్, రోటా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నిరోధించవచ్చు. జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్న టీకాలు వేయించుకోని వారిని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సంచార జాతులు, వలస కార్మికులు ఉండే స్థలాల్లో ఉన్న పిల్లలకు టీకాలు వేయించుకోని వారిని గుర్తించి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఫ ప్రాణాంతక వ్యాధుల నిరోధానికి టీకాలు ఫ పిల్లలు, గర్భిణుల్లో రోగ నిరోధక శక్తి పెంపునకు ప్రణాళి ఫ 27 వరకు టీకాల ప్రక్రియ కొనసాగింపు -
రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి
సాక్షి,యాదాద్రి : రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ వారిచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆపదలో ఉన్న వారిని ప్రాణాలను రక్షించే అవకాశం ఉందన్నారు. రెడ్క్రాస్ రాష్ట్ర కార్యదర్శి, సీఈఓ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో త్వరలోనే బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర రెడ్ క్రాస్ రెండు కోట్ల మేర ఎక్విప్మెంట్ను సమకూర్చిందని, భవన నిర్మాణం కోసం దాత శ్రీధర్ రెడ్డి రూ.5కోట్ల మేర అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, సీఈఓ శోభారాణి, చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు పీడీ సురేష్, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి శివప్రసాద్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. – అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
ఐదు చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జిల్లా కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల కేసుల పురోగతిపై శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జయరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చెక్ బౌన్స్ ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 5 దీర్ఘకాలిక కేసులను రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు తెలిపారు. దీని ద్వారా కక్షిదారులకు రూ.19,60,000 చెల్లింపులు జరిగేలా చూశామని వెల్లడించారు. మరిన్ని చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రూ, భువనగిరి ఏసీపీ రవీందర్, యాదాద్రి ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తులు భువనగిరి: ఖమ్మం స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాల ఎంపికకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి శ్యాంసుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించే ఎంపికకు 14 నుంచి 16 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన విద్యార్థులు రావాలని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి మోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శనివారం మోత్కూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 150కి పైగా నూతన విద్యార్థులు రావడం శుభ సూచకమన్నారు. ప్రధానోపాధ్యాయుడు దేవినేని అరవిందరాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, ఇన్స్పెక్టర్ సి.వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి టి.సత్యనారాయణ, పాఠశాల కమిటీ చైర్మన్ దబ్బెటి శైలజ, కౌన్సిలర్ కుర్మిళ్ల ప్రమీల రాములు పాల్గొన్నారు. 31లోగా బయోమెట్రిక్ పూర్తిచేయాలిసాక్షి, యాదాద్రి : రేషన్ కార్డుదారులు ఈనెల 31లోగా బయోమెట్రిక్ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నివాస ప్రాంతానికి సమీపంలో అందుబాటులో ఉన్న ఏ రేషన్ దుకాణానికై నా స్వయంగా వెళ్లి వేలిముద్ర వేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి: జిల్లాలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న మూడు పోస్టులకుగాను ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు తమ దరఖాస్తులను ఈ నెల 20 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. రైతు వేదికల్లో విద్యుత్ బకాయిలు ఆత్మకూరు(ఎం): రైతు వేదికలు విద్యుత్ బకాయిల బారిన పడ్డాయి. ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడంతో నెల వారీ బిల్లులు బకాయి పడాల్సి వచ్చింది. ఆత్మకూరు(ఎం), పల్లెపహాడ్, పల్లెర్ల, కూరెల్ల, కప్రాయపల్లి క్లస్టర్లలోని రైతు వేదికల్లో సెప్టెంబర్– 2022 నుంచి ప్రభుత్వం మెయింటనెన్స్ కింద ఖర్చులు ఇవ్వకపోవడంతో ఈ బిల్లులు పేరుకుపోయాయి. ఆత్మకూరు(ఎం) రైతు వేదిక విద్యుత్ బిల్లు రూ.14,730 రాగా నెల రోజుల క్రితం విద్యుత్ కనెక్షన్ తొలగించారు. పల్లెర్ల రైతు వేదిక విద్యుత్ బిల్లు రూ.14,797, కప్రాయపల్లి రైతు వేదిక బిల్లు రూ.10,200, పల్లెపహాడ్లో రూ. 10వేలు, కూరెల్ల రైతు వేదికలో రూ.14వేల వరకు బకాయి ఉంది. -
గోరింట పండింది
ఆషాఢంలో మైదాకు పండుగ జరుపుకుంటున్న మహిళలు ఫ అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకొస్తుంది. ఈ మాసం ముగిసేలోపు మహిళలు ఒకరోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. గోరింటాకు పెట్టుకోవడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక పెద్ద పండుగ. ఇటీవల కాలంలో నగరాల నుంచి పల్లెల వరకు ప్రతి ఇంటా మహిళలు, యువతులు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా అందరూ చేతులకు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేస్తున్నారు. రామగిరి(నల్లగొండ) : వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాసీ్త్రయ, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రకృతిని ప్రేమిస్తూ, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ జరుపుకునే ఈ గోరింటాకు సంబరం ముత్తైదువుల చేతుల్లో ఎర్రటి కాంతులు వెదజల్లుతోంది. మహిళలకు గోరింటాకుకు ఎంతో ప్రత్యేకం. పురాణాల ప్రకారం పడుచమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెబుతుంటారు. దీంతో ఈ ఆధునిక యుగంలో సైతం చాలా మంది అమ్మాయిలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. గోరింటాకును చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చాలా పరిశోధనల్లో రుజువైంది. వర్షాకాలంలో ప్రారంభంలో బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పంట పొలాలు బురదమయమై క్రిమికీటకాలు పెరుగుతాయి. మహిళలు పొలంలో వరినాట్లు వేయడం వలన చేతులు, కాళ్లకు బురద అంటుకుంటుంది. ఈ మాసంలో మైదాకు పెట్టుకుంటే చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. మైదాకు వేళ్లకు పెట్టుకోవడం వలన గోళ్లు పెలుసుబారకుండా కాపాడుతుంది. ఆకులే కాకుండా పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు కూడా ఔషధ యుక్తాలే. వీటితో శరీరంలో అలర్జీలను దూరం చేసుకోవచ్చు. ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకును బాగా నూరి పూస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నెలకోసారి గోరింటాకు ముద్దను తలకు ప్యాక్గా వేసుకుంటే జట్టు రాలదు. ఈ రోజుల్లో గోరింటాకు పెట్టుకోవడం ఒక పెద్ద ఆర్ట్ (మెహందీ ఫ్యాషన్) అయిపోయింది. కానీ ఆషాఢంలో పెట్టుకోవడం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, గోళ్ల వ్యాధులు రాకుండా ఈ గోరింటాకు కాపాడుతుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. – సిరా వరుణ కాలేజీకి సెలవులు ఉన్నా, లేకపోయినా ఆషాఢం రాగానే ఫ్రెండ్స్ అందరం ఒకరి ఇంట్లో చేరి చేతులకు గోరింటాకు పెట్టుకుంటాం. ఎవరి చెయ్యి బాగా పండిందోనని పోటీలు పడతాం. ఇదొక మంచి గెట్ టుగెదర్ లాంటిది. కొత్త కొత్త డిజైన్లు ట్రై చేస్తూ, సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ గడపడం బాగుంటుంది. – చందనమా చిన్నప్పటి నుంచి ఆషాఢ మాసం వస్తే చాలు.. ఇంట్లో అందరం కూర్చొని గోరింటాకు రుబ్బుకుని పెట్టుకునేవాళ్లం. ఇప్పటి కాలం అమ్మాయిలు కోన్ల వైపు మొగ్గు చూపుతున్నా.. మేము మాత్రం చెట్టు ఆకులు కోసుకొచ్చి సాంప్రదాయ పద్ధతిలోనే రుబ్బి పెట్టుకుంటాం. చేతులు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని ఒక నమ్మకం. ఈ పండుగ మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. – ఇందిర మా చిన్నప్పుడు అమ్మమ్మలు, అమ్మలు చెబుతుండేవారు.. ఆషాఢం వచ్చిందంటే వర్షాలు పడతాయి, వాతావరణం చల్లబడుతుందని, ఈ టైంలో ఒంట్లో వేడి తగ్గడానికి, వర్షాల వల్ల వచ్చే చర్మ వ్యాధులు, గోరుచుట్టు వంటి సమస్యలు రాకుండా ఉండడానికి గోరింటాకు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని కేవలం సంప్రదాయంగా కాకుండా, సీ్త్రల ఆరోగ్యం కోసం ప్రకృతి ఇచ్చిన ఔషధంగా భావిస్తాను. – తులసి -
మహిళా సంఘాలకు ఆహారశుద్ధి యూనిట్లు
బొమ్మలరామారం: మార్కెటింగ్ సమస్యలు, రవాణా భారం, కూలీల కొరతతో పాటు గిట్టుబాటు ధర లభించక కుదేలవుతున్న కూరగాయల రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సరికొత్త అడుగు వేసింది. జిల్లాకు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో ఆహార శుద్ధి కేంద్రాలు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా బొమ్మలరామారంలో రూ. 13.05 లక్షల ఖర్చుతో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్, భూదాన్ పోచంపల్లిలో రూ. 17.91 లక్షల వ్యయంతో రైస్ ఫ్లేక్స్ (అటుకులు), పఫ్డ్ రైస్ (బొరుగులు) ప్రాసెసింగ్ యూనిట్, గుండాలలో రూ. 19.03 లక్షలతో దాల్ (పప్పు దినుసుల) ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ఫ్), అంతర్జాతీయ పొడి ప్రాంత వ్యవసాయ పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) సంయుక్తంగా ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. బొమ్మలరామారంలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఒక ఎకరం అనువైన స్థలాన్ని కేటాయించాలని సెర్ఫ్ ప్రతినిధులు రెవెన్యూ అధికారులను కోరారు. ప్రస్తుతం మండలంలో గిట్టుబాటు ధర లేక సుమారు 80 శాతం మంది రైతులు కూరగాయల సాగును వదిలేసి వరి వైపు మళ్లారు. ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే యావపూర్, సోలీపేట్ వంటి గ్రామాల్లో కొత్తిమీర, కాలీఫ్లవర్, పాలకూర సాగు మరింత పెరగడంతో పాటు మహిళా రైతుల ఆర్థిక స్వాలంబనకు దోహదపడనుంది. ఇక్రిశాట్ ఆధ్వర్యంలో అత్యాధునిక శిక్షణ మండలంలోని రైతులకు ఇక్రిశాట్ సహకారంతో నాణ్యమైన పంటల సాగుకు మార్గం సులభం కానుంది. చీడపీడలను తట్టుకునే విత్తనాల పంపిణీ, మెరుగైన సాగు పద్ధతులు, నేల ఆరోగ్యం, వాతావరణ సూచనలు, డిజిటల్ వ్యవసాయం, నీటి సంరక్షణ యాజమాన్యంపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రేడింగ్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా మహిళా రైతులు పండించిన పంటలను నేరుగా తక్కువ ధరకు అమ్ముకోకుండా, ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా గ్రేడింగ్ చేస్తారు. ఆపై హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లోని సూపర్ మార్కెట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికల ద్వారా నేరుగా మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. జిల్లాకు మూడు కేంద్రాలు మంజూరు ఫ బొమ్మలరామారంలో వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ పోచంపల్లిలో అటుకులు, బొరుగులు, గుండాలలో పప్పుదినుసుల కేంద్రం ఏర్పాటు -
ఆషాఢం మహిళలకు ప్రత్యేకమైనది
యాదగిరిగుట్ట : ఆషాఢ మాసం మహిళలకు ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో అధికంగా గ్రామీణా ప్రాంతాల్లో బోనాల పండుగలు చేస్తారు. ముఖ్యంగా కొత్త నీరు రావడంతో పాటు నూతన ధాన్యాన్ని పండించేందుకు వరి నాట్లు వేస్తారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఉత్తరాణం పోయి.. దక్షిణాయన పుణ్య కాలం వచ్చింది. దక్షిణాయనంలో గ్రామ దేవతల పండుగలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో భాగంగానే మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. ప్రధానంగా కొత్తగా వివాహం జరిగిన వారు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకొని, సంప్రదాయంగా కనిపిస్తారు. ఈ ఆషాఢ మాసాన్ని దీక్షల మాసం అంటారు. ఆషాఢ పౌర్ణమి నుంచి చాలా మంది మునులు, స్వామిజీలు, ఆయా ప్రాంతాల్లో కొత్తగా వివాహాలు జరిగిన పురుషులు దాంపత్య జీవితంలో భాగస్వామికి దూరంగా ఉండేందుకు దీక్షలు తీసుకొని తీర్థ స్నానాలు చేస్తారు. మహిళలు మంచి పూజలు చేస్తే మంచిసంతానం కలుగుతుంది. మహిళలు ఎరుపు వర్ణం కలిగిన గోరింటాకును పెట్టుకొని అమ్మవారిలా నిండు సంప్రదాయంతో కనిపిస్తారు.పసుపు, కుంకుమను ఇంట్లో పూజించే గడపకు పెట్టుకుంటాం. అలా గే మహిళను గౌరవించాలనే సంప్రదాయంలో గోరింటాకును పెట్టుకుంటారు. – కాండూరి వెంకటచార్యులు, యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధానార్చకుడు -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
రాజాపేట : మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. శనివారం ఎస్ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట గ్రామానికి చెందిన బిచాల అశోక్ (27)కు తొమ్మిదేళ్ల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా మౌనిక తన తల్లిగారింటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో అశోక్ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున గ్రామంలోని రోడ్డు పక్కన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. అశోక్ విద్యుదాఘాతంతో మృతి చెందాడని అతడి భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లుగా భావిస్తూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతిమోతె : ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతిచెందాడు. ఈ ఘటన మోతె మండలం సిరికొండ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన ఎస్కే సలీమ్(38) ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా ఒక్కసారిగా సీట్లో నుంచి కిందపడ్డాడు. దీంతో ట్రాక్టర్ వెనుక చక్రాలు సలీమ్పై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్ 100 మీటర్ల దూరం వెళ్లి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. సలీమ్ను స్థానికులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మామపై హత్యాయత్నంచేసిన అల్లుడి అరెస్టుమోతె : మామపై హత్యాయత్నం చేసిన అల్లుడిని శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఆల్దాసు లింగయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. అదే గ్రామంలో ఉంటున్న అతడి అల్లుడు పాలకూరి సైదులు గొడ్డలితో లింగయ్యపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అదే గ్రామానికి చెందిన పాలకూరి సత్యం, పాలకూరి వెంకటేశంతో సైదులుకు ఉన్న గొడవల కారణంగా తన సొంత మామను హత్య చేసి ఆ నిందను సత్యం, వెంకటేశంపై మోపాలని ఈ దాడికి యత్నించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు సైదులును అరెస్టు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వ్యక్తి ఆచూకీ లభ్యంమర్రిగూడ : మండలంలోని వట్టిపల్లి గ్రామం నుంచి రెండు నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిపల్లి గ్రామంలో తన అత్తగారింటికి వచ్చిన పడకంటి మహేష్ అనే వ్యక్తి ఈ ఏడాది మే 12న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య శివలీల మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో శనివారం మహేష్ ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఆర్థిక సమస్యల కారణంగా ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు మహేష్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. అనంతరం మహేష్కు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఎల్నినో.. ‘ఆయిల్ పామ్’లో రక్షణ చర్యలు
సూర్యాపేట : ఈ వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రైతులంతా ఎంతో ఆశతో సాగుచేస్తున్న ఆయిల్ పామ్ తోటల్లో ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను కాపాడుకునే అవకాశం ఉంటుందని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య, సాంకేతిక అధికారి ముత్తినేని మహేష్ చెబుతున్నారు. వారు రైతులకు అందిస్తున్న సూచనలు, సలహాలు.. ఎల్నినో పరిస్థితుల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పగటిపూట సాపేక్ష ఆర్ధ్రత తగ్గుతుంది. దీని వల్ల పొడి వాతావర పరిస్థితులు ఏర్పడి ఆయిల్ పామ్ తోటల్లో గెలలు పూర్తిగా తయారుకావు. మగ పుష్పగుచ్ఛాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మూడేళ్ల కంటే తక్కువ వయస్సున్న ఆయిల్ పామ్ మొక్కలకు వేరు వ్యవస్థలు ౖపైపెనే ఉంటాయి. కావున పైన మట్టి పొర ఎండిపోవడం వల్ల ఆ వేర్లు ప్రభావితమవుతాయి. పొడి వాతావరణ ఎక్కువ కాలం కొనసాగితే మొక్కల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. అదనపు నీటి పారుదల కొనసాగించకపోతే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవి పాటించాలి.. ఫ రక్షణాత్మక నీటిపారుదల, తేమ సంరక్షణ చర్యలు పాటించాలి. క్రమం తప్పకుండా సూక్ష్మ పద్ధతిలో నీటిపారుదల జరిగేలా చూసుకోవాలి. చెట్టు దీర్ఘకాలిక తేమ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ఫ మొక్క మొదలు చుట్టూ కత్తిరించిన ఆకులు లేదా సేంద్రియ జీవ పదార్థంతో ఒక పొరగా కప్పటం వల్ల నేలలోని తేమ ఆదా అవుతుంది. దీని వలన సూక్ష్మ వాతావరణాన్ని చల్లబర్చి నీటి నష్టాన్ని తగ్గిస్తుందన్నారు. ఫ అధిక ఉష్ణోగ్రతల ఒత్తిడి ఉన్న కాలంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయకూడదు. నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రతి చెట్టుకు ఇచ్చే సాధారణం కంటే 0.5కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదనంగా అందించాలి. ఫ అధిక ఉష్ణోగ్రతల వల్ల పరాగ సంపర్కం చేయు వివిల్స్ మనుగడ, విస్తరణ ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది అంతిమంగా పరాగ సంపర్కం సరిగ్గా జరగకపోవడానికి, ఫలితంగా గెలలు విచ్చిన్నం కావడానికి దారి తీస్తుంది. కొత్తగా ఏర్పాటుచేసిన, ఒంటరి తోటల్లో వీటి స్థిరనివాసం తగ్గే అవకాశం ఉంది. కావున తోటల్లో తేమను పెంచడానికి బిందు సేద్య వ్యవస్థలో అవుట్లెట్ తెరిచి ఉంచాలి. వేడి ఒత్తిడిని తగ్గించడానికి కోకో, వక్క వంటి అంతర పంటలు వేసుకోవాలి. -
అతివలకు ఆరోగ్య పరీక్షలు
సాక్షి, యాదాద్రి: మహిళల ఆరోగ్య స్థితిపై సమగ్రం గా రూపొందించి, వ్యాధులను ముందస్తుగా గుర్తించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెర్ఫ్, మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా జిల్లాలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలె బీబీనగర్, షారా జీపేట, భూదాన్పోచంపల్లి పీహెచ్సీలు ఉన్నాయి. ఇక్కడ లభించే ఫలితాల ఆధారంగా విడతల వారీగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులందరికీ ఈ సేవలను విస్తరించనున్నారు. 3 నెలల్లో 2 లక్షల మంది మహిళలకు పరీక్షలు మూడు నెలల కాలంలోనే సుమారు 2 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు వైద్య పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 1,94,493 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వారందరికీ దశలవారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం రోజుకు 800 నుంచి 2,000 వరకు నమూనాలను పరీక్షించగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక ‘అనలైజర్’ మిషన్లను సమకూర్చుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కొత్తగా నియామకం చేసుకుంటున్నారు. కాగా. మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షలు, నమూనాల సేకరణ, డేటా నమోదు, ఫాలోఅప్ కోసం వైద్య ఆరోగ్యశాఖ, మెప్మా, మున్సిపల్ శాఖ, డీఆర్డీఏ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డీసీహెచ్ఎస్, ఆర్ఎంఓలు, వైద్యులు, టీ–హబ్ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. ఫ బీబీనగర్, షారాజీపేట, భూదాన్ పోచంపల్లి పీహెచ్సీలు ఎంపిక ఫ 3 నెలల్లో 2 లక్షల మంది మహిళలకు స్క్రీనింగ్ లక్ష్యం ఫ వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం బయోకెమిస్ట్రీ పరీక్షలు : బ్లడ్ షుగర్, సీరం బిలిరుబిన్, సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, ఎస్జీపీటీ, ఎస్జీఓటీ, సీరం ఆల్కలైన్ ఫాస్ఫటేస్, సీరం టోటల్ ప్రొటీన్, సీరం ఆల్బుమిన్. హిమటాలజీ పరీక్షలు : థైరాయిడ్ నిర్ధారణకు టీఎస్హెచ్, హీమోగ్లోబిన్, తెల్ల రక్తకణాల సంఖ్య, ప్లేట్లెట్ కౌంట్, ఎర్ర రక్తకణాల సంఖ్య. స్పోక్ స్థాయి పరీక్షలు : బ్లడ్ గ్రూప్, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), రక్తపోటు (బీపీ), వైకల్య నిర్ధారణ, శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన రేటు, శ్వాస రేటు, కంటి పరీక్షలు, నోటి పరీక్షలు, చర్మం–గోళ్ల పరీక్షలు. -
ముగిసిన ఇంటర్ సర్కిల్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్కో, టీజీ ఎనన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారం క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) టి.మధుసూదన్. హెచ్ఆర్డీ సి.ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. గెలుపొందిన జట్లు.. బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఆపరేషన్ సర్కిల్ జట్టు ప్రథమ బహుమతి, టీజీ ఎస్పీడీసీఎల్ నల్లగొండ సర్కిల్ జట్టు ద్వితీయ బహుమతి, మహబూబ్నగర్ సర్కిల్ జట్టు తృతీయ బహుమతి కై వసం చేసుకుంది. వాలీబాల్ విభాగంలో టీజీ ఎన్న్పీడీసీఎల్ ఖమ్మం ఆపరేషన్ సర్కిల్ జట్టు ప్రథమ బహుమతి, టీజీ ఎస్పీడీసీఎల్ మహబూబ్నగర్ సర్కిల్ జట్టు ద్వితీయ బహుమతి, హైదరాబాద్ సౌత్ సర్కిల్ జట్టు తృతీయ బహుమతి సాధించింది. క్యారం విభాగంలో టీజీ ఎన్న్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ప్రథమ బహుమతి, విద్యుత్ సౌధ, హైదరాబాద్ ద్వితీయ బహుమతి, ట్రాన్స్కో వరంగల్ తృతీయ బహుమతి దక్కించుకున్నాయి. సాగర్లో కార్మిక శాఖ కమిషనర్నాగార్జునసాగర్ : రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ పమేలా సత్పతి కుటుంబ సమేతంగా శనివారం నాగార్జునసాగర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన డ్యాం, జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనంలో ధ్యానవనం, స్థూపవనం, జాతక పార్కును సందర్శించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతి వెలిగించారు. బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర ఆమెను సత్కరించారు. ఆమె వెంట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీనివాస్, ప్రొటోకాల్ అధికారి దండ శ్రీనివాసరెడ్డి, కార్మిక శాఖ అధికారి నాగరాజు తదితరులు ఉన్నారు. -
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలు జరిపించారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం నిర్వహించారు. సాయంత్రం వేళ జోడు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
పత్తి మొలకలకు రెయిన్ గన్తో తడి
సాక్షి, యాదాద్రి : యూట్యూబ్లో చూసిన ఓ చిన్న ఆలోచనతో.. తన పత్తి పంటను కాపాడుకునేందుకు రెయిన్ గన్లను రంగంలోకి దించాడు. తక్కువ నీటితోనే పొలమంతా వర్షం కురిపిస్తూ సాగులో ఆదర్శంగా నిలుస్తున్నాడు భువనగిరి మండలం జమ్మాపురం గ్రామానికి చెందిన రైతు బాలస్వామి. ఆయన తనకున్న 15 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాడు. విత్తనాలు వేసి నెలన్నర దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రెండుసార్లు విత్తనాలు వేయడంతో ఇప్పటికే దాదాపు రూ.6 లక్షల వరకు పెట్టుబడి అయింది. మొక్కలు ఎండు ముఖం పట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తూ యూట్యూబ్లో ‘రెయిన్ గన్’ ద్వారా పంటలకు నీరందించే విధానాన్ని చూశాడు. ఆలస్యం చేయకుండా వెంటనే రూ.40 వేల ఖర్చుతో మూడు రెయిన్ గన్లను కొనుగోలు చేసి, తన పొలంలో అమర్చాడు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో జమ్మాపురం గ్రామానికి చెందిన మరికొంతమంది రైతులు రెయిన్ గన్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. -
రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు
యాదగిరిగుట్ట: రైతులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల రాష్ట్రీయ స్థాయి శిక్షణ తరగతులు శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ మహిళల ఆధ్వర్యంలో నడిచే చిన్న గృహ ఆధారిత పౌల్ట్రీ పారిశ్రమలు దెబ్బతినకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో హేమంతరావు, ఉపాధ్యక్షుడు కొప్పుజు సత్యనారాయణ, దొండపాటి రమేష్, కొల్లూరి రాజయ్య, మెడికంటి వెంకట్రెడ్డి, ప్రభు లింగం, దొడ్డ వెంకటయ్య, నెట్టెం నారాయణ, కార్యదర్శులు కందపర్తి గోవిందరావు, వెంకటయ్య, దేవబత్తుని సంధ్య, నరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
భూమి కేటాయించాలని కోరాం
బొమ్మలరామారం మండలానికి మంజూరైన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ఎకరం భూమి అవసరం ఉంది. ఇందుకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరాం. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే కూరగాయల రైతులకు బహుల ప్రయోజనాలు ఉంటాయి. తమ పంటలను సులభంగా మంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడానికి వేదిక కానుంది. – యాదగిరి, సెర్ప్ ఏపీఎం రవాణా భారం, కూలీల కొరత వల్ల కూరగాయల సాగు తగ్గించాం. రైతులకు సబ్సిడీపై పరికరాలు, విత్తనాలు, ఎరువులు అందించాలి. మండలంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే చాలా మంది రైతులు మళ్లీ కూరగాయల సాగు వైపు వస్తారు. అధికారులు ఈ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలి. – దాసరి జంగారెడ్డి, రైతు, హాజీపూర్ -
జల సంరక్షణకు కదులుదాం
భువనగిరిటౌన్ : ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోతూ తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. భూగర్భ జలాలను పెంచేందుకుగాను ‘క్యాచ్ ది రెయిన్–2026’ జాతీయ ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రతి చుక్క వర్షపు నీటిని పొదుపు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని భారీ ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఆరు మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం జిల్లాలోని భువనగిరి, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో భూగర్భ జలాలను పెంచే ప్రయత్నాలను మున్సిపల్ శాఖ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టరేట్తో పాటు ప్రధాన కూడళ్లలో హోర్డింగులు, అవగాహన బోర్డులను ఏర్పాటు చేశారు. భువనగిరి మున్సిపాలి టీలో ఖాళీ స్థలాలు, ఇళ్ల పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్, కమి షనర్ ఆధ్వర్యంలో ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రజా భాగస్వామ్యంతో అవగాహన భూగర్భ జలాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు (ఐకేపీ), విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. స్థానిక భాషల్లో బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ, వారి చేత మొక్కలు నాటించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కార్యక్రమాల వివరాలు ● అన్ని ప్రభుత్వ భవనాల్లో రూఫ్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ తప్పనిసరి. ● రీఛార్జ్ పిట్లు, రీఛార్జ్ బావులు, రీఛార్జ్ షాఫ్టులు, ఇంజెక్షన్ బావుల నిర్మాణానికి ఆదేశాలు. ● వినియోగంలో లేని బోరుబావులను పునరుద్ధరించడం. ● చెరువులు, సరస్సులు, సంప్రదాయ నీటి వనరుల పునరుజ్జీవనానికి ప్రత్యేక చర్యలు. ● పట్టణాల్లోని కాలువలు, జలాశయాల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టడం. ● వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో ‘స్పాంజ్ పార్కులు’ అభివృద్ధి. ● రీఛార్జ్ జోన్లు, క్యాచ్మెంట్ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కల పెంపకం. కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రతి మున్సిపాలిటీకి ఒక నోడల్ అధికారిని మున్సిపల్ శాఖ నియమించింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన ప్రతి పని వివరాలను, జియో–ట్యాగ్ చేసిన ఫొటోలను ప్రతిరోజూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ యూనివర్స్ ప్లాట్ఫామ్, జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్జేబీ) పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు వ్యక్తిగతంగా ఈ పనులను పర్యవేక్షించి, సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఫ ‘క్యాచ్ ది రెయిన్–2026’కు శ్రీకారం ఫ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యాచరణ ఫ ప్రజా ఉద్యమంగా మార్చాలని కేంద్రం పిలుపు -
నకిలీ ఎరువుల తయారీ ముఠా గుట్టురట్టు
మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెం, మేళ్లచెరువు మండల వేపలమాదారంలో పట్టుబడిన నకిలీ డీఏపీ ఎరువులకు సంబంధించిన మూలాలను హుజూర్నగర్, మఠంపల్లి పోలీసులు కనిపెట్టారు. హుజూర్నగర్సీఐ గజ్జె చరమందరాజు, మఠంపల్లి ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట్లో ఓ గోదాంలో నకిలీ ఎరువులు తయారు చేస్తున్నట్లు కనిపెట్టారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి గోదాంపై మెరుపు దాడి చేయగా.. నకిలీ ఎరువులు తయారుచేసే ముఠా తప్పించుకున్నారు. రూ.15లక్షలు విలువైన సుమారు 1000 నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మట్టి, ఉప్పు, రసాయనాలతో కూడిన నాసిరకం పదార్థాలతో డీఏపీ ఎరువులు తయారుచేసి ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో నింపి ఒక్కో బస్తా రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ ఎరువులను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి తదితర ప్రాంతాలకు ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని సీఐ చరమందరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నకిలీ ఎరువులను వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించామని.. ,పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు.ఫ రూ.15లక్షల విలువైన 1000 బస్తాల నకిలీ ఎరువులు సీజ్ -
యాదాద్రి ఫస్ట్.. నల్లగొండ సెకండ్
రాష్ట్రంలోనే సర్ ఫారాల డిజిటలైజేషన్లో ముందంజ వివిధ జిల్లాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ పంపిణీ చేసిన ఫారాలను తిరిగి తెప్పించుకొని డిజిటలైజేషన్ చేయడంలో నల్లగొండ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల తర్వాత నల్లగొండలోనే అత్యధికంగా ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 38,99,743 మంది ఓటర్లు ఉండగా అత్యధికంగా 14,41,564 మంది నుంచి పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను (మొత్తం ఓట్లతో పోల్చితే 38.97 శాతం) తెప్పించుకొని డిజిటలైజ్ చేశారు. హైదరాబాద్ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లకు 13,53,173 మంది నుంచి (మొత్తం ఓట్లతో పోల్చితే 28.57 శాతం) పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. ఇక నల్లగొండ జిల్లాలో సంఖ్యాపరంగా అత్యధికంగా 11,84,302 మంది ఓటర్ల నుంచి పూర్తి చేసిన ఫారాలను డిజిటలైజ్ చేసి మూడో స్థానంలో నిలిచింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ, యాదాద్రి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమరణ (సర్) ఎన్యుమరేషన్ ఫారాల డిజిలైజేషన్ (ఆన్లైన్లో నమోదు)లో రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నల్లగొండ జిల్లా నిలిచింది. గురువారం వరకు జరిగిన డిజిటైజేషన్ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలోనూ మిగితా జిల్లాల కంటే నల్లగొండ జిల్లా ముందుగా పంపిణీని పూర్తి చేసి మొదటి స్థానంలో నిలువగా, ఇప్పుడు డిజిటలైజేషన్లోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలు నిలిచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పని తీరును కనబరిచాయి. మరోవైపు ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పలు జిల్లాల్లో ఎన్యుమరేపన్ ఫారాలు తిరిగి రాకపోవడంతో ఎన్నికల కమిషన్ ఎన్యుమరేషన్ గడువును పొడగించింది. దీంతో నల్లగొండలో 92 శాతం ఫారాల డిజిటలైజేషన్ను లక్ష్యంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. 85.18 శాతంతో మొదటి స్థానంలో యాదాద్రి సర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో 85.18 శాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 78.11 శాతంతో నల్లగొండ రెండో స్థానంలో నిలువగా, 78.09 శాతంతో సిద్ధిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 4,59,943 మంది ఓటర్లు ఉండగా, వారందరికీ ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. వాటిల్లో 3,91,773 పూర్తి చేసిన ఫారాలను తిరిగి తెప్పించుకొని డిజిటలైజేషన్ చేశారు. నల్లగొండ జిల్లాలో 15,16,253 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా 11,84,302 మంది నుంచి పూర్తి చేసిన ఫారాలను తెప్పించుకొని డిజిటలైజ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలో 10,08,252 మంది ఓటర్లు ఉండగా వారందరికీ ఫారాలను పంపిణీ చేశారు. అందులో 6,74,688 మంది నుంచి పూర్తి చేసిన ఫారాలను తిరిగి తెప్పించుకొని డిజటలైజేషన్ పూర్తి చేసి 13వ స్థానంలో నిలిచింది. అలాగే 7,75,369 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను (78.09 శాతం) డిజటలైజ్ చేసి సిద్ధిపేట జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఆగస్టు 3వ తేదీ వరకు ఎన్యుమరేషన్ సర్ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ, డిజిటలైజేషన్ను ఆగస్టు 3 వరకు ఎన్నికల కమిషన్ పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3వ తేదీ నాటికి ఎన్యుమేషన్ను పూర్తి చేస్తారు. 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్ 8వ తేదీలోగా పరిష్కరిస్తారు. 12వ తేదీ తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఫ సూర్యాపేట జిల్లా 66.92 శాతంతో 12వ స్థానం ఫ హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత అత్యధికంగా నల్లగొండలోనే.. ఫ సవరించిన షెడ్యూల్ ప్రకారం 3వ తేదీ వరకు గడువు ఫ ఆగస్టు 10వ తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరణ ఫ అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా ప్రకటన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగంగా చేస్తున్నాం. వీలైనంత ఎక్కువగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 78.11 శాతం రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. కలెక్టర్ బి.చంద్రశేఖర్ నేతృత్వంలో దానిని 92 శాతం చేరుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. – జె.శ్రీనివాస్, అదనపు కలెక్టర్, నల్లగొండ -
గంజాయి రహిత జిల్లాగా మారుస్తాం
మోత్కూరు: జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని అడిషనల్ ఎస్పీ సీహెచ్.లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మోత్కూరు పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ భవనం పై భాగం అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉందని, మరమ్మతులు చేయించాలని సీఐకి సూచించారు. మరమ్మతులు చేయించేందుకు తాను కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గంజాయి ఎవరి దగ్గర దొరికినా వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలన్నారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్ సి.వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ నరసింహ ఉన్నారు. -
ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించడంతో..
మర్రిగూడ : ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళ డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లెంకలపల్లి గ్రామానికి చెందిన చాపల వెంకటయ్య, భారతమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శివ(25) డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నాడు. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ మహిళ తాను హైదరాబాద్లో పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని శిను నమ్మించి రూ.55 వేలు తీసుకుంది. డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించకపోవడంతో మనస్తాపానికి గురైన శివ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి అన్న వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. రాంబాబు తెలిపారు. ఫ పురుగుల మందు తాగి యువకుడి బలవన్మరణం -
సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తాం
మిర్యాలగూడ : రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను శనివారం సీపీఎం బృందం పరిశీలించనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు సరికాదని, ప్రాజెక్టుకు అఖిలపక్షంతో పాటు టెక్నికల్ ఇంజనీర్లను తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేయాలన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, బోర్లు, చెరువులు, కుంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మెట్ట పంటలు ఎండిపోతున్నాయని, గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యతను అంచనా వేసి ప్రజలకు తోడ్పడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. భారీ ప్రాజెక్టులు చేపట్టే సమయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలని ఏకపక్ష నిర్ణయాలతో ఈ విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్నారు. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ రూ.32వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.82వేల కోట్లకు డిజైన్ చేశారని అన్నారు. నీటి లభ్యత కోసం డిజైన్ చేయాల్సిన ప్రాజెక్టులను కమీషన్ల కోసం వ్యయాన్ని పెంచి నేడు వివాదస్పదం చేశారన్నారు. ప్రజలకు, రైతులకు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు కట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి -
ఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సందర్శన
రామన్నపేట : మండలంలోని సిరిపురం గ్రామంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఏర్పాటు చేసిన ప్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను గురువారం జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) శ్రీనివాస్రెడ్డి, ఐఐసీటీ శాస్త్రవేత్త కిరణ్ సందర్శించారు. చేనేత రంగుల అద్దకంలో వాడిన నీటితో పాటు డ్రెయినేజీ నీటిని శుద్ధిచేసి కాలుష్యం తగ్గించడం ఈ ప్లాంట్ ఏర్పాటు ఉద్దేశం. ప్లాంట్ పనితీరును శాస్త్రవేత్తలు అధికారులకు వివరించారు. త్వరలో ప్లాంట్ను గ్రామ పంచాయతీకి అప్పగించనున్నట్లు డీపీఓ తెలిపారు. వారి వెంట డీఎల్పీఓ ప్రతాప్నాయక్, ఎంపీడీఓ ఎ. రాములు, సర్పంచ్ అంబటి ఉపేంద్రరవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ ఎం. అనూషారమేష్ మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు ఉన్నారు. -
యాదగిరీశుడి క్షేత్రంలో జోడు సేవ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
హుజూర్నగర్ : ద్విచక్ర వాహనంపై సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం బాడవ తండా గ్రామానికి చెందిన బానోతు సైదా ద్విచక్ర వాహనంపై చౌటపల్లికి సారా తరలిస్తుండగా.. వాహనాల తనిఖీల్లో భాగంగా ఎకై ్సజ్ ఎస్ఐ జగన్మోహన్రెడ్డి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సైదాను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. అదేవిధంగా 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. లారీ ఢీకొని మృతిరామన్నపేట : రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన చినలచ్చి సాయిలు(65) గ్రామ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం రాత్రి చిట్యాల–భువనగిరి రోడ్డు దాటుతుండగా రామన్నపేట నుంచి భువనగిరి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య నర్సమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. సాయిలును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ లారీని ఎడమ వైపునకు తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కొద్దిదూరంలో నలుగురైదుగురు వ్యక్తులు బెంచీపై కూర్చొని ఉండగా.. వారు ప్రమాద శబ్దం విని పరుగు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంకొండమల్లేపల్లి : మండలంలోని కేశ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జోగ్యతండాకు చెందిన రామవత్ బోడ, సునీత దంపతుల ఇల్లు గురువారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.50 వేల నగదు, ఇంట్లోని ధాన్యం, దుస్తులు ఇతర సామాగ్రి కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి అరెస్టునిడమనూరు : కిడ్నాప్ డ్రామా ఆడి తప్పుదోవ పట్టించిన వ్యక్తిపై నిడమనూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన బొల్లెపల్లి శేఖర్, బత్తిని వెంకన్న కలిసి అనుముల మండలంలో 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. ఇటీవల కౌలు విషయంలో విభేదాలు రావడంతో వెంకన్న ఒక్కడే భూమిని కౌలుకు చేస్తున్నాడు. దీంతో వెంకన్న శేఖర్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వెంకన్నను అభాసుపాలు చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో శేఖర్ మంగళవారం తన ద్విచక్ర వాహనంపై హాలియా నుంచి ఊట్కూరు వస్తుండగా.. ఊట్కూరు గ్రామ స్టేజీ వద్ద కారులో దుండగులు వచ్చి తనను కిడ్నాప్ చేశారని డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు వద్ద విడిచి వెళ్లారని కిడ్నాప్ డ్రామా స్పష్టించాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో బొల్లెపల్లి శేఖరే కావాలని కిడ్నాప్ డ్రామా ఆడాడని నిర్ధారించుకున్నారు. దీంతో అతడిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
‘రెమిడియేషన్’తో అభ్యసన లోపాలకు చెక్
నకిరేకల్ : విద్యార్థులు అభ్యసనంలో వెనుకబడకుండా, ప్రతి చిన్నారి కనీస భాషా, గణిత నైపుణ్యాలు సాధించేలా తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్ఎల్ఎన్– ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) శ్రీరెమిడియేషన్శ్రీ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయనుంది. సాధారణ బోధనతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సమయం కేటాయించి, లక్ష్యాధారిత బోధన ద్వారా వారి అభ్యసన లోపాలను అధిగమించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనిని విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యాశాఖ దశలవారీగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దశలవారీగా శిక్షణ రెమిడియేషన్ కార్యక్రమం అమలులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 175 మంది జిల్లా రీసోర్స్పర్సన్లకు ఈ నెల 6, 7, 8 తేదీల్లో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల టీజీఐఈఆర్డీలో శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందిన వీరు ఈ నెల 13, 14, 15 తేదీల్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి జిల్లా కేంద్రాల్లో 292 మంది మండల రీసోర్స్పర్సన్లకు శిక్షణ అందించారు. వీరు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రెండు విడతల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 20,500 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరందరికీ దశలవారీగా ఈ శిక్షణ అందనుంది. రెమిడియేషన్ అంటే..? విద్యార్థులు ఏయే అంశాల్లో వెనుకబడ్డారో గుర్తించి, ఆ లోపాలను ప్రత్యేక బోధన, సాధన, నిరంతర పర్యవేక్షణ ద్వారా సరిదిద్దే ప్రక్రియనే ‘రెమిడియేషన్’ అంటారు. చదువులో వెనుకబడిన వారిని ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి తీసుకురావడమే దీని ఉద్దేశం. విద్యార్థుల్లో హాజరు శాతం తక్కువగా ఉండటం, భాషాపరమైన ఇబ్బందులు, ఇంటి వద్ద తగిన విద్యా సహకారం లేకపోవడం, గతంలో బోధించిన అంశాలపై అవగాహన లోపించడం వంటి కారణాలతో కొందరు పిల్లలు వెనుకబడే అవకాశం ఉంటుంది. ఈ లోపాలను ప్రారంభ దశలోనే సరిదిద్దేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది. ప్రత్యేక సమయం కేటాయింపు విద్యార్థులందరి నేర్చుకునే వేగం ఒకేలా ఉండదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమం కింద వారికి వ్యక్తిగత మద్దతు అందిస్తారు. ప్రధాన సబ్జెక్టులైన తెలుగు లేదా ఉర్దూ, ఇంగ్లిష్, గణితంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక సమయం కేటాయిస్తారు. సోమ, మంగళవారాల్లో తెలుగు.. బుధ, గురువారాల్లో గణితం.. శుక్ర, శనివారాల్లో ఇంగ్లిష్ బోధన చేయనున్నారు. అందరు పిల్లలు ఒకే వేగంతో నేర్చుకునేలా ఒత్తిడి చేయకుండా, ప్రతి విద్యార్థి తన సామర్థ్యానికి అనుగుణంగా ప్రగతి సాధించేలా ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి విద్యా క్యాలెండర్ను రూపొందించింది. ఫ పటిష్టంగా అమలు చేయనున్న పాఠశాల విద్యాశాఖ ఫ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఫ ఈ నెల 20 నుంచి 25 వరకు మండల స్థాయిలో నిర్వహణవిద్యార్థుల్లో అభ్యసన లోపాలను ప్రారంభంలోనే సరిదిద్దకపోతే తర్వాత బోధించే కొత్త భావనలను నేర్చుకోవడం వారికి కష్టమవుతుంది. కాలక్రమంలో ఈ లోపాలు పెరిగి వారి మొత్తం అభ్యసనంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రతి విద్యార్థి నేర్చుకోవడానికి, ప్రగతి సాధించడానికి తగిన ప్రోత్సాహం పొందాలి. రెమిడియేషన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అర్థవంతమైన అభ్యసనంలో చురుకుగా పాల్గొనేలా చూడవచ్చు. – తాటిపాముల నర్సింహమూర్తి, నల్లగొండ జిల్లా రీసోర్స్పర్సన్ -
వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దు
మోత్కూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. గురువారం మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీహెచ్సీలో అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి వైద్య సేవలు, పరిశుభ్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్ వార్డుల్లో బెడ్ షీట్లు సరిగ్గా లేక పోవడంతో సూపర్వైజర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బెడ్ షీట్లను ఎప్పటికప్పుడు మార్చాలని ఆదేశించారు.బెడ్ షీట్లు అపరిశుభ్రంగా ఉంటే రోగులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు ఎలా వస్తారని వైద్యులు, సిబ్బందిని ప్రశ్నించారు. రోజూ ఔట్పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు? వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా?, ఏయే మందులు ఇస్తున్నారు? వివరాలన్నీ ఆరోగ్యయాప్లో నమోదు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కాన్పులు ఎన్ని అయ్యాయో ఆరా తీశారు.ట్యాంకు వద్ద వృథాగా నీరు నిలిచిఉండడంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ నర్సయ్యకు ఫోన్ చేసి ట్యాంకును, ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ, డాక్టర్ నిరోష, సూపర్వైజర్ ఊర్మిళ, స్టాఫ్ నర్సు స్వాతి, ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్ ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం సాక్షి, యాదాద్రి : జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వాతావరణ మార్పులు, పంటల సాగు, విద్యారంగ అభివృద్ధి, తాగునీరు, ప్రజారోగ్యం అంశాలపై నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, డీపీఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి ఫ మోత్కూరు పీహెచ్సీ తనిఖీ -
టీటీడీ కార్యకలాపాలపై అధ్యయనం
యాదగిరిగుట్ట : తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్వేత భవనాన్ని గురువారం యాదగిరిగుట్ట ఈఓ భవానీ శంకర్, అధికారుల బృందం సందర్శించారు. టీటీడీలో భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు దాతలకు ఎలాంటి సౌకర్యాలు, దర్శన అవకాశాలు కల్పిస్తున్నారే అంశాలను పరిశీలించారు. టీటీడీ సమగ్ర కార్యకలపాలపై జీఎం(ఐటీ) బి. వెంకటేశ్వరనాయుడు యాదగిరిగుట్ట ఈఓతో పాటు బృందానికి వివరించారు. శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదం వితరణ, కల్యాణ కట్ట, క్యూలైన్లు, భక్తులకు వసతి, ఐటీ, వివిధ ట్రస్టులు, ధార్మిక కార్యక్రమలు, విద్యాసంస్థల నిర్వాహణ, వైద్య సేవలు, శ్రీవారి సేవలు, విజిలెన్స్, క్రౌడ్ మేనేజ్మెంట్, కంపార్ట్మెంట్ల నిర్వహణ, కమాండ్ కంట్రోల్ సెంటర్, పారిశుద్ధ్యం, పచ్చదనం, గోశాల, ప్రసాద తయారీ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ అధికారులు వివరించారు. అనంతరం టీటీడీ బోర్డు సమావేశాలు, అజెండాల తయారీ, తీర్మానాలు, మినిట్స్లో పొందుపరిచే అంశాలు, బోర్డు కార్యకలాపాలు, బోర్టు చట్టాలు, ఎండోమెంట్ చట్టం తదిరత అంశాలపై టీటీడీ డిప్యూటీ ఈఓ ప్రశాంతి వివరించినట్లు యాదగిరిగుట్ట ఈఓ భవానీ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈఓ అరుణదేవి, బోర్డు సెల్ ఏఈఓ సుశీల, డీపీపీ ఏఈఓ సత్యనారాయణ, సూపరింటెండెంట్ సుశీల, మళ్లీశ్వరి, చెంగల్ రాయుడు, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, యాదగిరిగుట్ట ఆలయ అధికారులు రాజన్బాబు, డి. నరేష్ ఉన్నారు. ఫ తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్వేత భవనాన్ని పరిశీలించిన యాదగిరిగుట్ట ఈఓ, అధికారుల బృందం -
పోచంపల్లిని సందర్శించిన అమెరికా, కెనడా దేశస్తులు
భూదాన్పోచంపల్లి : పోచంపల్లిని గురువారం అమెరికా, కెనడా దేశానికి చెందిన 8 పర్యాటకులు సందర్శించారు. గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని సందర్శించి అక్కడ మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్ వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్ డిజైన్లను చూసి చేనేత కళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. చేనేత వస్త్రాల తయారీ ఫొటో గ్యాలరీని తిలకించారు. భూదానోద్యమ చరిత్రను అడిగి తెలుసుకొని పోచంపల్లి గొప్పదనాన్ని అభినందించారు. భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కత్ వస్త్రాలకు పేరుగాంచిన పోచంపల్లిని సందర్శించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ఇక్కడి ప్రజల జీవన విధానాలు, స్నేహభావం ఎంతగానో ఆకట్టుకుందని విదేశీయులు కొనియాడారు. -
తల్లిదండ్రులకు ‘గుండె’కోత
ఫ గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి భువనగిరిటౌన్ : రోజూ ఆడుతూ పాడుతూ తిరిగే బాలిక ఉదయాన్నే బ్యాగు వేసుకుని స్కూల్కు వెళ్లాల్సిన సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందింది. ఈ విషాద ఘటన భువనగిరి పట్టణంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన చిన్నగారి మల్లేష్, కళమ్మ దంపతుల కుమార్తె దీక్షిత(12) స్థానిక మదర్ థెరిస్సా పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. రోజుమాదిరిగా గురువారం ఉదయం నిద్ర లేచిన దీక్షిత ఇంట్లోని కుర్చీలో కూర్చుని ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఉదయాన్నే పుస్తకాల బ్యాగుతో బడికి పంపాల్సిన బిడ్డను కాటికి పంపాల్సి వచ్చిందే అంటూ దీక్షత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు ఆస్పత్రి ప్రాంగణంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. దీక్షిత మృతిచెందిన విషయం తెలుసుకున్న మదర్ థెరిస్సా స్కూల్ యాజమాన్యం పాఠశాలకు సెలవు ప్రకటించింది. దీక్షిత భౌతికకాయాన్ని చూసి సహచర విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. -
దుబాయ్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఫ జిల్లా ఉపాధి కల్పన అధికారిణి పద్మ వెల్లడిభువనగిరిటౌన్ : తెలంగాణ ప్రభుత్వ విదేశీ మానవవనరుల సంస్థ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్)లోని ఒక ప్రముఖ సంస్థలో 500 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్. పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం క్లీనర్స్ , టైల్ మేసన్, ఆల్ రౌండ్ మేసన్, బ్లాక్/ప్లాస్టర్ మేసన్, స్టీల్ ఫిక్సర్, షట్టరింగ్ కార్పెంటర్, ప్లంబర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్, ఫినిషింగ్ కార్పెంటర్, వెల్డర్, జనరల్ హెల్పర్ ట్రేడ్ లో ఖాళీలు ఉన్నట్లు వివరించారు. ఎంపికై న వారికి నైపుణ్య స్థాయి ప్రకారం అదనపు పని వేళల (ఓవర్ టైమ్) భత్యంతో పాటు జీతం ఉంటుందని, వసతి, రవాణా, వంటగది సౌకర్యాలను యజమానే కల్పిస్తారని పేర్కొన్నారు. రోజుకు 9 గంటల పని వేళలు ఉంటాయని, విమాన ప్రయాణ టికెట్ ఖర్చులను అభ్యర్థులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ నెల 21న హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో గల సంస్థ కొత్త కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు బయోడేటా, పాస్పోర్ట్, విద్యార్హత, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8328602231, 9440050951, 9440051452 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. మౌలిక వసతుల కల్పనే ధ్యేయంబొమ్మలరామారం: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేయాలని డీఆర్డీఓ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం బొమ్మలరామారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శ్యామల, సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, ఎంపీఓ శ్రీమాలిని, ఏపీఎం చెంచల యాదగిరి, ఏపీఓ శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాలినల్లగొండ : సీఎంఆర్ డెలీవరిని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు. గురువారం నల్లగొండలోని రెవెన్యూ అదనపు కలెక్టర్ చాంబర్లో ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన ఖరీఫ్ 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఎఫ్సీఐ రేక్ మూమెంట్, స్థలాలు, ఎఫ్సీఐ పేమెంట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. సీఎంఆర్ డెలివరీని ప్రతిరోజూ డీఎస్ఓలు, పౌరసరఫరాల డీఎంలు మిల్లల వారీగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి వారం మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా డీఎస్ఓలు, పౌర సరఫరాల డీఎంలు, రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయ్, ఎన్పోర్స్మెంట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వస్తువుల సరఫరాకు టెండర్లు ఆహ్వానంభువనగిరి: జిల్లాలోని 62 ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇండోర్, అవుట్డోర్ ఫర్నిచర్, ఆట వస్తువులు, వాల్ పెయింటింగ్కు సంబంధించిన వస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల కోసం ఒక్కో పాఠశాలకు రూ. లక్ష చొప్పున నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన సరఫరాదారులు అవసరమైన పత్రాలు, డిమాండ్ డ్రాఫ్టుతో కూడిన టెండర్ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అందజేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారిని సంప్రదించాలని సూచించారు. -
స్వర్ణగిరీశుడికి తిరుప్పావడ సేవ
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం ఉదయం స్వామివారికి అర్చకులు తిరుప్పావడ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 450 కిలోల అన్నప్రసాదం, లడ్డూ, వడ తదితర పిండి వంటలను నైవేధ్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాలసేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ప్లాట్లు విక్రయిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు చివ్వెంల(సూర్యాపేట) : ప్లాట్లు విక్రయిస్తానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన కాసర్ల సురేందర్రెడ్డి తనకు ఐలాపురం గ్రామ శివారులో తనకు ప్లాట్లు ఉన్నాయని, తక్కువ ధరకు విక్రయిస్తున్నానని మోతె మండల నర్సింహాపురం గ్రామానికి చెందిన కోడిదల వెంకన్న, కోడిదల కనకయ్య నుంచి నగదు తీసుకున్నాడు. ఆ ప్లాట్లు కూడా ఇతరులకు సంబంధించిన భూమి కాగా.. తనదిగా చూపించాడు. నగదు చెల్లించిన వారు రిజిస్ట్రేషన్ చేయమంటే చేయకపోవడంతో సురేందర్రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సురేందర్రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యంకోదాడరూరల్ : అప్పుల బాధ భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన గురువారం కోదాడ పట్టణంలో జరిగింది. పట్టణ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఆసిఫ్ఖాన్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. బెట్టింగ్లకు అలవాటుపడిన అతడు అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ భరించలేక శ్రీఇంటి నుంచి వెళ్లిపోతున్నాను.. నా కోసం వెతకొద్దుశ్రీ అని లెటర్ రాసి గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో అతడి భార్య వహిదా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అతడికి నాలుగేళ్ల లోపు వయసున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆసిఫ్ఖాన్ ఆచూకీ తెలిసినవారు 87126 86009 నంబర్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. విద్యుదాఘాతంతో మహిళ మృతిహుజూర్నగర్ : ఇంట్లో ఫ్రిజ్ తెరుస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన తెప్పని రంగమ్మ(45) బుధవారం అర్ధరాత్రి పాలు ఫ్రిజ్లో పెట్టేందుకు ఇంట్లోని ఫ్రిజ్ డోర్ తెరవగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. గురువారం ఉదయం రంగమ్మ భర్త శ్రీను నిద్ర లేచి చూసేసరికి ఆమె మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
నల్లగొండ : కూరగాయల మార్కెట్ వద్ద దొరికిన బ్యాగును పోలీస్ స్టేషన్లో అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు నల్లగొండకు చెందిన ఆటో డ్రైవర్ మూకుండి నరేష్. గురువారం సూర్యాపేటకు చెందిన షహానా బేగం నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వద్ద తన బ్యాగును మర్చిపోయింది. ఆ మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్ మూకుండి నరేష్ బ్యాగును గమనించి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆ బ్యాగు షహానా బేగందిగా గుర్తించి ఆమెను స్టేషన్కు పిలిపించి అందులోని సెల్ఫోన్, రూ.14 వేల నగదు అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ నరేష్ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఫ రోడ్డుపై దొరికిన బ్యాగును పోలీస్ స్టేషన్లో అప్పగింత ఫ బాధితురాలికి అందజేసిన పోలీసులు -
ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
చౌటుప్పల్ : హైవేపై యూటర్న్ తీసుకుంటున్న ప్రైవేట్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని అపెరల్ టెక్స్టైల్ పార్క్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామ శివారులోని పోకర్ణ కంపెనీకి చెందిన బస్సు కంపెనీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లాల్సి ఉంది. డ్రైవర్ దండుమల్కాపురం గ్రామ శివారులోని అపెరల్ పార్కు ముందు ఉన్న జంక్షన్ వద్ద యూటర్న్ చేసుకుంటుండగా.. చౌటుప్పల్ వైపు వస్తున్న దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్డీసీ బస్సు వెనుక నుంచి ప్రైవేట్ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా హైవేపై బోల్తాపడింది. ఆ సమయంలో ప్రైవేట్ బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. ఆర్టీసీ బస్సులో ఉన్న పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ జాం అయ్యింది. మినీ బస్సును రోడ్డు పక్కకు తప్పించిన పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫ హైవేపై ట్రాఫిక్ జాం -
ఆర్మీ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
భూదాన్పోచంపల్లి : మండలంలోని దేశ్ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ అభ్యర్థులకు బీఎస్సీ, ఎంపీసీ, ఎంఎస్సీ, బీజెడ్సీ, ఎంజెడ్సీ, బీకాం సీఏ, బీకాం జీ, బీఏ గ్రూపులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎస్టీ అభ్యర్థులకు ఎంపీసీలో 1, బీకామ్ జీలో 2, మైనార్టీలకు బీజెడ్సీలో 1 సీటు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఈ నెల 18న ఉదయం 9గంటల లోపు ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, ఆధార్కార్డు, స్టడీ కండక్ట్, గేమ్స్/ఎన్సీసీ/ ఎన్ఎస్ఎస్/ మాజీ సైనికుల పత్రాలతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో నేరుగా హాజరుకావాలని సూచించారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల కనీస ఎత్తు 152 సెంటీమీటర్లు, కంటి చూపు +–1.5 కంటే తక్కువ ఉండాలన్నారు. ట్రాక్ సూట్, టీషర్ట్, షూ ధరించి రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 79950 10687 నంబర్ను సంప్రదించాలన్నారు. సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టుహుజూర్నగర్ : ద్విచక్ర వాహనంపై సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం లాలీతండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా ద్విచక్ర వాహనంపై సారాను తరలిస్తుండగా.. వాహన తనిఖీల్లో భాగంగా ఎకై ్సజ్ ఎస్ఐ జగన్మోహన్రెడ్డి పట్టుకున్నారు. అతడి వద్ద 3 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామన్నారు. అంతేకాకుండా అతడు సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. డబ్బు రెట్టింపు చేస్తామని ఆశచూపి మోసంఫ నకిలీ నోట్లు అంటగట్టిన ముగ్గురి అరెస్ట్ తుర్కపల్లి : డబ్బు రెట్టింపు చేస్తామని అమాయకుడికి ఆశచూపి నకిలీ నోట్లు అంటగట్టిన ముగ్గురు వ్యక్తులను తుర్కపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ తఖీయోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన ముదురుకోల యాకంబరం, ముదురుకోల దేవేందర్, హైదరాబాద్లోని హయత్నగర్ మండలం కుంట్లూరుకు మద్దెబోయిన నాగరాజు తుర్కపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తికి కలిసి రూ.లక్ష ఇస్తే రూ.2 లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పల్లెపహాడ్ గ్రామ స్టేజీ వద్ద రూ.లక్ష నగదు అందజేశాడు. అనంతరం వారు ఇచ్చిన నోట్ల కట్టలను పరిశీలించగా పైన, కింద మాత్రమే అసలైన రూ.500 నోట్ల ఉండగా.. మధ్యలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించిన నోట్లు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన తుర్కపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టి బుధవారం ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ముదురుకోల యాకంబరం గతంలో సుబేదారి. గతంలోనూ పలు నకిలీ కరెన్సీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు గుర్తించారు. వారి నుంచి నకిలీ కరెన్సీ నోట్లు, రూ.10వేల నగదు, బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
సౌకర్యాలు కరువు.. ధరల దరువు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమవుతున్నారు. దేవాలయంలో రుద్రాభిషేకం పూజకు రూ.1,116 టికెట్ పెట్టారు. ఇతర దేవాలయాల్లో ఎక్కడా ఇంత ధర లేదు. కానీ ఈ టికెట్ తీసుకున్న భక్తులకు దేవస్థానం తరఫున ఎలాంటి సన్మానం, ప్రసాదం అందించడం లేదు. గుట్ట పైన కోనేరులో నీరు కలుషితంగా ఉండటంతో స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక రేట్లకు విక్రయం.. గట్టు పైన కిరాణా షాపులు, కూల్డ్రింక్ షాపులను టెండర్ ద్వారా దక్కించుకున్న వారు అధిక రేట్లకు విక్రయిస్తున్నా సంబంధిత అధ/కారులు, పాలకమండలి సభ్యులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ సిబ్బంది ప్రోత్సాహంతోనే వ్యాపారస్తులు అధిక రేట్లకు పూజా సామగ్రి, వాటర్ బాటిళ్లు విక్రహిస్తున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు గుండ్ల పైన శివలింగానికి అభిషేకం చేసేందుకు గాను భక్తులకు రూ.100కు స్టీల్ బాక్స్లో పాలు విక్రయిస్తున్నారు. ఇవి కనీసం పావు లీటరు కూడా ఉండటం లేదని, అంతేకాకుండా నాణ్యత లేని కూల్ వాటర్, కూల్డ్రింక్స్ విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లు ఎక్కువ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల అమావ్యాస రోజు వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారస్తులు అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, దేవాలయ అధికారులు ధరల పట్టిక ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. పాలకమండలి దృష్టి సారించాలి చెర్వుగట్టు ఆలయ పాలకమండలి ఏర్పాటై రెండు నెలలవుతున్నా భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై, ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా లక్ష పుష్పార్చన పూజ చేసేందుకు భక్తులకు అవకాశం కల్పించడం లేదు. పాలకమండలి చైర్మన్, సభ్యులకు, దేవాలయ కార్యనిర్వహణ అధికారుల మద్య విభేదాలు కొనసాగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఫ చెర్వుగట్టుపై భక్తులకు ఇబ్బందులు ఫ అధిక ధరకు పాలు, వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్న వ్యాపారులు ఫ పారిశుద్ధ్యం అస్తవ్యస్తం ఫ కలుషితంగా కోనేటి నీరు -
ప్రవళిక.. బంగారు పరుగు
డిండి : నిరుపేద కుటంబంలో జన్మించిన ఆ యువతి తన ప్రతిభతో దేశానికే గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రిలే పరుగు పందెంలో భారత జట్టు తరఫున పాల్గొని బంగారు పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. డిండి మండల కేంద్రానికి చెందిన నారిమళ్ల రాంబాబు, విజయ దంపతులు మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ప్రవళిక ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు డిండి మండల కేంద్రంలోనే ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంది. ఫీజు కట్టేంత ఆర్థిక స్థోమత లేక గురుకుల ప్రవేశ పరీక్ష రాయగా.. స్థానిక గురుకుల పాఠశాలలో ప్రవళికకు సీటు వచ్చింది. దీంతో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలో చదివింది. ప్రస్తుతం నల్లగొండలోని గురుకుల డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. గురుకుల పాఠశాలలో చేరగానే ప్రవళిక క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. పాఠశాలలో నిర్వహించే క్రీడా పోటీల్లో ఎక్కువగా పరుగు పందెంలో పాల్గొని అసాధారణ ప్రతిభ కనబర్చింది. ప్రవళిక టాలెంట్ను గుర్తించిన పీఈటీ జ్యోతి ఆమెను ప్రోత్సహిస్తూ పరుగు పందెంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అథ్లెటిక్స్లో చేరిక.. 2020లో ప్రవేశ పరీక్ష ద్వారా డిండి గురుకుల అథ్లెటిక్స్ అకాడమీలో చేరిన ప్రవళిక కోచ్ పరుశురాం శిక్షణలో మెళకువలు నేర్చుకుంది. అప్పటి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో 35, జాతీయ స్థాయిలో 3 పతకాలతో పాటు ఇటీవల చైనాలో ఇటీవల జరిగిన అండర్–23 అథ్లెటిక్స్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్లో మహిళల 4 400 మీటర్ల రిలే పరుగు పందెంలో భారతదేశం తరఫున పాల్గొని బంగారు పతకం సాధించింది. ఫ పరుగు పందెంలో రాణిస్తున్న గురుకుల విద్యార్థిని ఫ అథ్లెటిక్స్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్లో బంగారు పతకం కైవసంనా తల్లిదండ్రులు ప్రోత్సాహంతో పాటు పీఈటీ మేడం జ్యోతి ఇచ్చిన శిక్షణతో డిండి గురుకుల అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశం దొరికింది. అప్పటి నుంచి కోచ్ పరుశురాం నేర్పిన మెళకువలతో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరుగు పందెంలో పతకాలు సాధించాను. స్థానిక గురుకుల పాఠశాల అధ్లెటిక్స్ అకాడమీలో పీజీ విద్యార్థులు కూడా శిక్షణ పొందే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. భవిష్యత్తులో దేశం తరఫున ఒలంపిక్స్లో పాల్గొని పతకం సాదించాలన్నదే నా లక్ష్యం. – నారిమళ్ల ప్రవళిక -
ప్రవళికకు ఘన స్వాగతం
చైనాలో జరిగిన అథ్లెటిక్స్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన ప్రవళిక బుధవారం డిండికి చేరుకోగా.. ఆమెను గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రవళికకు గురుకుల పాఠశాలల జోనల్ ఆఫీసర్ విద్యారాణి పుప్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ చౌరస్తా వరకు గురుకుల విద్యార్థినులు నిర్వహించిన ర్యాలీలో ప్రవళిక పాల్గొంది. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ పీడీ షంషీర్ అలీ, ప్రిన్సిపాల్ శిరీష, సర్పంచ్ నల్లగంతుల రవి, కోచ్ పరుశురాం, పీఈటీ జ్యోతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన నివాసంలో ప్రవళికకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
మాడుగులపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామానికి చెందిన చామర్తి ఉపేంద్రచారి(32) మాడుగులపల్లి మండలం కొత్తగూడెం గ్రామంలోని శ్రీబాలాజీ వేర్హౌసింగ్ అండ్ లాజిస్టిక్ గోదాంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. కుక్కడం గ్రామ శివారులో ముందు వెళ్తున్న బైక్ను క్రాస్ చేయబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మెలకు ఢీకొని తీవ్రంగా గాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిల్పకుంట్లకు చెందిన మరో వ్యక్తి..నూతనకల్ : మండలంలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన వేల్పుల గంగయ్య(48) జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలస వెళ్లాడు. వారం క్రితం హైదరాబాద్లోని అంబర్పేట సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
విజ్ఞాన్స్ యూనివర్సిటీకి ‘కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ ఎమినెన్స్ అవార్డు’
భూదాన్పోచంపల్లి : మండలంలోని దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి 2025–26 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ అందించే అత్యున్నత కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ ఎమినెన్స్ అవార్డు వరించింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ లీడర్షిప్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో క్యాంపస్ ప్రతినిధులకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే నేటి ఏఐ యుగంలో ఇంగ్లిష్ విద్యను సరికొత్తగా మలిచి విద్యార్థులను అంతర్జాతీయంగా ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపా రు. ఈ అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నకిలీ డీఏపీ బస్తాలు సీజ్మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెంలో ప్రముఖ ఎరువుల కంపెనీ పేరుతో నకిలీ డీఏపీ బస్తాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో బుధవారం వ్యవసాయ అధికారులు, పోలీసులు, డీఏపీ కంపెనీ ప్రతినిధులు దాడులు నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ రవి మాట్లాడుతూ.. అర్హత లేని వ్యక్తులు గత మూడు రోజులుగా రఘునాథపాలెం, చౌటపల్లి, మేళ్లచెరువు తదితర గ్రామాలలో 1000 నకిలీ డీఏపీ బస్తాలను రాత్రివేళ విక్రయించారని తమ విచారణలో తేలిందన్నారు. కొన్ని బస్తాలను పోలీసుల సహకారంతో సీజ్ చేసి కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. నకిలీ డీఏపీ బస్తాలలోని శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం కంపెనీకి పంపించామన్నారు. ఈ దాడుల్లో ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్, ఏఈఓలు శ్రావ్య, త్రివేణి, ప్రముఖ డీఏపీ కంపెనీ కంపెనీ జోనల్ మేనేజర్ సుమన్రెడ్డి, మార్కెటింగ్ అధికారి తిరుమల్రెడ్డి, ఆగ్రోనమిస్ట్ నిఖిల్రెడ్డి, శ్రీకాంత్, పోలీసులు పాల్గొన్నారు. ఊట్కూరులో కిడ్నాప్ కలకలంనిడమనూరు : మండల పరిధిలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం రాత్రి కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూరు గ్రామానికి చెందిన బొల్లేపల్లి శేఖర్ను మంగళవారం రాత్రి గ్రామ శివారులో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. మూడు, నాలుగు గంటల అనంతరం నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు ప్రాంతంలో శేఖర్ను కిడ్నాపర్లు వదిలిపెట్టడంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. కిడ్నాప్కు గురైన ప్రదేశంలో ద్విచక్ర వాహనం దగ్గర పెనుగులాడిన ఆనవాళ్లు లేకపోవడం, బాధితుడు శేఖర్ నుంచి పలువురికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. శేఖర్ కుటుంబంలో భూవివాదం జరిగినట్లు తెలిసింది. సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శేఖర్ తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి విజయ్కుమార్ తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి
భానుపురి (సూర్యాపేట) : బోరు బండి యాజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారితో పాటు లంచం తీసుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరునెలల క్రితం బోరు బండి కొనుగోలు చేసి జిల్లా భూగర్భ జల అధికారి నుంచి అనుమతి తీసుకోవాలనే విషయం తెలియక తన గ్రామంలో ఓ రైతు పొలంలో బోరు వేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన భూగర్భ జల కార్యాలయ సిబ్బంది వెళ్లి అనుమతి లేకుండా బోరు వేయొద్దని చెప్పారు. సదరు బోరుబండి యాజమాని సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి బాలును సంప్రదించగా.. అనుమతి కోసం రూ.లక్ష చెల్లించడంతో పాటు కార్యాలయ ఆవరణలో ఫ్రీగా బోరు వేయాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 10న బోరుబండి యాజమాని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బుధవారం ఫిర్యాదుదారుడు భూగర్భ జల అధికారి కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు బోరు బండి యజమాని నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధి కారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ను విచారించగా.. భూగర్భ జల అధికారి బాలు చెప్పడంతోనే లంచం తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే టోల్ఫ్రీ నంబర్ 1064కు లేదా వాట్సాప్ నంబర్ 94404 46106కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు సూచించారు. ఫ ఆయన చెప్పడంతోనే బోరు బండి యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు -
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు
నల్లగొండ : రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను నల్లగొండ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సీఐ రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ అలియాస్ సత్తిబాబుపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 47 చోరీ కేసులు ఉన్నాయి. రాత్రివేళ ఇళ్లు, వ్యాపార సంస్థలు, షాపులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో పలుమార్లు అరైస్టె జైలుకెళ్లి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని కర్మన్ఘాట్ ప్రాంతంలో నివాసముంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నప్పటికీ తన నేర ప్రవర్తనను విడిచిపెట్టకుండా చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 3వ తేదీన రాత్రి నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గల హనుమాన్ స్పోర్ట్స్ షాపు షట్టర్ తాళాన్ని ఇనుప రాడ్డుతో పగులగొట్టి కౌంటర్లో దాచిన రూ.3,40,000 నగదు ఎత్తుకెళ్లాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం నార్కట్పల్లి బస్టాండ్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడి నుంచి రూ.52,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఫ రూ.52 వేల నగదు స్వాధీనం -
హత్య కేసులో నిందితుల అరెస్టు
మిర్యాలగూడ టౌన్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని వాడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ పీఎన్డీ ప్రసాద్ వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డితో కలిసి విలేకరులకు వెల్లడించారు. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవింద్(53) అలియాస్ గోన్యా, సరోజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారందరికి వివాహాలయ్యాయి. గోవింద్ వ్యవసాయం చేస్తుండగా.. సరోజ గొర్రెలు మేపుతూ జీవనం సాగించేవారు. కుమార్తెల వివాహాల సమయంలో సరోజకు అదే గ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీను కొంతమేర ఆర్థికసాయం చేశాడు. దీంతో శ్రీను అప్పుడప్పుడు సరోజ ఇంటి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో శ్రీనుతో సరోజ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదే విషయమై గోవింద్ తన భార్య సరోజను అనుమానిస్తూ తరచూ గొడవ పడుతుండేవాడు. 10 రోజుల క్రితం శ్రీనుతో సరోజ ఫోన్ మాట్లాడుతుండగా గోవింద్ గమనించి ఆమె చేతిలోని సెల్ఫోన్ను పగులగొట్టాడు. దీంతో ఎలాగైనా గోవింద్ అడ్డు తొలగించుకోవాలని సరోజ, శ్రీను పథకం వేశారు. నిద్రలో ఉండగానే.. ఈ నెల 10న రాత్రి గోవింద్ ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా.. శ్రీను వచ్చాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం శ్రీను గోవింద్ ముఖంపై దిండుతో అదిమి పట్టగా.. భర్త కదలకుండా సరోజ కాళ్లు పట్టుకుంది. అయినా గోవింద్ ప్రతిఘటించడంతో సరోజ ఇంట్లో ఉన్న రోకలిబండను తీసుకొచ్చి భర్త వృషణాలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం వారిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. మరుసటిరోజు ఉదయం చుట్టుపక్కల వారు చూసేసరికి ఇంట్లో గోవింద్ చనిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి అన్న ఇస్లావత్ దుద్యా ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం దామరచర్ల గ్రామ శివారులోని రైల్వే గేటు సమీపంలో సరోజ, శ్రీను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను మిర్యాలగూడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరుణ్తేజ్ వద్ద హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సీఐ పీఎన్డీ ప్రసాద్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాాంత్రెడ్డి, ఏఎస్ఐ జోజి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ఫ రిమాండ్కు తరలింపు -
టెంపుల్ సిటీ
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పరిసరాలను ప్రత్యేక శ్రీటెంపుల్ సిటీశ్రీగా ప్రకటిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేసినా.. భౌగోళికంగా దాని సరిహద్దుల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. టీటీడీ తరహాలో పూర్తి స్వయంప్రతిపత్తితో నూతనంగా ఏర్పాటైన వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) బోర్డు ఈ టెంపుల్ సిటీ పరిధిని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. గతంలో అధికారులు భూముల సర్వే చేసి నివేదికలు సిద్ధం చేసినా అవి ఇంకా ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన పాలక మండలి టెంపుల్ సిటీ హద్దులపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నూతన చట్ట సవరణ ద్వారా స్వయంప్రతిపత్తి ప్రభుత్వం ఇటీవల ‘తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్, 1987’కు నూతన సవరణ (యాక్ట్ నంబర్. 11/2025) చేస్తూ అధికారిక గెజిట్ను విడుదల చేసింది. దీని ప్రకారం యాదగిరిగుట్ట దేవస్థానానికి టీటీడీ తరహాలోనే స్వయంప్రతిపత్తి కలిగిన ప్రత్యేక వైటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను ప్రత్యేక ‘టెంపుల్ సిటీ’ (టౌన్షిప్)గా ప్రకటించారు. ఆమోదం పొందని గత సర్వేలు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు, తిరుమల తరహాలో ఆలయ పవిత్రత, సంస్కృతికి అద్దంపట్టేలా టెంపుల్ సిటీ పరిధిని నిర్ణయించాల్సి ఉంది. అయితే గతంలో చేసిన ప్రయత్నాలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. గత ఏడాది దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, అప్పటి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు వివిధ శాఖల అధికారులతో పరిధిపై విస్తృతంగా చర్చించారు. డీజీపీఎస్ సర్వే వైటీడీఏ వివిధశాఖలతో పాటు యాదగిరిపల్లి, గుండ్లపల్లి,దాతారుపల్లి, సైదాపురం, మల్లాపురం గ్రామాల్లో భూసేకరణ చేసింది. ఈ భూములను సర్వే నంబర్ల వారీగా డీజీపీఎస్ సర్వే చేయించి, మ్యాప్లను సిద్ధం చేశారు. భవిష్యత్లో వివాదాలు రాకుండా భూములను ఏయే శాఖలకు కేటాయించారో సమగ్ర వివరాలు సేకరించారు. అలాగే స్వామివారికి హైదరాబాద్ బంజారాహిల్స్, భువనగిరిగంజ్, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దబగుంటపల్లి సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందల ఎకరాల భూములు, భవనాలను గుర్తించి సర్వే చేయించారు. యాదగిరిగుట్ట రింగ్ రోడ్డుతో పాటు తులసీకాటేజ్, పెద్దగుట్ట, పాత గుట్ట ప్రాంతాలను టెంపుల్ సిటీ పరిధిలోనే ఉంచారు.ప్రస్తుతం కొత్త పాలక మండలి ఏర్పాటైన నేపథ్యంలో.. వారు సమావేశమై టెంపుల్ సిటీ హద్దులపై త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రాజెక్టు శరవేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని భక్తులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఫ టీటీడీ తరహాలోనే వైటీడీకి ప్రత్యేక అథారిటీ ఫ అయినా పరిధిపై రాని స్పష్టత ఫ ఆమోదానికి నోచుకోని గత సర్వే నివేదికలు ఫ హద్దుల ఖరారుపై కొత్త పాలక మండలి నిర్ణయమే కీలకం టెంపుల్ సిటీ కోసం వైటీడీఏ సేకరించిన భూమి (ఎకరాల్లో) పరిహారం కింద ఇటీవల మంజూరైంది రూ.100కోట్లు పరిహారం ఇవ్వాల్సిన భూమి.. 180 ఎకరాలు -
అక్రమ నిర్మాణాలకు ఎమ్మెల్యే వత్తాసు
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో చేపట్టిన అక్రమ నిర్మాణాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వత్తాసు పలుకుతున్నాడని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. వలిగొండ రోడ్డులోని ప్రధానా నాలా, నాలాలో కౌన్సిలర్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. అదే విధంగా చౌటుప్పల్–వలిగొండ ప్రధాన రహదారి పనుల ఆలస్యంపై పార్టీ శ్రేణులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సేవ చేస్తాడని ప్రజలు కౌన్సిలర్గా గెలిపిస్తే నాలాలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నాడని ధ్వజమెత్తారు. 200గజాలకు అనుమతులు తీసుకొని 500గజాలలో నిర్మాణం చేస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పాత్ర ఎంత, షాడో ఎమ్మెల్యే పాత్ర ఎంత, మున్సిపల్ చైర్మన్ పాత్ర ఎంత ఉందని ప్రశ్నించారు. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస.. సమస్యల పరిష్కారంపై ఏమాత్రం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల, మున్సిపల్ అధ్యక్షులు గిర్కటి నిరంజన్, బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్, ఊదరి యాదయ్య, నాయకులు డిల్లీ మాధవరెడ్డి, దేవరపల్లి గోవర్దన్రెడ్డి, తాడూరి పరమేష్, ఊడుగు మల్లేష్, సుర్వి మల్లేష్, కొత్త పర్వతాలు, ముప్పిడి శ్రీనివాస్, కై రంకొండ వెంకటనర్సయ్య, డిల్లీ శంకర్రెడ్డి, బోరెం ప్రశాష్రెడ్డి, బాతరాజు యాదయ్య, ఎం.డి.ముషీర్, చెవగోని మహేష్, చింతల మహిపాల్రెడ్డి, సుర్కంటి శంకర్రెడ్డి పాల్గొన్నారు. ఫ మాజీ మ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపణ ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించంవరద కాలువ పేరుతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్రెడ్డి, బోయ దేవేందర్లు పేర్కొన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. బాధ్యత కలిగిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఇచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అంతేగానీ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నాలా నిర్మాణం ఎందుకు చేయించలేదో చెప్పాలన్నారు. రాజగోపాల్రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. -
విద్యార్థులకు అందిస్తున్న సేవలు అమోఘం
భువనగిరి: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందిస్తున్న సేవలు అమోఘమని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కొనియాడారు. భువనగిరి పట్టణ శివారులోఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, నిర్మాణ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్, వివిధ రకాల సౌకర్యాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటి కింద రూ.3.65 కోట్లతో జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఐస్పార్క్, ల్యాబ్, బంకర్ బెడ్స్, సోలార్ ఫెన్సింగ్,మెస్ డోర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కోరుకుంటున్న రంగంలో ఎదిగేలా టీచర్లు కృషి చేయాలన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందిస్తున్న సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు ఎలిమరణ్, కై లాస్ కాంత్, డీఈఓ బి. భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, సెక్టోరియల్ అధికారులు రాధ, పెసరు లింగారెడ్డి, ఎంఈఓ రంగరాజన్ పాల్గొన్నారు.ఫ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏఈలు, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రతి మండలంలో పనులపై నిరంతరం పర్యవేక్షణ చేసి లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని సూచించారు. కొండమడుగు, జిబ్లక్పల్లి, సిగన్నగూడెం ప్రాంతాల్లోని 2బీహెచ్కే కాలనీల భవనాలు, మౌలిక సదుపాయాల పనులపై ఆరా తీశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పీడీ (హౌసింగ్), ఎంపీడీఓలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (హౌసింగ్), అసిస్టెంట్ ఇంజినీర్లు (హౌసింగ్), పంచాయతీరాజ్ శాఖ అధికారులు , మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఐదు నెలల వేతనం విరాళంభూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లి సర్పంచ్ ఆర్ల కావ్య వెంకటేశ్యాదవ్ తన ఐదు నెలల వేతనం డబ్బులు రూ.32,500లను గ్రామాభివృద్ధికి బుధవారం అందజేశారు. ఈ డబ్బులను వాటర్ఫిల్టర్ నిర్వాహకులకు వేతనాల కింద చెల్లించారు. సర్పంచ్ వాటర్ఫిల్టర్ ద్వారా గ్రామ ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించడంతో పాటు ఫిల్టర్ కరెంట్ బిల్లులను సొంతంగా చెల్లిస్తున్నారు. దాంతో సర్పంచ్ను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆర్ల లింగస్వామి, పంచాయతీ కార్యదర్శి శుభాష్, మాజీ ఎంపీటీసీ సుర్కంటి జంగారెడ్డి, నాయకులు వల్లమల్ల సత్యనారాయణ, సిర్పంగి గణేశ్, మీసాల నర్సింహ, తంగడపల్లి వసంత, వార్డుసభ్యులు పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచండిసంస్థాన్ నారాయణపురం: గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల పనుల్లో వేగం పెంచాలని జెడ్పీ సీఈఓ ఎన్. శోభారాణి అధికారులను ఆదేశించారు. సంస్థాన్నారాయణపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయవద్దన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. భువనగిరి కేజీబీవీలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులుభువనగిరి: భువనగిరి పట్టణంలోని కేజీబీవీలో పీజీసీఆర్టీ(గణితం) సబ్జెక్టు ఖాళీ పోస్టు భర్తీకి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధికారిణి రాధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ(గణితం), బీఈడీ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ వరకు అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 801 9166587ను సంప్రదించాలని సూచించారు. 22న వేలం పాటలుమోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట నిర్మించిన పది కమర్షియల్ షాపులను ఏడాది కాలానికి అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈ నెల 22న బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు మార్కెట్ కార్యదర్శి శివకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం ప్రక్రియలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. టెండర్ షెడ్యూల్ ఫారాలు మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ. 500 చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు. టెండర్ ఫారంతో పాటు రూ. 10,000 డీడీని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి పేరిట సమర్పించాలని సూచించారు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. పది షాపుల్లో జనరల్ కేటగిరీకి నాలుగు, బీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1 చొప్పున కేటాయించనున్నట్లు వివరించారు. -
ఉక్కపోత.. జ్వరాల మోత
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చిన్నపిల్లలతో పాటు పెద్ద వారు కూడా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుత సీజన్లో కలుషిత ఆహారం, అపరిశుభ్రమైన నీటి వల్ల టైఫాయిడ్, విరేచనాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలకు వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి. దోమతెరలను వినియోగించడంతో పాటు, శరీరం పూర్తిగా కప్పబడేలా నిండు వస్త్రాలను ధరింపజేయాలి. –డాక్టర్ అరుణకుమారి, సూపరింటెండెంట్, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిభువనగిరి: వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చిన్నారుల ఆరోగ్యం క్షీణిస్తోంది. వర్షాలు పడాల్సిన సమయంలోనూ పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం.. భరించలేని ఉక్కపోతతో పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జ్వరం, తలనొప్పి, విరేచనాలు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం సకాలంలో అందుబాటులో లేక నిరుపేదలు పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రులకు పోటెత్తుతున్న రోగులు జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రోగుల తాకిడి పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. జనవాసాల మధ్య మురుగు నీరు నిల్వ ఉండి, వాటిని సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి రోగాల బారినపడాల్సి వస్తోంది. ఒక్క జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే రోజుకు సుమారు 100 నుంచి 150 వరకు చిన్నపిల్లల ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో జ్వరం, తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న 10 నుంచి 12 మంది చిన్నారులను ఆస్పత్రిలో చేర్చుకుని రెండు రోజుల పాటు ప్రత్యేక నిఘాలో ఉంచి చికిత్స చేస్తున్నారు.వాతావరణ మార్పులతో అనార్యోగం బారిన పిల్లలు ఫ ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతాకిడి ఫ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోజూ 150 దాటిన చిన్నపిల్లల ఓపీ -
బా్యంకుల్లో నగదు కొరత
సాక్షి, యాదాద్రి: జిల్లాలో నగదు కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సొంత ఖాతాలో డబ్బున్నా అవసరానికి తీసుకోలేని దుస్థితి నెలకొంది. ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా శ్రీనో క్యాష్శ్రీ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బ్యాంకులకు వెళ్తే ఎవరైనా డిపాజిట్ చేస్తేనే.. ఆ డబ్బులను విత్డ్రా కోసం ఇస్తున్నారు. అది కూడా అడిగినంత కాకుండా సగం మాత్రమే ఇస్తూ.. మిగతాది ఆన్లైన్లో బదిలీ చేసుకోవాలని అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వానాకాలం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో చేతిలో డబ్బులు లేక రైతులు, వృద్ధులు, మహిళలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నోట్ల రద్దు నాటి కష్టాలు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇలా పెట్టగానే.. అలా అయిపోతున్నాయి ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఏటీఎంలకు వెళితే ‘నో క్యాష్’ అని వస్తోంది. వృద్ధులు, మహిళలు, విద్యార్థుల అత్యవసరాల కోసం బ్యాంకులు కొంతవరకు నగదును ఏటీఎంలలో రిజర్వ్ చేస్తున్నప్పటికీ, మిగతా ఖాతాదారులు కూడా అక్కడే నగదు ఉపసంహరణలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. ఏటీఎంలలో కూడా నగదు లోడింగ్ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల చాలా చోట్ల అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. డిపాజిట్ చేస్తేనే నగదు: జిల్లాలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వింత పరిస్థితి నెలకొంది. ఎవరైనా ఖాతాదారులు డబ్బులు డిపాజిట్ చేస్తేనే మరొకరికి నగదు ఇస్తున్నారు. డబ్బులు జమ కాకపోతే నగదు ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. రోజువారీగా జమైన డబ్బుల నుంచి కూడా, కస్టమర్లు అడిగిన మొత్తంలో సగం నగదును మాత్రమే ఇచ్చి.. మిగిలిన మొత్తాన్ని డిజిటల్ బదిలీ (ఆన్లైన్ ట్రాన్సాక్షన్) చేసుకోమని చెబుతున్నారు. డిజిటలైజేషన్లో భాగమేనా?: ఆర్థిక లావాదేవీలలో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా నగదుపై ఈ అప్రకటిత పరిమితులు కొనసాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని వేగవంతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ తాత్కాలిక నగదు కొరత ఏర్పడి ఉండవచ్చని తెలుస్తోంది. కూలీలకు డబ్బులివ్వలేక రైతుల ఇబ్బందులు జిల్లా వ్యాప్తంగా 15 రోజులుగా బ్యాంకుల్లో సరిపడా నగదు నిల్వలు లేవు. పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొద్దిమంది రైతులకు రూ.20 వేల నుంచి రూ.50 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. చాలామంది రైతులు డబ్బులు లేవనగానే వెనుదిరిగిపోయారు. నాట్లు వేసే కూలీలకు, వ్యవసాయ పెట్టుబడులకు రోజూవారీగా నగదు ఇవ్వాల్సి ఉండటంతో రతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విత్డ్రా కోసం వెళ్తే సగం డబ్బులే ఇస్తున్న బ్యాంకులు ఫ ఏటీఎంల వద్ద నోక్యాష్ బోర్డులు ఫ డిజిటల్ చెల్లింపులు చేయాలంటున్న అధికారులు ఫ నగదు కోసం వృద్ధులు, మహిళల ఇబ్బందులు -
నేరాలను అరికట్టడమే ధ్యేయం
భువనగిరి: జిల్లాలో నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీస్శాఖ పనిచేస్తున్నట్లు ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ భద్రత వంటి అంశాల పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ఇంటలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. గ్రామాల వారీగా సీసీ కెమెరాల నెట్ వర్క్ విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పెట్రోలింగ్, నాకాబందీ, వాహన తనిఖీలు నిర్వహించి నేరస్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సైబర్ నేరాల నివారణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు, సీసీఎస్, సైబర్ సెల్, ఐటీ సెల్ అధికారులు పాల్గొన్నారు.ఫ ఎస్పీ అక్షాంశ్ యాదవ్ -
డ్రిప్, స్ప్రింక్లర్లతో పంటలకు నీటి తడి
భువనగిరి: డ్రిప్, స్ప్రింక్లర్లు వినియోగించడం ద్వారా పంటలను ఎల్నినో ప్రభావం నుంచి కాపాడుకోవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత సూచించారు. బుధవారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు, జమ్మాపురం గ్రామాల్లో పత్తి చేలను పరిశీలించారు. ఎల్నినో ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవడానికి అనుసరిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలను అడిగి తెలుసుకున్నారు. నీటి వసతి ఉన్న రైతులు ఈ విధానం అనుసరించడం ద్వారా పంటను పరిక్షించుకోవచ్చన్నారు. అనంతరం మునగ తోటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంటల సంరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, ఉద్వానశాఖ శాస్త్రవేత్త స్వాతి, గ్రామ సర్పంచ్ లూర్థయ్య, అంజయ్య, రైతులు మధు, నవీన్, నర్సయ్య, బాలస్వామి, చిన్నయ్య, ఏఈఓ సంధ్య పాల్గొన్నారు -
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..
ఆలేరు : తప్పిపోయిన మూడేళ్ల బాలుడి వివరాలు కనుగొనేందుకు పోలీసులు సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకున్నారు. బాలుడి వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో తప్పిపోయిన అరగంట లోపే తండ్రి వద్దకు చేరాడు. ఆలేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్కు చెందిన సామ్సన్ మూడేళ్ల కుమారుడు సాల్మన్ మంగళవారం ఉదయం ఇంటి నుంచి తప్పిపోయి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్నాడు. ఏడుస్తూ ఉన్న బాలుడిని గమనించిన స్థానికులు వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బాలుడి వీడియోలు, ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్ల్లో షేర్ చేశారు. అప్పటికే ఆందోళనలో ఉన్న సాల్మన్ తల్లిదండ్రులు వాట్సాప్ గ్రూప్లో తమ కుమారుడి వీడియోలు, ఫొటోలు చూసి వెంటనే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు వివరాలు సేకరించి బాలుడిని తండ్రి సామ్సన్కు అప్పగించారు. ఫ సోషల్ మీడియా సహాయంతో అరగంట లోపే వివరాలు కనిపెట్టిన ఆలేరు పోలీసులు ఫ బాలుడిని సురక్షితంగా తండ్రికి అప్పగింత -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
భూదాన్పోచంపల్లి : అభివృద్ధిలో పోచంపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛ ఎలక్ట్రిక్ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో హెచ్ఎండీఏ నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టెండర్లు పూర్తయిన సీసీ రోడ్లు, అంతర్గత డ్రెయినేజీ పనులను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. తదుపరి ఎండీపీఓ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పర్యాటక కేంద్రమైన పోచంపల్లికి అదనపు బస్సు సర్వీసులను నడిపించాలని ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్, డైరెక్టర్లకు శాలువా కప్పి సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, వైస్ చైర్పర్సన్ కొయ్యడ రజిని శ్రీనివాస్, అర్బన్బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పునూతుల వెంకటేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, పాక మల్లేశ్, మర్రి నర్సింహారెడ్డి, కాసుల అంజయ్య, సామ మోహన్రెడ్డి, కొట్టం కరుణాకర్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న రైతులు
కట్టంగూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామంలో రైతులతో కలిసి పంట పొలాలను, విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా రికార్డులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, సాగునీరు, ఎరువులు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. తీవ్ర వర్షాభావ ప్రభావంతో పాటు కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. తక్కువ ఓల్టేజీ, తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల మోటార్లు, స్టార్టర్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయన్నారు. సబ్స్టేషన్ల లాగ్బుక్స్లో రోజుకు 17 నుంచి 18 గంటలు త్రీఫేజ్ విద్యుత్, 6 నుంచి 7 గంటలు సింగిల్ ఫేజ్ విద్యుత్ ఇస్తున్నట్లు నమోదు చేసినప్పటికీ వాస్తవంగా అంత సమయం విద్యుత్ అందడం లేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తప్పుడు రికార్డులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు యాప్ విధానంతో సకాలంలో యూరియా, ఎరువులు అందడం లేదన్నారు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతుందన్నారు. కాళేశ్వరం, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల సామర్ాధ్యన్ని ప్రభుత్వం సక్రమంగా వినియోగంచడం లేదని, కాలువలకు నీరందక చెరువులు ఎండిపోవటంతో భూగర్భజలాలు తగ్గి రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజలకు తాగునీరు సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, స్థానిక సర్పంచ్ వడ్డె మాధవీసైదిరెడ్డి, ఉప సర్పంచ్ బండారు కృష్ణ, వార్డు సభ్యులు బండారు విజయ్కుమార్, బండారు అంజయ్య, మహేష్, మహేందర్రెడ్డి, సైదులు ఉన్నారు.ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
మిర్యాలగూడలో అగ్నిప్రమాదాలు
మిర్యాలగూడ టౌన్ : ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామంలో మంగళవారం జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అవంతీపురం గ్రామంలో కామ్రే రాజు తన భార్య అరుణతో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అరుణ మంగళవారం తెల్లవారుజామున వంట గదిలోకి వెళ్లి బల్బు స్విచ్ ఆన్ చేయగా అప్పటికే కిచెన్లో గ్యాస్ లీకై ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అరుణకు మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దంతో పాటు మంటలు ఇల్లు మొత్తం వ్యాపించడంతో ఇంట్లోని ప్లాస్టిక్ సామగ్రి, గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. అరుణ భర్త, పిల్లలు వెంటనే ఆమెను తీసుకుని బయటకు పరుగుల తీశారు. స్థానికులు గమనించి మంటలు ఆర్పివేసి అరుణను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ షాపు దగ్ధంమిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ షాపులో మంగళవారం షార్ట్ సర్క్యూట్ జరిగి షాపు దగ్ధమైంది. స్థానికులు, షాపు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ షాపులోని పై అంతస్తులో ఉన్న స్టోర్ రూంలో సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గదిలోని అట్టా పెట్టలకు మంటలు అంటుకుని ఒక్కసారిగా దట్టమైన పొగ రావడంతో షాపు నిర్వాహకులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. స్టోర్ రూంలోని ఎల్ఈడీ టీవీలతో పాటు కొన్ని ఫ్రిడ్జ్లు కాలిపోయాయని, సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.ఎంఎన్ఎస్ ఎంటర్ప్రైజెస్లో.. మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలోని మారం నర్సింహస్వామి(ఎంఎన్ఎస్) ఎంటర్ప్రైజెస్ షాపులో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండటంతో సోమవారం తెల్లవారుజాము వరకు మంటలు వ్యాపించాయి. ఎల్ఈడీ సెట్, జిరాక్స్ మిషన్, టైలరింగ్కు సంబంధించిన దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయాయని, సుమారు రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లిందని షాపు యజమాని తెలిపాడు. గ్యాస్ లీకై మహిళకు గాయాలు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన ఎలక్ట్రానిక్స్ షాపు -
ఉపాధ్యాయులకు మళ్లీ టెట్ టెన్షన్
భువనగిరి : టీజీటెట్–2026 ఫలితాలతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. గత నెల 16 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన టీజీటెట్–2026 ఫలితాలు ఈ నెల 13న విడుదలయ్యాయి. ఇందులో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో కేవలం 37.29 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధించిన టెట్ అర్హత తప్పసరి నిబంధనలతో అర్హత సాధించని ఉపాధ్యాయుల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది. ఉత్తీర్ణత తప్పసరితో ఒత్తిడి గత నెలలో జరిగిన టీజీటెట్–2026 పరీక్షకు 20 నుంచి 25 ఏళ్లుగా బోధన చేస్తున్న సుమారు 420 నుంచి 450 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరయ్యారు. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్లలో టెట్లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్లో తీర్పు వెలువరించింది. ప్రత్యేక టెట్ పైనే ఆశలు ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల భవిష్యత్ ఇప్పుడు ప్రత్యేక టెట్పై ఆధారపడి ఉంది. టెట్–1లో అర్హత సాధించలేకపోయిన వారికి ప్రత్యేకంగా టెట్–2 నిర్వహిస్తామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫ కేంద్ర నిబంధనతో ఉద్యోగ భద్రతపై ఆందోళన ఫ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో 37.29 శాతం మంది అర్హత ఫ టెట్–2 నిర్వహణకు 21న నోటిఫికేషన్ -
దరఖాస్తుల స్వీకరణ
రాజాపేట : జిల్లావ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పార్ట్టైమ్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, లైబ్రేరియన్ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యా సంస్థల సమన్వయ అధికారి పి.సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలలో ఈ నెల 18న డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అధ్యాపకుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని, ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. క్షేత్రపాలకుడికి ఆకుపూజ యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు.. సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలు జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో శ్రీఆంజనేయస్వామిని సింధూరంతో అభిషేకించి తమలపాకులతో అర్చన చేశారు. ఇక స్వామివారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్య నిర్వహించారు. రైతు బజార్లో కూరగాయల కొరతభువనగిరి : భువనగిరి రైతు బజార్లో రెండు రోజులుగా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని రైతు బజార్ వెలుపల వ్యాపారులు కూరగాయలను అధిక ధరలకు విక్రయించారు. సాధారణంగా రైతు బజార్కు నిత్యం భువనగిరి పరిసర ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నుంచి వ్యాపారులు వాహనాల ద్వారా కూరగాయలను తీసుకువస్తారు. హైదరాబాద్లో కూరగాయల ధరలు అధికంగా ఉండడం.. భువనగిరి రైతు బజార్లో ధరలు తక్కువగా నిర్ణయించడం వల్ల తమకు నష్టం కలుగుతోందని వ్యాపారులు కూరగాయల సరఫరా నిలిపివేశారు. కూరగాయలు లేకపోవడంతో రెండు రోజులుగా రైతు బజార్లో స్టాల్స్ను మూసివేశారు. జాబ్మేళాలో 340 మంది ఎంపిక నల్లగొండ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో మంగళవారం అప్రెంటిస్షిప్–ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో 25 సంస్థలకు చెందిన ప్రతినిధులు, అధికారులు పాల్గొని సుమారు 500 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 340 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ సందర్భంగా డీఐఈఓ దస్రూ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు త్వరగా ఉద్యోగ రంగంలో అడుగు పెట్టాలంటే అప్రెంటిస్ పూర్తి చేయడం ఎంతో అవసరమన్నారు. ఇందుకు ఉద్యోగ మేళాలు మంచి వేదికగా నిలుస్తాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యామండలి ఉద్యోగ మేళాల సమన్వయకర్త నండూరి శ్రీనివాస్, కళాశాల ప్రధానాచార్యులు ఎ.ఉపేందర్, సూర్యాపేట డీఐఈఓ బి.సులోచన రాణి, యాదాద్రి భువనగిరి జిల్లా నోడల్ అధికారి డి.సురేష్ రెడ్డి, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
యరగండ్లపల్లిలో కేంద్ర బృందం పర్యటన
మర్రిగూడ : కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి, వట్టిపల్లి గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యరగండ్లపల్లి జెడ్పీ హైస్కూల్ ఆవరణలో సర్పంచ్ వల్లంల సంతోష్యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ లాల్చందమ, అండర్ సెక్రటరీ రాజీవ్ రాణా, అసిస్టెంట్ డైరెక్టర్ నీతూ, జాయింట్ కమిషనర్ శేషుకుమార్, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ మురళీ పాల్గొన్నారు. వీరితో పాటు నల్లగొండ జెడ్పీ సీఈఓ, అడిషనల్ కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ వై. శేఖర్రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి శంకర్నాయక్ హాజరై అభివృద్ధి పనుల పురోగతిని కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి. చినమునయ్య, ఎంపీడీఓ బి. రవికుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్కుమార్, ఏపీవో జయరాజు, ఈసీ వివేక్, ఏపీఎం వెంకటేశ్వర్లు, డీపీఎం టెక్నికల్ నర్సింలు, దేవరకొండ ఏపీడీ ఎన్.బాలకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం పాల్గొన్నారు. చికిత్స పొందుతూ మృతిమర్రిగూడ(చింతపల్లి) : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆలంపల్లి బంగారు(50), యాదమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంగారు, యాదమ్మ దంపతులు సోమవారం తమ కుమారుడు చరణ్తేజతో కలిసి కుర్మపల్లి గ్రామంలో మేసీ్త్ర పనికి వెళ్లారు. పని ముగించుకుని బైక్పై స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో కుర్మేడు వద్దకు రాగానే మల్లేపల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆలంపల్లి బంగారు తలకు గాయాలయ్యాయి. యాదమ్మ కుడిచేయి విరిగింది. చరణ్తేజకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బంగారు పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు.సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు● బైక్ సీజ్, 8 లీటర్ల సారా స్వాధీనం హుజూర్నగర్ : సారా తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం హుజూర్నగర్లో ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం శూన్యంపహాడ్ తండాకు చెందిన రమావత్ రాముడు బైక్పై సారా తరలిస్తుండగా ఎకై ్సజ్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. బైక్ను సీజ్ చేసి, 8 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్ఐ దివ్య, కానిస్టేబుళ్లు సుధాకర్, పుట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జూదరుల అరెస్ట్నకిరేకల్ : మండలంలోని నోముల గ్రామ శివారులో ఐకేపీ సెంటర్ సమీపంలో మంగళవారం సాంయత్రం పేకాట ఆడుతున్న ఐదుగురిని ఇన్స్పెక్టర్ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.24,200 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అరుదైన గౌరవం
కనగల్ : మండలంలోని చిన్నమాదారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ఊగుతున్న ఉయ్యాల బాల గేయాల పుస్తకంలోని ‘కంప్యూటర్ పిల్లలం’ గేయాన్ని మహా రాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు బాలభారతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. దీంతో బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన బాల గేయం పాఠ్యాంశంగా ఎంపిక కావడం పట్ల పలువురు రచయితలు, కవులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఫ ఆయన రాసిన ‘కంప్యూటర్ పిల్లలం’ గేయానికి ప్రత్యేక గుర్తింపు ఫ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన తెలుగు బాలబారతి పుస్తకంలో పాఠ్యాంశంగా ఎంపిక -
బాధితులకు త్వరితగతిన సేవలందించాలి
భువనగిరి : భరోసా సెంటర్కు వచ్చే బాధితులకు త్వరితగతిన సేవలు అందించాలని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో భరోసా సెంటర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భరోసా సెంటర్కు వచ్చే ప్రతి కేసును వెంటనే నమోదు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ వారి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలన్నారు. బాధితులకు కౌన్సిలింగ్తోపాటు పునరావాస సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో భువనగిరి కోర్టు న్యాయమూర్తి మాధవీలత, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. ఫ ఎస్పీ అక్షాంశ్ యాదవ్ -
విద్యుదాఘాతంతో రైతులు మృతి
తిరుమలగిరి(సాగర్) : విద్యుత్ స్తంభం ఎక్కి తీగ లాగుతుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం పరిధిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం గ్రామానికి చెందిన యాల్ల మల రామకృష్ణ(42) గ్రామ పరిధిలోని నాగార్జునసాగర్ డ్యాం బ్యాక్వాటర్లో తన వ్యవసాయ మోటారును బిగించడానికి వెళ్లాడు. ఎల్టీ లైన్ బిగించడానికి విద్యుత్ స్తంభం ఎక్కి తీగ లాగుతుండగా అది గాలికి వేరే ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా అవుతున్న తీగపై పడడంతో రామకృష్ణ విద్యుదాఘాతానికి గురై స్తంభంపై నుంచి కిందపడిపోయాడు. పక్కనే పొలంలో పైపులు సరిచేస్తున్న రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికే రామకృష్ణ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్లోని కమలా నెహ్రూ హాస్పిటల్కు తరలించారు. మృతుడి భార్య అనసూర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డిండి : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన డిండి మండలం ఖానాపూర్ గ్రామంంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ గ్రామానికి చెందిన ముత్తాని అంతిరెడ్డి(53) వ్యవసాయ పొలంలోని బోరు మోటారుకు విద్యుత్ సప్లయ్ నిలిచిపోవడంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ అంతిరెడ్డికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. మృతుడికి ఒక కుమార్తె ఉంది.ఎలక్ట్రీషియన్ మృతి.. నేరేడుచర్ల : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నె గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ చల్లమల్ల గోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్దిన్నె గ్రామానికి చెందిన రాచూరి శ్రీనివాస్(46) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సమస్య ఉండటంతో మంగళవారం శ్రీనివాస్ను తీసుకెళ్లాడు. అక్కడ శ్రీనివాస్ విద్యుత్ వైర్లను చెక్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని హుజూర్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యాదాద్రికి లండన్ హంగులు
యాదగిరి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు మార్గంలో చేపట్టిన నెట్వర్క్ బ్రిడ్జి పనులు మరో రెండు నెలల్లో పూర్తవుతాయి. ఇప్పటికే లండన్ కేబుల్ అనుసంధానం పూర్తయింది. ప్రస్తుతం ఫ్లైఓవర్పై బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇది కాగానే జాయింట్లు వేస్తాం. కాంట్రాక్టర్కు శామీర్పేట్ ఫ్లైఓవర్తో పాటు గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడా ఉండడం వల్ల ఫ్లైఓవర్ పనులు కాస్త నెమ్మదించాయి. అయినప్పటికీ రెండు నెలల్లో పనులు పూర్తిచేసి ఇస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. – భరత్, ఆర్అండ్బీ ఏఈ యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులు కొండపైకి సులువుగా చేరుకునేందుకు చేపట్టిన నెట్వర్క్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చాయి. ఐదేళ్లుగా ఆగుతూ.. సాగుతూ సాగిన ఈ పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేసి, దేవస్థానానికి అప్పగించేందుకు ఆర్అండ్బీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. రూ.32 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బ్రిడ్జి కోసం ఇటీవల లండన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కేబుల్స్ అనుసంధాన ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేశారు. రూ.32 కోట్లతో 2021లో శ్రీకారం ఆర్యవైశ్య సత్రం నుంచి యాదగిరి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని జీయర్ కుటీర్ వరకు ఈ నెట్వర్క్ బ్రిడ్జిని అనుసంధానం చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైటీడీఏ అధికారులను ఆదేశించింది. 490 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఫ్లైఓవర్ కోసం ప్రభుత్వం రూ.32 కోట్లు కేటాయించడంతో, 2021 చివర్లో పనులు ప్రారంభమయ్యాయి. మొదట ‘సీ ఫైవ్’ అనే కాంట్రాక్టు సంస్థ టెండర్ దక్కించుకుంది. భూసేకరణ పూర్తి కాగానే ప్రారంభంలో పనులు వేగంగానే జరిగినప్పటికీ.. ఆ తర్వాత నిధుల కొరత, లండన్ నుంచి కేబుల్స్ రావడం ఆలస్యం కావడం వంటి సాకులతో 2023లో పనులను పూర్తిగా నిలిపివేశారు. రెండేళ్ల నిరీక్షణ.. కేవలం 64 మీ. పొడవు, 12 మీ. వెడల్పు మేర ఉన్న కీలకమైన పనులు దాదాపు రెండేళ్లపాటు నిలిచిపోయాయి. అయితే, ప్రధాన ఆలయ పునఃప్రారంభం (ఉద్ఘాటన) తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కొండపైకి వెళ్లేందుకు, వచ్చేందుకు రెండు విడివిడి రహదారులు ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చని భావించిన ఆర్అండ్బీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత కాంట్రాక్టు సంస్థ ‘సీ ఫైవ్’ టెండరును రద్దు చేసి, 2025లో ‘బీకేమ్’ సంస్థకు పనులను అప్పగించారు. ఈ కొత్త కాంట్రాక్టర్ 2025 ఆగస్టు 25న పనులను పునఃప్రారంభించి, అదే ఏడాది డిసెంబరు నాటికి లండన్ కేబుల్స్ బిగించే ప్రక్రియను పూర్తి చేశారు. ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న ప్రధాన పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం బ్రిడ్జిపై బీటీ రోడ్డు లేయర్ వేసే పనులు నడుస్తున్నాయి. దీని తర్వాత జాయింట్లు వేసే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ట్రయల్ రన్ తర్వాతే అనుమతి ఈ పనులన్నింటినీ మరో రెండు నెలల్లో పూర్తి చేసి ఆర్అండ్బీ అధికారులకు అప్పగించనున్నట్లు కాంట్రాక్ట్ సంస్థ తెలిపింది. ఆ వెంటనే ఆర్అండ్బీ అధికారులు బ్రిడ్జిపై ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అది విజయవంతం కాగానే ఆలయ అధికారులకు బ్రిడ్జిని అప్పగిస్తారు. ఆ తర్వాతే కొండపైకి వెళ్లేందుకు (ఎంట్రీ), కిందికి వచ్చేందుకు (ఎగ్జిట్) వన్వే పద్ధతిలో వాహనాల రాకపోకలకు ఆలయాధికారులు అనుమతి ఇవ్వనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి కొండపైకి వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎంట్రీ ఫ్లై ఓవర్పై బిగించిన కేబుల్స్ ఎంట్రీ ఫ్లై ఓవర్పై బీటీ లేయర్ పనులు చేస్తున్న దృశ్యం ఫ చివరి దశకు నెట్వర్క్ బ్రిడ్జి పనులు ఫ లండన్ కేబుల్స్ అనుసంధానం పూర్తి ఫ వేగంగా సాగుతున్న బీటీ రోడ్డు పనులు ఫ రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి.. -
తాగునీటికి ఎల్నినో గండం
సాక్షి, యాదాద్రి : ఎల్నినో జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావ పరిస్థితులతోపాటు ఎండలు మండుతుండడంతో తాగునీటికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే సమయంలో మున్సిపాలిటీలు, గ్రామాలకు నీటి సరఫరా గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో రోజువారీ తాగునీటి డిమాండ్ 88.76 ఎంఎల్డీలు (మిలియన్ లీటర్లు ఫర్ డే) కాగా, ప్రస్తుతం అందులో కేవలం 51.19 ఎంఎల్డీల (57.67 శాతం) సరఫరా మాత్రమే అవుతోంది. మిగిలిన 42 శాతం లోటును అధిగమించడానికి స్థానిక బోరుబావుల నుంచి నీటిని సేకరించి, మిషన్ భగీరథ నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. సగానికి పైగా కోత.. జిల్లాలోని ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 516 ఆవాసాలు, యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలు, వైటీడీఏ దేవస్థానానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ద్వారా నీరు సరఫరా అవుతోంది. 64.64 ఎంఎల్డీలు నీరు అవసరం కాగా.. ప్రస్తుత 29.98 ఎంఎల్డీల నీరు సరఫరా అవుతోంది. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు 59.90 ఎంఎల్డీల తాగునీరు అవసరం కాగా.. కేవలం 26.36 ఎంఎల్డీలు (44.01 శాతం) మాత్రమే అందుతోంది. ఈ కొరతను తీర్చడానికి స్థానిక పంచాయతీలు ప్రైవేట్ బోర్లు, ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్నాయి. భగీరథ నీటికి స్థానిక బోర్ల నీటిని కలిపి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరని దాహం.. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు గోదావరి, కృష్ణా జలాలను తాగునీటి కోసం అందిస్తున్నారు. ఘణపూర్గుట్ట రిజర్వాయర్ ద్వారా ఆలేరు, ఆత్మకూర్, బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మోటకొండూర్, గుండాల, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని 516 ఆవాసాలకు గోదావరి నీటిని సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా చౌటుప్పల్, నారాయణపూర్, పోచంపల్లి, వలిగొండ మండలాలకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా కృష్ణా నీటిని.. రామన్నపేట, మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలకు ఉదయ సముద్రం ద్వారా కృష్ణా జలాలను అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎక్కడా అమలు కావడం లేదు.మిషన్ భగీరథ నీటి సరఫరాలో భారీగా కోత ఫ ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం ఫ ప్రత్యామ్నాయంగా బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఫ సరిపడా నీరు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు మోటకొండూరు మండలంలోని కాటేపల్లి గ్రామానికి మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా ప్రతిరోజు 80 వేల లీటర్ల నీరు వచ్చేది. గ్రామంలో ఉన్న మూడు నీటి ట్యాంకులను భగీరథ నీటితో నింపి ఇంటింటికీ సరఫరా చేసేవారు. కానీ 20 రోజులుగా రోజు విడిచి రోజు, అది కూడా రెండు గంటల లోపే నీరు వస్తోంది. దీంతో గ్రామంలోని బీరప్ప ఆలయం వద్ద ఉన్న బోరు నుంచి నీటిని ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. ఈ విషయమై సర్పంచ్ పచ్చిమట్ల జయమ్మ మదార్గౌడ్ మాట్లాడుతూ.. తాత్కాలికంగా తన వ్యవసాయ బావి నుంచి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా అవసరమైన ప్రాంతాలకు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ శివారులోని వాగు వద్ద ఉన్న పంచాయతీ బోరు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర పైప్లైన్ వేస్తే తప్ప ఈ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేలా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.నల్లా కనెక్షన్లు 1,76,000చేతిపంపుల సంఖ్య 3868పీడబ్ల్యూఎస్ స్కీమ్ బోర్ల సంఖ్య 628ఎంపీడబ్ల్యూఎస్ స్కీమ్ బోర్ల సంఖ్య 114మొత్తం మండలాలు 17మున్సిపాలిటీలు 6గ్రామపంచాయతీలు 421ఆవాసాలు 800 -
పెసరలో చీడపీడలు.. నివారణ మార్గాలు
నడిగూడెం : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన పెసర పంట ఎదిగే దశలో ఉంది. పలు చోట్ల పూత, పిందె దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడితే చీడపీడలను నివారించి మంచి దిగుబడులు పొందవచ్చని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ సూచిస్తున్నారు. పెసర పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలు ఆయన మాటల్లోనే.. ఆశించే పురుగులు 1. చిత్త పురుగులు : ఈ పురుగులు పెసర పంటపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. నీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2. తామర పురుగు : ఈ పురుగులు పంట తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుంచి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత తెగులు కూడా వ్యాపిస్తుంది. పంటకు 15–20 శాతం నష్టం కలుగుతుంది. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 3. తెల్లదోమ : ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లోమొజాయిక్ అనే వైరస్ వ్యాధి(పల్లాకు తెగులు) కూడా వ్యాపింపజేస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా మిథైల్ డెమటాన్ 2.0 మి.లీ. లేదా ట్రైజోఫాస్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 4. పొగ్గాకు లద్దె పురుగు : ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీరి తినడం వలన ఆకులు తెల్లగా కన్పిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, పువ్వులను, పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రి పూట ఎక్కువగా నష్టపరుస్తుంటాయి. దీని నివారణకు గుడ్ల సమూదాయాలను ఏరివేయాలి. జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 30 వేల ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆశించే తెగుళ్లు1. సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగులో గుండ్రని చిన్నచిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వలన పెసర కాయల్లో గింజలు సరిగ్గా నిండవు. దీని నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా కార్బెండిజమ్ 1 గ్రాము లేదా క్లోరోథలోనిల్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2. బూడిద తెగులు : ఈ తెగులు విత్తిన 30–35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలు కనబడి క్రమేపీ పెద్దవై ఆకలపైన, కింద భాగాలకు మరియు కొమ్మలు, కాయలకు వ్యాపిస్తుంది. దీని నివారణకు కార్బెండిజమ్ 1 గ్రాము లేదా థయోఫానేట్ మిథైల్ 1 గ్రాము లేదా డీనోక్యాప్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 3. బ్యాక్టీరియ్ లీఫ్ బ్లైట్ : ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు మరియు 100 మి.గ్రా. ప్లాంటోమైసీన్ కలిపి 12 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.4. పల్లాకు తెగులు: ఇది వైరస్ జాతి తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులు, కాయల మీద పసుపు మచ్చ పొరలు ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమీథోయేట్ 2. మి.లీ. లేదా ట్రైజోఫాస్ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నడిగూడెం మండల వ్యవసాయాధికారి మల్సూర్ సూచనలు -
మానవత్వం చాటుకున్న బీబీగూడెం గ్రామస్తులు
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామంలో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందగా.. గ్రామస్తులంతా కలిసి అతడి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. ఏపీలోని కర్నూలుకు చెందిన గంగుల సుబ్బారావు(85) 1975లో సూర్యాపేటకు వలస వచ్చాడు. 30 ఏళ్ల పాటు సూర్యాపేటలో హోటల్ నిర్వహిస్తూనే నాటకాలు, రంగస్థలం పట్ల ఉన్న ఆసక్తితో వివిధ గ్రామాల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఆ తర్వాత చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. అతడికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావు మంగళవారం మృతి చెందారు. దీంతో గ్రామస్తులంతా కలిసి సుబ్బారావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పి. సైదులు, మాజీ సర్పంచ్ ధరావతు రాజు, మాజీ ఎంపీపీ యశోదవెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒంటరిగా ఉంటున్న పేద కళాకారుడికి అంత్యక్రియలు -
పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా
భువనగిరి : పీఆర్సీ తక్షణమే ప్రకటించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమా అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం గ్రాంట్లను విడుదల చేయాలన్నారు. తపస్ జిల్లా కార్యదర్శి ఇరుగు యాదగిరి, సీవీ శ్రీనివాస్, శ్రీధర్, శంకర్రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
డిజిటల్ భిక్షాటన
యాదగిరిగుట్ట రూరల్ : ప్రస్తుతం డిజిటల్ యుగంలో దేశంలో ఎక్కడికెళ్లినా, ఏ వస్తువు కొన్నా, ఎవరికై నా డబ్బులు ఇవ్వాలన్నా చాలావరకు ఫోన్ పే, గూగ్ల్ పే ఉపయోగిస్తున్నారు. భిక్షాటన చేసే వారు సైతం క్యూఆర్ కోడ్ స్కానర్లు చూపించి సరికొత్తగా భిక్షాటన చేస్తున్నారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిలో యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామ స్టేజీ పరిధిలో ఓ దివ్యాంగ వ్యక్తి తన మెడలో క్యూఆర్ కోడ్ స్కానర్ను పెట్టుకుని భిక్షాటన చేస్తూ కనిపించడంతో అటుగా వెళ్లే వారు అతడిని ఆసక్తిగా గమనించారు. -
నక్షా సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
యాదగిరిగుట్ట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నక్షా సర్వే ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడంతోపాటు భవిష్యత్లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో చేపట్టిన నక్షా సర్వే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకారెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే సమయంలో భూ యజమానులకు పూర్తి సమాచారం అందిస్తూ.. వారి అభ్యంతరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఆస్తికి కచ్చితమైన హద్దులను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు అధికారులు, సర్వే బృందాలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస గృహాలు, ప్లాట్ల వాస్తవ హద్దులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా నిర్ధారిస్తున్నారో కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ అండ్ సర్వే అధికారిణి సుజాత, రెవెన్యూ అధికారులు, సర్వే బృందాల సిబ్బంది, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్య సేవలందించాలి భువనగిరి : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న ప్రజారోగ్య కార్యక్రమాలు, పురోగతిపై మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య పరీక్షలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద భువనగిరిని మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. క్షయ వ్యాధి గుర్తింపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, డీసీహెచ్ఎస్ సూర్యశ్రీ, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఐఓ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్, డీఆర్డీఓ నాగిరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్స్ వీణ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
నిధులను వందశాతం వినియోగించాలి
ఫ జెడ్పీ సీఈఓ శోభారాణి భువనగిరి : మంజూరైన నిధులను వంద శాతం వినియోగించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేయడంతోపాటు పెండింగ్ దరఖాస్తులు, ఆడిట్ అభ్యంతరాలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం మంజూరైన నిధులు, పనుల పురోగతి, ఆరోగ్యం రంగం, పరిపాలన, సంక్షేమ పథకాలు, యువజన సాధికారత, సామాజిక సేవ అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ పీఆర్ ఇంజనీర్ విష్ణువర్థన్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, డీఆర్ఓ జయమ్మ, డీఎంహెచ్ఓ ఏఓ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
పెద్దవూర : విత్తనం బాగుంటే మొలక బాగా వస్తుంది. మొలకలు బాగా వస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. అందుకే రైతులు పంటల సాగులో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఎన్. సత్యనారాయణ సూచిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను క్రమపద్ధతిలో కడితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వివరించారు. విత్తనాలను మొలక కట్టి నాణ్యత ప్రమాణాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చునని వివరిస్తున్నారు. విత్తనం ఎంపికపంట సాగులో విత్తన నాణ్యతను మొలక శాతం ఆధారంగా నిర్ధారిస్తారు. అందుకు తెలుగు రాష్ట్రాలలో విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించి విత్తనాలను ఎంపిక చేస్తారు. ఆ విత్తనాలను ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు నిర్ధారించి రైతులకు సరఫరా చేస్తారు. రైతులు తాము పండించిన పంట నుంచి కూడా విత్తనాలు తయారు చేసుకోవచ్చు. విత్తనాలను మొలక కట్టి వాటి నాణ్యత ప్రమాణాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. రైతు స్థాయిలో విత్తన మొలక శాతాన్ని కింది పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. పేపర్ టవల్ పద్ధతిపేపర్ టవల్ లేదా మందపాటి బట్టను తీసుకుని బాగా తడిపి గచ్చు నేలపై పరిచి 100 గింజలను వరుసలో అమర్చాలి. దీనిపై మరో తడి పేపర్పై టవల్ను పరిచి రెండింటిని కలిపి చాపలా చుట్టాలి. చివర్లో దారంతో చుట్టి ఏదైనా పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. అప్పుడప్పుడు నీటితో తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతి ద్వారా వరి, జొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలను పరీక్షించుకోవచ్చు. ట్రే పద్ధతిలావు గింజ రకాలైన పత్తి, వేరుశనగ, ఆముదం వంటి విత్తనాలను ఇసుక పోసిన ప్లాస్టిక్ ట్రేలో వేయాలి. 100 విత్తనాలను అంగుళం లోతు ఇసుకలో విత్తుకోవాలి. తేమ ఉండేటట్లు నీళ్లు చల్లుతూ ఉండాలి. పెట్రి డిష్ పద్ధతిఈ పద్దతిలో వంగ, టమాట, మిరప వంటి చిన్న విత్తనం మొలకలను పరీక్షించుకోవచ్చు. పెట్రిడిష్లో బ్లాటింగ్ పేపరును ఆమర్చి నీటితో తడపాలి. గుడ్డమూట పద్ధతిమొలక కట్టాల్సిన 100 విత్తనాలను గుడ్డలో మూతకట్టి దీనిని చిన్న ప్లేటులో పెట్టి అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతి ద్వారా 5 నుంచి 10 రోజుల్లో మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు. మొలక శాతం ఇలా..u సామాన్యంగా పరీక్షకు తీసిన శాంపిల్ గింజల్లో నూటికి 99 శాతం మంచి గింజలు ఉండాలి. u మొక్కజొన్నకు 90 శాతం, పప్పు దినుసులకు 75 నుంచి 80 శాతం, నూనె గింజలకు 70 నుంచి 80శాతం, పత్తి, బెండ విత్తనాలకు 65శాతం, ఇతర ధాన్యాలకు 75 నుంచి 80శాతం మొలకలు రావాలి. ఉపయోగాలు u రైతులు పైన పేర్కొన్న నాలుగు పద్ధతులలో తమ స్థాయిలో మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. u మొలక శాతం పరీక్షల అనంతరం పంట పెంచుకోవడం వలన సమయం వృథా కాదు. u విత్తనాల విషయంలో ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు. u నాణ్యమైన విత్తనాలను నాటితే అధిక దిగుబడులు పొందవచ్చు. పెద్దవూర మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ సూచనలు -
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి
భువనగిరిటౌన్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడం కోసం వచ్చిన దివ్యాంగుడు ఏశాల గోపిని గమనించిన కలెక్టర్.. స్టేజీ దిగి కిందకు వచ్చి అర్జీని స్వీకరించి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారులకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 113 దరఖాస్తులు రాగా.. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించినవే 56 అర్జీలు నమోదయ్యాయి. మిగిలిన దరఖాస్తుల్లో హౌసింగ్ శాఖకు 10, మున్సిపాలిటీకి 7, సర్వే ల్యాండ్ విభాగానికి 5, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు 4, సంక్షేమ శాఖకు 4, జిల్లా పరిషత్కు 4 చొప్పున వచ్చాయి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు మూడు చొప్పున దరఖాస్తులు రాగా.. వ్యవసాయం, ఉపాధి కల్పన, పంచాయతీరాజ్ శాఖలకు రెండు చొప్పున అర్జీలు అందాయి. వీటితోపాటు సమాచార శాఖ, ఇరిగేషన్, రవాణాశాఖ, పశు సంవర్థక శాఖ, ఫుడ్ సేఫ్టీ, ఫిషరీస్, కో ఆపరేటీవ్, అటవీ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు. ఈ దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ కృతిక, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : ప్రజా భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఐజీ జోయెల్ డేవిస్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ శాఖ పనితీరుపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతం చేయడం వంటి అంశాలపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భద్రతా ఏర్పాట్లను, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. జిల్లాలో జరిగే వీఐపీ పర్యటనలు, ముఖ్య కార్యక్రమాల బందోబస్తు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, నేరాల గుర్తింపు, వాహనాల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును సత్వరమే పూర్తి చేసి, నేరస్థులకు శిక్షలు పడే శాతం పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్ ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఉన్న సీసీటీవీ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. భరోసా కేంద్రం పనితీరును, బాధితులకు అందుతున్న సేవలను మరింత విస్తృతం చేయాలని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసి, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించేలా పని చేయాలని డీఐజీ జోఝెల్ డేవిస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీలు లక్ష్మీనారాయణ, వినోద్ కుమార్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఫ డీఐజీ జోయెల్ డేవిస్ -
వాగును నమ్ముకుని సాగుచేస్తున్నాము
వాగును నమ్ముకుని నాలుగు కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుని మిరప, పత్తి పంటలను సాగు చేస్తున్నాను. సరైన వర్షం పడకపోవడంతో ఈ సంవత్సరం వాగులో ఒక్కసారి కూడా నీళ్లు పారలేదు. వాటర్ ప్లాంట్ను శుభ్రం చేయగా వచ్చే వృథానీరు పదిహేను రోజులకు ఒకసారి వస్తాయి. ఈ నీటితోనే ఇన్ని రోజులు నెట్టుకొస్తున్నాము. వాగు వెంట మోటార్లు ఎక్కువ సంఖ్యలో వేయటంతో వాగు ఎగువ భాగంలో ఉన్న రైతులకే ఆ నీళ్లు సరిపోతలేవు. వర్షాలు లేక పత్తి చేలు, తోటలు వాడుపడుతున్నాయి. – కత్తి ప్రభాకర్రెడ్డి, రైతు, బట్టుగూడెం -
బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జైలు
మోతె : బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పాలకూరి సాయికృష్ణపై గతంలో భూమి పంచాయితీల్లో భాగంగా క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో అతడిని మండల తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. బైండోవర్ ఉల్లంఘించిన సాయికృష్ణ మరో నేరానికి పాల్పడడంతో తహసీల్దార్ ఎం. వెంకన్న నిబంధనల ప్రకారం అతడికి నోటీలు జారీ చేశారు. అయినా అతడు స్పందించకపోవడంతో సోమవారం తహసీల్దార్ ఉత్తర్వుల మేరకు సాయికృష్ణను అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం నల్లగొండ జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బోధనా వ్యూహాలను పెంపొందించుకోవాలి
భువనగిరి(బీబీనగర్): అధ్యాపకులు సమకాలిన బోధన, అభ్యసన వ్యూహలతో పాటు సామర్థ్యాలను పెంపొందించుకోవాలని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ అన్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలోని నర్సింగ్ కళాశాలలో నూతన బోధన, అంచనా, మూల్యాంకనం, గుణాత్మక పరిశోధన అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో వినూత్న పద్ధతుల ద్వారా విద్యార్థులకు బోధించారు. అధ్యాపకులకు ఎఫ్డీపీ ద్వారా అందించిన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన అధ్యాపకులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.లత, ప్రొఫెసర్ రఫత్, ట్యూటర్ గురు, పీటర్, లక్ష్మసారా తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
పెద్దవూర : బైక్పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామ స్టేజీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన చెవుల నగేష్(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పెద్దవూర మండల కేంద్రంలో జరిగిన ఫంక్షన్కు బైక్పై వచ్చి రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో తెప్పలమడుగు గ్రామ స్టేజీ సమీపంలోని అమ్మ రైస్ మిల్లు వద్ద జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపు తిప్పాడు. దీంతో బైక్ను లారీ ఢీకొనడంతో నగేష్ రోడ్డుపై పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వస్తున్న పెద్దగూడెం గ్రామానికే చెందిన నవీన్ గమనించి గాయపడిన నగేష్ను 108 అంబులెన్స్లో నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సోమవారం మృతుడి భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్రావు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు. -
ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
భువనగిరి : జిల్లాలో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. తీవ్రమైన ఎండవేడిమి, ఉక్కపోత, చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జూలై రెండో వారం దాటినప్పటికీ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం గమనార్హం. జిల్లాలోనే అత్యధికంగా రామన్నపేట మండలం వెల్లంకిలో 38.5 డిగ్రీలు, భూదాన్పోచంపల్లి మండలం జలాల్పూర్, చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేటలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భువనగిరి మండలం బోల్లేపల్లి, బీబీనగర్ మండలం వెంకిర్యాలలో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వలిగొండ, రామన్నపేట, కొలనుపాక, బొల్లేపల్లి ప్రాంతాలలో రాత్రి వేళల్లో సైతం అత్యధికంగా 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నులిపురుగుల నివారణకు కృషి చేయాలిభువనగిరి : నులిపురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా భువనగిరి మండలంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,51,040 మంది పిల్లలకు మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో మొదటి రోజు 96 శాతం పిల్లలకు మాత్రలు వేశామన్నారు. మొదటి రోజు మాత్రలు వేసుకోని వారికి ఈ నెల 20వ తేదీన పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, డీఐఓ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సుమన్ కళ్యాణ్, అరుణకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.అండాలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కేసుల పరిష్కారానికి సహకరించాలిభువనగిరిటౌన్ : చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్కు జిల్లాలోని బ్యాంకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు కోరారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యాలయంలో సంస్థ కార్యదర్శి వి.మాధవీలతతో కలిసి జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంలో బ్యాంకులు తమ పరిధులకు లోబడి ఖాతాదారులకు రాయితీలు, మినహాయింపులు ఇస్తే ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. 31న జన జాగరణ యాత్రభువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం (టీఎస్ సీపీఎస్ఈయూ) ఆధ్వర్యంలో ఈ నెల 31న జిల్లాలో నిర్వహించనున్న జన జాగరణ యాత్రకు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆయా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు చామల తిరుపతిరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్, టీఎస్ సీపీఎస్ఈయూ రాష్ట్ర కార్యదర్శి విష్ణు భాశెట్టి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిల్ల రవీందర్, టీఎన్జీఓ జిల్లా ట్రెజరర్ కే.శ్రీకాంత్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుంట్ల అమరేందర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
మర్రిగూడ(చింతపల్లి) : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చింతపల్లి మండలం కుర్మేడు గేట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆలంపల్లి బంగారి, యాదమ్మ దంపతులు మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కుర్మేడు గేట్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరితో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని మాల్లోని ఆస్పత్రికి తరలించారు. బాలకార్మికులకు విముక్తితిప్పర్తి : బాలకార్మికులకు తిప్పర్తి పోలీసులు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ సామ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్ఐ యాట రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ టీంలు సోమవారం తనిఖీలు చేపట్టారు. తిప్పర్తి మండలం దుప్పలపల్లి రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన దీప్, మండల కేంద్రంలోని అమ్మ హోటల్లో పనిచేస్తున్న రాజస్తాన్కు చెందిన బారన్, విజయదుర్గ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్న ఇందుగుల గ్రామానికి చెందిన మహేష్ను గుర్తించి.. వారిని తిప్పర్తి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భవనంపై నుంచి దూకి వివాహిత బలవన్మరణం
భూదాన్పోచంపల్లి : భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధల వల్ల మనస్తాపం చెందిన భార్య రెండంతస్తుల భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం భూదాన్పోచంపల్లి పట్టణంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మనీష్, రాణిదేవి (28) దంపతులు వ్యాపార నిమిత్తం నాలుగేళ్ల క్రితం పోచంపల్లికి వలస వచ్చారు. అద్దె ఇంట్లో ఉంటూ చౌటుప్పల్ చౌరస్తాలోని మెయిన్ రోడ్డుపై భవానీ జ్యువెల్లరీ షాపు, భవానీ క్లాత్ షోరూం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండున్నర సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంట్లో గిన్నెలు కడిగే విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు. సోమవారం ఉదయం యథావిధిగా రాణిదేవి నిద్ర లేచి వంట చేసింది. భార్యాభర్తలిద్దరూ షాపుల వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు రాణిదేవి ఇంటికి వచ్చింది. అనంతరం మధురైలో ఉంటున్న తమ్ముడు మహేందర్కు వాట్సాప్లో తనకు బతకాలని లేదని చనిపోతున్నానని వాయిస్ మేసేజ్ పెట్టింది. వెంటనే ఆందోళన చెందిన అతడు బావ మనీష్కు ఫోన్ చేసి వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పాడు. మనీష్ ఇంటికి వెళ్లేసరికి రాణిదేవి భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను అంబులెన్స్లో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాణిదేవి మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
‘కార్పొరేషన్’పై ఆశలు!
ఫ నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలు ఫ జిల్లాకు చెందిన నలుగురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం పూర్తి ఫ వారి స్థానంలో ఎవరికి పదవులు దక్కుతాయోనని జోరుగా చర్చ ఫ ఇద్దరు ముగ్గురికే అవకాశం రావచ్చంటున్న పార్టీ వర్గాలు ఫ మంత్రులు, సీనియర్ నేతలను ప్రసన్నం చేసుకుంటున్న ఆశావహులుకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి కార్పొరేషన్ పదవులు ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి దక్కాయి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా పటేల్ రమేష్రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ముత్తినేతి వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మహిళా శిశు సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమితులైన బండ్రు శోభారాణి రెండేళ్ల పదవీ కాలం ఇటీవల ముగిసింది. అయితే వారికి మళ్లీ అవకాశం ఇస్తారేమోనన్న చర్చ జరిగినా ఆ పరిస్థితి లేదని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో వారికి ప్రత్యామ్నాయంగా పార్టీ బాధ్యతలను అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. గుత్తా అమిత్కు పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలు, పటేల్ రమేష్రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులపై జిల్లా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈనెల చివరి వారంలో కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు జిల్లా నుంచి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న నలుగురి పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో ఎలాగైనా తాము పదవులను దక్కించుకునే వ్యూహంతో నేతలు ముందుకు సాగుతున్నారు. తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరోవైపు మంత్రులు కూడా తమ అనుచరులకు అవకాశం కల్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఖాళీ అయిన ఆ నాలుగు స్థానాలకు బదులుగా కొత్తగా నలుగురికి అవకాశం కల్పిస్తారా? లేదా? అన్న చర్చ జిల్లాలో సాగుతోంది. ఇప్పుడు కాకపోతే ఇక కష్టమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలలకు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. అందులో మొదటి విడతలో పదవులను ఆశించిన నేతలు కొందరికి అవకాశం దక్కలేదు. పార్టీలో సీనియర్లు అయినప్పటికీ, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కూడా అవకాశం దక్కకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. అప్పట్లో పదవులు దక్కని నేతలు ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కనుక కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కకపోతే ఇక కష్టమేనన్న భావనతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రితోపాటు మంత్రులను, జానారెడ్డి లాంటి సీనియర్ నేతలను కలిసి తాము పార్టీకి చేసిన సేవలను గుర్తించాలని కోరుతున్నారు. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీలాంటి నిర్ణయం తీసుకుంటుందో? ఎవరికి అవకాశం కల్పిస్తుందోనన్న చర్చ ఆసక్తికరంగా మారింది. భారీగానే ఆశావహులు.. మాజీమంత్రి జానారెడ్డి ప్రధాన అనుచరుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పెద్దవూర మాజీ జెడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి, మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి సన్నిహితుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్మల మోహన్రెడ్డి, యాదాద్రి భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో మొదట ఇద్దరు ముగ్గురికే కార్పొరేషన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 2009 నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ టికెట్ను ఆశించిన కొండేటి మల్లయ్యకు, ప్రస్తుతం సీఎంకు అనుచరుడిగా కొనసాగుతున్న దుబ్బాక నర్సింహారెడ్డికి కార్పొరేషన్ పదవి దక్కుకుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగతా వారిలో కోదాడకు చెందిన సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డికి అవకాశం దక్కవచ్చన్న చర్చ సాగుతోంది. అయితే వారిలో ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది ఈనెలాఖరుకు తేలవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బస్సును ఢీకొన్న ట్రక్కు
మోత్కూరు : మున్సిపల్ కేంద్రంలో బిక్కేరు వాగుపై ఇరుకుగా ఉన్న వంతెనపై సోమవారం ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బిక్కేరు వంతెన మీదుగా మోత్కూరు వైపు నుంచి వస్తుండగా.. ఎదురుగా భారీ ట్రక్కు వంతెన పైకి వచ్చింది. వంతెన ఇరుకుగా ఉండటంతో రెండు వాహనాలు ఎదురెదురుగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తూ వంతెన చివరి వరకు తీసుకొచ్చాడు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు రావడంతో బస్సును ఢీకొంటూ వెళ్లాడు. దీంతో బస్సు స్వల్పంగా దెబ్బతింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
భార్య లేకుండా జీవించలేక భర్త ఆత్మహత్యాయత్నం
గుర్రంపోడు : గతంలో రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిన చోటనే భర్త బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం గుర్రంపోడు మండల కేంద్రంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ గతేడాది ఆగస్టులో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పది రోజులకే నవీన్, అనూష దంపతులు బైక్పై వెళ్తుండగా.. గుర్రంపోడు శివారులోని శశిలేటి వాగుపై గల బ్రిడ్జిపై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనూష అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి వాగులో పడి మృతిచెందింది. నవీన్ తలకు గాయమైంది. అతడు హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. తన కళ్లముందే భార్య చనిపోవడంతో నవీన్ తట్టుకోలేకపోయాడు. భార్య లేని జీవితం వృథా అని భావించి ఆమె ఎక్కడైతే బ్రిడ్జిపై నుంచి పడి చనిపోయిందో సోమవారం నవీన్ అక్కడే బ్రిడ్జి పైనుంచి వాగులోకి దూకాడు. అయితే బ్రిడ్జి దిగువన ఇసుకలో పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రిడ్జిపై నుంచి పడి మృతిచెందిన భార్య అక్కడే వాగులోకి దూకిన భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు -
చిన్నబోయిన పెద్దవాగు
పెద్దవూర : మండలంలో ఎప్పుడు నీటితో కళకళలాడే పెద్దవాగు సరైన వర్షాలు లేక ఎండిపోయింది. దీంతో వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైదులు ఆందోళన చెందుతున్నారు. ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు సరైన వర్షం పడలేదు. చిన్నపాటి వర్షాలు పడగా.. విత్తనాలు వేసుకోవడానికి కావాల్సిన పదును మాత్రమే అయ్యింది. ఎగువ నుంచి వరద రాకపోవడంతో నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. గత ఐదారేళ్లుగా ఏనాడు పెద్దవాగు ఎండిపోలేదు. ఏఎమ్మార్పీ నీటి రాకతో నిత్యం చెరువులు అలుగులు పోస్తుండంతో వాగులో నీళ్లు పుష్కలంగా ఉండేవి. గత ఏడెనిమిది నెలలుగా వర్షాభావ పరిస్థితులు ఉండటంతో చెరువులు ఎండిపోయాయి. దీంతో పెద్దవాగు ఎండిపోయింది. వాగు వెంట సాగుచేసుకున్న వందలాది ఎకరాలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. వందల ఎకరాలలో సాగు నాంపల్లి మండలం పసునూరు చెరువు వద్ద పుట్టిన పెద్దవాగు గుర్రంపోడు, పెద్దఅడిశర్లపల్లి మండలాల మీదుగా పెద్దవూర మండలంలోకి ప్రవహిస్తుంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణం కాకముందు వర్షాకాలంలోనే ఈ వాగులో నీరు ప్రవహించేది. ప్రాజెక్టు నిర్మాణంతో కాలువల ద్యారా ఎప్పటికప్పుడు చెరువులను నింపుతుండటం, జంట నగరాలకు కృష్ణాజలాలలను అందించే వాటర్ ప్లాంట్ను పదిహేను రోజులకొకసారి కడుగుతుంటుండంతో పెద్దవాగులో నిత్యం నీళ్లు ప్రవహిస్తుండేవి. దీంతో వాగు సమీపంలో భూములు ఉన్న రైతులు వాగులో విద్యుత్ మోటార్లు వేసుకుని పైపులైన్లు తీసుకుని పంటలు సాగు చేసుకునేవారు. పెద్దవూర, ఈదులగూడెం, పిన్నవూర, బట్టుగూడెం, కొత్తగూడెం, తెప్పలమడుగు, లింగంపల్లి, పెద్దగూడెం, చిన్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు వాగు వెంట సుమారు వెయ్యి ఎకరాలలో వరినాట్లు వేశారు. వాగును నమ్ముకుని వాగుకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములకు పైపులైన్లు వేసుకుని బత్తాయి తోటలను సాగుచేస్తున్నారు. వాగు ఎండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సరిగా పడకపోవడంతో బత్తాయి తోటలు, పత్తి చేలకు నీటి అవసరం రాగా, ఒక్కసారిగా వరినాట్లు వేయడంతో విద్యుత్ మోటార్లు అన్నింటిని ఒకేసారి ఆన్ చేయడంతో వాగులో నీరు అయిపోతుంది. పై నుంచి నీరు రాకపోవడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెద్దవూర సమీపంలో ఎండిపోయిన పెద్దవాగు వర్షాలు లేక ఎండిపోవడంతో ఆందోళనలో రైతులు -
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
చౌటుప్పల్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్రోడ్డు వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన షేక్ యాకూబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు కోదాడ సంతలో 5 ఆవులు, 4 ఎద్దులను కొనుగోలు చేసి వాహనంలో హైదరాబాద్కు తరలిస్తుండగా.. వలిగొండ క్రాస్రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. ద్విచక్ర వాహనం చోరీ తిప్పర్తి : మీసేవ కేంద్రం ఎదుట పార్కింగ్ చేసిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన తిప్పర్తి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయంంలో అటెండర్గా పనిచేస్తున్న నిరంజన్ జిరాక్స్ తీసుకురావడానికి స్థానికంగా ఉన్న ఓ మీసేవ కేంద్రానికి బైక్పై వెళ్లాడు. బైక్ పార్కింగ్ చేసి జిరాక్స్ తీసుకొని వచ్చే లోపే గుర్తుతెలియని వ్యక్తులు బైక్ను చోరీ చేశారు. దీంతో బాధితుడు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యుదాఘాతంతో వడ్రంగి మృతి గుండాల : ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వడ్రంగి మృతిచెందాడు. ఈ ఘటన గుండాల మండలం తుర్కలశాపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కలశాపురం గ్రామానికి చెందిన పోలోజు సత్యనారాయణ (60) వృత్తి రీత్యా వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజుమాదిరిగా సోమవారం తన ఇంటి బయట లైట్ కోసం ప్లగ్లో విద్యుత్ తీగలను అమరుస్తుండగా వైరు జారి మీదపడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చౌటుప్పల్ : పాముకాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్తండాకు చెందిన ధీరావత్ స్వామి(34) తన తండ్రి బిచ్చుతో కలిసి సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఓ బయోటెక్ కంపెనీలో సెంట్రింగ్ పనికి వెళ్తున్నాడు. రోజుమాదిరిగానే ఈ నెల 11న సైతం తండ్రితో కలిసి ఉదయం 9గంటలకు పనికి వెళ్లాడు. కంపెనీలో పని ముగించుకొని రాత్రి 7గంటల ప్రాంతంలో జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ కొయ్యలగూడెం బస్టాప్కు వెళ్తుండగా.. స్వామి ఎడమ కాలుకు పాము కాటు వేసింది. అతడి తండ్రి గుర్తించి ఆటోలో స్వామిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
‘సర్’లో ఆలేరు టాప్
77.25 శాతం డిజిటలైజేషన్తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం ఫ వారంలోనే ఫారాల పంపిణీ పూర్తి ఫ సమన్వయంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిఆలేరు : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచి ప్రత్యేకతను చాటుకుంది. అధికార యంత్రాంగం సమన్వయం, బూత్ లెవెల్ అధికారుల (బీఎల్ఓ) కృషి, రాజకీయ పార్టీల సహకారం, ఓటర్ల నుంచి లభించిన అద్భుత స్పందనతో నియోజకవర్గంలో ‘సర్’ ప్రక్రియ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. వలిగొండ మండలంలోని మూడు పోలింగ్ కేంద్రాలను కలుపుకుని, నియోజకవర్గంలోని మొత్తం ఎనిమిది మండలాల్లో ఉన్న 309 పోలింగ్ కేంద్రాల పరిధిలోని 2,38,040 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయింది. ఈ ప్రక్రియలో మోటకొండూరు మండలం మొదటి స్థానంలో నిలవగా.. యాదగిరిగుట్ట చివరి స్థానంలో నిలిచింది. శరవేగంగా డిజిటలైజేషన్ గత నెల 25న ప్రారంభమైన ఈ ప్రక్రియలో బీఎల్ఓలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ప్రతి ఓటరుకీ ఫారాలు అందించడం విశేషం. ఫారాలను ఓటర్ల నుంచి వాటిని తిరిగి సేకరించడం, అనంతరం డిజిటలైజేషన్ను శరవేగంగా పూర్తి చేయడం ద్వారా ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల కంటే ఎంతో ముందు వరుసలో నిలిచింది. సోమవారం నాటికి నియోజకవర్గంలోని మొత్తం 2,38,040 మంది ఓటర్లలో 1,83,890 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది రికార్డు స్థాయిలో 77.25 శాతానికి చేరుకుంది. కలెక్టర్ నుంచి బీఎల్ఓ వరకు సమన్వయం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డిల నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు అధికారులకు వారు అందిస్తున్న సూచనలు ఈ విజయానికి కీలకంగా మారాయి. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో పని చేయడంతోపాటు.. ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పించడం కూడా నియోజకవర్గంలో ‘సర్’ విజయవంతం కావడానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ప్రకారం.. ఈ నెల 24వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వంద శాతం పూర్తి చేయాలనే పట్టుదలగా అధికారులు ముందుకు సాగుతున్నారు.పాఠశాల, కళాశాలల విద్యార్థులు, రేషన్ డీలర్లు, పొదుపు సంఘాల మహిళలను భాగస్వాములను చేసి, ఎన్యుమరేషన్ ఫారాలు ఎలా నింపాలో శిక్షణ ఇచ్చాం. వారు ఓటర్లకు క్షేత్రస్థాయిలో వివరించారు. బీఎల్ఓలు సైతం ఓటర్లను నేరుగా కలుసుకుని వారి సందేహాలు తీరుస్తూ ఫారాలు సక్రమంగా నింపేలా అవగాహన కల్పించారు. దీంతో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. –వలిగొండ ఆంజనేయులు, ఆలేరు తహసీల్దార్ మండలం పీఎస్లు ఓటర్లు డిజిటలైజేషన్ శాతం బొమ్మలరామారం 40 29360 23851 81.24 తుర్కపల్లి 39 28116 22132 78.72 రాజాపేట 40 29805 24326 81.62 యాదగిరిగుట్ట 48 40925 27951 68.30 ఆలేరు 41 34589 24338 70.36 మోటకొండూరు 29 20755 17715 85.35 గుండాల 35 25816 20490 79.37 ఆత్మకూరు 34 25743 21272 82.63 వలిగొండ 3 2931 1815 61.92 మొత్తం 309 238040 183890 77.25 -
మహిళ మెడలో బంగారు గొలుసులు అపహరణ
మిర్యాలగూడ అర్బన్ : బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. వన్టౌన్ సీఐ నాగభూషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వసుంధరాదేవి ఆదివారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. నంబర్ ప్లేట్ లేని బైక్పై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అడ్రస్ అడిగినట్లు నటించి ఆమెను మాటల్లో పెట్టాడు. అదును చూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. నిందితుడు బైక్పై ఆంధ్రా వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి గురైన బంగారు గొలుసులు 9 తులాలు ఉంటాయని బాధితురాలు పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పశువులను తరలిస్తున్న లారీ పట్టివేతవలిగొండ : అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని వలిగొండ మండల కేంద్రంలో శనివారం రాత్రి స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముత్తు కుమార్ తన లారీలో 23 పశువులు, గేదెను అక్రమంగా తరలిస్తుండగా శనివారం రాత్రి తొర్రూర్ చౌరస్తా వద్ద పెట్రోలింగ్ పోలీసులు ఆపారు. లారీని తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతి లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించి లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ యుగంధర్ తెలిపారు. కిరాణ దుకాణంలో చోరీమర్రిగూడ : మండల కేంద్రంలోని కిరాణ దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ ప్రధాన రహదారి పక్కన కొడాల గోపాల్రెడ్డి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న కిరాణ దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కౌంటర్లో దాచిన రూ.20వేల నగదుతో పాటు విలువైన వస్తువులు అపహరించారు. శనివారం ఉదయం గోపాల్రెడ్డి దుకాణాన్ని తెరిచి చూడగా సామగ్రి అస్తవ్యస్తంగా పడి ఉండడం, కౌంటర్లో దాచి ఉంచిన నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నాడు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిశాలిగౌరారం : ఇంట్లో టేబుల్ ఫ్యాన్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఆకారం గ్రామానికి చెందిన వలిశెట్టి సందీప్(33)కు భార్య, కుమారుడు ఉన్నారు. సందీప్ భార్య తన కుమారుడితో కలిసి తన తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న సందీప్ శనివారం రాత్రి భోజనం అనంతరం నిద్రకు ఉపక్రమించే సమయంలో టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం, అర్ధరాత్రి అవుతున్నా తలుపులు తెరిచి ఉండటంతో చుట్టపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే సందీప్ మృతిచెంది ఉన్నాడు. -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
మిర్యాలగూడ టౌన్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వివరాలు.. మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ సమీపంలోని ఓ వెంచర్లో 14 మంది కార్మికులు విద్యుత్ లైన్ పనులు చేస్తున్నారు. వెంచర్ పక్కనే విద్యుత్ తీగలకు అడ్డొస్తాయనే ఉద్దేశంతో చెట్ల కొమ్మలు కొట్టివేసేందుకు గాను ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే చెట్ల కొమ్మలు కొట్టివేయడం ముగియకుండానే విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కార్మికులకు చెప్పకుండా కరెంట్ ఆన్ చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్కు చెందిన అష్రాఫుల్ మియా, హుస్సేన్ విద్యుదాఘాతానికి గురై స్తంభాల పైనుంచి కిందపడి గాయపడ్డారు. వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగతా 12 మంది కార్మికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విద్యుత్ అధికారుల నిరక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్మికులందరూ మిర్యాలగూడ పట్టణంలోని ఓ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వెంచర్లో చెట్ల కొమ్మలు కొట్టేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేత పని పూర్తికాకుండానే కరెంట్ ఆన్ చేసిన అధికారులు విద్యుదాఘాతానికి గురై గాయపడిన వలస కార్మికులు -
హక్కుల కోసం ఉద్యమించాలి
యాదగిరిగుట్ట : అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం, సమాన హక్కులు సాధించే దిశగా ఏఐవైఎఫ్ ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కేఎం గ్రాండ్స్లో ఆదివారం జరిగిన ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడవ మహాసభల ఆహ్వాన కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని సమస్యలపై యువత పోరాటాలు చేస్తున్నారని, ఇందులో ఏఐవైఎఫ్ ముందు వరుసలో ఉందన్నారు. బీజేపీ మత రాజకీయాలతో చేస్తున్న కుట్రలను ఏఐవైఎఫ్ తిప్పికొట్టాలన్నారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్ట కేంద్రంగా జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యుడు ఈటీ నర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు, మహిళల భద్రత, యువతకు ఉపాధి వంటి సమస్యలపై ఏఐవైఎఫ్ ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువతను సంఘటితం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలను మరింత విస్తృతం చేయాలనేదే మహాసభల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పేరబోయిన మహేందర్, వెంకటేశ్వర్లు, సత్యప్రసాద్, యుగంధర్, కొండల్, బాలకృష్ణ, సల్మాన్ బేగ్, ప్రవీణ్, యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, చెడే చంద్రయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ కొల్లూరి రాజయ్య, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ ఎన్నిక..ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. చీఫ్ ప్యాట్రన్గా పల్లా వెంకట్రెడ్డి, ప్యాట్రన్స్గా ఉజ్జిని యాదగిరిరావు, బొలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, గోద శ్రీరాములు, గౌరవ అధ్యక్షులుగా నెల్లికంటి సత్యం, అధ్యక్షులుగా యానాల దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పేరబోయిన మహేందర్, కోశాధికారిగా కళ్లెం కృష్ణ, సహాయ కార్యదర్శులుగా ఎల్లంకి మహేష్, వెంకటేశ్వర్లు, కొండల్తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి -
ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ
వరిలో వెదజల్లే పద్ధతి ద్వారా ఖర్చు ఆదాతో పాటు దిగుబడి ఎక్కువగా వస్తుంది. రైతులు ఒకేసారి నాట్లు వేయడం వల్ల కూలీల కొరత వేధిస్తోంది. దీని వల్ల నాట్లు ఆలస్యమవుతాయి. వెదజల్లే పద్ధతిలో తక్కువ విత్తనాలను అనుకున్న సమయానికి జల్లుకోవచ్చు. రైతులకు ఈ పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నాం. – డి. వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి, చివ్వెంల చివ్వెంల(సూర్యాపేట) : తక్కువ ఖర్చుతో పాటు కూలీల కొరతను అధిగమించేందుకు వరిలో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గ్రామాల్లో రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను నేరుగా దమ్ము చేసిన పొలంలో వెదజల్లుతారు. దీంతో నారు పోసే, నాటు వేసే ఖర్చు ఆదా అవుతుంది. సాధారణంగా ఎకరాకు నారు పోయడానికి 30 కిలోల విత్తనం వినియోగిస్తుండగా.. వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 10 నుంచి 15 కిలోల విత్తనం మాత్రమే అవసరమవుతుంది. ఎకరాకు రూ.10 వేల వరకు ఆదా.. వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేస్తే 7 నుంచి 10 రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది. నారు పెంచడం, నాట్లు వేయించే పనులు ఉండవు కనుక కనీసం ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు రైతుకు ఆదా అవుతుంది. 10 నుంచి 15 శాతం దిగుబడి అధికంగా వస్తుంది. ఈ సాగుకు అన్ని నేలలు అనుకూలమే. వెదజల్లే ముందు విత్తనాలను 24 గంటలు మండె కట్టాలి. మొలకెత్తిన తర్వాత దమ్ము చేసిన పొలంలో వెదజల్లాలి. విత్తనం జల్లే ముందు పొలం ఎత్తు వంపులు లేకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా నిల్వ ఉంచకూడదు. కలుపు యాజమాన్యం.. కలుపు నివారణకు విత్తిన 3 నుంచి 5 రోజుల మధ్యలో ఫైరజోసల్ఫ్యూరన్ ఇథైలన్ను ఎకరాకు 80 నుంచి 100 గ్రాములు పొలంలో జల్లుకోవాలి. 15 రోజుల తర్వాత ఎరువులు అందించాలి. ఒకవేళ అక్కడక్కడ కలుపు ఉంటే కూలీలచే తీయించాలి. వేర్లను తాకించడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది. ఫ వరిలో వెదజల్లే పద్ధతితో కూలీల కొరతను అధిగమించవచ్చు -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ముఖ మండపం క్యూలైన్, నిత్య కల్యాణ మండపం, ప్రసాదాల విక్రయ కేంద్రం, శివాలయం, మెట్ల మార్గం, బస్టాండ్, లక్ష్మీ పుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపం, అన్న ప్రసాద కేంద్రం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తులు కిటకిటలాడారు. భక్తులు అధికంగా కార్లలో రావడంతో కొండపైన పార్కింగ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో కొండపైకి కొద్దిసేపు వాహనాలను నిలిపివేశారు. ధర్మ దర్శనానికి 4గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. 48వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్యాదాయం రూ.68,22,052 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
నల్లగొండలో పోలీసుల నాకాబందీ
నల్లగొండ : పట్టణంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 17 చెకింగ్ పాయింట్ల వద్ద ఏడుగురు సీఐలు, 24 మంది ఎస్ఐ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 91 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడింగ్ 30, మైనర్ డ్రైవింగ్కు సంబంధించి 9 కేసులు నమోదు చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 4 మోడిఫైడ్ సైలెన్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు లేని 73 వాహనాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 97 మంది, సరైన వాహన పత్రాలు లేని 81 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మొత్తం 146 వాహనాలను సీజ్ చేశారు. ఇద్దరు అనుమానితులను గుర్తించడంతో పాటు 12 మంది రౌడీషీటర్ల కదలికలను మానిటరింగ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు కార్లకు అమర్చిన బ్లాక్ ఫిల్మ్లను తొలగించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 134 ఈ–చలాన్లు, ఇతర ఉల్లంఘనలకు 11 ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మైనర్లతో డ్రైవింగ్ చేయించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 17 చెకింగ్ పాయింట్లలో 200 మంది పోలీసులతో అర్ధరాత్రి తనిఖీలు 146 వాహనాలు సీజ్ 91 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు -
రైల్లో నుంచి జారిపడి యువకుడి దుర్మరణం
భువనగిరి : ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం సారగండ్లగూడెం గ్రామానికి చెందిన నవీన్(34) ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10న భార్యా పిల్లలను సొంతూరికి పంపి పని నిమిత్తం వరంగల్కు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని నేరుగా ఊరికి వస్తానని చెప్పాడు. ఈ నెల 11న సాయంత్రం కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కోసం ఎదురుచూస్తున్నట్లు ఫోన్లో భార్యకు ద్వారా చెప్పాడు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్, భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య మనీషా, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిభువనగిరి : రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున పగిడిపల్లి–భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య సికింద్రాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 30 ఏళ్లు ఉంటాయని, పసుపుచ్చ రంగు షర్ట్, నెక్కర్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఎడమ వైపు ఛాతి కింద పుట్టుమచ్చ ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 98482 22169 నంబర్కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు సూచించారు. అంతర్జాతీయ అథ్లెటిక్స్లో మెరిసిన ప్రవళిక డిండి : మండల కేంద్రానికి చెందిన నారిమళ్ల ప్రవళిక అంతర్జాతీయ అథ్లెటిక్స్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. చైనాలోని ఓర్దోస్లో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన అండర్–23 అంతర్జాతీయ అథ్లెటిక్స్ మహిళల విభాగంలో భారత జట్టు తరఫున రిలే పరుగు పందెంలో ఆమె పాల్గొని బంగారు పతకం సాధించింది. ప్రవళికను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ తదితరలుఉ అభినందించారు. -
అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆటో
ఆలేరు : ఆటో అదుపుతప్పి బైక్ను ఢీకొట్టి రోడ్డు పక్కన మక్కబుట్టలు విక్రయిస్తున్న మహిళ పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఆలేరు ఎస్ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడికల్ అండర్పాస్ దాటిన తర్వాత వరంగల్–హైదరాబాద్ బైపాస్ మార్గంలో భువనగిరి వైపు వస్తున్న ఆటో అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. అనంతరం బైపాస్ పక్కన మక్కబుట్టలు విక్రయిస్తున్న ఎల్లమ్మ అనే మహిళను కూడా ఢీకొని ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మక్కబుట్టలు విక్రయించే మహిళ తలకు తీవ్రంగా గాయమైంది. ఆటో డ్రైవర్ మహేందర్, బైక్పై వెళ్తున్న శ్రీశైలం, జహంగీర్తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎల్ల మ్మను మెరుగైన వైద్యం కోసం జనగామ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు పక్కన మహిళ పైకి దూసుకెళ్లి బోల్తా ఆరుగురికి గాయాలు -
వాతావరణం గుట్టు.. ముందే కనిపెట్టు
త్రిపురారం : వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త పుంతలు తొక్కుతోంది. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో, రైతులు వీటిని సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయంలో అధిక లాభాలు గడించవచ్చు. ప్రస్తుత వానాకాలం సీజన్లో అప్పుడప్పుడూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, పంటలకు ఆశించే చీడపీడల గురించి రైతులు తమ అరచేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా తక్షణమే తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పంటల సలహాలకు ‘మేఘదూత్’ రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను సులభంగా అందించే లక్ష్యంతో భారత వాతావరణ శాఖ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంయుక్తంగా ‘మేఘదూత్’ మొబైల్ యాప్ను రూపొందించాయి. ఈ యాప్ ద్వారా జిల్లా స్థాయిలో వాతావరణ వివరాలు, రాబోయే ఐదు రోజుల ముందస్తు వాతావరణ సూచనలను రైతులు తెలుసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల రక్షణ చర్యలు, ప్రధాన పంటలకు ఆశించే చీడపీడలు, ప్రస్తుత చీడపీడల నివారణ మార్గాల సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. జిల్లా ఆగ్రో–మెట్ ఫీల్డ్ యూనిట్ల ద్వారా ప్రతి మంగళ, శుక్రవారాల్లో వివిధ పంటల సమాచారం, సలహాలు, సూచనలు రైతులకు మొబైల్ ఎస్ఎంఎస్ల రూపంలోనూ అందుతాయి. పిడుగుల ముప్పును పసిగట్టే ‘దామిని’ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పిడుగుపాటుకు గురై రైతులు, పశువుల కాపరులతో పాటు మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర ఆస్తి నష్టం సంభవించడం చూస్తున్నాం. ఇలాంటి పిడుగుపాట్ల ముప్పును ముందుగానే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. యాప్లను డౌన్లోడ్ చేసుకోండిలా.. మేఘదూత్ యాప్ : ప్లేస్టోర్కి వెళ్లి ఆంగ్లంలో మేఘదూత్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక సైన్ అప్పై క్లిక్ చేసి.. పేరు, ప్రాంతం, మొబైల్ నంబర్, భాష, రాష్ట్రం, జిల్లా తదితర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఫోన్ నంబర్ ద్వారా లాగిన్ అయితే, డిస్ప్లేపై వాతావరణ వివరాలు కనిపిస్తాయి. దామిని యాప్ : ప్లేస్టోర్ నుంచి దామిని యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా, పిన్కోడ్ నమోదు చేయాలి. జీపీఎస్ లొకేషన్కు అనుమతి ఇవ్వగానే యాప్ పనిచేస్తుంది. పిడుగుపాటును గుర్తించే మార్గాలివే.. మనం ఉన్న ప్రదేశంలో 7 నిమిషాల వ్యవధిలో పిడుగు పడే అవకాశం ఉంటే, దామిని యాప్లోని సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. 10 నుంచి 15 నిమిషాల్లో ముప్పు ఉంటే పసుపు రంగులోకి, 18 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే నీలం రంగులోకి మారుతుంది.పిడుగుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు u ఆకాశం అంతటా నల్లటి మబ్బులు విస్తరించి భారీ వర్షం పడుతున్నప్పుడు రైతులు పొలంలో తిరగకూడదు. సమీపంలో ఏవైనా భవనాలు ఉంటే వెంటనే అక్కడికి చేరుకోవాలి. సురక్షిత భవనాలు లేకపోతే ఉన్నచోటనే నేలపై కూర్చుని, మోకాళ్ల మధ్య తలపెట్టి రెండు చేతులతో చెవులను గట్టిగా మూసుకోవాలి. u బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువ. ఫోన్ సిగ్నల్ వల్ల కూడా పిడుగు ఆకర్షితమయ్యే ప్రమాదం ఉన్నందున మబ్బులు కమ్మినప్పుడు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం సురక్షితం. u విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు, బోర్ మోటార్లకు దూరంగా ఉండాలి. ఆ సమయంలో బోరు మోటారు నుంచి వచ్చే నీటిని కూడా వినియోగించకూడదు. u పిడుగులు ఎత్తైన చెట్లపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడరాదు. u వర్షం పడేటప్పుడు పశువులను పాకలోనే ఉంచాలి. రైతులకు అండగా స్మార్ట్ యాప్లు వాతావరణ సూచనలు, పంటల సలహాలకు ‘మేఘదూత్’ పిడుగుల ముప్పును పసిగట్టే ‘దామిని’ స్మార్ట్ఫోన్తో రైతన్నలకు మరింత చేరువగా వ్యవసాయ సాంకేతికత -
జల నారాయణుడికి మంగళ హారతులు
భువనగిరి : పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి జల నారాయణస్వామికి మంగళ హారతుల సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కనుల పండుగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం తిరువీది ఉత్సవ సేవ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలిభువనగిరి : విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల (టీవీఏఈ) జేఏసీ రాష్ట్ర చైర్మన్ సంకు సతీష్రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని డీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వంపై మరోసారి తిరుగబడదామని పిలుపునిచ్చారు. సమావేశంలో టీవీఏఈ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ సుదగాని శ్రీధర్గౌడ్, కన్వీనర్లు సాయి, చంద్రారెడ్డి, నాయకులు చందర్సింగ్, సంతోష్నాయక్, పాండరిరెడ్డి, మహేష్, భాస్కర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలి భువనగిరి : తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగేలా పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పై అసత్య ప్రచారం చేస్తూ ఓటర్లను తప్పుదోవ పటిస్టుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రభారి శ్రీవర్ధన్రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అద్యక్షడు పాశం భాష్కర్, నాయకులు మురళీధర్రెడ్డి, కర్నాటి ధనుంజయ్య, శ్యాంసుందర్రెడ్డి, పట్నం శ్రీనివాస్, చంద్ర శేఖర్రెడ్డి, యాదిరెడ్డి, అచ్చయ్య, మేడి కోటేష్, కృష్ణ, పడమటి జగన్మోహన్రెడ్డి, నరేష్నాయక్, మాధురి, రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలిభువనగిరి : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రత్యేక అధికారి ఏ.అనిత అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులు, యువతలో నాయకత్వ లక్షణాలతోపాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజనక్రీడల అభివృద్ధి అధికారి జినుకల శ్యాంసుందర్, కోచ్లు సతీష్రెడ్డి, రాంబాబు, ఎం.చైతన్య, డాక్టర్ గణేష్, యువజన సంఘాల నాయకులు సరగడ కరుణ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి, పీడీలు పీఈటీలు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
మిర్యాలగూడ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హతమార్చింది భార్య. ఈ ఘటన దామరచర్ల మండలం నర్సాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవింద్(53), సరోజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. గోవింద్ వ్యవసాయ చేస్తుండగా.. సరోజ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సరోజ అదే గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పది రోజుల క్రితం రాత్రి సమయంలో సరోజ ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆమె భర్త గోవింద్ గమనించి భార్యతో గొడవపడి ఫోన్ను నేలకేసి కొట్టడంతో పగిలిపోయింది. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అంతమొందించాలని సరోజ నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి తమ చిన్న కుమార్తె ఇంట్లో జరిగిన శుభాకార్యానికి గోవింద్, సరోజ దంపతులు వెళ్లారు. అక్కడ సరోజ మద్యం సేవించింది. అనంతరం భార్యాభర్తలు ఇంటికి వచ్చి నిద్రించారు. శనివారం ఉదయం చుట్టుపక్కల వారు చూసేసరికి గోవింద్ ఇంట్లో శవమై కనిపించాడు. బంధువులు సరోజను గట్టిగా నిలదీయడంతో తానే చంపినట్లు అంగీకరించింది. సరోజ ఆమె ప్రియుడు శ్రీను కలిసి గోవింద్ను ఊపిరాడకుండా చేసి హత్య చేశారని మృతుడి అన్న దూద్యా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఫ భర్తను హత్య చేసిన భార్య -
నులి పురుగులను నివారిద్దాం
భువనగిరి : పిల్లల ఆరోగ్యవంతంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లలు రోగాల బారిన పడతారు. అపరిశుభ్రత కారణంగా కడుపులో నులిపురుగులు తయారవుతాయి. మల, మూత్ర విసర్జణ చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవ పోవడం వల్ల ఇలా జరుగుతుంది. నులిపురుగుల బారిన పడిన పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13న ముందుగా గుర్తించిన సెంటర్ల వద్ద పిల్లలకు రెండు విడతలుగా మాత్రలు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1,51,040 మంది పిల్లలకు పంపిణీ జిల్లా వ్యాప్తంగా విద్యా, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో మాత్రల పంపిణీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 901 అంగన్వాడీ కేంద్రాలు, 665 ప్రభుత్వ పాఠశాలలు, 37 ఎయిడెడ్ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 150 ప్రైవేటు పాఠశాలలు, 21 ప్రైవేటు కళాశాలల్లోనూ ఏర్పాట్లు చేశారు. ఆయా విద్యా సంస్థలలో మొత్తం 1,51,040 మంది పిల్లలకు మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యధికంగా తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 20,186, తర్వాత భువనగిరి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 20,047, బీబీనగర్ పీహెచ్సీ పరిధిలో 10,624, అతి తక్కువగా వెల్వర్తి పీహెచ్సీ పరిధిలో 591 మంది పిల్లలు ఉన్నారు. మాత్రలు ఇలా వేయాలి 1 నుంచి 2 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు సగం, అల్బెండజోల్ మాత్రను, రెండు నుంచి మూడేళ్ల లోపు వారికి ఒక మాత్రను క్రష్ చేసి, మూడేళ్ల నుంచి 19 ఏళ్ల పిల్లలకుఒక మాత్రను చంపరించి, నమిలి మింగాలి. మాత్రల పంపిణీకి 1,555 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 874 మంది అంగన్వాడీ టీచర్లు, 681 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. వీరు ప్రతి ఇంటిని, పాఠశాలను సందర్శించి మాత్రలు పంపిణీ చేస్తారు. ఫ పిల్లల ఆరోగ్యానికి ఆల్బెండ జోల్ మాత్రలు ఫ 1 నుంచి 19ఏళ్లలోపు వయస్సు గలవారికి రేపు పంపిణీ -
ప్రమాణ స్వీకారం జరిగింది ఇలా..
ముందుగా చైర్మన్ డాక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి ఉదయం 11.37గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత సభ్యులు వరుసగా వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ ప్రమాణం చేశారు. అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఈఓ భవాని శంకర్, ప్రధానార్చకుడు కె.వెంకటాచార్యులు ప్రమాణం చేశారు. ఇద్దరు ఇంగ్లిష్లో.. మిగతా వారు తెలుగులో.. పాలక మండలి సభ్యుల్లో వినోద్ వెంకటస్వామి, స్వాతి కంఠమణి ఇంగ్లిష్లో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సత్యనారాయరెడ్డితో పాటు ఆరుగురు సభ్యులు, నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులు తెలుగులో ‘దైవ సాక్షిగా’ అని ఒక్కొక్కరు 5 నిమిషాల పాటు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి సురేఖతో వైటీడీ పాలక మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, (ఇన్సెట్లో) మంత్రి కొండా సురేఖకు శ్రీస్వామి వారి చిత్రపటం అందిస్తున్న ఈఓ -
బీఆర్ఎస్ నేతపై పోలీసుల దాడి అమానుషం
రామన్నపేట : చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా రామన్నపేట మండలం బోగారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పార్టీ సీనియర్ నాయకుడు బద్దుల రమేష్ను ఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బంది తీవ్రంగా కొట్టడం అమానుషమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లును కోరారు. అనంతరం చిరుమర్తి లింగయ్య విలేకరులతో మాట్లాడుతూ.. పోస్టింగుల కోసం బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ ఘటనకు బాద్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సర్పంచులు కమ్మంపాటి శ్రీనివాసులు, కూనూరు సాయికుమార్, గర్దాసు విక్రం, నాయకులు పోచబోయిన మల్లేశం, బొక్క మధవరెడ్డి, పులిపలుపుల వీరస్వామి, మందడి విద్యాసాగర్రెడ్డి, దోమల సతీష్, అంతటి రమేష్, ఎస్కే చాంద్, జాడ సంతోష్, బత్తుల వెంకటేష్, కూనూరు ముత్తయ్య, చొప్పరి నర్సింహ తదితరులు ఉన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
పోలీసులు, నాయకుల మధ్య తోపులాట
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన వైటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. చైర్మన్తో పాటు పాలకమండలి సభ్యులకు చెందిన అభిమానులు, కుటుంబ సభ్యులు, నాయకులు తూర్పు ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆలయ మెయిన్ గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో నాయకులు, అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చైర్మన్ సత్యనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పశ్చిమ ద్వారం ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీడియాతో మాట్లాడకుండా పలువురు ఆయనని బ్యాటరీ వాహనం వైపు తీసుకెళ్లెందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు, పోలీసుల మధ్య కూడా తోపులాట జరిగింది. అదేవిధంగా వీఐపీలు వచ్చే సమయంలో కొండపైన ప్రొటోకాల్ కార్యాలయం వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు ఉండటంతో వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచే కొండపైకి భక్తుల వాహనాలను అధికారులు నిలిపివేశారు. దీంతో కొండ పైకి వచ్చేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామివారి దర్శనం కోసం సుమారు 4గంటల పాటు భక్తులు కొండ కింద వేచి ఉన్నారు. మధ్యాహ్నం 1.30గంటల తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు. -
‘నవోదయ’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపులో నిర్వహించబడుతున్న జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. శంకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవవచ్చునని ఆయన తెలిపారు. అర్హతలు ఇవీ.. 2026–27 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 3, 4, 5 తరగతులు ఆయా జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివి ఉండాలని, 01–05–2015 నుంచి 31–07–2017 మద్య జన్మించి ఉండాలన్నారు. 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకే కేటాయించామని, ప్రతి విద్యార్థి ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ కల్పించబడుతుందని, ఆరో తరగతిలో మొత్తం 80 సీట్లు ఉండగా 1/3 సీట్లు బాలికలకు కేటాయించినట్లు వివరించారు. ప్రవేశ పరీక్షకు నవోదయ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, ఆధార్ కార్డు లింక్డ్ మొబైల్ నంబర్(ఓటీపీ కోసం), ప్రభుత్వంచే ధ్రువీకరించబడిన బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరని సూచించారు. ఆధార్ కార్డు లేని వారు తెలంగాణ ఉంటున్నట్లు నివాస ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు తన ఫొటోతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకుని సంతకంతో ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపి, ఐదో తరగతి చదువుతున్న పాఠశాల హెచ్ఎంచే జారీ చేయబడిన ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు అవకాశం.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 చివరి తేదీ అని, ప్రవేశ పరీక్ష 2026 నవంబర్ 28న ఉదయం 11.30 నుంచి 1.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 3, 4, 5 తరగతులు ఒక్కరోజైనా మున్సిపాలిటీలలో చదివినట్లైతే వారిని అర్బన్గా పరిగణించబడతారని, మరిన్ని వివరాలకు 94489 83776, 94413 76915 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు ఫారం తప్పుగా నింపితే ఎంపికై నా అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామన్నారు. ఫ ఆరో తరగతిలో చేరేందుకు అవకాశం ఫ ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు -
చెలిమితో చిరునవ్వులు!
బొమ్మలరామారం : కొత్తగా హాస్టల్లో చేరిన విద్యార్థినుల్లో ఇంటిపై బెంగను పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) సరికొత్త మార్గంలో పయనిస్తున్నాయి. ‘చెలిమి’ పేరుతో ఆటపాటలు, కథలు, రోల్ప్లే, యోగా లాంటి సృజనాత్మక కార్యక్రమాలతో చేపట్టిన ప్రత్యేక శిక్షణ సత్ఫలితాలిస్తోంది. కేజీబీవీ హాస్టళ్లలోని చిన్నారుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసి, వారిలోని అద్భుతమైన నైపుణ్యాలను వెలికితీస్తోంది. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు.. జిల్లాలో మొత్తం 11 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో సుమారు 500 మంది వరకు బాలికలు చేరారు. హాస్టల్ అంటేనే చిన్నారుల్లో నెలకొనే బెరుకును తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని నింపి.. ఇంటిని మరిపించేలా చేయడానికి జూన్ 20న శ్రీచెలిమిశ్రీకి శ్రీకారం చుట్టారు. ఆగస్టు రెండో వారం వరకు 45 రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఉపాధ్యాయులు రోజూ సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. సామాజిక శ్రేయస్సు కోసమే.. బాలికల మానసిక, సామాజిక శ్రేయస్సు కోసమే శ్రీచెలిమిశ్రీని ప్రత్యేకంగా రూపొందించారు. వసతి గృహాల్లో ఇతర బాలికలతో ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలి? ఒత్తిడిని ఎలా అధిగమించాలి? తదితర విషయాలను నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో స్నేహపూర్వక వాతావరణం కోసం ఆటలు ఆడిస్తున్నారు. యోగా, కమ్యూనికేషన్ స్కిల్స్, చిత్రలేఖనం, గ్రూప్ డిస్కషన్, పాత్ర పోషణ (రోల్ ప్లే), పాటలు పాడడం, ఆసక్తికరమైన కథలు చెప్పడం నేర్పిస్తున్నారు. కాగితాలతో పలు ఆకృతులు తయారు చేయిస్తున్నారు. ఫ కేజీబీవీల్లో వినూత్న కార్యక్రమం ఫ 6వ తరగతి విద్యార్థినుల కోసం అమలు ఫ జూన్ 20వ తేదీన ప్రారంభం ఫ ఆగస్టు రెండో వారం వరకు శిక్షణ ఫ సృజనాత్మక నైపుణ్యాలకు పదును ఫ ఆటపాటలతో ఇంటిపై బెంగ, మానసిక ఒత్తిడి దూరం -
వలస ఓటర్లకు పరీక్షే.. సర్
సంస్థాన్ నారాయణపురం : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) ప్రక్రియతో క్షేత్రస్థాయిలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో వేలాది మంది ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అవసరమైన వివరాలు సమర్పించలేకపోతే ఓటు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందేమోనని భయపడుతున్నారు. తెలంగాణలో వివాహం చేసుకుని స్థిరపడిన వారిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళలే ఉన్నారు. అదేవిధంగా జీవనపాధి కొసం వచ్చి సిర్థపడిన కుంటుంబాలున్నాయి. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోనే సుమారు 100కు పైగా కుటుంబాలు మూడు దశాబ్దాల కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడ్డాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నో కుంటుంబాలు, కోడళ్లుగా వచ్చిన మహిళలు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2002 నాటి తమ తల్లిదండ్రుల ఓటరు జాబితా వివరాలు లేదా కుటుంబ వంశవృక్షానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని అధికారులు సూచించడంతో వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పాత రికార్డులు వెంటనే అందుబాటులో లేకపోవడం, అవసరమైన వివరాలు సకాలంలో లభించకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దీంతో కొందరు ఓటు నమోదు ప్రక్రియనే విరమించుకునే పరిస్థితి కనిపిస్తోంది. 24 ఏళ్ల నాటి వివరాల కోసం గాలింపు... ఎన్యూమరేషన్ ఫాంలో 2002 నాటి నియోజకవర్గం, గ్రామం, పోలింగ్ స్టేషన్, ఓటరు క్రమసంఖ్య, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉండడంతో ప్రజలు తికమకపడుతున్నారు. చాలా మందికి ఆ వివరాలు గుర్తులేకపోవడంతో బీఎల్ఓలు తమ మొబైల్లోని పాత ఓటరు జాబితా పీడీఎఫ్లను పరిశీలిస్తూ ఇంటింటికీ వెళ్లి వివరాలు వెతికి నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో ఓటర్లతో పాటు బీఎల్ఓలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఫ పనులు మానుకొని పాత ఓటరు జాబితా కోసం అన్వేషణ ఫ 24 ఏళ్ల నాటి వివరాలు లేక సతమతం ఫ పాత రికార్డులు తిరగేసినా లభించని సమాచారం ఫ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లకు కష్టాలు నేను ఏపీలోని మచిలీపట్నంలో పుట్టి పెరిగాను. అక్కడి నుంచి గుంటూరు పెద్దకూరుపాడు ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు నివసించాను. అనంతరం 2015లో జీవనోపాధి కోసం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి వచ్చాను. 2021లో పుట్టపాక గ్రామంలో ఓటరుగా నమోదు చేసుకున్నాను. అప్పటి నుంచి పుట్టపాకలోనే ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. ఇటీవల బీఎల్ఓ సర్ ఎన్యూమరేషన్ ఫాం ఇచ్చారు. ఆ ఫాం నింపి ఇవ్వాలంటే 2002కు ముందు ఓటరు జాబితా వివరాలు కావాలని చెబుతున్నారు. జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాల్లో నివసించడంతో పాత ఓటరు జాబితా వివరాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదు. అంతా తికమకగా ఉంది. – శ్రీనివాసరావు, వలస ఓటరు, పుట్టపాక -
జాతీయ కమిటీలో ఇంద్రపాలనగరం వాసి
రామన్నపేట : ఆర్జీఎన్ మానవ హక్కులు మరియు అవినీతి నిరో ధక సంస్థ జాతీయ కమిటీలో రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వాసి చిన్నపాక శ్రీనివాసులుకు చోటు దక్కింది. సామాజిక కార్యకర్త అయిన చిన్నపాక శ్రీనివాసులు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సంస్థ జాతీయ అధ్యక్షుడు దేవానంద నాయుడు, సెక్రటరీ భూక్యా శ్రీని వాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ వలీపాష, ఇన్చార్జి మహేష్గుప్త హైదరాబాద్లో శ్రీనివాసులుకు నియామక పత్రం అందజేశారు. లారీ, కారు ఢీ.. ఒకరు మృతిఫ మరో ఇద్దరికి గాయాలు పెద్దవూర : కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం పెద్దవూర మండల పరిధిలో చోటు చేసుకుంది. దేవరకొండ పట్టణానికి చెందిన శ్రీరామదాసు(40) మరో ఇద్దరితో కలిసి కారులో ఫంక్షన్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు పెద్దవూర మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలోకి రాగానే దేవరకొండ నుంచి హాలియా వైపు వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న శ్రీరామదాసుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ ముత్యాలు, మరో వ్యక్తి ప్రవీణ్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, శ్రీరామదాసు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్రావు తెలిపారు. చండూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలిఫ పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల ధర్నా చండూరు : గత కొన్ని నెలలుగా చండూరు ఎస్ఐ శివకుమార్ తమను తీవ్రంగా వేధిస్తున్నాడని చండూరు మున్సిపాలిటీకి చెందిన కొందరు బాధితులు శనివారం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుడు మొగుదాల రవి మాట్లాడుతూ.. మార్చి నెలలో కొందరు యువకుల మధ్య గొడవ జరగగా, ఎస్ఐ శివకుమార్ ఏకపక్షంగా తమపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. కేవలం ఒక సామాజిక వర్గమే టార్గెట్గా ఎస్ఐ కేసు నమోదు చేశారని, ఆ కేసులో తాను జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్లో ఉంటున్నానని రవి తెలిపారు. తాను ఏపీ రాజకీయాలకు సంబంధించిన ఓ వీడియోను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నానన్న కారణంగా గత 10 రోజలుగా తన ఇంటికి ఎస్ఐ పోలీసులను పంపుతూ, రౌడీషీట్ ఓపెన్ చేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయాడు. తనకు తెలిసిన నాయకులతో డీఎస్పీ శివరాంరెడ్డిని కలిస్తే ఆయన ఫోన్లో ఎస్ఐని మందలించారని, అప్పటి నుంచి ఇంకా తనపై పగ పెంచుకుని స్టేషన్కు రావాలని వేధిస్తున్నాడని వివరించాడు. శనివారం ఉదయం ఇద్దరు నాయకులను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ తమను దుర్భాషలాడాడని, దీంతో విసుగుచెంది పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగామని తెలిపారు. ఎస్ఐ శివకుమార్ సివిల్ తగాదాల్లో తలదూరుస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కోడి గిరిబాబు ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
సీపీఎం మహాధర్నాకు తరలిరావాలి
భువనగిరిటౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలనే డిమాండ్తో ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు నిరుద్యోగ యువత తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం ధర్నాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ హామీ 12 ఏళ్లయినా నెరవేరలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ యూత్ డిక్లరేషన్ ఇచ్చి నిరుద్యోగులను వంచించిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, దయ్యాల నరసింహ, పల్లెర్ల అంజయ్య, ఈర్లపల్లి ముత్యాలు, అన్నంపట్ల కృష్ణ, ఎదునూరి మల్లేశం పాల్గొన్నారు. -
స్థానికులకు చోటు లేకపోవడం విచారకరం
ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు యాదగిరిగుట్ట : వైటీడీ పాలకమండలిలో ఉమ్మడి జిల్లా వాసులకు స్థానం కల్పించకపోవడం విచారకరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శనివారం ఆయన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి యాదగిరీశుడిని సందర్శించుకున్నారు. అనంతరం కొండకు దిగువన ఉన్న సన్నిధి హోటల్లో విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పాలకమండలి నియామకం జరిగినట్లు తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేకు తెలిస్తే ఆలేరు నియోజకవర్గం, నల్లగొండ జిల్లాకు సంబంధించిన వారి పేర్లు ఉండేవన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా మాదిగలను అణచివేసేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మాదిగలు, బలడుగు, బలహీన వర్గాలదే రాజ్యం అని పేర్కొన్నారు. మాదిగ మహాశక్తి ఆధ్వర్యంలో మాదిగలను ఒకటి చేసే విధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్తో కలిసి పర్యటనలు చేస్తున్నామన్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ పనిచేసే అవసరం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. మాదిగ జాతితో పాటు రాజకీయంగా అణచివేయబడిన బడుగు, బలహీన వర్గాలను కలుపుకొని పోరాటం చేస్తున్నామన్నారు. -
భవిష్యత్కు బలమైన పునాది
చెలిమి కార్యక్రమం బాలికల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తోంది. విద్యాభ్యాసంతో పాటు సామాజిక నైపుణ్యాలను నేర్చుకుంటూ తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటున్నారు. ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణతో విద్యాలయంలో మెరుగైన ఫలితాలకు బాటలు పడుతున్నాయి. – కందుకూరి సాయిలక్ష్మి, ప్రత్యేకాధికారిణి, మల్యాల కస్తూర్బా విద్యాలయం హాస్టల్కు వచ్చిన కొత్తలో మానసిక ఒత్తిడికి గురయ్యాను. చెలిమితో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఆటలు, పాటలతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నారు. నాలో భయం పోయి చదువుపై దృష్టి సారించగలుగుతున్నాను. ఇంటిపై ధ్యాస కూడా పోయింది. – జి.వంశిక, 6వ తరగతి విద్యార్థిని, మల్యాల కస్తూర్బా విద్యాలయం చెలిమి కార్యక్రమంతో విద్యార్థినులు మానసిక ఒత్తిడిని అధిగమిస్తున్నారు. చదువుతో పాటు కథలు చెప్పడం, యోగా, డ్రాయింగ్, రోల్ ప్లే, సింగింగ్లో శిక్షణ ఇస్తుండడంతో ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకుంటున్నాం. స్నేహపూర్వకంగా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. – చంద్రకళ, ఆంగ్ల ఉపాధ్యాయురాలు, మల్యాల కస్తూర్బా విద్యాలయం -
వాలీబాల్.. భాగ్య‘రాజ్’
ఫ వాలీబాల్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మిర్యాలగూడ యువకుడు ఫ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పేరు ప్రఖ్యాతలు నిరుపేద కుటుంబంలో పుట్టినా.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇవేవీ అతడి కలకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. చిన్ననాటి నుంచి వాలీబాల్పై ఉన్న మక్కువతో అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడకు చెందిన అమరవాది భాగ్యరాజ్. మిర్యాలగూడ పట్టణంలోని అశోక్నగర్కు చెందిన అమరవాది పార్థసారధి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. భాగ్యరాజ్ తండ్రి ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తుండగా, తల్లి గృహిణి. ఎన్నో కష్టాలకోర్చి భాగ్యరాజ్ తండ్రి తన పిల్లలను చదివించాడు. పెద్దవాడైన భాగ్యరాజ్ పదో తరగతి వరకు స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని బకల్వాడీ పాఠశాలలో చదువుకున్నాడు. మహబూబ్నగర్లో ఇంటర్మీడియట్, చైన్నెలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. భాగ్యరాజ్కు చిన్నప్పటి నుంచి వాలీబాల్పై ఉన్న ఇష్టంతో యూనివర్సిటీ స్థాయి నుంచే అద్భుత ప్రతిభ కనబర్చి తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నాడు. సత్తా చాటి.. ఉద్యోగం సాధించి.. వాలీబాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భాగ్యరాజ్కు 2022లో స్పోర్ట్స్ కోటా కింద చైన్నెలోని సెంట్రల్ జీఎస్టీ విభాగంలో ఉద్యోగం లభించింది. దీంతో అతడు తమిళనాడు రాష్ట్రం, జీఎస్టీ శాఖ తరఫున వాలీబాల్ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2018–19లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్–23 బ్రిక్స్ గేమ్స్లో ఇండియా తరఫున వాలీబాల్ ఆడి కాంస్య పతకం సాధించాడు. 2020–21లో ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ఆలిండియా ఇంటర్–యూనివర్సిటీ పోటీల్లో పాల్గొని రజత పతకం, 2021–22లో కాంస్య పతకం గెలుపొందాడు. 2025లో రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన సీనియర్ నేషనల్ టోర్నీలో తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ప్రస్తుతం తెలంగాణ వాలీబాల్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. జీఎస్టీ సెంట్రల్ టీమ్ తరఫున చైన్నె ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రదర్శన కనబర్చాడు. జీఎస్టీ దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ చేతుల మీదుగా ‘బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్’ అవార్డు అందుకున్నాడు. క్రీడలకు సరైన ప్రోత్సాహం కరువవ్వడంతో ఎంతోమంది ప్రతిభావంతులు పల్లెలకే పరిమితమవుతున్నారు. నేను ఎలాంటి ప్రోత్సాహం లేకుండానే సొంత కృషితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాను. ప్రభుత్వాలు మాలాంటి క్రీడాకారులను ఆర్థికంగా ఆదుకుంటే భవిష్యత్తులో దేశానికి మరింత పేరు తీసుకొస్తాం. – ఎ. భాగ్యరాజ్ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
రామన్నపేట : బోరు మోటారు వద్ద పైపు సరిచేస్తుండగా కరెంట్ తీగ తగిలి విద్యుతాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామంలో శని వారం జరిగింది. పోలీ సులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంకుడుపాముల గ్రామానికి చెందిన గొలుసుల వెంకన్న(38) శనివారం ఉదయం గ్రామ శివారులోని తన పొలంలో నాట్లు వేసేందుకు కూలీలతో కలిసి వెళ్లాడు. బోరు సమీపంలో ఊడిపోయిన పైపును సరిచేస్తుండగా కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై కేకలు వేస్తూ కిందపడిపోయాడు. కేకలు విన్న కూలీలు పరుగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి వెంకన్న మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. వెంకన్న మృతదేహానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని కోరారు. -
రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కోదాడ: తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న కోదాడలో రూ.16.92 కోట్లతో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. శనివారం కోదాడ బస్టాండ్ ఆవరణలో నూతన బస్టాండ్ నిర్మాణానికి వారు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం ద్వారా వారికి 11,400 కోట్ల రూపాయల ప్రయోజనం కలిగేలా చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు 600 బస్సులను అందించి వారిని కోటీశ్వరులుగా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ, మార్కెట్ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ, నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వేనేపల్లి చందర్రావు, షేక్ బషీర్, ఎండీ మహబూబ్జానీ, మున్సిపల్ వైస్చైర్పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్ రెడ్డి -
నేడు వైటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలి శనివారం ఉదయం 11.37 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆలయ ముఖ మండపంలోని గర్భాలయ బంగారు వాకిలి చెంత చైర్మన్తో పాటు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. పాలకమండలి సభ్యులకు ఘనంగా స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ మండపాన్ని విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దడంతో పాటు పూలతో అలంకరించారు. ఆలయ పరిసరాలు, తిరు, మాడ వీధులు పరిశుభ్రంగా కనిపించేలా తీర్చిదిద్దారు. మొదట చైర్మన్తో.. వైటీడీ పాలకమండలి చైర్మన్గా మహబూబ్నగర్కు చెందిన ఎం. సత్యనారాయణరెడ్డి మొదటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, విజయేందర్ తూళ్ల, పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం. రాఘవేందర్రావు, లక్ష్మీనారాయణనాయక్, వ్యవస్థాపక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులచే ఆలయ ఈఓ భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం చైర్మన్, సభ్యులంతా కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీ తొలి సమావేశంలో పాల్గొననున్నారు.సాక్షి, యాదాద్రి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లకు ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జి కమిటీలను నియమిస్తోంది. ఎన్నికలతో సంబంధం లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా వచ్చే ఈ పదవుల కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 21 పీఏసీఎస్లలో ఇప్పటివరకు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 10 పీఏసీఎస్లకు పాలకవర్గాలను ప్రభుత్వం ప్రకటించింది. మరికొన్ని ప్రకటించాల్సి ఉంది. తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లోని ఆరు పీఏసీఎస్ పాలకవర్గాల కోసం ఆశావహులు ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఆ నియోజకవర్గాల నుంచి పేర్లు ఇవ్వాలి తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ కమిటీ అధ్యక్షులు, డైరెక్టర్ల పేర్లు ఖరారు చేయలేదని సమాచారం. గుజ్జ, సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్, మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట పీఏసీఎస్లకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. తమకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా ఎంపిక చేస్తారు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని పీఏసీఎస్లకు పాలకవర్గ సభ్యుల పేర్లను ఖరారు చేసి జిల్లా సహకార అధికారికి ఇస్తారు. సీఈవోలు పీఏసీఎస్ల పరిధిలో ఓటు హక్కు ఉందా, లేదా వంటివి విచారణ చేసి ఎమ్మెల్యేకు నివేదిక ఇస్తారు. ఆయన తన నియోజకవర్గంలో పాలక వర్గాలను ప్రకటించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ ఇస్తారు. దాని ఆధారంగా మంత్రి సహకార శాఖ రిజిస్ట్రార్కు పంపించి పాలకవర్గ సభ్యులను అధికారికంగా ప్రకటిస్తారు. అత్యధికంగా ఇక్కడే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తున్న పీఏసీఎస్లలో అత్యధికంగా పది పాలకవర్గాలను ఈ జిల్లాలోనే ప్రకటించారు. భువనగిరి, చందుపట్ల, బీబీనగర్, ఆలేరు, యాదగిరిగుట్ట, రేణికుంట, తుర్కపల్లి, ఆత్మకూర్.ఎం, గుండాల, బొమ్మలరామారం పాలకవర్గాలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం నాటికి వీరంతా కొలువు దీరారు. కాగా.. వంగపల్లి పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ కమిటీ అధ్యక్షుడి పేరు ప్రకటించడంలో క్లరికల్ మిస్టేక్తో ఆగిపోయినట్లు సమాచారం. అయితే వలిగొండ, ఆరూర్, జూలూరు, పోచంపల్లి పీఏసీఎస్ల పాలకవర్గాల పేర్లను ప్రకటించాల్సి ఉంది. వేగవంతంగా ఓటరు డిజిటలైజేషన్ ప్రక్రియ ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి ఫ పది చోట్ల కొలువుదీరిన పీఏసీఎస్ పాలకవర్గాలు ఫ నేడో.. రేపో.. మరో ఐదు ఖరారయ్యే అవకాశం ఫ తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్లో ఆలస్యం ఫ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ.. ఆశావహుల్లో ఉత్కంఠ -
ఆయిల్పామ్తో అధిక లాభాలు
యాదగిరిగుట్ట రూరల్: రైతులు ఆయిల్ పామ్తో అధిక లాభాలు పొందవచ్చని ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్రెడ్డి అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్ సమన్వయంతో యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో గల రైతు వేదికలో శుక్రవారం ఆయిల్ పామ్ పంటలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. యాదగిరిగుట్ట ఉద్యానవన శాఖ అధికారి స్నేహిత, ఏఈఓ లావణ్య, ఎఫ్ఓ సోహైల్, హరీష్ పాల్గొన్నారు. లక్ష్మీనారసింహుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శుక్రవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరిచి స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజ చేపట్టారు. అదేవిధంగా ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి అదనపు బాధ్యతలు భువనగిరిటౌన్ : జిల్లా యువజన క్రీడల శాఖ అదనపు బాధ్యతలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యామ్సుందర్ శుక్రవారం స్వీకరించారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు యువజన క్రీడల శాఖ అధికారిగా పనిచేసిన ధనుంజయ్ బదిలీ కావడంతో, తొలుత ఆ బాధ్యతలను జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్కు అప్పగించారు. ఇటీవల జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు పదవీ విరమణ పొందడంతో సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలను కూడా డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్కే కేటాయించారు. ఒకే అధికారిపై పనిభారం పెరగడంతో, కలెక్టర్ స్పందించి శ్రీనివాస్ వద్ద ఉన్న యువజన క్రీడల శాఖ బాధ్యతలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జేవీవీ కృషి ప్రశంసనీయంభువనగిరి: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జేవీవీ చేసిన కృషి ప్రశంసనీయమని డీఈఓ భిక్షపతి అన్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డీఈఓ కార్యాలయంలో శ్రీనేను ఆడపిల్లనుశ్రీ అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర జ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలు, అశాసీ్త్రయ భావాలను ఎండగట్టడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలను అన్వేషించడంలో జేవీవీ కృషి ఉందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణారెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అమరేందర్, జీసీడీఓ రాధ, సెక్టోరియల్ ఆఫీసర్ నాగిరెడ్డి శ్రీహరిఅయ్యంగార్, నాయకులు పాల్గొన్నారు. -
8.50 లక్షలకు చేరువలో జనాభా
నేడు విద్యా, శాసీ్త్రయ విజ్ఞానం అబివృద్ధి చెందడంతో యువ దంపతులు తమకు ఎప్పుడు సంతానం కావాలి. ఎంత మంది కావాలి అని నిర్ణయించుకుని తమ కుటుంబ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమ పిల్లలకు చక్కని విద్యను అందించడం ఆరోగ్యవంతమైన పరిసరాల్లో పెరిగే అవకాశం కల్పించడం తప్పనిసరి అని భావిస్తున్న తల్లిదండ్రులు దానికి తగ్గట్టుగా తమ ఆర్థిక స్థితి ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు పుట్టినట్లయితే వారి అవసరాలను తీర్చడంతమకు కష్టమని వారు గుర్తిస్తున్నారు అందుకే తక్కువ సంతానంతోనే చిన్న కుటుంబానికి పరిమితం చేసుకుంటున్నారు. భువనగిరి : ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలల్లో జనాభా పెరుగుతోంది. జనాభా పెరగడం వల్ల కలిగే సమస్యలు, సమాజం పై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. పెరుగుతున్న జనాభాతో తలెత్తే సమస్యలను వివరించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవం 1989లో ప్రారంభించింది. 8లక్షలకు చేరువులో..: 2011 జనాభా లెక్కలే ఇప్పటికి ప్రామాణికంగా ఉండగా త్వరలోనే కేంద్రం ప్రభుత్వం జనగణన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం 2024లో చేసిన కులగణన వివరాలను గతంలో వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,70,833 మంది ఉండగా ఇందులో మహిళలు 3,80,341 మంది, పురుషులు 3,90,482 మంది ఉండగా 1,88,520 కుటుంబాలు ఉన్నాయి. గత మే నెల 11 నుంచి గత నెల 9వ తేది వరకు జిలాలలో జనగణనలో భాగంగా ముందుగా ఇళ్లలను లెక్కించారు. 2027 ఫిబ్రవరిలో జనగణన సర్వే జరగనుంది. కాగా గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కులగణన లెక్కల ప్రకారం జిల్లా జనాభా 8.50 లక్షల చేరువలో ఉంది. ఫ ఏటేటా పెరుగుతున్న జనాభా ఫ 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,70,833 మంది ఫ నేడు ప్రపంచ జనాభా దినోత్సవం -
కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలి
సాక్షి, యాదాద్రి : మాజీ సీఎం కేసీఆర్కు పేరు వస్తుందన్న ఈర్ష్యతోనే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం నీటిని తెలంగాణ ప్రజలకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కన్నేపల్లి రిజర్వాయర్ నుంచి కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. మేడిగడ్డ వద్ద ఒక్క పిల్లర్ కుంగిపోతే బాగు చేయడానికి రెండున్నరేండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ బస్వాపూర్, గంధమల్లకు నీళ్లిస్తే ఇక్కడి ప్రజలు బాగుపడతారన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెబుతూ గోదావరి జలాలను ఎత్తిపోయకుండా రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి లోక్సభ ఇన్చార్జ్ క్యామ మల్లేష్, బీఆర్ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, కొలుపుల అమరేందర్, రామచంద్రారెడ్డి, నరేందర్రెడ్డి, తుంగబాలు, ఏవి.కిరణ్, శ్రీనివాస్రెడ్డి, పద్మ పాల్గొన్నారు. ఫ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నాయకుల ధర్నా -
ఐటీఐలకు కొత్త కళ
భువనగిరి, నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం సేతు) పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు (ఐటీఐలు) కొత్త ఊపునివ్వనుంది. తెలంగాణలో 15 ప్రభుత్వ ఐటీఐలను మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.757 కోట్ల పెట్టుబడులు రానుండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ–నల్లగొండ, ప్రభుత్వ బాలికల ఐటీఐ–నల్లగొండ, ప్రభుత్వ ఐటీఐ–భువనగిరి ఎంపిక కావడం విశేషం. ఈ ప్రతిపాదనలకు నాలుగో నేషనల్ స్టీరింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అత్యాధునిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. రెండు క్లస్టర్లలో జిల్లా ఐటీఐలు అపోలో మెడ్ స్కిల్స్ సంస్థ ఆధ్వర్యంలో మూడు క్లస్టర్లలో ఐటీఐలను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ పాతనగరం ప్రభుత్వ ఐటీఐ క్లస్టర్ కేంద్రంగా దీనికి అనుబంధంగా వరంగల్, నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ, వికారాబాద్ బాలికల ఐటీఐ, పంజాగుట్ట ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేస్తారు. ఈ క్లస్టర్పై రూ.241.01 కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నారు. పటాన్చెరువు ప్రభుత్వ ఐటీఐని కేంద్రంగా తీసుకుని షాద్నగర్, మార్పల్లి, నల్లగొండ ప్రభుత్వ బాలికల ఐటీఐ, భువనగిరి ప్రభుత్వ ఐటీఐలను సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. దీనికి రూ.275.24 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నారు. ఈ రెండు క్లస్టర్లలో జిల్లాలోని మూడు ఐటీఐలు ఉన్నాయి. పారిశ్రామిక అవసరాలకు కోర్సులు ప్రస్తుతం ఐటీఐల్లో ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్ వంటి సంప్రదాయ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఐటీఐలను నైపుణ్య హబ్లుగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన సాంకేతికతపై విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. ఈ నూతన కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రముఖ కంపెనీలలో వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. దీంతో భువనగిరి ఐటీఐ కళాశాల ముఖచిత్రం మారనుంది. ఇప్పటికే భువనగిరి ఐటీఐ కళాశాల పక్కనే ఐటీసీ సెంటర్ను ఏర్పాటు చేశారు. తాజా మార్పులతో ప్రస్తుతం ఉన్న పాత భవనాల స్థానంలో ఆధునిక హంగులతో నూతన భవనాలు నిర్మించనున్నారు. కొత్త కోర్సుల ప్రాక్టికల్స్ కోసం అధునాతన మెషినరీ రానుంది. పీఎం–సేతు పథకం అమలుతో ఐటీఐల్లో ఆధునిక పరిశ్రమలకు అనుగుణంగా కొత్త ట్రేడ్లు ప్రారంభం కానున్నాయి. స్మార్ట్ క్లాస్రూమ్లు, డిజిటల్ బోధన, అత్యాధునిక యంత్రాలు, ఈవీ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఏఐ, సీఎన్సీ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలతో అనుసంధానంగా అప్రెంటిస్షిప్, ఆన్–ది–జాబ్ శిక్షణ, ప్లేస్మెంట్ అవకాశాలను పెంచడంతో పాటు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫ పీఎం–సేతు పథకం కింద ఉమ్మడి నల్లగొండలోని ఐటీఐలు ఎంపిక ఫ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ఫ సరికొత్త కోర్సులు.. వెంటనే ఉద్యోగాలు -
పీఏసీఎస్ డైరెక్టర్ల ఎంపికపై ఎమ్మెల్యేను నిలదీత
గుండాల : గుండాల పీఏసీఎస్ డైరెక్టర్ల ఎంపికలో పారదర్శకత పాటించలేదని ఆరోపిస్తూ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మచ్చ కొండల్రెడ్డి పీఏసీఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను నిలదీశారు. హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను ఎందుకు ఎంపిక చేయలేదంటూ ప్రశ్నించారు. దీంతో కొండల్రెడ్డిని ఎస్సై శోభన్బాబు పక్కకు తీసుకెళ్లారు. అదేవిధంగా అనంతారం గ్రామానికి చెందిన అంజయ్య సైతం ఎమ్మెల్యేను ప్రశ్నించారు. -
90 రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, యాదాద్రి, భువనగిరి: జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలు, పట్టణాల పరిధిలో ఖాళీగా ఉన్న 90 రేషన్ దుకాణాల డీలర్ల నియామకం కోసం అధికారులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో 60 ఖాళీలు, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 30 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఏయే స్థానాలు ఏ రిజర్వేషన్లకు కేటాయించారో నోటిఫికేషన్లో స్పష్టంగా ప్రకటించారు. అర్హతలు, నిబంధనలు ఫ అభ్యర్థులు కనీసం 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి అర్హత కలిగిన వారు లభించని పక్షంలో మాత్రమే 7వ తరగతి పాసైన వారి దరఖాస్తులను పరిశీలిస్తారు. ఫ నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండి, 40 ఏళ్లు మించకూడదు. ఫ నిరుద్యోగులు, మహిళా స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీ) అర్హులు. ఫ అభ్యర్థులు ఏ చౌక ధరల దుకాణానికి దరఖాస్తు చేసుకుంటున్నారో, తప్పనిసరిగా ఆ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలోనే నివాసి అయి ఉండాలి. దివ్యాంగ అభ్యర్థులైతే సంబంధిత మండల నివాసి అయి ఉండి, ఎంపికై న తర్వాత సదరు గ్రామంలోనే నివసించాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత మాత్రం గ్రామ నివాసికే ఇస్తారు. ఫ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, మహిళా గ్రూపులకు (ఎస్హెచ్జీ) ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఫ దరఖాస్తుదారులపై ఎలాంటి నేర చరిత్రగానీ, నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు గానీ ఉండకూడదు. 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 13వ తేదీ నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 27ను ఆఖరు తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో దరఖాస్తులను స్వీకరించరు. ఫ భువనగిరి డివిజన్లో 60, చౌటుప్పల్లో 30 పోస్టులు ఫ 13 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ -
అడుగంటుతున్న గండి చెరువు
యాదగిరిగుట్ట: వేసవిలో నిండు కుండలా ఉన్న చెరువు.. వర్షాకాలంలో అడుగంటిపోతోంది. యాద గిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ కొండ దిగువన ఉన్న గండి చెరువులో నీటి మట్టం తగ్గుతోంది. గోదావరి జలాలు నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భక్తుల అవసరాలకు నీరు అందుబాటులో ఉంచాలని, గార్డెన్స్కు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు నీరు అందించాలనే ఉద్దేశంతో వేసవిలో గండి చెరువును గోదావరి జలాలతో నింపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి మే 1 వరకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల మీదుగా బస్వాపూర్లోని నరసింహ సాగర్ రిజర్వాయర్కు వచ్చే మెయిన్ కెనాల్ నుంచి నీటిని మళ్లించారు. జంగంపల్లి వద్ద ఉన్న ఓటీ–2 సబ్ కెనాల్ ద్వారా గండి చెరువులోకి 14 ఎంసీఎఫ్టీల (మిలియన్ క్యూబిక్ ఫీట్) నీటిని పంపింగ్ చేయడంతో కళకళలాడింది. ప్రస్తుతం గోదావరి జలాల సరఫరా నిలిచిపోయింది. -
కాంగ్రెస్లో కమిటీల చిచ్చు!
ఫ కొత్త అధ్యక్షుల నియామకంతో వర్గపోరు బహిర్గతం ఫ అర్వపల్లిలో కొట్టుకున్న కార్యకర్తలు ఫ మిగతా మండలాల్లోనూ అంతర్గత అసంతృప్తి ఫ ఎమ్మెల్యేల ఆధిపత్యంపై నిరసనలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకాలు ఆ పార్టీలో వర్గ పోరుకు తెరలేపాయి. పాత, కొత్త కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతల అనుచరుల మధ్య ఉన్న విభేదాలు.. ఈ నియామకాలతో బహిర్గతమయ్యాయి. పలు మండలాల్లో బహిరంగంగానే నిరసనలు, ఘర్షణలు చోటు చేసుకోగా మరికొన్ని మండలాల్లో అంతర్గతగా అసంతృప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. తుంగతుర్తిలో ఘర్షణ తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డిగూడెం, అడ్డగూడూర్, మోత్కూర్ మండలాలకు నియమించిన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గానికే చెందిన వారని సీనియర్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే వైఖరిని అధిష్టానానికి వివరించేందుకు కొందరు నాయకులు, కార్యకర్తలు బుధవారం గాంఽధీభవన్కు వెళ్తుండగా అర్వపల్లిలో ఎమ్మెల్యే అనుచరులు, సీనియర్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం గాంఽధీ భవన్ వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారిని కాకుండా ఇటీవల తనతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేసి మండల అధ్యక్షులుగా నియమించారని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి, దివంగత దామోదర్రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ మాత్రం.. మండల అధ్యక్షుల నియామక విషయంలో ఏకాభిప్రాయం కుదిరాకే ప్రకటించాల్సి ఉందని ఇటీవల టీపీసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మంత్రి ఉత్తంకుమార్రెడ్డి సూచించిన వ్యక్తికి కూడా మండల అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో కూడా ఆందోళనకు కారణమైంది. ● మద్దిరాల మండలంలో గతంలో అధ్యక్షుడిగా ఉన్న ముక్కాముల అవిలమల్లుయాదవ్ స్థానంలో పచ్చిపాల వెంకన్నయాదవ్ను నియమించారు. వెంకన్న యాదవ్.. ఎమ్మెల్యే సామేల్తో గతంలో బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే తన అనుచరుడికే పదవి కట్టబెట్టాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. సీనియర్ నాయకుడు మార్త కృష్ణమూర్తిని అధ్యక్షుడిగా చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● మోత్కూర్ మండల అధ్యక్షుడిగా రాచకొండ బాలరాజు నియామకాన్ని ముసిపట్ల గ్రామానికి చెందిన తండ సత్తయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా అధ్యక్షుడిని నియమించారని ఆరోపించారు. మునుగోడులో అంతర్గత అసంతృప్తి మునుగోడు మండలంలో బహిరంగంగా నిరసనలు వ్యక్తం కాకపోయినా.. మండల అధ్యక్షుడి ఎంపికపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కోసం పని చేసిన నాయకుడికే పదవి ఇవ్వడంతో.. రాజగోపాల్రెడ్డి వెంట బీజేపికి వెళ్లి తిరిగి వచ్చిన వారికి అవకాశం లేకపోవడం కొందరికి నచ్చ లేదని తెలుస్తోంది. కోదాడలో సీనియర్ల కినుక.. కోదాడ నియోజకవర్గంలో ఒకేసారి నాలుగు మండలాల అధ్యక్షులను మార్చడం పార్టీలో చర్చనీయాంశమైంది. కనీస సమాచారం ఇవ్వకుండా మార్చడంతో సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒంటిపులి వెంకటేష్ను కోదాడ పట్టణ అధ్యక్షుడిగా నియమించడం కూడా పార్టీలో చర్చకు దారితీసింది. బయటకు ఎవరు స్పందించకపోయినా లోలోపల అసంతృప్తి వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నర్సింగ్ విజయ్కుమార్గౌడ్ను నియమించడంతో అక్కడ వర్గపోరు బయటపడింది. మొదట మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి పేరును మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రతిపాదించినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం చొరవతో ఊట్కూరు గ్రామానికి చెందిన విజయ్కుమార్కు పదవి దక్కింది. పార్టీ నిబంధనల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళకు మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని ఉన్నప్పటికి విస్మరించారని రామేశ్వరి మట్టారెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీలో విభేదాల కారణంగా ఎమ్మెల్యే జైవీర్రెడ్డి కూడా నిడమనూరు మండల కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్ వర్గాల మధ్య విభేదాల కారణంగా ఇప్పటికీ కొన్ని మండల కమిటీల ఏర్పాటు కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దామరచర్ల, మిర్యాలగూడ రూరల్, టౌన్ కమిటీలో ఇరువర్గాలు పోటీపడుతున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకంలో రెండు వర్గాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎమ్మెల్యే నిర్ణయంతో మాజీ ఎంపీపీ దూదిపాల రేఖశ్రీధర్రెడ్డి వర్గానికి చెందిన నేతలకు పదవి కేటాయించినట్లు చర్చ జరగుతోంది. దీంతో పార్టీలో పలువురు నాయకులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ బహిరంగంగా స్పందించడం లేదు. -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తులకు హారతినిస్తున్న అర్చకులు -
నేడే చేనేత ఎన్నికలు
భూదాన్పోచంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహకార సంఘాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవమైన సంఘాలు పోను మిగిలిన 28 సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 725 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 సంఘాలకు 539 మంది, నల్లగొండ జిల్లాలోని 9 సంఘాలకు 175 మంది, సూర్యాపేట జిల్లాలో 1 సంఘానికి 11 మంది బరిలో ఉన్నారు. యాదాద్రి జిల్లాలో ఎన్నికలు జరిగే సంఘాల్లో మొత్తం 5818 మంది ఓటర్లు, నల్లగొండ జిల్లాలో 2,851 మంది ఓటర్లు, సూర్యాపేట జిల్లాలో 230 మంది ఓటర్లు మొత్తం 8,899 మంది ఓటర్లు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓటు హక్కు కలిగిన ఓటర్లకు సంఘం గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు జరిగే సంఘాలు ఇవే.. భూదాన్పోచంపల్లి , భువనగిరి, బండసోమారం, ఆత్మకూర్ (ఎం) మండలం రహీంఖాన్పేట మార్కండేయ సొసైటీ, యాదగిరిగుట్ట ఎస్ఎల్ఎన్ఎస్ సిల్క్ సొసైటీ, వలిగొండ మండలం వెల్వర్తి సంఘం, చౌటుప్పల్, కొయ్యలగూడెం, కుంట్లగూడెం, నేలపట్ల, నారాయణపురం, పుట్టపాక శ్రీభావనారుషి సొసైటీ, పుట్టపాక సిల్క్సొసైటీ, రామన్నపేట మండలం భోగారం, సిరిపురం, జనంపల్లి, వెంకటరమణ సొసైటీ, వెల్లంకి, మోత్కూర్, నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి, నార్కట్పల్లి మండలం మాండ్ర, గట్టుప్పల్, గట్టుప్పల్ ధనలక్ష్మి సొసైటీ, మునుగోడు, పలివెల, పలివెల బాలాజీ సిల్క్ సొసైటీ , చండూర్, మర్రిగూడ మండలం వట్టిపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి. రహస్య పద్ధతిలో పోలింగ్ ప్రతి చేనేత సంఘంలోని 7 జనరల్, 2 మహిళా రిజర్వు మొత్తం 9 డైరెక్టర్ స్థానాలకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. జనరల్ అభ్యర్థులకు తెలుపు రంగు, మహిళా రిజర్వు అభ్యర్థులకై తే పింక్ రంగు బ్యాలెట్ పత్రం ఇస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కోరం ఉంటే పోలింగ్ జరిగిన 3 రోజుల లోపు ఎప్పుడైనా ఎన్నికై న 9 మంది డైరెక్టర్ల నుంచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి, కోశాధికారిని చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు. ఒక్క ఓటు ఎక్కువైనా చెల్లదు జనరల్ స్థానాలలో పోటీ చేస్తున్న డైరెక్టర్ల అభ్యర్థుల బ్యాలెట్ పత్రంలో గరిష్టంగా 7, లేదా అంతకంటే తక్కువ మందికి ఓటు వేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ ఏడుగురి ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వేసినా అది రద్దవుతుంది. అలాగే రెండు మహిళా స్థానాల బ్యాలెట్లో రెండు, లేదా ఒకరికి ఓటు వేసినా చెల్లుతుంది. కానీ రెండుకంటే ఒక్క ఓటు ఎక్కువైనా చెల్లదు. ఫ ఉమ్మడి జిల్లాలో 28 సంఘాలకు ఎన్నికలు ఫ ఉదయం 7నుంచి 3గంటల వరకు పోలింగ్ ఫ పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి -
డిసెంబరే డెడ్లైన్
నిర్దేశించిన గడువులోగా ఎయిమ్స్ పూర్తి కావాల్సిందే : కేంద్ర మంత్రి నడ్డాసాక్షి, యాదాద్రి : బీబీనగర్ ఎయిమ్స్ పనులన్నీ ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్నాటికి పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు. గురువారం ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డితో కలిసి బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించారు. ఎయిమ్స్ ప్రగతిపై ఎంపీలు, ఎయిమ్స్ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ బీబీనగర్ ఎయిమ్స్ ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ చాలా పట్టుదలగా ఉన్నారని, ఇప్పటి వరకు సుమారు 85శాతం పనులు పూర్తయ్యాయని అయితే పనుల్లో జాప్యం అవుతోందని, ఇప్పటికే రెండుసార్లు డెడ్లైన్ పొడిగించామని, మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. పనుల పురోగతి పర్యవేక్షణకు ప్రతి రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక సెక్రటరీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్లో కేవలం 100 నుంచి 150 పడకలతోనే సేవలు అందుతున్నాయని,బడ్జెట్ పరంగా , వైద్య పరికరాల కొనుగోలు పరంగా ఎలాంటి కొరత లేదని, భవన నిర్మాణాలు పూర్తి కాక అధునాతన వైద్య పరికరాలను కొనుగోలు చేసి అమర్చలేకపోతున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం అందించాలని వినతి ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఊట్కూరి అశోక్గౌడ్, చందా మహేందర్గుప్తాలు .. కేంద్రమంత్రి జేపీ నడ్డాకు వినతిపత్రం అందజేశారు. జారి కిందపడిన పలువురికి గాయాలు ఎయిమ్స్ అకడమిక్ భవన్లోకి వస్తున్న పలువురు జారి కిందపడి గాయాలపాలయ్యారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ పక్కన టైల్స్పై ఉప్పు కలిపిన రంగులు అందంగా అలంకరించారు. వీటిపైఅడుగు వేసిన వెంటనే సెక్యూరిటీ అధికారులు, కెమెరామెన్లు, జర్నలిస్టులు, బీజేపీ నాయకులు కిందపడ్డారు. ఓ టీవీ కెమెరామన్ కెమెరా కిందపడి పగిలిపోయింది. అందని అత్యవసర వైద్యం కేంద్ర మంత్రి నడ్డా అత్యవసర విభాగాన్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా అక్కడికి అత్యవసర వైద్యం కోసం వచ్చి రోగి నిరీక్షించాల్సి వచ్చింది. ఫ బీబీనగర్ ఎయిమ్స్పై ప్రధాని పట్టుదలగా ఉన్నారు ఫ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులపై సీఎంతో మాట్లాడుతా ఫ ఎంపీలు, అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష ఎయిమ్స్ పాత భవన సముదాయంలో ప్రారంభం కావడం వల్ల, వాటిని ఎయిమ్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం ఇబ్బందిగా మారిందని సమావేశంలో చర్చకు వచ్చింది. కార్డియాలజీ వంటి కొన్ని విభాగాల్లో తగిన స్థలం లేకపోవడం, నెఫ్రాలజీ విభాగంలో తగినన్ని డయాలసిస్ మిషన్లు లేకపోవడం వంటి సమస్యలను కూడా త్వరలోనే అధిగమిస్తామని అధికారులు మంత్రికి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఎయిమ్స్ డైరెక్టర్ అమిత అగర్వాల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ విజ్యనేత్ర, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, చామల కిరణ్కుమార్రెడ్డి, బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, మాజీ ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి ఉన్నారు. -
పారదర్శకంగా భూముల రీ సర్వే
సాక్షి, యాదాద్రి : భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే, భూముల నక్షా తదితర అంశాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీ లో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డు అధికారి సుజాత పాల్గొన్నారు. నేడు విద్యా సంస్థల బంద్భువనగిరి: విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్వహించే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డీ. సలీం గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల విలీనం, మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పెండింగ్లోఉన్న స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి సాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈ సదస్సులో ఉప కమిషనర్ సరిత, జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ ఈఓ బాధ్యతల స్వీకరణయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో డిప్యూటీ ఈఓగా దోర్భాల భాస్కర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. యాదగిరి దేవస్థానం డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహించిన నవీన్ కుమార్ వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గతంలో డిప్యూటీ ఈఓగా పనిచేసిన భాస్కర్ శర్మ వచ్చారు. ఈ ఏడాది మార్చి 30న వేములవాడ శ్రీరాజరాజేశ్వరి దేవస్థానానికి వర్కింగ్ అరెంజ్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ ఈఓ హోదాలో దోర్భాల భాస్కరశర్మ బదిలీపై వెళ్లారు. డిప్యూటీ ఈఓ నవీన్ కుమార్ను దేవాదాయశాఖ అధికారులు రాజరాజేశ్వరి దేవస్థానానికి బదిలీ చేయడంతో తిరిగి ఆ స్థానంలో భాస్కర్ శర్మ బాధ్యతలు తీసుకున్నారు. -
త్వరలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సేవలు
చౌటుప్పల్ : చౌటుప్పల్లో త్వరలోనే అదనపు జూనియర్ సివిల్జడ్జి కోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు తెలిపారు. నూతనంగా మంజూరైన అదనపు జూనియర్ సివిల్జడ్జి కోర్టు ఏర్పాటు కోసం గురువారం చౌటుప్పల్లోని జూనియర్ సివిల్జడ్జి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న భవనంలోని బార్ అసోసియేషన్ చాంబర్.. కోర్డు హాలుకు అనువుగా ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం అంగీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరి పరమేష్, మాజీ అధ్యక్షులు ఎలమోని శ్రీనివాస్, బాల్యం వెంకటాచలపతి, న్యాయవాదులు మక్తల నర్సింహ, జెల్ల రమేష్, ఎండి.ఖయ్యూం, పరమేష్, రవీందర్, కట్టెల లింగస్వామి, ఏఓ రామకోటి, చంద్రిక, అమర్బిన్ నాసిర్ పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు -
వైటీడీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం రేపే
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(వైటీడీ) పాలకమండలి, ఎక్స్అఫీషియో సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని ఆలయ ఈఓ భవానీ శంకర్ తెలిపారు. గురువారం ఈఓ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శనివారం ఉదయం 11.37 గంటలకు ఆలయ ముఖ మండపంలోని గర్భాలయం బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు. పాలకమండలి చైర్మన్ ఎం. సత్యనారాయణరెడ్డితో పాటు సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, విజయేందర్ తూళ్ల, పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం. రాఘవేందర్రావు, లక్ష్మీనారాయణనాయక్, వ్యవస్థాపక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో పాటు ఎక్స్అఫీషియో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తామని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించామన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కొండకు దిగువన ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు ఈఓ భవానీ శంకర్ తెలిపారు. టీటీడీ తరహాలో అభివృద్ధి చేయాలి.. యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో అభివృద్ధి చేయాలని నూతన చైర్మన్తో పాటు సభ్యులను సీఎం రేవంత్రెడ్డి కోరినట్లు ఈఓ వెల్లడించారు. క్యూలైన్లలో నిల్చునే భక్తులకు అర్థగంట సమయంలోనే స్వామివారి దర్శనం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారన్నారు. దర్శనానికి సంబంధించిన టైమ్ స్లాట్స్ను పక్కాగా అమలు చేయాలని సూచించినట్లు ఈఓ పేర్కొన్నారు. కొండ కింద ప్రత్యేక బస్ షెల్టర్లు.. భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం మరింత మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఈఓ తెలిపారు. కొండకు దిగువన తులసీ కాటేజీ, వైకుంఠద్వారం వద్ద, సెంట్రల్ పార్కింగ్ చెంత బస్ షెల్టర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. అంతేకాకుండా అవసరమైతే రాయగిరి కమాన్ వద్ద బస్ షెల్టర్లు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి యాదగిరి కొండపైకి ఉచితంగా బస్సులను నడిపించేందుకు ఆలోచిస్తున్నామన్నారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో తొలి సమావేశం వివరాలు వెల్లడించిన ఆలయ ఈఓ భవానీ శంకర్ -
రాంగ్ రూట్తో పొంచి ఉన్న ప్రమాదం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలో, యాదగిరి కొండ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డులో వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్తుండడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అయినప్పటికీ వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. గురువారం ఉదయం టెంపుల్ సిటీకి వెళ్లే దారిలో ఉన్న సర్కిల్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట వైపు వెళ్తున్న ట్రాక్టర్ రాంగ్ రూట్లో వస్తూ కనిపించింది. అదే సమయంలో యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వైపు వాహనాలు వెళ్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి రాంగ్రూట్లో వెళ్లే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
జూదరులపై కేసు నమోదు
రామన్నపేట : మండలంలోని వెల్లంకి గ్రామంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గురువారం ఎస్ఐ జి. సతీష్ తెలిపారు. బుధవారం రాత్రి వెల్లంకిలోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు దాడి చేయగా.. నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారియేందుకు యత్నించారని, వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వారి నుంచి రూ.1800 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. నిర్మానుష్య ప్రాంతంలో పశువుల అవశేషాలు చిట్యాల : మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నార్లగుట్ట సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గురువారం పశువుల అవశేషాలు లభ్యమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు గోవధ చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అవశేషాలను సంచుల్లో మూటకట్టి నార్లగుట్ట సమీపంలో సిమెంటు గూనల్లో దాచి ఉంచారు. గురువారం ఆ ప్రాంతంలో దుర్వాసన రావటంతో పలువురు సిమెంటు గూనలను పగులగొట్టి చూడగా అందులో పశువుల అవశేషాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చికిత్స పొందుతూ మృతి చౌటుప్పల్ : ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన రావుల శ్రీశైలం(33) గత నెల 28న ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పొలం వద్దకు బయల్దేరాడు. పొలం సమీపంలోకి వెళ్లగానే అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. వ్యక్తి అదృశ్యం చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండల కేంద్రానికి చెందిన బొప్పని దానియేలు ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించడంలేదని అతడి కుమారుడు మధు గురువారం చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన దానియేలు తిరిగి రాలేదని, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. ఆచూకీ తెలిసిన 87126 86031 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం చిట్యాల : చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, తెలుపు, నలుపు రంగుల చెక్స్ షర్ట్, నీలం రంగు ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. అతడి కుడి చేతిపై అశోక చక్రం, చేతిముద్ర పచ్చబొట్టు, కుడి చేతి పిడికిలిపై పచ్చబొట్టు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని నల్ల గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, వివరాలు తెలిసిన వారు 87126 70187 నంబర్కు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు. -
ఎస్పీ కార్యాలయం ప్రహరీ సమీపంలో నెమలి కళేబరం
● ఖననం చేసిన అటవీ శాఖ అధికారులు నల్లగొండ : పట్టణంలోని ఎస్పీ కార్యాలయం ప్రహరీ సమీపంలో గురువారం ఉదయం జాతీయ పక్షి నెమలి కళేబరం లభ్యమైంది. ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫుట్పాత్పై నెమలి చనిపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రవీందర్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు చనిపోయిన నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని ఖననం చేశారు. లతీఫ్సాహెబ్ గుట్ట ప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చిన నెమలి ట్రాన్స్ఫార్మర్ సమీపంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణలో ఏడుగురి బైండోవర్హుజూర్నగర్ : హుజూర్నగర్లో గత సోమవారం ఇరువర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఏడుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా గురువారం వారిని స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. తిరిగి ఎక్కడైనా అల్లర్లకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్) ఎదుట ఒక్కొక్కరిని రూ.2 లక్షల చొప్పున సంవత్సర కాలానికి బైండోవర్ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా, బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. -
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
చౌటుప్పల్ : ఒంటరి జీవితంపై విరక్తితో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చింతల రాజశేఖర్రెడ్డి(35) తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే మృతిచెందారు. రాజశేఖర్రెడ్డి ఒక సోదరుడు ఉండగా.. అతడు తన కుటుంబంతో కలిసి చౌటుప్పల్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. రాజశేఖర్రెడ్డి ఒక్కడే గ్రామంలో ఒంటరిగా ఉంటూ డ్రైవర్గా పనిచేసస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజులుగా అతడు కనిపించకపోవడం, ఇంటి తలుపులు లోపలి నుంచి పెట్టి ఉండడంతో చుట్టుపక్కల వారు గురువారం ఉదయం ఇంట్లోకి వెళ్లి చూడగా.. గదిలో ఇంటి పైకప్పుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒంటరిగా జీవిస్తుండడంతో పాటు వివాహం జరగకపోవడంతో మవస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. మృతుడి బావ గంగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
పిల్లలను చిత్రహింసలకు గురిచేసిన తల్లిదండ్రులపై కేసు
హుజూర్నగర్ : తమ స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నారని పిల్ల లను చిత్రహింసలకు గురిచేసిన తల్లిదండ్రులపై హుజూర్నగర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నకిరేకంటి రవికి 24 ఏళ్ల క్రితం శైలజతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం రవి, శైలజ విడిపోయారు. ఆ తర్వాత శైలజ వేరే వ్యక్తిని వివాహమాడింది. నాలుగేళ్ల క్రితం రవి.. ఇందు అలియాస్ అఖిలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అఖిలకు కూడా అప్పటికే వివాహం జరగగా.. ఆమెకు ధనుష్(5) అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత రవి, అఖిలకు కుమారుడు హేమంత్(2) పుట్టాడు. ప్రస్తుతం రవి, అఖిల దంపతులు పిల్లలు హేమంత్, ధనుష్తో కలిసి హుజూర్నగర్ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నివాసముంటున్నారు. రవి లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా.. అఖిల కూలీ పనికి వెళ్తుంది. వీరిద్దరి స్వేచ్ఛకు పిల్లలు అడ్డుగా ఉన్నారనే ఉద్దేశంతో వారిని విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ నరేష్ చిన్నారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ నిర్మల ఫిర్యాదు మేరకు రవి, అఖిల దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరు చిన్నారులను సూర్యాపేటలోని ప్రభుత్వ బాలల సురక్షా కేంద్రానికి తరలించారు. బాలల సురక్షా కేంద్రానికి చిన్నారుల తరలింపు -
‘క్రిప్టో’లో పెట్టుబడి పేరుతో మోసం
ఆలేరు : ‘ఒక్క ఐడీతో మీ జీవితం మారిపోతుంది.. మూడేళ్లలో మూడు రెట్ల లాభం.. రోజూ డాలర్లలో ఆదాయం’ అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలతో పరారైన భారీ క్రిప్టో పెట్టుబడి మోసం ఆలేరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 500 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడీ క్రియేషన్కు రూ.3.20 లక్షలుహైదరాబాద్లోని రామంతాపూర్కు చెందిన గౌస్ 2023 ఫిబ్రవరిలో ఆలేరు ప్రాంతంలో ‘యూనిటీ మెటా క్రిప్టో’ పేరుతో పెట్టుబడి పథకాన్ని ప్రారంభించాడు. ఒక్కో ఐడీ క్రియేట్ చేయడానికి రూ.3.20 లక్షలు వసూలు చేశారు. ఆ మొత్తానికి 1,167 క్రిప్టో కాయిన్లు ఇస్తామని, వాటిని సేఫ్పాల్ యాప్లో స్టేక్ చేస్తే రోజూ 10 కాయిన్లు వస్తాయని నమ్మబలికారు. ఆ కాయిన్లను ‘కాయిన్ స్టోర్’ ఎక్స్ఛేంజ్లో ఒక్కోటి 6 నుంచి 10 డాలర్లకు విక్రయించుకోవచ్చని ఆశ చూపారు. ఈ మాయమాటలు నమ్మిన ఆలేరు పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన వందలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు, వ్యాపారులు తమ డబ్బును ఇందులో పెట్టుబడిగా పెట్టారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇళ్ల నిర్మాణం కోసం దాచుకున్న డబ్బుతో కొందరు రెండు, మూడు ఐడీలు సైతం తీసుకున్నారు. గౌస్ బంధువు అవుతాడని భావిస్తున్న ఓ ప్రభుత్వ అధికారి (యూనిఫాం సర్వీస్) ఈ నెట్వర్క్ విస్తరణలో కీలకపాత్ర పోషించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మోసంనిజానికి ఈ స్కీం కార్యకలాపాలు 2024 సెప్టెంబర్లోనే నిలిచిపోయినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టిన నిర్వాహకుడు గౌస్, ఆ తర్వాత కూడా కొత్త సభ్యుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి తన వద్ద ఉన్న పాత కాయిన్లనే వారికి అంటగట్టాడు. 2025 మే 21 నాటికి తమ వద్ద ఉన్న కాయిన్లకు మార్కెట్లో ఎలాంటి విలువ లేదని గుర్తించిన బాధితులు నిర్వాహకుడిని నిలదీశారు. 2025 డిసెంబర్ 31లోగా పెట్టుబడులన్నీ తిరిగి చెల్లిస్తానని అతడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత గడువు దాటవేస్తూ కాలయాపన చేశాడు. చివరకు, ఈ ఏడాది ఏప్రిల్లో ‘5 స్టార్, 7 స్టార్ అచీవర్లే తమ కింద చేరిన సభ్యుల డబ్బులు చెల్లించాలి’ అంటూ కంపెనీ సీఈఓ పేరిట వాయిస్ మెసేజ్ విడుదలైంది. ఏప్రిల్ 10 నుంచి గౌస్ కనిపించకుండా పోయాడు. ఆర్థిక సంక్షోభంలో 500 కుటుంబాలుఈ మోసం కారణంగా సుమారు 500 కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. లాభాల ఆశతో బ్యాంకు రుణాలు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వారంతా ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం ఆలేరు పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులు ఎండీ మహమూద్, బూషిగంపల శ్రీశైలం, సుంకరి ప్రదీప్గౌడ్, పల్లెకడి శివకుమార్గౌడ్, వి. రవీందర్ తదితరులు తమ గోడును వివరించారు. రూ.10 కోట్లతో ఉడాయించిన నిర్వాహకుడు ‘యూనిటీ మెటా క్రిప్టో’ పేరిట 500 మందికి కుచ్చుటోపీ పరారీలో ప్రధాన నిందితుడుడీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు ఈ వ్యవహారంపై మే 13న బాధితులు ఆలేరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు గౌస్, అతడి భార్య వజీదాపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు పలుమార్లు జిల్లా ఎస్పీ అక్షాంశ్యాదవ్ను కలిసి తమ సమస్యను వివరించారు. జూన్ 18న డీజీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.క్రిప్టో కాయిన్ పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు గౌస్, అతడి భార్యపై కేసు నమోదు చేశాం. వజీదాను రిమాండ్కు తరలించగా, ప్రస్తుతం ఆమె బెయిల్పై విడుదలయ్యారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు గౌస్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం. – యాలాద్రి, సీఐ, ఆలేరు -
అరచేతిలో హైవే సమాచారం
చిట్యాల : 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి అవసరమైన సేవలను, సమాచారాన్ని క్షణాల్లో అందించే దిశగా నేషనల్ హైవే అధికారులు శ్రీకారం చుట్టారు. చిట్యాల మండల పరిధిలో హైవేపై క్యూఆర్ కోడ్లతో కూడిన డిజిటల్ సమాచార బోర్డులను రహదారి నిర్వహణ బాధ్యతలను చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ(సరన్ కన్స్ట్రక్షన్ కంపెనీ) ఏర్పాటు చేస్తోంది. చిట్యాల మండల పరిధిలో హైవే వెంట గ్రామాలు, బ్లాక్ స్పాట్ల వద్ద, ట్రక్ బే ఉన్న చోట ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ క్యూఆర్ కోడ్ను మొబైల్లో స్కాన్ చేయగానే హైవే నిర్వహణ కాంట్రాక్ట్ సంస్థ వివరాలు, మొత్తం దూరం, టోల్ప్లాజాల వివరాలు, టోల్ ప్లాజాల మేనేజర్ నంబర్లు, హోటళ్లు, దాబాలు, పంక్చర్ షాపులు, టాయిలెట్స్, విశ్రాంతి కేంద్రాల సమాచారం, దూరం వంటి వివరాలు తెలుస్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు సంప్రదించాల్సిన హైవే అధికారుల టోల్ ఫ్రీ నంబర్లు, అంబులెన్స్, పోలీస్ స్టేషన్లు, హైవే పెట్రోలింగ్ సేవలు, దగ్గరలో ఉన్న పట్టణాల సమాచారం లభిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణించేవారికి క్యూఆర్ కోడ్ సమాచార వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. చిట్యాల పరిధిలో హైవేపై క్యూఆర్ కోడ్లతో కూడిన బోర్డుల ఏర్పాటు -
భూ భారతి సర్వర్ స్లో
భువనగిరి: భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. వారం రోజుల క్రితమే మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ, సర్వర్లో తలెత్తిన లోపాల కారణంగా రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో ప్రతిరోజూ క్రయవిక్రయదారులు తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చి, సాయంత్రం వరకు ఎదురుచూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు వెళ్లి ఆరా తీయడం.. సర్వర్ రావడం లేదని ఆయన చెప్పడం నిత్యకృత్యంగా మారింది. ఉదయం.. సాయంత్రం కొద్దిగా పనిచేసి..గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూభారతిని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రాష్ట్రస్థాయిలో భూభారతి సర్వర్ను అప్డేట్ చేసినప్పటి నుంచి ఈ సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా 17 తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. సర్వర్ల సమస్య కారణంగా 510 భూ క్రయవిక్రయ దరఖాస్తులు పెండింగ్లో పడినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సర్వర్ ఉదయం 10లోపు, తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే కొద్దిగా పనిచేస్తోందని క్రయవిక్రయదారులు చెబుతున్నారు.మీ సేవలో స్లాట్ బుకింగ్చేసుకున్న క్రయవిక్రయ దారులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కోసం పడిగాపులు కాస్తున్నారు.సర్వర్ పనిచేయక భువనగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీగా కూర్చున్న అధికారిభువనగిరి తహీల్దార్ కార్యాలయం వద్దపడిగాపులు కాస్తున్న రైతులుఫ తహసీల్దార్ కార్యాలయాల్లో నిలిచిన రిజిస్ట్రేషన్లు ఫ వారం రోజులుగా సాంకేతిక సమస్య ఫ క్రయవిక్రయదారుల పడిగాపులు ఫ 510 దరఖాస్తులు పెండింగ్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
గుండాల : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్ను కలెక్టర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు. మోడల్ స్కూల్లోని స్టోర్ రూమ్లో కూరగాయలపై ఈగలు వాలుతుండటంతో ప్రిన్సిపాల్ రాములును మందలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను శుభ్రంగా ఉంచాలని, కూరగాయలను స్టోర్ చేసేందుకు టేబుల్ ఏర్పాటు చేయాలని, సరుకులు తాజాగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నారా ? అని ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నిర్మిస్తున్న ప్రహరీ వివరాలను ఎస్ఓ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కేజీబీవీలో 6వ తరగతిలోకి వెళ్లి బాలికలచే పాఠాలు చదివించారు. అనంతరం మోడల్ స్కూల్ ముందు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో మరుగు దొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం సీ్త్ర నిధులు వచ్చినా ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదని ప్రిన్సిపాల్ను అడిగారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు గుడిసెలు ఉన్నవారిని ఎంపిక చేయాలన్నారు. ఆయన వెంట డీఈఓ బొల్లారం భిక్షపతి, తహసీల్దార్ ఎస్.హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, ఏఈలు దామోదర్, కావ్యశ్రీ, ఎంఈఓ అగ్గిరాములు, ఎస్ఓ విజయలక్ష్మి, సర్పంచ్ దేవనబోయిన అయిలయ్య ఉన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
180 చెక్బౌన్స్ కేసుల గుర్తింపు
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా 976 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో మొదటి విడతగా దాదాపు 180 కేసులను పరిష్కారం కోసం గుర్తించినట్లు నిమిత్తం గుర్తించామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, సంస్థ కార్యదర్శి వి. మాధవీ లత మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈనెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకేసులకు సంబంధించిన కక్షిదారులకు ఇప్పటికే ఎలక్ట్రానిక్ మోడ్లో నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. కక్షిదారులకు అవసరమైన తగిన న్యాయ సహాయం, సేవలు అందించేందుకు భువనగిరి, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి కోర్టులలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, ఇదే తరహాలో రెండవ ప్రత్యేక లోక్ అదాలత్ను తిరిగి ఈ ఏడాది నవంబర్ 21వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంఆత్మకూరు(ఎం): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ అక్షాంశ్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. రికార్టులు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నేర పరిశోధనలో పోలీస్లు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ ఎన్. లక్ష్మీనారాయణతో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. డిప్యూటీ ఈఓ నవీన్ బదిలీ..? యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి బదిలీ అయినట్లు సమాచారం. ఆయన స్థానంలో గతంలో యాదగిరి క్షేత్రంలో డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహించిన దోర్భాల భాస్కర్ శర్మ తిరిగి రానున్నట్లు ఆలయ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. ఈ ఏడాది మార్చి 30వ తేదీన వేములవాడ శ్రీరాజరాజేశ్వరి దేవస్థానానికి వర్కింగ్ అరేంజ్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ ఈఓ హోదాలో దోర్భాల భాస్కరశర్మ బదిలీపై వెళ్లారు. నాలుగు నెలల తరువాత డిప్యూటీ ఈఓ నవీన్ కుమార్ను దేవాదాయశాఖ అధికారులు బదిలీ చేయడంతో తిరిగి ఆ స్థానంలో డిప్యూటీ ఈఓ హోదాలో తిరిగి భాస్కర్ శర్మ రానున్నట్లు తెలిసింది. వారం రోజులుగా నవీన్ కుమార్ సెలవుల్లో ఉన్నారు. బదిలీకి సంబంధించిన ఉత్తర్వుల ప్రకటన దేవాదాయశాఖ నుంచి అధికారికంగా రావాల్సి ఉంది. మండలానికి, మున్సిపాలిటీకి వేర్వేరుగా తహసీల్దార్లు మిర్యాలగూడ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి మున్సిపాలిటీలతో పాటు నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు, మున్సిపాలిటీకి ప్రభుత్వం వేర్వేరుగా తహసీల్దార్లను నియమించాలనే ఆలోచన చేస్తోంది. ఆయా చోట్ల ఒక్క తహసీల్దార్ ఉండడంతో పనులన్నీ పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో రెవెన్యూ కార్యాలయం ఒక్కటే ఉన్నా.. ఒకరు గ్రామీణ ప్రాంతాలు, మరొకరు మున్సిపాలిటీని చూసుకునేలా ఇద్దరు తహసీల్దార్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. క్షేత్రపాలకుడికి ఆకుపూజయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన జరిపారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు.


