రానికెట్ వ్యాధితో నాటుకోళ్లు మృతి
రామగిరి(నల్లగొండ): రానికెట్ అనే వ్యాధితో నల్లగొండ మండలంలోని కేశరాజుపల్లి గ్రామానికి చెందిన ఆతి మల్లయ్య ఫామ్లో 200 నాటుకోళ్లు మృతిచెందాయి. ఇటీవల ఖాజీరామారంలోనూ ఓ రైతు ఫామ్లో 800 వరకు నాటుకోళ్లు, అప్పాజిపేటలో పెరటి కోళ్లు ఈ వ్యాధితో మృతిచెందాయి. నాటుకోళ్లు, బాయిలర్ కోళ్లకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని వెటర్నరీ డాక్టర్ కోట్ల సందీప్రెడ్డి తెలిపారు. ఆయన కేశరాజుపల్లిలోని రైతు ఫామ్ను గురువారం సందర్శించారు. ప్రస్తుతం రానికెట్ వ్యాధి ప్రభావం ఎక్కుగా ఉందని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా కోళ్లకు లసోటా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.


