breaking news
Yadadri District News
-
పల్లెల్లో స్మార్ట్ ప్రచారం
హాలియా : గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో గ్రామాల్లో రచ్చబండ వద్ద స్థానికులు సమావేశమై సమస్యలు, అభివృద్ధితో పాటు ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై మాట్లాడుకునే వారు. పోటీ చేసే వారు సైతం రచ్చబండ వద్దకే వచ్చి తమ అజెండా, హామీలను వివరించేవారు. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి, ప్రధాన సమస్యలేమిటనే విషయాన్ని కూడా గ్రామ వాట్సాప్ గ్రూపుల్లోనే చర్చిస్తున్నారు. అభ్యర్థులు తమ అజెండాను స్థానిక గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ, ఫోన్లో స్టేటస్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. భువనగిరి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు స్మార్ట్ఫోన్లతో ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. గతంలో కరపత్రాలు, వాల్పోస్టర్లు, వాల్పెయింటింగ్తో ప్రచారం నిర్వహించేవారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను ఇస్తూ వాల్పోస్టర్లను గోడలకు అతికించేవారు. కానీ ఇప్పుడు సర్పంచ్తో పాటు వార్డు సభ్యుల పోటీదారులు సోషల్ మీడియానే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్లో పోస్టులు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే కొంత మంది ఆశావహులు తాము ఈ సారి ఎన్నికల బరిలో ఉంటున్నామంటూ సోషల్మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టారు. ఇక నోటిఫికేషన్ రాగానే విస్తృతంగా ప్రచారాన్ని ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో నిత్యం పోస్టులు పెడుతూ ప్రచారం ముమ్మురం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓటర్ల ఫోన్ నంబర్లను తెలుసుకుని ప్రతిరోజూ ప్రచారం వీడియోలను, తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న పోటోలను పంపిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తారో ఆ విషయాన్ని కూడా పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నారు. తమ కుల సంఘాల వారికి ఫోన్లు చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. స్టేటస్గా ప్రచార వీడియోలు సర్పంచ్, వార్డు సభ్యుల పోటీదారులు తమను గెలిపించాలని కోరుతున్న వీడియోలను తమ అనుచరుల ఫోన్లలో స్టేటస్ పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యువకులు ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయగా ఆయా గ్రామాల గ్రూపులలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో తాము చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎడిట్ చేసి వాటికి బ్యాగ్గ్రౌడ్ పాటలను సెట్ చేసి మరీ పంపిస్తున్నారు. మరి కొందరు అభ్యర్థులు ఇప్పటికే తమ పేరు మీద ప్రత్యేకంగా పాటలను రాయించుకొని మరీ ప్రచారంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల వరకు కొంత మంది యువకులతో కమిటీ వేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఫ సోషల్మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ఫ పంచాయతీలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఫ తమను గెలిపించాలంటూ పోస్టులు, వీడియోలు -
క్రీడాకారులు దేశం గర్వించేలా రాణించాలి
హాలియా : క్రీడాకారులు దేశం గర్వించేలా రాణించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాలియా పట్టణంలోని టైం స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 51వ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి అండర్– 20 బాలికల కబడ్డీ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలు ఈ ప్రాంతంలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేష్ ముదిరాజ్, మద్ది మహేందర్రెడ్డి, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూలోకరావు, కర్తయ్య, హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్రెడ్డి, నాయకులు కాకునూరి నారాయణ గౌడ్, టైం స్కూల్ డైరెక్టర్ మందా నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి -
హామీ పత్రం
తుర్కపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. తుర్కపల్లి మండలంలోని రుస్తాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండాపురం శ్రీహరికుమార్ తాను గెలిస్తే చేసే పనులను బాండ్ పేపర్పై రాసి ప్రజలకు దాని ప్రతులు అందిస్తున్నారు. ప్రజ లకు ఉచిత మంచినీటిసరఫరా, బస్టాప్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఆరోగ్య కేంద్రం, పశువుల దవాఖాన నిర్మాణంతో పాటు 15 అంశాలతో కూడిన హామీ పత్రాన్ని విడుదల చేశాడు. ఈ పనులను 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానంటూ ప్రకటించిన హామీ పత్రాన్ని ప్రచురించి ప్రజలకు అందిస్తున్నాడు. -
నాడు సర్పంచ్.. నేడు కూలీ
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి ఐదేళ్లు సర్పంచ్గా పనిచేసిన మాదగాని నాగమ్మ ప్రస్తుతం వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. తన హయాంలో గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అయినా రూపాయి కూడా సొంతానికి వినియోగించుకోకుండా నిధులను గ్రామానికే ఖర్చు చేశారు. కాసర్లపహాడ్ సర్పంచ్ మాదగాని నాగమ్మది నిరుపేద కుటుంబం. 2014లో ఆమెను గ్రామస్తులు సర్పంచ్గా నిలబెట్టించి మరీ గెలిపించారు. 2019 వరకు ఐదేళ్లు సర్పంచ్గా పనిచేశారు. నిరక్షరాస్యురాలైనప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తూ గ్రామంలో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్, పల్లె దవాఖాన, బోర్లు పైప్లైన్ నిర్మాణం చేయించారు. సర్పంచ్ కాకముందుకు ఉన్న పాత రేకుల ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జీవనోపాధి కోసం ఉపాధి పనులతో కూలీగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వితంతు పింఛన్తో కాలం వెల్లదీస్తున్నారు. -
ఎవల్ నిలబడుతుండ్రే..
మల్లయ్య తాత గజగజ వణికే చలిలో పొద్దుగాల లేచి నెత్తికి రుమాలు సుట్టుకొని, కంబళి కప్పుకొని, నోట్లో యాప పుల్లేసుకొని పండ్లు తోముకుంటూ చేతిలో కర్రతో నిమ్మలంగా నడుసుకుంటూ పోయి నడూళ్ల గుడిబండ కాడ కూకుండు. చిత్తుకాగితాలు ఏరి కుప్పగాపోసి కీస నుంచి అగ్గిపెట్టెగీరి చలిమంటకాగుతున్నడు. ఇంతలో అట్నుంచి పోతున్న నర్సయ్యను చూసి ఏమోయ్.. మనవడా గిట్రా అని పిలిచిండు. నర్సయ్య.. మల్లయ్య తాత దగ్గరికొచ్చి కూసుండు. అప్పుడు.. మల్లయ్య తాత : ఏమోయ్ మనవడా గిప్పుడు ఓట్ల పండ్గొచ్చిందిగా మనూళ్లె పెసిడెంట్గా ఎవలెవలు నిలబడ్తరంట నర్సయ్య : యాద్గిరి కొడ్కు నవీన్ లేడు ఎలచ్చన్ల నిలబడ్తడంట.. గా పిల్గాడు పట్నంల బాగా సదువుకుండంట. పిల్గాడు మంచోడేనంట మల్లయ్య : పుల్లయ్య కొడుకు సోమయ్యగూడా పోటీజేత్తడంట. గియ్యాల నామినేషన్ ఏస్తడంట. గా పిల్గాని దగ్గర పైసల్ మస్తుగున్నయంట. ఖర్చు బానే పెడ్తడంట. ఇంతలో.. అట్నుంచి పోతున్న వెంకన్న.. గుడిబండకాడ కూకున్న మల్లయ్య, నర్సయ్యలను చూసి దగ్గరికి వచ్చి కూకుండు.వెంకన్న : పొద్దుపొద్దుగాల ఇద్దరూ తీర్బాటంగా కూకున్నరేందే.. మల్లయ్య : ఏం లేదు మనవడా గీ ఎలచ్చన్ల గురించి ముచ్చట బెట్టుకుంటున్నం వెంకన్న : తాతా.. పట్నంల ఉంటున్న మనూరి చంద్రయ్యసార్ గూడా పోటీజేత్తడంటగా మల్లయ్య : సార్ గిప్పుడు కొలువు జేత్తలేడానే వెంకన్న : జేత్తలేడే ఎన్నడో దిగిపోయిండు. గా సార్ గూడా మంచోడేనే. ఇంతలోనే సుట్ట కాల్చుకుంటూ రామయ్య గూడా వాళ్ల దగ్గరికొచ్చి కూకొని మాటళ్లమాట గలిపిండు. రామయ్య : గా సంజీవ గూడా నిలబడ్తడంట . మల్లయ్య : గాయనకు ముగ్గురు పిల్లలుగా.. ఎట్ల నిలబడ్తడు వెంకన్న : గిప్పుడు అదిలేదే ..ముగ్గురు పిల్లలున్నా నిలబడొచ్చు. ఎవలు నిలబడ్తేందే.. ఊరిని బాగుచేసేటోడు కావాలే. మలయ్య: అవునోయ్ మనవడా.. రామయ్య: అవునవును.. వెంకన్న: ఈ ఎలచ్చన్ల ఏమైతదో సూద్దాం మరి. మల్లయ్య తాతా.. నేను ఐకేపీ కేంద్రం కాడికి బోతనే .. వడ్లు పోసి రెండ్రోజులైతంది . గియ్యాల నా సీరియల్ వత్తదే. గా వడ్లు అమ్మాలే. మల్లయ్య : సరేపో మనవడా నర్సయ్య : నేను గూడ పోత బర్రెకు పాలుపిండాలే మల్లయ్య : సరే నేను గూడ ఇంటికిబోత మల్లయ్యతాత నోట్లో ఉన్న యాపపుల్లను తీసి పక్కన బడేసి ఇంటిబాట పట్టిండు.. రామయ్య కూడా సుట్ట పీల్చుకుంటూ ఎళ్లిపోయిండు. – నల్లగొండ డెస్క్ -
సీఎం బందోబస్తుకు వెళ్లొస్తుండగా ప్రమాదం
గుర్రంపోడు, నల్ల గొండ: నారాయణ్పేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్రెడ్డి బందోబస్తుకు వెళ్లి నల్లగొండకు కారులో వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి గుర్రంపోడు మండలం తానేదార్పల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మధు తెలిపిన వివరాల ప్రకారం. నల్లగొండ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఏఎస్సైలుగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, శ్రీధర్, సత్యనారాయణ, హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు గాయాలు కాగా నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ సిబ్బందిని ఎస్పీ శరత్చంద్ర పవార్ పరామర్శించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత వలిగొండ : కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. సుంకిశాలకు చెందిన మొగిలిపాక శ్రీకాంత్ కారులో సుమారుగా రూ.42,500 విలువగల 39 లీటర్ల మద్యం రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈమేరకు శ్రీకాంత్పై కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.ఫ చెట్టును ఢీకొన్న కారు ఫ నలుగురికి గాయాలు -
కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరు
సూర్యాపేట : కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా మాట్లాడిన వ్యాఖ్యలపై పది రోజుల తర్వాత తెలంగాణ మంత్రులు స్పందించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు వాటర్ లో నీళ్లు కలుపుకొని స్పృహ కోల్పోతున్నారని, మరికొందరు కమిషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉంటున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తామెప్పుడూ ప్రాంతాలను దూషించలేదని, అన్నదమ్ములుగా విడిపోయి వేర్వేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ అనాడే చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికై నా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. అంతే కానీ సినిమాలు ఆపుతామని ఇక్కడి మంత్రి కామెడీగా మాట్లాడుతున్నారని, వాస్తవానికి అభిమానం వేరు.. రాజకీయం వేరన్నారు. తమ అభిమాన హీరోగా జనం ఎవరి సినిమాలైనా ఆదరిస్తారని పేర్కొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
ఆదర్శ నేత రాఘవరెడ్డి
ఫసర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నాయకుడు చిట్యాల : రాజకీయాలలో నీతి,నిజాయితీకి మారు పేరుగా నిలిచిన నేత దివంగత నర్రా రాఘవరెడ్డి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి పంచాయతీ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేశారు. వట్టిమర్తి సర్పంచ్గా ఏక గ్రీవం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి 1959లో (నాడు వట్టిమర్తి, శివనేనిగూడెం కలిసి ఉండేవి) జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇదే సమయంలో నార్కట్పల్లి సమితి ప్రెసిడెంట్గానూ ఆయన ఎన్నికయ్యారు. 1964 వరకు సర్పంచ్గా పని చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో ఒకసారి ఓటమి పాలైనప్పటికీ తిరిగి 1977లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత రాఘవరెడ్డికే దక్కింది. 2015 ఏప్రిల్ 15న రాఘవరెడ్డి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలకు గుర్తుగా వట్టిమర్తి వద్ద ఎన్హెచ్ 65 పక్కన రాఘవరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
భారీగా నామినేషన్లు
ఫ ముగిసిన రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఫ నేటి నుంచి మూడో విడత షురూ ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు సాక్షి, యాదాద్రి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ముగియనుండంతో పెద్ద ఎత్తున బేరసారాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. అయితే మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. కాగా ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలైయ్యారు. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల నేతలు, ఆశావహులు తీరిక లేకుండా గడుపుతున్నారు. టోకెన్లు తీసుకుని..క్యూలో నిలబడి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. చివరి రోజు కావడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలలోపు క్లస్టర్ కేంద్రాలకు చేరుకున్న వారికి అధికారులు టోకెన్లు ఇచ్చి రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించారు. వార్డు సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కాస్త జాప్యం జరిగింది. మూడో విడత నేటి నుంచే.. గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మండలాల వారీగా కలెక్టర్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో క్లస్టర్ల వారీగా 124 గ్రామ పంచాయతీలు, 1,086 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తారు. భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉపసంహరణ నేడే.. ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆత్మకూర్(ఎం), రాజాపేట మండలాల్లో ఈనెల 11న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే పలుచోట్ల ప్రధానపార్టీల అభ్యర్థులకు రెబల్స్ తలనొప్పి ఉంది. కొన్నిచోట్ల బుజ్జగింపులతో ఉపసంహరించుకోగా, మరికొన్ని చోట్ల బెదిరింపులు, బేరసారాలు నడిచాయి. అయితే బుధవారం భారీగానే నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వలిగొండ మండలంలో నామినేషన్ల స్వీకరణఅర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.మైనర్, కొత్త గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అంతర్గతంగా వేలం పాటలు పాడారు. గ్రామాభివృద్ధికోసం నిధులు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల రెండు పార్టీలు సర్పంచ్–ఉపసర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను పంచుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవం సర్పంచ్లు, వార్డు సభ్యుల లెక్కలు తేలనుంది. నామినేషన్ల వివరాలు మండలం జీపీలు చివరి రోజు మొత్తం భూదాన్పోచంపల్లి 21 65 117 భువనగిరి 34 130 202 బీబీనగర్ 34 84 177 రామన్నపేట 24 69 136 మండలం వార్డులు చివరి రోజు మొత్తం భూదాన్పోచంపల్లి 192 340 487 భువనగిరి 294 506 743 బీబీనగర్ 284 386 736 రామన్నపేట 232 421 607 -
ఎక్కడిదక్కడే!
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, యాదాద్రి : జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) జిల్లా పరిధిలోని బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టిన ఆరు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. అండర్పాస్లతో కూడిన వీటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్– వరంగల్ హైవే–163పై నాలుగు చోట్ల ఫ్లై ఓవర్లు మంజూరు కాగా మూడు చోట్ల పనులు జరుగుతుండగా, ఒకచోట టెండర్ల దశలోనే ఉంది. పనులు ప్రారంభించిన నాటి నుంచి పద్దెనిమిది నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఏడాది గడిచినా రెండు చోట్ల నెమ్మదిగా మిగతా రెండు చోట్ల అంతంత మాత్రంగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఫ్లై ఓవర్లు ఎక్కడెక్కడంటే.. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి–165పై యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, భువనగిరి మున్సిపల్ పరిధిలోని సింగన్నగూడెం, బీబీనగర్ ఎయిమ్స్, బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద ఆరు వరుసల్లో అండర్ పాసులతో కూడిన నాలుగు ఫ్లై ఓవర్లు మంజూరయ్యారు. కొండమడుగు మెట్టు వద్ద పనులు వేగం బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద గతనెలలో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి. ఆరు లేన్ల ఫ్లైఓవర్ను 1,200 మీటర్ల పొడవునా నిర్మించనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభం కాగా డైవర్షన్ రోడ్లను ఏర్పాటు చేసి సర్వీస్ రోడ్డులో రాకపోకలను అనుమతించారు. వంగపల్లి వద్ద కాంక్రీట్ పనులు పూర్తి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఫ్లైఓవర్ పనులు పూర్తి కావొచ్చాయి. ఇక్కడ రూ.15 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. ఆరు వరుసలతో కాంక్రీట్ పనులు పూర్తికాగా, మట్టి పనులు పూర్తి కావొస్తున్నాయి. దీనితోపాటు స్థానిక రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే మార్గాలు, గ్రామాల మధ్య ప్రమాద రహిత ప్రయాణం కోసం అధికారులు డీపీఆర్లు రూపొందించి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. వీటి పనులు పద్దెనిమిది నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగడెం వద్ద ఫ్లై ఓవర్ పనులు నెమ్మదిగా కొనసాగుతుండడంతో నిర్ణీత 18 నెలల గడువులోగా పూర్తి అవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది గడిచినా.. -
భూభారతి అర్జీలను పరిష్కరించాలి
భువనగిరి : భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం బీబీనగర్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు. సాదాబైనామా దరఖాస్తులను చిన్నచిన్న కారణాలతో రిజెక్ట్ చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులుగా నిర్ధారించి పరిష్కారం చూపాలన్నారు. అనంతరం పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యాంసుందర్, డీటీ భగత్ ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
భువనగిరి : రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మంగళవారం భువనగిరి మండలం అనంతారం క్లస్టర్ సెంటర్లో ఎన్నికల సాధారణ పరిశీలకరాలు, ఐఏఎస్ అధికారి గోతమి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని అడిగి నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలిమోటకొండూర్ : పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో క్లస్టర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నామినేషన్ స్వీకరణపై ఆర్ఓలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిర, తహసీల్దార్ నాగదివ్య, చొల్లేటి శ్రావణ్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మోర బాలగంగాధర్రెడ్డి, ఎండీ గఫార్, శ్రీకాంత్రెడ్డి, రాజగోపాల్, చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, జ్యోతి, మహేష్రెడ్డి పాల్గొన్నారు. రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ –16 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక ఈనెల 4వ తేదీన నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించబడునని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనొద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న జట్లతో లీగ్ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనభర్చిన వారిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. 01–09–2009 నుంచి 31–08–2011 మధ్య జన్మించిన వారు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9885717996, 6303430756 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తి గట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణం జరిపారు. శ్రీస్వామి వారిని గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, పణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
సెల్లార్లు ఖాళీ చేయించేదెప్పుడు?
భువనగిరి టౌన్ : జిల్లా కేంద్రంలోని వివిధ దుకాణాల ఎదుట పార్కింగ్కు స్థలం లేక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు విస్తరించకపోవడంతో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా తయారైంది. ప్రధాన కూడళ్లకు కారులో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ దూరంలో పెద్ద వాహనాలను నిలిపి ప్రధాన షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలకు వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. సెల్లార్ షాపింగులతో ఇబ్బందులు భువనగిరి మున్సిపాలిటీలో బహుళ అంతస్తుల భవనాల సెల్లార్లను కిరాయికి ఇవ్వడంతో పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసం వదిలివేయాలి. కానీ సెల్లార్లలో షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో వాహనాలు రోడ్ల పక్కన పార్క్ చేయాల్సి వస్తోంది. ప్రధాన రోడ్డులో సెల్లార్లను వ్యాపార నిమిత్తం ఉపయోగిస్తున్నారు. సెల్లార్లను కిరాయిలకు ఇస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సెల్లార్లను ఖాళీ చేయించి, వాటిని పార్కింగ్ స్థలాలుగా ఉపయోగిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. ఆదేశాలు బేఖాతర్.. సెల్లార్లలో షాపులను ఖాళీ చేసి వాటిని వాహనాల పార్కింగ్ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని గతంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీచేసినా వారు పట్టించుకోవడం లేదు. గత నెలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన అధికారులు సెల్లార్ షాపులకు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. నెల రోజులు గడుస్తున్నా ఖాళీ చేయకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ముడుపులు తీసుకుని సెల్లార్ దుకాణాలను ఖాళీ చేయించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతనెల 31 వరకే ఖాళీ చేయాలని చివరి గడువు విధించినా అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ఆదేశాలు సైతం లెక్కచేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. షాపింగ్ చేసే జనం ఇబ్బందులను గుర్తించి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలంటే సెల్లార్లలో కొనసాగే దుకాణాలను ఖాళీ చేయించి వాటిని పార్కింగ్ స్థలాలుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఫ నోటీసులిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు ఫ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు ఫ యథేచ్ఛగా కొనసాగుతున్న సెల్లార్ దుకాణాలు -
ముగిసిన అండర్–19 ఖోఖో ఎంపిక పోటీలు
కనగల్: కనగల్ ఎస్ఏవీఎం తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి నల్ల గొండ జిల్లా అండర్–19 బాలబాలికల ఖోఖో ఎంపిక పోటీలు ముగిశాయి. బాలబాలికలు 200 మంది ఎంపిక పోటీలకు హాజరు కాగా.. బాలికల నుంచి 12 మంది, బాలుర నుంచి 12 మందిని ఎంపిక చేసినట్టు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ కుంభం నర్సిరెడ్డి తెలిపారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో సికింద్రాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో జిల్లా తరఫున వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు రిటైర్డు ఎస్ఐ పందుల శంకరయ్య క్రీడా దుస్తులను బహూకరించారు. కార్యక్రమంలో ఎంఈఓ పద్మ, పాఠశాల ప్రిన్సిపాల్ థామాసయ్య, ఎస్ఐ కే.రాజీవ్రెడ్డి, తరాల జగదీష్, పీడీ విజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత చివ్వెంల(సూర్యాపేట) : కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని దురాజ్పల్లి గ్రామ స్టేజీ వద్ద సోమవారం జరిగింది. ఎస్ఐ వి.మహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్పల్లి గ్రామ స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. సూర్యాపేట నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న 11 కాటన్ల మద్యాన్ని పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. -
ట్యాంక్బండ్ తరహాలో సుందరీకరణ
ఆలేరు: చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదం అందించేలా చెరువుల సుందరీకరణకు ప్రభుత్వ ప్రాధాన్యమిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల నిధులతో చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా సుందరీకరించడమే లక్ష్యమన్నారు. రైతులకు సాగునీరు అందేలా భవిష్యత్లో చెరువుల వద్ద చెక్డ్యాంల నిర్మాణాలకు కృషి చేస్తానని చెప్పారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువు చుట్టూ బండింగ్, జంగల్ కటింగ్, వాకింగ్ ట్రాక్, రకరకాల మొక్కలతో సుందరీకరణ, విద్యుత్దీపాలు తదితరు పనులు చేపట్టనున్నట్టు వివరించారు. ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్, కాంగ్రెస్ నాయకులు చింతలఫణి శ్రీనివాస్రెడ్డి, సాగర్రెడ్డి, జెట్ట సిద్ధులు, పబ్లిక్హెల్త్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే ఊరుకోం
నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా బీసీలకు పెద్దపీట వేస్తూ జనరల్ స్థానాల్లో అవకాశాలు కల్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తీన్మార్ మల్లన్న విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు అన్నారు. సోమవారం నల్ల గొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, వంగూరి లక్ష్మయ్య.. పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో యాదగిరి అనే వ్యక్తి కిడ్నాప్ ఒక రాజకీయ డ్రామా అని, ఆ పంచాయితీలో జోక్యం చేసుకొని మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే చింతపండు నవీన్ (మల్లన్న) వీపు చింతపండు అవుద్దని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఆయా గ్రామాల నాయకులకే మంత్రి అప్పగించారని, ఇలాంటి పంచాయితీలో తలదూర్చలేదన్నారు. కిడ్నాప్ అంటూ నాటకాలు ఆడే యాదగిరికి తన భార్యను కొట్టడంతో పాటు తల్లిదండ్రులకు అన్నం పెట్టని చరిత్ర ఉందని, అలాంటి వ్యక్తి మాటలు నమ్మి మంత్రిని విమర్శించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదని అన్నారు. తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించడంలో కోమటిరెడ్డి కృషి ఉందని చెప్పారు. మల్లన్న బీసీల కోసం పోరాడితే తమ మద్దతు ఉంటుందని.. కానీ మంత్రిని విమర్శిస్తే ఊరుకోమన్నారు. గతంలో రెండు పర్యాయాలు పుల్లెంల వెంకటనారాయణగౌడ్ను మున్సిపల్ చైర్మన్గా చేశారని, జనరల్ స్థానంలో కూడా బీసీ అయిన వెంకటనారాయణగౌడ్కు పదవి ఇచ్చి రాష్ట్ర మున్సిపల్ చాంబర్ చైర్మన్ పదవిని కూడా ఇప్పించారని గుర్తుచేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, బీసీ సంఘాల నేతలు జూలకంటి శ్రీనివాస్, ప్రదీప్ నాయక్, జెర్రిపోతుల భాస్కర్, బొజ్జ రమేష్యాదవ్, అల్లి సుభాష్యాదవ్, ఇటికాల శ్రీనివాస్, పిల్లి రమేష్యాదవ్, గోగుల గణేష్యాదవ్, గోవర్ధన్గౌడ్, బొడ్డుపల్లి రాజేష్, భువనగిరి ప్రభాకర్, పాలకూరి శ్రీధర్, రంజిత్ పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్గౌడ్ -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
వలిగొండ: మండలంలోని లోతుకుంట గ్రామ మోడల్స్కూల్ విద్యార్థి నకబోయిన బాల్రాజు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. నల్లగొండ జిల్లా కనగల్లో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో బాలరాజు ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో అతన్ని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు ఫిజికల్ డైరెక్టర్ ఐలయ్య తెలిపారు. నిబద్ధతకు మారుపేరు భారతీయులుమోత్కూరు : నమ్మకం, నిబద్ధతకు మారుపేరు భారతీయులని, అందుకే భారతీయులకు ప్ర పంచస్థాయిలో గుర్తింపు ఉందని మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి, డీఎస్పీ కొత్త బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అంతర్జాతీయంగా పేరొందిన మైక్రోసాప్ట్, గూగుల్ తదితర సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ పరశురాములు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నరసింహారెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్లు లింగస్వామి, సీహెచ్అంజయ్య, లెక్చరర్లు ఈశ్వర్రావు, నరసింహ, వై.నర్సిరెడ్డి, ఎం.సుజాత, డి.మంజుల, సతీష్, కె.శ్యామ్ పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో పారదర్శకత పాటించాలిభూదాన్పోచంపల్లి: ఉపాధిహామీ పనుల్లో పా రదర్శకత పాటించాలని, లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని అడిషనల్ డీఆర్డీఏ సురేశ్ అధికారులకు సూచించారు. సోమవారం భూదాన్పోచంపల్లిలోని మండల మహిళాస మాఖ్య భవనంలో నిర్వహించిన 16 వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనులకు ఖర్చు చేసిన డబ్బులు, ఆడిట్ రిపోర్టులో వ్యత్యాసం లేదన్నారు. మెరుగైన పనితీరును కనబర్చిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఏపీఓ పీవీజీ కృష్ణమూర్తి, అంబుడ్మెన్ వీరమల్లు పాల్గొన్నారు. రక్తదానం.. మరొకరికి ప్రాణదానం చౌటుప్పల్ : రక్తదానం చేయడం వల్ల ప్రాణా పాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి తెలిపారు. లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమమ జనరల్ మేనేజర్ సత్యచంద్ర దివి వర్ధంతి సందర్భంగా సోమవారం కంపెనీలో రక్తదాన శిబిరాన్ని ప్రా రంభించి మాట్లాడారు. యువత రక్తం ఇచ్చేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ మన్మథకుమార్, దివీస్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్లు రామకృష్ణ, హేమంత్కుమార్, పి.శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, లైజాన్ ఆఫీసర్లు బి.కిషోర్కుమార్చౌదరి, కె.శివప్రసాద్, ఆర్కేసీ ప్రతినిధులు సావిత్రి, మోహన్రావు పాల్గొన్నారు. -
బొలేరో ఢీకొని ముగ్గురికి గాయాలు
చివ్వెంల(సూర్యాపేట) : అతివేగంగా వస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బైక్ను ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మండల కేంద్రం శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ నుంచి ఖమ్మం పట్టణానికి ఇంటి సామగ్రి లోడ్ కోసం వెళ్తున్న బొలేరో వాహనం.. చివ్వెంల మండల కేంద్రం శివారులో మోతె మండలం మామిళ్లగూడెం గ్రామం నుంచి సూర్యాపేటకు వస్తున్న బైక్ను ఢీ కొట్టింది. అనంతరం రహదారిపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ప్రయాణిస్తున్న మహబూబ్నగర్కు చెందిన రవి, మహేష్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా బైక్పై వెళ్తున్న వ్యక్తి తల, కాళ్లకు గాయాలయ్యాయి. అదే సమయంలో చివ్వెంల మండల కేంద్రంలో ఎన్నికల నామినేషన్లను పరిశీలించి సూర్యాపేటకు వెళ్తున్న ఎస్పీ నరసింహ సంఘటనను చూసి ఆగారు. రహదారిపై పడిఉన్న వాహనాన్ని స్వయంగా సిబ్బందితో కలిసి పక్కకు తీయించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. ఈ విషయమై ఎస్ఐ మహేశ్వర్ను వివరణ కోరగా.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
అన్నప్రసాద కేంద్రంలో ఇబ్బందులు తలెత్తొద్దు
యాదగిరిగుట్ట : నూతనంగా ప్రారంభించిన అన్నప్రసాద వితరణ కేంద్రంలో అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈఓ ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్లో ఆలయంలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. అన్న ప్రసాదం వితరణ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఏవైనా సౌకర్యాలు లేకపోతే వెంటనే సమకూర్చాలని సూచించారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవలు, పూజలు, దర్శన వేళలు తదితర అంశాలకు సంబంధించి వివరాలతో కూడిన సూచిక బోర్డులను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు సదుపాయాలను మరింత మెరుగుపరచడం, సమన్వయ విధానాలను బలోపేతం చేయడంపై మార్గదర్శకాలను జారీ చేశారు. అయ్యప్ప మాలధారణ భక్తులు గిరిప్రదక్షిణ సందర్భంగా తగిన చర్యలు తీసుకొని జయప్రదం చేసినందుకు స్పెషల్ ప్రొటక్షన్ గ్రూఫ్ (ఎస్పీఎఫ్) సిబ్బందిని ఈఓ వెంకట్రావ్ అభినందించారు. గుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
‘అయాన్’ పై రైతుల ఆసక్తి
నల్లగొండ అగ్రికల్చర్ : పంటకాలం ఎక్కువగా ఉండడంతోపాటు వాతావరణ పరిస్థితులను తట్టుకోలేకపోవడం.. చీడపీడల బారిన పడడం వల్ల గతంలో రైతులు సన్నరకం ధాన్యం సాగుపై పెద్దగా దృష్టి సారించలేదు. అయితే దశాబ్ద కాలంగా తక్కువ పంటకాలం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక దిగుబడి సాధించే బ్రీడెడ్ సన్నరకం వైరెటీలను ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వీటిని సాగుచేస్తున్న రైతులకు అధిక దిగుబడులతోపాటు మంచి లాభాలు వస్తున్నాయి. ఈ సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 5.70 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి ధాన్యం సాగయ్యింది. ప్రధానంగా ప్రభుత్వ వైరెటీలైన బీపీటీ–5204 స్వర్ణమసూరి, తెలంగాణ సోనా, సాంబ లాంటి విత్తనాలతోపాటు జీనెక్స్ సీడ్స్కు చెందిన ఆయాన్–2025 వైరెటీ విత్తనాలను రైతులు భారీగా సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వంగడాలు భారీ దిగుబడి రావడంతోపాటు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయాన్–2025పై రైతుల ఆసక్తి రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అనేక కంపెనీలు మేలు రకమైన వంగడాలు మార్కెట్లోకి తెస్తున్నాయి. ప్రధానంగా జీనెక్స్ సీడ్స్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన అయాన్–2025 అనే ఫైన్ వైరెటీ సీడ్ చీడపీడలను తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడి ఇస్తున్న నేపథ్యంలో రైతులు ఈ రకం వరిని అధికంగా సాగు చేస్తున్నారు. 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికొస్తున్న ఈ రకం వరి ఎకరానికి 55 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది. ఎక్కువ పిలకలు రావడం.. తక్కువ ఎత్తు పెరగడం.. మొక్క కాండం ధృడంగా ఉండడంతో గాలి వానకు కూడా కింద పడడం లేదని రైతులు అంటున్నారు. రైస్లో ఆయిల్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇతర రాష్ట్రాలు, దేశాల్లో భారీ డిమాండ్ ఏర్పడడంతో అక్కడికి సైతం ఎగుమతి చేస్తున్నామని మిల్లర్లు చెబుతున్నారు. సన్న ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.500 బోనస్ రావడంతో రైతులు సన్నధాన్యం సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటున్న ఫైన్ వైరెటీ వంగడాలు అధిక దిగుబడి ఇస్తున్న అయాన్–2025 రకం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు -
ఆశీర్వదించండి అమ్మా నాన్న
రోడ్డేస్తేనే ఓటేస్తాం.. వేములపల్లి : తమ కాలనీకి సర్వీస్ రోడ్డు వేస్తేనే ఓటు వేస్తాం లేదంటే ఓటింగ్ను బహిష్కరిస్తామంటూ నల్లగొండ జిల్లా వేములపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వాట్సాప్లలో చక్కర్లు కొడుతోంది. వేములపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపు కాలనీకి రాకపోకలు కొనసాగించాలంటే వేములపల్లి మండల కేంద్రం నంచి నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై రాంగ్ రూట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో జరగబోయే ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తామంటూ ఎన్ఎస్పీ కాలనీ ప్రజలు వాట్యాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నారు. రోడ్డు వేయిస్తామని హామీ ఇస్తే తప్ప ఓటు వేసేది లేదని పేర్కొంటున్నారు. -
గ్రామ శివారుకు తరలిన మద్యం దుకాణాలు
మునుగోడు : ఎంతో కాలంగా నల్లగొండ జిల్లా మునుగోడులోని ప్రధాన కూడలిలో కొనసాగుతున్న మద్యం దుకాణాలు గ్రామ శివారుకు తరలాయి. మద్యం దుకాణాలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని మండల ప్రజలు ఎన్నో రోజులుగా కోరుతూ వస్తున్నారు. దీనికితోడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మద్యం దుకాణాలు గ్రామ శివారుల్లో ఏర్పాటుచేయాలని, అలాగే సిట్టింగ్ అనుమతి కూడా ఉండొద్దని నెలరోజు క్రితం ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న యజమానులతో సమావేశమై మద్యం విక్రయాలపై పలు ఆంక్షలు విధించారు. దీంతో యజమానులంతా గ్రామ శివారులో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి సోమవారం ప్రారంభించారు. మునుగోడులో మొత్తం నాలుగు దుకాణాలు ఉండగా నల్లగొండ రోడ్డులో ఒకటి, చండూరు రోడ్డులో మరొకటి, చౌటుప్పల్ రోడ్డులో ఇంకొకటి ప్రారంభించారు. నాలుగోది ఇంకా ప్రారంభించలేదు. పల్లెపహాడ్ గ్రామంలో విషాదంతుర్కపల్లి: తుర్కపల్లి మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పల్లెపహాడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ (మహిళ) రిజర్వ్ అయ్యింది. కాగా గ్రామానికి చెందిన పంగాల బాలరాజ్ భార్య పంగాల చంద్రకళను గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటూ గ్రామస్తులు ప్రోత్సహించారు. దీంతో ఆమె నామినేషన్ దాఖలు చేసింది. అయితే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో బాలరాజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఽతెలిపారు. బాలరాజు మరణంపై గ్రామస్తులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
ఒక కుటుంబంలో ముగ్గురు సర్పంచ్లు
బొమ్మలరామారం : మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబ సభ్యులు నాలుగు పర్యాయాలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. మచ్చ చంద్రమౌళి తొలిసారిగా 1995లో చీకటిమామిడి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై య్యారు. ఐదేండ్లు ప్రజలతో మమేకమై పని చేయడంతో 2001లో సైతం రెండో సారి ఆయనను సర్పంచ్గా ఎన్నుకున్నారు. 2007లో చంద్రమౌళిగౌడ్ మాతృమూర్తి కళావతి సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించారు. 2013లో చంద్రమౌళి గౌడ్ సోదరుడు శ్రీనివాస్గౌడ్ ఎంపీటీసీగా గెలుపొందగా 2019లో మచ్చ శ్రీనివాస్గౌడ్ సతీమణి మచ్చ వసంత సర్పంచ్గా గెలిచారు. దాదాపు 20 సంవత్సరాల పాటు మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబం గ్రామానికి నిస్వార్థంగా సేవలందించి ప్రశంసలు పొందారు. సర్పంచ్గా 30 ఏళ్లు..కొండమల్లేపల్లి : రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వస్తున్న గ్రామపంచాయతీల జాబితాలో కొండమల్లేపల్లి పేరు ఉటుంది. దానిని ఆస్థాయిలో తీర్చి దిద్దిన ఘనత గ్రామ మొదటి సర్పంచ్ కుంభం పుల్లారెడ్డికే దక్కుతుంది. 1959లో కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఏర్పడింది. మొదటి సర్పంచ్గా కుంభం పుల్లారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత 1964లో రెండో సర్పంచ్గా నాయిని పుల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1969 నుంచి 2000 సంవత్సరం వరకు సుమారు వరుసగా 30 సంవత్సరాల పాటు కుంభం పుల్లారెడ్డి సర్పంచ్గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే కొండమల్లేపల్లి పశువుల సంతను అభివృద్ధి చేశారు. దాంతో ప్రస్తుతం సంత నుంచి ప్రతి ఏటా రూ. 1.23కోట్ల ఆదాయం గ్రామపంచాయతీకి సమకూరుతోంది. మేము డబ్బులు తీసుకోము..ఆత్మకూర్(ఎస్) (సూర్యాపేట) : ఎన్నికల్లో డబ్బులు, మద్యం ప్రభావం అధికం. పోటీ చేసే అభ్యర్థులు ఓటుకు ఇంత అంటూ రేటు నిర్ణయించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన యల్లంకొండ వెంకట్రెడ్డి తన ఇంటి గోడపై రాయించిన వాల్ పేయింటింగ్ గ్రామంలో చర్చనీయాంశమైంది. ‘మేము డబ్బులు తీసుకొని ఓటు వెయ్యం.. ప్రభావితం చేసేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటాం’ అని తన ఇంటి ప్రహరీపై రాయించాడు. మచ్చ వసంతమచ్చ కళావతిచంద్రమౌళి గౌడ్ -
ఆదర్శం.. రేణికుంట పంచాయతీ
రాజాపేట : ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రేణికుంట గ్రామం రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని రేణిగుంట గ్రామానికి సర్పంచ్గా ఉన్న బూరు భాగ్యమ్మానర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం, స్వచ్ఛ సర్వేక్షణ్, పల్లె ప్రగతి పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేశారు. జాతీయ అవార్డులురేణికుంట గ్రామానికి 19 జూన్ 2023న రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించింది. మౌళిక వసతుల కల్పన, స్వయం సమృద్ధి విభాగంలో 2021–2022లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గానూ జాతీయ పంచాయతీ అవార్డు లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఇంకుడు గుంతలు, సేంద్రియ ఎరువుల తయారి, పల్లె ప్రగతి కార్యక్రమం సమగ్రంగా అమలు చేసినందుకు 26 జనవరి 2020లో జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు లభించింది. అభివృద్ధి పనులుగ్రామంలో ప్రతి కాలనీలో 80 లక్షల నిధులతో సీసీ రోడ్లు వేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి ఎదుట, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడంతో వాటిని 100 శాతం బతికించారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతీ కాలనీలో, రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు రేణిగుంట నుంచి, రాజాపేట వరకు లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామానికి కొత్త కళ వచ్చింది. కొత్త హంగులతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడంతో పాటు శిథిలావస్థకు చేరిన పాఠశాలను ఆధునీకరించి గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దారు. రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీగా ఎంపిక హరితహారం, స్వచ్ఛ భారత్ మిషన్, పల్లె ప్రగతి నిర్వహణలో జాతీయ అవార్డు -
రూ.24 కోట్ల లిక్కర్
ఆలేరు: మొన్నటి వరకు స్టాక్ లేక బోసిబోయిన మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుకువచ్చిన నూతన మద్యం పాలసీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 82 మద్యం షాప్లు కొత్త యజమానుల చేతికి మారాయి.దుకాణాలను నిర్వాహకులు మామిడి తోరణాలు, పూలతో అలంకరించి, ముహూర్తం చూసి ప్రారంభించారు. ఈ నూతన పాలసీ 2027 నవంబర్ వరకు అమల్లో ఉండనుంది. వరుస ఎన్నికలు, మేడారం జాతర ఉండటంతో ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎకై ్సజ్ శాఖ అంచనా వేస్తోంది. నాలుగు సర్కిళ్లు, 82 వైన్స్లుజిల్లాలోని ఆలేరు, మోత్కూరు, రామన్నపేట, భువనగరి ఆబ్కారీ సర్కిళ్ల పరిధిలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. పాత దుకాణాలకు లైసెన్స్ గడువు నవంబర్ 30 తేదీ రాత్రి 10 గంటలకు ముగిసింది. వచ్చే రెండేళ్లకు గాను కొత్తగా లైసెన్స్ పొందిన వ్యాపారులు 29,30 తేదీల్లో మద్యం లిఫ్టింగ్కు ఇండెంట్ పెట్టారు. ఆదివారం రాత్రి నుంచి బోగారంలోని లిక్కర్ డిపోనుంచి మద్యం స్టాక్ను తమ దుకాణాలకు తరలించారు. చీఫ్ లిక్కర్ నుంచి ఖరీదైన మద్యం వరకు లిఫ్ట్ చేశారు భారీగా స్టాక్సాధారణ రోజుల్లో అయితే మూడు రోజులకోసారి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.15 కోట్ల మద్యం స్టాక్ను వైన్స్ల యజమానులు లిఫ్ట్ చేస్తుంటారని సమాచారం. తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కో షాప్ నిర్వాహకులు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల చొప్పున జిల్లా మొత్తం రూ.20.50 కోట్ల నుంచి రూ.24.60 కోట్లు విలువ చేసే లిక్కర్ దుకాణాలకు లిఫ్ట్ చేసినట్టు తెలిసింది. మడిగెలపై అభ్యంతరాలుపాత వైన్స్లు కొనసాగిన చోటే కొత్తవాటిని కొనసాగించడంపై స్థానికుల నుంచి ఆభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన రహదారుల పక్కన, జనా వాసాల మధ్య దుకాణాలు ఉండటం వల్ల స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతాయని, రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని పలు ప్రాంతాల ప్రజలు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయమై ఆబ్కారీ అధికారులు దృష్టిసారించారు.నృసింహుడికి లక్ష పుష్పార్చన యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల ను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వైజ్రవైఢూర్యాలు, వివిధ పుష్పమాలికలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు.. ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రనామ పఠనాలు పఠిస్తూ లక్ష పుష్పార్చన నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రాకా ర మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం తదితర పర్వాలను పాంచారాత్రగమశాస్త్ర రీతిలో చేపట్టారు. ● స్వామియే.. శరణం అయ్యప్పాగిరి ప్రదక్షిణ అనంతరం శ్రీస్వామి వారి దర్శనానికి ప్రధానాలయంలో బారులుదీరిన అయ్యప్ప స్వాములు రికార్డు స్థాయిలో వచ్చిన స్టాక్ కళకళలాడుతున్న లిక్కర్ షాప్లు అమల్లోకి వచ్చిన నూతన మద్యం పాలసీఉల్లంఘనులపై నజర్ఆలేరు : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా నూతన మద్యం దుకాణాల్లో తనిఖీ చేశారు. ఆలేరు ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూరు మండలాల్లోని వైన్స్ల్లో సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. ఇండెంట్ ప్రకారం లిక్కర్ తరలించారా లేదా రికార్డులను పరిశీలించారు. నిర్వాహకులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధనలకు లోబడి అమ్మకాలు చేయాలని, లేని పక్షంలో లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. -
రెండో రోజు నామినేషన్ల కోలాహలం
సాక్షి, యాదాద్రి : మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే స్థానాల్లో రెండో రోజు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్వేయడానికి అభ్యర్థులు బారులుదీరారు. సర్పంచ్లకు 270, వార్డుసభ్యుల స్థానాలకు 957 నామినేషన్లు పడ్డాయి. రెండో రోజుల్లో కలిపి సర్పంచ్లకు 380, వార్డులకు 1,123 నామినేషన్లు దాఖలయ్యాయి. భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఐదు మండలాల్లో 150 సర్పంచ్లు, 1,332 వార్డు స్థానాలకు ఈ నెల 14 రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి మూడవ విడతమూడో విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో బుధవారం నుంచి నామినేషన్ల ఘట్ట ప్రారంభం కానుంది. 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, మోత్కూ రు, అడ్దగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లోని 124 సర్పంచ్ స్థానాలు, 1,086 వార్ఢు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. తొలి దశలోఅర్హత సాధించిన నామినేషన్లు తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ బుధవారం నుంచి మొదలుకానుంది. పరిశీలన అనంతరం 153 గ్రామ పంచాయతీల్లో 698 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. 1,284 వార్డులకు 3,065 నామినేషన్లు అర్హత సాధించాయి. రెండో విడత.. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు మండలం జీపీలు నామినేషన్లుపోచంపల్లి 21 37 భువనగిరి 34 41 బీబీనగర్ 34 69 వలిగొండ 37 79 రామన్నపేట 24 44 మొత్తం 150 270 వార్డు సభ్యులకు.. పోచంపల్లి 192 123 భువనగిరి 294 173 బీబీనగర్ 284 297 వలిగొండ 330 189 రామన్నపేట 232 175 మొత్తం 1332 957 సర్పంచ్లకు 270, వార్డు స్థానాలకు 957 టోకెన్లు జారీ చేసి సమయం ముగిసినా అనుమతి నేటితో ముగియనున్న మలి విడత నామినేషన్ల స్వీకరణ -
ప్రజారోగ్య రక్షణలో నర్సులు కీలకం
భువనగిరి : ప్రజల ఆరోగ్యం, వారి శ్రేయస్సును కాంక్షిస్తూ నిస్వార్థంగా సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకమని బీబీనగర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లత పేర్కొన్నారు. ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్–2025 విద్యార్థుల కోసం దీపాలంకరణ, ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సింగ్ విద్యార్థులు తమ క్లీనికల్ ప్రాక్టీస్లో భాగంగా రోగుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడంతో పాటు సీనియర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రోగుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో నర్సింగ్ విద్యార్థులు పోషించాల్సిన పాత్రపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, నితిన్ జాన్, నాగ్పూర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రజనీ తదితరులు పాల్గొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లత -
కుటుంబ సభ్యులందరూ ప్రజాప్రతినిధులే..
అనంతగిరి: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రజా ప్రతినిధులుగా పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఉమ్మడి కోదాడ మండలం కొత్తగోల్తండాకు చెందిన బాణోతు పాశ్చానాయక్ 1964లో వార్డు సభ్యుడి ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు బాణోతు బాబునాయక్ కొత్తగోల్తండా పంచాయతీ ఎన్నికల్లో 1996లో వార్డు మెంబర్గా, 2006లో సర్పంచ్గా పోటీచేసి విజయం సాధించారు. 2013లో బాబునాయక్ తల్లి బాణోతు మంగ్లీ సర్పంచ్గా గెలుపొందారు. బాబునాయక్ పెద్ద కుమార్తె ధరావత్ ధనలక్ష్మి 2014లో జెడ్పీటీసీగా విజయం సాధించింది. 2019లో బాబునాయక్ చిన్నకుమార్తె బాణోతు త్రివేణి సర్పంచ్గా ఎన్నికయ్యారు.ఫ ముగ్గురు సర్పంచ్లుగా, ఒకరు జెడ్పీటీసీ, మరొకరు వార్డుమెంబర్ -
విద్యార్థులకు మానవీయ విలువలు నేర్పాలి
సూర్యాపేట టౌన్ : విద్యార్థులకు ఉపాధ్యాయులు మానవీయ విలువలు నేర్పించాలని అఖిల భారత విద్యావేదిక సభ్యుడు, ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ యోగానందచారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృత్తి నిబద్ధతకు, సామాజిక బాధ్యతకు లోబడి ఉపాధ్యాయులు పనిచేస్తేనే మంచి సమాజం నిర్మాణమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధి రాఘవాచారి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, కార్యదర్శి లింగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు ఎం. గంగాధర్, ప్రతినిధులు ఆర్. లింగయ్య, లక్ష్మణ్, సుదర్శన్, నాగయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ : విజ యవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం చౌటుప్పల్ పట్టణంలో వాహనాల రద్దీ నెలకొంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సైతం ప్రయాణికులు కిటకిటలాడారు. ఉదయం 11గంటల వరకు విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ ఉండగా, సాయంత్రం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ మార్గంలో రద్దీ ఉంది. దీంతో చౌటుప్పల్ పట్టణంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు సాఫీగా వెళ్లేందుకుగాను ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సు సర్వీసులు లేక చౌటుప్పల్ బస్టాండ్లో గంటల తరబడి నిరీక్షించారు. ‘కల వస్తే బాగుండును’ పుస్తకావిష్కరణనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఆదివారం మట్టి కవి, ప్రొఫెసర్ బెల్లి యాదయ్య సాహిత్య మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెల్లి యాదయ్య రచించిన ‘కల వస్తే బాగుండును’ కవితా సంపుటిని ప్రకృతి కవి జయరాజు ఆవిష్కరించి మాట్లాడారు. బెల్లి యాదయ్య నేటి సమాజం కోసం ఎన్నో మంచి పుస్తకాలు రచించారని కొనియాడారు. అనంతరం బెల్లి యాదయ్య కవిత్వం, సాహిత్య దృక్పథంపై పరిశోధకుడు, హైకోర్టు న్యాయవాది విప్లవ్కుమార్ చేసిన పరిశోధనా పుస్తకం అవుట్లుక్ను సినీ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఆనందం, అనితారాణి, తెలంగాణ వాగ్గేయకారుడు చింతల యాదగిరి, కృష్ణ కౌండిన్య, పగడాల నాగేందర్, కవి మునాస వెంకట్ పాల్గొన్నారు. -
ఊరికి సర్పంచే సుప్రీం
రామన్నపేట,చిట్యాల : గ్రామానికి సంబంధించిన సర్వాధికారాలు పంచాయతీవే. గ్రామపంచాయతీలో సర్పంచే సుప్రీం. గ్రామసభల తీర్మానాలే శాసనాలు. పంచాయతీరాజ్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఐదెంచెల విధానం అమలులోకి వచ్చింది. ఈ చట్టం గ్రామపంచాయతీలకు విశేష అధికారాలను కట్టబెట్టింది. గ్రామంలో వసతుల కల్పన గ్రామంలోని సమస్యల పరిష్కార వేదికగా గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామపంచాయతీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకమైనవి. గ్రామంలోని రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటుతో పాటు పలు సౌకర్యాల కల్పనకు సంబంధించిన అంశాలను సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనులు, ఖర్చులు, భవిష్యత్లో చేపట్టబోయే పనులు, పథకాలకు అయ్యే ఖర్చులు, ఆదాయ వ్యయాలను ప్రజల దృష్టికి తీసుకు వచ్చేందుకు గ్రామసభను నిర్వహిస్తారు. ఈ సభలో చేసే తీర్మానాలను గ్రామచట్టాలుగా పరిగణిస్తారు. సర్పంచ్ విధులు, బాధ్యతలుu గ్రామపంచాయతీ సమావేశాలు, గ్రామసభలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. u గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామసభల తీర్మానాలతో జరిగే పనులను పర్యవేక్షించడం. u రోజువారి కార్యాలయ నిర్వహణ, ప్రభుత్వం ఆమోదించిన మేరకు నిధులు ఖర్చు చేసే అధికారం సర్పంచ్కు ఉంటుంది. u పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాలపై సర్పంచ్కు పరిపాలనా పరమైన అధికారం ఉంటుంది. u గ్రామ సర్పంచ్ గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు చెక్ పవర్ కలిగి ఉంటాడు. u గ్రామ పంచాయతీ సర్పంచ్కు ప్రభుత్వం ప్రతినెలా రూ. 6500 వేతనాన్ని అందిస్తుంది. u ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యే సర్పంచ్పైన అవిశ్వాసం పెట్టే అధికారం సభ్యులకు ఉండదు. సక్రమంగా నిర్వర్తించక పోతేu గ్రామసభలు సకాలంలో నిర్వహించక పోవడం, ఆదాయ వ్యయాలపై ఆడిట్ చేయించక పోవడం, నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు, అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు, పంచాయతీ నిర్వహణకు అవసరమైన ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోని పక్షంలో సర్పంచ్లపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. u సర్పంచ్ ఏదైన కారణం చేత రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా పత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చి పదవిలోంచి దిగిపోవాల్సి ఉంటుంది. u ఏదైన కారణంతో గ్రామ సర్పంచ్ పదవి ఖాళీ అయితే 120 రోజులలోపు ఎన్నిక నిర్వహించి తిరిగి కొత్త సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఉపసర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తాడు. గ్రామ సర్వాధికారాలు పంచాయతీకే విశేష అధికారాలు కల్పించిన నూతన పంచాయతీరాజ్ చట్టం -
సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
ఫ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతిప్పర్తి : సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం చూడాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరిని ఇటీవల కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో తీన్మార్ మల్లన్న ఆదివారం బాధితుడు యాదగిరిని పరామర్శించారు, అగ్రవర్ణాల వారు బీసీలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీసీలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. యాదగిరిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయడం సరికాదన్నారు. అరాచక శక్తులను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్ల ప్పుడూ బీసీలకు అండగా ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలాని తీన్మార్ మల్లన్న కోరారు. ఆయన వెంట వట్టె జానయ్య, సైదులు, బీసీ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. -
ఒక కుటుంబం.. ముగ్గురు సర్పంచ్లు
మఠంపల్లి: మఠంపల్లి మండలం పాతదొనబండతండాకు చెందిన సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్లుగా పని చేశారు. గతంలో పెదవీడు గ్రామ పంచాయతీకి ఆవాసంగా ఉన్న దొనబండతండాకు చెందిన భూక్యా భక్షానాయక్ 1981లో పెదవీడు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1995లో పెదవీడు నుంచి దొనబండతండా విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 1995లో పంచాయతీకి మొదటి సారి జరిగిన ఎన్నికల్లో భక్షానాయక్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. భక్షానాయక్ సతీమణి చాందీబాయి కూడా 2000 నుంచి 2005 వరకు దొనబండతండాకు సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు హనుమానాయక్ 2006 నుంచి 2011 వరకు సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న చాందీబాయి కూడా గ్రామంలోని గిరిజనులకు నేటికీ అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. భక్షానాయక్ కుటుంబం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందించి ఆదర్శంగా నిలిచింది. -
మీ చేతుల్లోనే నా భవిష్యత్తు
కోదాడ : దేశానికి పట్టుగొమ్మలు మన పల్లెలు.. ఇది జాతిపిత మహాత్మాగాంధీ నాకు ఇచ్చిన గొప్ప గౌరవం. కానీ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా నా పరిస్థితి తయారయ్యింది. నా పల్లె బిడ్డలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి నానా కష్టాలు పడుతున్నాను. తాజాగా నా ఆలనాపాలన చూసేందుకు గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవాన్ని పొందడానికి ఆశావహులు ఎన్నికల బరిలో పోటాపోటీగా తలపడడానికి సిద్ధపడుతున్నారు. ఏడు దశాబ్దాల నా ప్రస్థానాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే నాకు నిరాశే కలుగుతుంది. నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. అభివృద్ధిలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన నేను నా పల్లె బిడ్డలకు కనీస సౌకర్యాలను కూడా అందించలేకపోతున్నాను. గుంతలు పడిన రోడ్లు, కంపుకొడుతున్న మురికి కాలువలు, నాలుగు రోజులకు ఒకసారి వచ్చే నల్లా నీళ్లు, వెలగని వీధి దీపాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నా సమస్యలు చాంతాడంత అవుతుంది. పట్టించుకోవాల్సిన పెద్ద నేతలు పట్టణాలకే పరిమితం అవుతుండడంతో నా పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు అరకొర విదిల్చే నిధులతో నా వాకిట చేపడుతున్న పనుల్లో అధికారుల, పాలకుల కమీషన్ల కక్కుర్తి వల్ల నాణ్యత నేతి బీరకాయలో నెయ్యి అన్న చందంగా మారింది. సీసీ రోడ్లు కాస్తా ఛీ..ఛీ.. రోడ్లుగా దర్శనం ఇస్తున్నాయి. వీధి దీపాలు మిణుకు మిణుకుమంటూ నా వీధుల్లో మూడువందల అరవై రోజులు అమవాస్య చీకట్లే కనిపిస్తాయి. ఇక గ్రామంలో స్వైరవీహారం చేస్తూ చిన్నారులపై దాడి చేస్తున్న గ్రామ సింహాలను, ఇళ్లపై దండెత్తుతున్న వానర మూకలను కట్టడి చేయలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, నాలో నేనే మదనపడుతున్నాను. ఇదిలా ఉండగా నా గుండెల మీద కుంపటిలా వీధికి రెండు మూడు బెల్ట్ షాపులు వెలిసి మంచినీరు దొరకని చోట రేయింబవళ్లు మద్యం అమ్మకాలు చేస్తూ యువతను మత్తులో జోగేలా చేస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే వారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాను. గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తారని.. ప్రజాస్వామ్యానికి పునాదైన పల్లెలు పటిష్టంగా ఉండాలంటే అది మీ చేతుల్లో, చేతల్లోనే ఉంది. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మరో వారం, పది రోజుల్లో ఐదు సంవత్సరాలు నా, మీ బాగోగులు చూసే ప్రథమ పౌరుడిని ఎంపిక చేసుకొనే అవకాశం మీకు వచ్చింది. ఓటే వజ్రాయుధమంటారు. దాన్ని మీరు సక్రమంగా వినియోగించి మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తారని ఆశిస్తున్నాను. చివరగా గ్రామ సేవ చేయాలని సర్పంచ్గా నిలబడాలనుకుంటున్న ఔత్సహికులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సొంతూరిని బాగు చేసుకోవాలనే మీ సంకల్పం మంచిదే. దీని కోసం లక్షలు ఖర్చుచేసి అప్పులపాలై కుటుంబాలను వీధిన పడేయకండి. ప్రజా బలంతో నిజాయితీగా ఎన్నికకావడానికి ప్రయత్నించండి.. ఇట్లు మీ పల్లెడబ్బు, మద్యానికి ఓటు అమ్ముకోనుఫ ఇందూర్తిలో ఇంటి గోడపై రాసిన రామచంద్రంమర్రిగూడ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యానికి ఓటును అమ్ముకోను అంటూ మర్రిగూడ మండలంలోని ఇందూర్తి గ్రామానికి చెందిన పగిళ్ల రామచంద్రం తన ఇంటి ప్రహరీపై రాసి ఉంచాడు. ప్రజలకు కనువిప్పు కావాలన్న ఉద్దేశంతో ఓట్లను డబ్బు, బిర్యానీకి అమ్ముకోవద్దని, ఓటును గ్రామాభివృద్ధికి పాటుపడే అభ్యర్థులకు స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించుకోవాలని రామచంద్రం కోరారు. ఈ సందర్భంగా రామచంద్రం దంపతులను మేటిచందాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఏర్పుల యాదయ్య, ఏరుకొండ అబ్బయ్య శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
15 ఏళ్లు సర్పంచ్గా..
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన సంఘం నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడంతో పాటు గ్రామ సర్పంచ్గా 15ఏళ్ల పాటు పని చేశారు. 1957లో బొందుగుల గ్రామానికి మొదటి సర్పంచ్గా ప్రభుత్వం ఆయనను నామినేట్ చేసింది. ఆతరువాత జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన తల్లి మాణిక్యమ్మ కూడా సర్పంచ్గా ఎన్నికయ్యారు. తాను సర్పంచ్గా ఉన్న సమయంలో చెరువుల నిర్మాణం, సాగులో ఆధునిక పద్ధతులు ప్రవేశ పెట్టించారు. కలరా, మసూచి వంటి వ్యాధులతో పాటు పాము, తేలుకాటుకు తాను నేర్చుకున్న ఆయుర్వేద వైద్యంతో మందులు అందించారు. ఆయన ప్రజలతో మమేకమై ఉంటుండడంతో గ్రామ ప్రజలు ఆయనను సంఘం నారాయణరెడ్డికి బదులుగా బొందుగుల నారాయణరెడ్డిగా పిలిచేవారు. నారాయణరెడ్డి 1994లో మృతి చెందారు. ఊట్కూరులో ‘నర్సింగ్’ కుటుంబానిదే హవా నిడమనూరు : నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామంలో రెండు దశాబ్దాలుగా నర్సింగ్ కృష్ణయ్య కుటుంబం నుంచే సర్పంచ్గా గెలుపొందుతున్నారు. నర్సింగ్ కృష్ణయ్య 2006లో, ఆయన భార్య సత్యమ్మ 2013లో వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్లుగా కొనసాగగా.. 2019లో వారి కుమారుడు నర్సింగ్ విజయ్కుమార్ సర్పంచ్గా గెలుపొందారు. నాకు గెలుపు యోగ్యం ఉందా..!● జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు హాలియా : పంతులూ.. ఎన్నికల బరిలో దిగితే గెలుస్తానా, నా జాతక చక్రం ఎలా ఉందంటూ నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచే ఆశావహులు పలువురు జ్యోతిష్యులు, పురోహితులను ఆశ్రయిస్తున్నారు. మాకు అనుకూలంగా రిజర్వేషన్ ఉంది, సర్పంచ్ కావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది, పోటీ చేయాలనుకుంటున్నా.. ఇంతకు నా జాతకం బాగుందా..? నామినేషన్ ఎప్పుడు వేయాలి. పక్కాగా గెలుస్తానా అని ఆరా తీస్తున్నారు. ఫలానా పంతులు బాగా చెబుతాడు అంటే అక్కడికి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొంతమంది ఆశావహులు పురోహితులు, జ్యోతిషుల సూచన మేరకు పలు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేయిస్తుండగా.. మరికొంత మంది ఆశావహులు తిధి, నక్షత్రం, ముహూర్త బలం చూసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండల కేంద్రంలోని నల్లగొండ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లికి చెందిన గుంటూరు అభిరామ్(21) నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద పండ్లు కొనుక్కునేందుకు వెళ్లాడు. అదే సమయంలో నల్లగొండ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీసీఎంను డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి అభిరామ్ను ఢీకొట్టి ఎదురుగా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అభిరామ్ మృతిచెందగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను నియంత్రించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యాదగిరిగుట్టలో అన్నప్రసాద కేంద్రం ప్రారంభం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధ్యాత్మిక వాడలో అధునాత హంగులతో వేగేశ్న ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన శ్రీ శాంతా రుష్య శృంగ అన్నప్రసాద కేంద్రాన్ని ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో కలిసి ఆదివారం వేగేశ్న ఫౌండేషన్ నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేగేశ్న ఫౌండేషన్ అధినేత అనంతకోటి రాజు మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా ఆయా ఆలయాలకు వచ్చే భక్తులకు తమ ఫౌండేషన్ ద్వారా అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు. గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమలలో అన్నప్రసాద కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పుడు యాదగిరిగుట్ట ఆలయంలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన గత, ప్రస్తుత ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి మాట్లాడుతూ.. 5 ఏళ్ల క్రితం వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన అన్నప్రసాద కేంద్రాన్ని రూ.21కోట్లతో అద్భుతంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. మొదటి రోజు అన్నప్రసాద కేంద్రంలో పులిహోర, సిర, చిన్న లడ్డూ, మిర్చి, పన్నీరు కూర్మ, ఆలు కర్రీ, పెరుగు, పప్పుచారు, టమాట పచ్చడి, పాపడం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్ నిర్వాహకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సజావుగా నామినేషన్ల స్వీకరణ
వలిగొండ : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వలిగొండ, పుల్లిగిల్లలో నామినేషన్ కేంద్రాలను సందర్శించి నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి సూచనలు చేశారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం నాగారం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట డీఆర్డీఓ నాగిరెడ్డి, ఎంపీడీఓ జలేందర్ రెడ్డి, తహసీల్దార్ దశరథ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
సర్పంచ్లకు 110.. వార్డు సభ్యులకు 166
సాక్షి,యాదాద్రి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మలిదశలోకి ప్రవేశించింది. ఇప్పటికే మొదటి విడత సజావుగా పూర్తికాగా.. ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండో విడతలో భువనగిరి, భూదాన్పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని 150 పంచాయతీలు, 1,332 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు 46 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 110, వార్డులకు 166 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆలస్యంగా ప్రారంభం..నామినేషన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. నామినేషన్ల పత్రాలకు జతపర్చాల్సిన సర్టిఫికెట్లు, బ్యాంకు అకౌంట్లు అందడం జాప్యం కావడంతో మధ్యాహ్నం తర్వాత ప్రారంభమై నాలుగు గంటల తర్వాత ఊపందుకున్నాయి. సోమ, మంగళవారాల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యే వకాశం ఉంది. వలిగొండ, రామన్నపేట, ఇంద్రపాలనగరం తదితర గ్రామాల్లో నామినేషన్లను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. తొలి విడుత ఎన్నికలు జరిగే స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో ఒకటి తిరస్కరణకు గురైంది. తుర్కపల్లి మండలంలోని ఓ పంచాయతీ జనరల్ కావడంతో భార్యాభర్తలు ఇద్దరూ నామినేషన్ వేశారు. భార్య నామినేషన్న సరిగా నింపకపోవడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వార్డు సభ్యుల నామినేషన్లు తుర్కపల్లి మండలంలో 9, ఆత్మకూర్(ఎం) 2, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో ఒక్కోటి చొప్పున తిరస్కరణకు గురయ్యాయి. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఫ తొలి రోజు తక్కువగా దాఖలు ఫ నేడు, రేపు రెట్టింపు సంఖ్యలో పడే అవకాశంసర్పంచ్ స్థానాలకు దాఖలైన నామినేషన్లు మండలం జీపీలు నామినేషన్లుపోచంపల్లి 21 15 భువనగిరి 34 31 బీబీనగర్ 34 24 వలిగొండ 37 17 రామన్నపేట 24 23 మొత్తం 150 110 వార్డు సభ్యులకు.. పోచంపల్లి 192 24 భువనగిరి 294 64 బీబీనగర్ 284 53 వలిగొండ 330 14 రామన్నపేట 232 11 మొత్తం 1,332 166 -
శ్రీకాంతాచారి వర్ధంతికి తరలిరావాలి
మోత్కూరు : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని డిసెంబర్ 3న హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ తలపెట్టిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామరోజు వీరాచారి తెలిపారు. ఆదివారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి ప్రాణాలర్పించడం వల్లే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందన్నారు. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. వర్ధంతి కార్యక్రమానికి ఉద్యమకారులు పెద్దసంఖ్యలో తరలివచ్చి శ్రీకాంతాచారికి నివాళులర్పించాలని కోరారు. జిల్లాలోనే శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలిభువనగిరి : 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాయకులు డిమాండ్ చేశారు. తపస్ జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమ ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డిని హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండేళ్లలో టెట్ పాస్ కావాలనే నిబంధన పెట్టడం సమంజసం కాదన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టెట్పై ప్రస్తావించాలని వారు ఎంపీని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట, రాజా పేట, తుర్కపల్లి మండలాల అధ్యక్షులు సైదారావు, జానయ్య, మంజుల ఉన్నారు. నేటి నుంచి కొత్త వైన్స్లు సాక్షి యాదాద్రి : నూతన మద్యం పాలసీ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. రెండేళ్లకాల పరిమితితో జిల్లాలో 84 మద్యం షాపులను డ్రా పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. పాత దుకాణాలకు నవంబర్ 30వ తేదీతో గడువు పూర్తి కావడంతో నేటి నుంచి కొత్త వైన్స్లు తెరుచుకోనున్నాయి. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు అవసరమైన సర్టిఫికెట్లను ఎకై ్సజ్ అధికారులకు సమర్పించి మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు లైసెన్స్ పొందారు. పాత వైన్స్లు నిర్వహించిన చోటే కొత్తవాటి ఏర్పాటుకు వ్యాపారులు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వేరే చోటుకు మారాయి. -
పట్టణదారి.. నరకంగా మారి
ప్రశాంత్నగర్, చెక్పోస్టు ప్రాంతా ల్లో పైప్లైన్ వేయడానికి రోడ్లను తవ్వి వదిలేశారు. అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై కంకర, మట్టి పెల్లలు అదే విధంగా ఉండటంతో వాహనదారులు కింద పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలి. –బుచ్చిబాబు, ప్రశాంత్నగర్యాదగిరిగుట్ట: అత్యవసరం పేరుతో చేపడుతున్న రోడ్ల తవ్వకాలతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. తిరిగి మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలు సాగించేందుకు నానా యాతన పడుతున్నారు.యాదగిరిగుట్టలో అమృత్ 2.0 స్కీం కింద తాగునీటి పైప్లైన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగుండ్లపల్లిలోని చెక్పోస్టు వద్ద నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేసేందుకు ప్రశాంత్నగర్, చెక్పోస్టు ప్రాంతాల్లో 10 కిలో మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. ఇందులో 2 కిలో మీటర్లకు పైగా నివాస గృహాల ముందు నుంచి పైప్లైన్ వేశారు. రోడ్లను తవ్విన కాంట్రాక్టర్లు తిరిగి మరమ్మతులు చేపట్టలేదు. సిమెంట్, కంకర తొలగించకుండా ఎక్కడికక్కడ వదిలేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఫ గుట్టలో భగీరథ పైపులైన్ల కోసం తవ్వకాలు ఫ మరమ్మతులకు దిక్కులేదు -
నారాయణపురం వాసికి డాక్టరేట్
సంస్థాన్నారాయణపురం: మండల కేంద్రానికి చెందిన ఎస్.గోవర్థన్ అన్నమలై యూ నివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్కు ఎంపికయ్యాడు. ఫర్ఫార్మెన్స్ ఈవాల్యుయేషన్ ఆఫ్ గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇన్ ఇండియా– ప్రీ అండ్ పోస్ట్ కోవిడ్–19 సీనారియో.. అనే అంశంపై గోవర్థన్ పరిశోధన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తూ ఎంబీఏ విభాగానికి హెచఓడీగా కొనసాగుతున్నారు.యాదగిరీశుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరీశుడి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పర్వాలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేవ చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. -
గేటు పడితే.. గుండెల్లో రైళ్లు
ఆలేరురూరల్ : గుండ్లగూడెం రైల్వే గేటు మీదుగా వెళ్లాలంటేనే ప్రయాణికులు అమ్మో అంటూ భయపడే పరిస్థితి నెలకొంది. గేటు పడితే ఎండైనా.. వానొచ్చినా.. అరగంట పైగా వేచి ఉండాల్సిందే.. నాలుగైదు రైళ్లు వెళ్లే వరకూ గేటు తీయకపోవడంతో 30 నిమిషాల పాటు నిలిచి ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఏళ్లతరబడి ఇదే సమస్య నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైల్వేగేటు స్థానంలో అండర్పాస్, లేదా ఫ్లయ్ ఓవర్ నిర్మించి సమస్య పరిష్కరించాలని గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాస్పురంతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 150 వరకు రైళ్ల రాకపోకలుఆలేరు పట్టణ పరిధిలో సుమారు 7 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో సికింద్రాబాద్–ఖాజీపేట, నాందేడ్, సిర్పూర్ ఖాగజ్నగర్, ముంబయి, ఢిల్లీ వైపు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు కలిపి రోజూ 100 నుంచి 150 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్యాసింజర్ రైలు వచ్చిన ప్రతీసారి 5 నుంచి 10 నిమిషాలు గేట్ పడుతుంది. అదే గూడ్స్ రైలు వస్తే కనీసం 15 నిమిషాలు గేట్ వేస్తున్నారు. రైలు వెళ్లాక గేటు ఎత్తాలంటే మరో 10 నిమిషాలైనా వేచి ఉండాలి. దీంతో కాలినడకన ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదొక్కటే మార్గంగుండ్లగూడెం, శివలాల్తండా, పటేల్గూడెం, శ్రీనివాస్పురంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే గుండ్లగూడెం రైల్వే గేట్ మీదుగా ఉన్న మార్గం ఒక్కటే. వారంతా ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు.. ఇలా వివిధ పనుల నిమిత్తం ఆలేరు, భువనగిరి తదితర ప్రాంతాలకు వెళ్లొస్తుంటారు. వందల సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్తుంటారు. రైలు వచ్చిన ప్రతీసారి ఐదు నిమిషాల ముందే గేట్ పడుతుండటంతో యాతన పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అంబులెన్స్ వచ్చినా ఆగాల్సిందే. అత్యవసరం ఉంటే 12 కిలో మీటర్లు జనగాం అయినా వెళ్లాలి, లేదా చుట్టూ 8 కిలో మీటర్ల తిరిగి ఆలేరుకు రావాలి.రైల్వే గేట్ దాటడానికి ప్రజ లు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం, ఓ రైలు పోతుందనుకుంటే మరొకటి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అరగంట వరకు నిలబడాల్సి వస్తుంది. కొందరు గేటు దాటే ప్రయత్నంలో ప్రాణాలు పోగోట్టుకున్నారు. ఇప్పటికైనా అండర్పాస్ నిర్మించాలి. – బండ జహంగీర్, పటేల్గూడెం, ఆలేరు మండలంగుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద నిత్యం నరకం ఫ ఇరువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు ఫ ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ప్రయాణికులు ఫ సాకారం కాని అండర్పాస్ కలగతం కంటే రైళ్ల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రైళ్లు, గూడ్సు రైళ్లు కలిపి రోజూ వందకు పైనే పోతుంటాయి. అరగంటకోసారి గేటు పడుతుండటంతో వివిధ పనులు నిమిత్తం ఆలేరు, జనగామ, భువనగిరికి వివిధ పనులకు వెళ్లేవారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే చొరవ చూపితే సమస్య తీరుతుంది. – ఏసీరెడ్డి. మహేందర్రెడ్డి, గుండ్లగూడెం మాజీ సర్పంచ్ దీక్షలు, నిరసనలుగుండ్లగూడెం రైల్వే గేట్ వద్ద అండర్పాస్ లేదా ఫ్లై ఓవర్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇటీవల బీజేపీ నాయకులు ఆలేరులో రిలే నిరాహర దీక్ష చేయగా.. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వచ్చి ఆరు నెలల్లో అండర్పాస్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
చికిత్స పొందుతూ మృతి
శాలిగౌరారం : కుటుంబ సమస్యలతో పురుగుల మందు తాగిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన బుర్రె రాములు–యల్లమ్మ దంపతులకు దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. రెండో కుమారుడు బుర్రె మహేశ్(28) స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మహేశ్ తండ్రి రాములు మూడేళ్ల క్రితం పక్షవాతానికి గురై మంచాన పడ్డాడు. ఉన్నారు. పెద్ద కుమారుడితో పాటు కుమార్తెల వివాహాలు చేశారు. ఈ నేపథ్యంలో రాములు కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో మనోవేదనకు గురైన మహేశ్ ఈ నెల 27న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పర్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మహేశ్ కళ్లను హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. -
ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడలు
భువనగిరి: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సీ్త్ర శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్–18, అంతకు పైబడిన దివ్యాంగులకు పరుగు పందెం, షాట్పుట్, క్యారమ్స్, చెస్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.అంతకుముందు క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, యువజన, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా పోటీలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు, పీడీలు, పీఈటీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
40 ఏళ్లు సర్పంచ్గా..
కనగల్: కనగల్ మండలంలోని చర్లగౌరారం గ్రామానికి చెందిన చిలకరాజు చిన మారయ్య చర్లగౌరార, పర్వతగిరి, దర్వేశి పురం ఉమ్మడి గ్రామపంచాయతీకి 1957లో సర్పంచ్గా నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి 1977 వరకు 20 ఏళ్లపాటు సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత పర్వతగిరి, దర్వేశిపురం, చర్లగౌరారం గ్రామాలు మూడు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 1977లో చర్లగౌరారం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో చిన మారయ్య విజయం సాధించి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కంటిన్యూగా 20 ఏళ్ల పాటు సర్పంచ్గా కొనసాగారు. ఇలా ఏకధాటిగా 40 ఏళ్లపాటు సర్పంచ్గా పనిచేసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. 1997లో ఆయన మృతిచెందారు. ఎలాంటి మద్యం, డబ్బును ఆశించకుండా స్వచ్ఛందంగా మారయ్యకు ఓటేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. నామినేషన్ తిప్పలుయాదగిరిగుట్ట రూరల్ : సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు శనివారం దాతర్పల్లి క్లస్టర్ కేంద్రానికి వచ్చాడు. అయితే అక్కడ జిరాక్స్ మిషన్ అందుబాటులో లేదని తెలుసుకుని.. ఆ అభ్యర్థి స్వయంగా జిరాక్స్ మిషన్ను తన వెంట తెచ్చుకున్నాడు. నామినేషన్కు వేయడానికి కావాల్సిన పత్రాలను జిరాక్స్ మిషన్ సహాయంతో ప్రింట్ తీసుకుని నామినేషన్ సమర్పించాడు. అతడితో పాటు తన వెంట వచ్చిన వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే వారు సైతం ఈ జిరాక్స్ మిషన్ సహాయంతో తగిన పత్రాలను జిరాక్స్ తీసుకుని తమ నామినేషన్ల ప్రక్రియ పూర్తిచేశారు. -
సిటీ సబర్బన్ బస్సులు నడపండి
భూదాన్పోచంపల్లి: పర్యాటక కేంద్రమైన పోచంపల్లికి దిల్సుఖ్నగర్ నుంచి సిటీ సబర్బన్ బస్సులు నడిపించాలని కోరుతూ శనివారం భూదాన్పోచంపల్లికి చెందిన పలువురు నాయకులు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నిత్యం దేశ, విదేశీయులు వస్తుంటారని, పోచంపల్లి నుంచి హైదరాబాద్కు వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తుంటారని పేర్కొన్నారు. వారంతా సరిపోను బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అదనపు సర్వీసులను నడపాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆర్టీసీ ఎండీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఎండీకి వినతిపత్రం అందజేసిన వారిలో తడక రమేశ్, బిజిలి కుమార్, సీత కృష్ణ, భారత గిరివాసు, తడక విష్ణుదాస్, పెండెం పాండురంగం, కడవేరు వెంకటేశం, గుండు ఉప్పలయ్య, సీత జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
చౌటుప్పల్ : సంస్థాన్నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం రాత్రి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టపాకకు చెందిన పున్న అనిత చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని మాంగళ్య షాపింగ్మాల్లో పనిచేస్తోంది. ఆమె భర్త బ్రహ్మయ్య చేనేత కార్మికుడు. శుక్రవారం సాయంత్రం అతడు పుట్టపాక నుంచి క్యారేజీ బ్యాగులు తీసుకొని తన భార్య పనిచేస్తున్న షాపింగ్మాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమెకు ఆ బ్యాగులు చూపించి ఎలా ఉన్నాయని అడిగాడు. అవి బాగాలేవు, మరో కలర్ తీసుకురమ్మని ఆమె చెప్పింది. దీంతో అతడు స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భార్య అనిత తన డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో భర్త ఇంట్లో కన్పించలేదు. ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఎంత వెతికినా బ్రహ్మయ్య ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి నగదు చోరీ ఫ దొంగను వెంబడించడంతో బస్టాండ్ ఆవరణలో నగదు పారేసి పరార్ సూర్యాపేటటౌన్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి నగదు చోరీ చేసిన దొంగ.. ఆ నగదును బస్టాండ్ ఆవర ణలో పారేిఠిస పరార య్యాడు. ఆ నగదు ఆర్టీసీ అధికారులు, పోలీసులు బాధితుడికి అప్పగించారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన రామగిరి రాములు వడ్లు అమ్ముకున్న డబ్బులతో శనివారం తన సొంత గ్రామానికి వెళ్లేందుకు సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్లో తొర్రూర్ బస్సు ఎక్కుతుండగా.. అతడి జేబులోంచి రూ.44 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. అది గమనించిన రాములు తోటి ప్రయాణికుల సహాయంతో ఆ దొంగను వెంబడించగా వారికి చిక్కకుండా బస్టాండ్ ఆవరణలో డబ్బులు వదిలేసి పారిపోయాడు. అది గమనించిన ఓ ప్రయాణికుడు విధి నిర్వహణలో ఉన్న కండక్టర్కు సమాచారం ఇవ్వగా కింద పడేసిన డబ్బులను బస్టాండ్లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ ఆర్వీ సింగ్కు అందజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బస్టాండ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎండీ అఫ్సర్, ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ చేతులమీదుగా బాధితుడు రాములుకు డబ్బును అందజేశారు. -
కేంద్రాల వద్దే కుల ధ్రువీకరణ
యాదగిరిగుట్ట రూరల్ : రిజర్వేషన్ స్థానాల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. శనివారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పలువురు అభ్యర్థులు నామి నేషన్ పత్రాల్లో కుల ధ్రువీకరణకు ఇచ్చిన ప్రత్యేక కాలమ్లో తమ కులానికి సంబంధించిన వివరాలు నింపారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ గణేశ్నాయక్ స్వయంగా మండలంలోని ఐదు క్లస్టర్లలో నామినేషన్ కేంద్రాల వద్దకే వెళ్లి అభ్యర్థితో పాటు అతడిని ప్రతిపాదించిన వారిని విచారించి కుల ధ్రువీకరణ చేశారు. దీంతో అభ్యర్థులు ప్రత్యేకంగా కుల ధ్రువీకరణ పత్రం జత చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. తహసీల్దార్ కార్యాలయంలో కుల ధ్రువీకరణ కోసం డిప్యూటీ తహసీల్దార్ కూడా అందుబాటులో ఉన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే.. ఎన్నికలకు దూరం
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటినుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. దీనినే ‘మోడల్ ఆఫ్ కండక్ట్’ అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసును దాఖలు చేయవచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ● ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై నిషేధం ఉంటుంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ● కోడ్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించవద్దు. ● మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు ఆర్థిక గ్రాంట్ను, వాటికి సంబంధించిన హామీలను ప్రకటించకూడదు. ఎక్కడ శంకుస్థాపనలు చేయడానికి వీల్లేదు. మంత్రులు అధికారిక యంత్రాంగాన్ని, వాహనాలను వినియోగించరాదు. ● ఎవరైనా అధికారి, సిబ్బంది మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్న్ 218లో పేర్కొన్న విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలి. ● ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి మంత్రులు ఇతర అధికారులు విచక్షణ నిధుల నుంచి గ్రాంట్లు/చెల్లింపులను మంజూరు చేయవద్దు. ● గృహ నిర్మాణ పథకం మంజూరై, పని ప్రారంభిస్తే, లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సహాయం అందాలి. ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొత్త నిర్మాణాలను చేపట్టడం లేదా కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయడం చేయరాదు. ● కరవు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకతి వైపరీత్యాలు సంభవిస్తే బాధిత ప్రజలకు సహాయాన్ని ఎస్ఈసీ అనుమతితో ప్రభుత్వం అందించాలి. 1960 కేరళ అసెంబ్లీ ఎన్నికలతో శ్రీమోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్శ్రీ మొదలైంది. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి అంగీకారం తెలిపిన తర్వాతే ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేశారు. ఇందులో ఎలాంటి నిబంధనల్ని పాటించాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత, 1967 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవర్తనా నియమావళిని అనుసరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తన వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ డబ్బు ఉండి దానికి సంబంధించిన సరైన పత్రాలు చూపలేక పోతే ఆ డబ్బులను పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధి కారుల వద్ద జమ చేస్తారు. ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి సదరు డబ్బులను కోర్టులో జమ చేస్తారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
సర్పంచ్కు 844, వార్డు సభ్యుల స్థానాలకు 2,450సాక్షి యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. 153 సర్పంచ్, 1,286 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆయా స్థానాల్లో చివరి రోజూ నామినేషన్లు వెల్లువెత్తాయి. ఈ ఒక్క రోజే సర్పంచ్ 440, వార్డు సభ్యుల స్థానాలకు 1,776 నామినేషన్లు పడ్డాయి. మూడు రోజుల్లో మొత్తం నామినేషన్లు సర్పంచ్ 844, వార్డు స్థానాలకు 2,450 దాఖలయ్యాయి. ఆదివారం (నేడు) నామినేషన్ల పరిశీలన, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. సమయం ముగిసినా అనుమతి తొలి విడత ఎన్నికలు జరిగే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారం మండలాల్లో క్లస్టర్ కేంద్రాలకు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి బారులుదీరారు. చివరి రోజు కావడంతో వందలాది మంది తమ అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అభ్యర్థులకు టోకెన్లు జారీ చేశారు. నామినేషన్ సమయం ముగిసినా టోకెన్లు జారీ చేసిన అభ్యర్థులందరినీ నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించారు. రాజాపేట, తుర్కపల్లి సర్పంచ్ అభ్యర్థులు క్లస్టర్ కేంద్రాలకు తమ అనుచరులతో కలిసి భారీ ర్యాలీ వచ్చారు. యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి స్వయంగా జిరాక్స్ మిషన్ కూడా వెంట తెచ్చుకోవడం విశేషం. జిరాక్స్ సెంటర్లన్నీ రద్దీగా ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో నామినేషన్కు జతపర్చాల్సిన ధ్రువీకరణ పత్రాలను తానే జిరాక్స్ తీసుకున్నారు. ముగిసిన తొలి విడత నామినేషన్లు ఫ చివరి రోజు క్లస్టర్ కేంద్రాల్లో బారులుదీరిన అభ్యర్థులు ఫ టోకెన్లు ఇచ్చి సమయం ముగిసినా నామినేషన్ దాఖలుకు అనుమతి ఫ రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగిన ప్రక్రియ ఫ నేడు నామినేషన్ల పరిశీలన.. ఫ 3న ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన మొదటి విడత నామినేషన్లు మొత్తం మండలం జీపీలు చివరి రోజు మొత్తం ఆలేరు 16 61 101 ఆత్మకూర్ 23 80 156 బి.రామారం 35 104 171 రాజాపేట 23 33 89 తుర్కపల్లి 33 102 198 యాదగిరిగుట్ట 23 60 129 మొత్తం 153 440 844 వార్డు స్థానాలుఆలేరు 140 230 276 ఆత్మకూర్ 192 369 433 బి.రామారం 284 406 524 రాజాపేట 206 142 237 తుర్కపలి 266 380 564 యాదగిరిగుట్ట 198 249 416 మొత్తం 1,286 1,776 2,450 -
హైవేలపై ఇక నో టెన్షన్
ఆలేరు బైపాస్ వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ బోర్డు ఆలేరు: నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి భద్రత, మెరుగైన సౌకర్యం కల్పించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారుల పొడవునా క్యూఆర్ (క్విక్ రియాక్షన్)కోడ్లతో కూడిన సమాచార సైన్బోర్డులను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులకు ఏదైనా అత్యవసర సమయం ఎదురైనపుడు తక్షణమే సులభంగా సేవలు కల్పించేందుకు క్యూఆర్ కోడ్లు దోహదపడుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 13 చోట్ల క్యూఆర్ కోడ్లు హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి 53 నుంచి వరంగల్ బైపాస్ వరకు క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేశారు. కోమల్ల, కోమటిపల్లి టోల్ప్లాజాలతో పాటు పెట్రోల్ బంక్లు, ముఖ్యమైన కూడళ్ల వద్ద మొత్తం 13 చోట్ల క్యూఆర్ కోడ్ బోర్డులు సేవలందిస్తున్నాయి. సమాచారం పొందడం ఇలా.. వాహనదారులు క్యూఆర్ కోడ్ను తమ సెల్ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే ఫోన్లో జాతీయ కిలో మీటర్ల పరిధి, గస్తీ అధికారుల నంబర్లు, రెసిడెంట్ ఇంజనీర్ల ఫోన్ నంబర్లు, పోలీసుస్టేషన్లు, ఆస్పత్రులు,హైవే నిర్వహణ అధికారుల సమాచారం,హెల్ప్లైన్ నంబర్లు, టాయిలెట్లు, హోటళ్లు, వాహన సర్వీస్ కేంద్రాలు, సెల్ చార్జింగ్ సెంటర్లు, ట్రక్ల పార్కింగ్ స్థలాలు, టోల్ప్లాజాలు, ఫంక్చర్ షాప్లు.. తదితర వాటికి సంబంధించిన సమాచారం స్క్రీన్పై వస్తుందని ఎన్హెచ్ఐఏ రెసిడెంట్ ఇంజనీర్ మధుసూదన్ తెలిపారు. ఫ ఎన్హెచ్–163పై క్యూఆర్ కోడ్లతో సైన్ బోర్డులు ఏర్పాటు ఫ అత్యవసర సమయంలో తక్షణమే సులభంగా సేవలు -
కేసీఆర్ దీక్షతోనే కేంద్రం దిగొచ్చింది
భువనగిరి : స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్షతోనే నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శనివారం భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావు అంచులదాకా వెళ్లిన గొప్ప నాయుకుడు కేసీఆర్ అని, అలాంటి నాయకుడిపై ఎవరైనా నోరు జారితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ దేవుడని, ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేత అని కొనియాడారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్ నాయకులు అనుభవిస్తున్న పదవులు కేసీఆర్ చలువేనని పేర్కొన్నారు. అటువంటి మహానేతను ఆరోగ్యం బాగలేదని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం దారుణమన్నారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని, మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగే వరకు పోరాటం చేస్తామన్నారు.అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిషోర్కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, గాదె నరేందర్రెడ్డి, రాకేశ్రెడ్డి, కొల్పుల అమరేందర్, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ తెలంగాణకు కాంగ్రెస్ నుంచి విముక్తి కలిగే వరకు పోరాటం -
ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దష్ట్యా నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 17 వరకు కోడ్ అమల్లో ఉంటుందని, ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు. రెండు తండాలు.. ఒక్కో నామినేషన్ బొమ్మలరామారం : మండలంలోని లక్ష్మీతండా, రామస్వామి తండాల్లో సర్పంచ్ పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. లక్ష్మీతండా సర్పంచ్ అభ్యర్థిగా దీరావత్ భిక్షపతి , రామస్వామితండా సర్పంచ్ అభ్యర్థిగా దీరావత్ సునీత నామినేషన్ వేశారు. వీరి నామినేషన్లలో అన్నీ సవ్యంగా ఉంటే వారిద్దరూ ఏకగ్రీవం కానున్నారు. అదే విధంగా లక్ష్మీతండాలో 8 వార్డుకు, రామస్వామి తండాలోని 6 వార్డులకు గాను ఒక్కో నామినేషన్ మాత్రమే వచ్చింది. వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవం కానున్నాయి.21న లోక్ అదాలత్ భువనగిరిటౌన్ : డిసెంబర్ 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా న్యాయవాదులు, పోలీస్ అధికారులు చొరవ చూపాలని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు సూచనల మేరకు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదాతో కలిసి జిల్లాలోని ఏసీపీలతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీపడదగిన కేసులను గుర్తించడంతో పాటు కక్షిదారులు రాజమార్గం అనుసరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. లోక్అదాలత్పై అవగాహన కల్పించాలని సూచించారు. నామినేషన్ల పరిశీలన తుర్కపల్లి: మండలంలోని మాదాపురంలో నామినేషన్ల ప్రక్రియను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతురావు పరిశీలించారు. మూడు రోజుల్లో మొత్తం దాఖలైన నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలి యాదగిరిగుట్ట: రాష్ట్రంలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థానం డిసెంబర్ 1న ప్రత్యేకంగా గిరిప్రదక్షిణ నిర్వహించనుందని ఆలయ ఈఓ వెంకట్రావ్, అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఉదయం 5గంటలకు యాదగిరి కొండ చుట్టూ ప్రదక్షిణ ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం నేరుగా వెళ్లి కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అయ్యప్ప మాలధారులు గిరి ప్రదక్షిణలో పాల్గొని, శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు. ‘ప్రీ ప్రైమరీ’ బలోపేతంలో బోధకుల పాత్ర కీలకం భువనగిరి : ప్రీ ప్రైమరీ పాఠశాలలను బలోపేతం చేయడంలో బోధకుల పాత్ర కీలకమని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లోని బోధకులకు భువనగిరిలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. శిక్షణ తరగతుల్లోని అంశాలను ఓపిక, సహనంతో చిన్నారులకు నేర్పించాలన్నారు. ఏఎంఓ జాని అఫ్ఘని, జిల్లా రిసోర్స్ పర్సన్లు జ్యోతిర్మయి, కృష్ణవేణి, భిక్షమయ్య, రహీం పాల్గొన్నారు. -
అధునాతన హంగులతో అన్నప్రసాద కేంద్రం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించేందుకు గాను శాంత రుష్యశృంగ అన్నప్రసాద కేంద్రాన్ని వైటీడీఏ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఈ అన్న ప్రసాద భవనాన్ని ఆదివారం ఉదయం 10.42గంటలకు దాతలు వేగేశ్న సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2021లో పనులు ప్రారంభం.. యాదగిరి కొండకు దిగువన ఆధ్యాత్మిక వాడలో అన్నదాన భవన నిర్మాణ పనులకు 2021 మార్చిలో శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మార్చి 23న పనులు పూర్తయినప్పటికీ కొన్ని కారణాల చేత భవనాన్ని ప్రారంభించలేదు. ఈ అన్న ప్రసాద కేంద్రం నిర్మాణానికి 2.7ఎకరాల స్థలాన్ని వైటీడీఏ కేటాయించగా.. 1.3 ఎకరాల్లో అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణానికి వేగేశ్న ఫౌండేషన్ సంస్థ మొదట రూ.11కోట్లు విరాళం అందజేసింది. ఆ తర్వాత వైటీడీఏ సుమారు రూ.11కోట్ల వరకు ఖర్చు చేసింది. గతేడాది క్రితం మిగిలిన పనుల కోసం తిరిగి వేగెశ్న సంస్థ మరో రూ.2కోట్లు ఇచ్చింది. ఒకేసారి 900 మంది భోజనం చేసేలా.. అన్నదాన భవనంలో 2 డైనింగ్ హాల్స్, రెండు వెయిటింగ్ హాల్స్, 12 స్టోర్రూమ్లు నిర్మించారు. అంతేకాకుండా 25శాతం స్థలంలో కిచెన్ సైతం ఏర్పాటు చేశారు. ఒకేసారి ఒక్కో హాల్లో సుమారు 450 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. భక్తుల కోసం బయట గార్డెన్ సైతం ఏర్పాటు చేశారు. దీంతో గత మూడు, నాలుగు సంవత్సరాలుగా కొండకు దిగువన లక్ష్మీ పుష్కరిణి పక్కన దీక్షాపరుల మండపంలో తాత్కాలికంగా కొనసాగుతున్న అన్న ప్రసాద కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఊరట లభించనుంది. ఫ యాదగిరిగుట్టలో నేడు ప్రారంభం -
ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర కీలకం
భూదాన్పోచంపల్లి: ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ల (పీఓ) పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పీఓలు, ఓపీఓలకు స్థానిక ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్కు సన్నద్ధత, బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు తదితర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తారని, అందువల్లనే ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందన్నారు.పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం , సీల్ వేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని పలుమార్లు సరి చూసుకోవాలని పేర్కొన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుడికి రెండు ఓట్లు వేయాల్సి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకు ముందు జూలూరులో ధాన్యం కొనుగోళ్లన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంఈఓ ప్రభాకర్, సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి, పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
శిక్షణకు హాజరుకాని పీఓలు వివరణ ఇవ్వాలి
భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి శుక్రవారం మండల పరి షత్ కార్యాలయాల్లో ఇచ్చిన శిక్షణకు హాజరు కాని వారు వివరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. 24 గంటల లోపు రిపోర్ట్ ఇవ్వాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసు జారీ చేస్తామని, అయినా స్పందించకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. 30న ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలుభువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీగిరి విజయకుమార్రెడ్డి, తునికి విజయసాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో నిర్వహించే పురుషులు, మహిళల ఎంపీక పోటీలకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ వెంట ఆధార్కార్డుతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని ఉదయం 10 గంటలకు వరకు హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కోచ్ సంపత్ను 9182842387లో సంప్రదించాలని కోరారు. అలరించిన ప్లానిటోరియం షో భువనగిరి : జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ ఐఐటీ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన ప్లానిటోరియం షో ఆకట్టుకుంది. గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, రాకెట్ లాంచ్ అయ్యే విధానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. భౌగోళికంగా చోటు చేసుకునే మార్పులను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ప్లానిటోరియం వంటి ప్రదర్శనలు దోహదపడుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పగిడాల జలేందర్రెడ్డి, డైరెక్టర్ పురేందర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట: పంచ నారసింహుడి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనల్లో భాగంగా ఆండాళ్దేవికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలోకి వేంచేపు చేయించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోన స్వయంభూలకు అభిషేకం, తులసీ దళ సహస్రనామార్చన గావించారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు చేపట్టారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
దొడ్డు రకాలు అమ్మడం సులభం
యాసంగి సీజన్లో దొడ్డు రకం వరి సాగు చేస్తున్నాం. విత్తనాలు కూడా కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఎకరం పొలాన్ని నాట్లకు సిద్ధం చేశా. బోరులో నీరు పెరిగితే మరో ఎకరం నాట్లు వేస్తాం. దొడ్డు రకాలు అమ్ముకోవడం సులభం. –వంగూరి పర్వతాలు, జనగామ దొడ్డు రకాలు వరి తక్కువ కాలంలో చేతికి రావడంతో పాటు అధిక దిగుబడినిస్తుంది. తేమ ఎక్కువగా ఉన్నా మిల్లుల్లో కొనుగోలు చేస్తారు. నాకున్న మూడు ఎకరాల భూమిలో దొడ్డు రకం వరి విత్తనాలు మొలక పోశాను. –కొర్ర జగ్గిరాం, గంగమూలతండా -
దీక్షా దివస్ను జయప్రదం చేయాలి
భువనగిరి: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరిలో దీక్షా దివస్ నిర్వహించే ప్రాంతాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. స్వరాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. ఆ దీక్షతో కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం 10 గంటలకు దీక్షా దివస్ ప్రారంభం అవుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, మాజీ మున్సిపల్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి -
ఏకగ్రీవాలకు అందని నజరానా
సాక్షి యాదాద్రి: సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వ పరంగా రూ.10 లక్షలు చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు ఆప్పటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రూ.15లక్షలు, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆ ఫండ్ వస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఆశతో కలిసికట్టుగా 59 పంచాయతీలను జనం ఏకగ్రీవం చేసుకున్నారు. పాలకవర్గాల పదవీకాలం ముగిసి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క పంచాయతీకి పైసా నిధులు రాలేదు. ఏకగ్రీవంపై గ్రామాల్లో చర్చ తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 427 సర్పంచ్లు, 3,826 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. శనివారం(నేడు)తో తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఏకగ్రీవాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏకగ్రీవం కోసం ఆశావహులు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వ్యక్తిగత మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకగ్రీవంపై గ్రామాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మంత్రి వెంకట్రెడ్డి ప్రకటనతో ఆశలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షల నజారానా ప్రకటించడం యాదాద్రి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీలను ఏకగ్రీవం చేయుటకు కసరత్తు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ 2019 ఎన్నికల్లో 59 పంచాయతీలు ఏకగ్రీవం ఫ ఈసారైనా నజరానా అందేనా? -
టికెట్ వస్తే ఓకే.. లేదంటే జంప్!
సాక్షి, యాదాద్రి : పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న నేతల నేతల సంఖ్య పెరిగిపోతోంది.టికెట్ రాలేదని కొందరు, భవిష్యత్ కోసం ఇంకొందరు, సొంత పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులతో మరికొందరు.. ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ప్రధాన పార్టీల్లో ఎక్కువగా ఉంది. ముందస్తు హామీ తీసుకొని పార్టీ మారిపోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో పోటీ అధికం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో పార్టీ నుంచి కనీసం ఐదారుగురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో సానుభూతిపరులు సైతం టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ దక్కని వారు పార్టీతో నిమిత్తం లేకుండా నామినేషన్ వేస్తున్నారు. వార్డు స్థానాలకు సైతం తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్గా బరిలో నిలవాలనుకున్న నాయకులు చాలా చోట్ల రిజర్వేషన్లు అనుకూలించలేదు. దీంతో వారు ఉప సర్పంచ్ పదవులపై కన్నేసి బరిలోకి దిగుతున్నారు. భవిష్యత్పై ముందుగా భరోసా ఇస్తేనే.. పార్టీలు మారే నాయకులు తమ రాజకీయ భవిష్యత్పై ముందే భరోసా తీసుకుంటున్నారు. తమకు ఇచ్చే ఆఫర్లను బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. బొమ్మలరామారం మేజర్ గ్రామ పంచా యతీ స్థానానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుర్రాల లక్ష్మారెడ్డి మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు మరి కొందరు నాయకులు టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో లక్ష్మారెడ్డి తన అనుచరులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వుడ్ అయ్యింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పులేపాక లావణ్యశ్రీనివాస్, మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ రాదని తేలిపోవడంతో పార్టీని వీడారు. తమ అనుచరులతో కలిసి డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడిమహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన పాలసంఘం చైర్మన్, కాంగ్రెపా ర్టీకి చెందిన సీనియర్ నాయకుడు పయ్యావుల ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి శుక్రవారం బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆలేరు మండలం మంతపురిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సతీష్రెడ్డి ఎంతోకాలంగా సర్పంచ్ టికెట్ ఆశిస్తున్నాడు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకు న్న కొరుటూరి భిక్షపతికి నిరాశే మిగిలింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టికెట్ల లొల్లి ఫ బీసీ, జనరల్ స్థానాల్లో తీవ్ర పోటీ ఫ ఒక్కో పార్టీ నుంచి ఐదారుగురు ఆశావహులు ఫ టికెట్ దక్కని నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఫ అనుచరులతో కలిసి పార్టీ మార్పు -
మద్యం అమ్మకాలపై ఆబ్కారీ ఆంక్షలు
ఎన్నికల నియమావళిని ఉల్లఘించి ఎవరైనా మద్యం పంపకాలు చేసినా, నిల్వ చేసినా కంట్రోల్రూంకు సమాచారం ఇవ్వాలి. ఎకై ్సజ్ సిబ్బందితో పాటు డీటీఎఫ్, ఎస్టీఎఫ్ బృందాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తాయి. –విష్ణుమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆలేరు: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఎన్నికల సందర్భంగా కొంతమంది నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మద్యం దుర్విని యోగం కాకుండా ఉండేందుకు ఎన్ని కల కమిషన్ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఆంక్షలు విధించింది. విచ్చలవిడిగా మద్యం విక్రయించకుండా పరిమితి విధించింది. నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం అక్రమరవాణాపై ఫిర్యాదు చేయడానికి, ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మద్యం పంపకాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని ఆలేరు, మోత్కూరు, భువనగిరి, రామన్నపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల్లో కంట్రోల్రూంలు ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. ఒకరికి ఆరు ఫుల్ బాటిళ్లు ఒకరికి ఆరు ఫుల్బాటిళ్లు, బీర్లు అయితే ఒక కాటన్ మాత్రమే విక్రయించాలని ఎకై ్సజ్ అధికారులు వైన్స్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. సదరు వ్యక్తులు కొనుగోలు చేసిన మద్యాన్ని బెల్ట్షాప్లకు లేదా గ్రామాల్లో ఓటర్లకు పంపకాలకు వినియోగించినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోనున్నారు.ఆలేరు 8712658955మోత్కూరు 8712658957 భువనగిరి 8712658956రామన్నపేట 8712658958 ఫ వినియోగదారులకు పరిమితి మేరకే మద్యం విక్రయం -
దొడ్డు రకం వరిపైనే మక్కువ
దొడ్డు రకాలు సన్నాల కంటే అధిక దిగుబడి వస్తాయి. విత్తనాల ఆధారంగా దొడ్డు రకాలు యాసంగి సీజన్లోనూ 20 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, నీరు అందకపోయినా తట్టుకునే శక్తి ఉంటుంది. ధాన్యం అమ్మకం సులభం. చేనుపైనే హార్వెస్టింగ్ చేసి నేరుగా మిల్లులకు తరలించి అమ్మకోవచ్చు. తేమ శాతం ఉన్నా విక్రయించే సమయంలో పెద్దగా ఇబ్బందులుండువు. ఫ పంటకాలం, చీడపీడలు తక్కువ, దిగుబడి ఎక్కువ రావడమే కారణం ఫ మార్కెటింగ్ సులభం ఫ సన్నాలకు బోనస్ ఇస్తున్నా ఆసక్తి చూపని రైతులు సంస్థాన్ నారాయణపురం: జిల్లాలో యాసంగి సీజన్ పరిస్థితి మారిపోతోంది. మునుపటితో పోలిస్తే ఎక్కువగా దొడ్డు రకాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. సన్నాలకు పెట్టుబడి పెరగడం, దిగుబడి తక్కువ, చివరి సమయంలో నీరు సరిగా అందకపోతే నూక అధికంగా వస్తుండటంతో తదితర కారణాల వల్ల అధికంగా దొడ్డు రకాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుత యాసంగిలో మొత్తం 3,12,500 ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో సన్నాలు 62,500 ఎకరాలు, దొడ్డు రకాలు2,50,00 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. వానాకాలం జిల్లా వ్యాప్తంగా 2,95,000 ఎకరాల్లో వరి సాగు కాగా.. అందులో 1,03,250 ఎకరాల్లో సన్నాలు, 1,91,750 ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేశారు. వానాకాలంతో పోలిస్తే యాసంగిలో సన్నాల వరి సాగు 40,750 ఎకరాలు తగ్గే అవకాశం ఉంది. దొడ్డు రకాలు 58,250 ఎకరాలు పెరగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సన్నాలకు సమస్యలెన్నో.. సన్న వడ్లకు మద్దతు ధర అధిక ఉండటంతో పాటు ప్రభుత్వం బోనస్ ఇస్తున్నా రైతులు అసక్తి చూపడం లేదు. ప్రధానంగా పంట చేతికి వచ్చే సమయానికి వేసవి కాలం వస్తుంది. అప్పుడు ధాన్యం మరపట్టిస్తే(మిల్లింగ్) ఆధిక నూక శాతం ఉంటుంది. నీరు సరిగా అందకపోతే బియ్యపు గింజ నూకగా మారే అవకాశం ఉంది. సన్నాల సాగు కాలం అధికంగా ఉంటుంది. నీటి సరిగా అందకపోతే చేను తట్టుకొదు. పొట్ట దశలో దోమకాటు వస్తే గింజ మీద మచ్చలు ఏర్పడుతున్నాయి. మచ్చలు పడిన ధాన్యానికి మార్కెంటింగ్ కష్టమవుతుంది. అకాల వర్షాలు వస్తే దిగుబడి తగ్గుతుంది.సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. సన్నాలు తేమ శాతం ఉంటే రంగు మారుతుంది. కాబట్టి తేమ, తాలు లేకుండా, శుభ్రంగా ఉంటేనే కొనుగోలు చేస్తారు. యాసంగి అంచనా.. ఎకరాల్లోమొత్తం సాగు 3,12,500దొడ్డు రకాలు 2,50,500సన్నాలు 62,500వానాకాలం సాగైంది మొత్తం 2,95,000 దొడ్డు రకాలు 1,91,750 సన్నాలు 1,03,250 -
సూర్యాపేట వాసికి ఇండియా ఫార్మా అవార్డు
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్కు చెందిన ప్రముఖ సైంటిస్ట్, పారిశ్రామికవేత్త డాక్టర్ అనంతుల రవిశేఖర్ నేషనల్ ఇండియా ఫార్మా అవార్డు అందుకున్నారు. శాస్త్రవేత్తగా తాను చేసిన ప్రయోగాత్మక సేవలకుగాను ఢిల్లో జరిగిన ఫార్మా క్వాలిటీ ఎక్స్లెన్స్ అవార్డు ప్రదానోత్సవంలో సీపీహెచ్ఐ ఆర్గనైజింగ్ వారు ఈ పురస్కారం అందించినట్లు ఆయన తెలిపారు. బాల రచయితల సమ్మేళనానికి ఎంపిక కోదాడ : కోదాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సోమ రమేష్ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ నెల 30న ఆన్లైన్లో ‘బాల సాహిత్య భేరి’ పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనానికి ఎంపికయ్యాడు. కథ, వచన కవిత్వం, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా 101 మంది విద్యార్థులకు తానా సంఘం అవకాశం ఇవ్వగా కోదాడకు చెందిన విద్యార్థి సోమ రమేష్ ఆ జాబితాలో ఉన్నాడు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని మండల విద్యాధికారి సలీంషరీఫ్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. -
బంగారు బ్రాస్లెట్ అప్పగింత
మునగాల: పెట్రోల్ బంక్లో బంగారు బ్రాస్లెట్ పోగొట్టుకున్న వ్యక్తికి ఆ ఆభరణాన్ని బంక్ యజమాని తిరిగి అతడికి అందజేశారు. మునగాల మండల కేంద్రం శివారులో గల భారత్ పెట్రోల్ బంక్లో ఓ వినియోగదారుడు ఈనెల 21న రాత్రి తన కారులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చి తన చేతికి ఉన్న బంగారు బ్రాస్లెట్ పోగొట్టుకున్నాడు. బైక్లో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన బరాఖత్గూడెం గ్రామానికి చెందిన గోవింద లింగరాజుకు బ్రాస్లెట్ లభించడంతో దానిని బంక్ సిబ్బందికి అందించి పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయాలని తెలిపాడు. ఈక్రమంలో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ఓ వ్యక్తి చూసి బ్రాస్లెట్ పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెనబోయిన రాంబాబుకు తెలిపాడు. రాంబాబు ఆభరణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, బంక్లో డీజిల్కు సంబంధించిన బిల్లులు బంక్ యాజమాన్యానికి పంపించడంతో అన్నీ పరిశీలించి గురువారం రాత్రి రాంబాబు, నాగమణి దంపతులకు బంక్ యజమాని హిమబిందు బ్రాస్లెట్ అందజేశారు. రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతినల్లగొండ, చిట్యాల : చిట్యాల–రామన్నపేట రైల్వే స్టేషన్ల మధ్యలో గురువారం రైల్లో నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతిచెందినట్లు నల్లగొండ రైల్వే ఎస్ఐ బి. రామకృష్ణ పేర్కొన్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50ఏళ్ల మద్యలో ఉంటుందని రైల్వే ఎస్ఐ తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడు తెల్లటి గడ్డంతో పాటు స్వచ్ఛ భారత్ అని ఇంగ్లిష్లో రాసి ఉన్న వైట్ టీషర్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. నల్లగొండ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, మృతుడి వివరాలు తెలిస్తే 87126 58595ను సంప్రదించాలని సూచించారు. -
వార్డు సభ్యుడి నుంచి..మండలి చైర్మన్గా
చిట్యాల: చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అలాంటిది గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అనంతర కాలంలో పార్లమెంట్ సభ్యుడుగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర శాసనమండలి చైర్మన్గా అంచెలంచెలుగా ఎదిగారు చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుత్తా సుఖేందర్రెడ్డి. గుత్తా ప్రస్థానం ఇలా..గుత్తా సుఖేందర్రెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1981లో ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1984లో చిట్యాల వ్వవసాయ మార్కెట్ వైస్ చైర్మన్గా నామినేట్ అయ్యారు. 1985లో మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1992లో చిట్యాల సింగిల్ విండో చైర్మన్గా గెలుపొందారు. 1992–99 వరకు వరుసగా ఉరుమడ్ల గ్రామ పాలఉత్పత్తిదారుల సంఘం చైర్మన్గా ఎన్నికై నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల యూనియన్ చైర్మన్గా పనిచేశారు. 1995–99 వరకు ఏపీ డెయిరీ చైర్మన్గా పనిచేస్తూనే నేషనల్ డెయిరీ బోర్డు సభ్యుడుగానూ కొనసాగారు. 1995లో దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. ఎంపీ, ఎమ్మెల్సీగా..1999లో నల్లగొండ లోక్సభ స్థానం నుంచి గుత్తా సుఖేందర్రెడ్డి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో, 2014లో నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు. 2018 నుంచి 2019 వరకు క్యాబినేట్ హోదాలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. మొదటిసారిగా 2019–21 వరకు ఎమ్మెల్సీగా వరకు పనిచేశారు. రెండోసారి 2021న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 నుంచి రాష్ట్ర శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి పనిచేస్తున్నారు. ఇలా గుత్తా సుఖేందర్రెడ్డి గ్రామస్థాయి నుంచి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగారు. -
పార్టీల జెండా దిమ్మెలకు సున్నం
భూదాన్పోచంపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు ఆయా గ్రామాల్లోని రాజకీయ పార్టీలకు చెందిన జెండా దిమ్మెలకు సున్నం వేయించారు. అదేవిధంగా రాజకీయ నాయకుల విగ్రహాలు, శిలాఫలకాలను బట్టతో మూసివేశారు. అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు లెక్చరర్నార్కట్పల్లి : మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన సోమనబోయిన ధనలక్ష్మి 2007లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా గెలుపొందారు. సర్పంచ్గా కొనసాగుతూనే 2009–2010లో బీఈడీ, 2010– 2012లో పీజీ పూర్తి చేశారు. ప్రస్తుతం నకిరేకల్ మండలం చందుపట్ల గురుకుల జూనియర్ కళాశాలలో తెలుగు ఽఅధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. ధనలక్ష్మి సర్పంచ్ గా ఉన్న సమయంలో బ్రాహ్మణ వెల్లంల గ్రామ పంచాయతీ 2007–2008 నిర్మల్ పురస్కారానికి ఎంపికై ంది. కుల ధ్రువీకరణ పత్రం ఉందా..తిరుమలగిరి (తుంగతుర్తి) : సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో నిలిచే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తమ నామినేషన్ల పత్రాలకు కుల ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. అయితే కొత్తగా కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. గత మూడేళ్లలో తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం నంబర్తో మీ సేవ కేంద్రాలకు వెళ్తే అప్డేట్ చేసి ప్రస్తుత తేదీతో జారీ చేస్తారని పేర్కొన్నారు. ఓటు వేయాలంటే దూరం నడవాల్సిందేగట్టుప్పల్ : గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గిరిజన తండాలకు చెందిన ఓటర్లకు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూరభారం తప్పడం లేదు. అంతంపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్కు రంగంతండా సుమారు 1.5 కిలోమీటర్లు, అజనాతండా 3 కిలోమీటర్లకు పైగా, దేవులతండా 0.5 కిలోమీటర్లు, రాగ్యాతండా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ నాలుగు తండాల్లో సుమారు 650మంది ఓటర్లు ఉన్నారు. ఆయా తండాల ప్రజలు ఏళ్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతంపేటకు వస్తున్నారు. దీంతో వృద్ధులు, అంగవైకల్యం కల్గిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అంతంపేట ప్రాథమిక పాఠశాలలోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు మండల పంచాయతీ అధికారి సునీత తెలిపారు. ● ఎన్నికల నియమావళి అమలు -
డివైడర్ను ఢీకొని యువకుడికి గాయాలు
చివ్వెంల(సూర్యాపేట) : బైక్పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన కడవంచి సతీష్ చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో వరికోత మిషన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం స్వగ్రామంలో శుభకార్యం ఉండటంతో బైక్పై వెళ్లి తిరిగి గుంపుల గ్రామానికి వస్తుండగా.. గ్రామ శివారులో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సతీష్ ఎడమ కాలు విరిగింది. చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
నకిరేకల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా
నల్లగొండ టూటౌన్ : నకిరేకల్ నియోజకవర్గంలో గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంకు సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చిరుమర్తి లింగయ్య విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తాను మంజూరు చేయించిన పనులకు ప్రస్తుత ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తూ రెండేళ్ల నుంచి పబ్బం గడపడం తప్ప కొత్తగా చేసింది ఏమిటో చెప్పాలన్నారు. గత 25 ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని.. గెలిచినా, ఓడినా ప్రజల ప్రజల మధ్యే ఉన్నానని, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే అరాచకాలు నల్లగొండ నుంచి మొదలుకొని పక్క రాష్ట్రం గుంటూరు, పిడుగురాళ్ల వరకు తెలుసన్నారు. కరపత్రాల్లో, పత్రికల్లో, శిలాఫలాలపై పేర్ల కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదన్నారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కలలను సాకారం చేసేలా అయిటిపాయిల ప్రాజెక్టు, వంద పడకల ఆస్పత్రిని తానే తీసుకొచ్చానని చిరుమర్తి తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారవేత్తలు, అధికారులను మామూళ్ల పేరిట పెడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా మొత్తం కోడై కూస్తుందన్నారు. ఒత్తిడి తట్టుకోలేకే అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తూ సస్పెండ్ అవుతున్నారన్నారు. మాట వినని అధికారులను బదిలీల పేరిట వేధింపులకు గురిచేస్తూ నియంతలా పాలిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిపై ప్రజలతో రెఫరెండం నిర్వహిస్తే ఎవరికెన్ని ఓట్లు పడతాయో తేల్చుకుందామని ఎమ్మెల్యే వేముల వీరేశంకు సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ధాన్యం లారీ బోల్తా
నూతనకల్: మండల కేంద్రంలో గురువారం తెల్లవారు జామున ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. స్థానికులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్పల్లి నుంచి ధాన్యాన్ని లారీలో మిర్యాలగూడ రైస్ మిల్లుకు తరలిస్తున్న క్రమంలో నూతనకల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అకస్మాత్తుగా వ్యక్తి రోడ్డుపైకి రావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో లారీ మెయిన్ క్రాంక్ విరిగి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. -
కాంగ్రెస్ జెండా దిమ్మెలు ధ్వంసం
చౌటుప్పల్ రూరల్ : గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ బుధవారం రాత్రి చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం, తూప్రాన్పేట గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాంగ్రెస్ జెండా దిమ్మెలను ధ్వంసం చేయడం కలకలం రేపింది. జెండా దిమ్మెలను ధ్వంసం చేయడంలో తెలంగాణ జాగృతి కార్యకర్తల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో జాగృతి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మరో నలుగురు ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. జాగృతి ఎల్బీనగర్ జోన్ అధ్యక్షుడిగా ఉన్న మన్సురాబాద్కు చెందిన రాంకోటిని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో నలుగురిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇద్దరు, హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్కు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల వేళ సంచలనం సృష్టించడానికే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసుల అదుపులో ఉన్న రాంకోటి చెప్పినట్లు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..కాంగ్రెస్ జెండా దిమ్మెలను జాగృతి కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు గురువారం దండుమల్కాపురం, తూప్రాన్పేట గ్రామాలకు భారీగా తరలివచ్చారు. కూల్చిన జెండా దిమ్మెలను పరిశీలించారు. జెండా దిమ్మెలను ధ్వంసం చేయడం పిరికపంద చర్య అని, దిమ్మెలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి పబ్బు రాజుగౌడ్, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, మండల అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహ తదితరులు జెండా దిమ్మెలను పరిశీలించిన వారిలో ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు కాంగ్రెస్ జెండా దిమ్మెలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ కె. ఉపేందర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. దండుమల్కాపురం, తూప్రాన్పేటలో ఘటనలు పోలీసుల అదుపులో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు -
మద్యం, నగదు రవాణాపై నిఘా
ఫ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తుఫ ఆలేరు, పంతంగి, బీబీనగర్, బొమ్మలరామారం వద్ద చెక్పోస్టులు ఫ రాత్రివేళ గ్రామాల్లో పోలీసుల గస్తీ ఆలేరు: పల్లెపోరు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా దృష్టిసారించింది. జిల్లాలో ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, రాజా పేట, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం), బొమ్మలరామా రం, యాదగిరిగుట్ట మండలాల పరిధిలో 154 గ్రామ పంచాయతీల్లో డిసెంబర్ 11న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన ప్రతి క్లస్టర్ వద్ద ఇద్దరు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైవే కనెక్టివిటీ రూట్లపై ప్రత్యేక దృష్టి ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పట్ష్టి చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జాతీయ కనెక్టివిటీ ఉన్న మార్గాలైన ఆలేరు, పంతంగి, బీబీనగర్, బొమ్మలరామారంలో గురువారం చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా చెక్పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నారు. గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రతి వాహనం వివరాలను సేకరించనున్నారు. ఆలేరు: ఎన్నికల సందర్భంగా ముందస్తు అనుమతులు లేకుండా సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ రాచకొండ సీపీ సుధీర్బాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. ఆదేశాలు ఉల్లంఘించే వ్యక్తులు హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం 1348ఫస్లి(చట్టంఐగీ) కింద ప్రాసిక్యూషన్కు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. క్లస్టర్లతో పాటు గ్రామాల్లో పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల నియంత్రణతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాత్రి వేళలో పోలీసుల గస్తీ ఏర్పాటు చేశాం. 29వ తేదీన ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగుతాయి. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వాలి. –అక్షాంశ్యాదవ్, డీసీపీ -
సర్పంచ్కు 205, వార్డులకు 134
తొలి విడత మొదటి రోజు భారీగా నామినేషన్లు ఫ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ఫ ఆరు మండలాల్లో 153 సర్పంచ్లు, 1,286 వార్డు స్థానాలు సాక్షి,యాదాద్రి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత నామినేషన్ల పర్వం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయగానే ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. 153 సర్పంచ్ స్థానాలకు మొదటి రోజు 205 నామినేషన్లు, 1,286 వార్డు స్థానాలకు 134 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం తరువాత ఊపందుకున్న నామినేషన్లు నామినేషన్ల ప్రక్రియ ఉదయం సమయంలో మందకొడిగా సాగింది. నామినేషన్ పత్రాలకు జతపర్చాల్సిన సర్టిఫికెట్లు, బ్యాంకు ఖాతాలు సకాలంలో అందకపోవడంతో అభ్యర్థులు వేచిచూడాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమై నాలుగు గంటల తర్వాత ఊపందుకుంది. శుక్ర, శనివారాల్లో అష్టమి, నవమి ఉందని చాలామంది మొదటి రోజునే నామినేషన్లు వేశారు. 427 పంచాయతీలు భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగుతుర్తి, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో ఆలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 153 పంచాయతీలు, 1,286 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 150 పంచాయతీలు, 1,332 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడవ విడతలో మునుగోడు, తుంగతుర్తి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 124 పంచాయతీలు, 1,086 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ స్థానాలకు దాఖలైన నామినేషన్లు మండలం జీపీలు నామినేషన్లుఆలేరు 16 16 రాజాపేట 23 34 యాదగిరిగుట్ట 23 31 బిరామారం 35 33 ఆత్మకూర్ 23 43 తుర్కపల్లి 33 49 మొత్తం 153 205 వార్డు స్థానాలకు.. ఆలేరు 140 09 రాజాపేట 206 21 యాదగిరిగుట్ట 198 49 బి.రామారం 284 07 ఆత్మకూర్ 192 14 తుర్కపల్లి 266 34 మొత్తం 1,286 134 -
29న దివ్యాంగులకు క్రీడా పోటీలు
భువనగిరిటౌన్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఈనెల 29న క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్సింహరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలు, 18 నుంచి 54 ఏళ్ల వయస్సులోపు మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చిన్న నీటి వనరుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి భువనగిరి : చిన్న నీటిపారుదల వనరుల గుర్తింపునకు జిల్లా వ్యాప్తంగా సర్వే చేయనున్నట్లు జిల్లా ప్రఽణాళిక అధికారి వెంకటరమణ తెలిపా రు. గురువారం భువనగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు చిన్న నీటి వనరుల సర్వేపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి 2 వేల హెక్టార్ల లోపు ఉన్న నీటి వనరుల గణన చేస్తారని పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో సర్వే చేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. మీడియా సెంటర్ ప్రారంభంభువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ను ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారంపై తదితర వాటిపై మీడియా సెంటర్ ద్వారా నిఘా ఉంటుందన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఆలేరురూరల్: ఎన్నికల్లో స్టేజ్–2 అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్టేజ్–2 అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సమీక్షించి వారికి సూచనలు చేశారు. నేడు పీఓలకు శిక్షణ భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారుల(పీఓ)కు శుక్రవారం శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 15 రైతువేదికల్లో రెండు విడుతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో 985 మంది, రెండవ సెషన్లో 1,392 మంది శిక్షణలో పాల్గొంటారు. నేత్రపర్వంగా నృసింహుడి నిత్య తిరుకల్యాణంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పర్వాల్లో భాగంగా గురువారం నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి గజవాహనంపై కల్యాణ మండపంలోకి వేంచేపు చేయించి నిత్యకల్యాణం జరిపించారు. అంతకుముందు వేకువజామున సుప్రభాత సేవతో స్వామివా రిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, వెండి జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
వేలం వేస్తే ఎన్నిక చెల్లదు
ఫ రుజువైతే ఎన్నికై న ప్రతినిధులపై అనర్హత వేటు ఫ ఖర్చుపై అభ్యర్థులు ముందుగానే డిక్లరేషన్ ఇవ్వాలి ఫ సంతానం ఎంతమంది ఉన్నా పోటీ చేయొచ్చు‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సాక్షి, యాదాద్రి: ‘పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం అక్రమం.. అటువంటి ఎన్నిక చెల్లదు.. రుజువైతే ఎన్నికై న ప్రతినిధులపై అనర్హత వేటు పడుతుంది’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సర్పంచ్ పదవులను కొనుగోలు చేసే విధంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారు శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఓటు చిత్తు కాకుండా ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ‘సాక్షి’ వెల్లడించారు. పదవులు వేలం వేయాలనే నిర్ణయం తప్పువేలం ద్వారా సర్పంచ్ పదవులు దక్కించుకోవాలనే నిర్ణయం తప్పు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ సీరియస్గా ఉంది. డబ్బులు ఇచ్చి పదవి ఏకగ్రీవం చేసుకుంటామని కొందరు సోషల్ మీడియాలో, గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటివారిని గుర్తించడానికి నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. వేలం పాటల ద్వారా ఎన్నికై న సర్పంచ్లు పదవిని కోల్పోతారు. రూల్స్ ఉల్లంఘిస్తే అనర్హత సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తామని ముందుగానే ఎన్నికల అధికారులకు అఫిడవిట్ ఇవ్వాలి. ప్రతి అభ్యర్థి కొత్తగా బ్యాంకులో అకౌంట్ తీయాలి. పరిమితికి మించి ఖర్చు చేస్తే వారిని ఎన్నికల కమిషన్ అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్న్ పత్రాలు సమర్పించవచ్చు. డమ్మీ నామినేషన్న్ వేయడం మంచింది. అన్ని నామినేషన్న్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. 116 ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో 116 లొకేషన్లలో నామినేషన్లు స్వీకరిస్తాం. తొలివిడత జరిగే ఆరు మండలాల్లో 42 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. డిసెంబర్ 11, 14,17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు మూడు విడతల్లో 9వేల మంది విధుల్లో పాల్గొంటారు. ఆర్ఓ రూం సమయమే పరిగణనలోకి.. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.ఎన్ని కల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) రూంలోని గడియారం చూపే సమయాన్నే పరిగణలోకి తీసుకుంటాం. అభ్యర్థితో పాటు అతని వెంట మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ర్యాలీగా వచ్చే వారు నామినేషన్న్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండాలి. కులధ్రువీకరణ తప్పనిసరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే సమయానికి కుల ధ్రువీకరణ పత్రం అందకపోతే డిప్యూటీ తహసీల్దార్తో రాత పూర్వకంగా తీసుకురావాలి. నామినేషన్ స్క్రూట్నీ రోజు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ఓటు వేసే విధానంపై ప్రచారం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధానంపై ప్రచారం చేస్తాం. చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఓటు చెల్లకుండా పోతుంది. అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రదర్శనల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తాం. ఏకగ్రీవ నజరానాలపై ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల వివరాలన్నీ టి–పోల్లో.. ఎన్నికలకు సంబంధించిన వివరాలన్నీ టి–పోల్ యాప్లో అప్లోడ్ చేశాం. ప్రజలు ఏ సమాచారం కావాలన్నా టి–పోల్లో చూసుకోవచ్చు. తొలి విడత ఏర్పాట్లు పూర్తి తొలి విడత ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ నిర్వహణకు 2,742 మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. పోలింగ్ కేంద్రాలకు 3,100 బ్యాలెట్ బాక్స్లతో పాటు ఇతర సామగ్రి చేరవేశాం. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషనన్ సెంటర్లు ఏర్పాటు చేసి పోలింగ్ ముందు రోజు పంపిణీ చేస్తాం. సర్వేలెన్స్ టీం ఏర్పాటు చేశాం. అభ్యంతరాలు, ఫిర్యాదులు, ఇతర ఏ సమస్యలున్నా తెలియజేసేందుకు కలెక్టరేట్లో టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలకు 48 గంటల ముందుగానే ఆర్డీఓల నుంచి అనుమతి పొందాలి. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇప్పటి వరకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయడానికి అర్హత ఉండేది కాదు. -
నేతల హామీలు.. శిలాఫలకాలకే పరిమితమా!
గుండాల : మండలంలోని నూనెగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రెండున్నర ఏళ్ల వ్యవధిలో రెండుసార్లు ప్రజాప్రతినిధులు శిలాఫలకాలను ఆవిష్కరించి, పనులకు శంకుస్థాపన చేయడం విస్మయానికి గురిచేస్తోంది. భవన నిర్మాణానికి 2023లో ఉపాధిహామీ పథకం నిధులు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. 2023 ఫిబ్రవరిలో అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 2025 జనవరిలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే పనికి ఒకే చోట శంకుస్థాపన చేశారే తప్ప.. ఇప్పటి వరకు ఇటుక కూడా పేర్చలేదు. -
12 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో
వలిగొండ : వలిగొండ మండలం పహిల్వాన్పురం సర్పంచ్ అభ్యర్థి పచిమట్ల రేణుకామల్లేష్ 12 హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను గ్రామ సోషల్ మీడియా గ్రూప్లో వెల్లడించారు. తనను గెలిపిస్తే హామీలన్నీ నెరవేర్చి, పారదర్శక పాలన అందిస్తానన్నారు. డబ్బుకు అమ్ముడుపోకుండా ఊరిభవిష్యత్ కోసం తనను ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు. హామీలు ఇవీ.. ● గ్రామ సమస్యలపై ప్రతివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాల బలోపేతం, ప్రతి వార్డుకు అభివృద్ధి కమిటీ, గ్రామంలో గొడవలకు తావులేకుండా శాంతి కమిటీ ఏర్పాటు, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు, వీధివీధినా విద్యుత్ దీపాలు, కోసి టీవీలు, డిజిటల్ కనెక్షన్ ఏర్పాటు, ప్రతి వార్డుకు రోడ్లు, గ్రామ చెరువును మినీ రిజర్వాయర్గా మార్పు, అర్హులందరికీ ఆసరా పింఛన్లు, ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు ఇళ్లు మంజూరు చేయించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. పదవీ కాలంలో తప్పులు చేసినట్లు రుజువువైతే మీరు వేసే శిక్షకు సిద్ధమన్నారు. -
1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు
కోదాడ : ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభమైన గ్రామపంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచనలను జాతీయాభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్ రాష్ట్రం అమలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనిని 1959 అక్టోబర్2న అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని దీనిలో పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్ను ఎన్నుకునేవారు. ఎన్నికై న సర్పంచ్లు కలిసి సమితి ప్రెసిడెంట్ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. 1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి వారి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3 వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్లు ఉండేవారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం –1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థను ఆమోదించింది. మండల పరిషత్లో సర్పంచ్లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ను ఎన్నుకోవడం ప్రారంభమైంది. ఫ గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు. ఫ గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు. బకాయిలపై నోటీసులు ఇచ్చినా స్పందించని వారు. ఫ మతిస్థిమితం లేనివారు, బధిరులు. ఫ పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు. ఫ గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేస్తున్నా, నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఫ పోటీ చేసే అభ్యర్థుల పేరు ఓటరు లిస్టులో లేకున్నా, వయస్సు సరిగ్గా లేకపోయినా నామినేషన్ను తిరస్కరిస్తారు. ఫ నామినేషన్ వేసే అభ్యర్థుల సంతకాలు, ప్రతిపాదకుని సంతకాలు లేకున్నా, గత ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు 45 రోజుల్లోగా ఇవ్వని అభ్యర్థుల నామినేషన్ను అధికారులు తిరస్కరిస్తారు. -
రెఫరెండం
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీలివ్వడం, ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం.. ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోవడం పరిపాటి. కానీ, కొద్దిమంది ప్రజాప్రతినిధులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటంతోపాటు తమ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని.. అందుకు అనుగుణంగా పనిచేస్తుంటారు. అలా నల్లగొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు తమ పాలనపై రెఫరెండం నిర్వహించుకుని.. ప్రజాభిప్రాయం తీసుకున్నారు. ఈ రెఫరెండంలో ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు. స్థానిక సంస్థల్లోఆలగడప మాజీ సర్పంచ్ వేనేపల్లి పాండురంగారావు తమ పాలనపై ప్రజాభిప్రాయం తీసుకున్న ఇద్దరు సర్పంచ్లు, ఒక ఎంపీటీసీ రెఫరెండంలో మరింత ఆదరణ పొందిన ఆ నాయకులు మిర్యాలగూడ : దేశంలో 22ఏళ్ల క్రితం ఆ గ్రామం పేరు మారుమోగింది. ప్రజాస్వామ్యానికి జీవం పోసే విధంగా అప్పటి సర్పంచ్ తన పాలనపై పెట్టుకున్న రెఫరెండం దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా తన పాలనపై రెఫరెండం పెట్టుకొని గెలిచి తనకంటూ ఒక ముద్ర వేసుకోవడంతోపాటు గ్రామానికి పేరు తెచ్చి పెట్టాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం పుట్టిన గడ్డ కోసం ఖర్చు చేసి ‘తెలంగాణ మట్టి మనిషి’గా పేరుతెచ్చుకున్నాడు. మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో ‘మనిల్లు’ అని పేరు పెట్టుకుని ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తుంటాడు వేనేపల్లి పాండురంగారావు. ప్రజలే నామినేషన్ వేయించారు.. ఊరి జనం మొత్తం పాండురంగారావును సర్పంచ్గా చేయాలని పలుమార్లు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మూడుసార్లు పోటీ చేయకుండా నిరాకరించాడు. ఎట్టకేలకు 2001లో ప్రజలే ఆయనతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించారు. పాండురంగారావుకు కాంగ్రెస్, సీపీఎం మద్దతు తెలిపాయి. టీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థి బరిలో ఉన్నాడు. పాండురంగారావు కేవలం రూ.200 ఖర్చు పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో అప్పుడు సుమారు 3,800 ఓట్లు ఉండగా 3,600 ఓట్లకు పైగా పోలయ్యాయి. అందులో పాండురంగారావుకు 2,800 ఓట్లు వచ్చాయి. ఇంకా 400 ఓట్ల పోలింగ్ చిట్టీలపై అభిమానులు నినాదాలు రాయడంతో అవి చెల్లలేదు. ప్రత్యర్థికి కేవలం 400 ఓట్లు వచ్చాయి. 1400 ఓట్ల మెజారిటీతో పాండురంగారావు గెలుపొందారు. సర్పంచ్ పదవి చేపట్టిన వెంటనే ఊరిలో సారా నిషేధం పెట్టాడు. ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి చాలా మందిని సొంత ఖర్చులతో చదివించారు. 2003లో రెఫరెండం.. పాండురంగారావు సర్పంచ్గా తన రెండేళ్ల పాలనపై 2003లో రెఫరెండం పెట్టుకున్నాడు. అప్పట్లోనే దేశానికి ఆలగడప పేరును పరిచయం చేశాడు. ‘పదవిలో నేను ఉండాలా.. వద్దా..’ అని బ్యాలెట్లు ముద్రించి పోలింగ్ నిర్వహించగా 1710 మంది ఉండాలని, 70 మంది వద్దని తీర్పు ఇచ్చారు. అప్పట్లో ఆలగపడ గ్రామాన్ని జాతీయ మీడియా వెతుక్కుంటూ వచ్చింది. ఈ విజయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం దక్కించుకుంది. 2005లో పాండురంగారావు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా ఎంపికై కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు. అవినీతి రహిత పాలనపై దక్షిణాది రాష్ట్రాల తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ బెస్ట్ సర్పంచ్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది. పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. దేశంలోనే మొట్టమొదటగా ఆలగడప గ్రామంలో.. ‘సాక్షి’తో వేనేపల్లి పాండురంగారావు మా గ్రామంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న సమయంలో ప్రజలు నన్ను సర్పంచ్గా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. 2001లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి 1400 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగాక.. పదవిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండెం పెట్టాను. దానిలో 90శాతం మంది ప్రజలు పదవిలో ఉండాలని, పాలన బాగుందని తీర్పు ఇచ్చారు. ఈ రెఫరెండెం దేశ చరిత్రలో మొదటిసారి కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
అభ్యర్థులు ఖర్చు చేయాల్సింది ఇంతే
ఫ సర్పంచ్కు రూ.2.50 లక్షలు ఫ వార్డు సభ్యుడికి రూ.50 వేలు భువనగిరి టౌన్ : పంచాయతీరాజ్ చట్టంలోని 237(3)ల ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చును నిర్ణయించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయవచ్చనే విషయాన్ని నిర్ణయించారు. ఎన్నికల్లో పారదర్శకత, సమతుల్యాన్ని కాపాడేందుకు ఈ ఖర్చు పరిమితిని విధించారు. గ్రామ పంచాయతీలోని ఓటర్ల సంఖ్యను బట్టి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఖర్చు పరిమితులు నిర్ణయించారు. ఫ 5వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో గరిష్టంగా రూ. 2.50 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు సభ్యడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.50వేలు ఖర్చు చేసేందుకు వీలుంది. ఫ 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు సభ్యడిగా పోటీ చేసేవారు రూ.30 వేల వరకు ఖర్చ చేయవచ్చు. ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల ఖర్చు లెక్కలను కూడా పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. -
ప్రత్యేక గ్రీవెన్స్, ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్తో పాటు సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం తిరిగి యథావిధిగా కొనసాగుతాయన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన వాయిదా భువనగిరి: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం భువనగిరి మండలం రాయగిరి పరిధిలోని విద్యాజ్యోతి హైస్కూల్లో నేటినుంచి 29వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శన జరగాల్సి ఉంది. సుమారు 200 పాఠశాలలు సైన్స్ఫెయిర్లో పాల్గొనేందుకు వివరాలు నమోదు చేసుకున్నాయి. కాగా, ఉపాధ్యాయులకు సర్పంచ్ ఎన్నికల విధులు పడనుండటంతో సైన్స్ఫెయిర్ను వాయిదా వేసినట్లు డీఈఓ సత్య నారాయణ తెలిపారు. తదుపరి తేదీలను ఎన్నికల అనంతరం ప్రకటిస్తామన్నారు. విద్యార్థులకు రవాణా భత్యం భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు మంజూరయ్యాయి. 10 నెలలకు సంబంధించి రూ.54.18 లక్షలు విడుదల చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో 3 కిలో మీటర్లు, ఉన్నత పాఠశాలలకు 5 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే విద్యార్థులు ఒక్కొక్కరికి నెలకు రూ.600 చొప్పున చెల్లిస్తోంది. హాజరు శాతం ప్రకారం జిల్లాలో 885 మంది విద్యార్థులను విద్యాశాఖ అర్హులుగా గుర్తించింది. వారందరి ఖాతా త్వరలోనే డబ్బులు జమ కానున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిందే : కలెక్టర్సాక్షి,యాదాద్రి : రోడ్డు ప్రమాదాలను తగ్గించి విలువైన ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రహదారులపై ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. డీసీపీ అకాంక్ష్యాదవ్ మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రోడ్లు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, మరమ్మతులు చేయించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, రోడ్లు భవనాల శాఖ జిల్లా అధికారి సరిత పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం భువనగిరిటౌన్ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హనుమంతరావు, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే ఉద్యమం మలుపు
భువనగిరి: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్ను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతోనే ఉద్యమం మలుపు తిరిగిందన్నారు. నాటి ఉద్యమ ఘట్టాలు, పోరాట పటిమను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, దీక్షా దివస్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు భారీగా హాజరుకావాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునిత, గాదరి కిషోర్, భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, ఎలిమినేటి సందీప్రెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీటీసీగా ‘దుబ్బాక’ రెఫరెండం
చిట్యాల : మండలం నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి. దుబ్బాక నర్సింహారెడ్డి 1999లో స్వగ్రామం నేరడ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. 200 ఓట్ల అత్యధికంతో గెలిచారు. గ్రామాభివృద్ధికిగాను శక్తివంచన లేకుండా పనిచేశారు. ఎంపీటీసీగా ఆయన పనితీరుపై మూడేళ్ల పదవీకాలం తర్వాత 2002లో స్వచ్ఛందంగా రెఫరెండం నిర్వహించుకున్నారు. మొత్తం 1600 మంది ఓటింగ్లో పాల్గొనగా.. 1510 మంది దుబ్బాక పాలనను మెచ్చుకున్నారు. 90 మంది మాత్రమే వ్యతిరేకించారు. అప్పట్లో ఓ పోటీ పరీక్షలో పార్టీ గుర్తుపై గెలిచి రెఫరెండం నిర్వహించుకున్న ప్రజాప్రతినిధి ఎవరని.. ప్రశ్న వచ్చింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అందుకుగా నేను ఎంపీటీసీగా పని చేస్తున్న క్రమంలో ప్రజల అలోచనల మేరకు పనిచేస్తున్నానా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండం నిర్వహించుకున్నాను. 95 శాతం మంది నాకు మద్దతుగా నిలవడం సంతృప్తినిచ్చింది. ప్రజాప్రతినిధులు ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తే సమస్యలన్నీ పరిష్కరమవుతాయి. – నర్సింహారెడ్డి, నేరడ, చిట్యాల మండలం -
ఊరు దాటితేనే సెల్ సిగ్నల్
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ సేవలు పొందాల న్నా, ఇతరులకు ఏదైనా స మాచారం ఇవ్వాలన్నా సెల్ఫోన్ తప్పనిసరి అయ్యింది. గ్రామంలో సిగ్నల్స్ అందకపోవడం వల్ల ఎత్తయిన ప్రాంతాలకు వెళాల్సి వస్తుంది. అక్కడ కూడా సిగ్నల్స్ సరిగా రాకపోవడం వల్ల ఊరికి దూరంగా పోతున్నాం. –చిలుక మల్లయ్య, గోపాల్పురం గ్రామంలో ఎవరికై నా ప్ర మాదం జరిగినా, ఆరోగ్యం బాగోలేకున్నా 108 అంబు లెన్స్కు ఫోన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. కలెక్టర్ చొరవచూపి సెల్టవర్ ఏర్పాటు చేయించాలి. అధికారులు పట్టించుకోవాలి. –శమైయిన మహేష్, గోపాల్పురం ఫ సేవలందక అత్యవసర సమయంలో గోపాల్పురం గ్రామస్తుల అవస్థలు ఫ 108కి కాల్ చేయలేని దైన్యం ఫ కిలో మీటరున్నర దూరం వెళ్తేనే నెట్వర్క్తుర్కపల్లి: అత్యవసర సమయంలో అంబులెన్స్కు కబురు పెట్టాలన్నా, ఉపాధిహామీ కూలీలు బయోమెట్రిక్ వేయాలన్నా, ఆసరా పింఛన్ తీసుకోవాలన్నా, రేషన్ సరుకులు పొందాలన్నా ఆ ఊరికి జనాలకు ప్రయాస తప్పదు. ఊరికి కిలో మీటరున్నర దూరం వెళ్తే కానీ సిగ్నల్స్ దొరకవు. ప్రపంచంలో ఏ మూలన, ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయే నేటి డిజిటల్ యుగంలో తుర్కపల్లి మండలం గోపాల్పురం గ్రామస్తులు మాత్రం ఇంకా సెల్ సిగ్నల్స్ కోసం వెతుకుంటున్నారు. ఊరికి సమీపంలో నెట్వర్క్ టవర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇతరులతో మాట్లాడుకోవడం అటుంచితే.. అత్యవసర వైద్యం కావాల్సిన సమయంలో పడే ఇబ్బందులు వర్ణణాతీతం. సేవలకు ఆటంకం ● ఉపాధిహామీ కూలీలు ఉదయం పనులకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి. వారి ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలి. పని చేసే ప్రదేశంలో సిగ్నల్స్ అందకపోవతే నెట్వర్క్ కోసం వెతుక్కుంటూ వెళ్లడం వారికి నిత్యకృత్యంగా మారింది. ● ఆసరా లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వాలంటే పోస్టల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. సిగ్నల్స్ అందే ప్రాంతానికి వెళ్లి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ● రేషన్ లబ్ధిదారులు సరుకులు పొందాలంటే బయోమెట్రిక్ వేయాలి. గ్రామంలోని ఎత్తయిన భవనాల పైకి, లేదా ఊరికి దూరంగా వెళ్లాల్సి వస్తుందని లబ్ధిదారులు పోతున్నారు. ● గర్భిణులు ప్రసవ సమయంలో, ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఇంకేదైనా అత్యవసర సమయంలో 108 అంబులెన్స్కు ఫోన్ చేయాలంటే సిగ్నల్ దొరకడం లేదు. ● పాఠశాలల్లో రోజువారీ కార్యకలాపాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తదితర వివరాలు యాప్లో అప్లోడ్ చేయలేకపోతున్నారు. ప్రజావాణిలో వినతి గోపాల్పురంలో సెల్ టవర్ ఏర్పాటు చేయించాలని గ్రామస్తులు ఇటీవల ప్రజవాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సెల్ఫోన్లు పనిచేయక పోవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గోడు వెల్ల బోసుకున్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
పెద్దఅడిశర్లపల్లి : గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనపురంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపురం గ్రామ శివారులో జడ్చర్ల–నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని మహిళ(50) నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మూడేళ్లకు ప్రజాభిప్రాయం
కట్టంగూర్ : కట్టంగూర్ మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన గద్దపాటి దానయ్య 2001లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 800 ఓట్లు ఉండగా దానయ్యకు 450 ఓట్లు రాగా ప్రత్యర్ధి పులి నర్సింహకు 350 ఓట్లు వచ్చాయి. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన మూడు సంవత్సరాల తర్వాత 2004లో తన పాలనపై రెఫరెండం నిర్వహించారు. మానవ హక్కుల వేదిక, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో రెఫరెండం చేపట్టారు. దానయ్య రైతు గుర్తుతో, వ్యతరేకంగా క్రాస్ గుర్తుతో ఎన్నికలు నిర్వహించారు. ఈ రెఫరెండం పోలింగ్లో మొత్తం 750 ఓట్లు పోలవ్వగా 110 ఓట్ల మెజార్టీతో గద్దపాటి దానయ్య గెలుపొందారు. తన పాలనపైనే ప్రజల తీర్పు కోరిన దానయ్య ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15, 2004లో ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు. ప్రజల ఆమోదంతో ఆయన ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేశారు. ప్రజాపాలనలో ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే రెఫరెండం విధానాన్ని అమలు చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే ప్రజాపాలన, ప్రజా వ్యవస్థ మెరుగు పడుతుంది. గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు మేలు కలిగేలా పనులు చేయాలంటే ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలి – గద్దపాటి దానయ్య, మాజీ సర్పంచ్, పందెనపల్లి -
గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ చేసుకోవాలి
ఫ జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జేడీ మరియదాస్ గరిడేపల్లి : గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనాలు సమకూరుతాయని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎ.మరియదాస్ అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో ‘వేర్ హౌసింగ్ డెవలప్మెంట్, నెగోషియబుల్ వేర్ హౌస్’పై బుధవారం రైతులు, వ్యాపారులు, పప్పు మిల్లు యజమానులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొలంలో ఎలుకల యాజమాన్యంపై వివరించారు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆహార ధాన్యాలు వృథా కాకుండా కాపాడుకోవచ్చన్నారు. లేదంటే చీడ పురుగులు, ఎలుకల వల్ల 10 నుంచి 30శాతం వరకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ధాన్యం నిల్వ చేసే సమయంలో ఉపయోగించే హెర్మటిక్ బ్యాగ్ల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త డి.ఆదర్శ, కిరణ్, అక్షిత్సాయి, ఎన్. సుగంధి, రైతులు పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు
మునగాల : బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రాత్రి మునగాల శివారులో చోటు చేసుకుంది. పెన్పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన కొండమీది వెంకన్న బైక్పై కోదాడకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా మునగాల శివారులోని కొక్కిరేణి వెళ్లే రోడ్డుపై రైతులు ఽఆరబోసిన ధాన్యం గమనించకుండా బైక్ను వెళ్లనీయడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. వెంకన్నకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రద్దీగా ఉండే రోడ్లపై కూడా ధాన్యం ఆరబోయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
చైన్ స్నాచింగ్కు పాల్పడి అప్పులు తీర్చాడు
మిర్యాలగూడ అర్బన్ : మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్న నిందితుడిని టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణం దీక్షిత్నగర్కు చెందిన మందడి వినోద్ జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. వాటిని తీర్చాలంటూ అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 14న మిర్యాలగూడ పట్టణం సీతారాంపురంలో వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని బైక్పై పారిపోయాడు. హుజూర్నగర్ మండలం రామస్వామిగట్టుకు చెందిన తన స్నేహితురాలు షేక్ నజ్మాకు సదరు బంగారు పుస్తెల తాడు ఇచ్చి ఆమె పేరుపై శ్రీరామ్ ఫైనాన్స్లో రూ.2.30 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బుల్లోంచి కొంత అప్పు తీర్చి, మిగతా దాంతో పేకాట ఆడి పోగొట్టుకున్నాడు. సీతారంపురంలో జరిగిన చైన్స్నాచింగ్పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు పట్టణంలోని సీసీ కెమరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. మళ్లీ చైన్స్నాచింగ్కు పాల్పడేందుకు ఈ నెల 25న నంబర్లేని పల్సర్ బైక్పై మిర్యాలగూడకు రాగా రాజీవ్చౌక్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తాను చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఇతడిపై ఇప్పటికే హుజూర్నగర్, మునగాల, అనంతగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 3.2 తులాల బంగారు పుస్తెల తాడు, పల్సర్ బైక్, సెల్ఫోన్, చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నామని, వినోద్తో పాటు అతడికి సాయం చేసిన షేక్ నజ్మాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన టూటౌన్ సీఐ సోమనర్సయ్య, సిబ్బందికి రివార్డులు అందించారు. ఆయన వెంట ఎస్ఐ బి.రాబాబు, ఏఎస్ఐ చంద్రయ్య, సిబ్బంది ఉన్నారు. -
రాజేశ్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
కోదాడరూరల్ : దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిమాండ్ ఖైదీగా ఉండి ఇటీవల మృతి కోదాడకు చెందిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. రాజేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజేశ్ను అదుపులోకి తీసుకొని నాలుగురోజుల పాటు చిలుకూరు, రూరల్ పోలీస్స్టేషన్లకు తిప్పి చిత్రహింసలు పెట్టడంతోనే మృతి చెందాడన్నారు. అమాయక దళితులను చంపి డబ్బు ఆశ చూపడం ద్వారా నిందితులు చట్టం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. రాజేశ్ కేసు విషయంలో జరిగిన పరి ణామాలు చూస్తుంటే దళితుల మాన ప్రాణాలకు విలువ లేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకమై కేసును నీరు గారుస్తు న్నారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం బాధకరమని అన్నారు. రాజేశ్ మృతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్మాదిగ, నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు, ఏపూరి రాజుమాదిగ, యలమర్తి రాము, ఆంజనేయులు, కోటేశ్, బోడ సునీల్, రాజన్న, చింత వినయ్బాబు ఉన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు
నల్లగొండ టూటౌన్ : మాజీ సైనికులు, అమరులైన సైనికుల పిల్లలు వృత్తి విద్యా కోర్సులు చదువుతుంటే వారికి కేంద్ర రక్షణ శాఖ ఉపకార వేతనాలు అందిస్తోందని నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, ఎంబీబీఎస్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ చదువుతూ ఉండి ఇంటర్లో 60 శాతం మార్కులు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. బాలురకు నెలకు రూ. 2500, బాలికలకు రూ.3వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన సైనిక కుటుంబాలకు చెందిన వారు డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.kr b.gov.in ను గానీ, లేదా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని, ఫోన్ 08682–224820 నంబర్కు సంప్రదించాలని కోరారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికనేరేడుచర్ల : జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు నేరేడుచర్లకు చెందిన వరాల వరుణ్కుమార్ ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో అతను పాల్గొని ప్రతిభ కనబర్చడంతో అధికారులు వరుణ్కుమార్ను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానాలో జరుగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో వరుణ్ తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. జాతీయ స్థాయికి ఎంపికై న వరుణ్ను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామ నర్సింహారావు, అసోసియేషన్ మండలాధ్యక్షుడు నూకల సందీప్రెడ్డి, కార్యదర్శి సైదులు అభినందించారు. మహిళ అవయవాలు దానంయాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. రామాజీపేట గ్రామానికి చెందిన కల్లెపల్లి ఐలయ్య భార్య ఉపేంద్ర (43)తో కలిసి ఈ నెల 11న బైక్పై ఆలేరు నుంచి రామాజీపేట గ్రామానికి వస్తుండగా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కల్లెపల్లి ఉపేంద్ర మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ ఫౌండేషన్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని అవయవదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అవయవ దానానికి ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య అంగీకరించడంతో ఉపేంద్ర కాలేయం, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులను సేకరించారు. ‘డ్రాగెన్ బోట్’లో ఉత్తమ ప్రతిభరాజాపేట : జాతీయస్థాయి డ్రాగెన్ బోట్ చాంపియన్ షిప్ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పుట్టగూడేనికి చెందిన ఎం.రేవంత్ ప్రతిభ కనబర్చాడు. మహారాష్టలోని నాందెండ్లో ఈ నెల 24 నుంచి జరుగుతున్న జాతీయస్థాయి డ్రాగెన్ బోట్ చాంపియన్షిప్ పోటీల్లో రేవంత్ తెలంగాణ తరఫున పాల్గొంటున్నాడు. బుధవారం నిర్వహించిన సీనియర్ మెన్ వెయ్యి మీటర్ల పోటీల్లో రేవంత్ సిల్వర్ మెడల్, 500 మీటర్లు, సీనియర్ మిక్స్డ్ వెయ్యి, 500 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించాడు. -
పోచంపల్లికి కర్ణాటక చేనేత కార్మికులు
భూదాన్పోచంపల్లి : ఇక్కత్ వస్త్ర తయారీ తీరుతెన్నులను తెలుసుకునేందుకు మంగళవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన 58 మంది చేనేత కార్మికులు భూదాన్పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్లో మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్ వస్త్రాలు, రంగులద్దకం, చిటికి కట్టడం తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక టెక్స్టైల్ ఇన్స్పెక్టర్ రమేశ్, హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ సీనియర్ ఆఫీసర్ దివాకర్బాబు, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర అంజనేయులు మాట్లాడుతూ.. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని మూడు చేనేత సహకార సంఘాలకు చెందిన చేనేత కార్మికులు పోచంపల్లి ఇక్కత్ వస్త్ర తయారీలో అవలంబిస్తున్న టెక్నిక్లను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారని తెలిపారు. అదేవిధంగా చేనేతకు పేరెన్నికగన్న నారాయణపేట, వెంకటగిరి, మధురై, సేలం తదితర ప్రాంతాలను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. -
ఆస్పత్రిని త్వరితగతిన ప్రారంభించాలి
నకిరేకల్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నకిరేకల్కు మంజూరు చేసిన 100 పడకల ఆస్పత్రిని పూర్తిచేసి త్వరితగతిన ప్రారంభించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. నకిరేకల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆస్పత్రి భవన సముదాయాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 జనవరి 22న రూ.32 కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించి 80 శాతం మేర పూర్తిచేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తిచేయించడంలో జాప్యం చేస్తోందన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందనే ఆస్పత్రి నిర్మాణంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతోందన్నారు. అప్పట్లో వైద్యశాల నిర్వహణ, 69 మంది సిబ్బంది వేతనాల కోసం ప్రతి ఏటా రూ.6.35 కోట్లు మంజూరు చేయించామని గుర్తుచేశారు. వైద్యశాల సముదాయాన్ని త్వరితగతిన పూర్తిచేసి పేద ప్రజల అందుబాటులో తేవాలని కోరారు. ఆయన వెంట నకిరేకల్ మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, నాయకులు రాచకొండ వెంకన్నగౌడ్, గుర్రం గణేశ్, దైద పరమేషం, నోముల కేశవరాజులు, రాచకొండ శ్రవణ్, యానాల లింగారెడ్డి, పల్లె విజయ్, రావిరాల మల్లయ్య, పేర్ల కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందనే పనుల్లో జాప్యం జరుగుతోంది నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
భువనగిరి టౌన్ : డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేసిన నిత్య పెళ్లికొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భువనగిరిటౌన్ ఇన్స్పెక్టర్ రమేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్, పెట్రోల్బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు. అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్కుమార్ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. తనను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు ఆగస్టు 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడు కరీంనగర్కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ వివరించారు. -
రాజేష్ను అకారణంగా పొట్టనపెట్టుకున్నారు
కోదాడ : కోదాడకు చెందిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ను పోలీసులు అకారణంగా చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని, దీనికి కారణమైన చిలుకూరు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడలో రాజేష్ కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పరామర్శించారు. రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజేష్ పాత నేరస్తుడు కాకపోయినా.. చిలుకూరు పోలీసులు ఐదు రోజులపాటు చిత్రహింసలకు గురిచేయడం వలనే మృతిచెందాడని ఆరోపించారు. రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయడంతో పాటు అతడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిలుకూరు పోలీసులు ఏ తప్పు చేయనప్పుడు రూ.8లక్షలు ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. దళితులు చనిపోతున్నా దళిత మంత్రులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. దళితల కోసం గ్రేహౌండ్స్ తరహా రక్షణ దళం ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానన్నారు. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి. చివరిరోజు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లను తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలువగా.. ద్వితీయ స్థానంలో మహబూబ్నగర్ జిల్లా, తృతీయ స్థానంలో నల్లగొండ జిల్లా జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే జాతీయస్థాయి పోటీలకు 12మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విధ్యాధికారి గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాష్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రథమ బహుమతులు గెలుచుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు -
తెలంగాణలో గ్రామాల అభివృద్ధి బాగుంది
యాదగిరిగుట్ట రూరల్ : తెలంగాణలో గ్రామాభివృద్ధి పనులు చాలా బాగున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీ) విభాగం, ఛత్తీస్గఢ్కు చెందిన ఉపాధి హామీ పథకం ప్రోగ్రాం అధికారులు అన్నారు. ఎన్ఐఆర్డీ ప్రొఫెసర్ షేక్ ఆరిఫ్ ఆధ్వర్యంలో 26 మంది మంగళవారం యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట గ్రామాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్లు, క్యాటిల్ షెడ్లు, ఆయిల్పామ్ తోటలు, నీటి తొట్టిలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇక్కడ అధికారులు చాలా నిబద్ధతతో పనులు చేస్తున్నారని కొనియాడారు. వారి వెంట ఎంపీడీఓ నవీన్కుమార్, ఎంపీఓ చంద్రశేఖర్, ఏపీఓ లింగంపల్లి నర్సయ్య, ఈసీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు ఉన్నారు. కొనియాడిన ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉపాధి హామీ పథకం ప్రోగ్రాం అధికారులు మహబూబ్పేట గ్రామంలో పర్యటించిన బృందం -
పాడి రైతులకు త్వరలో బిల్లులు చెల్లిస్తాం
యాదగిరిగుట్ట : మదర్ డెయిరీలో పాడి రైతుల బిల్లులు త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు జరిగిన జాప్యానికి రైతులంతా క్షమించాలని సంస్థ చైర్మన్ జి. మధుసూదన్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు, మదర్ డెయిరీ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టర్ల సమిష్టి నిర్ణయంతోనే మదర్ డెయిరీని ఎన్డీడీబీకి ఇచ్చేందుకు అంగీకరించామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించేందుకు ఎన్డీడీబీ సిద్ధంగా ఉండటంతో ఆ బ్యాంక్ అధికారులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. బ్యాంక్ల నుంచి క్లియరెన్స్ తీసుకొని త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను చెల్లిస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో బ్యాంక్ అధికారులు చెప్పారన్నారు. లోపాలను సరిదిద్దుకుంటూ, మదర్ డెయిరీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో మదర్ డెయిరీ ఆధ్వర్యంలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ను సబ్సిడీ కింద ఇస్తామన్నారు. మళ్లీ రైతులంతా మదర్ డెయిరీకి పాలు పోయాలని, వారందరికీ 15 రోజులకు ఒకసారి డబ్బులు అకౌంట్లో వేస్తామని ఎన్డీడీబీ హామీ ఇచ్చిందన్నారు. సమావేశంలో కళ్లెపల్లి శ్రీశైలం, గొల్లేపల్లి రాంరెడ్డి, పుప్పాల నర్సింహ, శ్రీధర్రెడ్డి, సందిళ్ల భాస్కర్గౌడ్, మండలి జంగయ్య, రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, కస్తూరి పాండు, రంగారెడ్డి, బి.నరేందర్రెడ్డి పాల్గొన్నారు. మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
హమాలీగానూ.. ఆమె
పెన్పహాడ్ : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, గృహనిర్మాణ రంగాల్లో కూలీలుగా పని చేసిన మహిళలు ఇప్పుడు హమాలీలుగా పని చేస్తూ తాము తలచుకుంటే ఏపనైనా చేయగలమని నిరూపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేస్తూ మగ వారితో సమానంగా పనులు చేస్తున్నారు. పెన్పహాడ్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 10 మంది మహిళలు హమాలీలుగా పనులు నిర్వహిస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని గోనె సంచుల్లోకి ఎత్తడం, దానిని తూకం వేయడం, బస్తాలను సీల్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు, పత్తి ఏరే పనులు చేపడుతున్నారు. అయితే వరిని యంత్రాల ద్వారా కోయడం, ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి దెబ్బతినడంతో వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా పోయింది. ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేపడుతున్నామని వారు తెలిపారు. రోజుకు 500 బస్తాల్లో ధాన్యం నింపి తూకం వేయడం ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు కూలి వస్తున్నట్లు మహిళలు పేర్కొంటున్నారు. అయితే ఇన్న రోజులు హమాలీల కొరత కారణంగా కాంటాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మహిళలు హమాలీ పనులు చేపట్టేందుకు ముందుకు రావడంతో కాంటాలు వేగవంతమై తమ ఇబ్బందులు తీరాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులు దొరకక..గ్రామంలో కూలి పనులు దొరకడం లేదు. పనుల్లేక ఇంట్లో ఖాళీగా ఉండి, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను అధిగ మించడం కోసం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు వేసే పనిని ఎంచుకున్నాం. దాంతో రోజు పని లభించడంతో పాటు చేతికి డబ్బు అందుతోంది. – ఒగ్గు నాగమణి, హమాలీ, పెన్పహాడ్రోజుకు రూ.600 వస్తున్నయ్కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కాంటా వేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తీరినై. ప్రతి రోజు సుమారు రూ.600ల వరకు కూలి వస్తుంది. ఈ డబ్బలతో ఇంట్లో అవసరాలను తీర్చుకుంటున్నం. – అలివేంద్ర, హమాలీ పెన్పహాడ్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాల నిర్వహణ ఉపాధి పొందుతున్న వ్యవసాయ కూలీలు -
మహిళలు అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి
ఆలేరు: ‘నాకు అప్పు ఇచ్చే స్థాయికి మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లిస్తాను’ అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం ఆలేరులో నిర్వహించిన మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు మంజూరైన రూ.18కోట్ల వడ్డీలేని రుణాల్లో ఆలేరు నియోజకవర్గానికే రూ.7.49కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు. భవిష్యత్తుల్లో గ్రామాల్లో చేపట్టబోయే సీసీ రోడ్లు తదితర అభివృద్థి పనులతోపాటు సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో మహిళా సంఘాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఆర్డీఓ నాగిరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ శ్రీకాంత్, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
మహిళల ఆర్థిక సంక్షేమానికే వడ్డీలేని రుణాలు
భువనగిరి: మహిళల ఆర్థిక సంక్షేమానికే స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు 3772 స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ. 566.86 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రతి మహిళ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలకు గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందిస్తున్నామన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు రూ. 566.86 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైజ్చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖబాబురావు, మండల సమాఖ్య అధ్యక్షులు, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
రైతులపై హమాలీ భారం
రామన్నపేట: ప్రతి ఏటా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నా రైతులకు హమాలీ చార్జీలు మాత్రం ఇవ్వడం లేదు. హమాలీ ఖర్చుల కింద క్వింటాకు రూ.5.20 చొప్పున చెల్లించాల్సి ఉన్నా ఆరేళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో హమాలీ చార్జీలు రైతులకు భారంగా మారాయి. 2017 వరకు అమలు..ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి రైతులు పండించిన ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కొనుగోలు బాధ్యతను మహిళా సంఘాలు, పీఏసీఎస్లకు అప్పగించి ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు (ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేశారు. కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ ఇచ్చేవారు. హమాలీ చార్జీలతో కొంత భాగం ప్రభుత్వమే భరించేది. 2017 వరకు ప్రభుత్వం క్వింటాకు రూ 5.30లు చెల్లించింది. ఆ తరువాత చెల్లించకపోవడంతో అప్పటి నుంచి రైతులే హమాలీ ఖర్చులు భరిస్తున్నారు. క్వింటాకు రూ.40 చొప్పున చెల్లింపు..జిల్లాలో ప్రతి సీజన్లో సరాసరి 2.80 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. 6లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. రైతుల కుటుంబ అవసరాలు, విత్తనాలకు పోగా మిగిలిన 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం పీపీసీల ద్వారా కొనుగోలు చేస్తుంది. పీపీసీ సెంటర్ల ప్రారంభంలో క్వింటాకు రూ.20 హమాలీ చార్జీ ఉండేది. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులే చెల్లించేవారు. ప్రభుత్వం తరువాత వారి ఖాతాల్లో రూ 5.30 జమచేసేది. 2017లో వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఆ తరువాత ప్రభుత్వం హమాలీ చార్జీల చెల్లింపుపై చేతులేత్తేసింది. ప్రస్తుతం హమాలీ చార్జీలు రెట్టింపయ్యాయి. క్వింటాకు రూ.40 చొప్పున రైతులు హమాలీ చార్జీలు చెల్లిస్తున్నారు. పీపీసీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులోలేని గ్రామాల్లో ప్రైవేటు స్థలాలను తీసుకొని అద్దె చెల్లిస్తున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చును రైతులు క్వింటాకు రూ.2 నుంచి రూ.3 భరిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలోని రైతులపై ప్రతి సీజన్కు రూ.14 కోట్ల భారం పడుతోంది. ఆరేళ్లుగా రైతులకు చెల్లించని హమాలీ చార్జీలు ప్రతి సీజన్లో రూ.14 కోట్ల భారంహమాలీ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రూ 2,380లో రూ 40లు హమాలీ చార్జీలకే పోతుంది. గ్రామాల్లో ధాన్యం ఆరబెట్టడానికి, తడవకుండా కాపాడడానికి టార్పాలిన్ కవర్లును రైతులు అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. హమాలీ చార్జీలతోపాటు అదనపు ఖర్చులు రైతులపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – అశోక్రెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు -
ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి పూర్తయ్యాక తిరిగి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వెటర్లు, దుప్పట్లు పంపిణీభువనగిరిటౌన్ : 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఎస్సీ ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకుగాను మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతరావు 1100 స్వెటర్లు, 1300 బ్లాంకెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సాహితి తదితరులున్నారు. క్షేత్రపాలకుడికి నాగవళ్లి దళార్చనయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరం పాటు పాలతో అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఇక శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. త్వరలో సిటీ స్కాన్ సేవలుభువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈమేరకు మిషన్ను వైద్యులు మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో సిటీ స్కాన్ లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సి వచ్చేది. రోగులకు ఉచితంగా సిటీ స్కాన్ సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మూడు నెలల క్రితం జిల్లా కేంద్ర ఆస్పత్రికి సిటీ స్కాన్ మిషన్ను మంజూరు చేసింది. ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానుండడంతో రోగులకు ఎంతో మేలు కానుంది. ప్రస్తుతం ఈ సిటీ స్కాన్ మిషన్ను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేశారు. పోలీస్స్టేషన్ తనిఖీ బొమ్మలరామారం : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను భువనగిరి ఏఎస్పీ రాహుల్రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో సబ్ ఇన్స్పెక్టర్ బుగ్గ శ్రీశైలం పనితీరును అభినందించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించడంతో పాటు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారని కొనియాడారు. బెల్ట్ షాపుల నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణ, చోరీలను తగ్గించడం, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అవగాహన కల్పించడంపై ఎస్సై, సిబ్బందిని అభినందించారు. అనంతరం మండల కేంద్రంలో బైక్పై పెట్రోలింగ్ నిర్వహించారు. భువనగిరి రూరల్ ఎస్సై చంద్రబాబు, ఎస్సై శ్రీశైలం, ఏఎస్సై మహిపాల్ పాల్గొన్నారు. -
కొత్తిమీర.. లేదు ధర
● రోడ్డుపక్కన పారబోసిన రైతన్న ఆలేరురూరల్: ఆలేరు పట్టణం నుంచి మంతపురి వెళ్లే దారిలో జంగాల కాలనీ దగ్గర హైవే వెంట సర్వీస్ రోడ్డులో మినీ డీసీఎం లోడ్ కొత్తిమీర కట్టలను మంగళవారం సాయంత్రం పడవేశారు. స్థానికులు, వాహనదారులు కొత్తిమీర కట్టలను సంచుల్లో నింపుకుని వెళ్లారు. సరైన ధర రాకనే రైతులు ఇలా రోడ్డుపక్కన పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.ఆలేరులో సర్వీస్ రోడ్డు పక్కన పడేసిన కొత్తిమీర -
రూ.2302.94 కోట్ల రుణాలు పంపిణీ
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ హనుమంతరావు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాల కింద మొత్తం రూ.2302.94 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వీటిలో పంట రుణాలే రూ.1809.22 కోట్లు విడుదల అయ్యాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత రుణాల వార్షిక లక్ష్యం 53.04 శాతం సాధించడం మంచి పురోగతిగా అభివర్ణించారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.415.94 కోట్లు రుణాలు మంజూరవడం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారులకు గణనీయమైన ఊతం లభించిందన్నారు. ప్రాధాన్య రంగాల రుణాల్లో కూడా ఇప్పటివరకు 46.08 లక్ష్యం చేరుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. పీఎంఎంవై పథకం కింద 8052 ఖాతాలకు రూ 129.03 కోట్లు, మహిళా సంఘాలకు 283.17 కోట్ల రుణాలు, మెప్మా సంఘాలకు రూ 73.85 కోట్లు రుణాల మంజూరు చేసినట్లు చెప్పారు. పీఎం సేవా నిధి పథకం కింద మూడు విడతల్లో మొత్తం 12,523 దరఖాస్తులు మంజూరయ్యాయన్నారు. ఇంకా బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే ప్రాసెస్ చేసి మంజూరు చేయాలని బ్యాంకులు, మెప్మా అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీ తక్కువగా ఉన్న గుండాల, మోత్కూర్, అడ్డగూడూర్, నారాయణపూర్ మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం రవీందర్, అదనపు డీఆర్డీఓ జంగారెడ్డి, మెప్మా పీడీ రమేష్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ, ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీశ్రావ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం కమలాకర్ తదితర ప్రభుత్వ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ వచ్చేసింది
● 2025–26కు సంబంధించి పొదుపు సంఘాల ఖాతాల్లో రూ.18.02కోట్లు జమరామన్నపేట: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,032 సంఘాలకు రూ.18.02కోట్ల వడ్డీ సొమ్మును విడుదల చేసింది. జిల్లాలో 14,956 సమభావనా సంఘాలు, 562 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. 1,55,359 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో రెండు దఫాలుగా వడ్డీ సొమ్మును విడుదల చేసింది. మొదటి దఫాలో 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను 11,676 సంఘాలకు రూ.8.68కోట్ల నిధులు, 2024–25కు సంబంధించి 11,676 సంఘాలకు రూ.12.40కోట్లు విడుదల చేసి మహిళా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,032 సంఘాలకు రూ.18.02కోట్ల వడ్డీ సొమ్మును విడుదల చేసింది. మొత్తం మూడు విడతలుగా రూ.41.42కోట్ల వడ్డీ డబ్బులను ప్రభుత్వం మహిళల పొదుపు ఖాతాల్లో జమ చేసింది. -
అవే సమస్యలు.. తీరని వ్యథలు
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తలేరని, భూమిని కబ్జా చేశారని, ఏడు దశాబ్దాలుగా కబ్జాలో ఉన్నా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని.. ఇలా రకరకాల సమస్యలను ప్రజలు ప్రజావాణిలో ఏకరువుపెట్టారు. పదేపదే తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావుతో కలిసి కలెక్టర్ హనుమంతరావు అర్జీలు స్వీకరించారు. 58 అర్జీలు రాగా వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.ఎప్పటి మాదిరిగానే రెవెన్యూకు సంబంధించి 41 వినతులు వచ్చాయి. వినతులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని, సమస్య తమ పరిధిలో లేకపోతే దరఖాస్తుదారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్ఓ జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, హౌసింగ్ పీడీ విజయసింగ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ● వక్ఫ్ భూములు ఆన్లైన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉమిద్ పోర్టల్ క్యాంపును భువనగిరిలో ఏర్పాటు చేయాల వక్ఫ్బొర్డు మాజీ సభ్యుడు మహ్మద్ షరీప్ కలెక్టర్కు విన్నవించారు. యాదాద్రి జిల్లాలో వక్ఫ్ భూములు అధిక సంఖ్యంలో ఉన్నాయని, ఉమిద్ పోర్టల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం వల్ల ఆన్లైన్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ● 70 ఏళ్లుగా భూములు సాగదు చేసుకుంటున్నామని, హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని సంస్థాన్నారాయణపురం మండలం రాచకొండ గ్రామానికి చెందిన గిరిజన రైతులు వినతిపత్రం అందజేశారు.ఫ ప్రజావాణిలో గోడు వెల్లబోసుకున్న అర్జీదారులు ఫ వినతులు స్వీకరించిన కలెక్టర్ -
పెండింగ్ బిల్లులు క్లియర్ చేయిస్తా
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఎటువంటి బిల్లులు పెండింగ్ ఉన్నా సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని, సీఎంతో మాట్లాడి క్లియర్ చేయిస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఈఓ వెంకట్రావుతో కలిసి దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరి కొండపైన భక్తులు బస చేసేందుకు డార్మిటరీ హాల్ నిర్మాణం, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించి త్వరగా సమర్పించాలని ఆదేశించారు. వీటితో పాటు దాతల సహకారంతో టెంపుల్ సిటీలో నిర్మిస్తున్న అతిథిగృహాలు, పెండింగ్ అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అదే విధంగా భక్తులకు నిత్యాన్నదాన వితరణ చేయటానికి విధివిధానాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈఓ వెంకట్రావ్ వివరించారు. అంతకుముందు మంత్రి యాదగిరీశుడిని దర్శించుకొని పూజలు చేశారు. ఆయన వెంట మహిళా కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, మాజీ డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఉన్నారు. మంత్రికి కలెక్టర్ హనుమంతరావు, అదనపు వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేష్ స్వాగతం పలికారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
ఫ నేడు సెమీఫైనల్స్, ఫైనల్స్చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం పంతంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల నుంచి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రెండో రోజు ప్రతి జట్టు 9 జట్లతో పోటీపడ్డాయి. మంగళవారం సెమీఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి. గెలుపొందిన జట్లకు కలెక్టర్ హనుమంతరావు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విధ్యాధికారి గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాష్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్, టి. సురేందర్రెడ్డి తదితరులు పాల్డొన్నారు. -
బీబీనగర్ ఎయిమ్స్ పనులు ఇంకెన్నాళ్లు..!
సాక్షి,యాదాద్రి : అధునాతన వైద్యం, నాణ్యమైన వైద్య విద్య, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా చేపట్టిన బీబీనగర్ ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నిధుల కేటాయింపుల్లో జాప్యంతో మందకొడిగా పనులు నడుస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పనులు పూర్తిచేయాలని గడువు పొడిగించారు. 2023లో శంకుస్థాపన తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్కు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో 2023 ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి స్వాస్థ్ యోజనలో భాగంగా దీనికి రూ.1365.95కోట్లు మంజూరు చేశారు. ఈపీసీ విధానం ద్వారా ఏసీసీ కంపెనీకి టెండర్ ద్వారా పనులను అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం 201.65 ఎకరాల స్థలాన్ని ఎయిమ్స్కు అప్పగించగా అందులో పనులు జరుగుతున్నాయి. 24 నెలల్లో అంటే 2024 జూనలై 13 నాటికి పనులన్నీ పూర్తిచేసి ఎయిమ్స్కు అప్పగించాలి. అయితే పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో 2025 నవంబర్ వరకు ఆస్పత్రి, సేవలకు చెందిన భవనాలు, ఇతర బ్లాక్లు సిద్ధం చేశారే కానీ పూర్తి పనులు కాలేదు. పనులు జాప్యం జరగడానికి కారణం నిధులు కేటాయింపు పూర్తిస్థాయిలో జరగలేదని తెలు స్తోంది. పనులు జరుగుతున్న విధంగా నిధులు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.834.90 కోట్లు విడుదలయ్యాయి. వీటిలో రూ.805.59 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.29.31 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నిధులు రావాల్సి ఉంది. దీంతో పనుల గడువు పొడిగించారు. 2026 ఫిబ్రవరి నాటికి 390 బెడ్ల ఆస్పత్రి బ్లాక్లతో పాటు పూర్తిస్థాయి మెడికల్ పరికరాలతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణాలు ఇలా.. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఎయిమ్స్ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల వసతి కోసం 24 అంతస్తుల్లో రెండు టవర్స్ నిర్మించారు. 750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 300 మంది పీజీ విద్యార్థులు ఇక్కడ చదువుకోనున్నారు. డాక్టర్లు, లెక్చర్ థియేటర్, ఎగ్జామ్ హాల్, రీసెర్చ్ ల్యాబ్, 22 ఫ్యాకల్టీల రీసెర్చ్ ల్యాబ్లు, నర్సింగ్, పారా మెడికల్ స్టాఫ్ వసతి గృహాలు నిర్మిస్తున్నారు. ఆస్పత్రి బిల్డింగ్, న్యూ ఆస్పత్రి బ్లాక్, అకడమిక్ బ్లాక్, ఆడిటోరియం, ఆయుష్ బ్లాక్, రోగుల వెంట వచ్చేవారి కోసం నైట్ షెల్టర్, మార్చురీ, డైరెక్టర్ రెసిడెన్స్, గెస్ట్హౌజ్ అండ్ క్లబ్, ఆరు రకాల క్వార్టర్స్, యూజీ బాలుర, బాలికల వసతి గృహాలు, పీజీ బాలుర, బాలికల వసతి గృహాలు, పీజీ వర్కింగ్ నర్సుల హాస్టల్, డైన్నింగ్ బ్లాక్, కమ్యూనిటీ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్, అమృత్ ధార, అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ప్యానల్ రూం, పార్కులతోపాటు పోస్టాఫీస్, బ్యాంకు ఇతర మౌలిక వసతులు తదితర పనులు చేపడుతున్నారు. ఫ రూ.1,365.95కోట్లతో నిర్మాణానికి శ్రీకారం ఫ నిర్దేశించిన గడువులోగా పూర్తికాని పనులు ఫ 2026 ఫిబ్రవరి వరకు గడువు పొడిగింపు ఫ అందని అత్యవసర వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్మించిన నిమ్స్ భవనాలలో ప్రస్తుతం 38 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ఎయిమ్స్లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్ధోపెడిక్, న్యూరా లజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ, అప్తామాలజీ, రేడియాలజీ, డెర్మటాలజీ, స్కిన్ సర్జరీలు, ఆర్థోపెడిక్ సర్జరీలు, ఎంఆర్ఐ స్కాన్, లాప్రోస్కోపిక్, సీటీ స్కాన్, క్యాన్సర్ చికిత్సలు, ఆపరేషన్ ఽథియేటర్లు, పీడియాట్రిక్, డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. -
చైనా మాంజా గొంతుకు తగిలి గాయాలు
భూదాన్పోచంపల్లి : బైక్పై వెళ్తున్న యువకుడికి చైనా మాంజా తగలడంతో గొంతుకు గాయాలపాలయ్యాడు. చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన షేక్ మదార్ వ్యక్తిగత పనిమీద సోమవారం బైక్పై పోచంపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ స్వీట్హౌజ్ సమీపంలోకి రాగానే మెయిన్ రోడ్డుపై కరెంట్ తీగలపై నుంచి కిందికి వేలాడుతున్న చైనా మాంజా.. మదార్ గొంతుకు తగిలి కోసుకుపోయింది. వెంటనే అతను అప్రమత్తమై బైక్ బ్రేక్ వేయడంతో పెనుప్రమాదం తప్పింది. గొంతు కోసుకుపోయి రక్తస్రావం అవుతుండగా స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. -
గీత కార్మికుడికి గాయాలు
మోటకొండూర్ : తాటిచెట్టుపై నుంచి దిగుతుండగా జారిపడి కల్లుగీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మోటకొండూర్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన కల్లుగీత కార్మికుడు వంగాల చంద్రమౌళిగౌడ్ రోజుమాదిరిగానే తాటిచెట్టు ఎక్కి మెర వేసి కిందకు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో ఆయన నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దివిస్ ఉద్యోగి అదృశ్యంచౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పరిధిలోని దివిస్ ఫార్మా కంపెనీలో పనిచేసే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన బుద్దెపు ఏడుకొండలు కొంతకాలంగా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పరిధిలోని దివిస్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తూ.. స్థానికంగా పరిశ్రమకు చెందిన హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 9వ తేదీ వరకు తల్లిదండ్రులకు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడిన ఏడుకొండలు.. 10వ తేదీ నుంచి ఫోన్ చేయకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో తల్లిదండ్రులు పరిశ్రమ వద్దకు వచ్చి ఆరా తీశారు. దీంతో ఏడుకొండలు ఈ నెల 5వ తేదీ నుంచి హాస్టల్కు రావడం లేదని తోటి ఉద్యోగులు చెప్పారు. ఈ మేరకు సోమవారం ఏడుకొండలు తల్లి రమణమ్మ చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సిరెడ్డి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంభువనగిరిటౌన్ : భువనగిరి పట్టణ శివారులోని దివ్యబాల పాఠశాల వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. గుర్తుతెలియని వాహనం మృతుడి తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయ్యిందని పేర్కొన్నారు. డ్యూటీ కానిస్టేబుల్ సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 35 ఏళ్లు ఉంటాయని, గోధుమ రంగు చొక్కా, నీలం రంగు జీన్స్ ప్యాంట్ ధరించినట్లు వివరించారు. కుక్కను తప్పించబోయి యువకుడి దుర్మరణంభూదాన్పోచంపల్లి : రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి బైక్పై నుంచి పడి యువకుడు మృతిచెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని లక్ష్మణ్నగర్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు పొట్టబత్తిని నర్సింహ చిన్న కుమారుడు సాయికుమార్(25) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తన స్నేహితుడు దోర్నాల బద్రీనాథ్తో కలిసి పద్మానగర్ నుంచి బైక్పై ఇంటికి వస్తుండగా.. రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో దానిని తప్పించబోయి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న బద్రీనాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచార ఇవ్వడంతో వారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా సాయికుమార్ అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బద్రీనాథ్ చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బీసీలకు తగ్గాయ్!
సాక్షి యాదాది : గ్రామ పంచా యతీ ఎన్నికల రిజర్వేషన్లు బీసీలను నిరాశపరిచాయి. 2019 సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. రొటేషన్ విధానంతో ఆయా కేటగిరీల్లో సర్పంచ్ స్థానా లకు కోత పడింది. రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 427 గ్రామ పంచాయతీలు, 3,407 వార్డులు ఉన్నాయి. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తంగా మహిళలకు 45 శాతం, జనరల్కు 55 శాతం సీట్లు కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక మేరకు బీసీల రిజర్వేషన్లు కేటాయించారు. ఆదివారం ఉదయం భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు తమ డివిజన్ల పరిధిలోని సర్పంచ్ స్థానాలకు, ఎంపీడీఓలు మండల పరిషత్ కార్యాలయాల్లో వార్డు స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి కసరత్తు పూర్తి చేసి జాబితాలను కలెక్టర్కు పంపించారు. కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, ఆర్డీఓలు కలిసి రాత్రి పొద్దుపోయే వరకు తుది జాబితాలను రూపొందించారు. అనంతరం రాజకీయ ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్లు వెల్లడించారు. 2019లో బీసీలకు 105 స్థానాలు 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీసీ రిజర్వేషన్లు స్వల్పంగా తగ్గాయి. అప్పట్లో 421 సర్పంచ్ స్థానాలు ఉండగా బీసీలకు 108 రిజర్వ్ అయ్యాయి. ఈసారి గ్రామ పంచాయతీలు 427కు పెరిగాయి. అయినా 105 సీట్లే బీసీలకు కేటాయించబడ్డాయి. రొటేషన్ విధానం ద్వారా మూడు సీట్లను బీసీలు కోల్పోయారు. ఇక 2019లో బీసీ మహిళలకు 54 స్థానాలు దక్కగా, ప్రస్తుతం 47 స్థానాలే రిజర్వ్ అయ్యాయి. జనరల్ కేటగిరీలో మాత్రం 54 నుంచి 58కి పెరిగాయి. ఎస్టీ పంచాయతీల్లో మహిళలకు 15, జనరల్ 21, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో మహిళలకు 5, జనరల్ 8 కేటాయించారు. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో మహిళలకు 33, జనరల్ 41 సీట్లు దక్కాయి. బీసీ రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు 47, జనరల్ 58, జనరల్ కేటగిరీలో మహిళలకు 95, జనరల్ 195 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. వార్డుల కేటాయింపు ఇలా.. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల్లో 3,704 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్సీ గ్రామ పంచాయతీల్లో మహిళలకు 130, జనరల్ 130, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో మహిళలకు 43, జనరల్ 62, ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు 241, జనరల్ 395 ఖరారయ్యాయి. బీసీ రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు 397, జనరల్ 572, జనరల్ కేటగిరీలో మహిళలకు 789, జనరల్ 945 స్థానాలను రిజర్వ్ చేశారు. కొన్ని పంచాయతీల్లో మారని రిజర్వేషన్లు రొటేషన్ విధానం పాటించినప్పటికీ కొన్ని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు మారలేదు. భువనగిరి ని యో జకవర్గం భూదాన్పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ 2019లో జనరల్ కేటగిరీలో ఉంది. ఈసారి కూడా జనరల్కే కేటాయించారు.రొటేషన్ విధానం ద్వారా దక్కింది 105 స్థానాలే ఫ 2019తో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల ఫ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఫ కొన్ని చోట్ల యథావిధిగా..గ్రామ పంచాయతీలు 427వార్డు స్థానాలు 3,704మహిళలకు.. మొత్తం 195జనరల్ 232ఎస్టీ రిజర్వ్ 13 మహిళలకు 05జనరల్ 08వంద శాతం ఎస్టీ జీపీలు 36మహిళలకు 15 జనరల్ 21 జనరల్ 199 మహిళలకు 95 జనరల్ 104బీసీ రిజర్వ్ 105 మహిళలకు 47జనరల్ 58 ఎస్సీ రిజర్వుడ్ 74 మహిళలకు 33 జనరల్ 41 -
కేవలం డబ్బు సంపాదనే రేవంత్ లక్ష్యం
సూర్యాపేట టౌన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పెద్దఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ మోసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోకాపేటలో ఎకరం రూ.100కోట్ల నుంచి రూ.170 కోట్లు వేలంలో విక్రయించినట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడంపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందన్నారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారు ఎవరైనా వదిలిపెట్టమని, భూ కుంభకోణంలో సహకరించిన వాళ్లంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో గోల్మాల్ జరుగుతోందని, ఐకేపీ సెంటర్లలో సరిగ్గా ధాన్యం కొనడం లేదన్నారు. దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ 2014కు ముందున్న సమస్యలే తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. బీసీలను పెద్దఎత్తున మోసం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్సేనని, రేవంత్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ఉన్న రిజర్వేషన్లు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చిందన్నారు. 29న దీక్షా దివస్ను విజయవంతం చేయాలి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జగదీష్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని, తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం మెడలు వంచిందని, తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్టానికే ఆదర్శంగా సూర్యాపేటలో దీక్షా దివస్ నిర్వహించుకుందామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగులు లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగంధర్రావు పాల్గొన్నారు. ఫ కోకాపేటలో భూముల ధర ఇప్పుడు ఎందుకు తగ్గింది ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శ -
కుమారులు పట్టించుకోవడం లేదు..
భువనగిరి టౌన్ : తమ కుమారులు ఆస్తి, డబ్బులు తీసుకుని తమ పోషణను విస్మరిస్తున్నారని పలువురు వృద్ధులు సోమవారం కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వారు కలెక్టర్కు వినతిపత్రం అందజేసి గోడు చెప్పుకున్నారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ధర్మసోమిరెడ్డి, రమణమ్మకు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు ప్రభు త్వ ఉద్యోగి. ఉద్యోగం వచ్చే సమయంలో అతనికి డబ్బులు కూడా ఖర్చు చేశారు. కానీ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యతలను పెద్ద కుమారుడు నిర్వహించడం లేదు. దీంతో వారు కొంతకాలంగా చిన్న కొడుకు వద్ద ఉంటున్నారు. పెద్ద కుమారుడిపైవెంటనే చర్యలు తీసుకుని పోషణ బాధ్యలు చేపట్టాలని వారు కలెక్టర్ను వేడుకున్నారు. -
చారిత్రక కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత
భువనగిరి: చారిత్ర కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత అని పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు అన్నారు. వారసత్వ వారోత్సవాల్లో భాగంగా సోమవారం భువనగిరి ఖిలా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. విద్యార్థులకు చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏటా వారసత్వ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్, టెక్నికల్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్, ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ రాజు, సాయి కిరణ్, ఏడీ నాగలక్ష్మి, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, సద్ది వెంకట్రెడ్డి, దిడ్డి బాలాజీ, జంపాల అంజయ్య, బాలేశ్వర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఫ పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు -
విత్తనాలు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
త్రిపురారం : రైతులు వానాకాలం వరి కోతలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు రైతులు యాసంగి వరి సాగుకు నారుమడులు సిద్ధం చేసుకొని నారు పోసుకోవడానికి తయారవుతున్నారు. అయితే రైతులు విత్తనాల కొనుగోలులో తగిన జాగ్రత్తలు పాటించాలని త్రిపురారం మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహన్ సూచిస్తున్నారు. అనుమతులు లేని కంపెనీలకు చెందిన విత్తనాలు, కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో.. రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని వివరాలు పరిశీలించాకే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆమె పేర్కొంటున్నారు. విత్తనాల కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే.. ఫ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం. ఫ ఎలాంటి అనుమాలు తలెత్తినా వెంటనే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు సమాచారం అందించాలి. ఫ మండల కేంద్రాలు, గ్రామాల్లో లైసెన్స్ లేని దుకాణాలు, దళారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయకూడదు. ఫ సరుకు లాట్ నంబర్, తయారీ తేదీ, రకం ఇలా అన్ని వివరాలు ఉండేలా చూసుకోవాలి. ఫ విత్తనాలు కొనుగోలు సమయంలో రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదుపై డీలరు, రైతు సంతకం తప్పకుండా ఉండాలి. ఫ రశీదు పంటకాలం పూర్తయ్యేంత వరకు భద్రపర్చుకోవాలి. ఫ స్థానిక పరిస్థితులకు అనుకూలమైన, దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. ఫ విత్తన సంచుల సీల్ తీసినట్లు లేదా విప్పతీసి తిరిగి కుట్లు వేసినట్లు గమనిస్తే కొనుగోలు చేయొద్దు. ఫ వ్యవసాయ శాఖ అనుమతులు పొందిన డీలర్లు, మార్కెట్ కమిటీలు, ప్రాథమిక సహకార సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రం, వరి పరిశోధనా స్థానాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయడం ఉత్తమం. -
ఏపూర్లో బ్యాటరీ ఇంధన ప్లాంట్
చిట్యాల : తక్కువ వ్యయంతో నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు కరెంట్ సరఫరాలో సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఇటీవల అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలో, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో 750 మెగావాట్ల సామర్ధ్యంతో బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం సుమారు 109 ఎకరాల్లో తెలంగాణ ట్రాన్స్కో 440 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ సబ్స్టేషన్కు ఖమ్మంతో పాటు త్వరలో విద్యుత్ ఉత్పత్తి జరగనున్న దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ గ్రిడ్ల ద్వారా కరెంటు సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి చౌటుప్పల్తో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో, రోజువారి విద్యుత్ వినియోగం పెరిగినప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా భారత ఇంధన ఎక్స్ఛేంజి(ఐఈఎక్స్) నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీనిని నివారించడానికి బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. 10 నుంచి 15 ఎకరాలు కేటాయింపు.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బ్యాటరీ ఇంధన ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలం లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో, చిట్యాల మండలం ఏపూర్లో రెండు బ్యాటరీ ఇంధన ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏపూర్లోని 440 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు పది నుంచి పదిహేను ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఇందులో 187.50 మెగావాట్ల సామర్ధ్యం గల నాలుగు బేస్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు రూ.250కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు నిధులు కేటాయించనుంది. ఈ బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుతో అత్యవసర సమయాల్లో సుమారు పదహారు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. దీంతో గ్రేటర్ హైదరాబాద్కు విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు వీలవుతుంది. ఫ ఏర్పాటుకు అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫ సుమారు రూ.250కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఫ త్వరలో ప్రారంభంకానున్న పనులుఏపూర్లో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. త్వరలో ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది. ఆ తర్వాత నాలుగైదు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చు. – కిశోర్, ఏఈ(ఆపరేషన్), 440 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, ఏపూరు -
‘మధ్యాహ్నం’ మరింత రుచిగా..
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మరింత రుచిగా అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.6.19ను రూ.6.78కు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.9.29 నుంచి రూ.10.17కు పెంచింది. జిల్లాలో 715 పాఠశాలలు, 38,187 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వంట ఏజెన్సీలకు ఊరట మధ్యాహ్న భోజన ఏజెన్సీలు 1,225 వరకు ఉన్నాయి. ధరల పెంపుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడమే కాకుండా, ఏజెన్సీలకు ఊరట దక్కింది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో కొనుగోలు చేయడం ఏజెన్సీలకు భారంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంలో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విద్యా సంవత్సరం భోజన రేట్లు పెంచడం ఇది రెండవ సారి. ఫ భోజనం రేట్లు రెండో సారి పెంపు పెరిగిన ధరలు ఇలా (రూ.లో) తరగతి గతంలో ఇటీవల తాజాగా 1–5 5.45 6.19 6.78 6–8 8.17 9.29 10.17 9–10 8.17 9.29 10.17 -
భూదాన్పోచంపల్లిలో ఫ్రాన్స్ దేశస్తులు
భూదాన్పోచంపల్లి : ఇండియా పర్యటనలో భాగంగా పలువురు ఫ్రాన్స్ దేశస్తులు సోమవారం భూదాన్పోచంపల్లిని సందర్శించారు. రూరల్ టూరిజం పార్కులో మగ్గాలు, చీర తయారీ, డిజైన్లను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత, భూదానోద్యమ చరిత్రను తె లుసుకున్నారు. వారం రోజుల ఇండియా పర్యటనలో భాగంగా తెలంగాణలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల సందర్శనకు వచ్చామని ఫ్రాన్స్ దేశస్తులు తెలిపారు. వీరికి టూరిజం పోలీసులు రాజశేఖర్, జాహ్నవి మార్గదర్శకం చేశారు. హక్కులపై మహిళలను చైతన్యపరచాలి భువనగిరి టౌన్ : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈనెల 25నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మహిళల హక్కులపై వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, డిజిటల్ హింసను అంతం చేయడానికి మహిళల్లో చైతన్యం తేవాలన్నారు. అంతకుముందు మానవ హక్కుల దినోత్సవ పోస్టర్ను అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. భువనగిరి టౌన్ : భవన నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లోని కార్మికులకు సంబంధించి బీమా పెంచినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. అదనపు కలెక్టర్లతో కలసి బీమా పెంపు వివరాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. బీమాతో కార్మికలు దీమాగా ఉండవచ్చన్నారు. ట్రావెల్స్ బస్సుల తనిఖీ చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సోమవారం చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. స్లీపర్ కోచ్లలో నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించారు. ఎమర్జెన్సీ సమయంలో తెరుచుకోవడానికి డోర్ ఉందా లేదా.. ఉంటే పనిచేస్తుందా అనే అంశాలను తనిఖీ చేశారు.ఫైర్ సేఫ్టీ పరికరాలు లేని బస్సులకు భారీగా జరిమానా విధించినట్లు సమాచారం. అనుమతులు లేకుండా గూడ్స్ పార్సిళ్లను తీసుకెళ్లవద్దని సూచించారు.బస్సుల ఫిట్నెస్ను పరిశీలించారు.తనిఖీల్లో ఎంవీఐలు ఎండీ ఇమ్రాన్, ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు. నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనుబంధ శివాలయంలో సోమవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు ఘనంగా నిర్వహించారు. కొండపైన గల శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి.వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చన, ప్రాకార మండపంలో సదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం నిర్వహించారు. -
పూర్వగిరీశా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరీశుడి దివ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి(పాతగుట్ట) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల య అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దేవస్థానం అధి కారులు ప్రణాళికలు రూపొందించారు. నిర్వహణ లోపంతో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పాతగుట్ట ఆలయంలోని పలు కట్టడాలు జీర్ణావస్థకు చేరా యి.ఈ క్రమంలో ఈఓ వెంకట్రావ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ ప్రాశస్యాన్ని కాపాడాలని సంకల్పించారు. పలు దఫాలు దేవస్థానం అధికారులు, ప్రధానార్చకులతో పాతగుట్టను సందర్శించి చే యాల్సిన పనులు, తదితర విషయాలపై చర్చించారు. చేపట్టనున్న పనులు ఇవీ.. పాతగుట్ట దేవస్థానం యాదగిరిగుట్ట పట్టణం నుంచి మూడు కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. స్వయంభూలు తొలుత ఇక్కడే వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. కానీ, ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. క్రమేణా భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పూర్వవైభవం తీసుకురావడానికి దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. ● నూతనంగా అద్దాల మండపం నిర్మాణం, ఆంజనేయస్వామి ఆల యం, పుష్కరిణి పునరుద్ధరణ, ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గానికి మరమ్మతులు, షెడ్ల నిర్మాణం, ప్రహరీ నిర్మాణంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఆలయ నిధులా.. విరాళాలా? ఈఓ వెంకట్రావ్ చొరవ తీసుకొని ఆలయ అభివృద్ధికి సన్నాహాలు ప్రారంభించారు. కాగా ఆలయ అభివృద్ధికి సహకరించేందుకు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. దాతలు ఇచ్చే విరాళాలతో పాటు దేవస్థానం నిధులు ఖర్చు చేయడం ద్వారా పాతగుట్ట అభివృద్ధి వేగంగా జరగనుందని భక్తులు అంటున్నారు. అయితే నిధులను దాతల ద్వారా సమకూరుస్తారా, ఆలయ నుంచి ఖర్చు చేస్తారా.. స్పష్టత రావాల్సి ఉంది. పనులు పూర్తయితే ఆలయ రూపురేఖలు మారడంతో పాటు భక్తులకు సదుపాయాలు సమకూరనున్నాయి.అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణం నుంచి పాతగుట్ట ఆలయం వరకు 2.1 కిలో మీటర్ల రోడ్డును 50 ఫీట్ల మేర విస్తరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రెయినేజీలు రానున్నాయి. ఇందుకోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణ పనులకు గత నెల 17న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. చాలా ఏళ్లుగా ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విస్తరణ పనులు పూర్తయితే భక్తులు రాకపోకలు సాగించేందుకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. పాతగుట్ట ఆలయ అభివృద్ధికి అడుగులు ఫ ప్రణాళికలు సిద్ధం, త్వరలోనే అమలు ఫ మారనున్న దేవస్థానం రూపురేఖలు ఫ తీరనున్న భక్తుల కష్టాలు -
ఆరోగ్యవంతమైన నారు పెంచండి ఇలా..
నడిగూడెం: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే రబీ సాగుకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. నారుమడి తయారాలో తగు జాగ్రత్తలు పాటించాలని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ చెబుతున్నారు. ఆయన సలహాలు, సూచనలు.. ఫ నారుమడిని 10–12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ముచేసి, చదును చేయాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేయాలి. ఫ రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని (కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో విత్తిన 12–14 రోజులకు), కిలో భాస్వరం, కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉంటే భాస్వరం రెట్టింపుగా వేయాలి. ఫ మొలక కట్టిన విత్తనాన్ని గుంటకు 12 కిలోల చొప్పున చల్లుకోవాలి. ఫ నారు, ఒక ఆకు పురివిచ్చుకొనే వరకు ఆరు తడులు ఇచ్చి పలుచగా నీరు నిలకట్టాలి. ఫ జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చలి ఎక్కువగా ఉంటే యాసంగి వరి సాగులో జింకు లోపం కనిపిస్తుంది. ఫ విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాములు చొప్పున వేయాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి వేయాలి. చలి నుంచి నారుమడుల రక్షణ రబీలో అధిక పంట దిగుబడులు సాధించడానికి చలిని తట్టుకునే అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎంపికతో పాటు ధృడమైన, ఆరోగ్యవంతమైన నారును పెంచడం అంతే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినా, చలి తీవ్రత ఎక్కువైనా మొక్కలు సరిగ్గా ఎదగకపోవడం, ఆకులు పసుపు రంగుకి మారి కొన్నిసార్లు నారు చనిపోవడం జరుగుతుంది. చలి నుంచి నారుమడిని రక్షించుకునే విధానం ఫ చలి నుంచి నారు కాపాడుకోవడానికి రాత్రివేళ నారుమడిలో నీరు నిల్వ ఉంచకూడదు. ఎందుకంటే చల్లని నీటి వలన మొక్కలు చనిపోతాయి. ఫ సాయంత్రం నీళ్లు తీసేసి మరల పగటిపూట కొత్త నీటిని పెడుతూ ఉండాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి తప్పక పాటించాలి. ఫ నారుమడిలో సేంద్రియ ఎరువులు వేయని రైతులు వర్మీ కంపోస్టు, గొర్రెలు, లేదా పశువుల ఎరువును పొడి రూపంలో చల్లుకోవాలి. దీని వల్ల నారు త్వరగా పెరుగుతుంది. ఫ తీవ్రమైన చలి నుంచి రక్షించడానికి ఒక అడుగు ఎత్తులో వెదురు బద్దలు లేదా ఇనుప ఊచలు అమర్చి దాని మీద 2–3 ప్లాస్టిక్ షీట్లు లేదా రైతులు నూర్పిడికి వాడే పట్టాలు సాయంత్రం వేళ మొక్కలపై కప్పి మరల ఉదయం పూట తీసివేయాలి. ఫ చలికాలంలో పోషకాలు మొక్కకు సరిగ్గా అందక కొన్నిసార్లు జింకు లోపం వలన ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి. లోప నివారణకు జింకు సల్ఫేట్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఫ కాండం తొలిచే పురుగు బారి నుంచి నారుమడిని కాపాడటానికి కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి సరిపడే నారుమడిని ఒక కిలో చొప్పున చల్లాలి. చలి తీవ్రత ఎక్కువై, మంచుతో కూడిన వాతావరణం ఉంటే అగ్గి తెగులు ఆశించకుండా మందు జాగ్రత్తగా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఫ నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ సూచనలు -
సాక్షి స్పెల్ బీకి అపూర్వ స్పందన
నల్లగొండ: సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ రెండో లెవెల్ పరీక్షకు అపూర్వ స్పందన లభించింది. ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలకు ప్రధాన స్పాన్సర్గా డ్యూక్స్ వాఫీ, అసోసియేట్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్– రాజమండ్రి వారు వ్యవహరించారు. జిల్లాలోని నార్కట్పల్లిలోని శ్రీవిద్యాపీఠ్్, మిర్యాలగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, వర్డ్ అండ్ డీడ్ ప్రైమరీ స్కూల్, కోదాడలోని తేజ విద్యాలయం, బీబీనగర్లోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్, నల్లగొండలోని మైత్రీ అకాడమీ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 196 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాక్షి బ్రాంచ్ మేనేజర్ కందికట్ల రుక్మాధర్, యాడ్స్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ రాపోలు నాగేశ్వర్రావు, ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్, కెమెరామెన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, ఉపాధ్యాయులు శ్యాంప్రసాదరావు, అలేఖ్య, తదితరులు పాల్గొన్నారు.ఫ నల్లగొండ పట్టణంలోని ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్లో పరీక్ష ఫ అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు అక్షర దోషాలు లేకుండా రాయడం ఈ పరీక్షల ద్వారా నేర్చుకోగలుగుతాం. మాకు ఉపయోగకరంగా పరీక్షలు ఉన్నాయి. భవిష్యత్లో అందరూ ఈ స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు రాయాలి. – మహ్మద్ అజ్హాన్ఖాన్, 7వ తరగతి, శ్రీవిద్యాపీఠ్, నార్కట్పల్లి -
రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితుల వినతి
సంస్థాన్ నారాయణపురం: రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు హైదరాబాద్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను, సంస్థాన్ నారాయణపురం సర్వేల్ గురుకుల పాఠశాల వద్ద చీఫ్ సెక్రఓటరీ రామకృష్ణారావుకు ఆదివారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. చౌటుప్పల్లోని దివీస్ కంపెనీని కాపాడటం కోసం రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని భూనిర్వాసితులు ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఔటర్ రింగ్రోడ్డు నుంచి సరైన దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్పై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈటల రాజేందర్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. సీఎస్ రామకృష్ణారావుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భూనిర్వాసితుల ఆవేదనను వివరించారు. -
ర్యాంకుల కోసం తాపత్రయపడొద్దు
చౌటుప్పల్: ర్యాంకుల కోసం తాపత్రయపడే ఆలోచనా విధానం మారాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల నుండి గౌవర వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు సైతం అంతే ముఖ్యమన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఓటమితో కుంగిపోవద్దని, ఓటమి నుండే గెలుపు ఉద్భవిస్తుందన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తద్వారా శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారని గుర్తుచేశారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి 240 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచ్ బాతరాజు సత్యం, ఎస్జీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథరెడ్డి, ఎంఈఓ గురువారావు, క్రీడల రాష్ట్ర పరిశీలకులు వాసం నవీన్, పులి కిషోర్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, క్రీడల ఆర్గనైజర్ కృష్ణమూర్తిగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు. ఫ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఫ పంతంగి గ్రామంలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం -
ఆటోను ఢీకొన్న జేసీబీ.. ఒకరు మృతి
నాగారం: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారంబంగ్లా వద్ద ఆదివారం జేసీబీ ఆటోను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటో నాగారం బంగ్లాలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న జేసీబీని ఓవర్టేక్ చేయబోతుండగా జేసీబీ వెనుక ఉన్న బొక్కెన తగిలి ఆటో ప్రమాదానికి గురైంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వర్ధమానుకోట గ్రామానికి చెందిన బండారి ప్రభుదాస్(75) బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలకు, డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ భగవాన్ తెలిపారు. ఫ మరో ముగ్గురికి గాయాలు -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ పరిసరాలు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ముఖ మండపాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. స్వామి వారిని 35వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.50,49,359 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
గోవులు తరలిస్తున్న వాహనం పట్టివేత
చౌటుప్పల్: అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ సంతలో ఆరు గోవులు, మూడు ఎద్దులను కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్లోని బహదూర్పురాకు తరలిస్తుండగా.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. వాహన డ్రైవర్ షేక్ ఆరీఫ్, సహాయకుడు షేక్ ఖలీల్పాషను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గోవులు, ఎద్దులను గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. మేడపై నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం ఇబ్రహీంపట్నం రూరల్: తమ్ముడి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన అన్న మేడపై నుంచి జారి పడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన కుంచెల ముత్యాలు వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. ఆయన సోదరుడు శ్రీశైలం(30) పెళ్లి పత్రికలు పంచడానికి శనివారం రంగారెడ్డి తుర్కయంజాల్లో ఉంటున్న వారి బంధువు విష్ణు ఇంటికి వెళ్లాడు. రాత్రి కావడంతో అక్కడే భోజనం చేసి ఇల్లు ఇరుకుగా ఉండడంతో మూడు అంతస్తుల మేడ పైన అందరూ నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చూసేసరికి శ్రీశైలం కనిపించలేదు. చుట్టూ వెతకగా కింద కుక్కలు అరస్తుండటం గమనించి దగ్గరకు వెళ్లి చూడగా.. తీవ్ర గాయలతో శ్రీశైలం విగతజీవిగా పడి ఉన్నాడు. నిద్రమత్తులో రెయిలింగ్పై నుంచి పడి చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భూవివాదం.. కేసు నమోదు మునగాల: మునగాల మండలం బరాఖత్గూడెంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య నెలకొన్న భూవివాదంలో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపారు. వివరాలు.. బరాఖత్గూడేనికి చెందిన దొంతిరెడ్డి కళావతికి కుమారుడు ఉపేందర్రెడ్డి, కుమార్తె రెణబోతు జ్యోతి ఉన్నారు. ఉపేందర్రెడ్డి, జ్యోతి మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. జ్యోతి బరాఖత్గూడెంలో తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి కౌలుకు ఇచ్చింది. జ్యోతి తన భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆదివారం బరాఖత్గూడేనికి వచ్చి కౌలు రైతుతో కలసి వరి పంటను కోయిస్తుండగా.. అక్కడకు చేరుకున్న కళావతి, ఉపేందర్రెడ్డి వరికోత యంత్రాన్ని ఆపారు. అడ్డుకోవడానికి వెళ్లిన జ్యోతి, ఆమె భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తైపె ఉపేందర్రెడ్డి దాడి చేశాడు. అంతేకాక జ్యోతి ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘర్షణలో గాయపడిన జ్యోతి, ఇద్దరు కుమార్తెలు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కళావతి, ఉపేందర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనయాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు చెందిన అరుణాచలేశ్వర అకాడమీ కళాకారిణులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. ఆలయ మాడ వీధిలో స్వామి వారి గీతాలకు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అంతే కాకుండా హైదరాబాద్కు చెందిన శ్రీనృత్య అకాడమీ కళాకారులు సైతం భక్తులను తమ సంప్రదాయ నృత్యాలతో కనువిందు చేశారు. -
భవిష్యత్లో ఎంతో ఉపయోగం
సాక్షి నిర్వహిస్తున్న స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు భవిష్యత్లో ఎంతో ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. – తోర్షా చౌదరి, 7వ తరగతి, బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్, బీబీనగర్ పోటీ పరీక్షలకు మేలు పోటీ పరీక్షలకు మ్యాథ్ బీ, స్పెల్ బీ ఎంతో ఉపయోగపడతాయి. మ్యాథ్ బీ ద్వారా మ్యాథ్స్లో మెళకువలు నేర్చుకోగలుగుతాం. భవిష్యత్లో పోటీ పరీక్షలు తేలిగ్గా రాయగలుగుతాం. – కె.కె. అశ్వతి, లిటిల్ ఫ్లవర్ స్కూల్, మిర్యాలగూడ -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
తిరుమలగిరి(తుంగతుర్తి): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రైతును థార్ వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని నీలిబండతండాకు చెందిన ఆంగోత్ బద్యా(56) యూరియా కొనేందుకు ద్విచక్ర వాహనంపై తిరుమలగిరి క్రాస్ రోడ్ వద్దకు వెళ్తుండగా వెనుక నుంచి థార్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్యా అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మునుగోడు: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో జరిగింది. మునుగోడు మండల కేంద్రానికి చెందిన రేవెల్లి వినయ్కుమార్ బైక్పై చండూరు రోడ్డులోని మొబైల్ దుకాణానికి వెళ్తుండగా.. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద చండూరు నుంచి మునుగోడుకు వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్యద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి అనంతరం నల్లగొండకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు, బైక్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తైక్వాండోలో అబ్దుల్ ముక్సిత్కు కాంస్యం నల్లగొండ టూటౌన్: 8వ జాతీయ తైక్వాండో పోటీల్లో నల్లగొండ జిల్లాకు చెందిన అబ్దుల్ ముక్సిత్ కాంస్య పతకం సాధించాడు. ఈ నెల 21 నుంచి 23 వరకు పంజాబ్ రాష్ట్రం జలంధర్లో జరిగిన తైక్వాండో జాతీయ పోటీల్లో పాల్గొన్న ముక్సిత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి కాంస్య పతకం పొందినట్లు కోచ్ ఎండీ యూనుస్ కమాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముక్సిత్ను తండ్రి ఇలియాజ్ పాషా, కోచ్ అభినందించారు. -
సహకార సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలి
యాదగిరిగుట్ట: సహకార సంఘాలు సహకార సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలని జాతీయ సహకార భారతి ప్రముఖ్, ప్రధాన కార్యదర్శి దీపక్ చౌరసియా, రాష్ట్ర అధ్యక్షుడు ఝెక్కటి ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర సహకార భారతి ఆధ్వర్యంలో కార్యకర్తల రాష్ట్ర అభ్యసవర్గ రెండు రోజుల శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. సహకార సంఘాల సభ్యులంతా ఐక్యతను పాటిస్తూ, సహకార సూత్రాలను వ్యాప్తి చేయాలన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ శాఖ పనిచేస్తుందన్నారు. అంతకుముందు సహకార భారతి జెండాను ఆవిష్కరించారు. ఈ శిక్షణ శిబిరంలో అఖిల భారత సహ సంపర్క ప్రముఖ్ అడ్డూరి శ్రీనివాస్రావు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సదస్యులు అన్నదానం సుబ్రహ్మణియం, ప్రధాన కార్యదర్శి నాగిళ్ల కుమారస్వామి, వర్గ ప్రముఖ్ పి. సత్యనారాయణ, సహ ప్రముఖ్ బాలరాజు, ప్రాంత అధి కారులు శంకరయ్య, విఠలయ్య, పాండురంగారెడ్డి, సుమంత్, బాలరాజ్, రమాదేవి పాల్గొన్నారు. -
లారీలు రాకపోతే కాంట్రాక్టర్దే బాధ్యత
తుర్కపల్లి: కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోతే ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన వడ్ల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్లో నమోదు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోళ్లలో ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. లారీలు రావడం లేదని గంధమల్ల రైతుల ఫిర్యాదు తుర్కపల్లికి కలెక్టర్ వస్తున్నారని తెలుసుకున్న గంధమల్ల గ్రామ రైతులు.. అక్కడికి వచ్చారు. కొనుగోలు కేంద్రానికి లారీలు సక్రమంగా రావడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మిల్లులకు ధాన్యం ఎగుమతుల్లో జాప్యం జరుగుతుందని, ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపుతుందని వాపోయారు. కలెక్టర్ స్పందించి తక్షణమే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి కారణం తెలుసుకున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి రోజుకు కనీసం మూడు లారీలు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి జానయ్య, తహసీల్దార్ జలకుమారి, ఏపీఓ రమణ ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
మారథాన్లో మెరిశారు
వలిగొండ : తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్లో నిర్వహించిన ‘ట్రై సిటీ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ మారథాన్’ పోటీల్లో వలిగొండ మండలానికి చెందిన ఇద్దరు పతకాలు సాధించారు. ఇంటలిజెన్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులను నిర్వహిస్తున్న ప్రొద్దటూర్కు చెందిన దుబ్బ కిషన్ 21 మీలో మీటర్న రన్నింగ్ రేసును ఒక గంట 41 నిమిషాల్లో పూర్తి చేశాడు. అలాగే నాగారం గ్రామానికి చెందిన డాక్టర్ కట్టా శేఖర్ 21 కిలో మీటర్ల రేస్ను 2 గంటల 30 నిమిషాల్లో చేరి పతకాలు కై వసం చేసుకున్నారు. దుబ్బ కిషన్, కట్టా శేఖర్కు గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు. -
ఆటాపాటలతో ఓనమాలు
భువనగిరి: ప్రీ ప్రైమరీ స్కూళ్లను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్కు రూ.1.70 లక్షల చొప్పున 35 పాఠశాలలకు రూ.61.25 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాలలకు రంగులు, తరగతి గదుల గోడలపై బొమ్మలు వేయడంతో పాటు పిల్లలకు ఆటల సామగ్రి, ఫర్నిచర్ కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు విద్యార్థులకు యూనిఫాం, షూ, టై అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్లు నిండగానే పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నడిపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లోనూ శిశు విద్యను ప్రవేశపెట్టాలని భావించి అక్టోబర్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించింది. మొదటి విడతగా జిల్లాలో 35 పాఠశాల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 280 విద్యార్థులు ఉన్నారు. వీరికి బోధన చేసేందుకు ప్రతి స్కూల్లో ఒక టీచర్, ఒక ఆయాను నియామించారు. ఫ ప్రీ ప్రైమరీ పాఠశాలల బలోపేతంపై విద్యాశాఖ దృష్టి ఫ సౌకర్యాల కల్పనకు రూ.60 లక్షలు మంజూరు -
కాంగ్రెస్ పార్టీ బీసీల గొంతుకోసింది
చౌటుప్పల్ : పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయబద్దంగా రావాల్సిన వాటా ఇవ్వాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చిలకల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ భిక్షగా ఇచ్చే సీట్లను బీసీ సమాజం ఒప్పుకోదన్నారు. బీసీ జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి చౌటుప్పల్ పట్టణంలో జీఓ 46 ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తరువాత కామారెడ్డి డిక్లరేషన్ను విస్మరించిందని ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీఓ 9 విడుదల చేసి, ఇప్పుడు జీఓ 46 ఇవ్వడం బీసీల గొంతు కోయడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన మోసంపై కవులు, రచయితలు, కళాకారులు గళమెత్తాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చౌటుప్పల్లో జరిగిన సభలో ఉద్యమంపై సినిమా తీయమని కోరిన వెంటనే దర్శకుడు శంకర్ స్పందించారని, జైబోలో తెలంగాణ చిత్రం నిర్మించి ఉద్యమానికి నిప్పురాజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీసీ ఉద్యమానికి మద్దతుగా సినిమాలు తీయాల్సి అవసరం వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు జాజుల లింగంగౌడ్, ఉప్పల మధు, గూడూరు భాస్కర్, ఆదిమళ్ల శంకర్, జోర్రిగల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు. ఫ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ -
భక్తుల లెక్క పకా్కగా..
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి రోజూ పక్కాగా తేలుతోంది. ఇందుకోసం దేవస్థానం అధికారులు వినియోగిస్తున్న హెడ్కౌంట్ కెమెరాలు సత్ఫలితమిస్తున్నాయి. వీటిని ప్రధానాలయ తూర్పు పంచతల రాజగోపురం ముందుభాగంతో పాటు ఆళ్వార్ పిల్లర్, మహాద్వారం ఎంట్రీ, పశ్చిమ ద్వారం వద్ద అమర్చారు. గతంలో ఈ విధంగా అంచనా వేసేవారు గతంలో భక్తుల సంఖ్యను లెక్కగట్టడానికి వివిధ పద్ధతులు అనుసరించేవారు. దర్శనం టికెట్లు, లడ్డూల విక్రయం, పార్కింగ్ చేసిన వాహనాలు, ఘాట్ రోడ్డు వద్ద వాహన రుసుము, ప్రొటోకాల్ లిస్ట్, ఉచిత బస్సులు, ఆటోల్లో ప్రయాణం చేసిన భక్తులు.. తదితర వాటి ఆధారంగా అంచనాకు వచ్చేశారు. దీని వల్ల కచ్చితత్వం ఉండేది కాదు. పునర్నిర్మాణం తరువాత ఆలయానికి భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. సాధారణ రోజుల్లో సగటున 30 వేలు, వారాంతంలో 45 వేల వరకు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు, కార్తీకమాసం, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం వంటి ప్రత్యేక రోజుల్లో 70 వేల నుంచి లక్ష మంది వరకు వస్తున్నారు. ప్రతి ఒక్కరినీ లెక్కేసి ఎంత మంది స్వామివారిని దర్శించుకున్నారో సులువుగా తెలుసుకునేందుకు హెడ్కౌంట్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ లెక్కలోకి.. భక్తులు ఆలయ తూర్పు పంచతల రాజగోపురం నుంచి త్రితల రాజగోపురం మీదుగా ప్రధానాలయంలోకి వెళ్లి స్వయంభూలను దర్శించుకుంటారు. అక్కడి నుంచి పశ్చిమ పంచతల రాజగోపురం మీదుగా సప్తతల రాజగోపురం నుంచి బయటకు వెళ్తారు. ధర్మదర్శనం, రూ.150 టికెట్ దర్శనాలతో పాటు వీఐపీలు తప్పనిసరిగా తూర్పుగోపురం గుండా వెళ్లాల్సి ఉంటుంది. కాగా తూర్పు పంచతల రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ హెడ్కౌంట్ కెమెరా.. స్వామివారిని దర్శించుకొని వచ్చే ప్రతి భక్తుడిని లెక్కిస్తుంది. ఎన్ని వేల మంది వచ్చినా అందరినీ క్యాప్చర్ చేసి నమోదు చేస్తుంది. ఈ సమాచారాన్ని ఆఫ్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా కంట్రోల్ కమాండ్ రూంలోని కంప్యూటర్లోకి సమాచారం చేరవేస్తోంది. ఈ సమాచారం మేరకు భక్తుల సంఖ్యను ఆలయ అధికారులు వెల్లడిస్తారు. దీంతో పాటు ఆళ్వార్ పిల్లర్, మహాద్వారం, పశ్చిమ ద్వారం వద్ద హెడ్ కెమెరాలను అమర్చారు. గుట్టలో భక్తుల నమోదుకు హెడ్కౌంట్ కెమెరాలు ఫ రెండున్నర ఏళ్ల క్రితమే ఏర్పాటు ఫ ఇటీవల అందుబాటులోకి .. -
జీపీఓల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా వీరన్న
అడ్డగూడూరు : గ్రామ పాలన అధికారుల (జీపీఓ) అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన దాసరి వీరన్న ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జీపీఓల సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వీరన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీపీఓల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వీరన్న పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించండి భువనగిరిటౌన్ : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) వెంకటరమణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఏ–గ్రేడ్ క్వింటా రూ.2,389, కామన్ రకం రూ.2,369 చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని కేంద్రాల్లో ప్రభుత్వ సూచనలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా 330 కేంద్రాలను ప్రారంభించి, ప్రతి సెంటర్కు ఒక ఏఈఓను నియమించినట్లు వెల్లడించారు. రికార్డుల నిర్వహణ తప్పనిసరి కొనుగోలు కేంద్రాల్లో గెస్ట్, ఎనాలసిస్ రికార్డులు తప్పనిసరిగా రాయాలని ఆదేశించారు. వడ్ల కుప్పలపై మళ్లీ వడ్లు పోయరాదని, దీని వల్ల ధాన్యం నిర్దిష్ట తేమ శాతం వచ్చే అవకాశం ఉండదన్నారు. ట్రక్ షీట్, ఎనాలసిస్ షీట్ను లారీలతో పాటు మిల్లులకు పంపాలని, ప్రతి బస్తాలో ధాన్యం 40.6 కిలోలు తూకం కచ్చితంగా ఉండేలా ఏఈఓలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యాదగిరీశుడికిసంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణోత్సవం, అష్టోత్తీరం బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. -
వినియోగంలోకి తెచ్చిన ఈఓ
ఆలయ ఉద్ఘాటన అనంతరం హెడ్కౌంట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. కానీ, సరిగా వినియోగించే వారు కాదు. ఈఓగా వెంకట్రావ్ బాధ్యతలు చేపట్టిన తరువాత భక్తుల సౌకర్యాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు రోజువారీగా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్యలో కచ్చితత్వం ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హెడ్కౌంట్ కెమెరాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పాటు హెడ్కౌంట్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా భక్తుల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. -
ప్రచారం మోత.. మారని బడి రాత!
మూతపడిన పాఠశాలలను తెరిపించాలని విద్యా సంవత్సరం ప్రారంభంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. బడిబాటతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే కలిగే ప్రయోజనాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. అయినా వారి నుంచి సహకారం లభించలేదు. ఇద్దరు, ముగ్గురు విద్యార్థులున్న చోట వారు కూడా సక్రమంగా రాకపోవడంతో పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది. మూతపడకుండా అన్ని ప్రయత్నాలు చేసినా తల్లిదండ్రుల నుంచి సహకారం లభించలేదు. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లు ఉంటే తిరిగి ప్రారంభిస్తాం. –వీరజాల మాలతి, తుర్కపల్లి మండల విద్యాధికారి తుర్కపల్లి: బడిబాట నిర్వహించినా, ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించినా ప్రభుత్వ బడుల రాత మారలేదు. విద్యార్థులు లేకపోవడంతో తుర్కపల్లి మండలంలో చాలా చోట్ల పాఠశాలలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనగా.. ఈ విద్యాసంవత్సరం ఎలాగైనా తెరిపించేందుకు ఉపాధ్యాయులు చేసిన కృషి ఫలించలేదు. రామోజీనాయక్తండా ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ముగ్గురు విద్యార్థులు ఉండగా వారికి ఒక ఉపాధ్యాయుడు విద్యాబోధన చేసేవాడు. ఆ ముగ్గురు కూడా సక్రమంగా రాకపోవడంతో నెల రోజుల కిందట విద్యాశాఖ అధికారులు పాఠశాలను మూసివేశారు. ముగ్గురు విద్యార్థులను సమీపంలోని కర్షలగడ్డతండా పాఠశాలకు పంపించారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని డిఫ్యూటేషనపై పల్లెపహాడ్ ప్రాథమిక పాఠశాలకు కేటాయించారు. మండలంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పాడైపోతున్న భవనాలు పాఠశాలలు మూతపడటంతో భవనాల ఆలనాపాలన చూసేవారు లేకు అధ్వానంగా తయారయ్యాయి. కంప చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల గోదాములుగా వినియోగిస్తున్నారు. తుర్కపల్లి మండలంలో పది పాఠశాలలకు పైగా తాళం ఫ బడిబాట, ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించినా తల్లిదండ్రుల అనాసక్తి ఫ ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులు గూగుల్గుట్ట తండా, పొట్టిమర్రి తండా, పెద్దతండా, ధర్మారం తండా, పీర్యాతండా, కేవాలతండా, దయ్యంబండ తండా, రాంశెట్టిపల్లి, గంధమల్ల పరిధిలోని బీమరిగూడెంతో పాటు మరికొన్ని చోట్ల పాఠశాలలు తెరుచుకోవడం లేదు. ఆయా తండాల విద్యార్థులు సమీపంలోని తుర్కపల్లి, వడపర్తి, భువనగిరి, బొమ్మలరామారం, జలాల్పూర్లోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. -
ఆలోచనలు
ఆకాశానికి ఎగిరినఆకాశంలో ఎగిరే విమానాన్ని చూడగానే ఎవరికై నా చూడముచ్చటగా అనిపిస్తుంది. కానీ అది ఎలా ఎగురుతుందో తెలుసుకుని దానిని తయారుచేయాలనే ఆలోచన కొందరికే వస్తుంది. ఆ కొందరిలో ఒకడు నల్లగొండకు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ షాపెల్లి రవిప్రసాద్రావు. ఆయన తన ఇంటినే ఒక ప్రయోగశాలగా మార్చుకుని మినీ ఏరోప్లేన్లు, డ్రోన్లు తయారుచేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. రవిప్రసాద్రావు తయారు చేసిన డ్రోన్నేను మినీ ఏరోప్లేన్లు, డ్రోన్లను డబ్బుల కోసం తయారు చేయడం లేదు. విమానాలు, డ్రోన్లపై నాకున్న ఆసక్తితో ప్రయోగాలు చేస్తూనే అన్ని విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో డ్రోన్లకు అధిక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా మినీ ఏరోప్లేన్లు, డ్రోన్లు తయారుచేస్తే దానికి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రస్తుతం నేను ఏరో మోడలింగ్ క్లస్టర్, వరల్డ్ డ్రోన్ బిల్డర్స్లో సభ్యుడిగా ఉన్నాను. –షాపెల్లి రవిప్రసాద్రావు -
దొంగ అరెస్టు
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసి అతని వద్ద రూ.4లక్షల18వేల నగదుతోపాటు, 5 గ్రాముల బంగారం, కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి శనివారం పోలీస్స్టేషన్లో వెల్లడించారు. చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన పగిళ్ల శివ పదో తరగతి వరకు చదివి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనుకుని దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈనెల 11న దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్కు చెందిన శరావత్ జబ్బార్ ఇంట్లో రూ. 8లక్షలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు శనివారం పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శివను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. కాగా.. ఇతడిపై రాష్ట్ర వ్యాప్తంగా 11 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు నారాయణరెడ్డి, రాజు,సిబ్బంది సతీష్, అంజయ్య, సింహాద్రి, చాంద్పాషా, హరిబాబు, యాదయ్య తదితరులు ఉన్నారు.ఫ రూ.4.18లక్షల నగదు స్వాధీనం -
ఎంజీయూ ప్లేస్మెంట్ ట్రైనింగ్ డైరెక్టర్గా హరీష్కుమార్
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్గా హరీష్కుమార్ను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు 2018 నుంచి డైరెక్టర్గా వ్యవహరించిన ప్రశాంతి నుంచి శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రశాంతి నేతృత్వంలో సుమారు 300 కంపెనీలను యూనివర్సిటీకి ఆహ్వానించి విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో హరీష్కుమార్ ఎంతో కృషి చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. డైరెక్టర్గా డా. హరీష్కుమార్ ఒక సంవత్సరం పాటు విద్యార్థులకు సేవలందించనున్నారు. అనంతరం ప్రశాంతిని, హారీష్కుమార్ను విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు నీలకంఠం, శేఖర్, సత్యనారాయణరెడ్డి, సమరీన్, కజ్మీ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ అధ్యక్షుడిగా ఐలయ్య
సాక్షి, యాదాద్రి : ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను డీసీసీ పదవి వరించింది. యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఐలయ్యను నియమిస్తూ శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నాయకులు పోటీపడినప్పటికీ ఐలయ్యకు అవకాశం దక్కింది. డీసీసీ రేసులో లేనప్పటికీ ఐలయ్యకు పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించి 2023లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన ఐలయ్య ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. సీఎం రేవంత్రెడ్డికి నమ్మినబంటుగా ఐలయ్యకు పేరుంది. ఆశావహులను కాదని.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు అక్టోబర్లో జిల్లాకు వచ్చారు. భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే, ప్రస్తుత అధ్యక్షుడు అండెం సంజీరెడ్డిని కొనసాగించాలని ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు పరిశీలకులకు సూచించారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీ నియమావళి ప్రకా రం రెండోసారి అధ్యక్షుడిగా అవకాశం దక్కకపోతే.. భువనగిరి నియోజకవర్గానికి చెందిన తడ్క వెంకటేష్కు ఇవ్వాలని ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి పరి శీలకులను కోరారు. ఈ పదవికి పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కోటాలో తమ ప్రయత్నాలు చేశారు. సుమారు 21 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లోంచి ఆరు పేర్లు ఎంపిక చేసి పీసీసీకి పంపించారు. అక్కడి నుంచి మూడు పేర్లు ఫైనల్ చేసి ఏఐసీసీకి గత నెల 25న పంపారు. చివరకు పార్టీ శ్రేణుల అంచనాలను తల్లకిందులు చేస్తూ అధిష్టానం.. ఐలయ్యకు డీసీసీ పీఠం కట్టబెట్టింది. డీసీసీ అధ్యక్ష పదవితో నాపై మరింత బాధ్యత పెరిగింది. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీఅధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ జయంతి నటరాజన్కు ధన్యవాదాలు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో పార్టీని ముందుకు తీసుకుపోతా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తా. ఫ రేసులో లేకున్నా.. వరించిన పదవి -
పంతంగిలో నేటి నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
చౌటుప్పల్ : మండల పరిధిలోని పంతంగి గ్రామంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా సమాఖ్య యాదాద్రి జిల్లా కార్యదర్శి కందాడి దశరథరెడ్డి తెలిపారు. ఈమేరకు పోటీలు జరగనున్న జెడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం ఎంఈఓ గురువారావుతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దశరథరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 25 వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఉమ్మడి 10 జిల్లాల నుంచి బాల, బాలికల జట్ల కోసం 240మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో మృతి
చిట్యాల: చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోని కాల్వలో పడి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. చిట్యాల మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన అంతటి సీనయ్య(39) దివ్యాంగుడు. ఆటో కొనుగోలు చేసి డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య రజిత, ఇద్దరు పిల్లలున్నారు. ఐదు రోజుల క్రితం తన అత్తగారి ఊరైన చండూరు మండలం బంగారుగడ్డకు వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం మునుగోడుకు ఆటో కిరాయి కోసమని వెళ్లాడు. తిరిగి బంగారుగడ్డలోని ఇంటిని చేరుకోలేదు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో సీనయ్యకు భార్య రజిత ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. శనివారం ఉదయం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన కాల్వలో ఆటోతో పాటు సీనయ్య పడిపోయి మృతి చెంది ఉండడంతో ఈ విషయాన్ని సీనయ్య అన్న నర్సింహ రజితకు ఫోన్ చేసి తెలిపాడు. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మామిడి రవికుమార్ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
20 గుంటల్లో 23 రకాల వరి విత్తనాలు
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిళ్లపాటి గోవర్ధన్రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ పద్ధతిలో దేశీయ వరి విత్తనాలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అర్ధశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన గోవర్ధన్ వ్యవసాయంపై మక్కువ. నాలుగేళ్లుగా తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఈసారి 20 గుంటల విస్తీర్ణంలో 23 రకాల దేశీయ వరి విత్తనాల సాగు చేపట్టాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూర్వకాలం నాటి వరి విత్తనాలు సేకరించాడు. అలా సేకరించిన విత్తనాలను అర ఎకరంలో సాగు చేశాడు. గతంలో నాలుగు రకాల వరి విత్తనాలు సాగు చేయగా.. హైబ్రిడ్ విత్తనాలతో ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడి అధిక దిగుబడులు సాధిస్తున్నప్పటికీ ఆరోగ్యానికి హానికరమని భావించి దేశీయ వరి విత్తనాల సాగును ఎంచుకున్నాడు. మార్కెట్లో దేశీయ వరి ధాన్యం (బియ్యం) సుమారు క్వింటాల్ రూ.10 వేల వరకు ఉంటుందని పేర్కొంటున్నాడు. సాగవుతున్న వివిధ రకాల వరి విత్తనాలు ఇలా.. కులాకార్ (రెడ్రైస్), కాలనమ్మక్, రత్నచోడి, కాలబట్టి, కృష్ణవీహీ, నారాయణకామిని, బహురూపి, తులైపంజి, సీరగసాంబ, ఇంద్రాణి, పొక్కుర్, మాపల్లె, ఇల్లపు సాంబ, మట్ట రైస్, తూయమల్లి, కాలజీర, పుంగార్, చిట్టి ముత్యాలు, మణిపూర్ బ్లాక్, చికిల కోయిల, డాక్టర్ రైస్, రాజముడి, కర్పుకవని, గరుడన్సాంబ, కరుంగ్కరువై లాంటి దేశవాళి వరి విత్తనాలు సాగు చేస్తున్నాడు. ఈ దేశీయ వరి విత్తనాల ద్వారా సాగు చేసిన పంటతో కాల్షియం, పొటాషియం, ఐరన్ లభిస్తుందని పేర్కొంటున్నాడు. ఫ సేంద్రియ పద్ధతిలో దేశీయ వరి విత్తనాలు సాగు చేస్తున్న యువ రైతు 22ఎంటిఆర్ 05 వివిధ రకాల దేశీయ వరి విత్తనాల సాగు 22ఎంటిఆర్ 02 కాలన్ నమ్మక్ వరి -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
సూర్యాపేటటౌన్ : క్రీడలు జిల్లాలు, రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి దోహదపడతాయని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడాపోటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వాలీబాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మాజీ వాలీబాల్ జాతీయ క్రీడాకారులు యడవల్లి ప్రవీణ్కుమార్, వాలీబాల్ ఫౌండేషన్ సభ్యులు రవికుమార్, ఆదినారాయణ, మమత, వెంకటేశ్వర్లు, కిరణ్ పాల్గొన్నారు. 25న వాలీబాల్ ఎంపిక పోటీలుసూర్యాపేట : తెలంగాణ జూనియర్ అంతర్ జిల్లాల 8వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ చాంపియన్షిప్కు ఈ నెల 25న సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి ప్రకాష్ శనివారం తెలిపారు. 2008 జనవరి 1 తరువాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు చక్రహరి నాగరాజు 98486 20226, గడ్డం వెంకటేశ్వర్లు 94944 44870, మన్నెం సీతారాంరెడ్డి 93930 44274 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
రైతులను వేధింపులకు గురిచేస్తే ఊరుకోం
రామన్నపేట: రాజకీయ కక్షలతో రైతులను వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలోని మందడి సాగర్రెడ్డికి చెందిన ధాన్యం మిల్లులో దిగుమతి చేసుకోకుండా తిరిగి పంపిన విషయం తెలుసుకున్న ఆయన శనివారం గ్రామానికి వెళ్లారు. లారీని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులు తేమను పరిశీలించి సర్టిఫై చేసిన అనంతరం, పీఏసీఎస్ అధికారులు తూకం వేయించి ఇతర రైతుల పేరుతో ట్రక్షీట్ రాసి లారీలో లోడ్ చేయించి మిల్లుకు పంపిన ధాన్యంను దిగుమతి చేసుకోకుండా వాపస్ పంపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫోన్చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి ధాన్యం దిగుమతి చేయించక పోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మందడి సాగర్రెడ్డి, గర్దాసు విక్రం, బందెల రాములు, బద్దుల రమేష్, సాల్వేరు అశోక్, ఎస్కే చాంద్, మంటి లింగస్వామి తదితరులున్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి
బీబీనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. బీబీనగర్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని శనివారం ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రా ష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. వైద్య, విద్యకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే కుంభం రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశారని, దాన్ని చక్కబెట్టే పనిలో సీఎం రేవంత్ ఉన్నారని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గానికి హెచ్ఎండీఏ నిధులు రూ.56 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. అంతకు ముందు మాదారం, ముగ్దుంపల్లి తదితర గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ హనుమంతురావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, పీఆర్ ఈఈ దాసయ్య, గంథాలయ చైర్మన్ అవైచీ చిస్తీ, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, మెడికల్ అఫీసర్ మౌనిక, ఏఈ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
ధాన్యం ఎగుమతిలో జాప్యం చేయొద్దు
వలిగొండ, మోటకొండూరు : ధాన్యం ఎగుమతి చేయడానికి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపకుంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శనివారం ఆయన వలిగొండ, సంగెం, సుంకిశాలలోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. లారీలు రాకపోవడంతో ధాన్యం ఎగుమతిలో జాప్యం జరుగుతుందని, కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతున్నాయని పలువురు రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఫోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడారు. ప్రతి కేంద్రానికి రోజూ కనీసం మూడు లారీలు పంపాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్లో ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా మోటకొండూరు మండలం కాటేపల్లిలోని ఐకేపీ సెంటర్ను కలెక్టర్ సందర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. ఫ కలెక్టర్ హనుమంతరావు


