Yadadri District News
-
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణం
భువనగిరి : మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇండియా కూటమి తీరును ఖండిస్తూ బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని వినాయక చౌరస్తా వద్ద శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధురి చంద్ర మాట్లాడుతూ ప్రధాని మోదీ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంటే.. ఇండియా కూటమి దానిని అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. మహిళా బిల్లు 2008లో రాజ్యసభలో ఆమోదం పొందినా, లోక్సభలో ఎందుకు ప్రవేశపెట్టలేదని కాంగ్రెస్ను నిలదీశారు. మహిళా ఓట్ల కోసం నాటకాలు ఆడేవారికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వంగేటి సుచరితరెడ్డి, బండారు స్వర్ణలత, తుమ్మల యాస్మిన్, బీజేపీ నాయకులు చందా మహేందర్ గుప్తా, పడమటి జగన్ మోహన్రెడ్డి, మేడి కోటేష్, తడిసిన మల్లారెడ్డి, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పరిషత్ పోరుకు కసరత్తు
సాక్షి, యాదాద్రి : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర జాబితాలు సిద్ధం చేయాలని శుక్రవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాలో అదనపు ఓటర్ల మ్యాపింగ్ పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. అయితే జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 17 మండలాల్లో 17 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్త ఓటర్లతో జాబితాలు తయారీ అదనపు ఓట్లను కలుపుకుని పోలింగ్కేంద్రాల వారీగా కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల 23వ తేదీలోగా ఆయా పోలింగ్ బూత్లలో నమోదు చేస్తారు. శాసనసభ ఎన్నికల ఓటరు జాబితాతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. గత జూలై తర్వాత నమోదైన అదనపు ఓటర్లను జత చేస్తారు. జూలై 10, 2025 తర్వాత 2026 ఫిబ్రవరి 5 వరకు నమోదైన అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పోలింగ్కేంద్రాల వారీగా ఉన్న జాబితాల్లో జత చేయనున్నారు. గతేడాది చేపట్టినా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ గత సంవత్సరం సెప్టెంబర్లోనే ప్రాంరంభమైంది. రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకుగత సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ ఇవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేశారు. అయితే హైకోర్టు అక్టోబర్ 9న ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా 2019 మే,6,10,14 తేదీల్లో గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్లోఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకున్నారు. 2025 జూన్లో పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనల కొనసాగుతోంది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన ఆశావహులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు రావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రెవెన్యూ భువనగిరి, డివిజన్లు చౌటుప్పల్ మండలాలు 17 జెడ్పీటీసీ స్థానాలు 17 ఎంపీటీసీ స్థానాలు 178 పోలింగ్ కేంద్రాలు 1,001 ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఫ కదిలిన జిల్లా యంత్రాంగం ఫ 23లోగా పూర్తికానున్న ప్రక్రియ -
ధాన్యం దిగుమతుల్లో జాప్యం చేయొద్దు
సాక్షి, యాదాద్రి : యాసంగి ధాన్యం దిగుమతుల్లో మిల్లుల యజమానులు జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. 2025–26 ధాన్యం కొనుగోళ్లపై శనివారం కలెక్టరేట్లో మిల్లర్లు, సంబంధిత శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం యాసంగి 2024–25 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువు పొడిగించినందున గడువులోగా ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా నిర్వాహకులు హరికృష్ణ, మిల్లుల యజమానులు పాల్గొన్నారు. సంక్షేమ వారం పకడ్బందీగా నిర్వహిస్తాం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి 26 వరకు ఏడు రోజుల పాటు సంక్షేమ వారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతులు చేయిస్తామన్నారు. విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితీ పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి -
ఇంటి యజమానిగా మహిళలు 22.46 శాతమే..
ఫ ఓసీల్లో అత్యధికంగా వృద్ధులు ఫ నిరక్షరాస్యులు ఎస్సీల్లోనే అధికం ఫ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, కుల సర్వేలో వెల్లడి సామాజిక వర్గాల వారీగా ఇళ్లు.. జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు (బీసీల్లో, ఓసీలు అన్నీ కలిపి ఓసీల్లో కలిపి) నల్లగొండ 98,367 67,652 2,53,817 28948 62,854 5,11,638 సూర్యాపేట 75,102 49,525 1,75,323 22582 49,000 3,71,532 యాదాద్రి 48,753 15,494 1,57,310 8803 30,406 2,60,766 -
యాదగిరి క్షేత్రంలో శాస్త్రోక్త పూజలు
యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చనలు జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నాణ్యత ప్రమాణాల్లో రాజీపడొద్దుబొమ్మలరామారం : విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దని సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో గల కేజీవీబీని శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యాలయంలో మాడ్యులర్ కిచెన్ను పరిశీలించారు. పాఠశాలలో ఫ్యాకల్టీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఈఓ సత్యనారయణ, ఈఈ మధు సూదన్ రెడ్డి, జీసీడీఓ రాధ, ప్రత్యేక అధికారి సాయి లక్ష్మి ఉన్నారు. సౌకర్యాలు కల్పించాలితుర్కపల్లి : పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు తాగునీరు, నీడతోపాటు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీఓ నాగిరెడ్డి అన్నారు. తుర్కపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. కూలీలకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయం వేళల్లోనే పనికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ గీతారెడ్డి, గ్రామ కార్యదర్శి శైలజ, ఎప్ఏ చాంద్పాషా పాల్గొన్నారు. -
ముగిసిన భూదాన స్ఫూర్తి పాదయాత్ర
భూదాన్పోచంపల్లి : భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకుని నేటి యువతకు భూదా నోద్యమ చరిత్ర గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు సంఘమిత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి నుంచి ప్రారంభించిన 55 కిలోమీటర్ల భూదాన స్ఫూర్తి పాదయాత్ర శనివారం పోచంపల్లికి చేరుకోవడంతో ముగిసింది. పట్టణ శివారులో పాదయాత్ర బృందానికి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఘనస్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం వినోబాభావే మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొన్న వారిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు శాలువాలు కప్పి, గాంధీజీ విగ్రహ మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ప్రతినిధులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్, పాదయాత్రికులు తడక రమేశ్, భారత లవకుమార్, గునిగంటి రమేశ్, రాపోలు జ్ఞానేశ్వర్, పట్నం పారిజాత, చింతకింది రమేశ్, అంకం పాండు, ఆటిపాముల మహేందర్, చక్రాల నర్సింహ, కర్నాటి బాలరాజు, మందుల యాదగిరి పాల్గొన్నారు. -
నిరక్షరాస్యులు ఎస్సీల్లో ఎక్కువ
ఉమ్మడి జిల్లాలో 15 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో నిరక్షరాస్యులు అత్యధికంగా ఎస్సీల్లోనే ఉన్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 31.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 46.9 శాతం మంది ఉన్నట్లు తేలింది. సూర్యాపేట జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 30.4 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 40.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తంగా చూస్తే 15 ఏళ్ల పైబడిన వారిలో 26.8 శాతం మంది నిరక్షరాస్యులు ఉండగా, ఎస్సీల్లో అత్యధికంగా 40.9 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 ఏళ్ల పైబడిన వారిలో నిరక్షరాస్యుల శాతం ఇలా.. జిల్లా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 31.9 46.9 31.9 31.0 34.5 26.9 10.3 35.5 19.1 18.7 సూర్యాపేట 30.4 40.9 32.6 30.2 34.3 26.4 26.2 33.4 25.7 17.2 యాదాద్రి 26.8 40.9 28.6 26.1 30.2 22.6 9.7 29.7 18.7 20.0 -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
ఫ రికార్డులు స్వాధీనం సాక్షి, యాదాద్రి : బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు రాత్రి వరకు జరిగాయి. స్టాంప్ డ్యూటీల్లో అవకతవకలపై, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న దస్త్రాలు, రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజుల చెల్లింపుల వివరాలు సేకరించారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదులు ఉన్న ఉద్యోగులను విచారించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలకు వచ్చిన విషయం తెలిసిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిసరాల్లోని డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులను మూసి వేసి వెళ్లిపోయారు. కాగా, బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గతంలో ఏసీబీ అధికారులు దాడులు జరిగాయి. అప్పట్లో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కూడా అయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి డాక్యుమెంట్కు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, రామన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి రోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే.. వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పత్రాలు సరిగా లేకుంటే రూ.5వేల నుంచి రూ.10వేల వరకు తీసుకుంటారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బు వసూలు జరుగుతోంది. -
నిబంధనల మేరకే ధాన్యం సేకరించాలి
నల్లగొండ టౌన్: ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి, ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రైతులను రైస్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలోని ధాన్యపు రాశులు, తేమ, తాలు, తరుగు వివరాలను తెలుసుకున్న అనంతరం ఆయన ధాన్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం రైతులు, హమాలీలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం ఉండరాదని, ధాన్యం అమ్మిన వెంటనే రైతుకు రశీదు ఇవ్వాలని సూచించారు. తాలు, తరుగు, తేమ సమస్యలుంటే రైతులు కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించుకోవాలని, మిల్లర్లకు సమస్య ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం క్వింటాల్కు రూ.45 మాత్రమే హమాలీ ఛార్జీ తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తరుగు, తాలు, తూకం పేరిట మిల్లుల వద్ద లారీలను ఆపుతున్నారని, లారీకి 10 క్వింటాళ్ల చొప్పున తరుగు తీస్తున్నారని పలువురు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతినాయక్, తహసీల్దార్ పరశురాం, నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆదర్శ రైతు రామిరెడ్డి పాల్గొన్నారు. ఫ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
‘భూభారతి’తో భూములకు రక్షణ
భూదాన్పోచంపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తీసుకొచ్చి పేదల భూములకు రక్షణ కల్పిస్తుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం వినోబాభావే సేవా సమితి ఆధ్వర్యంలో పోచంపల్లిలో నిర్వహించిన భూదానోద్యమ వజ్రోత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట పేదల భూములను భూస్వాములకు అప్పగించే కుట్ర చేసిందన్నారు. భూదాన యజ్ఞబోర్డును పునరుద్ధరించి రాష్ట్రంలో మిగిలిపోయిన భూదాన భూములను భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని అన్నారు. అనంతరం భూమి సునీల్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలను అధ్యయనం చేశామని తెలిపారు. ఒక వ్యవస్థను రూపొందించి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భూదాన యజ్ఞబోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మర్రి నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ తడక యాదగిరి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
దాహార్తి తీర్చుకునేందుకు వెళ్లి..
ఫ పాత బావిలోని బురదలో కూరుకుపోయి ఆవు మృతి శాలిగౌరారం : దాహార్తి తీర్చుకునేందుకు పాత బావిలోకి వెళ్లిన ఆవు బురదలో కూరుకుపోయి మృతిచెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఊట్కూరు గ్రామానికి చెందిన కప్పల యాదయ్య నాలుగు రోజుల క్రితం తన పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి తోలుకెళ్లాడు. అందులో ఓ ఆవు దాహార్తి తీర్చుకునేందుకు సమీపంలో పూడికతో నిండిన పాత బావిలోకి వెళ్లింది. బావిలోని ఒండ్రు మట్టిలో ఆవు కూరుకుపోయి బయటకు రాలేక మృతిచెందింది. ఆవును గమనించని యజమాని అదే తిరిగి వస్తుందనుకుని ఇంటికి వెళ్లాడు. నాలుగు రోజులు గడిచినా ఆవు ఇంటికి రాకపోవడంతో గ్రామ సమీపంలో పూడికతో నిండిన బావి వద్దకు వెళ్లి చూడగా అందులో ఆవు మృతిచెంది ఉంది. కాగా.. ఆవు కళేబరం వద్దకు వచ్చిన లేగ దూడ బావి చుట్టూ అరుస్తూ తిరుగడం గ్రామస్తులను కలిచివేసింది. వినూత్నంగా అవగాహనకేతేపల్లి : మండలంలోని బీమారం గ్రామంలో శనివారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కోయ దొర వేషధారణలో కరపత్రాలు పంచుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతిఒక్కరు పాటించాలని ఆయన సూచించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం మత్తులో వావనాలు నడపరాదని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తాజుద్దీన్, నర్సయ్యచారి, నాగరాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి
పురుగు మందులు పిచికారీ చేయరాదు నిషేధించిన పురుగు మందులను మామిడి కాయలపై పిచికారీ చేయకూడదు. వీలైనంత వరకు సేంద్రియ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తర్వాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు, తిరిగి కాాయ కోతకు ముందు లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్ లేదా థయోఫానేట్ మిథైల్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడుసార్లు ఇలా పిచికారీ చేస్తే కాయలపై చీడల బెడద తగ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. పెద్దవూర : ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడిలో దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మామిడి కాయలు ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తున్నాయి. కోతలు కూడా మొదలవుతున్నాయి. అయితే చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తేనే ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామిడి కోతతో పాటు నిల్వ, రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోత సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి కొంపెల్లి మురళి పేర్కొన్నారు. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవడం, ముదిరిన కాయలతో పాటు ముదరని కాయలను కోయడం, గ్రేడింగ్, ప్యాకింగ్లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వలన పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించటం వలన ఈ నష్టాలను తగ్గించుకోవచ్చు. నిల్వ, రవాణా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలు పొందవచ్చునని ఆయన సూచిస్తున్నారు. ఎంపికే కీలకం.. తోటల్లో మామిడికాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండాలి. శ్వేద గ్రంథులు కనిపిస్తుండాలి. కాయ ఆకుపచ్చ రంగు నుంచి బాగా ముదిరిన లేత ఆకుపచ్చరంగు కలిగిన కాయలనే కోతకు ఎంపిక చేసుకోవాలి. వీటిలోనూ బ్రిక్స్(చక్కెర శాతం) ఉన్న కాయలనే కోయాలి. బ్రిక్స్ మీటర్ ద్వారా బ్రిక్స్ 10–13 ఉన్న కాయలను కోసుకోవాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. ఇవి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. లోపల కండ లేతపసుపు రంగులో ఉండాలి. కోత ఉదయం 10 గంటల లోపు లేదంటే సాయంత్రం వేళల్లోనే ఉండాలి. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోసుకోవాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాయలకు 6 నుంచి 7సెంటీమీటర్ల తొడిమ ఉండేటట్లు చూసుకోవాలి. కాయల మీద ఉండే చర్మానికి సొన(జిగురు) అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాయ కోసిన తర్వాత తప్పనిసరిగా సొన(జిగురు) పూర్తిగా కారేలా చూడాలి. తర్వాత తొడిమలను 0.5 నుంచి 1 సెంటీమీటర్ వరకు ఉండేలా పదునైన కత్తితో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి రెండుమూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయల నుంచి సొన సజావుగా నేల మీదికి కారుతుంది. కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చగానీ, దెబ్బగానీ తగలకుండా జాగ్రత్త పడాలి. కోసిన కాయలను మట్టినేలపై ఉంచకూడదు. శుభ్రపర్చడం ముఖ్యం మామిడి కాయలను శుభ్రపరచడం చాలా అవసరం, 10 గ్రాముల డిటర్జంట్ను 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో కడగాలి. తర్వాత 52 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడినీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైడ్ కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచాలి. రవాణా సమయంలో ఆంత్రాక్నోస్, పండు ఈగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కాయలను 48+0.3 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో గంట సేపు శుద్ధి చేయాలి. కాయలపై ఉన్న తేమ ఆరే వరకు నీడలో ఆరబెట్టాలి. 300–350 గ్రాముల బరువు ఉండేటట్లు గ్రేడింగ్ చేసుకుని, అట్టపెట్టెలలో 10 నుంచి 13 కాయలు అమర్చి ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాంకిగ్ కోసం టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డు బాక్సులను వాడాలి. వీటిని ఆరుగంటలలోపే ప్యాక్హౌజ్కు తరలించాలి. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను మళ్లీ వాడాల్సి వస్తే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ఇథిలిన్తో మాగించాలి మామిడి కాయలను వ్యాపారులు కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా మాగిస్తున్నారు. దీనివలన కాయ మంచి రంగు వస్తుంది కాని రుచి ఉండదు. పైగా అనారోగ్యానికి కారణమవుతోంది. రైతులు, వ్యాపారులు కార్బైడ్తో మాగించడానికి స్వస్తి పలికి ఆరోగ్యవంతమైన పద్ధతుల ద్వారా మాగించాలి. అప్పడే రుచి, శుచి లభిస్తాయి. ఈ రెండు ఉంటే మంచి ధర లభిస్తుంది. ఇథిలిన్తో మామిడి కాయలను మాగించడం అన్నివిధాలా మంచిది. ఇథిలిన్ అనేది గ్రోత్ హార్మోన్.. ఇది అన్నిచోట్ల లభ్యమవుతుంది. 10 లీటర్ల నీటికి ఒక మిల్లీలీటర్ ఇథిలిన్ కలిపిన ద్రావణంలో మామిడి కాయలను ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత గదిలో మామిడిని పోసి వరిగడ్డి కప్పితే 14 గంటల్లోనే మంచి రంగు, సువాసన వస్తుంది. ఇలా మామిడిని మాగించడం ఆరోగ్యదాయకం. ఫ అనుముల క్లస్టర్ ఉద్యానవనశాఖ అధికారి కొంపెల్లి మురళి సూచనలు -
నేడు విశ్వశాంతి మహాయజ్ఞం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రంలో ఆదివారం ఉదయం సుదర్శన నారసింహస్వామి విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్, యాదగిరిగుట్ట మున్నూరు కాపు సంఘం చైర్మన్ నేతి విద్యాసాగర్ తెలిపారు. ఈ విశ్వశాంతి యజ్ఞంలో 108 జంటలు పాల్గొంటాయన్నారు. అంతేకాకుండా 1008 మంది దంపతులతో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం సైతం జరిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సుదర్శన నారసింహ హోమంతో పాటు స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకలో సుమారు 5వేల మంది భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం కొనసాగుతాయన్నారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ట్రస్టు సభ్యులు పలుగుల శ్రీనివాస్, జీఎంఏ కన్వీనర్ రజనీకాంత్, తూడి జనార్దన్, కుమారస్వామి, అవుల సురేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఉప సర్పంచ్ మృతి
బొమ్మలరామారం : మండలంలోని తూంకుంట గ్రామ ఉప సర్పంచ్ మేకల బాలకృష్ణ(36) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలకృష్ణ శుక్రవారం రాత్రి స్వగ్రామం నుంచి తన ద్విచక్రవాహనంపై మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో అంకిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బాలకృష్ణ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలకృష్ణను స్థానికులు 108 వాహనంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. బైక్ను ఢీకొన్న ట్రాక్టర్ ఫ గ్రామ పంచాయతీ ఆఫీసర్ మృతి చివ్వెంల(సూర్యాపేట) : బైక్ను ట్రాక్టర్ ఢీకొనడంతో గ్రామ పంచాయతీ ఆఫీసర్(జీపీఓ) మృతిచెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని తిలక్నగర్కు చెందిన షేక్ ముస్తఫా(58) తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ పంచాయతీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం విధులు ముగించుకుని బైక్పై కోదాడకు వస్తుండగా.. మార్గమధ్యలో చివ్వెంల మండల వల్లభాపురం గ్రామ శివారులో ఎదురుగా రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముస్తఫా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు షేక్ హఫీజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని ఆత్మహత్యపెన్పహాడ్ : షాపు యాజమానుల వేధింపులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన షేక్ హుస్సేన్(35) హైదరాబాద్లో శ్రీనివాస సిమెంట్, ఐరన్ షాపులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో షాపు యాజమాని సుందరి కోటేశ్వర్రావు, హాజీ పటేల్ వేధింపులకు గురిచేస్తున్నారని షేక్ హుస్సేన్ పలుమార్లు కుటుంబ సభ్యులతో చెప్పాడు. కాగా శుక్రవారం ఉదయం షేక్ హుస్సేన్ హైదరాబాద్ వెళ్తున్నానని ఇంటి నుంచి బయల్దేరి అనంతారం క్రాస్ రోడ్డు వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు షేక్ లతీఫ్ పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రకృతిని మైమరిపించే
ఫ తీరొక్క మొక్కలతో ఇల్లే నందనవనం ఫ ఆకట్టుకుంటున్న తామర పూల కొలను, మోట బావి ఫ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా వ్యవసాయ పరికరాలు ఫ తన ఆదాయంలో 80 శాతం పచ్చదనానికి వెచ్చిస్తున్న నిడమనూరు వాసి ప్రకృతిపై ప్రేమతో తన ఇంటిని పచ్చని పొదరిల్లుగా మార్చుకున్నారు నిడమనూరు మండల కేంద్రానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు మేరెడ్డి వెంకట్రాహుల్. ఇంటి ఆవరణలో పూలు, పండ్ల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. అంతేకాకుండా తామర పూల కొలను, మోట బావి, ఎడ్ల బండి చక్రాలు, నాగలి, డంగు సున్నపురాళ్లతో అందంగా తీర్చిదిద్దిన బుద్ధుడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నిడమనూరు : వ్యవసాయ విద్యలో డిగ్రీ పూర్తిచేసిన వెంకట్రాహుల్ నిడమనూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి 167 పక్కనే రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి చిత్రకూటమి అని పేరు పెట్టుకున్నారు. వ్యవసాయంతో పాటు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతానికి పైగా తన ఇంట్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి వెచ్చిస్తున్నారు. వెంకట్రాహుల్ మూడు దశాబ్దాలుగా ఇంట్లో పెంచుతున్న చెట్లు, వివిధ రకాల మొక్కల కారణంగా వేసవిలో సైతం చల్లగా ఉంటుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించగానే పచ్చని మొక్కలు స్వాగతం పలుకుతూ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇంటి ఆవరణ మొత్తం తీగజాతి పందిళ్లు, తామరపూల కొలను, రంగురంగుల పూలచెట్లు, చెట్ల మధ్యలో పాత గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దిన అరుగులు కనిపిస్తాయి. మోట బావి, విద్యుత్ దీపాలు, చెట్ల పొదల్లో బుద్ధుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. మరోవైపు ఆవు, ఇతర గ్రామీణ వస్తువులతో బొమ్మల కొలువు ఉంటుంది. కొబ్బరి చెట్లు, టేకు చెట్లకు తమలపాకుల తీగలు అల్లుకుపోయి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్లోని వివిధ నర్సరీల్లో సేకరించిన క్రోటాన్, సుగంధ పరిమళాలు అందించే మొక్కలను పెంచుతున్నారు. వెంకట్రాహుల్ ఇంటిని మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు ప్రశంసించారు. చిత్రకూటమి పేరే ఎందుకంటే.. రామాయణంలో రాముడు సీతతో అరణ్యవాసంలో ఉండగా చిత్రకూట్ పర్వతంపై పదేళ్లకు పైగా నివసిస్తాడు. రాముడు చిత్రకూట్ పర్వతంపై పచ్చని చెట్ల మధ్య ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నట్లు చెబుతాడని అందుకే తన ఇంటికి చిత్రకూటమిగా నామకరణం చేసినట్లుగా మేరెడ్డి వెంకట్రాహుల్ చెబుతున్నారు. ఇంటి పచ్చదనాన్ని తన తండ్రి మేరెడ్డి మట్టారెడ్డి వారసత్వంగా ఇవ్వగా, అదే పచ్చదనాన్ని కొనసాగిస్తూ తన వారసుడు కృష్ణవివేక్కు అందిస్తానని వెంకట్రాహుల్ చెప్పడం విశేషం. ఎడ్ల బండి చక్రాలతో అలంకరించిన ఇంటి ప్రాంగణంకృష్ణుడి విగ్రహం ఇరువైపులా ఏర్పాటుచేసిన పురాతన డంగు సున్నంరాళ్లుఇంటి పరిసరాల్లో ఏపుగా పెరిగిన మొక్కలు పచ్చని చెట్లతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఇంటి ప్రవేశ ద్వారం -
లబ్ధిదారుల కల.. నెరవేరే వేళ
సాక్షి, యాదాద్రి: భువనగిరి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు త్వరలో డబుల్ బెడ్రూం ఇళ్లు దక్కనున్నాయి. ప్రధానంగా భువనగిరిలోని సింగన్న గూడెం వద్ద నిర్మించిన 444 డబుల్ బెడ్ రూం ఇళ్లలో మౌలిక వసతులు పూర్తి చేసి, జూన్ మొదటి వారంలో సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి శుక్రవారం అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనర్హుల తొలగింపు గడిచిన రెండు నెలలుగా నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడానికి ప్రణాళిక ఖరారు చేశారు. ఈ నెల చివరి నాటికి డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో డ్రెయినేజీ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి పైప్లైన్ల వంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా.. లబ్ధిదారుల ఎంపికపై మరోసారి విచారణ చేపట్టాలని నిర్ణయించారు. మిగతా మండలాల్లో.. బీబీనగర్ మండలం కొండమడుగులో 24 డబుల్ బెడ్ రూం ఇళ్లు, బీబీనగర్ 10, పోచంపల్లిలో 120, జిబ్లక్ పల్లిలో 24 ఇళ్ల పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కొండమడుగులో విద్యుత్ స్తంభాలు నాటుతున్నారు. బీబీనగర్ లెప్రసీ కాలనీలో ఉన్న డంపింగ్ యార్డును తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిఽధిలోని రేవణపల్లిలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. అదేవిధంగా జిబ్లక్పల్లిలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. సాక్షి, యాదాద్రి : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం జనగణనకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ముందుగా ఇళ్ల లెక్కింపు, ఆ తర్వాత జనాభాను లెక్కించనున్నారు. ఈనెల 26 నుంచి ప్రజలకు స్వీయ గణన నమోదుకు అవకాశం ఇచ్చారు. మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు క్షేత్రస్థాయి గృహాల సమాచారాన్ని సేకరించనున్నారు. 2027 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జనగణన చేపట్టనున్నారు. ఇందుకోసం సిబ్బందికి ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణ ఇవ్వగా.. శనివారం ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రతి 600 నుంచి 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేటర్ ప్రస్తుతం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7,70,833 జనాభా ఉండగా, అందులో మహిళలు 3,80,341 కాగా, పురుషులు 3,90,482 మంది ఉన్నారు. 1,88,520 ఇళ్లు ఉండగా ఎఫెక్ సర్వే లెక్కల ప్రకారం 2.14లక్షలు ఉన్నట్లు తేలింది. సర్వే చేసేందుకు ప్రతి 600 నుంచి 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేటర్ ఉంటారు. ప్రతి ఆరుగురు ఎన్యుమరేటర్లను ఒక సూపర్వైజర్ పర్యవేక్షిస్తారు. మే 11నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు సర్వే చేయనున్నారు. తొలిదశలో క్షేత్రస్థాయి గృహాల సమాచారాన్ని సేకరిస్తారు. ఈమేరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 104 వార్డులు, 427 గ్రామపంచాయతీలలో ఇళ్ల జాబితాలను రూపొందిస్తారు. ఆయా ఇళ్లలోని కుటుంబాల జీవన స్థితిగతులను గుర్తిస్తారు. ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎన్ని గృహాలు ఉన్నాయో గుర్తించి, ప్రాంతాలవారీగా మ్యాప్లను రూపొందిస్తారు. 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్న జనగణన సర్వేలో కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను నమోదు చేస్తారు. తొలి దశ సర్వేలో నివాస గృహం స్థితి, వాహనాలు, ఆహారపు అలవాట్లతోపాటు 33 రకాల ప్రశ్నలు ఉంటాయి. పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే ఈ సర్వే కొనసాగుతుంది. భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలతోపాటు జిల్లా ప్లానింగ్ అధికారి, డీపీఓ, డీఎఫ్ఓ, జెడ్పీ సీఈఓ, డీఐసీ, ఎస్ఓ, డీఈఓతో కలిపి 10 మంది అధికారులు ఇళ్ల జాబితా, ఆ కుటుంబాల జీవనస్థితిగతుల నమోదును పరిశీలిస్తారు. జనాభా గణన ప్రధాన అధికారిగా కలెక్టర్ వ్యవహరించనున్నారు. ఆయనకు సహాయ ముఖ్య జిల్లా జనగణన అధికారిగా అదనపు కలెక్టర్ ఉంటారు. 26 నుంచి మే 5 వరకు స్వీయగణన జనగణనలో తాజాగా స్వీయ గణన నమోదు ప్రక్రియ తీసుకువచ్చారు. ఈనెల 26 నుంచి మే 5వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజలు తమ కుటుంబ వివరాలు, నివాసం వంటి పలు అంశాలు ప్రభుత్వం ఇచ్చిన ఆన్లైన్ పోర్టల్ se.census. gov.in లో స్వయంగా నమోదు చేయాలి. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చి అధికారిక వెబ్సైట్ లో వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక ఐడీ ఇస్తారు. ఫీల్డ్ ఎన్యుమరేటర్ ఈ డేటా ఐడీని ధ్రువీకరిస్తారు. నేటి తరానికి స్ఫూర్తిగా భూదాన పాదయాత్ర17బిఎన్జి209–ఫ జూన్లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు ఫ ఈనెలాఖరులోగా మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని సూచన ఫ సింగన్నగూడెం వద్ద ఇళ్ల నిర్మాణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష ఫ జనగణనలో భాగంగా ముందుగా ఇళ్ల సర్వే, ఆ తర్వాత జనాభా లెక్కింపు ఫ 26 నుంచి స్వీయగణన నమోదుకు అవకాశం ఫ వచ్చే నెల 11 నుంచి జూన్ 9 వరకు క్షేత్రస్థాయిలో ఇళ్ల సమాచార సేకరణ ఫ 2027 ఫిబ్రవరి 10 నుంచి మొదలుకానున్న జనగణన ఫ నేటి నుంచి మూడు రోజులపాటు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం వద్ద నిర్మిస్తున్న 444 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టు కోసం తక్షణమే రూ. 2.5 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు లేని పేదలకు, మధ్యతరగతి వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, హౌసింగ్ పీడీ, డీఈ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. 2011 జనాభా లెక్కలు ఇలా.. జనాభా : 7,70,833 మహిళలు : 3,80,341 పురుషులు : 3,90,482 కుటుంబాలు : 1,88,520 జిల్లాలో జనగణనకు సంబంధించి మొదటి దశ శిక్షణ తరగతులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని, క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ప్రధాన జనగణన అధికారి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈనెల 18, 20, 21 తేదీల్లో మొత్తం మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 13 ఛార్జ్ లెవెల్ కేంద్రాల్లో ఈ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమకు కేటాయించిన కేంద్రాలకు నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. జనగణనలో సాంకేతికత వినియోగం పెరిగిన నేపథ్యంలో, మొబైల్ యాప్ల నిర్వహణ, డాటా ఎంట్రీ మరియు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై సిబ్బందికి నిపుణులతో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనగణన సమయంలో పాటించాల్సిన విధివిధానాలు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ స్పష్టత కలిగి ఉండాలని పేర్కొన్నారు. జనగణన దేశ భవిష్యత్ ప్రణాళికలకు కీలకమైనదని, ఇందులో ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. -
రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ పాటించాలి
చౌటుప్పల్ : రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలోని దివీస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు– నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు, సిబ్బంది ఏ విధంగా స్పందించాలి, ప్రాణ, ఆస్తినష్టం లేకుండా వ్యవహరించాల్సిన తీరును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు అధికంగా ఉన్నందున ఆయా పరిశ్రల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీతోపాటు ప్రమాద సమయంలో స్పందించాల్సిన అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో దివీస్ పరిశ్రమ జనరల్ మేనేజర్లు బాలకిషోర్, పెండ్యాల సుధాకర్, ఏజీఎం సాంబశివరావు, మండల ఫైర్ అధికారి శివాజీ, దివీస్ ప్రతినిధులు ఉమామహేష్, రంగారావు, ఎన్వీడీ ప్రసాద్ పాల్గొన్నారు. -
కులగణనలో మాదిగలకు తీవ్ర అన్యాయం
ఆలేరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణనలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాదిగల జనాభాను తగ్గించి చూపించారని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం ఆలేరు మండలంలోని కొలనుపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డికి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వే బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఒక్కరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాదిగలను తక్కువ చూపించి అసెంబ్లీ, పార్టమెంట్ సీట్లు రాకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. కుల గణన సమాచారాన్ని తారుమారు చేస్తే సామాజిక న్యాయానికి ఆటంకం కలిగిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుల రామన్, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకుడు మోత్కూరి ఐలయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సైదాపురం సురేష్, గందమల్ల స్వామి పాల్గొన్నారు. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులు నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలు విశేషంగా జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. చెరువుకట్ట పరిశీలన మోత్కూరు : మోత్కూరు పట్టణంలోని పెద్ద చెరువు ఇటీవల వర్షా కాలంలో 20 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతుతో పెద్దఎత్తున కుంగిపోయింది. శుక్రవారం నీటి పారుదల శాఖ సూర్యాపేట చీఫ్ ఇంజనీర్ టీఎన్ భూషణ్రావు, తిరుమలగిరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ సందర్శించి పరిశీలించారు. చెరువు కట్ట రోడ్డు ప్రాధాన్యతను పరిశీలించి అన్ని రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరుకాగానే మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట ఏఈలు చంద్రశేఖర్, అఖిల్ ఉన్నారు. వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి ఆత్మకూరు(ఎం) : ఉచిత వైద్యశిబిరాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. చేనేత జౌళి శాఖ, జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో చేనేత కార్మికులకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైధ్యాధికారి సుమన్ కల్యాణ్, చేనేత మరియు జౌళి శాఖ ప్రాంతీయ అధికారి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి, వైద్యాధికారి అమరావతి, చేనేత సంఘం మేనేజర్ వేముల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలి గుండాల : ఎన్నికల హామీలు అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదరరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీపీఐ మండల కౌన్సిల్ సమావేశాన్ని గుర్రం మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్న తూకాలు ప్రారంభించడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మంచి నీరు, నీడ, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కుసుమని హరిశ్చంద్ర, దయాకర్రెడ్డి, కొమురయ్య, జోసఫ్, యాదయ్య, స్వామి, భిక్షం పాల్గొన్నారు. -
దోస్త్ పిలుస్తోంది!
రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి ఈనెల 13న దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు అడ్మిషన్ల వేటలో పడ్డాయి. ప్రభుత్వ కళాశాలలు సైతం ప్రైవేట్కు దీటుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాయి. మొత్తం 59 డిగ్రీ కళాశాలలు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 59 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 11 ప్రభుత్వ కళాశాలలు, రెండు ఎయిడెడ్, 46 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. యూనివర్శిటీ ఆయా కళాశాలల ద్వారా సుమారు 45కి పైగా కోర్సులను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. వాటిలో ప్రధానంగా బీఏలో హెచ్ఈఎంజే, హెచ్ఈపీఎ, హెచ్పీపీ, హెచ్ఈపీ, ఈపీపీ, హెచ్పీజీ, టీహెచ్పీ, ఈహెచ్పీ కోర్సులు, బీకాంలో కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు, బీఎస్సీలో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంసీసీ, బీజెడ్సీ, డీజెడ్సీ, బీజెడ్సీఎస్ వంటి కోర్సులు ఉన్నాయి. ఫ 13న విడుదలైన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ ఫ జూన్ 1 వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఫ జూలై 1 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు దోస్త్ షెడ్యూల్ ఇలా.. మొదటి దశ రెండవ దశ మూడో దశ రిజిస్ట్రేషన్లు (ఏప్రిల్ 15 – మే 7) మే 15 – 25 వరకు మే 31– జూన్ 15 రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 రూ.400 రూ.400 వెబ్ ఆప్షన్ల నమోదు ఏప్రిల్ 30 – మే 8 మే 15– 26 వరకు మే 31 – జూన్ 16 సీట్ల కేటాయింపు మే 14 మే 30 జూన్ 20 కళాశాలల్లో చేరాల్సింది మే 15 – 25 లోపు మే 31 – జూన్ 5లోపు జూన్ 20 – జూన్ 25లోపు -
వెట్టిచాకిరి నుంచి చిన్నారికి విముక్తి
అనంతగిరి(కోదాడ) : వెట్టిచాకిరి నుంచి ఏడేళ్ల బాలికకు విముక్తి కల్పించారు ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది. అనంతగిరి మండలం పాలవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో ఏడేళ్ల వయసున్న సుబ్బులు అనే బాలిక ఎండలో బాతులు మేపుతుండగా అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు గమనించి చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది చిన్నారి వద్దకు చేరుకుని అనంతగిరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా.. తన తల్లిదండ్రుల పేర్లు సుబ్బయ్య, లక్ష్మి అని తెలిపింది. నాలుగేళ్ల క్రితం కోదాడ పట్టణంలోని చందానగర్కు చెందిన పాలకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద తనను వదిలి వెళ్లిపోయారని చెప్పింది. అప్పటి నుంచి శ్రీకాంత్ తనతో ఇంటి పనులు చేయించడం, బాతులు మేపించడం, తరచూ కొట్టడం, తిట్టడం చేస్తున్నాడని బాలిక ఏడుస్తూ పోలీసులకు వివరించింది. ఈ మేరకు పాలకుర్తి శ్రీకాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. అనంతరం చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు బాలికను సూర్యాపేట పట్టణంలోని బాల రక్షక భవన్కు తరలించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్... యజమాని కొట్టిన గాయాలను పోలీసులకు చూపిస్తూ చిన్నారి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాకుండా తనను చదివిస్తే చదువుకుంటానని ఆ చిన్నారి పోలీసులకు చెప్పింది. ఫ బాల రక్షక భవన్కు తరలించిన అధికారులు ఫ యజమానిపై కేసు నమోదు -
భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడంలేదని..
ఫ మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య రామగిరి(నల్లగొండ) : భార్య పుట్టింటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకుల కొండారం గ్రామానికి చెందిన చెనగోని రాకేష్కు(25) మూడేళ్ల క్రితం నల్లగొండ పట్టణానికి చెందిన మమతతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప సంతానం. గత నెల పుట్టింటికి వెళ్లిన మమత తిరిగి రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రాకేష్ శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి మదార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నల్లగొండ రూరల్ ఏఎస్ఐ లాజర్ తెలిపారు. ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకోదాడరూరల్ : పరీక్షలో ఫెయిలైన ఇంటర్ విద్యార్థిని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో శుక్రవారం జరిగింది. వివరాలు.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన బొగ్గారపు లేక్ష్యా కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమె ఇటీవల విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్ట్లు ఫెయిల్ కాగా.. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి కళాశాలకు వచ్చింది. వచ్చిన గంట సేపటికే మొదటి అంతస్తులోని క్లాస్రూంకు వెళ్లి ఉరేసుకుంది. కళాశాల పక్క ఇంటి వారు గమనించి సిబ్బందికి చెప్పడంతో వారు వెళ్లి విద్యార్థినిని కిందకు దించి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ సీఐ కె. శివశంకర్ తెలిపారు. కారును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతిఫ మరొకరికి తీవ్ర గాయాలు మర్రిగూడ(చింతపల్లి) : లారీ కారును ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ శివారులో శుక్రవారం జరిగింది. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ టౌన్కు చెందిన సూర్య గిరిధర్గౌడ్(28) బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు తన స్నేహితుడు అవినాష్తో కలిసి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గిరిధర్గౌడ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి స్నేహితుడు అవినాష్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి సోదరుడు సూర్య అరవింద్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ మృతి త్రిపురారం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన బైరం పెదభిక్షం, లక్ష్మమ్మ భార్యాభర్తలు. వీరి వద్దే పెదభిక్షం చెల్లెలి కుమారుడు పగడాల ప్రకాష్ ఉంటున్నాడు. పెదభిక్షంకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ముగ్గురు కలిసి గురువారం మిర్యాలగూడలో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం బైక్పై తిరిగి వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయడ్డారు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పెదభిక్షం శుక్రవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోగొట్టుకున్న బంగారు పుస్తెలు తిరిగి అందజేత
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తురాలు పోగొట్టుకున్న బంగారు నల్లపూసల పుస్తెలను ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి తిరిగి ఆమెకు అందజేశారు. ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా గొర్లనోనిబావికి చెందిన కావలి మంగమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరీశుడిని దర్శించుకునేందుకు శుక్రవారం వచ్చింది. స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న సమయంలో ఆమె బంగారు నల్లపూసల పుస్తెలు పోగొట్టుకుంది. వెంటనే మంగమ్మ సమీపంలోని ఎస్పీఎఫ్ సిబ్బందికి, ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాల సాయంతో పుస్తెలు దొరికిన వ్యక్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఈఓ నవీన్కుమార్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె. శేషగిరిరావు, ఎస్ఐ సీహెచ్. రవి సమక్షంలో మంగమ్మకు బంగారు పుస్తెలు అందజేశారు. -
ద్వార పాలకుడి పురాతన విగ్రహం గుర్తింపు
వేములపల్లి, రామగిరి(నల్లగొండ): వేములపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో 13వ శతాబ్దం నాటి ద్వార పాలకుడి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర అన్వేషణ బృదం సభ్యుడు రాగి మురళి గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న విగ్రహాన్ని ఆయన పరిశీలించి విశ్రాంత పురావస్తు అధికారి ఈమని శివానాగిరెడ్డితో మాట్లాడి వివరాలు తెలియజేశారు. ఈ విగ్రహం శివాలయాల ముందు ఉండే ద్వార పాలకుడిదని, విగ్రహం అంసంపూర్తిగా ఉందన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయని.. మనకు వాటి గురించి తెలియక ధ్వంసం చేస్తుండడంతో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు. -
నేడు వెదిరె రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ
భూదాన్పోచంపల్లి : భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్తాలో ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. వెదిరె రామచంద్రారెడ్డి సేవాసమితి, సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆవిష్కరించనున్నట్లు ఆలిండియా సర్వోదయ మండలి అధ్యక్షుడు వెదిరె అరవిందారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ.. భూదాన వజ్రోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్గౌడ్, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆలిండియా సర్వసేవా సంఘ్ మేనేజింగ్ ట్రస్ట్ మహాదేవ్ విద్రోహి, సర్వోదయ మండలి అధ్యక్షుడు తురుపునూరి కృష్ణ, వెదిరె రాంచంద్రారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య, కొమ్ము లక్ష్మణ్, కరగళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సంస్కరణలకు నాంది
భూదాన్పోచంపల్లి : 50వ దశకంలో పోచంపల్లిలో 500 కుటుంబాలు నివసించేవి. వీరిలో చాలా మందికి సెంటు భూమి కూడా లేదు. మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో అప్పటి మద్రాస్, ఆంధ్రా, తెలంగాణలో కమ్యూనిస్టుల మద్దతుతో భూమిలేని ప్రజలంతా భూస్వాములపై తిరుగుబాటు మొదలుపెట్టారు. ఆ సమయంలోనే నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కారం కనుగొనడానికి గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే 1951 ఏప్రిల్ 17న పాదయాత్రగా పోచంపల్లికి వచ్చారు. మరుసటి రోజు ఏప్రిల్ 18న స్థానిక చెరువు సమీపంలో ఉన్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు తలా రెండెకరాల భూమి ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని 40 దళిత కుటుంబాలు తమ గోడు వెల్లబోసుకున్నారు. గ్రామంలోని భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డికి వేల ఎకరాల భూమి ఉందని, మీరు అడిగితే కాదనరని దళితులు వినోబాభావేకు చెప్పారు. దీంతో వెదిరె రామచంద్రారెడ్డిని అడిగిందే తడవుగా తన తండ్రి వెదిరె నర్సింహారెడ్డి జ్ఞాపకార్ధం 100 ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించారు. అక్కడికక్కడే వెదిరె రామచంద్రారెడ్డి దాన పత్రాన్ని రాసి వినోబాభావేకు అందించారు. ఆ భూమిని దళితులకు పంచి వినోబాభావే భూదానోద్యామానికి శ్రీకారం చుట్టారు. 100 ఎకరాలతో మొదలైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించి ఐదేళ్లలో 44 లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి 40లక్షల మంది భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టారు. ఈ భూదానోద్యమం భూ సంస్కరణలకు, దేశంలో ఆర్థిక అసమానతలు తొలగడానికి దోహదపడింది. ఇలా పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆచార్య వినోబాభావే పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా పేర్కొనడం విశేషం. కాగా వెదిరె రామచంద్రారెడ్డిని అప్పటి పోచంపల్లి ప్రజలంతా భాయ్సాబ్ అని పిలిచేవారు. అతడు మొదట దళితులకు 100 ఎకరాల వ్యవసాయ భూమిని దానం చేయగా.. అనంతరం విడతల వారీగా మొత్తం 800 ఎకరాల వరకు భూమిని దానం చేశారు. ఆయన దానం చేసిన 14 ఎకరాలలోనే ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, శాఖ గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారు. అంతేకాక 24 ఎకరాలలో లక్ష్మణ్నగర్ కాలనీ, మరో రెండెకరాలలో ఇందిరానగర్ కాలనీలు ఏర్పాటయ్యాయి. వినోబాభావే దేశవ్యాప్తంగా తిరిగి సేకరించిన భూదాన్ భూములకు చట్టబద్ధత కల్పించాలని 1958లో అప్పటి ప్రధాని నెహ్రూ దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ అధ్యక్షతన దేశంలోని మేధావులతో సమావేశం నిర్వహించి ‘భూదాన్–గ్రామదాన్’ చట్టాన్ని రూపొందించడానికి కమిటీని వేశారు. అనంతరం 1965లో అధికారికంగా భూదాన్–గ్రామదాన్ చట్టానికి చట్టబద్దత లభించింది. అనంతరం మిగిలిన భూదాన్ భూములను నిరుపేదలకు పారదర్శకంగా పంపిణీ చేయడానికి ఆయా రాష్ట్రాలలో భూదాన యజ్ఞబోర్డులను ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూదానోద్యమం మొదలైంది ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి నుంచే. అందుకే దీనిని భూదాన్పోచంపల్లి అని పిలుస్తుంటారు. ఈ భూదానోద్యమంతో పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు లభించాయి. భూదానోద్యమం మొదలై నేటికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం. ఫ 75 ఏళ్ల క్రితం పోచంపల్లిలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన ఆచార్య వినోబాభావే ఫ 100 ఎకరాలు దానం చేసిన స్థానిక భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి ఫ నేడు పోచంపల్లిలో భూదానోద్యమ వజ్రోత్సవాలు నాడు భాయ్సాబ్(వెదిరె రామ చంద్రారెడ్డి) పోచంపల్లిలో ఉన్న మా దళితులకు 80 ఎకరాల భూమి దానం చేసిండు. 2 ఎకరాల చొప్పున 40 కుటుంబాలు వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. భాయ్సాబ్ మాపాలిట దేవుడు. ఆయనను ఊపిరి ఉన్నంత వరకు మరువం. – కరగళ్ల నర్సింహ, ప్రథమ భూగ్రహీత కుమారుడు -
అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదు
నకిరేకల్ : ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న చోట స్థానికంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని ఆహ్వానించకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, కానీ గడిచిన 40 రోజుల ప్రణాళికలో ఏం సాధించారని ప్రశ్నించారు. చిన్నచిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో తూకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అదనపు తూకాలను నిలిపివేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొండ శ్రీనివాస్గౌడ్, నకిరేకల్, కేతేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, సర్పంచ్ గోర్ల వీరయ్య, కౌన్సిలర్ పల్లె విజయ్, నాయకులు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, రావిరాల మల్లయ్య, గుండగోని జంగయ్య, దైద పరమేషం పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ఇందిరమ్మ ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం
మునగాల: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన గురువారం మునగాల మండలంలోని తాడువాయి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోట సునీతకు 2008లో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైనట్లు రికార్డుల్లో ఉంది. కానీ వాస్తవానికి తన మంజూరు కాలేదని, ఇందిరమ్మ ఇళ్ల ఇల్లు మంజూరు చేయాలని గత కొంత కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. పలుమార్లు కలెక్టర్కు ప్రజావాణిలో మొర పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి కలెక్టర్ తేజస్నందలాల్, ఎస్పీ నరసింహ, తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. దీంతో సునీత తన పేరు కల్గిన మరో మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తనకు కాలేదని చెప్పినప్పటీకీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని కలెక్టర్కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరింది. అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుమందు డబ్బాను తీసి తాగేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న కొందరు అడ్డుకున్నారు. మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి సిబ్బందిసాయంతో సదరు మహిళ చేతిలో నుంచి పురుగుమందు డబ్బాను తీసేసి హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం సునీత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. తనకు న్యాయం చేయాలని, తన పేరు మీద వేరే వ్యక్తులకు ఇల్లు మంజూరు చేసిన అఽధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితురాలు సునీత కోరడంతో కలెక్టర్ స్పందించి ఈ విషయమై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. -
యాదాద్రిలో బీసీలు అధికం
జిల్లాల వారీగా జనాభాతో పోల్చితే యాదాద్రి భువనగిరి జిల్లాలోనే బీసీల శాతం ఎక్కువగా ఉన్నారు. సంఖ్యా పరంగా మాత్రం నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో సంఖ్యా పరంగా ఎక్కువే అయినా మొత్తం జనాభాలో బీసీలు 54 శాతం ఉండగా, సూర్యాపేటలో 52 శాతం ఉన్నారు. ఇక యాదాద్రిలో అత్యధికంగా 63 శాతం మంది బీసీలు ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక జనాభా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా జనాభా ఉంది. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా అన్ని సామాజిక వర్గాల్లోనూ తక్కువే. టాయిలెట్ సదుపాయం ఉన్న కుటుంబాల శాతం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 69.8 79.7 88.5 86 91 94.3 86.6 92.6 93.8 సూర్యాపేట 68.7 73 84.6 81.9 85.7 87 83.7 88.7 92.8 యాదాద్రి 86.4 88.4 93.8 90.7 95.2 98.5 93.4 92.1 95.9 -
నేడు ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన
భువనగిరిటౌన్ : తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి వెల్లడించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేయాలని కోరారు. 2023 నుంచి పెండింగ్లో ఉన్న రెండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలనిడిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్జీఓ అధ్యక్షుడు భగత్, పీఆర్టీయూ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
సొంతిళ్లు ఉన్న వారిలో బీసీ–ఈ వారే తక్కువ
జిల్లాలోని మొత్తం నివాస సముదాయాల్లో సొంతిళ్లు కలిగిన వారిలో బీసీ–ఈ వారే తక్కువగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో బీసీ–సీ వారు ఉన్నారు. సొంతిళ్లు కలిగిన వారిలో మూడు జిల్లాల్లోనూ ఎస్సీలు, ఓసీలే ఎక్కువ ఇళ్లు కలిగి ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సొంతిళ్లు లేని వారిలో ఎస్టీలే అత్యధికంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 9.2 శాతం ఎస్టీలకు సొంతిళ్లు లేవు. అదే జిల్లాలో 7.5 శాతం ఎస్సీలకు సొంతిళ్లు లేవు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోనూ ఎస్టీలకు సొంతిళ్లు లేవు. 15 ఏళ్ల పైబడిన వారిలో నిరుద్యోగులుగా ఉన్న వారు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 6.5 9.5 10.2 10.0 11.2 7.7 9.8 9.5 13.4 సూర్యాపేట 7.3 10.0 10.7 10.3 11.3 6.6 10.6 10.2 14.1 యాదాద్రి 9.0 12.2 12.3 11.7 12.8 10.5 12.2 10.6 14.7 -
సంత కాంట్రాక్ట్లో నకిలీ చలానాల బాగోతం
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పశువుల సంత కాంట్రాక్ట్కు సంబంధించి చెల్లించాల్సిన బకాయిల కోసం కాంట్రాక్టర్ సమర్పించిన చలానాలు నకిలీగా తేలాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంత కాంట్రాక్ట్ను దక్కించుకున్న నార్కట్పల్లి వాసి దూదిమెట్ల శ్రీనివాస్ రూ.1.22కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అలాగే 2024–25 సంవత్సరానికి గాను రూ.20లక్షలు, 2025–2026 సంవత్సరానికి గాను రూ.40 లక్షలు చెల్లించలేదు. ఈ క్రమంలో బకాయిలు చెల్లించాలని సదరు కాంట్రాక్టర్పై పాలకవర్గం ఒత్తిడి తెచ్చింది. దీంతో సదరు గుత్తేదారు మొత్తం రూ.60లక్షలకు మార్చిలో పలుమార్లు దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్కి చెందిన ఆరు చలాన్లు సమర్పించాడు. అయితే ఈ ఆరు చలానాలు నకిలీగా అనుమానం రావడంతో పాలకవర్గం కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ చాలానా అంశంపై విచారణ చేయాలని డీపీఓ ద్వారా ఇన్చార్జ్ ఎంపీడీఓ సుధీర్కుమార్ను ఆదేశించారు. అయితే సదరు ఇన్చార్జ్ ఎంపీడీఓ విచారణ లేకుండానే నివేదిక పంపించడం గమనార్హం. ఇటీవల పాలకవర్గం బ్యాంకును సంప్రదించగా ఇవి నకిలీ చలానాలుగా అధికారులు తేల్చారు. ఈ విషయమై ఇన్చార్జ్ డీపీఓ శంకర్నాయక్ను వివరణ కోరగా నకిలీ చలానాల విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫ రూ.60లక్షల బకాయిలకు నకిలీ చలానాలు సమర్పించిన కాంట్రాక్టర్ -
మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యం
భూదాన్పోచంపల్లి: మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భూదాన్పోచంపల్లి మండలంలోని ఏడుగురు మహిళా రైతులకు పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా సబ్సిడీపై మంజూరైన ప్యాడీ క్లీనర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి పథకం మహిళల పేరిటే అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఉత్తమ ఇంద్రియాల వీఓఏ లక్ష్మితో పాటు ఆయా బ్యాంకు మేనేజర్లను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ కోట జంగారెడ్డి, తహసీల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, ఏఓ శైలజ, డీపీఎం రవీందర్, ఏపీఎం తవుర్యానాయక్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పారిజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశ్ పాల్గొన్నారు. -
లింగ వివక్షలో తేడాలు
సామాజిక వర్గాల పరంగా చూస్తే లింగ నిష్పత్తిలో చాలా తేడాలు ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాల్లో ప్రతి వేయి మంది పురుషులకు మహిళల సంఖ్య తక్కువగా ఉండగా.. కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం జనాభా పరంగా చూస్తే మాత్ర లింగ నిష్పత్తి తక్కువే ఉన్నట్లు తేలింది. ప్రతి వేయి మందికి నల్లగొండలో 969 మంది మహిళలు, సూర్యాపేటలో 989 మంది, యాదాద్రిలో 974 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అదే ఓసీల్లో చూస్తే మాత్రం మూడు జిల్లాల్లో మహిళ నిష్పత్తి ఎక్కువగా ఉంది. సామాజికవర్గాల వారీగా.. సొంతిళ్లు కలిగిన వారి శాతం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ నల్లగొండ 84.4 80.0 81.2 79.8 81.9 74.3 84.9 65.1 83.2 సూర్యాపేట 79.5 70.2 73.7 70.4 76.0 57.0 76.2 61.2 76.8 యాదాద్రి 73.8 72.2 72.7 69.7 73.4 62.1 75.2 55.9 76.9 ఇళ్లు లేని వారి శాతం నల్లగొండ 6.1 6.3 3.5 4.5 3.3 2.1 3.6 2.2 2.1 సూర్యాపేట 7.5 9.2 5.8 6.9 5.6 5.7 5.8 5 3.4 యాదాద్రి 6.1 6.2 4.0 5.1 3.7 2.3 3.8 3.9 3.3 -
భూదానంతో దేశానికి ఘన కీర్తి
భూదాన్పోచంపల్లి: వెదిరె రాంచంద్రారెడ్డి భూదానంతో పోచంపల్లికి, దేశానికి ఘన కీర్తి వచ్చిందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని కస్తూర్బా ప్రకృతి చికిత్సాలయం నుంచి పోచంపల్లి వరకు సంఘమిత్ర సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల భూదానోద్యమ స్ఫూర్తి పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ ససందర్భంగా మాట్లాడుతూ.. పోచంపల్లిలో ఈనెల 18న భూదానోద్యమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోచంపల్లిలో నిర్వహిస్తున్న వజ్రోత్సవాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, సంఘమిత్ర సంస్థ ప్రతినిధులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్, తడక రమేశ్, భారత లవకుమార్, తడక లావణ్య, కొయ్యడ నర్సింహ, గుజ్జ సత్యం, పారిజాత, చక్రాల నర్సింహ, పిల్లలమర్రి దేవేందర్, రాపోలు జ్ఞానేశ్వర్, చింతకింది రమేశ్ పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
లారీ ఢీకొని మహిళ దుర్మరణం
చౌటుప్పల్ : పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి వస్తున్న మహిళను లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. చౌటుప్పల్లోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబీకురాలైన కడారి యాదమ్మ (50) రోజువారీ కూలి పనికి వెళ్తుంది. భర్త మల్లయ్య ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉండే ఈడెం మల్లేష్తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన ఫంక్షన్లో వంట వండేందుకు వెళ్లారు. సాయంత్రం పని ముగిసిన తర్వాత ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో వలిగొండ రోడ్డు నుంచి జాతీయ రహదారి క్రాస్ చేస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెనుక కూర్చున్న యాదమ్మ ఎగిరి కింద పడింది. లారీ టైర్లు ఆమైపె నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న మల్లేష్కు స్వల్ప గాయాలయ్యాయి. యాదమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
చరిత్రాత్మక నిర్ణయం
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయం ఎంతో చరిత్రాత్మకమైనది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు ఇది పండుగ రోజు. ఎవరో ఇస్తే కాకుండా హక్కుగా మహిళలు చట్టసభల్లోకి వెళ్తారు. ఇప్పటికే అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్టసభల్లో హక్కు అందని ద్రాక్షగా మిగిలింది. అలాంటి తరుణంలో మహిళా సమాజానికి హక్కు కల్పిస్తూ చట్టం రావడం శుభ పరిణామం. రానున్న రోజుల్లో మహిళలు చట్టసభల్లో గొప్పగా రాణిస్తారు. – డాక్టర్ ఉజ్జిని మంజుల, ట్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్, చౌటుప్పల్. -
ఆరునెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం : ఎస్పీ
భువనగిరిటౌన్ : డ్రైవర్లు ప్రతి ఆరునెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఎస్పీ అక్షాంశ్యాదవ్ సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భువనగిరి బస్టాండ్ ఆవరణలో ఆటో, స్కూల్ బస్సులు, భారీ వాహన డ్రైవర్లకు చావా ఫౌండేషన్, పర్ఫెక్ట్ ఐ విజన్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజులతో కలిసి ఎస్పీ హాజరై మాట్లాడారు. కంటి చూపు సరిగ్గా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి సాయికృష్ణ, డీఎస్పీలు బి. రవీందర్, ప్రభాకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు ఎం. రమేష్, మధు సూదన్ పాల్గొన్నారు. చౌటుప్పల్ @ 43 డిగ్రీలుచౌటుప్పల్ : ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం చౌటుప్పల్లో ఏకంగా 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 7గంటల నుంచే ఎండ తీవ్రత మొదలయ్యింది. అలా గంట గంటకు పెరుగుతూ మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక్కసారిగా 41డిగ్రీలకు చేరింది. 3.30గంటలకు ఏకంగా 43డిగ్రీలుగా నమోదైంది. ఎండ తీవ్రత కారణంగా జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అల్లాడిపోయారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే చిన్నకొండూర్రోడ్డు, తంగడపల్లిరోడ్డు, వలిగొండరోడ్డు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వేసవి తాపాన్ని తాళలేక జనం మంచినీళ్లు, శీతల పానీయాలు సేవించడానికి ఎగబడ్డారు. -
ఉమ్మడి జిల్లాలో తేలిన బీసీల లెక్క
సాక్షి ప్రతినిధి, నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కులాల వారీ జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే (ఎస్ఈఈఈపీఎస్–2024) ప్రకారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఎంత మంది బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారనే లెక్కలు ఉపకులాల వారీగా వెల్లడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వెనుకబడిన వర్గాలు (బీసీ) 56 శాతం ఉండగా, ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 12.45 శాతం, ఓసీలు 11.70 శాతం ఉన్నారు. ఇక, అటు బీసీల్లోనూ, ఓసీల్లోనూ ఉన్న ముస్లిం మైనార్టీలు 5.50 శాతం ఉన్నారు. అయితే, గతంలో ఎప్పుడు జనాభా లెక్కలు జరిగినా కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు మాత్రమే వెల్లడించేవారు కానీ, ఈసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే అనంతరం తొలిసారి ఉపకులాల వారీగా బీసీ, ఓసీల లెక్కలు కూడా స్పష్టంగా తేలడం గమనార్హం. సామాజికవర్గాల వారీగా జనాభా జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఓసీ అన్నీ కలిపి (బీసీలో ఓసీలో కలిపి) నల్లగొండ 3,14,670 2,29,625 7,86,788 94,613 1,78,043 16,03,739 సూర్యాపేట 2,21,989 1,50,665 5,01,982 66,277 1,31,376 10,72,289 యాదాద్రి 1,54,021 52,686 4,80,978 30,444 85,900 8,04,029 సామాజికవర్గాల వారీగా గ్రామీణ జనాభా నల్లగొండ 259196 216296 615509 36296 120982 1248279 సూర్యాపేట 176461 134204 380959 36817 88875 817316 యాదాద్రి 129245 50575 386267 15,641 71303 653031 సామాజిక వర్గాల వారీగా పట్టణ జనాభా నల్లగొండ 55474 13329 171279 58317 57061 355460 సూర్యాపేట 45528 16461 121023 29460 42501 254973 యాదాద్రి 24776 2111 94711 14803 14597 150998 -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏడీఈ
కొండమల్లేపల్లి : విద్యుత్ శాఖకు సంబంధించి కాంట్రాక్ట్ బిల్లు క్లియరెన్స్ ఇచ్చేందుకు ఏడీఈ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా గురువారం నల్లగొండ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉమ్మడి నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ విద్యుత్ శాఖలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న సిరికొండ సైదులు ఓ కాంట్రాక్టర్ చేసిన పనులకుగాను రూ.10లక్షల బిల్లుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్ నల్లగొండ ఏసీబీ పోలీసులను వారం క్రితం ఆశ్రయించాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గురువారం దేవరకొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్ నుంచి ఏడీఈ రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పర్చి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. కాగా.. హైదరాబాద్లోని ఏడీఈ సైదులు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు ఫ వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ జగదీశ్చందర్ -
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ అధికంగా ఉంటుంది.- 8లోప్రతిభ ఉన్నా అవకాశాలు లేక వెనుకబడిపోయిన వనితలకు ఇప్పుడు ఒక వేదిక లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడం ఒక చట్టపరమైన నిర్ణయమే కాదు ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న అతివల ఆశలకు వెలుగునిచ్చిన చరిత్రాత్మక క్షణం. ఈ బిల్లు నారీమణులకు గౌరవం.. స్వరం.. రాజకీయంగా సమాన హక్కులు కల్పిస్తుంది. ఒకఅమ్మ.. ఒక అక్క.. ఒక కూతురు.. దేశం కోసం చట్టాలను రూపొందించే స్థాయికి చేరిన శుభతరుణం. దేశ ప్రజాస్వామ్యాన్ని సమానత్వంతో నింపడమే కాకుండా సగభాగమైన వారికి చట్టపరమైన హక్కు ఇచ్చిన అపూర్వ సందర్భం ఇది. నారీ.. చట్ట సభల్లో సవారీ -
బీసీల తరువాత ఎస్సీలే అత్యధికం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీలే అత్యధికంగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా 34,80,057 కాగా, అందులో బీసీలు 19,48,993 మంది ఉన్నట్లు తేలింది. ఎస్సీలు 6,90,680 మంది ఉండగా, ఎస్టీలు 4,32,976 మంది ఉన్నారు. ఓసీలు 4,07,408 మంది ఉన్నారు. ఇక బీసీ, ఓసీల్లోని ముస్లింలు 1,91,334 మంది ఉన్నట్లు తేలింది. అందులో బీసీ ముస్లింలే అత్యధికంగా ఉండగా, ఓసీల్లో ముస్లింలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నల్లగొండ జిల్లాలో బీసీ ముస్లింలు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. -
ధాన్యం నిల్వలో జాగ్రత్తలు అవసరం
పెద్దవూర: యాసంగి వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటి అవసరాలు, విత్తనాల కోసం ధాన్యాన్ని ఎలా భద్రపర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పండించిన పంటలో 10 నుంచి 20 శాతం నష్టపోయే ప్రమాదం ఉంటుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ పేర్కొంటున్నారు. ధాన్యం నిల్వ చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తేమ శాతం 14లోపు వచ్చేదాక చూసుకోవాలి ధాన్యం నూర్పిడి తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలకు కలిపి సుమారు ఏడాదికి పైగా భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ధాన్యం రంగు, రుచి తగ్గుతుంది. ధాన్యాన్ని నిల్వ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు ఆశించి నష్టం కలుగచేస్తాయి. అంతే కాక ఎలుకలు ధాన్యాన్ని తినడమేకాక, వాటి విసర్జనలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా వరికోతల సమయంలో ధాన్యంలో 20శాతం తేమ ఉంటుంది. గతంలో కూలీలతో వరి కోతలు కోపించేవారు. వరి పంటను కోసిన తర్వాత వరి పసలను ఆరబెడితే 4 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. కానీ ప్రస్తుతం రైతులు కూలీలపై ఆధార పడకుండా యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. పంట పచ్చగా ఉన్నప్పుడే వరి కోస్తున్నారు. దీంతో ధాన్యంలో మరింత తేమ ఉండే అవకాశాలు ఉంటాయి. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమ శాతం 14లోపు వచ్చేదాక చూసుకోవాలి. నిల్వ ఉంచిన ధాన్యాన్ని నష్టపరిచే కీటకాలు ముక్క పురుగు : పంట కోయడానికి ముందు నుంచి ముక్క పురుగు నష్టం కలిగిస్తుంది. బియ్యంలో తెల్లని పురుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ పురుగులే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి అందులో గుడ్లు పెట్టి తన నోటి నుంచి వెలువడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా ప్రౌడ దశలోని ముక్క పురుగు గింజ లోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది. వడ్ల చిలుక : ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే ధాన్యం చెడువాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపులుగా చేరి గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి లార్వా గింజ లోపలికి తొలుచుకుని పోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరక ముందే పై పొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌడ దశకు చేరిన తరువాత ఆ రంధ్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వడ్ల మూటలు, గిడ్డంగులపై కనిపిస్తుంది. నుసి పురుగు : నుసి పురుగును పుచ్చ పురుగు లేదా పెంకు పురుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో 3 మి.మీ పొడవు ఉంటుంది. ప్రౌడ కీడకం ధాన్యం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, ఆ తరువాత గింజ పైపొరను, ఆ తర్వాత లోపలి బియ్యపు గింజను తిని తీవ్ర నష్టం కలిగిస్తుంది. ధాన్యం నిల్వ చేసే పద్ధతి రైతులు తక్కువ ధాన్యం నిల్వ చేసుకోవాలంటే వెదురు గాదెలు, సిమెంటు గాదెలు, లోహపు గాదెల ద్వారా నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంటు కాంక్రీటుతో నిర్మించుకుంటే పూర్తి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా కీటకాలు, తేమ, వర్షం నీరు లోనికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే గాజు ముక్కలు, సిమెంటుతో పూడ్చి వేయాలి. ధాన్యం నిల్వలో కొత్త గోనె సంచులు ఉపయోగించాలి. గోనె సంచుల పైన, లోపల మలాథియాన్ లేదా ఎండో సల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. మరునాడు సంచులను ఎండలో ఆరబెట్టాలి. ఎలుకల నివారణకు చర్యలు ధాన్యం గిడ్డంగి చుట్టూ చెత్త లేకుండా రోజూ శుభ్రం చేస్తుండాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలను ఉపయోగించి ఎలుకలను నిర్మూలించాలి. గిడ్డంగి తలుపుల కింది భాగాలకు జింక్ రేకులు అమర్చాలి. రంధ్రాలకు వైర్ మెస్ మూతలు అమర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ రోజులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. -
భయం వీడండి.. ప్రాణం నిలపండి
భువనగిరిటౌన్ : రహదారిపై ప్రమాదం జరిగినప్పుడు రక్తం ఓడుతున్న బాధితులను చూసి అయ్యో అనుకుంటూ వెళ్లిపోతుంటారు. పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతుంది. ఈ భయాలను పో గొట్టి బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘రహ– వీర్’ అనే పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ నెల 13 నుంచి 18 వరకు జరుగుతున్న ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. గోల్డెన్ అవర్.. ప్రాణం నిలిపే సమయం ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలను కాపాడవచ్చు. ఈ కీలక సమయంలో బాధితులను ఆస్పత్రికి చేర్చే సామాన్య పౌరులే నిజమైన హీరోలు. వారినే ప్రభుత్వం రహ– వీర్గా గౌరవిస్తోంది. ఇందులో భాగంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి చేర్చి కాపాడిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం రూ. 25వేల నగదు బహుమతిని అందజేస్తోంది. అంతేకాకుండా సామాజిక బాధ్యతను గుర్తిస్తూ రవాణా శాఖ అధికారికంగా ప్రశంసా పత్రాన్ని ఇస్తుంది. గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం సాయం చేసే వారికి పూర్తి రక్షణ ఉంటుంది. అనుమతి లేకుండా పోలీసులు వ్యక్తిగత వివరాలు అడగరు. సాక్ష్యం కోసం బలవంతం చేయరు. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు బాధితులను ఆస్పత్రులకు తీసుకువచ్చినప్పుడు వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించాలి. డబ్బుల కోసం జాప్యం చేసినా లేదా సాయం చేసిన వారిని ఇబ్బంది పెట్టినా ఆ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా వైద్య అధికారులను ఆదేశించింది. నిబంధనలు ఇవే.. ఫ ప్రమాద సమయంలో సాయం చేసిన వ్యక్తి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి, ఆస్పత్రి యాజమాన్యం నమోదు చేస్తుంది. ఫ కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ ఈ వివరాలను పరిశీలించి, అర్హులను రహ–వీర్గా ఎంపిక చేస్తుంది. ఫ ఎంపికై న వారి ఖాతాలో నేరుగా నగదు జమ చేయబడుతుంది. ఫ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రిలో చేర్పిస్తే రూ. 25వేల నగదు బహుమతి ఫ రహ– వీర్ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న రవాణా శాఖ రోడ్డు ప్రమాద బాధితులకు సరైన వైద్యసేవలు అందకపోవడంతో 50 శాతం మరణాలు సంభవిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి బాధితులకు వైద్య ఖర్చులు అందించేందుకు ఫిబ్రవరిలో పీఎం రాహత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఈ పథకం కింద గరిష్టంగా రూ.1.50లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మొదటి 7 రోజుల వరకు అయ్యే అత్యవసర చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం బాధితులు ముందస్తుగా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు లేదా సహాయం చేసే వ్యక్తులు 112 నంబర్కు ఫోన్ చేయాలి. ఈ నంబర్ను ఎమర్జెన్సీ రెస్పాన్న్స్ సపోర్ట్ సిస్టమ్కు లింక్ చేయడం వల్ల, బాధితులకు తక్షణమే అంబులెన్స్ సాయంతోపాటు, సమీపంలోని ఆస్పత్రి వివరాలు అందుబాటులోకి వస్తాయి. -
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవాలి
నకిరేకల్ : రోడ్డు ప్రమాదాల నివారణ.. భద్రతా చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తేవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్ సూచించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ వారోత్సవాల సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. జాతీయ రహదారుౖలపై నిత్యం ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని గుర్తించి అక్కడ అండర్ పాస్ల నిర్మాణానికి ప్రణాళిలకు రూపొందిస్తే సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఎవరైన మోటార్ సైకిల్పై వస్తే హెల్మెట్ లేకుండా రావొద్దని ఈ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గ్రామ సభ తీర్మానాలు చేసి డీజీపీకి సమర్చించడం గొప్ప నిర్ణయమన్నారు. నకిరేకల్లో స్థలం చూస్తే ఇక్కడి ఎమ్మెల్యే వీరేశం కోరిన విధంగా మహనీయుల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల సమస్య పరిష్కారం కోసం చేపట్టే కార్యక్రమాల్లో వార్డు మెంబర్ నుంచి పైస్థాయి వరకు అందరిని, అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేయాలని పోలీస్ శాఖ పక్షాన సీఎంతో చర్చించామన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలందరు చైతన్యం కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 18 వరకు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత కార్యక్రమాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. జిల్లా జాతీయ రహదారిపై ఈ సంవత్సరం జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ చౌహాన్, ఎమ్మెల్యేలు మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పాడిపరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అమిత్రెడ్డి, సూర్యాపేట ఎస్పీ నరసింహ, ఇన్చార్జి అదనపు కలెక్టర్ యానాల అశోక్రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, రోడ్డు భద్రత ప్రత్యేక అధికారి పోలిశెట్టి అంజయ్య, డీసీసీ అధ్యక్షుడు పున్న కేలాష్నేత, రాష్ట్ర నాయకులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల,చౌగోని రజితా, స్దానిక సీఐలు హరిబాబు, కొండల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రమాదాలు జరిగే చోట అండర్ పాస్లు నిర్మిస్తాం ఫ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సందడి
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే భువనగిరి, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కమిషనర్లు నోటిఫికేషన్ విడుదల కాగా.. మోత్కూరు, చౌటుప్పల్లో విడుదల కావాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన ఏడు రోజుల్లో అభ్యర్థులు కో ఆప్షన్ పదవి కోసం మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే కౌన్సిలర్ పదవితో దాదాపు సమానమైన కో ఆప్షన్ పదవికి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. అన్ని మున్సిపాలిటీలను అధికార పార్టీ చేతుల్లో ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు పొత్తు ఉన్న సీపీఐతో కలిసి కో ఆప్షన్ సభ్యుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నారు. ఏడు రోజుల గడువు మున్సిపాలిటీలు కో ఆప్షన్ సభ్యుల దరఖాస్తుల స్వీకరణకు ఏడు రోజుల గడువు ఉంది. సెలవు రోజుల్లో కాకుండా ప్రభుత్వ పనిదినాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో రెండు మైనార్టీ, రెండు జనరల్ కేటగిరిలో కో ఆప్షన్ సభ్యులకు అవకాశం ఉంది. జనరల్ కేటగిరి, మైనార్టీ కేటగిరిలో ఒక్కో మహిళా కో ఆప్షన్ సభ్యులు తప్పకుండా ఉండాలి.ఫ మున్సిపాలిటీల వారీగా నోటిఫికేషన్లు విడుదల ఫ మైనార్టీలో ఇద్దరు, జనరల్ కేటగిరీలో ఇద్దరు సభ్యులకు అవకాశం ఫ ఆశావహుల్లో పెరిగిన ఆసక్తి -
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటెండెన్స్ రిజిస్టర్లను చెక్ చేసి, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. అనంతరం ఓపీ రిజిస్టర్ను పరిశీలించి ప్రతిరోజూ వచ్చే రోగుల సంఖ్యపై వివరాలు సేకరించారు. ఆస్పత్రి పరిసరాలను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని, పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులున్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
ప్రారంభం ఆర్భాటం.. కాంటాలో జాప్యం!
సాక్షి, యాదాద్రి: అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా క్షేత్రస్థాయిలో మాత్రం కాంటాలు మొదలవ్వలేదు. పలు మండలాల్లో కేంద్రాలు తెరిచి వారం గడుస్తున్నా ఒక్క క్వింటా ధాన్యం కూడా సేకరించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద వడ్ల కుప్పలు పోసి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ధాన్యం ఎండిపోయి తూకంలో నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటు ఎండకు ఎండలేక, ఇటు ధాన్యం అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిల్లుల కేటాయింపులో ఆలస్యం గత వారం రోజులుగా అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, ఆలేరు, రాజాపేట, ఆత్మకూరు.ఎం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వలిగొండ, భువనగిరి, చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేటతోపాటు పలు మండలాల్లో ఇంకా ప్రారంభించలేదు. అయితే ప్రారంభమైన కేంద్రాలకు రైస్ మిల్లులను ట్యాగింగ్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. రైతులకు మాత్రం తేమ శాతం ఎక్కువగా ఉందని సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. నిల్వ చేయడానికి ఖాళీ స్థలం లేదని తాము కొత్తగా వచ్చే ధాన్యం ఎలా దించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు మిల్లర్ల నుంచి ఇచ్చే పూచీకత్తు విషయంలో సివిల్ సప్లై అధికారులకు పేచి పడింది. ప్రభుత్వం తాజా నిబంధనలపై మిల్లర్లు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో 3,14,621 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో అత్యధికంగా దొడ్డురకం సాగు చేశారు. అధికారులు 6,92,166 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రైవేట్గా మిల్లర్ల కొనుగోలు, స్థానిక ప్రజల అవసరాలు, రైతుల విత్తనాలకు పోను సుమారు 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో దొడ్డు రకం 6,84,226 మెట్రిక్ టన్నులు, సన్నరకం 8 వేల మెట్రిక్ టన్నులు దిగుమతి అంచనా వేశారు. మొత్తంగా 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు 179 ఐకేపీ కేంద్రాలు 154, ఎఫ్పీఓలు 15, మెప్మా 3 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాలు ప్రారంభించగా ఎక్కడ కూడా ధాన్యం కాంటా ప్రారంభం కాలేదు. రాశులు పోసి ఎదురుచూస్తున్న రైతులు మోత్కూరు మార్కెట్ యార్డులో పీఏసీఎస్, పాటిమట్ల, ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 9న ప్రారంభించారు. సుమారు 20 మంది రైతులు ధాన్యాన్ని తెచ్చి ఆరబోశారు. మాయిశ్చర్ రాలేదని కాంటా వేయడం లేదు. ఆత్మకూర్ (ఎం)లో ఈనెల 11న ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. 77 మంది రైతులు ధాన్యం రాశులు పోసి ఎదురుచూస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం, ఆలేరు మండలం గొలనుకొండ, కొల్లూరు, మందనపల్లి ఈనెల 12న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రాజాపేట మండలంలో ఈనెల 13న ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. గుండాల మండల కేంద్రంలో ఈనెల 14న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా.. అన్ని చోట్ల రైతులు వడ్ల రాశులు పోసి కాంటా వేయడం కోసం ఎదురు చూస్తున్నారు. దిగుబడి, కొనుగోలు అంచనా వివరాలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో) దొడ్డు రకం : 6,84116 సన్న రకం : 8000 మొత్తం దిగుబడి అంచనా : 6,92,166 కొనుగోలు అంచనా : 4,50,000 వరి సాగు విస్తీర్ణం : 3,14,621 ఎకరాలు ఫ ధాన్యం కేంద్రాలు తెరిచినా మొదలు కాని కొనుగోళ్లు ఫ వారం రోజులుగా కల్లాల్లోనే రైతుల నిరీక్షణ ఫ తేమ శాతం ఎక్కువగా ఉందని సాకు చెప్పి తప్పించుకుంటున్న అధికారులు -
అండర్పాస్ నిర్మించాలని బీజేపీ రాస్తారోకో
చౌటుప్పల్ : నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ బస్టాండ్ ప్రాంతంలో అండర్పాస్ లేకుండా పనులు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల భిక్షంగౌడ్ అన్నారు. అండర్పాస్ నిర్మాణ పనులు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని, ప్రధాన కూడలి ప్రాంతాల్లో అండర్పాస్లు ఇవ్వకుండా పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్లో ఆర్టీసీ బస్స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నిర్మాణ పనులు చేస్తున్న యంత్రాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దూడల భిక్షంగౌడ్ మాట్లాడుతూ.. అండర్పాస్ ప్రారంభించే ప్రాంతాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ముందుకు జరిపి పనులు చేయడం వల్ల బస్టాండ్ వద్ద అండర్పాస్ లేకుండా పోతుందన్నారు. ఈమేరకు ఆర్డీఓ శేఖర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనయాదవ్, కౌన్సిలర్లు ఆలె శ్రీలతచిరంజీవి, బుడ్డ సురేష్, పోలేపల్లి లక్ష్మిముత్తయ్య, నాయకులు గుజ్జుల సురేందర్రెడ్డి, శాగ చంద్రశేఖర్రెడ్డి, కంచర్ల గోవర్ధన్రెడ్డి, దిండు భాస్కర్, అమృతం దశరథ, గోశిక పురుషోత్తం, బత్తుల జనార్దన్, ఊదరి రంగయ్య, గుర్రం రవీందర్, జి.వేణు, భాను, శేఖర్ పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొట్టిన బైక్
● చికిత్స పొందుతూ యువకుడు మృతి పెద్దఅడిశర్లపల్లి : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణానికి చెందిన జహంగీర్ (23)అంగడిపేట ఎక్స్రోడ్ వద్ద తన తండ్రితో కలిసి బ్యాటరీ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం తన బ్యాటరీ షాపును మూసివేసి తిరుగుపయనంలో ఇంటికి వెళ్తుండగా చిల్కమర్రి స్టేజి సమీపంలో అతడి బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డుప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు మర్రిగూడ: ఆటో, బైక్ ఢొకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మర్రిగూడ మండలంలోని బట్లపల్లి గ్రామం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితుడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు చెట్టును ఢీకొని వ్యక్తి మృతితిప్పర్తి: కారు చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం తిప్పర్తి మండలంలోని మల్లేపల్లివారిగూడెం వద్ద చోటు చేసుకుంది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతానికి చెందిన దిట్టకవి శ్రీనివాస్(58) ఈనెల 10న హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ఫ్రయాణంలో భాగంగా మంగళవారం తిప్పర్తి మండలంలోని మల్లేపల్లివారిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు కారు చెట్టుకు ఢీకొంది. దీంతో శ్రీనివాస్కు బలమైన గాయాలయ్యాయి. చికిత్సనిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య దిట్టకవి సీతామహాలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ అప్జల్ అలీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలు ● రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్నల్లగొండ టౌన్ : భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతాంగ ఉద్యమాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండలోని ఏచూరి గార్డెన్లో రైతు సంఘం నల్లగొండ జిల్లా 24వ మహాసభలో వారు మాట్లాడారు. పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు యాప్, యూరియా అమ్మకం యాప్లు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పండించిన ప్రతి గింజకూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, వి.వెంకటేశ్వర్లు, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, దేవిరెడ్డి అశోక్రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, మల్లయ్య, కత్తి శ్రీనివాస్రెడ్డి, అయితరాజు నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
భూదాన్పోచంపల్లి: మండలంలోని గౌస్కొండ గ్రామంలో చెరువులో మునిగి గల్లంతైన పాండాల శివ (24) మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. రెస్క్యూ టీమ్, పోలీసులు సంయుక్తగా గల్లంతైన శివ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా.. చెరువు మధ్యలో శివ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని చెరువు నుంచి బయటికి తీసి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమ్తితం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుతన కుమారుడు శివను తోటి స్నేహితులే కొట్టి చంపి చెరువులో పడేశారని మృతుడి తల్లి మనోహర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మద్యం మత్తులో ఉన్న స్నేహితులు, శివతో ఘర్షణ పడ్డారని. ఘటన జరిగిన మధ్యాహ్న సమయంలో సమీపంలో ఉన్న రైతులు వీరి కొట్లాడిన మాటలు విన్నారని చెప్పింది. అంతేకాక శివ ముఖం వద్ద గాయాలు ఉన్నాయని తెలిపింది. పోలీసులు సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. మృతుడి తల్లి మనోహర ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. పాండాల శివ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. -
బత్తాయి రైతుకు మంగు ముప్పు
గుర్రంపోడు : బత్తాయికి వచ్చే మంగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో సాగవుతున్న బత్తాయి తోటల్లో ఎంతో కొంత మంగు ఆశించని తోట అంటూ లేదంటే సమస్య తీవ్రత ఏస్థాయిలో ఉందో చెప్పవచ్చు. కాయలపై వక్క లేదా ఊదా రంగు లేదా ముదురు గోధుమరంగు ఏర్పడటాన్ని మంగు అంటారు. ప్రస్తుతం కత్తెర బత్తాయి కాయలు మంచి సైజును సంతరించుకునే దశలో ఉన్నాయి. ముఖ్యంగా ఎండలు ముదిరే మార్చి, ఏప్రిల్లో మంగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో బత్తాయిలో మంగును నివారించి విలువైన కత్తెర బత్తాయి పంటను కాపాడుకోవడానికి అనుముల ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి మురళి పలు సూచనలు చేశారు. నల్లి పురుగులతో మంగుబత్తాయి కాయలపై మంగు ఏర్పడటానికి ప్రధాన కారణం మంగునల్లి. ఈ నల్లులు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వీటి పిల్లలు పసుపు రంగులోనూ, పెద్ద నల్లులు ఆరంజి రంగులోనూ ఉంటాయి. పిల్ల, పెద్ద మంగు నల్లులు పిందెలపైన, కాయలపైన పారాడుతూ బత్తాయి కాయల తొక్కల నుంచి రసం పీల్చుతాయి. రసాన్ని పీల్చే పక్రియలో నల్లి నోటి నుంచి రసాయనాన్ని వదులుతుంది. ఈ రసాయనం కాయతోలు నుంచి స్రవించిన ద్రవం, సూర్యరశ్మి మార్పు చెంది తుప్పురంగుగా మారుతుంది. బత్తాయి పిందెలకు నల్లి ఆశిస్తే కాయ సైజు తగ్గదు కానీ మంగు వచ్చి తోలు గట్టిపడి పెలుసుగా మారుతుంది. కాయ రుచిలో తేడా రాదు. ఐనా మంగు కాయలకు తోలు గట్టిపడి పెలుసుగా మారి చూడటానికి నల్లగా కనిపిస్తున్నందున మార్కెట్లో ధర పలకదు. మంగు నల్లి నివారణ ● రైతులు భూతద్దం సహాయంతో నల్లి ఉనికిపై నిఘా ఉంచాలి. ఒకటి, రెండు నల్లులు తోటలో ఎక్కడైనా పిందెలు, కాయలపై కనిపించగానే స్ప్రేయింగ్ మొదలు పెట్టాలి. సెల్ఫోన్పై కూడా కొమ్మను ఊపితే స్క్రీపై సన్నగా పాకుతూ కనిపించే మంగు నల్లి పురుగులు గమనించవచ్చు. రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపట్టాలి. ● చెట్లలో కొమ్మల కత్తిరింపులు సకాలంలో సక్రమంగా చేసి చెట్టు లోపల గాలి వెలుతురు బాగా ప్రసరించేటట్లు చూడాలి. ● తోటల్లో ఎండు పుల్ల కత్తిరించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలి. ఈ రాగి ధాతువు శిలీంద్రనాశిని కత్తిరించిన కొమ్మలకు రక్షణ ఇవ్వడమేగాక నల్లికి ప్రతి కూలంగా ఉంటుంది. ● మంగునల్లి నివారణకు లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల ప్రాపర్గైట్ లేదా ఒక గ్రాము డైపెంధిరాన్ లేదా రెండు మిల్లీ లీటర్ల ఇధియాన్ వంతున కలిపి మందు మార్చుతూ అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి చొప్పున రెండు, మూడు సార్లు పిందెలన్నీ తడిసేలా పిచికారీ చేయాలి. ● మంగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే స్పైరో మిసిఫిన్ ఒక మిల్లీ లీటరు వేప నూనె మూడు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ● పిందెలు గోళీకాయ సైజు నుంచి నిమ్మ కాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి 5 గ్రాముల సల్పేట్ ఆఫ్ పోటాష్ మరియు 5 గ్రాముల మల్టీకే ఒక మారు పిచికారీ చేస్తే నల్లిని అణిచివేయడంతోపాటు కాయసైజు నాణ్యత పెరగుతుంది. ● నీటి తడులు ఎక్కువ కాకుండా అవసరం మేరకు డ్రిప్ పద్ధతిలో అందించాలి. సిఫారసు మేరకు సమతుల సమగ్ర ఎరువులు సకాలంలో అందించాలి. మంగు సోకిన కాయలను తోటలో ఉంచకూడదు. తోటలో అంతరకృషి బాగా చేసి పరిశుభ్రత పాటించాలి.వాతావరణంలో మార్పులతో.. వేడి వాతావరణానికి మారుతున్న సమయం, వర్షాభావ పరిస్ధితులు మంగు ఉధృతికి ఎక్కువగా దోహదం చేస్తాయి. ఇటీవలి వరకు రాత్రి వేళల్లో మంచు కురవడం, ఉదయం బాగా ఎండ తీవ్రంగా ఉండటం మంగు ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. పంటను కాపాడుకునేందుకు ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి సూచనలు -
పాన్ మసాలా ట్రక్కు చోరీ కేసులో ఒకరి అరెస్ట్
ఆలేరురూరల్ : సుమారు రూ.కోటి విలువ చేసే పాన్ మసాలాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న కంటైనర్ చోరీకి గురైన కేసులో ఒకరిని మంగళవారం ఆలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ యాలాద్రి వెల్లడించారు. హర్యానా నుంచి హైదరాబాద్కు పాన్ మసాలా లోడ్తో వస్తున్న కంటైనర్ ఏప్రిల్ మొదటి వారంలో ఆలేరు సమీపంలో అదృశ్యమైందని న్యూఢిల్లీకి చెందిన కంటైనర్ యజమాని వినోద్ ఉపాధ్యాయ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హర్యానాకు చెందిన కంటైనర్ డ్రైవర్ సద్దాం, అతడి స్నేహితుడు హైదరాబాద్కు చెందిన సిరాజ్తో కలిసి ఈచోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. ఆలేరు బైపాస్లో క్రషర్ వద్ద కంటైనర్ని నిలిపి అందులోని 296 కాటన్ల పాన్ మసాలా ప్యాకెట్లను వేరే వాహనంలోకి మార్చారు. తిరిగి కంటైనర్ వాహనాన్ని జనగాం జిల్లా రఘునాథ్పురం మండలం కోమలి హైవే పక్కను నిలిపేశాడు. అనంతరం ఆ సరుకును హైదరాబాద్లోని చంచల్గూడ ప్రాంతంలోని ఒక గోదాముకు తరలించారు. సద్దాం, సీరజ్ కలిసి అక్కడ దాచిపెట్టి విక్రయించాలని పథకం వేశారు. పోలీసులు డ్రైవర్ సద్దాం ఫోన్ నంబర్ సాయంతో ట్రాక్ చేశారు. చంచల్గూడలోని అతడి స్నేహితుడు సీరాజ్ ఇంట్లో ఉన్న సద్దాంను పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు గోదాంలో నిలిపి ఉంచిన పాన్ మసాలా కాటన్లను పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందులో దాదాపు రూ.79 లక్షల విలువ గల 236 కాటన్ల పాన్ మసాలను రికవరీ చేసినట్లు చెప్పారు. మిగతా 60 కాట్లను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సద్దాంను రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న మరో నిందితుడు సీరాజ్ కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సీజ్ చేసిన పాన్ మసాలా కాటన్లను ఆలేరు పోలీస్స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు -
నడిచొచ్చిన రాజ్యాంగ నిర్మాత
● అంబేద్కర్ వేషధారణలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం సూర్యాపేట టౌన్ : డ్రగ్స్, గంజాయి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం అంబేద్కర్ వేషధారణతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. -
వన్యప్రాణులకు జలరక్షణ
నాగార్జునసాగర్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో భాగమైన నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్ టైగర్ రిజర్వ్ కోర్జోన్ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఓ పక్క అడవుల విస్తీర్ణం పెంచుతూ మరోపక్క వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సున్నిపెంట వరకు 2,166 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవి విస్తరించి ఉంది. సాగర్ ఫారెస్ట్ డివిజన్లో మూడు రేంజ్లు, 40 మేరకు బీట్లు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఫారెస్ట్ రేంజ్లో 76,350 ఎకరాలు, దేవరకొండ ఫారెస్ట్ రేంజ్లో 9,945 ఎకరాలు, కంబాలపల్లి రేంజ్లో 28,000 ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. వేసవి సమీపించడంతో వాగులు, వంపులు, నీటి జాలు గుంతల్లో నిల్వగా ఉన్న వర్షపు నీటి నిల్వలు ఇంకిపోవడంతో వన్యప్రాణులకు నీరు దొరకక మైదానం ప్రాంతంలోకి వస్తూ రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో జంతువుల దాహార్తి తీర్చేందుకుగాను అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సుమారుగా 120 వరకు ఏర్పాటు చేసిన సాసర్పిట్లను శుభ్రం చేసి అందులో నీటిని పోస్తున్నారు. కొన్ని చోట్ల బోర్లు ఉండగా విద్యుత్ సౌకర్యం ఉన్న చోట పైపులైన్లు వేశారు. మరికొన్ని చోట్ల సోలార్ విద్యుత్ సౌకర్యంతో బోర్లకు మోటార్లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా సాసర్పిట్స్లో నీటిని నింపుతున్నారు. బోర్లకు సమీపంలో ఉన్న నీటికయ్యలు, వంపులు, చెక్డ్యాంలను నింపుతున్నారు. క్షేత్ర స్థాయిలో వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించేందుకు సాసర్ఫిట్స్ వద్ద, మరికొన్ని దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జంతువుల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తున్నారు. జంతుగణనకు కూడా ఇది తోడ్పడే అవకాశం ఉంది. జంతువుల దాహార్తి తీర్చేందుకు ట్యాంకర్ల సాయంతో సాసర్పిట్లను నింపుతున్న అధికారులు విద్యుత్ సౌకర్యం ఉన్న చోట పైపులైన్ల ద్వారా సరఫరా వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటువేసవిలో అడవి జంతువుల సంరక్షణకు నీటికయ్యలు, చెక్డ్యాంలు, వంపుల్లోకి నీటి ని పారిస్తున్నాం. ట్యాంకర్ల సాయంతో సాసర్ పిట్లను నింపుతున్నాం. అగ్నిప్రమాదాలు జరగకుండా చెట్లను నరకకుండా, జంతువులను వధించకుండా అటవీ శివారు గ్రామాల్లో బేస్ క్యాంప్ హెల్పర్లు 24గంటలు కాపలాగా ఉంటారు. స్వచ్ఛంద సంస్థలు సైతం అడవుల రక్షణ బాధ్యత తీసుకోవాలి. – రమేష్, సెక్షన్ ఆఫీసర్ నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్–హాలియా, నల్లగొండకు వెళ్లే రహదారి వెంట మూడు రోడ్ల కూడలి (సమ్మక్క సారక్కల) సమీపంలో రూ.1.5 కోట్ల వ్యయంతో 250 ఎకరాల్లో అర్బన్ పార్కు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో దారులు ఏర్పాటు చేసి పట్టణాల నుంచి వచ్చే పర్యాటకులను ఫారెస్ట్ శాఖ వాహనాల్లో అడవిలోకి తీసుకువెళ్లి చూపించి తిరిగి తీసుకువస్తారు. -
సెన్సార్ బోర్డులో భువనగిరి వాసికి కీలక బాధ్యతలు
భువనగిరిటౌన్ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అడ్వైజరీ ప్యానెల్ సభ్యుడిగా భువనగిరికి చెందిన మెరుగు మధు నియామకమయ్యారు. ఈ మేరకు సీబీఎఫ్సీ హైదరాబాద్ ప్రాంతీయ అధికారి రాహుల్ గోవిల్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో మెరుగు మధు మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. సినిమా రంగానికి సంబంధించిన కీలక బాధ్యతల్లో నియామకం కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ మెరుగు మధుకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సేంద్రియ పంటల సాగుపై అవగాహనచౌటుప్పల్ : మండల పరిధిలోని తమ్మలోనిబావి గ్రామంలో వాకిటి రజితారెడ్డి–రాజేందర్రెడ్డిలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను మంగళవారం హైదరాబాద్లోని ఫనినీయ మహావిద్యాలయానికి చెందిన విద్యార్థులు పరిశీలించారు. రసాయన, పురుగు మందులు వాడకుండా పంటల సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉషారాణి, డీన్ నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కారులోనే ప్రాణం పోయింది
నార్కట్పల్లి : ఆడుకోవటానికి కారులోకి వెళ్లిన చిన్నారి వాహనం డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం నార్కట్పల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లికి చెందిన పేర్ని సతీష్, గాయత్రిల కుమార్తె పేర్ని శరణ్య (5) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద ఉన్న చిన్నారులతో కలిసి ఆడుకుంటుంది. ఈక్రమంలో శరణ్య తన ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారులోకి వెళ్లింది. ఎవరూ గమనించకపోవడం, వాహనం డోర్లు, విండోస్ లాక్ కావడంతో అందులోనే ఉండిపోయింది. ఆడుకోవడానికి వెళ్లిన తమ కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో శరణ్య తల్లి గాయత్రి, కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో చివరకు వారి ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారులో చూడగా వాహనం వెనుక సీటులో అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే కారు డోర్లు తీసి చిన్నారిని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శరణ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు.● ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారి ● డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతి -
రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం
తిప్పర్తి : అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ కాంస్య విగ్రహాలను మంగళవారం ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఓ వ్యక్తి అభివృద్ధి చెందాలంటే చదువు తప్పనిసరి అని చెప్పారని పేర్కొన్నారు. అందరికీ ఓటు హక్కు, చదువు కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. అంబేడ్కర్ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ చదువుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తిప్పర్తి మండలంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, రూ.పది కోట్లతో మండల కేంద్రంలో సుందరీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఏఎమ్మార్పీ క్వాలకు రూ.450 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టామని, ఆ పనులు పూర్తయితే చివరి భూములకు నీరు అందుతుందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ సభకు తిప్పర్తి సర్పంచ్ బద్దం రజితసుదీర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీదర్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఆర్అండ్బీ డీఈ గణేష్, ఏఈ గౌస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యాంసుందర్, నాయకులు పాశం సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తిప్పర్తి సర్కిల్లో అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణ -
రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు
మోత్కూరు : మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో వలిగొండ–తొర్రూరు ప్రధాన రహదారిపై వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం హయత్నగర్కు చెందిన ఐదుగురు తెల్లవారు జామున తొర్రూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలడుగు శివారులో కారు అదుపుతప్పింది. అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వెళ్తున్న బైక్ను మరో బైక్ ఢీ కొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. -
మొక్కు వస్త్రాల టెండర్ నోటిఫికేషన్ వేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో భక్తుల నుంచి సేకరించి, తిరిగి భక్తులకు మొక్కు వస్త్రాలను విక్రయించే టెండర్ నోటిఫికేషన్ వేయాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన అన్నల్దాస్ వెంకటేష్ మంగళవారం ఆలయాధికారులకు వినతి పత్రం అందజేశారు. కొండపైన శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించే వస్త్రాలను సేకరించి, భక్తులకు మొక్కు వస్త్రాలను విక్రయించే టెండర్ల గడువు పూర్తి అయినా ఆలయాధికారులు మాత్రం టెండర్ల ప్రకటన జారీ చేయడం లేదన్నారు. దీంతో దేవస్థానానికి ఆర్థిక నష్టం కలుగుతుందని పేర్కోన్నారు. దేవస్థానం ఆదాయానికి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక సమానత్వంతోనే కులనిర్మూలన సాధ్యం భువనగిరిటౌన్ : ఆర్థిక సమానత్వంతోనే కులనిర్మూలన సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారత రాజ్యాంగం – సామాజిక న్యాయం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, హక్కులు, అవకాశాలను కల్పించిందన్నారు. మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షత వహించిన సదస్సులో జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్, మండల నాయకులు ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కష్ణ, కొండమడుగు నాగమణి, మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి, మధ్యపురం బాల్ నర్సింహ, రజక వత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సురుపంగ ప్రకాష్, అనాజిపురం సర్పంచ్ రాయపురం సురేష్, నాయకులు ఏదునూరి వెంకటేష్, మచ్చ భాస్కర్, కొల్లూరి సిద్ధిరాజు, నరాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. బెల్టుషాపులు నిషేధించాలని తీర్మానంరాజాపేట : రాజాపేట మండలంలోని దూదివెంకటాపురం గ్రామంలో బెల్టుషాపులు నిషేధించాలని మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మే 1 నుంచి గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించొద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నిడింటి నరేష్, ఉప సర్పంచ్ వెంకటేశం, పాలకవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆవుదూడకు ఆర్థోపెడిక్ సర్జరీ కోదాడరూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి తుంటిఎముక విరిగిన ఆవుదూడకు ఆరు గంటలు శ్రమించి ఆర్థోపెడిక్ సర్జరీ చేశారు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు. నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన పశు పోషకుడు హైదరాబాద్ నుంచి గిర్ రకానికి చెందిన ఆవుదూడను ఆటోలో తీసుకొస్తుండగా చౌటుప్పల్ వద్ద ఆటోలోంచి కిందికి దూకింది. ఈ ప్రమాదంలో దూడ తుంటి ఎముక విరిగి తీవ్రంగా గాయపడింది. దానిని చికిత్స కోసం సోమవారం కోదాడ పశువైద్యశాలకు తీసుకొచ్చారు. ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ ఆధ్వర్యంలో పశువైద్యాధికారులు భూక్యా మధు, డాక్టర్ సిరిపురపు సురేంద్ర సాయంత్ర 4 గంటల నుంచి రాత్రి 10 వరకు శ్రమించి విరిగిన ఎముకకు రాడ్లు వేసి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. అదే సమయంలో కోదాడకు వచ్చిన జిల్లా పశువైద్యాధికారి బి. శ్రీనివాసరావు డాక్టర్ పెంటయ్యను అభినందించారు. -
ఉత్తీర్ణత సాధించేలా..
భువనగిరి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు తప్పిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా బుధవారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. కొన్ని కళాశాలల్లో ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించే అవకాశం ఉండగా మరికొన్ని కళాశాలల్లో ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ద్వారా పాఠాలు బోధించనున్నారు. కొన్ని కళాశాలల్లో ఆశించిన స్థాయిలో రాని ఫలితాలు జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. తల్లిదండ్రుల సమావేశం వంటి వాటిని ఏర్పాటు చేసినా కొన్ని కళాశాలల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ సారి ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో మొత్తం 1,346 మంది పరీక్షకు హాజరు కాగా 720 మంది ఉత్తీర్ణత సాధించి 53.49 శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 1,166 మంది హాజరు కాగా 815 మంది ఉత్తీర్ణత సాధించగా 69.90 శాతం నమోదైంది. బొమ్మలరామారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో మొత్తం 24 మందికి నలుగురు, ప్రథమ సంవత్సరంలో 41 మందికి ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు మంచిగా రాసేలా.. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో కొన్ని కళాశాలల్లో ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించే అవకాశం ఉండగా మరికొన్నింటిలో అధ్యాపకులు ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. పరీక్షలు సక్రమంగా రాసేలా సన్నద్ధం చేయనున్నారు. వారంలో రెండు నమూనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ తరగతులు ఈ నెల 15 నుంచి మే 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.గతంలో కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ర్యాంకులో తేడా ఉత్తీర్ణత శాతం పెరగడంతో గతంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణులుకాని విద్యార్థులకోసం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇచ్చాం. – రమణి, డీఐఈవో ఫ ఇంటర్ తప్పిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఫ నేటి నుంచి ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ నిర్వహణ ఫ వారంలో రెండు నమూనా పరీక్షలు -
నేతన్నలకు ఆరోగ్య మస్తు
భూదాన్పోచంపల్లి, భువనగిరి టౌన్ : వస్త్ర సృష్టిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న చేనేత కార్మికుల చెంతకే వైద్య సేవలను తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నిరంతరం కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే వెన్నునొప్పి, కంటి సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు ఈ శిబిరాల్లో చికిత్స అందించనున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా హెల్త్ క్యాంప్లను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మే 13వరకు కొనసాగింపు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 10,323 మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా చేనేత, జౌళిశాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. మే 13 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ శిబిరాలలో జనరల్ ఫిజీషియన్, కంటి, ఎముకల వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నారు. అదేవిధంగా కార్మికులకు సాధారణ బీపీ, షుగర్ పరీక్షలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా మండల కేంద్రాల్లో గుర్తించిన ప్రదేశాలు, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన టెక్నీషియన్స్తో పాటు వైద్యనిపుణులు శిబిరాల్లో అందుబాటులో ఉంటారు. శిబిరాలు ఇలా... ఈనెల 16న ఆలేరులోని గౌడ సంఘం భవనంలో వైద్య శిబిరం నిర్వహిస్తారు. 17న ఆత్మకూర్(ఎం) పీహెచ్సీ, 18న భువనగిరి యూపీహెచ్సీ, 20 నుంచి 23 వరకు చౌటుప్పల్ మార్కండేయ దేవాలయం దగ్గర కొయ్యలగూడెం వీవర్ బిల్డింగ్, కుంట్లగూడెంలో, 24న మోటకొండూర్ పీహెచ్సీ, 25న మోత్కూర్ పీహెచ్సీ, 27 నుంచి మే 2 తేదీ వరకు పోచంపల్లి చేనేత డైహౌజ్, మే 4న రాజాపేట పీహెచ్సీ, 5, 6 తేదీలలో రామన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 7న వలిగొండ పీహెచ్సీ, 8న యాదగిరిగుట్ట పీహెచ్సీ, 11న గుండాల పీహెచ్సీ, 12న నారాయణపురం పీహెచ్సీ, 13న పుట్టపాక క్లస్టర్ భవనంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తారు ఫ రేపటి నుంచి వైద్య శిబిరాలు -
హిందూ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
భూదాన్పోచంపల్లి: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని త్రిలింగ ప్రాంత సామాజిక సేవాప్రతి వాసుదేవానంద సరస్వతీ స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హిందూ సమ్మేళంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ సమాజంలో గౌరవం, ఐక్యమత్యం, అంకితభావం, సేవా గుణం, దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలో కులాలు వేరైనా మనమంతా హిందువులమనే ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. తద్వారా దేశ నిర్మాణం పటిష్టమవుతుందన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ్ ఉప్పలంచ మల్లికార్జున్, రాష్ట్ర సేవికా సమితి కార్యవాహిక కటకం పావని, డాక్టర్ దేవరాయ స్వామి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్పర్సన్ కొయ్యడ రజిని శ్రీనివాస్, సీత శ్రీరాములు, కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివ, చిక్క కృష్ణ, హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు రుద్ర పాండురంగశాస్త్రి, ప్రధానకార్యదర్శి కొమ్ము లక్ష్మణ్, కోశాధికారి సాయిని భాస్కర్, ఉపాధ్యక్షులు సీత సత్యనారాయణ, చక్రాల నర్సింహ, ఎస్. సత్యనారాయణ, వంగూరి స్వామి, గునిగంటి మల్లేశం, శ్రీనివాసశర్మ, రుద్ర వెంకటేశం, బాలనర్సింహ, గునిగంటి రమేశ్, వెంకటేశ్, బల్ల దుర్వాసులు, చిట్టిమల్ల లక్ష్మినారాయణ, జల్ది నర్సింహ పాల్గొన్నారు. -
తొలిరోజే పాఠ్య పుస్తకాలు
రామన్నపేట: పాఠశాలల పునఃప్రారంభమయ్యే తొలి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. గతంలో పాఠశాల ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు వివిధ దశల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగేది. కొన్ని పుస్తకాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆయా సబ్జక్టులో వెనుక బడేవారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా పాఠ్యపుస్తకాలు తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుస్తకాలు నిల్వ ఉంచడానికి విద్యాశాఖ గోదాము ఖాళీ లేదు. దీంతో ఇతర శాఖల గోదాములు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 46,107 మంది విద్యార్థులు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, పదిహేడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 46,107 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. వీరికి 3,92,250 పుస్తకాలు అవసరమని అధికారులు గుర్తించారు. కొన్ని జిల్లాలకు సంబంధించి మొదటిదశ పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలలోని గోదాములకు చేరుకున్నాయి. యాదాద్రి జిల్లాలో విద్యాశాఖకు సంబంధించిన గోదాము ఖాళీగా లేకపోవడంతో ఇతర శాఖల పరిధిలోని గోదాముల కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలను ఒకే విడతలో తెప్పించే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి పాఠ్యపుస్తకాలు చేరిన వెంటనే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధి పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకాలు ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ప్రవేశాలు పెంచడం ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడం ద్వారా వాటి బలోపేతానికి అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగుస్తుంది. జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలతో చాలా చోట్ల ఇప్పటికే ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడి ఈడు పిల్లలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లితండ్రులను కలుస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం మొదటి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్కు పునాదులు వేయాలి. –సత్యనారాయణ, డీఈఓ భువనగిరి పాఠశాలలు, విద్యార్థులు ఇలాప్రభుత్వ 1,941 కేజీబీవీ 1,606 ఎంజేపీటీబీ 1,557 మండల/జెడ్పీ 34,221 మైనార్టీ గురుకులాలు 638 సాంఘిక సంక్షేమ గురుకులాలు 2,538 గిరిజన సంక్షేమ గురుకులాలు 290 మోడల్ స్కూళ్లు 1,865 తెలంగాణ గురుకులాలు 1,402 అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్స్ 49 మొత్తం విద్యార్థులు 46,107 మొత్తం టైటిల్స్ 221 కావాల్సిన పుస్తకాలు 3,92,250 ఫ పాఠశాలల పునః ప్రారంభం రోజే ఇచ్చేందుకు కసరత్తు ఫ 3,92,250 పుస్తకాలు అవసరమని అంచనా ఫ విద్యాశాఖ గోదాము ఖాళీలేక ఇతర శాఖలవి తీసుకోవడానికి యత్నం -
బీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్లు కల్పించాలి
దేవరకొండ : పార్లమెంట్లో మహిళా బిల్లుతో పాటు బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్ కోటా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి మహిళలకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటే జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో చేరిపల్లి జయలక్ష్మి, ముత్తమ్మ, వనం చంద్రకళ, శారద, శివ తదితరులు పాల్గొన్నారు. -
బైక్పై నుంచి కిందపడి..
త్రిపురారం : ౖబెక్పై నుంచి కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం జరిగింది. సోమవారం త్రిపురారం ఎస్ఐ గైకూరి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి భద్రయ్య(50) ఆదివారం పని నిమిత్తం అడవిదేవులపల్లికి వెళ్లి రాత్రి తిరిగి మిర్యాలగూడకు వెళ్తుండగా.. త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు వెంట ఉన్న రాయి తగిలి బైక్పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఒక కుమార్తె ఉంది. -
భూదాన వజ్రోత్సవాలకు ఆహ్వానం
భూదాన్పోచంపల్లి : పోచంపల్లిలో 18న నిర్వహిస్తున్న భూదాన వజ్రోత్సవాలకు హాజరుకావాలని సోమవారం హైదరాబాద్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి నాయకులు ఆహ్వానపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సేవాసమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య మాట్లాడుతూ.. వజ్రోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత లవకుమార్, కొట్టం కరుణాకర్రెడ్డి, తడక యాదగిరి, కొమ్ము లక్ష్మణ్, కరగల్ల కుమార్, తొలుపునూరి కృష్ణ, పోతగల్ల నర్సింహ పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే హత్య
చివ్వెంల(సూర్యాపేట) : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని హత్య చేసిన వ్యక్తిని, అతడికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సూర్యాపేట రూరల్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ మణిభార్గవ్, రత్నావత్ సాయిదుర్గ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు. సాయిదుర్గ భార్య సాయిశ్రీతో మణిభార్గవ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో మణిభార్గవ్కు ఈ నెల 9న రాత్రి సాయిదుర్గ ఫోన్ చేసి గ్రామ శివారులోని అడవికుంట చెరువు వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో మణిభార్గవ్ చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడి చేరుకున్న సాయిదుర్గ, అతడి భార్య సాయిశ్రీ కలిసి మణిభార్గవ్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మణిభార్గవ్ను సాయిదుర్గ కిందపడేసి ఛాతిపై బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆటో స్టార్ట్ చేసే తాడును మణిభార్గవ్ మెడకు గట్టిగా బిగించడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దురాజ్పల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్కు వెళ్తున్న సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు భార్యాభర్తల అరెస్ట్ రిమాండ్కు తరలింపు -
ఎఫ్సీఐ ఉద్యోగినంటూ మోసం
మాడుగులపల్లి : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. యువతితో పెళ్లి కుదుర్చుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు పోలీసుల అదుపులో నిందితుడు..? -
ఐదు నెలలుగా అందని వేతనాలు
పెద్దవూర: ప్రభుత్వ ఎస్టీ వసతి గృహాల్లో పనిచేసే వర్కర్లకు ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేసే హాస్టల్ వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో వారి రోజువారీ జీవితం కుదేలవుతుంది. అప్పులు చేసి మరీ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 312 మంది వర్కర్లునల్లగొండ జిల్లాలో 43 గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో విద్యార్థులకు వంట చేయడం, హాస్టల్ గదులను, పరిసరాలను, బాత్రూంలు, మూత్రశాలలు శుభ్రపరచడం వంటి పనులు చేసేందుకు గాను 312 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు హాస్టల్లోనే ఉంటూ పనులు చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ వర్కర్లతో సమానంగా ... ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాలలో పనిచేసే రోజువారి వర్కర్లు రెగ్యులర్ వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నా.. వారికి ఇస్తున్న వేతనం రూ.13,328 మాత్రమే. పని మాత్రం ప్రతిరోజూ చేస్తున్నా. జీతం మాత్రం రావడం లేదని, ఇలా అయితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో తమ పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేకపోతున్నారు. నవంబర్ నుంచి పెండింగ్..గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదని, దీంతో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తున్నామని వర్కర్లు వాపోతున్నారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రేపు మాపు అంటున్నారు గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు ఇవ్వలేదు. పది రోజులైతే ఈ విద్యాసంవత్సరం కూడా అయిపోతుంది. జీతాల గురించి అడిగితే రేపొస్తాయి.. మాపొస్తాయి అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు హాస్టళ్లలోనే పనిచేస్తుండటంతో వేరే పనులకు వెళ్లే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి తక్షణమే వేతనాలు ఇప్పించాలి. – నాగేందర్, వర్కర్, ఎస్టీ హాస్టల్, పెద్దవూర కుటుంబ పోషణ కష్టంగా ఉంది ఐదు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. మాకు వేరే పనులకు వెళ్లడానికి వీలు ఉండదు. కిరాణ దుకాణాలు, పాలు పోసే వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చకపోవడంతో సరుకులు ఇవ్వడం లేదు. పాలు పోయడం లేదు. చేసిన అప్పులు తీర్చాలని అప్పులోల్లు ఒత్తిడి చేస్తున్నారు. – బొడ్డు రాములమ్మ, ఎస్టీ హాస్టల్ వర్కర్ పెద్దవూర కుటుంబ పోషణ భారంగా మారిందంటున్న ఎస్టీ హాస్టళ్లలో పనిచేసే వర్కర్లు అధికారులు స్పందించి జీతాలు ఇవ్వాలని వేడుకోలు -
రైతులను ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కట్టంగూర్ : ఐకేపీ కేంద్రాల్లో తాలు పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ముంచుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకుల హవా నడుస్తుందని, రైతులను పట్టించుకునేవారు కరువయ్యారని ఆరోపించారు. రైతులు మరలా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి మార్కెట్లో పోసి రాత్రికి రాత్రే కాంటా వేసి పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులు రోజుల తరబడి ఇబ్బందులకు గురువుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు ఇవ్వకుండా రైతుల సంఘాల పేరిట వేరే వారికి ఇవ్వటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తాలు పేరుతో బస్తాకు 2 నుంచి 3 కిలోలు అధికంగా కాంటా వేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. రైతులను కొనుగోలు కేంద్రాల్లో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు పెరగటంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ అధికారుల నిఘా కొనుగోలు కేంద్రాలపై ఉండాలన్నారు. దళారీ వ్యవస్థను తొలగించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములుయాదవ్, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సింహ, పెద్ది మల్లేష్ ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
చెరువులో మునిగి యువకుడి గల్లంతు
భూదాన్పోచంపల్లి : చెరువులో నాటుపడవపై షికారుకు వెళ్లగా.. పడవ మునగడంతో యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్పోచంపల్లి మండలం గౌస్కొండ గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌస్కొండ గ్రామానికి చెందిన పాండాల శివ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. శివ సోమవారం ఉదయం బైక్పై డ్యూటీకి బయల్దేరుతుండగా.. అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితులు దుర్గాప్రసాద్, సాయి, తరుణ్, మల్లేశ్, రాము ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని శివకు చెప్పారు. దీంతో శివ తన తల్లికి ఫోన్ చేసి ఈరోజు డ్యూటీకి వెళ్లడంలేదని చెప్పాడు. అనంతరం స్నేహితులంతా కలిసి గ్రామ శివారులోని చెరువు సమీపంలో మద్యం సేవించారు. అనంతరం చెరువు ఒడ్డున మత్స్యకార్మికులు చేపలు పట్టే నాటుపడవ కనిపించడంతో సరాదాగా చెరువులో షికారు కొడదామని అందరూ కలిసి పడవ ఎక్కి చెరువు లోపలికి వెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక పడవలోకి నీళ్లు రావడంతో వారంతా భయపడి చెరువులోకి దూకారు. ఐదుగురిని రక్షించిన చెక్క వెంకటేశ్..చెరువులోకి దూకిన వారంతా కొద్దిదూరం ఈత కొడుతూ వచ్చారు. మద్యం మత్తులో ఉండడంతో ఒడ్డు వరకు ఈదలేక కేకలు వేయగా.. అటుగా వెళ్తున్న మత్స్యకార్మికుడు చెక్క వెంకటేశ్ గమనించి థర్మాకోల్తో చేసిన తెప్ప సహాయంతో ఐదుగురిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. శివకు ఈత రాకపోవడంతో చెరువులో మునిగి గల్లంతయ్యాడు. ఒడ్డుకు చేరిన యువకులు భయంతో అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోచంపల్లి ఎస్ఐ భాస్కర్రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని శివ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి
పెన్పహాడ్ : విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు మృతిచెందాయి. ఈ ఘటన పెన్పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దూపహాడ్ గ్రామానికి చెందిన రైతు దొంగరి మురళయ్య తన పాడి గేదెలను మేతకు తీసుకెళ్లగా.. పంట పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగ తగిలి గేదెలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ శాఖ నుంచి రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. తెగిన తీగను సరిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. బ్యాటరీలు చోరీ చేసిన దొంగల అరెస్ట్ నేరేడుచర్ల : డాంబర్ మిల్లులో పార్కింగ్ చేసిన టిప్పర్లలోని బ్యాటరీలు చోరీ చేసిన ముగ్గురు దొంగలను నేరేడుచర్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న రాత్రి నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద గల డాంబర్ మిల్లులో పార్కింగ్ చేసిన మూడు టిప్పర్లలోని బ్యాటరీలతో పాటు జనరేటర్ రూంలోని బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. డాంబర్ మిల్లు వాచ్మన్ మాతంగి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి శివయ్య, కంచుగంటి కార్తీక్, పంటమూల జానయ్య చోరీ చేసిన బ్యాటరీలను ఆటోలో తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు వారి ముగ్గురిని అరెస్ట్ చేసి హుజూర్నగర్ కోర్టులో హాజరుపర్చి జడ్జి తీర్పు మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. చేపల వేటకు వెళ్లి మృతి నడిగూడెం : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి వల కాళ్లకు చిక్కుకొని చెరువులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. నడిగూడెం ఎస్ఐ గందమళ్ల అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన వట్టికూటి వెంకటేశ్వర్లు(45) సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వలను చెరువులోకి విసిరిన సమయంలో నీటి కాకి వలలో చిక్కుకోగా.. దానిని తీయడానికి వెంకటేశ్వర్లు నీటిలో ఈదుతూ వెళ్లగా కాళ్లకు వల చిక్కుకుని చెరువులో మునిగి మృతిచెందాడు. మృతుని భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. కాల్వలో బోల్తా పడిన కారు● ముగ్గురికి స్వల్ప గాయాలు సూర్యాపేటటౌన్ : కారు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం తెల్ల వారుజామున సూర్యాపేట పట్టణంలో జరిగింది. హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి కారులో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా.. మార్గమధ్యలో సూర్యాపేటలోని అంజనాపురి కాలనీ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి కాల్వలో బోల్తా పడింది. కారు డ్రైవర్కు, ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. -
యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. సోమవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన పూజ చేపట్టారు. వివిధ పుష్పాలు, తులసీ దళాలతో స్వామివారిని లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు. -
బుద్ధవనంలో కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ బృందం
నాగార్జునసాగర్: కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ చైర్మన్ ధర్మేంద్రకుమార్శర్మ, సభ్యులు గౌతం, గుల్షన్రాజు సోమావారం సాయంత్రం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. స్థానిక ఇంజనీర్లతో కలిసి బుద్ధవనంలోని జాతక వనం, స్థూపపార్కు తదితర ప్రాంతాలను పరిశీలించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు. అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన వారిని సత్కరించారు. వారి వెంట ఎస్ఈ మల్లికార్జున్రావు, ఈఈ సీతారాం, డీఈ అశోక్, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ, నర్సింహ, విజయ్ తదితరులు ఉన్నారు. -
చెరువులు నింపాలని రైతుల రాస్తారోకో
తుర్కపల్లి : మండలంలోని తిరుమలపూర్, వీరారెడ్డిపల్లి గ్రామాల్లోని చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తిరుమలపూర్లో భువనగిరి–గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు ఎండిపోయి, సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పంటలకే కాకుండా, పశువులకు కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, కాల్వల ద్వారా ఈ చెరువులకు నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రైతులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నూకల శ్రీనివాస్ యాదవ్, రామకృష్ణరెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, సందీప్, శేఖర్ యాదవ్ పాల్గొన్నారు. 14న భీమ్ యాత్రభువనగిరిటౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ కోరారు. ఆదివారం వారు భువనగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 14న ఉదయం 8 గంటలకు హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు కర్తల శ్రీనివాస్, సజావుద్దీన్, కూతాడి సురేష్, ఇటుకల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చనలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం విశేషంగా నిర్వహించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను అర్చకులు ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. మూసీ ప్రక్షాళనపై శ్రద్ధలేని ప్రభుత్వంభూదాన్పోచంపల్లి : ప్రభుత్వానికి మూసీనది సుందరీకరణపై ఉన్న శ్రద్ధ, దాని ప్రక్షాళనపై లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి విమర్శించారు. ఆదివారం భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీని పూర్తిగా ప్రక్షాళన చేసి పరీవాహక ప్రాంత గ్రామాలకు కాలుష్యరహిత సాగునీటిని అందించాలని కోరారు. మదర్డైరీ రైతులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. రెండో విడతలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెద్దరావులపల్లి నుంచి పోచంపల్లి వరకు పూర్తిగా ధ్వంసమై, అధ్వానంగా మారిన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి గోడళ్ల నాగభూషణంగౌడ్, గీత పనివారల సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు యాదయ్య, మాజీ మండల కార్యదర్శి భీమగాని నర్సింహ, పార్టీ నాయకులు సంగెం గణేశ్, కొమ్ము బాలనర్సింహ, కంటె శ్రీశైలం, పర్వతం రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య ఆశయాలు సాధిద్దాం
వలిగొండ : దొడ్డి కొమురయ్య ఆశయాల సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. వలిగొండ మండలం కేర్చుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు కొమురయ్య అని గుర్తు చేశారు. కొమురయ్య నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు అని కొనియాడారు. అనంతరం కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్యామ మల్లేశం, మాజీ ఎంపీపీ నూతి రమేష్, సర్పంచ్ మద్దెల మంజుల, కొనపురి కవిత, వెంకటేశం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
చౌటుప్పల్లో ట్రాఫిక్ తిప్పలు
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారితోపాటు సర్వీస్ రోడ్లపై ఆదివారం ట్రాఫిక్ జామ్ అయ్యింది. వివాహాలు, ఇతర శుభకార్యాలు అత్యధికంగా ఉండడం..వీకెండ్ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు సాగించారు. దీనికి తోడుగా పట్టణంలో అండర్పాస్ నిర్మాణ పనులు సాగుతుండడంతో విజయవాడ మార్గంలో నవో దయ టాకీస్ నుంచి, హైదరాబాద్ మార్గంలో తంగడపల్లి చౌరస్తా నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో హైవేపై వచ్చే వాహనాలకు తోడుగా స్థానిక వాహనాలు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ మార్గంలో లింగోజిగూడెం శివారు వరకు, విజయవాడ మార్గంలో లక్కారం శివారు వరకు వాహనాలు బారులుదీరాయి. సాయంత్రం వరకు కొంత మేరకు రద్దీ తక్కువగానే ఉన్నా రాత్రి మాత్రం హైదరాబాద్ మార్గంలోనే భారీగా పెరిగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. సర్వీసు రోడ్ల వెంట ఉన్న దుకాణాలు, ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. -
ఇందిరమ్మ ఇళ్లకు ధరల మంట!
ఆలేరు రూరల్ : పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే వంట నూనెలు, పప్పు దినుసుల ధరలు మండుతుంటే.. తాజాగా స్టీల్, సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఒక్కో ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.27వేల పైచిలుకు భారం పడుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగాయి ఇలా.. అధికారుల లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రెండున్నర టన్నుల స్టీల్, 200 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. ఇరవై రోజుల క్రితం వరకు టన్ను స్టీల్ ధర రూ.63 వేలుకు ఉండగా ప్రస్తుతం రూ.70 వేలకు చేరింది. ఈ లెక్కన టన్నుకు రూ.7వేలు పెరిగింది. రెండున్నర టన్నులకు రూ.17,500 అదనపు భారం పడుతోంది. అలాగే సిమెంట్ బస్తా ధర ఇరవై రోజుల క్రితం రూ.280 ఉండగా.. ప్రస్తుతం రూ.330కి చేరుకుంది. బస్తాకు రూ.50 పెరిగింది. పెరిగిన ధరతో సిమెంట్ రూ.10వేలు అదనపు భారం పడుతుంది. రూ.23.14 కోట్ల అదనపు భారం ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థికసాయం చేస్తుండగా లబ్ధిదారులు మరికొంత డబ్బులు కలిపి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. కానీ పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో ఒక్కో ఇంటిపై రూ.27,500 అదనపు భారం పడుతుంది. ఈ ప్రకారంగా జిల్లాకు మంజూరైన 8,418 ఇళ్లకు సంబంధించి ఏకంగా రూ.23.14కోట్ల అదనపు భారం పడనుంది. దీంతో పెరిగిన ధరలతో ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మరికొందరు లబ్ధిదారులు వ్యాపారుల వద్ద, బంధువుల వద్ద వడ్డీలకు అప్పుతెచ్చి ఇళ్లు నిర్మించుకుంటున్నామని చెబుతున్నారు. ఆవేదనలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఇప్పటికే ప్రభుత్వ నిర్మాణ పనులను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు, అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు చేసే బిల్డర్లు సైతం స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో తాము నష్టాల్లో కూరుకుపోయి అప్పుల పాలు కావడం ఖాయమని బిల్డర్లు ఆవేదన చెందుతున్నారు. ఫ భారీగా పెరిగిన స్టీల్, సిమెంట్ రేట్లు ఫ టన్ను స్టీల్పై రూ.7వేలు, బస్తా సిమెంట్కు రూ.50 పెరుగుదల ఫ ఒక్కో ఇంటిపై రూ.27 వేల అదనపు భారం ఫ లబోదిబోమంటున్న లబ్ధిదారులు జిల్లాకు మంజూరైనవి 9,618 నిర్మాణాలు ప్రాంభించినవి 8,418 పూర్తయినవి 1,264 వివిధ దశలో ఉన్నవి 7,154 -
వ్యాపారంగా మారుతున్న విద్యారంగం
నార్కట్పల్లి : దేశంలో విద్యారంగం వ్యాపారంగా మారుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ, సీపీఎం మండల కమిటీ సభ్యుడు కల్లూరి యాదగిరి స్మారక స్తూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అందరికీ విద్య ఉచితంగా అందించాలని సీపీఎం పోరాటం చేస్తోందన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని అన్నారు. నేటి యువత డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు రాక కూలీలుగా మారుతున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలే నేటి ప్రభుత్వాలకు ఎజెండాలుగా మారుతున్నాయని, పేదలకు గుండె బలం కమ్యూనిస్టులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి ఐలయ్య, దండు నాగరాజు, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, జిట్ట సరోజ, జిట్ట నగేష్, చింతపల్లి బయ్యన్న, ఎస్సార్ వెంకటేశ్వర్లు, ఇల్లందుల లింగస్వామి, బత్తుల అనంతరెడ్డి, చెరుకు పెద్దులు, కుమ్మరి శంకర్, దండు రవి, కొప్పు శ్రవణ్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
సత్తా చాటిన ‘గౌతమి’ కళాశాల
నల్లగొండ : ఇంటర్ ఫలితాల్లో నల్ల గొండలోని గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో కె. సుదీక్ష, కె. హాసిని, బుర్రి కావేరి 468 మార్కులు, జుహనూరిన్, నలహిదా తన్వీర్, కె. హరిని, ఎన్. ప్రసన్న, పి. రమ్య, డి. ప్రవళిక, ఎ. వర్ష, ఎం. శివాని, యశ్వంత్రెడ్డి 467 మార్కులు సాధించారు. బైపీసీలో ఆర్. జ్యోతిక 438, డి. రేశ్మాదేవి, పి. ప్రసన్న, ఎం.గాయత్రి, కె. హనీషా, ఎ. స్పందన 437 మార్కులు పొందారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో జె. అనూష, పి.శ్రీచరణ్ 992 మార్కులు, ఎన్. తేజస్విని, కె.అనుష్క, డి.స్పందన, ఎం.అర్జున్, పవన్కుమార్రెడ్డి 991 మార్కులు సాధించారు. బైపీసీలో వి. ప్రణవిక 993 మార్కులు, సమమా సీరెన్, కె. సాత్విక, కె. దీక్షిత, ఎస్. నిఖిత 992 మార్కులు, ఎన్. సతీష్కుమార్ 991 మార్కులు పొందారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు. -
కళలతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం
భూదాన్పోచంపల్లి : కళలతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య అన్నారు. ఆదివారం భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ్రీకళాకృతీయ ఆర్ట్ ఫెస్టివల్శ్రీ నిర్వహించారు. ఈ ఫెస్టివల్కు యూనివర్సిటీ అడ్వైజర్ అయిన పూనం మాలకొండయ్య హాజరై విద్యార్థులు ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కళల పట్ల ఆసక్తి పెంచుకోవడం ద్వారా సృజనాత్మక ఆలోచనలతో పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. కళా నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. మార్కులు, ర్యాంకులే కాకుండా కళలలో కూడా విద్యార్థులు రాణించాలని అన్నారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే కళాకృతియ ఆర్ట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసి కళలలో కూడా విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు రూపొందించిన పెయింటింగ్స్, హ్యాండ్మేడ్ వస్తువులు, మట్టి పాత్రలు, గృహాలంకరణ వస్తువులు, లైవ్ మ్యూజిక్తో పాటు ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య -
ఎండల నుంచి పండ్ల తోటల రక్షణ ఇలా..
గుర్రంపోడు : అధిక ఉప్ణోగ్రతలు పండ్ల తోటలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వేసవిలో పండ్ల తోటల్లో సరైన నీటి యాజమాన్యం పాటించకపోతే తెగుళ్ల బారిన పడతాయి. ప్రధానంగా బత్తాయి తోటల్లో ఏటా కొన్ని చెట్లు వేరుకుళ్లు బారిన పడటం జరుగుతుంది. వేసవిలో పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన నీటి యాజమాన్య పద్ధతుల గురించి హాలియా ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచనలు ఇలా.. సరైన నీటి యాజమాన్యం కీలకంనీటి ఎద్దడి పరిస్థితులు ఉన్న చోట్ల వేసవిలో చెట్ల పాదుల్లో తడారిపోకుండా ఆకులు లేదా ఊకతో కప్పి ఉంచాలి. ఇలా మల్చింగ్ వల్ల నీటి అవసరం 20 నుంచి 30 శాతం తగ్గుతుంది. ఉదయం, సాయంత్ర వేళ నీరు అందించాలి. చెట్టు పాదులోని మట్టి ఎప్పుడూ చేతితో పట్టుకుంటే ముద్దకానంతగా పదునుతో ఉండాలి. తడి ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో ప్రతిరోజు కనీసం మూడు గంటలు నీరు అందించాలి. చెట్టుకు కనీసం 4 నుంచి 8 డ్రిప్పర్లు చెట్టు వయస్సును బట్టి ఏర్పాటు చేసుకోవాలి. మధ్యాహ్నం సూర్యకాంతి నుంచి రక్షణ కల్గించేలా చిన్న పండ్ల మొక్కలకు షేడ్ నెట్ లేదా తాటి ఆకులతో నీడనివ్వాలి. ముందుగా తోటలో ఆరోగ్యంగా లేని మొక్కలను గుర్తించి ఎండ నుంచి తట్టుకునేలా చేయాలి. మార్కెట్లో లభించే ఒత్తిడిని తట్టుకునే యాంటీ స్ట్రెస్ ద్రావణాలు వాడవచ్చు. ఇవి ఆకులపై తెల్లటి పొరలా ఏర్పడి సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. సేంద్రియ పదార్ధాల వినియోగం తప్పనిసరినేలలో తగినంత సేంద్రియ ఎరువులు పశువుల పేడ, వర్మీ కంపోస్టు లాంటివి నీటి ఎద్దడిని, ఎండ తీవ్రతను కొంతవరకు తట్టుకుంటాయి. పండ్ల తోటల్లో సేంద్రియ ఎరువులతో పాటు వర్షాకాలంలో జనుము, మినుము, జీలుగ లాంటి పంటలు వేసి దుక్కిలో దున్నుకుంటే నేల సారవంతమై నీటి ఎద్దడి తట్టుకుంటుంది.నీటి ఎద్దడితో వేరుకుళ్లు తెగులుప్రధానంగా పండ్ల తోటల్లో నీటి ఎద్దడి వల్ల వేరుకుళ్లు తెగులు సోకుతుంది. నీరు పెట్టినా వాడి పట్టినట్లు కనిపించడం ఈ తెగులు ప్రధాన లక్షణం. నీటి ఎద్దడి వల్ల అనేక శిలీంధ్రాలు విజభించి వేరకుళ్లు తెగులుకు దోహదం చేస్తాయి. నేలలో తడి ఎక్కువైనా, నీటి ఎద్దడికి గురైనా వేరుకుళ్లు తెగులు వ్యాపిస్తుంది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చెట్లను బతికించుకునే అవకాశం ఉంటుంది. చెట్టుకు పది కిలోల చొప్పున వద్ది చేసిన ట్రై కోడర్మాను పది కిలోల వంతున పాదులో వేయాలి. నీరు కట్టిన మరుసటి రోజు 40 గ్రాములు కార్బండిజం, 50 గ్రాములు మాంకోజెబ్లు 20 లీటర్ల నీటిలో కలిపి పాదంతా తడిచేలా చేయాలి. మల్టీకే లాంటి నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేయాలి. హాలియా ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచనలు -
‘జయ’కేతనం ఎగురవేసిన విద్యార్థులు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో టి. భూమిక, జి. శివమణి 468 మార్కులు, బి. సాయి, ఎల్. సంజన, ఎం. అనన్య, పి. సాయిలిక్షిత, ఎస్. మాధురి, ఎ. సాయిచర్విత, టి. సాయిహర్షిత 467, జి. సాయిప్రణవి, వై. భావన, ఎన్. దీక్షిత, ఎస్. మాన్విత, కె. సంజన 466, బి. విశ్వసేనాగౌడ్, కె. సాయిరెడ్డి, వి. హాసిని, కె.చరణ్య 465 మార్కులు సాధించారు. 460పైగా 43 మంది, 450పైగా 84 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. బైపీసీ విభాగంలో ఎం. ప్రగతి ఇవాంజలిన్ 438 మార్కులు సాధించింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో డి. సిరి 994, జి. శ్రీనిక, ఎం. భవ్యశ్రీ 992, ఎస్. అశువర్ధన్, జి. మనోవర్షిత 991, ఎండీ ముస్కాన్ 990, సీహెచ్. జయశ్రీ 989, ఎస్కే సాధియా ఇర్ఫానా, జి. శ్రీజ, ఎం. తీర్థశ్రీ, డి. వెన్నెల 988, టి. తేజస్వి, ఎన్. శ్రీలక్ష్మి, కె. స్లేష్మ 987, ఎన్. హారిణి 985 మార్కులు సాధించినట్లు చెప్పారు. 980 మార్కులకు పైగా 32 మంది, 950 పైగా 107 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. బైపీసీలో కె. శృతి 985, జె. మానస 981, జె. శ్రీనిత్య 980 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినంధించారు. -
ముగిసిన జాతీయ డయాబెటీస్ సదస్సు
నాగార్జునసాగర్ : రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్లోని విజయ విహార్లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డయాబెటీస్ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి వెయ్యికి పైగా వైద్యులు పాల్గొని మధుమేహంపై తాజా అధ్యయనాలపై చర్చించారు. ఈ రెండు రోజుల్లో 30కి పైగా శాసీ్త్రయ ఉపన్యాసాలు, 15 పేపర్ ప్రజెంటేషన్లు, 10 పోస్టర్ ప్రజెంటేషన్లు, 5 వర్క్షాపులు విజయవంతంగా నిర్వహించారు. యువ వైద్యులు, పీజీ విద్యార్థులు తమ పరిశోధనలను ప్రదర్శించి నిపుణుల సలహాలు, సూచనలు పొందారు. సదస్సు ముగింపు సందర్భంగా ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. సదస్సులో పాల్గొన్న వైద్యులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. వలంటీర్లు, స్పాన్సర్లను ప్రత్యేకంగా సన్మానించారు. గ్రామానికి కీడు సోకిందని.. ● వనవాసం వెళ్లిన కట్టంగూర్ వాసులు కట్టంగూర్ : గ్రామానికి కీడు సోకిందని ప్రజలంతా వనభోజనానికి వెళ్లారు. ఈ సంఘటన కట్టంగూరు మండల కేంద్రంలో ఆదివారం చోటచేసుకుంది. ఏడాది కాలంగా కట్టంగూర్లో వరుస మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వృద్ధులతో పాటు యువకులు మరణిస్తుండటంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన స్థానికులు, పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు పురోహితుడిని సంప్రదించారు. దీంతో గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులంతా ఒక రోజు ఊరు విడిచి వనవాసం వెళ్లాలని పురోహితుడు సూచించాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామస్తులంతా ఇల్లు వాకిలి ఊడ్చకుండానే ఇళ్లకు తాళం వేసి సకుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లారు. సంప్రదాయంగా వ్యవసాయ బావుల వద్ద వంటలు చేసుకొని అక్కడే భోజనం చేసి సాయంత్రం ఇళ్లకు తిరిగివచ్చారు. -
యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డులో ప్రమాదం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఆలయ మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదానికి గురైంది. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కర్మన్ఘాట్కు చెందిన తరుణ్, అతడి కుటుంబ సభ్యులు నలుగురు కలిసి కారులో ఆదివారం ఉదయం యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం పూర్తయిన తర్వాత కారులో మొదటి ఘాట్ రోడ్డు నుంచి కిందకు దిగుతుండగా.. జీయర్ కుటీర్ వద్దకు రాగానే టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి ఘాట్ రోడ్డు ప్రహరీని ఢీకొట్టింది. కారులోని భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును ట్రాఫిక్ పోలీసులు మరో వాహనం సహాయంతో కొండ కిందకు తీసుకెళ్లారు. ప్రహరీని ఢీకొట్టిన కారు -
ఇంటర్ ఫలితాల్లో ‘గీతాంజలి’ ప్రభంజనం
నల్లగొండ : పట్టణంలోని గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో బి. అర్చిత 994 మార్కులు, వి. శ్వేత, ఆర్. ప్రజ్ఞిత 993, బి. శ్రీవిద్య, కె. ఉమారాణి 992, ఎస్. సాయిమాధురి, కె. నిఖిల్కుమార్ 991, ఎస్. జగదీష్ 990 మార్కులు సాధించారు. బైపీసీలో ఆర్. ప్రవల్లిక, కె. వెరోనిక రాణి 988 మార్కులు, డి. చరణ్తేజ 987, టి. సింధు 981, ఎం. మంజుల 981, ఎల్. మీనా 980 మార్కులు సాధించారు. అదేవిధంగా ఫస్టియర్ ఎంపీసీలో సీహెచ్. సందీప్రెడ్డి, షేక్ సానియా, ఎస్. తులసి 466 మార్కులు, ఎన్. వంశీ, శైలజ 465 మార్కులు పొందారు. బైపీసీలో బి. నవ్య 437, కె. అంజలి, సీహెచ్. వరలక్ష్మి, ఎన్. అనూష 436, జి. హని వర్షిత 435 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ టి. నరేందర్రెడ్డి, డైరెక్టర్లు సీహెచ్.మల్లారెడ్డి, ఎ.విమోచన్రెడ్డి, కె.రాజేందర్రెడ్డి, ఎ.జనార్దన్రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. -
యాదగిరీశుడి ఆలయంలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూకాంప్లెక్స్ ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.40,34,619 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.యాదగిరీశుడి సేవలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీయాదగిరీశుడిని సీఎం రేవంత్రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవానీ శంకర్ లడ్డూ ప్రసాదం అందజేశారు. -
రూ.2కోట్లు స్వాహా చేసిన బ్యాంక్ కాంట్రాక్ట్ ఉద్యోగి..?
దేవరకొండ : దేవరకొండ పట్టణంలోని ఓ బ్యాంక్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.2కోట్లకు పైగా నగదును డిజిటల్ పద్ధతిన స్వాహా చేసి పరారైనట్లు ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దేవరకొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఓ బ్యాంకులో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దీర్ఘకాలికంగా డబ్బులు డ్రా చేయని ఖాతాలను ఎంచుకొని డిజిటల్ పద్ధతిన ఖాతాదారులకు తెలియకుండా దాదాపు రూ.2కోట్ల మేర లావాదేవీలు జరిపి పరారైనట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా బ్యాంక్కు సెలవులు ఉండడంతో ఎవరి ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ అయ్యిందో తెలియడంలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దేవరకొండ పోలీసులు తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి మృతి మద్దిరాల : వడదెబ్బతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మద్దిరాల మండలం చౌళ్లతండా గ్రామ పంచాయతీ పరిధిలోని రాజానాయక్తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానాయక్తండాకు చెందిన బానోత్ సైదులు(45) వ్యవసాయ పనులను చేసుకొని మధ్యాహ్నం చేను వద్ద నుంచి ఇంటికి వస్తుండగా వడదెబ్బ కారణంగా మార్గమధ్యలో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇరు వర్గాల మధ్య చేపల పంచాయితీ మోతె : తుమ్మలపల్లి గ్రామంలో ఆదివారం రెండు వర్గాల మధ్య చెరువులో చేపలు పట్టే విషయమై పంచాయితీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలపల్లి గ్రామంలోని కన్నె చెరువులో సంవత్సర కాలం నుంచి ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు సొంత ఖర్చులతో చేప పిల్లలు పెంచుతున్నారు. గత వారం నుంచి చేపలు పట్టేందుకు సన్నాహాలు చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ముదిరాజు కులస్తులు చేపలు పట్టేందుకు ఆదివారం చెరువు వద్దకు వెళ్లారు. దీంతో వారిని ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు అడ్డుకున్నారు. కన్నె చెరువు తమ పట్టా భూముల్లో కొంత మేరకు ఉన్నందున చేపలు పెంచుతున్నామని ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు బదులిచ్చారు. సమాచారం తెలుసుకున్న మత్స్యశాఖ అధికారులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకొని ఇరు వర్గాల సభ్యులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి నిడమనూరు : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలంలోని వడ్డెరిగూడెం – కుంటిగోర్లగూడెం గ్రామాల మధ్యన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురేష్(35) వరికోత మిషన్ డ్రైవర్గా పనిచేసేందుకు సాగర్ ఆయకట్టుకు వచ్చాడు. ఆదివారం సాయంత్రం వరికోత యంత్రాన్ని నిడమనూరు మండలంలోని వడ్డెరిగూడెం శివారు నుంచి కుంటిగొర్లగూడెం తరలించేందుకు ట్రాక్టర్ను తీసుకెళ్తుండగా రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. -
విప్స్ కంపెనీ ఏజెంట్ల అరెస్టు
రామగిరి(నల్లగొండ): అధిక లాభాలు, క్యాష్బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్న విప్స్ కంపెనీ ఏజెంట్లను నల్లగొండ రూరల్ అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఏఎస్పీ రమేష్ ఆదివారం వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన వినోద్ తుకారాం ఖుటే విప్స్ వ్యాలెట్ యాప్ను ప్రారంభించాడు. 2018లో దానిని విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా మార్చి వివిధ రకాల సేవల పేర్లతో అధిక లాభాలు, క్యాష్బ్యాక్ ఆఫర్లు అంటూ ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఏజెంట్లను నియమించుకుని అమాయక ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించారు. కమిషన్ వ్యవస్థ, ట్రేడింగ్, ప్రాపర్టీస్, మర్చంట్, క్యూఆర్ కోడ్ పేరుతో దుకాణాలు, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా నమ్మించి మోసం చేశారు. కొత్త యాప్తో మరోసారి మోసం.. విప్స్ కంపెనీకి చెందిన ఏజెంట్లు శనివారం నల్లగొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్ సమీపంలో పాత కస్టమర్లతో సమావేశం ఏర్పాటు చేసి వేవ్ అనే కొత్త యాప్లో రూ.లక్ష పెట్టుబడి పెడితే పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని ప్రచారం చేశారు. సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన కానాల లక్ష్మీనారాయణరావు, నకిరేకల్ మండలం మర్రూర్కు చెందిన పున్నం బాలకృష్ణ, చిట్యాల మండలం ఎలికట్టెకు చెందిన ఉయ్యాల శ్రీనివాస్, నల్లగొండ పట్టణానికి చెందిన కురాకుల రమేష్, మాదగోని సైదులు, కనగల్ మండలం దోరెపల్లికి చెందిన గాజుల మహేష్, నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామానికి చెందిన కోల కుశలయ్య, అప్పాజీపేటకు చెందిన ఓరుగంటి శంకర్, కట్టంగూర్ మండలం మునుకుంట్లకు చెందిన ముడుసు ఉమాశంకర్, కట్టంగూర్ మండలానికి చెందిన గుడపూరి లింగస్వామి ఉన్నారు. విప్స్ గ్రూప్ సీఈఓ వినోద్ తుకారాం ఖుటే, డైరెక్టర్లు సుమిత్ పురాంక్, సౌతిండియా డెవలప్మెంట్ డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డైరెక్టర్లు గుమ్మల సత్యనారాయణ, గుమ్ముల అభినాష్ పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన టూటౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్ఐ సైదాబాబు, సిబ్బందిని ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలిసులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ఏఎస్పీ రమేష్ సూచించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, యువత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొత్త యాప్ పేరుతో పాత కస్టమర్లను మోసం చేసేందుకు యత్నం వివరాలు వెల్లడించిన నల్లగొండ ఏఎస్పీ రమేష్ -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
భువనగిరి : యోగాతో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హోమియోపతి వైద్యశాస్త్ర పితామహుడు డాక్టర్ సీఎస్ శ్యామ్యూల్ హనిమన్ జయంతిని పురస్కరించుని శుక్రవారం భువనగిరి కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ఆయూష్ అండ్ హోమియోపతి దినోత్సవంలో ఆయన మాట్లాడారు. యోగాభ్యాసం వల్ల ఏకాగ్రత, రోగ నిరోదక శక్తి పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు యోగా సాధన అలవాటుగా చేసుకోవాలన్నారు. అనంతరం ఉచిత హోమియోపతి, యునాని వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, డాక్టర్ సంగీత, బాలభవాని, విజయలక్ష్మి, శ్రీనివాస్, కవిత, రోజ్మేరీ పాల్గొన్నారు. -
సిరుల సాగు మునగ
‘యాదాద్రి మొరింగా మిషన్–2026’కు శ్రీకారం సాక్షి, యాదాద్రి : తక్కువ ఖర్చుతో రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మునగ సాగుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యాదాద్రి మొరింగా మిషన్–2026 పేరుతో వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు మునగ సాగు కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో, పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో మునగను సాగు చేయించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న మునగ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతులను పెంచి రైతులకు అధికాదాయం అందించాలని యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ పలు దఫాలుగా చర్చించారు. 500 ఎకరాల్లో సాగే లక్ష్యం ఈ వానాకాలం సీజన్లో మునగ సాగును ప్రోత్సహించడానికి జిల్లాలో బొమ్మలరామారం, ఆలేరు, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు ఆరు మండలాలను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో ముందుగా రైతులకు దీనిపై అవగాహన కల్పించనున్నారు. ప్రయోగాత్మకంగా ఒక్కో మండలంలో 25 ఎకరాల్లో సాగు చేయిస్తారు. 2026 నాటికి జిల్లాలో సుమారు 500 ఎకరాలకు మునగ సాగును విస్తరించడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి.. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే మునగ పంటకు ఎకరానికి సుమారు రూ.20 వేల పెట్టుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి ప్రభుత్వ ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీలు అందించనుంది. ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీపై బిందు సేద్యం (డ్రిప్) పరికరాలు ఇస్తారు. ఆకును ఎండబెట్టి పొడి చేయడానికి అవసరమైన సోలార్ డ్రయ్యర్లను సైతం సబ్సిడీపై అందించనున్నారు. గ్రామంలో మూడెకరాల్లో మునగ సాగు చేశాను. కన్యాకుమారి నుంచి విత్తనాలను తెప్పించాను. సేంద్రియ పద్ధతిలో సాగు చేయడంతో 4 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. రెండు నెలలకు ఒకసారి ఆకులను కట్ చేస్తాం. నేను పండించిన మునగాకుకు విదేశీ ఎగుమతి ఆర్డర్ రావడమే కాకుండా, మూడేళ్ల కాంట్రాక్టు దక్కింది. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం వస్తుంది. జిల్లాలో చేపడుతున్న మొరింగా మిషన్లో భాగస్వామిని అవుతున్నాను. – మామిడి అమరేందర్రెడ్డి, మునగ రైతు, దత్తాయపల్లి, తుర్కపల్లి మండలం కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శకత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే ఈ మునగ సాగు చేపట్టాం. పంట దిగుబడి కొనుగోళ్లకు భరోసా కల్పించడం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుంది. అలాగే, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి మహిళలకు నేరుగా ఉపాధి కల్పిస్తాం. తద్వారా మహిళా సాధికారత సాధించవచ్చు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, ఆ తర్వాత జిల్లా అంతటా మోడల్గా మునగ సాగును విస్తరిస్తాం. – వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి మునగాకు ఉత్పత్తులపై మహిళా రైతుతో చర్చిస్తున్న కలెక్టర్ అనురాగ్ జయంతి (ఫెల్)ఫ సేంద్రియ పద్ధతిలో మునగ సాగుకు ప్రణాళిక ఫ ఈ వానాకాలంనుంచే సాగు ప్రారంభం ఫ ప్రయోగాత్మకంగా ఐదు మండలాల ఎంపిక -
దేవుడి నైవేద్యం ఎటుపోతోంది?
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉద్యోగులు, సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. స్వామివారి నైవేద్యానికి, నిత్య కై ంకర్యాలు, ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకులు పక్కదారి పడుతున్నాయి. దేవస్థానం గోదాముకు వచ్చే కాజు, బాదం, బియ్యం, నూనె, తదితర ముడి సరుకులను సంబంధిత శాఖ ఏఈఓ, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో వివిధ విభాగాల సిబ్బంది రోజూ తీసుకెళ్తుంటారు. కానీ గోదాములో పనిచేసే సిబ్బంది మాత్రం ఎవరూ లేని సమయంలో కాజు పకోడి చేసుకొని ప్యాకింగ్ చేస్తున్నారు. దీంతో గోదాములో రోజూ కిలోల కొద్ది కాజు మాయమవుతోందని తెలుస్తోంది. అసలు సరుకులు ఎంత వస్తున్నాయి, ఎంత వినియోగిస్తున్నారు, మిగిలిన సరుకుల లెక్కలు ఏమిటనే సందేహాలు ఇప్పుడు భక్తుల్లో కలుగుతున్నాయి. అసలు ఈ ప్యాకింగ్ చేసిన కాజు పకోడి దేవస్థానం ఉద్యోగులు, అధికారుల ఇళ్లకు పంపిస్తున్నారా.. లేక సిబ్బంది ప్యాకింగ్ చేసుకొని బయటకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేవస్థానం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అధికారి ఏమంటున్నారంటే.. ఈ విషయమై సంబంధిత గోదాము అధికారి దాసోజు నరేష్ను వివరణ కోరగా తాను రెండు, మూడు రోజులుగా సెలవులో ఉన్నానని, నాకు ఇంతకు ముందే తెలిసిందని సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా కాజు పకోడి బయటి నుంచి కొనుగోలు చేశారని వెల్లడించారు. కొనుగోలు చేసిన పకోడి మిగిలితే దేవస్థానానికి చెందిన కవర్లో ప్యాకింగ్ చేసుకున్నారని సమాధానం చెప్పారు. అది పెద్ద ఇష్యు కాదని పేర్కొనడం గమనార్హం. ఫ యాదగిరీశుడి గోదాములో సరుకులు పక్కదారి ఫ కాజు పకోడి చేసి ప్యాకింగ్ చేస్తున్న సిబ్బంది -
13 నుంచి ‘అరైవ్–అలైవ్’
సాక్షి, యాదాద్రి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీస్ ఏఆర్హెడ్ క్వాటర్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఏఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. 13న సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయాలన్నారు. 15న చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే నిర్వహించి 4 ఏళ్ల పైబడిన పిల్లలకు కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరింపజేయడంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. 16న ఉద్యోగులందరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. 17న ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంపై శిక్షణ ఇవ్వాలన్నారు. 18న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఎస్పీలు రవీందర్, ప్రభాకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారి ఇమ్రాన్, డీపీఓ శ్రీకాంత్, డీఈఓ సత్యనారాయణ, డీఐఈఓ రమణి, ఆర్అండ్ బీ అధికారి సరిత పాల్గొన్నారు. ఫ ఎస్పీ అక్షాంశ్ యాదవ్ -
నేతన్న కల సాకారం చేసిన ప్రభుత్వం
సాక్షి, యాదాద్రి : చేనేత భరోసా పథకం కింద జిల్లాలోని నేతన్నలకు ప్రభుత్వం రుణమాఫీ చేసి వారి కల సాకారం చేసిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని లింగ బసవ గార్డెన్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతోపాటు కలిసి ఆయన చేనేత భరోసా మెగా చెక్కు పంపిణీ చేసి మాట్లాడారు. రుణమాఫీ కింద రూ.19.24 కోట్లను రుణమాఫీ, నేత భరోసా కింద రూ. 3.29 కోట్లు, చేనేత బీమా కింద రూ. 2.40 కోట్ల నిధులు విడుదల చేయడం శుభపరిణామన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకారెడ్డి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
బస్షెల్టర్లు లేక ఎండలోనే..
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట బస్ షెల్టర్లు కరువయ్యాయి. కొన్నిచోట్ల బస్ షెల్టర్లు ఉన్నా అక్కడ ఆర్టీసీ బస్సులు ఆపడం లేదు. మరికొన్ని చోట్ల ఉన్న బస్ షెల్టర్లు కూర్చొటానికి సౌకర్యవంతంగా లేక నిరుపయోగంగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు బస్సుల కోసం ఎర్రటెండలో రోడ్లపైనే నిలబడి నిరీక్షిస్తున్నారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రయాణికులు రోడ్డు పక్కనే ఉన్న వివిధ దుకాణాల ముందు, చెట్ల నీడలో నిలబడుతున్నారు. ‘సాక్షి’ విజిట్లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. గుండాల : మండల కేంద్రంలో నిర్మించిన బస్ షెల్టర్ ఉపయోగంలో లేకపోయింది. దీంతో మహిళలు, విద్యార్థులు, ప్రజలు గుండాల రోడ్డుపై ఎండలో నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత వేసవిలో నిలువ నీడ కరువైంది. ఇదిలా ఉంటే మాసాన్పల్లి గ్రామంలో తలపెట్టిన బస్ షెల్టర్ నిర్మాణ పనులు మూడు సంవత్సరాలుగా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం
సాక్షి, యాదాద్రి : రానున్న స్థానిక సంస్థల (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలంతా సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ భవన్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మండల, జిల్లా కమిటీల నియామకంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుకున్న వారికి, గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు.. కొత్త ఓటర్ల నమోదు, నకిలీ ఓట్ల గుర్తింపుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. వైభవంగా ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. ఈ సమయంలో మహిళ భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులను నివేధించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలిభూదాన్పోచంపల్లి : పట్టణంలో ఈ నెల 14న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని హిందూ సమ్మేళన సమితి జిల్లా అధ్యక్షుడు రుద్ర పాండురంగశాస్త్రి అన్నారు. శుక్రవారం పోచంపల్లి పట్టణంలోని మార్కండేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన ప్రచార రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మజాగరణ ప్రముఖ్ బడుగు మహేశ్, విశ్వహిందూ పరిషత్ మండల శాఖ అధ్యక్షుడు కటకం తుకారాం, కౌన్సిలర్ కర్నాటి వరలక్ష్మినర్సింహ, బండి యాదగిరి, దోర్నాల గణేశ్, సాయిని భాస్కర్, చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, భిక్షపతిచారి తదితరులు పాల్గొన్నారు. సాగర్లో నేడు, రేపు డయాబెటీస్ సదస్సు నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ విజయవిహార్లో శని, ఆదివారల్లో జాతీయస్థాయి డయాబెటీస్ సదస్సు జరగనుంది. రీసెర్చ్ సొసైటీ ఫర్ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా(ఆర్ఎస్ఎస్డీఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ వార్షిక డయాబెటీస్ సదస్సు–2026లో మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా వైద్యులు, నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొనున్నారని పేర్కొన్నారు. శనివారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి హాజరుకానున్నారు. -
మాగేస్తే ఎండుగడ్డిలోనూ పోషకాలు
పశువులు యూరియానుగాని, యూరియా నీళ్లనుగాని తాగకుండా జాగ్రత్త పడాలి. పొరల మధ్య గాలి ప్రవేశించకుండా తొక్కడం, తాళ్లతో బంధించడం చేయాలి. తమకున్న పశువుల సంఖ్య ఆధారంగా 3 మాసాలకు సరిపోయే వరిగడ్డిని మాగేసుకుని, ఒక వాము వాడటం ప్రారంభించగానే మరొకటి తయారు చేసుకోవాలి. గుర్రంపోడు : వేసవిలో పచ్చిమేత లభ్యత తక్కువగా ఉంటున్న కారణంగా పలువురు రైతులు ఎండుగడ్డిపై ఆధారపడుతుంటారు. పచ్చిమేతలో ఉండే పోషకాలు ఎండిన వరిగడ్డిలో ఉండకపోవడంతో పశువులు బక్కచిక్కిపోతుంటాయి. మెళకువలు పాటిస్తే ఎండిన వరిగడ్డిలోనూ పోషకాలు పెరిగి పచ్చిమేతగా మారుతుందని గుర్రంపోడు మండల పశువైద్యాధికారి సాయిరామ్ పేర్కొంటున్నారు. అన్ని కాలాల్లో వినియోగం పశుపోషణకు రైతులు పచ్చిగడ్డితోపాటు ఎండుగడ్డిని కూడా అందిస్తుంటారు. సాధారణంగా వేసవిలో పచ్చిగడ్డి కొరత కారణంగా ఎండుగడ్డిని ఎక్కువగా వినియోగిస్తారు. ఎండుగడ్డితోపాటు జొన్న, మొక్క జొన్న, చొప్ప తదితర రకాలను కూడా ఎండబెట్టి ఆహారంగా వినియోగిస్తారు. వరికోతల అనంతరం రైతులు ఎండుగడ్డిని నిల్వ చేసి పశువులకు వేస్తారు. వాటికి కావాల్సిన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఎండుగడ్డిలో లభించవు. జీర్ణం కాని పీచు పదార్థమే వరిగడ్డిలో అధికంగా ఉంటుంది. అయితే ఎండుమేతను కూడా నాణ్యతను పెంచుకుని పశువులకు ఆహారంగా వినియోగిస్తే అన్నికాలాల్లో పచ్చిమేతగా ఉపయోగించవచ్చు. వరిగడ్డిని మాగేసే విధానం.. ఎండుగడ్డిని యూరియా ద్రావణంలో ఊరేస్తే పోషక విలువలు పెరుగుతాయి. 60 లీటర్ల నీటిలో నాలుగు కిలోల యూరియాను కరిగించాలి. 100 కిలోల వరిగడ్డిని పొరలు, పొరలుగా వేస్తూ ప్రతి పొరపై నీళ్లు చిలకరించాలి. పొరల మధ్య గాలి ప్రవేశించకుండా తొక్కాలి. పెద్ద మొత్తంలో యూరియా గడ్డి తయారీకి వాము వేసి టార్పాలిన్ను కప్పాలి. 10 రోజలు తర్వాత తీసిచూస్తే, అమ్మోనియా వాసన కలిగి గోధుమరంగుకు మారిన మాగేసిన వరిగడ్డి పశువులు తినడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రయోజనాలు యూరియా ద్రావణంలో మాగేసిన వరిగడ్డిని వాడటం వల్ల వరిగడ్డి నాణ్యత పచ్చిగడ్డి మేతతో సమానంగా ఉంటుంది. జీర్ణమయ్యే మాంసకృత్తులు లేని వరిగడ్డిలో మాగవేయడం ద్వారా నాలుగు శాతం మాంసకృత్తులు లభ్యమవుతాయి. యూరియా గడ్డి గోధుమ రంగులో ఉండి, అమ్మోనియా వాసన కలిగి, రుచికి తీయగా, మెత్తగా ఉండటం వల్ల ఇష్టంగా తింటాయి. గడ్డిలోని పోషక పదార్థాలు మూడు మాసాల వరకు నిల్వ ఉండి వినియోగమవుతాయి. వరిగడ్డిలో జీర్ణంకాని సెల్యులోజ్, హెమి సెల్యులోజ్ పీచుపదార్థాలు ఊరేసిన తర్వాత సులభంగా జీర్ణమవుతాయి. -
పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు
చిట్యాల: చిట్యాల మండల పరిధిలో వివిధ రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో తరచుగా పేలుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గురువారం సాయంత్రం బొంగోనిచెర్వు గ్రామ పరిధిలో గల నోష్ ల్యాబ్స్లో రియాక్టర్ లీకేజీతో జరిగిన పేలుడులో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడం గ్రామానికి చెందిన ముశం లక్ష్మణ్కుమార్, ఖమ్మం జిల్లా ముదికొండ గ్రామానికి చెందిన మిరికంటి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కూడా ఇదే పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు గాయపడ్డారు. తనిఖీలు చేయాల్సి ఉన్నా.. గత మూడేళ్ల కాలంలో వెలిమినేడు పరిధిలోని హిండస్, దశమి, రిత్వీక్ బయో ఫ్యూయల్స్ పరిశ్రమల్లో, గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని శ్రీపతి ల్యాబ్స్, ఆరేగూడెం పరిధిలోని వేస్టేజ్ మేనేజ్మెంట్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఎన్నో పేలుడు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరిగినప్పడు గాయపడిన, మృతి చెందిన వారి వివరాలను ఆయా పరిశ్రమల యజమాన్యాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తుండటంతో ప్రమాదం జరిగినప్పుడు వారిని గుట్టుచప్పుడు కాకుండా వారి ఇంటికి పంపించి వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పరిశ్రమల శాఖల అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫ తరచూ జరుగుతున్న ప్రమాదాలతో భయాందోళనలో కార్మికులు ఫ భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలు ఫ కొరవడిన అధికారుల పర్యవేక్షణ -
ఇక్కడ ధర తగ్గింది
ఆంధ్రా ధాన్యం వచ్చింది.. మిర్యాలగూడ: యాసంగి సీజన్లో కోతలు ప్రారంభం కావడంతో మిర్యాలగూడ పరిసర ప్రాంతాలతోపాటు ఉమ్మడి నల్లగొండ నుంచి మిర్యాలగూడ రైస్ మిల్లులకు ధాన్యం భారీగా వస్తోంది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి డీసీఎం లారీల ద్వారా ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీప ప్రాంతాల రైతుల పేరుతో మిర్యాలగూడ రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. రూ.1800 నుంచి రూ.2వేల వరకు కొనుగోలు చేసి మిల్లులకు క్వింటాకు రూ.2200 చొప్పున బస్తాతో సహా మిల్లు వద్దకు చేరుస్తున్నారు. దీంతో మిల్లర్లు స్థానిక రైతుల నుంచి పచ్చ గింజ, తాలు ఎక్కువగా ఉందనే సాకుతో ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన ధాన్యం తెచ్చినప్పటికీ మిల్లర్లు సిండికేట్గా మారి కొర్రీలు పెట్టి ధరలను తగ్గించి రైతులను మోసగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో మిషన్ల ద్వారా కోసిన ధాన్యాన్ని వెంటనే విక్రయించుకోక తప్పడం లేదని పేర్కొంటున్నారు. గత్యంతరం లేక మిల్లర్లు చెప్పిన ధరకే.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు నుంచి సన్న రకం ధాన్యాన్ని అక్కడి దళారుల ద్వారా మిర్యాలగూడ రైస్ మిల్లులకు రోజుకు సుమారు 300 డీసీఎంలు, లారీల ద్వారా ప్రతిరోజు రైస్ మిల్లులకు చేరుతున్నాయి. గత 25రోజుల క్రితం క్వింటాకు రూ.2750కు పైగా ధర పలకగా ఆంధ్రా ధాన్యం రావడంతో ప్రస్తుతం రూ.2350, రూ.2450 నిర్ణయించారు. గత్యంతరం లేక మిల్లర్లు చెప్పిన ధరకే రైతులు అమ్మాల్సి వస్తోంది. అమ్మిన ధాన్యానికి కూడా డబ్బులు ఇవ్వకుండా 15రోజులు, నెల వాయిదాలతో తెల్ల చీటిపై రాసి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఫ రైతుల పేరిట రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్న దళారులు ఫ స్థానిక రైతుల ధాన్యానికి ధర తగ్గిస్తున్న మిల్లర్లు -
డిజిటల్ సేవలపై ఢిల్లీ అధికారుల పరిశీలన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో డిజిటల్ సేవలను ఢిల్లీకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈ గవర్నెన్స్ అధికారుల బృందం శుక్రవారం పరిశీలించింది. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రదానం చేసే జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డుల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మికత, పర్యాటక కేటగిరీలో తెలంగాణ నుంచి ఎంపికై ంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలో అమలవుతున్న ఈ ఆఫీస్, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆన్లైన్ సేవలను, ఈ హుండీ, కంప్యూటరైజేషన్, కియాస్క్ మిషన్ల ద్వారా భక్తులు పొందుతున్న సేవలు, వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. భవిష్యత్తులో పూర్థిస్థాయి డిజిటలైజేషన్ చేసేంఉదకు కలిగి ఉన్న అవకాశాలను, తదితర పరిపాలన నిర్వహణ తీరును పరిశీలించి నివేదికను రూపొందించారు. యాదగిరి దేవస్థానం అవార్డుకు ఎంపిక అయ్యేందుకు పూర్థి స్థాయి అవకాశాలు ఉన్నాయని పరిశీలనకు వచ్చిన అధికారులు రాకేష్, రాజేష్లు తెలిపారు. దేవస్థానంలో అమలవుతున్న సేవలన్నీ సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నారు. -
ఆంధ్రా ధాన్యం రాకుండా అధికారుల ప్రత్యేక డ్రైవ్
ఆంధ్రా ప్రాంతం నుంచి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు పౌర సరఫరాల, పోలీసు, ట్రాన్స్పోర్ట్ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం మిర్యాలగూడ మండల పరిధిలోని ఆలగడప టోల్ గేట్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్రా నుంచి ధాన్యం లారీలు తెలంగాణలోకి వస్తున్నాయనే సమాచారం మేరకు చెక్పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం సుమారు 70 లారీల మేరకు తనిఖీ చేయగా ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది ఏ మిల్లులకు వెళ్తుంది, రైతుల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కోదాడ, సూర్యాపేట, గరిడేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతుల పేరిట వేబిల్లులతో రావడంతో వాటిని వదలివేశారు. ఈ తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్, ఎంవీఐ చంద్రశేఖర్, రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య, ఆర్.సైదులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
చివ్వెంల(సూర్యాపేట) : మండల పరిధిలోని ఎంజీనగర్ తండాలో శుక్రవారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రత్నావత్ ఆనంద్– మంజుల పెద్ద కుమారుడు రత్నావత్ మణిభార్గవ్ (22) డిగ్రీ వరకు చదివి, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగా గురువారం ఆటోలో కిరాయికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళకు చెందిన వ్యవసాయ భూమిలో మణిభార్గవ్ మృతి చెంది ఉన్నాడు. చుట్టుపక్కల రైతులు గమనించి తల్లిదండ్రులకు, గ్రామస్థులకు సమాచారం అందించారు. పోలీసులకు విషయం తెలపడంతో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐలు కనకరత్నం, బత్తిని శ్రీకాంత్, గోపి కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. వివాహేతర సంబంధమే కారణమా? మృతుడు మణిభార్గవ్ గత రెండు సంవత్సరాలుగా గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి ఆ మహిళ ఫోన్ చేయడంతో మణిభార్గవ్ అక్కడకు వెళ్లినట్లు సమాచారం. మహిళతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త గమనించడంతో, ఇద్దరు కలిసి హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సంఘటన స్థలంలో కత్తులు లభ్యం కావడం, వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళ కనిపించకపోవడంతో భార్గవ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మహిళను వేధించిన వ్యక్తిపై కేసు
అడ్డగూడూరు: ఉపాధి హామీ పనుల్లో మహిళను వేధించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలో తాత్కాలిక ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఈదుల రమేష్ అనే వ్యక్తి తనతో అసభ్యకరంగా మాట్లాడాడని అదే గ్రామంలోని ఓ మహిళా కూలీ వాపోయింది. తన కోరిక తీరిస్తేనే ఉపాధి పనులకు రానిస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. గతంలో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడిన సమయంలో స్క్రీన్షాట్ తీసి ఫొటోను సోషల్మీడియాలో పోస్టు చేశాడని, వాట్సాప్ డీపీగా కూడా పెట్టాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పార్కింగ్ చేసిన రెండు బైక్లు చోరీకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పట్టణంలో గురువారం అర్ధరాత్రి పార్కింగ్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. పట్టణ కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల క్రాంతి మొబైల్ షాప్ ఎదురుగా పార్కింగ్ చేసిన షేక్ మగ్బూల్కు చెందిన బైక్, అదేవిధంగా జేబి కాలనీలో వైన్స్ ఎదుట ఉన్న కాలనీలో ఉన్న నరేష్కు చెందిన బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వాహన యజమాని షేక్ మగ్బూల్ ఉదయం ఐదు గంటలకు తన వాహనం కోసం వచ్చి చూడగా బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ అజ్మీరా రమేష్ దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని అడ్డగించి..ఫ బైక్తోపాటు సెల్ఫోన్ చోరీ మిర్యాలగూడ టౌన్ : వాహనాన్ని అడ్డగించి బైక్తో పాటు సెల్ఫోన్ ఎత్తుకెళ్లిన సంఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది. ముల్కలకాలువ గ్రామానికి చెందిన మహేష్ బైక్పై మిర్యాలగూడకు వెళ్తుండగా రాయినిపాలెం గ్రామ శివారులో గుర్తు తెలియని దుండుగులు 8 మంది దారిలో వాహనాన్ని అడ్డగించారు. అతడి బైక్తో పాటు సెల్ఫోన్ కూడా ఎత్తుకెళ్లారు. స్థానికులు వారిని వెంబడించగా ఒకరు పట్టుబడ్డారు. మిగిలిన ఏడుగురు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి మిర్యాలగూడ రూరల్ పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. కాపురానికి తీసుకెళ్లడం లేదని.. ఫ భర్త ఇంటి ముందు మౌన పోరాటం మోతె : కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన మోతె మండంలోని ఉర్లుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఉర్లుగొండ గ్రామానికి చెందిన కోళ్ల వీరభద్రం –పద్మ దంపతుల కుమారుడు కోళ్ల సాగర్.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన సిరికొండ శ్రీలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన సాగర్ గత కొంత కాలంగా తన తల్లి ఇంటి వద్దనే తనను వదిలేశాడని, కాపురానికి తీసుకెళ్లడం లేదని పేర్కొంటూ అత్తింటి ముందు మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. -
భార్య పుట్టింటికి వెళ్లడంతో..
నూతనకల్ మండల పరిధిలోని పెదనెమిల గ్రామానికి చెందిన చింతమళ్ల కార్తీక్(28) కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థలతో అతడి భార్య మౌనిక తన పిల్లలను తీసుకొని రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన కార్తీక్ ఇంటిలో ఉరివేసుకున్నాడు. పక్క ఇంటిలో నిద్రిస్తున్న తల్లి రామనర్సమ్మ చూసి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి అతడిని కిందకి దించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లి రామనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
ప్రమాద ఘటనపై విచారణ
బొంగోనిచెర్వు గ్రామ పరిధిలోని నోష్ ల్యాబ్స్లో ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్ చంద్రశేఖర్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం శుక్రవారం రసాయన పరిశ్రమను సందర్శించి రియాక్టర్ లీకేజీ అయిన బ్లాక్–2ను పరిశీలించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరిశ్రమలోని కార్మికుల భద్రత ప్రమాణాలపై, పరిశ్రమ నిర్వహణ అనుమతులు, నిర్మాణ అనుమతులపై నివేదిక ఇవ్వాలని ఫ్యాక్టరీస్ ఆఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీదేవిని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగిందా.. మానవతప్పిదంతో జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. వారి వెంట ఆర్డీఓ అశోక్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ ఉన్నారు. -
భూమిలో కర్బన శాతాన్ని పెంచాలి
పెద్దవూర: భూమిలో కర్బన శాతాన్ని (సేంద్రియ పదార్థాల పరిమాణం) పెంచడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చని భూ పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త అరిఫ్ఖాన్ అన్నారు. శుక్రవారం పెద్దవూర మండలంలోని పులిచర్ల గ్రామంలో రైతులకు ఈ– బయోచార్ సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన కల్పించి మాట్లాడారు. ఈ– బయోచార్ తయారీలో 9 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో గుంతను ఏర్పాటు చేసుకుని వానిలో పత్తి కర్రలు గాని, మొక్కజొన్న కర్రలు కాని, తుమ్మచెట్టు కట్టెలు కాని దేనితోనైనా ఈ– బయోచార్ తయారు చేయొచ్చని తెలిపారు. వీటితో సేంద్రియ ఎరువు తయారవుతుందని, ఇది నర్సరీ మొక్కలకు, పత్తి, వరి, మిరప, బత్తాయి, నిమ్మ వంటి ఏ పంటకై నా వేసుకోవచ్చని పేర్కొన్నారు. వేరుకు గాలి తగిలి గాలిలో ఉన్న పోషకాలను కూడా వేరు తీసుకుని మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. వానపాములు, మిత్ర సూక్ష్మజీవులు పెరిగి చీడపీడలు, తెగుళ్లు రాకుండా ఉంటుందని తెలిపారు. దీంతో పంట నాణ్యత, ఉత్పత్తి పెరుగుందని తెలిపారు. కార్యక్రమంలో చుండూరు అనురాధ, గడ్డంపల్లి భిక్షంరెడ్డి, ముత్యంరెడ్డి, చెన్నారెడ్డి, విజయానందరెడ్డి పాల్గొన్నారు. -
లక్ష్యం 5,467.. తీసుకుంది 467
భువనగిరి: మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార(సర్వైకల్) క్యాన్సర్ను నిరోధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీలో జిల్లా వెనుకంజలో ఉంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.14–15 ఏళ్ల మధ్య బాలికలకు టీకాలు వెస్తున్నారు. తొలి విడతలో భాగంగా జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ సీహెచ్సీలలో ప్రారంభించారు. రెండో విడతకింద గత నెల 30న జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదలు పెట్టారు. నెల రోజుల్లో ఎనిమిది శాతానికిపైగా.. జిల్లాలో 5,467 మంది కిశోర బాలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో చాలా మంది 9,10 తరగతుల వారే. వీరు ప్రస్తుతం పరీక్షల బిజీలో ఉన్నారు. దీంతో కార్యక్రమం అంచనా మేరకు విజయవంతం కావడం లేదు. మూడు నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో నెల రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 467 మంది బాలికలు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రారంభంలో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం పండుగలు, పరీక్షల నేపథ్యంలో వెనుకబడింది. ఇంకా రెండు నెలల్లో 5వేల మంది బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలున్నా మహళలు కొన్ని పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్బారిన పడుతుంటారు. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే క్యాన్సర్కు దారి తీసే ప్రమాదం ఉంది. ప్రధానంగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఈ టీకా ఉపయోగపడుతుంది. స్పందన అంతంతే.. 14–15ఏళ్ల బాలికల్లో అత్యధికులు ప్రస్తుతం పది పరీక్షలకు హాజరవుతున్నారు. దీనికి తోడు ఈ నెల 8వ తేదీ నుంచి 9వ తరగతి విద్యార్థులకు సైతం పాఠశాలల్లో ఎస్ఏ–2 ప్రారంభంకావడంతో పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నేపథ్యంలో టీకా తీసుకుంటే ఏవైనా ఆరోగ్య సమస్యలు రావొచ్చని చాలా మంది బాలికలు వెనుకంజ వేస్తున్నారు. వైద్యాధికారులు కూడా పాఠశాలలు, కేజీబీవీల్లో అవగాహన కల్పిస్తున్నా స్పందన తక్కువగానే ఉంది. హెచ్పీవీ వ్యాక్సినేషన్లో వెనకంజ ఫ నెలరోజుల్లో ఎనిమిది శాతానికిపైగా నమోదు ఫ అవగాహన కల్పిస్తున్నా ఆసక్తిచూపని బాలికలు కిశోర బాలికలు హెచ్పీవీ టీకాలు వేసుకోవాలి. ఎలాంటి అపోహల నమ్మవద్దు. భవిష్యత్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి హెచ్పీవీ వ్యాక్సిన్ తోడ్పడుతుంది. తల్లిండ్రులు వారి పిల్లలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించేందుకు ముందుకు రావాలి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు జిల్లాలో వివిధ శాఖల సమన్వయంతో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం. – రామకృష్ణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి -
పాల బిల్లుల కోసం సొసైటీకి తాళం
ఆలేరు: పాడి రైతులు కన్నెర చేశారు. పాల బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ గురువారం ఆలేరు పట్టణంలోని కొలనుపాక మార్గంలో ఉన్న శ్రీకృష్ణ పాల సొసైటీకి తాళం వేశారు. అనంతరం సొసైటీ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సొసైటీ డైరెక్టర్ జెల్లి నర్సింహులు మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని 40మంది రైతులకు ఐదు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 15రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా...తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. మదర్డెయిరీ నిర్వాకం వల్ల రైతులు పాడి ఆవులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొందన్నారు. ఇప్పటికై నా పెండింగ్ పాల బిల్ల్లులు చెల్లించపోతే మదర్ డెయిరీ కార్యా లయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బిల్లులు చెల్లించే వరకు పాలు పోయబోమని రైతులు స్పష్టం చేశారు. సొసైటీ కార్యదర్శి రత్నం మదర్ డెయిరీ అధికారులతో మాట్లాడి త్వరగా బిల్లుల చెల్లించేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించి పాలు పోశారు. ఈకార్యక్రమంలోమొరిగాడి అశోక్, మొరిగాడి దేవేందర్, జూకంటి శంకర్, పాకాల విఘ్నేశ్వర్, పాపయ్య, చిమ్మిరవి, సీసా రేణుక, చంద్రయ్య, అనిమిరెడ్డి పాల్గొన్నారు.ఫ ఆలేరులో పాడి రైతుల ధర్నా -
ప్రైవేట్ వద్దు.. ప్రభుత్వ బడి ముద్దు
భువనగిరి: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా జిల్లాలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో గత మార్చి నుంచే కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా బడిబాటను జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తారు. కానీ గత ఏడాది నుంచి ముందస్తుగానే నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. జిల్లాలో 715 పాఠశాలలు జిల్లాలో మొత్తం 715 పాఠశాలలున్నాయి. ఇందులో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 163, ప్రాథమికోన్నత పాఠశాలు 68, ప్రాథమిక పాఠశాలలు 484 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం 37,254 మంది విద్యార్థులు ఉన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమం ద్వారా బడిబయట ఉన్న 5,262 మంది విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. ఈ ఏడాది కూడా.. గత ఏడాది కంటే మించి బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ సూచించింది. దీంతో జిల్లాలో కొన్ని పాఠశాలల్లో ముందస్తుగానే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన బోధన వివరాలను తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతిఽనిధుల సహకారం తీసుకుంటున్నారు. ఊరూరా ముందస్తు బడిబాట ఫ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, బోధనను వివరిస్తున్న ఉపాధ్యాయులు ఫ బడి బయట, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల గుర్తింపు ఫ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా కార్యాచరణ గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధన, డిజిటల్ తరగతులు ఉన్నాయి. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. – సత్యనారాయణ, డీఈఓప్రస్తుతం ఒంటి పూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతున్నాయి. తాజాగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ–2 ప్రారంభమైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు ఉదయం లేదా మధ్యాహ్నం తర్వాత గానీ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సారి పీఎంశ్రీ కింద 10 ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ. 4వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఆయా పాఠశాలల్లో పై తరగతులకు వెళ్లే వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రచారం నిర్వహించనున్నారు. -
పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు
భూదాన్పోచంపల్లి : హైదరాబాద్లోని టీ హబ్లో నిర్వహించిన రివర్స్ బయ్యర్, సెల్లర్ మీట్లో పాల్గొన్న శ్రీలంక దేశానికి చెందిన వస్త్ర వ్యాపారులు ఇర్ఫాన్, సాజిద్ ఇక్కత్ వస్త్రాల తయారీ తీరుతెన్నులను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు గురువారం పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్ వస్త్రాల తయారీ, రంగులద్దకం, చిటికి కట్టడం, ఆసు యంత్రం, గ్రాఫ్పై టై అండ్ డై విధానంలో డిజైన్లు వేయడం తదితర ప్రక్రియలను పరిశీలించారు. ఈ వారు మాట్లాడుతూ.. శ్రీలంకలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ప్రమోట్ చేస్తామని అన్నారు. అనంతరం జగదీశ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి హేమ మాట్లాడుతూ.. శ్రీలంకలో చాలా మంది మహిళలు చీరలు ధరిస్తారని, కానీ ఇప్పటి వరకు ఆ దేశానికి పోచంపల్లి చేనేత వస్త్రాలు ఎగుమతి కాలేదని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో శ్రీలంకలో కూడా ఇక్కత్ వస్త్రాలకు మార్కెటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వారి వెంట టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, ఈపూరి ముత్యాలు, గంజి బాలరాజు, సీత లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. టూరిజం పార్కు సందర్శించిన జపనీయులు పోచంపల్లిని జపాన్ దేశానికి చెందిన ఇద్దరు పర్యాటకులు సందర్శించారు. స్థానిక టూరి జం పార్కును సందర్శించి అక్కడ మ్యూజియంలో మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. కార్మికుల నైపుణ్యాలను కొనియాడారు. ఫ చేనేత కార్మికుల నైపుణ్యాలను కొనియాడిన శ్రీలంక, జపాన్ దేశస్తులు -
రసాయన పరిశ్రమలో మంటలు
చిట్యాల : మండలంలోని పిట్టంపల్లి గ్రామ పరిధిలోని నోష్ ల్యాబ్స్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ల వద్ద గురువారం సాయంత్రం మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమలోని బ్లాక్–2లో ల్యాబ్స్లోని రియాక్టర్ల వద్ద అకస్మాత్తుగా మంటలు లేచాయి. దీంతో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును పరిశ్రమ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఫ ఇద్దరు కార్మికులకు గాయాలు -
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
మిర్యాలగూడ టౌన్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్ధశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ‘బేసిక్ స్టాటిస్టిక్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఎకనామిక్స్’ అనే అంశంపై అధ్యాపకులకు రెండు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్షాప్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమన్నారు. భవిష్యత్ తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఇటువంటి శిక్షణ తరగతులకు హాజరై సబ్జెక్ట్పై పట్టును సంపాదించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాభివృద్ధి కోసం అనేక సంస్కరణలను ప్రవేశపెడుతుందన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అత్యుత్తమ ఉపాధ్యాయులు రాబోయే తరాలను మార్చగలుగుతారని అన్నారు. స్టాటిస్టిక్స్ లాంటి కఠినతరమైన సబ్జెక్టుని విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా బోధించాలని సూచించారు. వర్క్షాప్ డైరెక్టర్ గుమ్మడి నరేష్ను అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున్రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్షాప్లో రీజినల్ డైరెక్టర్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ హైదరాబాద్ ప్రొఫెసర్ సుజిత్ కుమార్ మిశ్రా, ప్రొఫెసర్ రామకృష్ణ, గుమ్మడి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ పురుషోత్తం -
ట్రేడ్ లైసెన్స్ పేరిట సైబర్ వల
భువనగిరిటౌన్ : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వలలో సామాన్యులే కాకుండా చదువుకున్న వారు, ప్రముఖులు కూడా చిక్కుకునేలా పక్కా స్కెచ్ వేస్తున్నారు. తాజాగా భువనగిరి పట్టణంలో మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యాపారులకు టోకరా పెట్టేందుకు ప్రయత్నించారు. వివరాలు.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీనిని గమనించిన సైబర్ నేరగాళ్లు.. మున్సిపల్ రికార్డుల్లోని లైసెన్స్దారుల వివరాలు, వారి ఫోన్ నంబర్లను సేకరించారు. బుధవారం పట్టణంలోని ప్రముఖ వైద్యుడు చావా రాజ్కుమార్కు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను మున్సిపల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని.. మీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయి ఉందని నమ్మబలికాడు. వెంటనే రూ.9,940 ఫోన్ పే లేదా గూగుల్ పే చేయాలని స్కానర్ పంపించాడు. లేదంటే లైసెన్స్ రద్దవుతుందని, జరిమానాలు పడతాయని ఒత్తిడి చేశాడు. డాక్టర్ అప్రమత్తతతో బయటపడ్డ బాగోతం సాధారణంగా మున్సిపల్ కార్యాలయంలోనే నేరుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించే సదరు డాక్టర్కు అనుమానం వచ్చింది. వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించగా.. తాము ఎవరికీ ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించమని చెప్పమని వారు స్పష్టం చేశారు. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని గ్రహించిన డాక్టర్ తనకు ఫోన్ చేసిన నంబర్కు కాల్ చేయగా అప్పటికే స్విచ్చాఫ్ చేశారు. ఇదే తరహాలో భువనగిరి పట్టణంలోని మరికొంత మంది వ్యాపారులకు కూడా ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నమ్మకండి.. మోసపోకండి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్న ఘటనపై భువనగిరి ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ కొండల్రావు స్పందిస్తూ వ్యాపారులకు కీలక సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు ఎప్పుడూ ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేయమని కోరరని పేర్కొన్నారు. వ్యాపారస్తులు తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజులను కేవలం మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లో లేదా వార్డు ఆఫీసర్లకు నేరుగా లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు. ఎవరైనా మున్సిపల్ అధికారులమని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే మున్సిపల్ కార్యాలయంలో లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫ మున్సిపల్ అధికారులమంటూ వ్యాపారులకు ఫోన్లు చేస్తున్న కేటుగాళ్లు ఫ ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఒత్తిడి -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
యాదగిరిగుట్ట రూరల్ : ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామ స్టేజీ సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ముడుగుల సరళ(45) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గురువారం ఉదయం బాహుపేట పరిధిలోని ఓ వెంచర్లో పనికి వెళ్లింది. సాయంత్రం వంగపల్లి గ్రామానికే చెందిన ముంజ స్వామి ద్విచక్ర వాహనంపై ఇద్దరూ కలిసి వస్తుండగా.. బాహుపేట స్టేజీ సమీపంలో గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరళ అక్కడికక్కడే మృతిచెందింది. స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
గేదెను ఢీకొని నిలిచిపోయిన రైలు
ఫ తిప్పర్తి సమీపంలో ఘటన తిప్పర్తి : గేదెను ఢీకొని రైలు ఆగిపోయింది. ఈ ఘటన తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం రైల్వే గేటు వద్ద గురువారం జరిగింది. స్థానికులు, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు–సింహద్రి ఎక్స్ప్రెస్ రైలు గుంటూరు నుంచి వికా రాబా ద్కు వెళ్తుండగా.. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం రైల్వే గేటు సమీపంలో గేదెను ఢీకొట్టింది. దీంతో గేదె రైలుకు, పట్టాలకు మధ్యన ఇరుక్కుపోవడంతో 20 నిమిషాల పాటు రైలు ఆగింది. గేదెను పక్కకు తొలగించడంతో రైలు తిరిగి కదిలింది. ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి మిర్యాలగూడ : బాలుడు సైకిల్ తొక్కుతూ ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన దామరచర్ల మండలం వాడపల్లిలో గురువారం జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లి గ్రామానికి చెందిన కిలారి సరిత, బంగారి దంపతుల కుమారుడు కుందన్ సాయి(6)కి మూడు రోజుల క్రితమే తల్లిదండ్రులు కొత్త సైకిల్ కొనిచ్చారు. గురువారం గ్రామంలో కుందన్ సాయి సైకిల్ తొక్కుతుండగా.. నీటిని తీసుకెళ్తున్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుని మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు.. రాజాపేట : తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన రాజా పేట మండలం కుర్రా రం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్రారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బూర్గు పోశెట్టి(60) రోజుమాదిరిగానే గురువారం మధ్యాహ్నం తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. మోకు జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన పోశెట్టిని చుట్టుపక్కల రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోశెట్టికి భార్య అనసూర్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. టాంగా కార్మికుడికి తీవ్ర గాయాలు యాదగిరిగుట్ట : గుర్రం ఎదురు తిరగడంతో యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని పాతగుట్టలో టాంగా కార్మికుడికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన టాంగా కార్మికుడు యాదగిరి గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు భక్తులను టాంగాలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అక్కడ భక్తులను దించి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో గుర్రం ఎదురు తిరిగింది. దీంతో యాదగిరి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని యాదగిరికి ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విద్యా ప్రమాణాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి రోజూ వంట సామగ్రి, బియ్యం, సరుకులను పరిశీలించి గడువు తేదీలను సరిచూసుకోవాలన్నారు. పాఠశాల ఆవరణంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠ్యాంశాల పై అవగాహన వచ్చేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. అంతకు ముందు పాఠశాలలోని వంట గది, వంట సామగ్రి, ఆహారం, పరిసరాలను పరిశీలించారు. విద్యా ర్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఉన్నారు. రోడ్డు భద్రత.. అందరి బాధ్యతసాక్షి, యాదాద్రి : రోడ్డు భద్రత అందరి బాధ్యత అని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ – అలైవ్ వారోత్సవాల నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీసీపీలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో కలెక్టర్, ఎస్పీ అకాంశ్యాదవ్, అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రోడ్డు భద్రత కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీస్ శాఖ తరపున అరైవ్– అలైవ్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
నకిలీ నోట్లు అంటగడుతున్న విదేశీయుడి అరెస్టు
నల్లగొండ : అమాయకులను నమ్మించి నకిలీ కరెన్సీని అంటగడుతున్న విదేశీయుడిని నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్పీ శరత్చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. ఆఫిక్రాలోని మాలి దేశానికి చెందిన సాల్మన్ ఉమ డాలియా, గోటియా డౌన్గా రెండేళ్ల క్రితం ఇండియాకు వచ్చారు. కొంతకాలం బెంగళూరులో నివాసం ఉండి వివిధ వ్యాపారాలు చేశారు. వీరితో పాటు మరికొందరు విదేశీయులు కలిసి వాట్సాప్ గ్రూపుల్లో పరిచయాలు పెంచుకుని అమాయకులకు నకిలీ కరెన్సీ నోట్లు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని పథకం రచించారు. వీరు అమాయకులకు వాట్సాప్ కాల్ చేసి.. రూ.లక్ష అసలు కరెన్సీ నోట్లు తమకు ఇస్తే బదులుగా రూ.5లక్షల విలువైన నల్లటి రంగు పూసిన రూ.500 నోట్ల కట్టలు ఇస్తామని నమ్మిస్తారు. ఆ నల్లటి రంగు పూసిన కాగితాలను ప్రత్యేక రసాయనంతో కడిగి నిజమైన నోటుగా మారినట్లు చేసి చూపిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 9న తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్ద ఓ దాబాలో వంగూరి జానయ్య అనే వ్యక్తిని గోటియా డౌన్గా పరిచయం చేసుకున్నాడు. అతడి నుంచి రూ.లక్ష అసలు కరెన్సీ నోట్లు తీసుకుని.. రూ.5లక్షల విలువైన నలుపు రంగు పూసిన రూ.500 నోట్ల కట్టలను, ప్రత్యేక రసాయనాన్ని అంటగట్టాడు. జానయ్య ఇంటికి వెళ్లి గోటియా డౌన్గాలో ఇచ్చిన నోట్ల కట్టలను ప్రత్యేక రసాయనంతో కడిగి చూడగా అవి తెల్ల కాగితాలుగా మారాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన జానయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్నేహితుడి కోసం పిలిపించి.. జానయ్య.. తన స్నేహితుడు కూడా రూ.2లక్షలు ఇస్తాడని గోటియా డౌన్గాకు సమాచారం ఇచ్చాడు. దీంతో గోటియా డౌన్గా గురువారం తిప్పర్తి రైల్వే స్టేషన్ వద్దకు రాగా జానయ్య, అతడి స్నేహితుడు కలిసి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి అరెస్ట్ చేసి అతడి నుంచి సెల్ఫోన్, రసాయన బాటిల్, నలుపు రంగు పూసిన రూ.500 నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, తిప్పర్తి ఎస్ఐ శంకర్ను ఎస్పీ అభినందించారు. -
మీ సేవ చార్జీలు పెంపు
ధ్రువపత్రం చెల్లించే ధర (రూ.లలో) ఆదాయ ధ్రువీకరణ పత్రం 80 కుల ధ్రువీకరణ పత్రం 80 నివాస ధ్రువీకరణ పత్రం 80 ఆహార భద్రత కార్డుకు 80 భూ భారతి ఈ కేవైసీ 80 కొత్త విద్యుత్ కనెక్షన్ 80 క్రీమీ, నాన్ క్రీమీ లేయర్ అప్లికేషన్ 80 ఈసీ 62 ఫార్మర్ రిజిస్ట్రీ 18 కోర్టు కేసు ఈ కేవైసీ 62 బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ 62 ఈ–పాస్ బయోమెట్రిక్ 35 త్రైమాసిక పన్ను 62 లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ 62 భువనగిరి : రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు వివిధ ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ సేవలను అందించే మీ సేవ కేంద్రాల్లో సర్వీస్ చార్జీలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు సోమవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. అయితే ఈ నెల 1వ తేదీ నుంచే పెంచిన చార్జీలను అమలు చేయాలనుకున్నా.. వివరాలు వెబ్సైట్లో నమోదు కాలేదు. దీంతో 36 గంటల పాటు మీ సేవ వెబ్సైట్ను నిలిపేసి అప్డేట్ చేశాక సేవలు కొనసాగిస్తున్నారు. పెంచిన చార్జీల వల్ల రైతులు, విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది. ఏ కేటగిరీకి ఎంత.. మీ సేవ కేంద్రాల్లో అందించే సేవలను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ సేవలకు(పహాణీ, ఈ కేవైసీ వంటి తక్షణ సేవలు) గతంలో కనీస చార్జీ రూ.35 ఉండగా.. ఇప్పుడు దానిని రూ.62కు పెంచారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయ్యే బీ కేటగిరీ సేవల(కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు) చార్జీని రూ.80గా నిర్ణయించారు. 78 శాతం వరకు పెంపు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సుమారు 62 మీ సేవ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల ద్వారా 350కి పైగా సేవలందిస్తున్నారు. ఇందులో అత్యధికంగా ఆధాయం, కులం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రతి నెలా సగటున సుమారు 3వేలకు పైగా దరఖాస్తులు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ గణంకాలు తెలియజేస్తున్నాయి. వీటితో పాటు వివిధ రకాల ప్రభుత్వ పథకాల కోసం మీ సేవ కేంద్రాలలోనే దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో మీ సేవల చార్జీలు పెంచడంతో ప్రతి సర్వీస్పై 78 శాతం వరకు ప్రజలపై అదనపు భారం పడుతుంది. గతంలో ఒక్కో ధ్రువీకరణ పత్రం పొందడానికి రూ.45 తీసుకోగా ఇప్పుడు ఏకంగా రూ.80 వరకు పెంచారు. కొన్ని మీ సేవ కేంద్రాలలో పెంచిన ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అదనంగా రూ.15 నుంచి రూ. 20లు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చార్జీల పట్టికను ఏర్పాటు చేయాలి భూములకు సంబంధించిన రికార్డులు, విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లడం తప్పనిసరిగా మారింది. పెంచిన ధరలతో సామాన్యులకు భారం తప్పేలా లేదు. అయితే పెరిగిన ధరల పట్టికను మీ సేవ కేంద్రాలలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫ ఒక్కో ధ్రువపత్రంపై 78శాతం అదనపు భారం ఫ ధ్రువీకరణ పత్రం పొందాలంటే రూ.80 చెల్లించాల్సిందే -
నేడు చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ
భువనగిరిటౌన్ : నేతన్న బీమా, నేతన్న భరోసా, రుణ మాఫీ పథకాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి బసవలింగ ఫంక్షన్ హాల్లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరవుతారని వివరించారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు శ్రద్ధగా బోధించాలిభువనగిరి: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందిస్తున్న ఉపకరణాలను వినియోగించి శ్రద్ధగా బోధించాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. గురువారం భువనగిరి పట్టణంలోని భవిత కేంద్రంలో నిర్వహించిన మండలాల సహిత విద్యా బోధకుల సమావేశానికి హాజరై మాట్లాడారు. వారంలో రెండు రోజుల పాటు అందించే ఫిజియోథెరపీని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం బోధనోపకరణాలు, వ్యక్తిగత విద్యా ప్రణాళికలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సహాయ సమన్వయకులు కిరణ్కుమార్రెడ్డి, బోధకులు రవీందర్రెడ్డి, సహిత విద్యాబోధకులు పాల్గొన్నారు. రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలిభువనగిరి: ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలోని విద్యుత్ డీఈ కార్యాలయం ఆవరణంలో విద్యుత్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టి నిరవధిక సమ్మేకు సీఐటీయూ నాయకులు మద్దుతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డివిజన్ చైర్మన్ ఇంజ మహేష్, కన్వీనర్ బోట్ల రమేష్, కో కన్వీనర్ ఎడ్ల వెంకటేష్, నాయకులు పాండరిరెడ్డి, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణభువనగిరిటౌన్ : జిల్లా కోర్టును రామన్నపేటకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా, కనీస సౌకర్యాలు లేని చోటుకు కోర్టును తరలిస్తే ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టు న్యాయమూర్తులను కలిసి విన్నవించామని, తరలింపు ప్రక్రియ ఆపేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిసంగి విద్యాసాగర్, మేడబోయిన యాదగిరి, శారద, ఉడుతల సురేష్, పడాల శ్రీనివాస్ పటేల్, పత్తిపాటి ప్రసాద్ రావు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనరసింహుడికి విశేష పూజలు మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం గావించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
భువనగిరి: ఎయిడ్స్ రహిత సమాజమే ప్రతి ఒక్కరి లక్ష్యమని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద ఎయిడ్స్పై అవగాహన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈర్యాలీ జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి జగదేవ్పూర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆస్పత్రిలో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. సబ్ జైలులో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, విజయ్పటేల్, సాగరిక, శైలజ, సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రునాయక్, నిరోష, నితీషా, గాయత్రి, నీడ్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ బాను, సిబ్బంది, ఆశావర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పశువుల్లో రేబిస్ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పెద్దవూర: కుక్కలు మనుషులను, మూగజీవాలను కరవడం వలన రేబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్ వైరస్ ఎక్కువగా పశువుల కేంద్ర నాడీ మండలంపై ప్రభావం చూపడం వలన పశువుల్లో పక్షవాతం, మరణం సంభవిస్తుంది. కుక్క కరిచిన 2–3 వారాల తర్వాత రేబిస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. రేబిస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మండల పశు వైద్యాధికారి నులక నాగార్జున్రెడ్డి వివరించారు. రేబిస్ వ్యాధి ఎక్కువగా కుక్కల ద్వారా సోకుతుంది. అంతేకాకుండా పిల్లులు, ముంగిసలు, నక్కలు తదితర జంతువుల ద్వారా కూడా సోకుతుంది. రాబ్డో వైరస్ క్రిముల వలన సంభవించే ఈ వ్యాధి సోకితే మృత్యువు నుంచి బయట పడడం అసాధ్యం. ఊర కుక్కలు అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, మనుషులు పిచ్చి కుక్క కాటుకు గురై మృత్యువు బారిన పడుతుంటారు. యాంటీ రేబిస్ టీకాలను సకాలంలో వేయించడం వలన ఈ వ్యాధిని అరికట్టవచ్చు. అతిగా స్పందిస్తాయి.. పశువులలో రేబిస్ వ్యాధి ఉగ్ర, శాంత రూపంలోకి సోకి పశువులు 7 నుంచి 10 రోజులలో మరణిస్తాయి. రేబిస్ వ్యాధి ఉగ్ర రూపంలో సోకితే ప్రవర్తన, నడకలో మార్పు ఉంటుంది. యజమానిని పశువులు గుర్తించవు. చిన్న కదలికలకు, శబ్దాలకు కూడా అతిగా స్పందిస్తాయి. అతి జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. రాళ్లు, రప్పలు, కర్రలను నములుతుంటాయి. వస్తువులపై, ఇతర జంతువులపై దాడి చేస్తుంటాయి. కదిలే వస్తువులను చూసి ఉద్రేకానికి గురవుతాయి. వ్యాధిగ్రస్త పశువులను కట్టివేసిన ప్రదేశంలో చుట్టూ గుండ్రంగా తిరుగుతూ గుద్దుకుంటాయి. గిత్తలలో కామోద్రేకం అధికమవుతుంది. రంకె బిగ్గరగా వేస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన ఒకటి, రెండు రోజుల తర్వాత పక్షవాతం సంభివించి మృత్యువాత పడతాయి. చొంగ ఎక్కువగా కారుస్తాయి.. రేబిస్ సోకినప్పుడు పశువులు నడుము వంచి నడిచేటప్పుడు వెనక భాగం ఊగుతూ, తోక ఒక పక్కకు వంచి ఉంటాయి. వ్యాధి సోకినప్పుడు పశువుల నోట్లో నుంచి విపరీతమైన చొంగ కారుతుంది. ముక్కు విరుస్తుంటాయి. గొంతు ప్రాంతంలోని కండరాలకు బిగుసుకుపోయి ఏదో అడ్డుపడినట్లు ఉంటుంది. మేత, నీరు సరిగ్గా తీసుకోవు. తరచూ ఆవలిస్తుంటాయి. ప్రథమ చికిత్స ఇలా చేయాలి.. పిచ్చి కుక్క కరిచిన వెంటనే గాయాన్ని డెటాల్, టింక్చర్ అయోడిన్ వంటి మందులతో శుభ్రపరచాలి. వెంటనే టిటానస్ టాక్సాయిడ్ యాంటి బయోటిక్ ఇంజెక్షన్లు వేయించాలి. గాయానికి 48 గంటలలోపు కుట్టు వేయడం గాని, కట్టుకట్టడం గాని, కాల్చడం గాని చేయరాదు. కుక్కకాటుకు గురైన పశువులను పశువైద్యుల పర్యవేక్షణలో యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు వేయించాలి. వీటిలో రెండు రకాల టీకాలు లభ్యమవుతున్నాయి. టిష్యూకల్చర్ యాంటీ రేబిస్ టీకాలను కుక్క కరిచిన 3, 7, 14, 90వ రోజుల్లో ఆరు ఇంజెక్షన్లు వేయించాలి. ఇక రేబిస్ హెచ్.ఈ.పీ టీకాలను కుక్క కరిచిన రోజు రెండు ఇంజెక్షన్లు, 3, 5 రోజుల్లో ఒక ఇంజెక్షన్ చొప్పున మొత్తం ఐదు ఇంజక్షన్లు ఇవ్వాలి. యాంటీ రేబిస్ టీకాలన్నింటినీ 4–10 డిగ్రీల సెంటీగ్రేడ్ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. పశువులకు కుక్క కరిచిన వెంటనే టీకాలు వేయడం ప్రారంభించాలి. పశువును కరిచిన కుక్కను వెంటనే చంపకుండా పది రోజులు దానిని కట్టివేసి పరిశీలించాలి. పది రోజుల్లో కుక్క దానంతటదే మరణిస్తే రేబిస్ వ్యాధిగ్రస్తమైనదని భావించాలి. ఒకవేళ కుక్క మరణించకపోతే ఆరోగ్యకరమైన కుక్కగా మాత్రం భావించాలి. పశువుల చొంగతో రేబిస్ వైరస్ ఐదు రోజుల పాటు జీవించి వ్యాధిని వ్యాపింపజేస్తుంది. కుక్కకాటుకు గురైన పశువులకు నోటి ద్వారా మందులు, ఆహారం తినిపించే సందర్భంలో వైద్యులకు, రైతులకు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన సందర్భాల్లో పశువులకు నోటి ద్వారా ఆహారం, మందులను తినిపించకూడదు. ఫ పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్రెడ్డి సూచనలు -
మహిళలే బంకు ఓనర్లు
చౌటుప్పల్ : ఇప్పటికే అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు ఇంధన వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు. మగువలే యజమానులుగా పెట్రోల్ బంకు నిర్వహించనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు సైతం మంజూరు చేస్తోంది. నారాయణపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో వనితల ఆధ్వర్యంలో రెండు పెట్రోల్ బంకులు విజయవంతంగా నడుస్తుండడంతో ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరించాలని సంకల్పించింది. ఈనేపథ్యంలో చౌటుప్పల్ మండలానికి ఒక మహిళా పెట్రోల్ బంకు కేటాయించింది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో హైవే వెంట.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 40పెట్రోల్ బంకులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా యాదాద్రిభువనగిరి జిల్లాకు ఒకటి మంజూరుకాగా దానికి చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామానికి కేటాయించారు. దీనికోసం గ్రామంలోని హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి వెంట బొర్రోళ్లగూడెం స్టేజీ ఎదురుగా, వెహికిల్ ఫిట్నెస్ సెంటర్ పక్కన సర్వేనంబర్ 486లో 0–20గుంటల భూమిని గుర్తించారు. భూ కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. త్వరలోనే రెవెన్యూ అధికారులు ఆ భూమిని బంకు ఏర్పాటు కోసం అప్పగించనున్నారు. మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఈ బంకు నడవనుంది. నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పలు ఆయిల్ కార్పొరేషన్లతో ఒప్పందాలు సైతం పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా వీటిని ప్రారంభించేందుకుగాను అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క పెట్రోల్ బంకు ద్వారా సుమారు 20మంది వరకు మహిళలు వ్యాపార రంగంలోకి రానున్నారు. పురుషులు లేకుండా మహిళలే నడుపుకోనున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని షిఫ్టుల్లోనూ మహిళలే పనిచేస్తారు. ఒక్క బంకు ఏర్పాటుకు ప్రభుత్వం 50లక్షల రూపాయలు రుణం అందించనుంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా ఆయిల్ కంపెనీల నుంచి సమకూరే కమీషన్ డబ్బులతోనే బ్యాంకు రుణం తీర్చాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఇప్పటికే నడుస్తున్న బంకులు లాబాల బాటలో ఉండడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బంకులను విస్తరించేందుకు నిర్ణయించి ప్రక్రియను వేగం చేసింది. ఆర్థిక క్రమశిక్షణకు మహిళలు మారుపేరుగా ఉండడంతో బంకుల నిర్వహణలోనూ చక్కగా రాణిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంధన వ్యాపార రంగంలోకి మగువలు ఫ దండుమల్కాపురంలో మహిళా పెట్రోల్ బంకు మంజూరు ఫ నిర్వహణ అంతా మహిళా సమాఖ్యదే ఫ 20గుంటల భూమి గుర్తింపు ఫ రూ.50లక్షల రుణం ఇవ్వనున్న ప్రభుత్వం -
అట్టడుగువర్గాల అభ్యన్నతికి అంబేద్కర్ కృషి
భువనగిరిటౌన్ : సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి పి. సాహితి పేర్కొన్నారు. భువనగిరి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ జ్యోతిర్మయి, ఏఎస్డబ్ల్యూఓ సుమంత్, వార్డెన్లు శైలజ, ఆనంద్, సుని, విశ్వనాథం, సైదులు, జహంగీర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఇటకాల దేవేందర్, సుపపంగశివలింగం, కర్తల శ్రీను, బట్టు రామచంద్రయ్య, బర్రె జహంగీర్, నర్సింహ, రవివర్ధన్, శంకర్, రామకృష్ణ, కుతడి సురేష్ పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో జోడు సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం జోడు సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరి(బీబీనగర్): అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజ కోరారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని 5,6 నంబర్ గల అంగన్వాడీ కేంద్రాలతో పాటు మండలంలోని రామునిగుండ్లతండాలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలంకు అందించే ఆహారాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాయన్నారు. క్రమం తప్పకుండా కేంద్రాలకు వెళ్లి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు కల్పిస్తున్న సదుపాయాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న బాలసదన్, సఖి కేంద్రం భవనాలను ఆమె పరిశీలించారు.ఫ సీ్త్రశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజ -
భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు
సాక్షి, యాదాద్రి : భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. భూభారతి, ప్రభుత్వ భూములు, సాదా బైనామాలు, ఓటరు జాబితా సవరణ , మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోళ్లు, ఆన్లైన్ ఇసుక సరఫరా తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. భూభారతి ద్వారా భూముల రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పారదర్శక సేవలు అందించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కింద ఓటరు జాబితాలను కచ్చితంగా సవరించాలని, బూత్ స్థాయి అధికారుల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని తహసీల్దార్లు కచ్చితంగా అమలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవె న్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
భువనగిరిటౌన్ : భువనగిరి అదనపు జిల్లా కోర్టును రామన్నపేటకు తరలించే నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కనీస సౌకర్యాలు లేని రామన్నపేటకు కోర్టును తరలిస్తే ప్రజలు అనేక ఇబ్బందులుపడతారన్నారు. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లి చీఫ్ జస్టిస్ను కలిసి విన్నవించుకుంటామని చెప్పారు. కోర్టును ఇక్కడే కొనసాగించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్అసోసియేషన్ అధ్యక్షుడు నిసంగి విద్యా సాగర్, మేడబోయిన యాదగిరి, శారద, బార్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి నివారణకు రూ. 88.15లక్షలు
సాక్షి, యాదాద్రి : జిల్లాలో వేసవికాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ అనురాగ్ జయంతి సత్వర చర్యలు చేపట్టారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ 2026లో భాగంగా రూ. 88.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా రైతుల నుంచి అద్దె ప్రాతిపదికన బోర్లను తీసుకోవడం, తాత్కాలిక పైప్లైన్ల ఏర్పాటు, బోర్ల ఫ్లషింగ్, డీపెనింగ్ వంటి పనులను చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. కరుణాకరన్ కు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. క్రీడా శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి: వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు న్విహించేందుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె. ధనుంజయనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు.. 12 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ శిబిరాల నిర్వహణకు సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. సీనియర్, జాతీయ స్థాయి క్రీడాకారులైతే వారు సాధించిన ప్రగతి ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. ఒక్కొక్కరు ఏదైనా ఒక క్రీడకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ శిబిరం నిర్వహించే వారికి గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు శిక్షణ పొందినవారికి గుర్తింపుపత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 8309992451ను సంప్రదించాలని కోరారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరంభువనగిరి: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ హెచ్చరించారు. బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. నిబంధనలు ఉల్లఘించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీ అండ్ పీఎన్డీటీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ యశోద, డాక్టర్ వై. ఇందిరామణి, గైనకాలజిస్ట్ జ్యోతి, శ్రీదేవి, నిర్మల, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుమన్కళ్యాణ్, డిప్యూటీ డీపీఆర్ఓ అరుంధతి, డాక్టర్ ప్రమీల, శివలింగం, నాగరాజు, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది స్వచ్ఛభారత్ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భద్రతా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది బుధవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీ ఎస్పీఎఫ్ ఐజీ స్వాతి లక్రా ఆదేశాలతో యాదగిరి కొండపైన, మెట్ల మార్గం, వైకుంఠద్వారం సమీపంలో చెత్త చెదారాన్ని తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.శేషగిరిరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రదేశమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎస్పీఎఫ్ శాఖ సైతం కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పుచ్చ.. నష్టాల మచ్చ
సంస్థాన్ నారాయణపురం : పుచ్చ సాగు చేసిన రైతులు ఈసారి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఓ పక్క తెగుళ్లు సోకి దిగుబడిపై ప్రభావం చూపగా మరో పక్క చేతికొచ్చిన కొద్ది పాటి పంటకు మార్కెట్లో ధరలేక కుదేలయ్యారు. పుచ్చకాయ కిలో రూ.5 రేటు పలుకుతోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో పశులకు మేతగా వదిలేస్తున్నారు. 150 ఎకరాల్లో సాగు సంస్థాన్నారాయణపురం మండలంలోని రైతులు సుమారు 150 ఎకరాల్లో పుచ్చకాయ పంటను సాగుచేశారు. అలాగే ఒక్క పుట్టపాక గ్రామంలో 70 ఎకరాలకు పైగా పుచ్చసాగైంది. 20 రోజుల క్రితం కురిసిన వర్షానికి పుచ్చ పంటకు తెగుళ్లు సోకాయి. ఆకులకు బూడిద తెగులు వ్యాప్తి చెందింది. దీంతో కాయ సైజు పెరుగుదల నిలిచిపోయింది. రైతుల ఎన్ని మందులు పిచికారీ చేసినా నివారించలేకపోయారు.అలాగే ముందు సాగు చేసిన పుచ్చకాయ సైజు వచ్చినప్పటికీ కాయకు మచ్చ తెగులు వ్యాప్తించింది. దీంతో కాయ పనికిరాకుండా పోయింది. చాలామంది రైతులు పుచ్చ పంటను పశువులకు వదిలి పెట్టారు. పుచ్చ పంట సాగు చేయడానికి ఎకరాకు ఒక్కో రైతు సుమారు రూ.60వేల నుంచి రూ. 70వేల వరకు పెట్టుబడి పెట్టాడు. వాస్తవానికి ఎకరాకు 25క్వింటాళ్ల నుంచి 30క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉంది. కానీ తెగుళ్ల కారణంగా 10క్వింటాళ్ల నుంచి 15క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. గత సంవత్సరం కిలో రూ.15 నుంచి రూ. 20 పలికిన ధర ప్రస్తుతం రూ.5గా ఉంది. హైదారాబాద్కు చెందిన వ్యాపారులు పంటను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రస్తుతం రైతులు పంటను అమ్మకోవడం కష్టంగా మారింది. కొంత మంది రైతులకు మొదట కోత పంట చేతికి వచ్చినప్పటికి, రెండవ కొత పంటకు తెగుళ్లసోకాయి. దీంతో పూర్తిగా పశువులుకు మేతగా మారింది. చాలా మంది రైతులకు ఎకరాకు రూ.20వేల నుంచి 30వేల వరకు నష్టం వాటిల్లింది. ఫ నిండా ముంచిన బూడిద, మచ్చ తెగుళ్లుఫ దిగుబడిపై తీవ్ర ప్రభావం ఫ మార్కెట్లో ధర అంతంత మాత్రమే ఫ పెట్టుబడులు వెళ్లక రైతుల్లో దిగులు ఫ పశువులకు మేతగా పంట ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు ఈదుల నరేష్. సొంతూరు సంస్థాన్నారాయణపురం మండలం బట్టోనిబావి. ఈ రైతులు మూడో ఎకరాలలో పుచ్చ పంట సాగు చేశాడు. దీనికోసం రూ.1.60లక్షలు పెట్టుబడి పెట్టాడు. మొదటి కోత పంటఅమ్మడం వల్ల రూ.60వేలు వచ్చింది. ఇక రెండవ కోత సమయానికి బూడిద తెగులు, కాయకు మచ్చ తెగులు ఆశించింది. దీంతో కాయ సైజు తగ్గంది. దీంతో వాటిని పశువుల మేతగా వదిపిపెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ రైతు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. -
అద్భుత పర్యాటక ప్రాంతంగా భువనగిరి ఖిలా
భువనగిరి: భువనగిరి ఖిలా అద్భుత పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని పురావస్తు శాఖ డైరెక్టర్ కుతాడి అర్జున్రావు పేర్కొన్నారు. భువనగిరి ఖిల్లా పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అలనాటి రాచరికం ఉట్టిపడేలా ప్రతి కట్టడాన్ని నిర్మించాలన్నారు. భువనగిరి ఖిలా తిరిగి నాటి వైభవాన్ని తలపించేలా పనులు చేయాలని సూచించారు. అంతకు ముందు డంగు సున్నాన్ని పరిశీలించారు. నాణ్యత వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, ఓఎస్డీ రాజు, పర్యాటక శాఖ డీఈ హనుమంతరెడ్డి, కాంట్రాక్టర్ రవీందర్, సిబ్బంది వినోద్ ఉన్నారు. -
నెలాఖరులోగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు యాదగిరిగుట్ట రూరల్: నెలాఖరులోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఏయే పనులు పెండింగ్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, నీటి సరఫరాతో పాటుగా, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బెడ్ రూమ్లతో పాటు చుట్టు పక్కన మిగిలి ఉన్న భూమిని సర్వే చేయించి ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ పూర్ణ చందర్, ఎంపీడీఓ నవీన్కుమార్, గ్రామ పాలకవర్గ సభ్యులు వగ్గు రాణా ప్రతాప్, చిన్నం మల్లయ్య, కానుగు రాజీవ్, కాల్నె వినోద్ పాల్గొన్నారు. సురక్షిత మాతృత్వమే లక్ష్యం సాక్షి, యాదాద్రి : సురక్షిత మాతృత్వమే లక్ష్యమని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో సేఫ్ మదర్ హుడ్ (సురక్షిత మాతృత్వం)పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి గర్భిణికి సురక్షిత ప్రసవం జరిగేలా పక్కా కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు అయ్యేలా కృషి చేయాలని కోరారు.ఈ సదస్సులో డీఎంహెచ్ఓ మనోహర్, డీసీహెచ్ఎస్ చిన్న నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ యశోద, హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో విద్యార్థి మృతిపెన్పహాడ్ : తాటి ముంజలు కోస్తుండగా విద్యుదాఘాతానికి గురై విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం గాజులమల్కాపురం గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులమల్కాపురం గ్రామానికి చెందిన నర్సింగోజు కనకాంబ్రచారి, శ్రీలత దంపతుల చిన్న కుమారుడు నర్సింగోజు నిఖిల్(14) గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఒంటి పూట బడులు కావడంతో బుధవారం గ్రామ శివారులో తాటి ముంజలు కోసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. నిఖిల్ ఇనుప రాడ్డుకు కొడవలి కట్టి తాటిచెట్టుకు ముంజలు కోస్తుండగా.. పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు ఇనుప రాడ్డు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి పక్కనే ఉన్న మణికంఠకు గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేతడిండి: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం డిండి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరిధిలోని ప్రతాప్నగర్, జేత్యతండాకు చెందిన నాలుగు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. సమాచారం తెలుసుకున్న సీఐ బీసన్న, ఎస్ఐ బాలకృష్ణ, పోలీస్ సిబ్బందితో బాపన్కుంట సమీపంలో నాలుగు ట్రాక్టర్లతో పాటు వాటికి రక్షణగా వెళ్తున్న రెండు బైక్లను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. గీత కార్మికుడికి గాయాలువలిగొండ : తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలం సుంకిశాలలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకిశాల గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొమ్మగాని ఐలయ్యగౌడ్ రోజుమాదిరిగా బుధవారం కల్లు గీసేందుకు గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి 108 సిబ్బంది సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి ఐలయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రేషన్ నిల్వల్లో వ్యత్యాసం ఉండొద్దుచండూరు : రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం నిల్వల్లో వ్యత్యాసం ఉంటే కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్షిప్ రద్దుకు సిఫారసు చేస్తామని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ రఘునందన్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పౌరసరఫరాల గిడ్డంగి నుంచి స్టాక్ రేషన్ దుకాణానికి రాకముందే కొందరు డీలర్లు బియ్యం అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. -
టీ హబ్లో ముగిసిన ఇక్కత్ వస్త్ర ప్రదర్శన
భూదాన్పోచంపల్లి : హైదరాబాద్లోని టీ హబ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్(ఆర్బీఎస్ఎం) బుధవారంతో ముగిసింది. పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ ఆధ్వర్యంలో పలువురు చేనేత వస్త్ర వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శించారు. చివరిరోజు దుబాయ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన ప్రతినిధులతో టీజీటీపీసీ, జగదీశ్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో వస్త్ర ఎగుమతులపై అవగాహన కల్పించారు. వస్త్రాల ఎగుమతుల్లో భాగంగా పాటించాల్సిన నాణ్యత, ఎకో ఫ్రెండ్లీ కలర్స్, డిజైన్ల గురించి వివరించారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ప్రదర్శన బాగుందని వివిధ దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి టై అండ్ డై సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కర్నాటి బాలరాజుతో పాటు పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ ప్రొప్రైటర్ తడక రమేశ్, వస్త్ర వ్యాపారులు భారత లవకుమార్, దోర్నాల శేషగిరి, ఈపూరి ముత్యాలు, గంజి బాలరాజు, గంజి యుగేంధర్, సీత లక్ష్మణ్, వనం దశరథ, సీత కృష్ణ, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..
చివ్వెంల(సూర్యాపేట) : టాటా ఏస్ వాహనంలో దైవ దర్శనానికి వెళ్తుండగా డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం జగన్నాయక్తండా శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన జనిగ నర్సింహారావు(36) మేనల్లుడి వివాహం బుధవారం జరగాల్సి ఉండగా.. తమ ఆరాధ్య దైవమైన చివ్వెంల మండలంలోని దురాజ్పల్లి లింగమంతులస్వామికి మొక్కు చెల్లించుకునేందుకు నర్సింహారావుతో పాటు అతడి బంధువులు 18 మంది కలిసి తెల్లవారుజామున టాటా ఏస్ వాహనంలో బయల్దేరారు. మార్గమధ్యలో విజయవాడ–హైదరాబాద్ హైవేపై చివ్వెంల మండలం జగన్నాయక్తండా శివారులోని ముత్యాలమ్మ ఆలయం వద్ద కోడిని కోసి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనిగ నర్సింహారావు, జనిగ సతీష్ (25), జనిగ లింగయ్య, జనిగ శ్రీను, జనిగ శశికుమార్, ఆవుల గంగయ్యతో పాటు మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించగా. జనిగ నర్సింహారావు, జనిగ సతీష్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడు నర్సింహరావు తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కనకరత్నం తెలిపారు. మృతుడు నర్సింహారావు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.. మరో మృతుడు సతీష్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ ఘటనలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.ఫ టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం ఫ ఇద్దరు వ్యక్తులు మృతి.. పలువురికి గాయాలు ఫ పెళ్లింట్లో విషాదఛాయలు -
బత్తాయి రైతులకు సంఘం అవసరం
గుర్రంపోడు : బత్తాయి రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఓ సంఘం అవసరమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నీలగిరి మహిళా సమాఖ్య కేంద్రంలో బత్తాయి రైతు పరస్పర సేవా సహకార సంఘం, ప్రతిభ బఝెటెక్ ప్రైవేట్ లిమిడెట్ ఆధ్వర్యంలో బత్తాయి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. బత్తాయి రైతుల సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. నాసిరకం పురుగు మందులు, దళారులు పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వడం లేదని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయమై ఎస్పీ గారితో మాట్లాడినట్లు తెలిపారు. దళారుల నుంచి సత్వరమే రైతులకు డబ్బులు ఇప్పించాలని అధికారులకు సూచించారు. ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్రెడ్డి ఈ అవగాహన సదస్సు నిర్వహించేందుకు ముందకురావడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని బత్తాయి రైతుల కోసం నిర్వహించాలని కోరారు. ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తగా రైతులకు సరైన సాగు విధానం నేర్పడం కోసమే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతుల సమస్యలు పూర్తిగా అవగాహన చేసుకుని పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో ఐదు తోటలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ బత్తాయి రైతు, ఛాంపియన్ అవార్డు గ్రహీతలు లోకసాని పద్మారెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, కొణతం చంద్రారెడ్డి, మల్గిరెడ్డి భాస్కర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని సైతం సన్మానించారు. బత్తాయి రైతు పరస్పర సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురుగురు శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నగడ్డల ఉపేందర్రెడ్డి, కార్యదర్శి దేవిరెడ్డి అశోక్రెడ్డి, వాసుదేవరెడ్డి, గణేష్రెడ్డి, గుర్రం శ్రీనివాస్రెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఫ మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి -
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
భూదాన్పోచంపల్లి : తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై భవనం పైనుంచి దూకిన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన కమునూరి శోభ బతుకుదెరువు నిమిత్తం తన ఇద్దరు కుమారులతో కలిసి ఏడాది క్రితం భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖికి వలస వచ్చింది. అక్కడ ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని బాయ్స్ హాస్టల్ నిర్వహిస్తోంది. ఆమె చిన్న కుమారుడు కమునూరి గోపిశంకర్(17) హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గోపిశంకర్ కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటుండంతో సోమవారం తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపిశంకర్ అదే రోజు రాత్రి హాస్టల్ భవనంలోని రెండో అంతస్తు నుంచి కిందికి దూకాడు. దీంతో గోపిశంకర్ తల పగిలి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే అతడిని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స చేసినా ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో మంగళవారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తలించగా.. అప్పటికే గౌరీశంకర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉస్మానియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని దేశ్ముఖికి తీసుకొచ్చారు. బుధవారం మృతుడి తల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి
ప్రయాణ సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ సూచించారు. చివ్వెంల మండలం జగన్నాయక్తండా శివారులో డీసీఎం, టాటా ఏస్ వాహనం ఢీకొన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తుండటం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. పోలీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ ఘటనకు గల కారణాలతో నివేదిక తయారు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలి
భూదాన్పోచంపల్లి : మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకొని విద్యార్థులు గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు అన్నారు. బుధవారం భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘ట్రినెక్సియా–2026’ పేరుతో టెక్ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆవిష్కరణలు సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండి వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాలని అన్నారు. టెక్ఫెస్ట్లు విద్యార్థుల భవిష్యత్తు, కెరీర్కు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఈ టెక్ఫెస్ట్లో ఐడియాథాన్, ఈ–స్పోర్ట్స్, టెక్పల్స్, డీబగ్గింగ్ ఛాలెంజ్, బ్లిట్జ్ అనే ఐదు అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విజేత విద్యార్థులకు రూ.25వేల నగదు పురస్కారాలతో పాటు సర్టిఫికెట్లు, మెమొటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాలిసెట్కు దరఖాస్తుల ఆహ్వానం
తిరుమలగిరి (తుంగతుర్తి) : పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 13తో ముగియనున్నాయి. విద్యార్థులు ఇంటర్మీడియట్ కంటే పాలిటెక్నిక్ చదవితే భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యా నిపుణులు చెబుతున్నారు. టీఎస్ పాలిసెట్కు ఈ నెల 20వ తేదీ వరకు www.polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహిస్తారు. విద్యార్థులు పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసి మూడేళ్ల పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా కోర్సులు చేయవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్లో నేరుగా రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ప్రశ్నలు ఇలా... ఉమ్మడి జిల్లాలో 50 వేలకు పైగానే విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పాలిసెట్లో ప్రవేశ పరీక్షలో పదో తరగతి నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు అన్నీ మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. గణితంపై 60 మార్కులు, భౌతిక శాస్త్రంపై 30 మార్కులు, రసాయన శాస్త్రంపై 30 మార్కులతో మొత్తం 120 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. 2.30 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250. ఉమ్మడి జిల్లాలో ఐదు కాలేజీలు.. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, తిరుమలగిరి, యాదగిరిగుట్టలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళా శాలల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఉంది. ఫ ఈ నెల 20 వరకు గడువు ఫ మే 13న ప్రవేశ పరీక్ష ఫ ఉమ్మడి జిల్లాలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు -
శాలిగౌరారం పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం
ఫ స్టోర్రూంలో చిందరవందరగా దర్శనమిస్తున్న సూది మందులు ఫ ఫ్రిజ్లో పెట్టాల్సిన మందులను బయట పెట్టిన వైనంశాలిగౌరారం : శాలిగౌరారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అందాల్సిన సూది మందులు స్టోర్రూంలో చిందరవందరగా దర్శనమిస్తున్నాయి. పీహెచ్సీలో సూది మందులు భద్రపరిచే స్టోర్రూంలో ఇతర సామగ్రిని నింపారు. దీంతో జిల్లా కేంద్రం నుంచి పీహెచ్సీకి వచ్చిన సూది మందులు స్టోర్రూంలో భద్రపరిచేందుకు అవకాశం లేకపోవడంతో పీహెచ్సీలో బయట పెట్టారు. సూది మందుల్లో కొన్ని రకాలలను ఫ్రిజ్లో భద్రపరచాల్సి ఉంటుంది. కానీ వాటిని బయట ఉంచడంతో నిరుపయోగవవుతున్నాయి. అదేవిధంగా పీహెచ్సీకి వచ్చిన మందులను గ్రామాల్లోని హెల్త్ సబ్సెంటర్లకు పంపించి ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాగా కొన్ని హెల్త్ సబ్సెంటర్లకు కేటాయించిన సూది మందులను ఏఎన్ఎంలు తీసుకెళ్లకపోవడంతో వాటిని మూటగట్టి పీహెచ్సీలో ఓ మూలన పడేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. శాలిగౌరారం పీహెచ్సీ స్టోర్రూంలో స్థలం లేక బయట పెట్టిన మందుల స్టాక్ శాలిగౌరారం పీహెచ్సీ స్టోర్రూంలో చిందరవందరగా పడి ఉన్న మందులు -
వ్యక్తి అదృశ్యం
భువనగిరి : మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమైనట్లు అతడి కుమారుడు బుధవారం భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరేపల్లికి చెందిన కాసుల బాలరాజు సోమవారం ఉదయం జీడిమెట్లకు వెళ్తున్నానని తన కుమారుడు సురేష్కు చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. సాయంత్రం అయినా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం ఇవ్వకపోవడంతో బంధువుల ఇళ్లతో వెతికారు. ఎంత వెతికినా బాలరాజు ఆచూకీ లభించకపోవడంతో బుధవారం అతడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. భువనగిరి మండలం చీమలకొండూరుకు చెందిన పల్లెర్ల స్వామి ఫిబ్రవరి 20న తన భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం స్వామి భార్య భువనగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62472, 87126 62733 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
ఫ ఈఎస్ఎస్సీఐ సౌత్ ఇండియా రీజినల్ హెడ్ లాలూనాయక్ మఠంపల్లి : యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే విద్యా రంగాన్ని ఎలక్ట్రానిక్ రంగంతో అనుసంధానిస్తున్నామని ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఎస్సీఐ) సౌత్ ఇండియా రీజినల్ హెడ్ ధరావత్ లాలూనాయక్ అన్నారు. బుధవారం ఆయన తమ స్వగ్రామమైన మఠంపల్లి మండలం కామంచికుంటతండాకు వచ్చిన సందర్భంగా సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు విద్యావ్యవస్థను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించేందుకు ఎలక్ట్రానిక్స్ రంగంలో అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం (ఏఈడీపీ) చేపట్టామన్నారు. దీంట్లో భాగంగా బుధవారం ఉదయం ఈ విషయమై హైదరాబాద్లో సాంకేతిక విద్యా, కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేన కలిసి నిర్వహించిన ఏఈడీపీ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు, పరిశ్రమల అనుభవం అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే ఈ ప్రోగ్రాం లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఈఎస్ఎస్సీఐ వైస్ ప్రెసిడెంట్ సరోజ్ అపాటో, వరుణ్ తదితరలు పాల్గొన్నట్లు తెలిపారు. -
జూన్ నాటికి 3వేల ఇళ్లు పూర్తిచేస్తాం
సాక్షి,యాదాద్రి : ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే 1200 ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తి అయ్యాయని, జూన్ వరకు 3వేల ఇళ్లు పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం ఆలేరులోని మినీ మీటింగ్ హాల్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గుడిసెలు లేని ఆలేరు నియోజకవర్గాన్ని సాధిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే ఆలేరు ప్రథమ స్థానంలో ఉందన్నారు. వంగపల్లి ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇళ్లకు కరెంట్, రోడ్లు, మంచినీటి సౌకర్యాలు వంటి మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీరాములు అధికారులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
మరమ్మతులకు నివేదికలు సిద్ధం చేయాలి
ట్రాక్టర్ బోల్తా.. గుర్రంపోడు మండలంలో కరెంట్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. - 8లో- 9లోభువనగిరిటౌన్ : జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. పాఠకులను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రామన్నపేట, వలిగొండ, ఆలేరు, తుర్కపల్లి గ్రంథాలయాలను సందర్శించారు. మరమ్మతులు చేపట్టేందుకు వెంటనే నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. మండల గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన లైబ్రరీ సెస్ తక్కువగా అందుతుందని, పూర్తిస్థాయిలో సెస్ వసూలు అయ్యేలా చూడాలని కోరగా కలెక్టర్ సానుకూలత వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎండీ అవైస్ ఉన్నారు. కార్పొరేట్ స్థాయి సేవలు అందించాలి సాక్షి,యాదాద్రి : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులు ఎన్క్యూఏఎస్ ప్రమాణాలతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 68 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఎంహెచ్ఓ మనోహర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
హోంగార్డు కుటుంబానికి రూ.34లక్షల బీమా చెక్కు
భువనగిరి, సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పనిచేసిన వెంకటేశం 2025 డిసెంబర్ 7న చిట్యాల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి ఆక్సిస్ బ్యాంకు నుంచి మంజూరైన రూ.34లక్షలు డెత్ బీమా క్లెయిమ్ చెక్కును మంగళవారం భువనగిరిలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అక్షాంశ్యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వినోద్కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐ స్వామి, ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. టెన్త్ పరీక్షకు 8,918 మంది హాజరు భువనగిరి: జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లాలోని 50 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి ఉదయం 11 గంటల వరకు జీవ శాస్త్రం పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 8930 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 8918 మంది హాజరయ్యారని, 12 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. పరీక్ష కేంద్రాల తనిఖీ తుర్కపల్లి: మండలంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను మంగళవారం డీఈఓ సత్యనారాయణ తనిఖీ చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నపత్రాల పంపిణీ విధానాన్ని పర్యవేక్షించారు. పరీక్షలు సజావుగా నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. డీఈఓ వెంట తహసీల్దార్ రవికుమార్, ప్రధానోపాధ్యాయులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభం భువనగిరి: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఆరోగ్య వారోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ఈ నెల 11 వరకు కొనసాగించనుంది. వారోత్సవాల్లో భాగంగా రోజుకు ఒక కార్యక్రమం చొప్పున చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజున ఫుడ్ సేఫ్టీ–ఈట్ రైట్ దినోత్సవం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంతో పాటు పీహెచ్సీల్లో వ్యక్తిగత పరిశుభ్రత, తీసుకోవాల్సిన ఆహారం గురించి వివరించారు. ఈ నెల 8న ఎయిడ్స్నివారణ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. 9న సురక్షిత మాతృ దినోత్సవం, 10న హోమియోపతి, ఆయూష్ దినోత్సవం సందర్భంగా స్వస్థత కేంద్రాల్లో యోగాసనాలు, చేయించడం, యోగ పాత్రను వివరింసాస్తరు. 11న మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా కలిగే నష్టాల గురించి కళాశాలల్లో అవగాహన కల్పించనున్నారు. గోదాముల తనిఖీమోత్కూరు : మోత్కూరు మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్ బియ్యం గోదాం, పాటిమట్ల గ్రామంలోని ధాన్యం గోదాములను మంగళవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి హరికృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో ఉన్న బియ్యం, ధాన్యం నిల్వలను పరిశీలించారు. హమాలీలకు తగిన సలహాలు, సూచనలు చేశారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ బియ్యం లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్నందున అధికారులు, డీలర్లు, హమాలీలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఆయన వెంట గోదాం కంప్యూటర్ ఆపరేటర్ బాలాజీ తదితరులున్నారు. -
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్కు కట్టబెడుతున్న కేంద్రం
భూదాన్పోచంపల్లి: వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందని అఖిల భారత కిసాన్ సంఘ్ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన రైతు సంఘం జిల్లా మహాసభల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధర రెట్టింపు చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. కేంద్రం నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నించగా రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వాటి స్థానంలో విత్తన, విద్యుత్ సవరణ చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. ఇటీవల మోదీ సర్కార్, అమెరికాతో చేసుకొన్న దైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం మన దేశంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలను ఎత్తివేసిందన్నారు. ఒప్పందం వల్ల మనదేశ ఆహారభద్రతకు పెనుప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్ కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ జహంగీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమగుడు నర్సింహ, ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షుడు గూడురు అంజిరెడ్డి, మేక అశోక్రెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మాటూరి బాలరాజు, డీవైఎఫ్ఐ జిల్లా ప్రధానకార్యదర్శి గడ్డం వెంకటేశ్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.ఫ అఖిల భారత కిసాన్ సంఘ్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి -
భక్తులకు రక్షణ కల్పించడమే ప్రధాన ధ్యేయం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించడమే ప్రధాన ధ్యేయమని ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు అన్నారు. టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతిలక్రా ఆదేశాల మేరకు యాదగిరి దేవస్థానం ఆలయ భద్రతా విభాగం సిబ్బంది మంగళవారం కొండకు దిగువన ఉన్న తులసీ కాటేజీ నుంచి మల్లాపురం శివారు వరకు 10కే రన్ నిర్వహించారు. అనంతరం యోగా, వ్యాయామం చేశారు. ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ.. భక్తులకు భద్రత కల్పించడం ఎంత ముఖ్యమో, భద్రత సిబ్బంది ఆరోగ్య, ఫిట్నెస్ కూడా అంతే ప్రధానమన్నారు. ఫిట్నెస్ కోసం సిబ్బంది వాకింగ్, రన్నింగ్, వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొనుగోళ్లు ప్రారంభించాలి
చాలా మంది రైతులు వరికోతలు మొదలు పెట్టారు. మా వ్యవసాయ బావి వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ధాన్యం రాశులతో నిండి పోయింది. వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే తర్వాత వచ్చే రైతులకు ఇబ్బందులు ఉండవు. – పి.లింగయ్య, రామన్నపేట వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర కల్పిస్తూ కనీస వసతులు ఏర్పాటు చేయాలి. వరి కోతలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా నేటికీ కొనుగోలు కేంద్రాలు లేక ధాన్యాన్ని ప్రైవేట్ దళారులకు విక్రయించాల్సి వస్తుంది. – కొమురయ్య, వెల్మజాల, గుండాల మండలం


