Vikarabad
-
ఏఐతోనే భవిష్యత్తు
పరిగి: భవిష్యత్తు మొత్తం ఏఐతోనే అని ప్రభుత్వ డిగ్రీకళాశాల నోడల్ అధికారి గంగాధర్ అన్నారు. పట్టణ కేంద్రంలోని కళాశాలలో అన్న అక్క మెంటర్షిప్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 5వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లర్నింగ్పై శిక్షణా తరగతులు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు నిర్వహించిన తరగతుల ద్వారా విద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకున్నారని తెలిపారు. శిక్షణ పూర్తి వారు కళాశాల విద్యాశాఖ కేటాయించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 30 గంటల పాటు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ అంశాలను బోధించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు గాను 1 క్రెడిట్ మార్క్తో పాటు కళాశాల విద్యాశాఖ వారిచే సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు. ఏఐ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునితాపద్మావతి, ట్రైనర్ సుష్మశ్రీ పాల్గొన్నారు. -
మహిళా సంఘం ప్రహరీ కూల్చివేత
తుర్కయంజాల్: ఆదిబట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడలోని మహిళా సంఘం భవనం ప్రహరీని శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడంతో వివాదానికి దారి తీసింది. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా, ఎలా కూల్చివేస్తారని గ్రామస్తులు మండిపడ్డారు. 25 ఏళ్లుగా ఈ భవనంలోనే 50 సంఘాలకు పైగా మహిళలు ఇక్కడ సమావేశం అవుతుంటారు. ఇటీవల పోస్టాఫీస్ వినియోగానికి మహిళా సంఘాలు, గ్రామస్తులు అభిప్రాయం మేరకు కేటాయించారు. దీని మరమ్మతుల కోసం పలువురు దాతల సహకారం తీసుకున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు విస్తరణ పేరుతో కొందరు అధికారులపై ఒత్తిడి తేవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రహరీని కూల్చివేశారని స్థానికులు ఆరోపించారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్న స్థలాన్ని పరిరక్షించాలని, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
అనుమతి లేకుండా ఇసుక రవాణా
పోలీసుల రాకతో ట్రాక్టర్లు పరార్ బషీరాబాద్: మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి ఇసుక తరలింపు వివాదాస్పదంగా మారింది. గంగ్వార్ శివారు కాగ్నా వాగు నుంచి శుక్రవారం సుమారు 15 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రాకను గమనించిన ట్రాక్టర్ డ్రైవర్లు వాహనాలతో పారిపోయారు. ఇబ్రహీంపట్నం రూరల్: మాదక ద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన పోస్టర్ను శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. 15ఆగస్టు 2020 నుంచి నేషనల్ యాక్షన్ ప్లాన్ పర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అమలు చేయబడుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన నష్టాలు ఉన్నాయని వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జూన్ 17 నుంచి 26 వరకు నషా ముక్త్ సప్తాహ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, స్వచ్చంధ సంస్థలు ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో అవగహన ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యం చేయాలన్నారు. మొయినాబాద్: కార్లు ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాయని అడ్డగించడంతో జరిగిన ఘర్షణపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురానికి చెందిన వీవీఎస్ సైరెల్ తన బంధువులతో కలిసి మూడు కార్లలో శుక్రవారం వికారాబాద్కు వెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో మొయినాబాద్ మున్సిపాలిటీలోని చిలుకూరుకు చేరుకోగానే అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి కార్లు ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాయని అడ్డగించాడు. దీంతో ఆయనకు కార్లలో వెళ్తున్న వారికి వాగ్వాదం జరిగింది. ఇంతలో గ్రామంలోని మరికొంత మంది వచ్చి గుమ్మిగూడారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి దాడి చేసుకున్నారు. కార్లలో ఉన్న మహిళలపై కూడా దాడి చేయడంతోపాటు రాళ్లు వేశారు. దీంతో 100కు డయల్ చేయడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వరం: ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఆకన్పల్లి–కోళ్లపడకల్ బీటీ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కోళ్లపడకల్ గ్రామానికి చెందిన ఆకుల నరేశ్(28) కొత్తురు మండలం పెంజర్ల గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. గురువారం రాత్రి పని నిమిత్తం మహేశ్వరం వెళ్లి తిరిగి స్వగ్రామానికి తన బైక్పై వెళ్తున్నారు. మార్గమధ్యలో అదుపుతప్పి పక్కనే ఉన్న ప్రహరీకి బలంగా ఢీకొని తీవ్ర గాయాలై దుర్మరణం చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఆకన్పల్లికి చెందిన రైతులు నరేశ్ మృతదేహాన్ని చూసి కోళ్లపడకల్ గ్రామస్తులు, బంధువులు, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మాత్రం నరేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్ డాటా, సిగ్నల్స్, సీసీ కెమెరాలను పరిశీలించి కేసును విచారించి రోడ్డు ప్రమాదమా? ఎవరైన హత్య చేశారా అని విచారణ చేపట్టాలని కోరుతున్నారు. -
కస్తూర్బాలో గుడ్డులేని భోజనం
బషీరాబాద్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనంలో గుడ్లు, చికెన్, స్నాక్స్ ఇవ్వడం లేదు. ఈ విషయం శుక్రవారం తహసీల్దార్ షాహేదా బేగం ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసింది. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలను తహసీల్దార్ సందర్శించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడారు. భోజన నాణ్యత, మెనూ అమలుపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమకు ప్రారంభం రోజు నుంచి అన్నం, కూర, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నారని, మెనూ అమలు చేయడం లేదని తెలిపారు. గుడ్లు, చికెన్, స్నాక్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్ రికార్డులను పరిశీలించి, పాఠశాల నిర్వహణపై ఆరా తీశారు. దీనిపై పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి గుడ్లు, చికెన్, స్నాక్స్కు సంబంధించి అనుమతులు రాలేదని వివరించారు. అందుబాటులో ఉన్న సరుకులతోనే విద్యార్థినులకు భోజనం అందిస్తున్నామని తెలిపారు. అనుమతులు రాగానే మెనూ అమలు చేస్తామని వివరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. సరఫరాలో నెలకొన్న సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అన్నం, కూర, సాంబార్తో సరిపెడుతున్న వైనం చికెన్, స్నాక్స్ ఇవ్వడం లేదన్న విద్యార్థినులు తహసీల్దార్ తనిఖీలో వెలుగులోకి.. -
కార్మికులకు కనీస వేతనం ఇవ్వండి
పరిగి: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లేశ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులను రెండో పీఆర్సీలోకి తీసుకొని, వేతనం రూ.26 వేలకు పెంచాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, వారికి పదోన్నతులు, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో.. ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు కిష్టయ్య, నర్సింహులు, రఘు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
అనంతగిరి: మున్సిపల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్మికులు(సీఐటీయూ అనుబంధం) గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. వారంతపు సెలవులు ఇవ్వాలన్నారు. పనిభారం తగ్గించి, కనీస వేతనాలు రూ.26 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.20 లక్షలు ఇవ్వాలని కోరారు. పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి బుచ్చయ్య, జంగమ్మ, లక్ష్మమ్మ, పెంటయ్య, గంగమ్మ, స్వప్న, అనసూయ, రాఘవేందర్, జ్యోతి, బుచ్చయ్య పాల్గొన్నారు. -
సమర్థవంతంగా నిర్వహిస్తాం
అనంతగిరి: సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని, ఇందుకు కోసం 1,133 మంది బూత్ స్థాయి అధికారులను నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత, హెచ్ విభాగం సూపరింటెండెంట్ నేమత్ అలీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల గణన పక్కాగా ఉండాలి బంట్వారం: సర్ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల గణన పక్కాగా నిర్వహించాలని డీఆర్ఓ స్వర్ణలత సూచించారు. శుక్రవారం బంట్వారం, కోట్పల్లి మండల కేంద్రాల్లో బీఎల్ఓలు, బీఎల్ఏలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించాలని సూచించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించాలన్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. సెప్టెంబర్ 28 వరకు పరిశీలన, విచారణ పూర్తి చేసి అక్టోబర్ ఒకటిన తుది ఓటరు జాబితను విడదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, డీటీ మహేశ్, బీఎల్ఓలు, బీఎల్ఏలు తదితరలు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి -
సగం ఇంట్లో.. సగం మట్టిలో..
వికారాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా రైతులు ఆకాశంకేసి చూడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెద్ద వర్షం పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొదట్లో కురిసిన చిన్నపాటి వానలకు 30 శాతం విత్తనాలు వేశారు. ఆ వెంటనే వరుణుడు ముఖం చాటేశాడు. ప్రస్తుత సీజన్లో 5.90లక్షల ఎకరాల్లో ఆయా రకాల పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. చాలా మండలాల్లో అదును కాలేదు. సాగుకు సరిపడా వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా రోహిణి లేదా మృగశిర కార్తెలో విత్తు వేస్తారు. కానీ ఇప్పటి వరకు 30 శాతమే వేశారు. మరో వారం గడిస్తే పెసర, మినుము, జొన్న సాగు చేయకపోవడమే మంచిదని వ్యవసాయ శాఖ అఽధికారులు అంటున్నారు. 5.90 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు కేవలం 1.5లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. లోటు వర్షపాతం జిల్లాలో 20 మండలాలు ఉండగా ఎనిమిది మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా ఆరు మండలాల్లో సాధారణం, ఆరు మండలాల్లో సగటు వర్షపాతానికి మించి పడింది. అయితే కొంతమంది రైతులు ధైర్యం చేసి విత్తనం వేశారు. మని కొందరు వర్షాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే పంటలు వేసిన రైతులు వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వేసిన విత్తనం మొలకెత్తుతుందా లేకుంటే నష్టపోతామా అని హైరానా పడుతున్నారు. కొన్ని చోట్ల మొలకలు ఎండిపోయాయి. సింహభాగం పత్తి ప్రస్తుత సీజన్లో రైతులు పత్తి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సాధారణంగా 16 రకాల పంటలు సాగు చేస్తారు. సింహభాగం పత్తి కాగా, ఆ తర్వాత కంది, మొక్కజొన్న, వరి సాగు చేయనున్నారు. గత ఏడాది 2.5లక్షల ఎకరాల్లో పత్తి చేయగా.. ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వరి, కంది సాగు కూడా పెరిగే అవకాశం ఉంది. కోతుల బెడద కారణంగా కూరగాయలు, వేరుశనగ పంటలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా 30శాతమే విత్తనం చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు ఈ ఏడాది సాగు అంచనా 5.90లక్షల ఎకరాలు సాగు చేసింది 1.5లక్షల ఎకరాల్లోనే.. లోటు వర్షపాతం కారణంగా ఇంకా విత్తు పూర్తి కాలేదు. ఈ నెల దాటితే పెసర, మినుము, జొన్న పంటలు వేయకపోవడమే మంచిది. సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాం. – రాజరత్నం, డీఏఓ -
నేడు బీఎల్ఓలకు శిక్షణ
బషీరాబాద్: సర్ కార్యక్రమంపై బూత్ లెవల్ అధికారులకు శనివారం మండల కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తహసీల్దార్ షాహేదా బేగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఇంటింటి ధ్రువీకరణ, దరఖాస్తుల స్వీకరణ, నమోదు విధానం, నిబంధనల అమలు తదితర అంశాలపై బీఎల్ఓలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మర్పల్లి: మర్పల్లి ఎంపీడీఓగా శాంత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఈఓ పీఆర్డీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఇన్చార్జ్ ఎంపీడీఓగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓ శాంత పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆరా తీశారు. వంద శాతం నిర్మించుకొనేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది ఎంపీడీఓను ఘనంగా సన్మానించారు. తాండూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా రేపు(ఆదివారం) తాండూరులోని విలియంమూన్ మైదానంలో యోగా అభ్యాసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పతంజలి యోగా సమితి అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్కుమార్, లక్ష్మణ్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5.30 గంటలకు యోగా ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజాబాల్రెడ్డి, డివిజన్ స్థాయి అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అధ్యక్షుడిగా రఘునందన్ గౌడ్ తాండూరు టౌన్: తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం పట్టణంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జీ రఘునందన్ గౌడ్ (లైన్ ఇన్స్పెక్టర్), వర్కింగ్ ప్రెసిండెంట్గా ఎస్ వెంకట్రామ్ రెడ్డి (లైన్మెన్), జిల్లా (రీజనల్) కార్యదర్శిగా సీ ఆనంద్ కుమార్ గౌడ్ (ఆర్జీజన్), కోశాధికారిగా భాస్కర్ రెడ్డి (జూనియర్ లైన్మెన్) ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా కంపెనీ ప్రెసిడెంట్ ఎం బాలరాజ్ వ్యవహరించారు. తమపై నమ్మకంతో జిల్లా కార్యవర్గ బాధ్యతలు అప్పగించిన పవర్ ఎంప్లాయీస్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నూతన అధ్యక్షుడు రఘునందన్ గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయ్కుమార్, ఆచారి, శ్రీనివాస్, చంద్రారావు హాజరయ్యారు. షాద్నగర్: తెలంగాణ రాష్ట్ర ఉత్తమ పౌర పురస్కారానికి షాద్నగర్ పట్టణానికి చెందిన యువ కవి, ఉపాధ్యాయుడు రవిప్రకాష్ హర్మాల్ ఎంపికయ్యారు. విద్య, సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి తెలంగాణ ప్రతిభా వేదిక ఆధ్వర్యంలో పౌర పురస్కారాలను అందజేస్తున్నారు. వచ్చే నెల విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో రవిప్రకాష్ హర్మాల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. -
గజదొంగ అరెస్ట్
● నిందితుడికి 78 కేసులలో ప్రమేయం ● 62 గ్రాముల బంగారం, 270 గ్రాముల వెండి ఆభరణలు స్వాధీనం పహాడీషరీఫ్: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్ అలైన్ కాలనీకి చెందిన మహ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి(52)కి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గుల్ల చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామం, అలైన్ హిల్స్, వాదే ముస్తఫా బస్తీలలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో మూడు, మీర్పేటలో ఒకటి, ఫలక్నుమాలో ఒక చోరీ చేశాడు. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో దొంగతనాల చిట్టా విప్పాడు. ఇతనిపై ఇప్పటి వరకు 78 దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదై ఉండడం విశేషం. నిందితుడి వద్ద నుంచి 62 గ్రాముల బంగారు, 270 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
కాలర్ పట్టుకుని.. దుర్భాషలాడుతూ
తుర్కయంజాల్: వివాదాస్పద స్థలంపై నిషేదాజ్ఞలు అమలు చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడికి ప్రయత్నించిన ఘటన రామన్నగూడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. సర్వే నంబర్ 338లోని 1,810 గజాల స్థలంపై కొంతకాలంగా వివాదం సాగుతోంది. 2005లో అల్లూరి వెంకట రమణ రాజు అనే వ్యక్తి ఈ సర్వే నంబర్లోని కొంత భూమిని కాశీవిశ్వనాథ్కు ఏజీపీఏ చేశారు. దీని ఆధారంగా అతను ప్లాట్లను విక్రయించగా, సరస్వతి అనే మహిళతో పాటు, మరికొందరు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ఇదే సర్వేనంబర్లోని భూమిని 2011లో వెంకటపతి రాజు అనే వ్యక్తి జైపాల్రెడ్డికి విక్రయించాడు. అనంతరం ఆయన మరో ఇద్దరికి జీపీఏ చేసినట్లు సమాచారం. దీంతో సదరు స్థలం మాదంటే.. మాదేననే గొడవ సాగుతోంది. ఇందులో కట్టిన నిర్మాణాలను కొంతమంది వ్యాక్తులు ఆరు నెలల క్రితం కూల్చివేయగా, పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈవివాదంపై ఆదిబట్ల పోలీసులు ఇటీవల ఇబ్రహీంపట్నం ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగే వరకు ఈభూమిపై బీఎన్ఎస్ఎస్ 164 సెక్షన్ విధించాలని అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి నిర్ణయించారు. దీన్ని అమలు చేయడానికి శుక్రవారం ఆర్ఐ ప్రేమ్కుమార్, జీపీఓ హనుమంతు నాయక్ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సదరు మహిళ అధికారులను దుర్భాషలాడుతూ, చొక్కా, కాలర్ పట్టుకుని లాగింది. ఈ విషయమై రెవెన్యూ అధికారులు ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని జీపీఓ హన్మంతునాయక్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన మహిళను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈవిషయమై పూర్తిస్థాయి విచారణ జరిపి, కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. రెవెన్యూ సిబ్బందిపై మహిళ దురుసు ప్రవర్తన -
హెచ్పీవీ టీకా.. బాలికకు రక్ష
యాలాల: బాలికలు సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఇచ్చే హెచ్పీవీ టీకా ఎంతో సురక్షితమని పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ రుబియా నాజ్ అన్నారు. శుక్రవారం 11 మంది విద్యార్థినులకు టీకా వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలో ఇప్పటి వరకు 14 ఏళ్లు నిండిన 204 మందికి టీకా వేశామని చెప్పారు. ఈ వ్యాక్సిన్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. అపోహలు వీడి బాలికలకు టీకా వేయించాలని సూచించారు. ఏఎన్ఎంలు జగదీశ్వరి, లక్ష్మీ తదితరులు ఉన్నారు. అనంతగిరి: వికారాబాద్ పట్టణానికి చెందిన డి.సాహితి తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో ఉత్తమంగా రాణించింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 250వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని తల్లిదండ్రులు, అధ్యాపకులు తదితరులు అభినందించారు. సాహితి.. పట్టణంలోని డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఎంపీసీఎస్)పూర్తి చేసి, ఎంట్రన్స్ రాసింది. బషీరాబాద్: మండల పరిధి అల్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకరప్పకు నామినేటెడ్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత కాలంగా పదవులు దక్కడం లేదని అంతర్గత సమావేశాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్ కావడం, ఈ బాధ్యతలను శంకరప్పకు అప్పగించేందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం అల్లాపూర్లో శంకరప్ప నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే.. చైర్మన్ పదవిపై సానుకూల హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఏఎంసీ కమిటీ పదవీకాలం జూలై 2తో ముగియనుండటంతో కొత్త కమిటీ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడైన శంకరప్ప పేరే ప్రధానంగా వినిపిస్తుండగా, ఈ నెలాఖరుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం కరన్కోట్ పోలీస్స్టేషన్ పరిధి కరన్కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాథోడ్ వినోద్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని వృద్ధురాలు(60), గ్రామ శివారులోని సీసీఐ ఫ్యాక్టరి సమీపంలోని ఓ నీటి గుంతలో పడి దుర్మరణం చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. బంట్వారం: కోట్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు వేప చెట్టు కూలి ఉప్పరి నాగమణి ఇంటిపై పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో పై కప్పు ధ్వంసం అయిందని, సరుకులు తడిసిపోయాయని బాధిత కుటుంబీకులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
మత్తుపదార్థాలు విక్రయిస్తే కేసులు
షాబాద్ సీఐ కాంతారెడ్డి షాబాద్: మత్తుపదార్థాలు విక్రయిస్తే కేసులు తప్పవని షాబాద్ సీఐ కాంతారెడ్డి హెచ్చరించారు. ప్యూచర్ సిటీ కమిషనర్ ఆదేశాల మేరుకు శుక్రవారం మండల పరిధిలోని దామర్లపల్లిలో డాగ్స్క్వాడ్, ఈగల్ టీం బృందాలతో దుకాణాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎక్కడ డ్రగ్స్ విక్రయించిన వాటిని ఉపయోగించిన డాగ్స్క్వాడ్ ఈగల్ టీంలతో పరిశీలన చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఆయన తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ సతీష్కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. -
‘అంబా’నుషం
● విషతుల్యమైన దాణా తిని ఏడు ఆవులు, లేగ దూడకు అస్వస్థత ● చికిత్స అందిస్తుండగానే మృత్యువాత ● కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తూరు: దాణాను విషతుల్యం చేయడంతో తన ఏడు ఆవులు, ఓ లేగ దూడ మృతిచెందాయని బాధిత రైతు వాపోయాడు. ఇందుకు కారణమైనవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమ్మరిగూడకు చెందిన రఘునందన్ కొన్నేళ్లుగా పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు. గ్రామ శివారులోని డెయిరీ ఫామ్ వద్ద బీహార్కు చెందిన మున్నా, రాజు అనే ఇద్దరు కూలీలతో పనులు చేయిస్తున్నారు. వీరిరువురూ గురువారం చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో అప్పటికే సంపులో పులియబెట్టిన దాణాను రఘునందన్ శుక్రవారం మధ్యాహ్నం ఆవులకు పెట్టి, ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వెళ్లే సరికి కడుపు ఉబ్బిన ఆవులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించాయి. వెంటనే పశువైద్యులకు సమాచారం ఇవ్వగా, చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఏడు ఆవులు, ఓ లేగదూడ చనిపోయాయి. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. దాణా సంపులో యూరియా అవశేషాలు ఉన్నట్లు పశువైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. సీఐ నర్సయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు అందిన తర్వాతే కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వెటర్నరీ డాక్టర్ పద్మిణి తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బాధిత రైతు రఘునందన్, నాయకులు ఈట గణేశ్, దేవేందర్యాదవ్, కోస్గి శ్రీనివాస్, రాజేందర్, రవినాయక్, తదితరులు పరామర్శించారు. -
వదినమ్మా ప్రజల్లోకి వచ్చి తిరగండి
ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పథకాలు అందడంలేదని పదేపదే మాట్లాడుతున్న మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ప్రజల్లోకి వచ్చి తిరిగితే తమ ప్రభుత్వ పథకాలు ఏమిటో, అవి ఎలా అందుతున్నాయో తెలుస్తాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మా వదిన సబితమ్మ ఇంటికి మీ తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడబిడ్డలకు అందించే చీర సారె పంపుతాను.. ఇందిరమ్మ చీర ధరించి బస్సెక్కండి.. ఆధార్ కార్డు చూపిస్తే ఒక్క రూపాయి ఎవరూ అడగరు.. ఒకవేళ రేషన్కార్డు ఉంటే బస్సు దిగగానే రేషన్ దుకాణానికి వెళ్లి సన్న బియ్యం తీసుకోండి.. అదే మార్గంలో మహిళా సంఘాలను కలిసి అవసరమైతే ఆ సంఘంలో చేరండి.. ఇందిరమ్మ మహిళా పథకం కింద ఒక్కో సంఘానికి పది లక్షలు అందించే వడ్డీలేని రుణాన్ని ఉపయోగించుకోండి.. మీకు సంబంధించిన వారెవరైనా బిడ్డ పెళ్లి చేస్తే కల్యాణలక్ష్మి కింద అందిస్తున్న రూ.లక్షా 116 చెక్కు ఇప్పించండి.. ఇంటికి చేరాక గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు అందించే విద్యుత్తో ఫ్యాన్, టీవీ ఆన్చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి.. వంటగదికి వెళ్తే మహాలక్ష్మి పథకం కింద రూ.500 అందిస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను ఉపయోగించుకొని మీకు ఇష్టమైన వంటలు వండుకోవచ్చు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్వయంగా వెళ్లి పరిశీలిస్తే ప్రభుత్వ పథకాల అమలు విషయంలో స్పష్టత వస్తుందన్నారు. మీరు ఏవైనా సలహాలిస్తే సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను.. ధన్యవాదాలు వదినమ్మా అంటూ ముగించారు. మా పథకాలేంటో తెలుస్తాయి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి వ్యంగ్యాస్త్రాలతో కూడిన ప్రకటన విడుదల -
సంత.. అక్కడే జనమంతా
● బషీరాబాద్లో ప్రతి మంగళవారం తైబజార్ ● మండల స్థాయిలోనే అతి పెద్ద మార్కెట్ ● రూ.లక్షల్లో వ్యాపారం బషీరాబాద్: మండల కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే సంతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బషీరాబాద్ తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఉండటంతో రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో సంతకు వస్తుంటారు. ఇక్కడ రైతులే నేరుగా కూరగాయలు విక్రయిస్తుంటారు. తక్కువ ధర.. తాజా కూరగాయలు లభిస్తుండటంలో ప్రజలు క్యూ కడుతున్నారు. ఒకేసారి వారానికి సరిపడా సరుకులు కొనుగోలు చేస్తున్నారు. సంతలో గుండు సూది మొదలుకొని పెళ్లి వస్త్రాలు, వంట సామగ్రి, గృహోపకరణాలు, వ్యవసాయ పనిముట్లు, నిత్యావసర సరుకులన్నీ లభిస్తాయి. రెండు రాష్ట్రాలకు చెందిన 50 గ్రామాల ప్రజలు ఈ సంతకు వస్తుంటారు. బషీరాబాద్ మండలంతో పాటు అయ్యాళం, ఆబుళం, అల్కోడ, పోతంగల్, జెట్టూరు, లోహడ, రాజోళ్లి, సోంపల్లి, మద్దుకంటి, కురుగుంట, కొంతంపల్లి తదితర గ్రామాల నుంచి దాదాపు పది వేల మంది వస్తారు. తగ్గని ఆదరణ సంతలో రూ.లక్షల వ్యాపారం జరుగుతుంది. సూపర్ మార్కెట్లు వెలసినా తైబజార్కు ఆదరణ తగ్గడం లేదు. తాండూరు సమీపంలోని సుద్ధ, నాపరాయి తదితర గనుల్లో పని చేసే కూలీలకు మంగళవారం సెలవు కావడంతో కార్మికులు మార్కెట్ బాట పడతారు. వీరే కాకుండా రోజువారి కూలీలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతకు వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పల్లె రుచులు మిరపకాయ బజ్జీలతో పాటు మటన్ సీకులు, బోటీ కూర ఇక్కడ ప్రత్యేకలు. బజ్జీలు తింటూ పల్లె సుద్దులు, పాత జ్ఞాపకాలు, కుటుంబ విషయాలు పంచుకుంటారు. సంత కేవలం వ్యాపార కేంద్రంగానే కాకుండా సామాజిక బంధాలను బలపరిచే వేదికగా మారింది. సౌకర్యాలు శూన్యం తైబజార్, దుకాణాల ట్రేడ్ లైసెన్సుల ద్వారా ఏటా గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. కానీ సంతలో కనీస వసతులు కూడా కల్పించడం లేదు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేక ఇటు వ్యాపారులు, అటు కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతకంటూ ప్రత్యేక స్థలం లేకపోవడంతో పోస్టాఫీసు గల్లీ, మసీదు గల్లీల్లో నిర్వహిస్తున్నారు. అంగడి రోజు ఈ ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంతకు ప్రత్యేక స్థలం కేటాయిచడంతోపాటు వసతులు కల్పించాలని వ్యాపారులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు. బషీరాబాద్ సంత అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మిరపకాయ బజ్జీలే. సంత వీధుల్లో అడుగు పెట్టగానే వేడి వేడి బజ్జీల సువాసన ప్రజలను ఆకట్టుకుంటుంది. ఇక్కడి ప్రతి హోటల్లో బజ్జీల విక్రయం జోరుగా సాగుతుంది. మంగళవారం అయితే వీటికి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఈ వ్యాపారం కూడా వేలల్లో జరుగుతుంది. -
పేదల సొంతింటి కల సాకారం
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం పరిగి, రాఘవాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో రెండో విడత ఇళ్లు వస్తాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నారని తెలిపారు. -
ఉపాధి కూలీల ఆందోళన
దోమ: పని ప్రదేశంలో ఫీల్ట్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళనకు దిగారు. గురువారం మండలంలోని మోత్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులు సవ్యంగా జరుగుతున్నా కావాలనే వేధిస్తున్నారని వాపోయారు. ఫొటో క్యాప్చర్ కావడం లేదని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంచుతున్నారని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించడం లేదని, సరైన కొలతలు తీయడం లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఫీల్ట్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి తీరు కారణంగా తాము పనులు చేయలేక పోతున్నామని పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రవీందర్రెడ్డిని వివరణ కోరగా.. సర్వర్ సమస్యలతో ఫొటో క్యాప్చర్ కావడం లేదని తెలిపారు. కూలీలు నిర్వహిస్తున్న పనుల్లో సరైన కొలతలు పాటించడం లేదన్నారు. ఇలా చేయడం ద్వారా డబ్బులు అనుకున్న మేర రావని చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పని ప్రదేశంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన ఫీల్ట్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆగ్రహం ఉన్నతాధికారులుస్పందించాలని విన్నపం -
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేఽశ్రెడ్డి దుద్యాల్: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సా ధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఈర్లపల్లిలో రూ.30 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కార్యక్రమంలో కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి వెంకటయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణ, సర్పంచ్ మొగులప్ప, జీపీ కార్యదర్శి సూర్యప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. ఆదర్శంగా నిలుద్దాం బొంరాస్పేట: అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలుద్దామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. అనంతరం నాందార్పూర్లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. టేకులగడ్డ తండాలో రూ.30లక్షల నిధులతో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమా ల్లో పార్టీ నాయకులు నర్సింలుగౌడ్, జయకృష్ణ, మల్లేశ్, మల్లికార్జున్, రాజునాయక్, సర్పంచులు లక్ష్మి, లక్ష్మీబాయి, కార్యదర్శులు శోభారాణి, శ్రీనివాస్లు తదితరులు పాల్గొన్నారు. దుద్యాల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి సూచించారు. గురువారం మండల కేంద్రంలో బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన వారి పేర్లను, డబుల్ ఎంట్రీలను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. నకిలీ ఓట్లకు ఆస్కారం ఇవ్వొదని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి పెద్దపీట
● వికారాబాద్ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అనంతగిరి: అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతులకు కంది మినీ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పప్పుధాన్యాల ఉత్పత్తి పెంపు, నేల సారవంత పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి, పోషకాహార భద్రతలో కంది పంట కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కంది విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. అనంతరం ఏఓ ప్రసన్న లక్ష్మి మాట్లాడారు. వికారాబాద్ మండలానికి 326 కంది మినీ కిట్లు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్, ఏడీఏ వెంకటేశం, ఏఎంసీ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు విజేందర్ రెడ్డి, పాపిరెడ్డి, ప్రభాకర్, రాజు నాయక్, రమేష్ నాయక్, నర్సింలు, ఏఈఓ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్టు
తాండూరు: బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నాయకులను గురువారం తాండూరు పట్టణ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పట్టణానికి చెందిన దత్తాత్రేయరావు, వినోద్కుమార్ను తెల్లవారుజామున అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. విద్యారంగాన్ని గాలికి వదిలేదసిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు. -
40,53,500
వికారాబాద్/కుల్కచర్ల: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. పలు ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 19 ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేశారు. ఆయా శాఖల వారీగా టార్గెట్లు ఇచ్చారు. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు. వాతావరణ కాలుష్యం రోజుకురోజుకూ పెరిగి పోతున్న తరుణంలో పచ్చదనం పెంచడం అనివార్యంగా మారింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అటవీ విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 40,53,500 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. గత ఏడాది 40,54,000 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా 80 శాతం పూర్తి చేశారు. ఈ సారి మరింత సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో ఖాళీ స్థలాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లు, రోడ్డు పక్కన, బంజరు భూముల్లో, పొలం గట్లపై ఇలా అవకాశమున్న ప్రతిచోటా మొక్కలు నాటాలని నిర్ణయించారు. అందుబాటులో మొక్కలు జిల్లా వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 600 పైచిలుకు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పరిధిలో 15, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో 594 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. వీటిలో 40లక్షల మొక్కలను పెంచుతున్నారు. టేకు మొక్కలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో నర్సనీలో 5వేల చొప్పున 594 జీపీల్లో 28,30,000 మొక్కలు, 15 ఫారెస్టు నర్సరీల్లో 10 లక్షల మొక్కలు పెంచుతున్నారు. అటవీ ప్రాంతాల్లో గచ్చకాయ, వెదురు, గుల్మోర్, రేన్ట్రీ, రావి, మర్రి, కానుగ, తురాయి, గార్డెనింగ్ మొక్కలు, దానిమ్మ, నిమ్మ, గోరింటాకు, తదితర మొక్కలు నాటనున్నారు. ఇళ్ల వద్ద పూలు, పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. వీటితో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు మొక్కలు పంపిణీ చేయనున్నారు. శాఖ అటవీ 3.3లక్షలు ఆర్అండ్బీ 5వేలు పంచాయతీరాజ్ 4లక్షలు డీఆర్డీఓ, ఎంపీడీఓలు 24.4లక్షలు నీటిపారుదల 76వేలు వ్యవసాయ 5.38లక్షలు మార్కెట్ 5వేలు ఉద్యాన 2.50లక్షలు ప్రొహిబిషన్ 9.5లక్షలు విద్య 11వేలు తాండూరు మున్సిపల్ 70వేలు వికారాబాద్ మున్సిపల్ 80వేలు కొడంగల్ మున్సిపల్ 35వేలు పరిగి మున్సిపల్ 30వేలుఈ నెల 19 నుంచి గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రజాప్రతినిధుల సమన్వయంతో వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తాం. ప్రతి గ్రామం కచ్చితంగా లక్ష్యాన్ని అధిగమించేలా పర్యవేక్షణ చేస్తున్నాం. – రామకృష్ణ, ఎంపీడీఓ, కుల్కచర్ల కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశాం. లక్ష్యాన్ని అధిగమించాలనే అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పొలం గట్లపై మొక్కలు నాటుకోవాలని రైతులకు సూచించాం. – చంద్రశేఖర్, ఏపీఓ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాలుఈ ఏడాది వనమహోత్సవ లక్ష్యం 19 శాఖలకు బాధ్యతలు 594 జీపీలు, 15 ఫారెస్టు నర్సరీల్లో మొక్కల పెంపకం గత సంవత్సరం 80శాతం పూర్తి -
ధర్మాన్ని రక్షించాలనే తపన ఉండాలి
మొయినాబాద్: ధర్మాన్ని రక్షించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ అన్నారు. హైదరాబాద్కు చెందిన ఆంజనేయులు గురుస్వామి 8 నెలల పాటు 25,200 కిలోమీటర్ల పాదయాత్రతో 18 శక్తిపీఠాలను దర్శించుకుని గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, బజరంగ్ దళ్ కార్యాకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ ఆయన్ను సన్మానించి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం రంగరాజన్ మాట్లాడుతూ.. దేశాన్ని, ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారత దేశ ప్రజలను కలిపేది దైవ సన్నిధానాలేనన్నారు. దేశాన్ని ఏకం చేసేది శక్తిపీఠాలు, దేవాలయాలు, ప్రార్థన స్థలాలని చెప్పారు. ధర్మాన్ని రక్షించడంకోసం ఆంజనేయులు పాదయాత్ర చేశారని.. ఈ యాత్రతో అందరిలో సద్భావన రావాలని ఆకాంక్షించారు. ఆంజనేయులు గురుస్వామి మాట్లాడుతూ.. లోక కల్యాణం, గో సంరక్షణ, దేశ ప్రజలందరు బాగుండాలనే ఆలోచనతో పాదయాత్ర చేసినట్లు చెప్పారు. శుక్రవారం శ్రీశైలంలో పాదయాత్ర అధికారికంగా ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సురేష్ శర్మ, బాలస్వామి, బజరంగ్ దళ్ నాయకులు నందకిషోర్, విజయ్, పాండు, శ్రీనివాస్ ఉన్నారు. -
పనుల్లో నాణ్యత తప్పనిసరి
● వసతి గృహ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి ● కలెక్టర్ దీపక్ తివారితాండూరు: పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. గురువారం తాండూరులోని గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, వసతి గృహాలను సందర్శించారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఆరా తీశారు. వంట గదిని తనిఖీ చేశారు. కాలం చెల్లిన సరుకులు వాడొద్దని సూచించారు. అనంతరం శాంతినగర్ పార్కును పరిశీలించారు. ప్రజలకు ఉపయోగ పడే పరికరాలు సమకూర్చాలని మున్సిపల్ కమిషనర్ రాకేష్రెడ్డికి సూచించారు. మిషన్ భగీరథ మంచి నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అంతారం శివారులోని డంపింగ్ యార్డును పరిశీలించి.. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్కు సూచించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తితో..
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య తాండూరు: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు రైల్వే స్టేషన్లో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మాణిక్నగర్కు చెందిన రాము(35) పెయింటర్ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య యశోదతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా తాగుడుకు బానిసైన రామును ఆర్థిక, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈక్రమంలో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ముంబై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్పైకి వస్తుండగా రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని రైల్వే పోలీసులు తెలిపారు. పార్క్ చేసిన బైక్ చోరీ -
పర్యావరణ పరిరక్షణకు పాటు పడుదాం
కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుదామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువారం అనంతగిరి – కొండాపూర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియలో ఎస్పీ స్నేహ మెహ్ర, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొక్కల పెంపకం మన బాధ్యత: టీఆర్ఆర్ కుల్కచర్ల: మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం వనమహోత్సవంలో భాగంగా కుల్కచర్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలే మానవ మనుగడకు ముఖ్య కారణమన్నారు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, పాంబండ ఆలయ మాజీ చైర్మన్ మైపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అంజిలయ్య, మాజీ ఎంపీపీ పడమటి అంజిలయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, సర్పంచులు తిరుపతయ్య, మడుగు శ్రీనివాస్, వెంకటయ్య, నాయకులు గోవర్దన్రెడ్డి, రాంచంద్రయ్య, జోగు వెంకటయ్య, భరత్కుమార్ రెడ్డి, లాలు తదితరులు పాల్గొన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ తాండూరు: మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంచితేనే మానవ మనుగడ సాధ్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్జాదవ్, నాయకులతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. తాండూరు ప్రాంతంలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పీసీబీ గుర్తించిందని తెలిపారు. ఇప్పుడు మొక్కలు నాటి కాలుష్యాన్ని తగ్గించడమే మనముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, అటవీ శాఖ రెంజ్ అధికారి శ్రీదేవి సరస్వతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్, తాండూరు సర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, నాయకులు తదితరులున్నారు. -
నేరాల నియంత్రణకే కార్డెన్ సర్చ్
● పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ● మల్లెమోనిగూడలో తనిఖీలు ● సరైన పత్రాలు లేని పలు వాహనాల సీజ్ పరిగి: నేరాల నియంత్రణకే కార్డెన్సర్చ్ నిర్వహిస్తున్నామని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడలో గురువారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 160 మంది పోలీసులు పాల్గొని సరైన పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన 39 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పాపులేషన్ డివిజన్ మెథడ్తో పాటు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా తనిఖీ చేశామన్నారు. గ్రామంలో, పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాలు జరగకుండా ఉండేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. ప్రతీ వ్యాపారి, గ్రామ ప్రజాప్రతినిధులు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కెమెరా పది మంది పోలీసులతో సమానమన్నారు. ఎలాంటి ఘటన జరిగినా కేసుల దర్యాప్తుతో పాటు నిందితులను పట్టుకునేందుకు ఇవి ఎంతో కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ మహ్మరిపై అప్రమత్తంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి, కొడంగల్ సీఐలు కొండల్రెడ్డి, శ్రీధర్రెడ్డి, ఎస్ఐ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి డంపింగ్ పరిశీలన
గుర్తు తెలియని వ్యక్తి మృతి అనంతగిరి: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వికారాబాద్ రైల్వే పీఎస్ ఇంచార్జి హరిప్రసాద్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం ధారూరు–గోధంగూడ మధ్యలో రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వద్ద చిరునామాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు అందాజా 40 సంవత్సరాలు ఉంటాడని, ఒంటిపై నీలం రంగు షర్ట్, పింక్–తెలుపు రంగు షార్ట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించి భద్రపరిచారు. ఎవరైనా సమాచారం, ఆచూకీ తెలిస్తే వికారాబాద్ రైల్వే పీఎస్లో సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్మికుడి ఖాతా నుంచి రూ.1,89,200 బదిలీ సర్పై అపోహలు వద్దు తహసీల్దార్ రాజేందర్రెడ్డి యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం -
అభివృద్ధి పనుల పరిశీలన
అనంతగిరి: పంచాయతీ రాజ్ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేకాధికారులు నీరజ, శైలజారెడ్డి పరిశీలించారు. గురువారం వీరు వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామంలో పర్యటించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు, గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ ఖర్చుపై ఆరా తీశారు. ఏయే పనులు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఆస్తులు, రికార్డుల నిర్వహణ, ఎస్హెచ్జీ భవనాల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, యూజీడీ నిర్మాణం, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ల తీర్మానాలు, అగ్రిమెంట్లు, ఎన్బీల నిర్వహణ, క్యాష్ బుక్లతో సరి చూశారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, డీఎల్పీఓ సంధ్యారాణి, ఎంపీడీఓ వినయ్కుమార్, సర్పంచ్ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పూర్ణిమ, ఎఫ్ఏ రత్నం తదితరులు పాల్గొన్నారు. -
వసతిగృహం.. భవితకు మార్గం
కుల్కచర్ల: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యత కల్పిస్తోంది. ముఖ్యంగా విద్యా రంగంలో.. అనేక అవకాశాలు కల్పిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నతంగా రాణించేలా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో షెడ్యూల్ కులాల శాఖ పరిధిలో బాలుర వసతిగృహం ఏర్పాటు చేసింది. గడిచిన విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఫలితాలను రాబట్టింది. నిబంధన లేదు పిల్లలను ప్రోత్సహించేందుకు ఎలాంటి నిబంధనలు లేకుండా చదువుకునే వారికి వసతిని కల్పిస్తోంది. ప్రవేటు పాఠశాలలో చదువుతున్నప్పటికీ.. మరికల్ ఎస్సీ వసతిగృహంలో ప్రవేశం పొందవచ్చు. తొలి ప్రాధాన్యత జిల్లా వాసులకు కల్పించింది. మిగతా వారు రాష్ట్రంలోని ఎక్కడి ప్రాంతం వారైనా అవకాశం ఇస్తోంది. షెడ్యూల్ కులాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. ఒకే సామాజికవర్గం అంటూ నిబంధన లేదు. నెలనెలా రూ.200లు మరికల్ ప్రభుత్వ బాలుర హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోంది. బోధన అంశంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మౌలిక సౌకర్యాల కోసం చిన్నారులకు ప్రతి ఒక్కరికీ నెలనెలా రూ.200లు అందజేస్తోంది. హాస్టల్లో ప్రవేశానికి ఆధార్కార్డు, కులం, నివాసం, ఆదాయం ధృవీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలి. మరిన్ని వివరాలకు వసతిగృహ ప్రత్యేకాధికారి నరేందర్ రెడ్డి 8886046672 నంబరును సంప్రదించవచ్చు. నాణ్యమైన బోధన, మెరుగైన సౌకర్యాలు ప్రత్యేక తరగతులు, నిరంతరం పర్యవేక్షణ పదిలో వందశాతం ఫలితాలు హాస్టల్ సొంతం ప్రవేశ పరీక్ష లేకుండానే ప్రవేశం విద్యార్హత పత్రాలు చాలు వసతిగృహంలో చేరేందుకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేదు. ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్హత పత్రాలతో ప్రవేశం పొందవచ్చు. నోట్బుక్స్, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రత్యేక తరగతులు చెబుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. – నరేందర్ రెడ్డి, మరికల్ బాలుర వసతిగృహం ప్రత్యేకాధికారి -
పప్పు ధాన్యాల సాగు పెంచాలి
● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ● రైతులకు కంది విత్తనాల పంపిణీతాండూరు: పప్పు ధాన్యాల సాగుకు తాండూరు నేలలు అనుకూలమని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో రైతులకు ఉచితంగా కంది, పెసర, మినుము విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాలనే ఎంచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్రెడ్డి, ఏడీఏ అరుణ, మున్సిపల్ కమిషన్ రాకేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కును పరిరక్షించుకుందాం తాండూరు టౌన్: ఎవరి ఓటు హక్కును వారు పరిరక్షించుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ అనిత ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాచౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడూ విధిగా ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. నకిలీ ఓట్లకు అవకాశం ఇవ్వొదన్నారు. బీఎల్ఏలు, బీఎల్ఓలు బాధ్యతగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ రాకేష్ రెడ్డి, నాయకులు అబ్దుల్ రవూఫ్, గాజుల మాధవి, ప్రభాకర్ గౌడ్, నాగరాజు, సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
● వేగవంతంగా పూర్తి చేయాలి ● కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డికొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్లోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంతుకుమార్ భూమిపూజ చేశారు. ఆలయ పురోహితులు వారికి స్వాగతం పలికారు. రూ.110 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులను వేగవంతం చేయాలని సూచించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్నాయక్, నాయకులు నందారం రత్నం, నందారం రాజు, మిఠాయి రాజు, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, దాము తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాలు
బొంరాస్పేట: తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని కొత్తూరుకు చెందిన బాల్రాజ్ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్లో అన్ని జిల్లాల ఇన్చార్జ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉద్యమ కళాకారులకు ఉద్యోగ భద్రతపై చర్చించారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కళాకారులకు న్యాయం, ఉద్యోగ భద్రతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ కోశాధికారిగా సలావుద్దీన్ బంట్వారం: తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ కోశాధికారిగా డాక్టర్ ఎండీ సలావుద్దీన్ (బంట్వారం – బొప్పునారం) నియమితులయ్యారు. బుధవారం నగరంలో సంఘం వ్యవస్థాపకులు వెంకటేశం, ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారు దరువు అంజన్న చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రతాప్,సైదులు తదితరులు పాల్గొన్నారు. -
యువత చేతిలో దేశ భవిష్యత్
● అర్హులు విధిగా ఓటు హక్కు పొందాలి ● 25 నుంచి ఇంటింటి గణన ● కలెక్టర్ దీపక్ తివారి ● వికారాబాద్లో ఎస్ఐఆర్పై 2కే రన్ అనంతగిరి: అర్హులు విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ యువత చేతిల్లోనే ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సచించారు. జూన్ 25 నుంచి జూలై 26వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ ఎస్ఐఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జిల్లా యువజన క్రీడల విభాగం అధికారి సత్తార్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నేమత్ అలీ తదితరులు పాల్గొన్నారు. భూ సేకరణ పూర్తి చేయండి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ సేకరణ చేపట్టాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో రేడియల్ రోడ్, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ కోసం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ అభివృద్ధి నిమిత్తం సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనలల కలెక్టర్ వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డీఓలు వాసుచంద్ర, అనిత, తహసీల్దారు పాల్గొన్నారు. వేగవంతం చేయండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మొదటి విడత ఇళ్ల పురోగతిపై సమీక్ష చేశారు. ఇళ్లు మంజూరైన వారు త్వరితగతిన పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ దశరథ్ సింగ్, డిప్యుటీ ఈఈ ముక్రం బాబా, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ‘సీజనల్’పై అప్రమత్తంగా ఉండండి పూడూరు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. బుధవారం పూడూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర ఓటరు జాబితాకు సహకరించండి
అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి కొడంగల్ రూరల్: సమగ్ర ఓటరు జాబితాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి సూచించారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు. ర్యాలీలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(సర్)లో భాగంగా సర్వే నిర్వహించే అధికారులకు ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు సహకరించాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు సర్వేలో పాల్గొంటూ తప్పులు లేకుండా జాబితా సిద్ధం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కొడంగల్, దుద్యాల మండలాల తహసీల్దార్లు రాంబాబు, కిషన్నాయక్, ఎంఈఓ రాంరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు అమ్మవారి జాతర కొనసాగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించారు. ఆలయ ఆవరణలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. రూ.6,92,047 సమకూరినట్లు ఆలయ ఈఓ శేఖర్గౌడ్, చైర్మన్ ప్రవీణ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయ ఈఓ బాల నర్సింహ పర్యవేక్షించారు. కరన్కోట్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరక్టర్లు సుజాత, నర్సింలు, పుఠ్యానాయక్, రాజుగౌడ్, రాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. దౌల్తాబాద్: మండల వ్యవసాయ అధికారిగా తులసి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఏఓ లావణ్య పూడూరు మండలానికి బదిలీకాగా.. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తులసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి అనంతగిరి: నగరంలోని ఇందిరా పార్క్లో ఈ నెల 21న తెలంగాణ ఉద్యమ కారుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. బుధవారం వికారాబాద్లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలన్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలన్నారు. గుర్తింపు కార్డులు, పెన్షన్ ఇవ్వాలన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాయకులు శ్రీనివాస్, కావాలి వసంత్ కుమార్, ఆకుల శివకుమార్, ప్రకాష్ గౌడ్, దష్టప్ప, డప్పు వెంకట్, ఈదనోళ్ల రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో రెండో విడత ‘ఇందిరమ్మ’
పరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీలను అములు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నట్లు వివరించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కుల్కచర్ల: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక కార్యాచరణలో సాగుతున్నామని అన్నారు. పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించడం ద్వారా 27లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. ఉద్దండపూర్ పథకంతో పరిగి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని, భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, బ్లాక్ బీ అధ్యక్షుడు భరత్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, నాయకులు డీటీ చంద్రశేఖర్, గిర్దవరి రవీందర్ చారి, ఆయా గ్రామాల సర్పంచులు నర్సింలు యాదవ్, తిరుపతయ్య, మడుగు శ్రీనివాస్, పీరంపల్లి వెంకటయ్య, చంద్రభూపాల్ రావు, రాజు, లాలు, గోవర్దన్ రెడ్డి, భరత్కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
వ్యాపారులతోనే మార్కెట్కు గుర్తింపు
తాండూరు: తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకు గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్ సభ్యులతోనే రాష్ట్రంలోనే గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మర్చంట్ అసోసియేషన్ 2026– 28 సంవత్సరానికి ఎమ్మెల్యేతో పాటు.. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి, మాజీ చైర్పర్సన్ స్వప్నపరిమళ్, వ్యాపారులు, నాయకుల సమక్షంలో బుధవారం మార్కెట్ నూతన కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు వీరేందర్తో పాటు నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. -
సీఎం చొరవతో దేవాలయాల అభివృధ్ది
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి దౌల్తాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తుందని తెలిపారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి నూతన దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. గుడి నిర్మాణం కోసం ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. వారి కోరిక మేరకు సీఎం రూ.2 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, నాయకులు వీరన్న, వెంకట్రెడ్డి, ప్రమోద్రావు, రాజశేఖర్రెడ్డి, దస్తప్ప, రెడ్డిశ్రీనివాస్, సత్యపాల్ తదితరులున్నారు. -
ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
తాండూరు రూరల్: ప్రాజెక్టు కాల్వల పునరుద్ధరణకు తాండూరు మండలం చంద్రవంచ వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా.. బుధవారం ఆ గ్రామ మహిళలు కొందరు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అభివృద్ధి పనులకు అడ్డుకోవద్దని చెప్పినా ససేమిరా అనడంతో ఖాళీ టిప్పర్లతో వెనుదిరిగారు. ఇదే విషయమై తహసీల్దార్ తారాసింగ్ను వివరణ కోరగా.. కోట్పల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రామం నుంచి తరలించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారని తెలిపారు. కానీ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. త్వరలో గ్రామస్తులతో మరోసారి చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటాం. ఇసుక పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తాం. ప్రజలు సహకరించాలి. -
రోకలిబండతో మహిళపై దాడి
ఆస్తి గొడవలే కారణం తాండూరు: ఆస్తి గొడవల కారణంగా ఓ వ్యక్తి తన చిన్నమ్మపై రోకలిబండతో దాడి చేసిన ఘటన తాండూరులో బుధవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మల్రెడ్డిపల్లికి చెందిన మిట్టి వెంకటయ్య, మిట్టి పాండు అన్నాదమ్ములు. ఓ ఇంటి విషయంలో వీరి కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పాండు భార్య అరుణ సదరు ఇంటికి తాళం వేసింది. దీనిపై ఆవేశానికి లోనైన వెంకటయ్య కుమారుడు ప్రవీణ్ చిన్నమ్మతో గొడవకు దిగాడు. ఈక్రమంలో పక్కనే ఉన్న రోకలిబండతో అరుణపై దాడికి పాల్పడ్డాడు. తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలైన ఆమెను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యుం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
ముక్కుపుటాలు అదిరి
మురుగు చేరి..మొయినాబాద్: మున్సిపాలిటీతో పాటు మండలం మొత్తంలో 48 చెరువులు, కుంటలున్నాయి. వీటిలో కొన్ని కబ్జాలకు గురికాగా మరికొన్ని చెరువులు మురుగునీటితో నిండిపోయాయి. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం ఊరుముందు కుంట, చిలుకూరు పెద్ద చెరువు, మొయినాబాద్ దర్గ చెరువు, హిమాయత్నగర్ బూరుగుకుంట, ఎనికేపల్లి మాల కుంట, బంగాలిగూడ బంగాలిచెరువు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆయా గ్రామాల్లోని మురుగు నేరుగా కుంటల్లో కలుస్తోంది. అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్లను సైతం నేరుగా చెరువులు, కుంటల వద్దకు తీసుకెళ్లి వాటిలో వదిలేశారు. అదే విధంగా మండలంలోని నాగిరెడ్డిగూడ అబ్బుకుంట, అమ్డాపూర్ పటేల్కుంట, చిన్నమంగళారం చిన్నచెరువు, మేడిపల్లి మేడికుంట, కుమ్మరికుంటలోకి నేరుగా మురుగునీరు వెళ్లి చేరుతుంది. దీంతో ఆయా చెరువులు, కుంటల్లోని నీరంతా కాలకూట విషంలా మారిపోయింది. దుర్గంధభరితంగా ఊర చెరువులు, కుంటలు నేరుగా చేరుతున్న వ్యర్థాలు, డ్రైనేజీ నీరు కలుషితమవుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం చెరువులు, కుంటల్లోకి మురుగు చేరకుండా ఎస్టీపీలు నిర్మించాలి. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని. పెద్దమంగళారంలోని ఊరుముందు కుంటలో నీటిని శుద్ధి చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. జలమండలి ఆధ్వర్యంలో హిమాయత్నగర్, నాగిరెడ్డిగూడ వద్ద రెండు ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. అవి పూర్తయితే మురుగు నీటిని వాటిలోకి మళ్లించే అవకాశం ఉంది. – జాకీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, మొయినాబాద్ గ్రామాల్లోని మురుగునీరు చెరువులు, కుంటల్లో చేరడంతో అవి కలుషితం అవుతున్నాయి. చిలుకూరు పెద్ద చెరువులోకి మొయినాబాద్, చిలుకూరు మురుగునీరు నేరుగా చేరుతోంది. మొయినాబాద్ నుంచి పైప్లైన్ వేసి పెద్దచెరువులో మురుగు వదులుతున్నారు. చేపలు పెంచుతున్న చెరువుల్లోకి మురుగునీరు చేరడంతో రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. – జొన్నాడ రాజు, చిలుకూరు -
మురుగు ఇలా.. ఇళ్లల్లో ఉండేదెలా?
దుద్యాల్: మండల పరిధి ఎక్కచెరువుతండాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిన్నమొన్నటి వర్షాలతో వీధుల్లో వరద నీరు నిలిచి తీవ్ర అసౌకర్యాన్ని తలపిస్తోంది. ఈ సందర్భంగా తండా వాసులు కొందరు మాట్లాడుతూ.. వాన నీరుముందుకు సాగక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. దుర్వాసతో ఇళ్లలో ఉండలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. దోమలు వృద్ధి చెంది, వ్యాధుల బారిన పడతామని వాపోతున్నారు. అధికారులు స్పందించి, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టి, సమస్యను పరిష్కరించాలని కోరారు. -
అటవీ భూమి ఆక్రమణపై సీరియస్
బషీరాబాద్: మండలంలోని మైల్వార్ రిజర్వు ఫారెస్టులో ప్రభుత్వ అటవీ భూమిని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నంపై అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అటవీ సంరక్షణలో భాగంగా తవ్విన ఇంకుడు గుంతలను పూడ్చి కబ్జా చేసేందుకు యత్నించిన కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా ఇందిరానగర్ తండాకు చెందిన శంకర్ నాయక్, రవి సర్దార్, హన్మ్యానాయక్లపై ఫారెస్టు సెక్షన్ అధికారిణి స్నేహశ్రీ బుధవారం కోర్టు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఫారెస్టు బీట్ ఆఫీసర్ మల్లప్పతో కలిసి బషీరాబాద్ ఎస్ఐ విట్టల్ సహకారంతో ఇందిరానగర్ తండాలో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బుధవారం శంకర్ నాయక్ను ఠానాకు రావడంతో సెక్షన్ అధికారి నోటీసులు అందజేశారు. రిజర్వు ఫారెస్టు భూములపై అక్రమ ఆక్రమణలను సహించబోమని, అటవీ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణను అధికారులు మరింత ముమ్మరం చేశారు. ఇంకుడు గుంతలు మూసివేసి కబ్జాకు యత్నం ముగ్గురు కర్ణాటక వాసులపై కేసులు నమోదు నోటీసులు జారీ చేసిన సెక్షన్ ఆఫీసర్ -
ఎరువుల కోసం వెళ్లి.. అనంతలోకాలకు
పరిగి: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పంట సాగు చేసేందుకు ఎరువుల కోసం వెళ్లిన వ్యక్తి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చిగురాల్పల్లి గేట్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూర్ మండలం మోమిన్కలాన్ గ్రామానికి చెందిన జావిద్(30), బుధవారం గ్రామం నుంచి పరిగికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఈ క్రమంలో పరిగి నుంచి లక్నాపూర్ వరకు రోడ్డు మరమ్మతు పనులు కోసం మట్టిని తరలిస్తున్న టిప్పర్.. జావిద్ను ఢీకొట్టి, అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఖైరున్బీ, ఓ కుమారుడు ఉన్నాడని, ఖైరున్బీ మరలా గర్భంతో ఉన్నట్లు బంధువులు పేర్కొన్నారు. -
పవర్ గ్రిడ్ భూ సేకరణపై సమీక్ష
అనంతగిరి: మార్కెట్ విలువ ఆధారంగా భూముల ధరలు నిర్ణయించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పవర్ గ్రిడ్ ద్వారా 765 కేవీ లైన్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ గ్రిడ్ పనుల నిమిత్తం సేకరించాల్సిన భూములపై రైతులతో చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం గురించి తెలియజేసి వారి సమ్మతితో భూ సేకరణ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డీఓలు వాసుచంద్ర, అనిత, పవర్ గ్రిడ్ డీజీఏం దామోదర్ నాయుడు, తహసీల్దార్లు, పవర్ గ్రిడ్ అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్కు సన్మానం దోమ: తహసీల్దార్ రవీందర్ను కాంగ్రెస్ పార్టీ నేతలు మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, నేతలు అంతిరెడ్డి పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలిగించవద్దు తాండూరు రూరల్: ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని తాండూరు బ్లాక్ ఆత్మకమిటీ చైర్మన్ శంకర్రెడ్డి అన్నారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించ వద్దని డీలర్లను ఆదేశించారు. తాండూరు ప్రాంతానికి యూరియా, డీఏపీ అధిక సంఖ్యలో స్టాక్ తెప్పించేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఏడీఏ అరుణ మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏఓలు కొమరయ్య, పవన్ ప్రీతం, శ్వేతరాణి, అనిత, డీలర్లు పాల్గొన్నారు. అతివల భద్రత.. షీటీం బాధ్యత తాండూరు: మహిళల భద్రత కోసమే షీటీం పని చేస్తోందని తాండూరు షీటీం బృందం పేర్కొంది. బుధవారం స్థానిక పాఠశాలలో బాలికల భద్రత గురించి అవగాహన కల్పించారు. చట్టాల గురించి వివరించారు. ప్రమాద సమయంలో 100 టోల్ ఫ్రి నంబర్ లేదా 181 కాల్ చేయాలని సూచించారు. పట్టణంలోని సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిసరాలను పర్యవేక్షిస్తామని, ఎవరైనా మహిళలు, బాలికలను వేధించినట్లు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో షీటీం సభ్యులు రోహిణి, ఉపాధ్యాయులు వెంకటేశ్, గణేషన్, తేజస్విని, నవనీత, కృష్ణవేణి తదితరులు ఉన్నారు. 28న బీఎల్ఓ, బీఎల్ఓలకు శిక్షణ డీఆర్ఓ స్వర్ణలత ధారూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత సందర్శించారు. బీఎల్ఓ, సూపర్వైజర్లతో సమావేశమైన ఎస్ఐఆర్పై సూచనలు చేశారు. ఈ నెల 28న బీఎల్ఓ, బీఎల్ఏలకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీలత్దార్ సాజిదాబేగం, డీటీ శ్రీలత, ఆర్ఐలు దేవేందర్రెడ్డి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
మట్టి పరీక్ష ద్వారా ఎరువుల వినియోగం
పూడూరు: భూసార పరీక్షల ఆధారంగా ఖేతి బచావో అభియాన్ను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం పూడూరు మండల కేంద్రంలో వరి సాగులో కృత్రిమ మేధస్సు వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అభియాన్ ప్రాముఖ్యతను గ్రహించి, బూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ శైలజ, డాక్టర్ క్రిష్ణవేణి, డాక్టర్ బజేంద్ర వ్యవసాయ ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పాండు, ఎంఆర్ఓ విజయ్కుమార్, సర్పంచ్ కిజర్పాషా, పీఎసీఎస్ మాజీ చైర్మన్ రఘునాథ్రెడ్డి, మురళీధర్రెడ్డి, రాందాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ఆమనగల్లు: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలలు వేసి, గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎస్సీ లో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు, ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా చారకొండ వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యాకమిషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రూపొందించి అ మలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారుస్తూ అత్యాధునిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములమ్మ, ఉపసర్పంచ్ విజయలక్ష్మి, ఎంఈఓ చాంప్లానాయక్, మార్కెట్ డైరెక్టర్ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకురు ప్రభాకర్రెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ అంజయ్యగౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు
అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొడంగల్ నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకే అమ్మాలని ఆదేశించారు. ఎక్కువ ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు ఉంటాయన్నారు. నకిలీ విత్తనాల కట్టడికి జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు బీమ, రైతు భరోసా తదితర పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. విత్తనాల పంపిణీ, నిల్వలను రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు. సన్న రకం వడ్ల సాగును ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ, విస్తరణ అధికారులు పాల్గొన్నారు. త్వరితగతిన పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 133 దరఖాస్తులు స్వీకరించారు. వీటిని ఆయా శాఖలకు బదలాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, డీఆర్ఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
గుడిసెలు లేని రాష్ట్రానికి కృషి
● హౌసింగ్ శాఖ రాష్ట్ర టెక్నికల్ అసిస్టెంట్ ఈశ్వరయ్య ● పెద్దేముల్ మండలంలో పర్యటన తాండూరు రూరల్: తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని హౌసింగ్ శాఖ రాష్ట్ర టెక్నికల్ అసిస్టెంట్ ఈశ్వరయ్య అన్నారు. సోమవారం పెద్దేముల్ మండలం చైతన్య నగర్, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ ఖలీమొద్దీన్, ఏఈ ఆకాంక్ష, ఎంపీడీఓ తిరులమస్వామి, ఎంపీఓ రతన్సింగ్, సర్పంచ్ గౌరమ్మ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మరో ఐదుగురు అగ్నివీరులు ఉద్యోగానికి ఎంపికై న బండవెల్కిచర్ల యువకులు కుల్కచర్ల: అగ్నివీర్ ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో మండల యువత సత్తాచాటుతున్నారు. వారం రోజుల క్రితం 17మంది యువకులు అగ్నివీర్కు ఎంపికవగా ఇందులో బండవెల్కిచర్లకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఇదే ఊరికి చెందిన మరో ఐదుగురు సెలెక్టయ్యారు. వీరిలో రమేశ్, మల్లేశ్, శ్రీకాంత్, శివకుమార్, గణేశ్ ఉన్నారు. గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి వెంకటేశ్ యువకులకు తర్ఫీదునిస్తూ తన సొంత డబ్బులతో వీరికి అవసరమైన సామగ్రిని అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారని స్థానికులు తెలిపారు. యువకుల ఎంపికపై సర్పంచ్ మడుగు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, పాంబండ ఆలయ మాజీ చైర్మన్ కోట్ల మైపాల్రెడ్డి హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు. ఈనెల 20వరకు విడుదల కానున్న ఫలితాల్లో తమ గ్రామానికి చెందిన మరికొంత మంది ఉద్యోగాలు సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. అధిక ఫీజులను నియంత్రించాలి అనంతగిరి: ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజుల వసూలును వెంటనే నియంత్రించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఈఓ అబ్దుల్ ఘనికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ జాయింట్ సెక్రటరీ శివ, నాయ కులు సాయిచరణ్, మధు, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
మోమిన్పేట తహసీల్దార్గా మునీరొద్దీన్
మోమిన్పేట: మండల తహసీల్దార్గా మునీరొద్దీన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ రవీందర్ దోమకు బదిలీ ఆయ్యారు. కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న మునీరొద్దీన్ బదిలీ పై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. దోమ తహసీల్దార్గా రవీందర్ దోమ: మండల నూత న తహసీల్దార్గా రవీందర్ సోమవారం బా ధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహసీల్దార్ గోవిందమ్మ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయ డీఏఓగా బదిలీ అయ్యారు. మోమిన్పేటలో విధులు నిర్వహిస్తున్న రవీందర్ను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెవెన్యూ సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. సకాలంలో పరిష్కరిస్తాం ఎస్పీ స్నేహమెహ్ర అనంతగిరి: ప్రజావాణికి వచ్చిన ఫిర్యా దులను సకాలంలో పరిష్కరిస్తామని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపా రు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాలకు చెందిన బాధితులు ఎస్పీని కలిసి సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాధితులకు సత్వర నాయం జరిగేలా చూస్తామన్నారు. పెండింగ్ కేసులను.. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ స్నేహమెహ్ర పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలోని సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు జానయ్య, శ్రీనివాస్, అంజయ్య, శ్రీనివాస్, నర్సింగ్ యాదయ్య,వీరేష్ పాల్గొన్నారు. యోగా డేనుఘనంగా నిర్వహించాలి అనంతగిరి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ కొప్పుల రాజశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దీన్దయాల్ బాంగ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కమిషన్ యోగాను సామర్థ్య ఆధారిత వైద్య విద్య పాఠ్య ప్రణాళికలో ఒక ముఖ్యమైన అంశంగా చేర్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలలు ప్రతి సంవత్సరం విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య నిపుణుల భాగస్వామ్యంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఎన్ఎంసీ సూచిస్తోందన్నారు. కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ స్వప్న, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. షాట్పుట్ విభాగంలో సాయికిరణ్కు గోల్డ్మెడల్ దుద్యాల్: మండలంలోని హస్నాబాద్కు చెందిన అల్వాల్ సా యి కిరణ్ షాట్పుట్ విభాగంలో బంగారు పతకం సాధించారు. పంజాబ్ రాష్ట్రం లుదియానలో అండర్ – 20 షాట్పుట్ పోటీలు జరిగాయి. తెలంగాణ తరఫున షాట్పుట్ విభాగంలో సాయి కిరణ్ పాల్గొని 17.71 మీటర్ల దూరం విసిరి ప్రతిభ చాటాడు. దీంతో బంగారు పతకం వరించింది. నేడు జాబ్ మేళా పరిగి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్కేఎస్ఎస్ ఆధ్వర్యంలో నేడు(మంగళవారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రానిక్ కంపెనీలో పని చేసేందుకు 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు, పదో తరగతి ఆపై చదివిన వారు హాజరుకావాలన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బడి గంటలు మోగిన వేళ
వికారాబాద్: వేసవి సెలవుల అనంతరం సోమ వారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆదివారం వరకు ఆటపాటలతో గడిపిన చిన్నారులు ఉదయం బడిబాట పట్టారు. మొదటి రోజు, అందులోనూ అమావాస్య కావడంతో 50శాతం లోపే హాజరయ్యారు. మన ఊరు – మన బడి, అమ్మా ఆదర్శ పాఠశాలల పథకం కింద స్కూళ్లను అభివృద్ధి చేశారు. గతంతో పోలిస్తే సమస్యలు అంతగా కనిపించలేదు. తొలి రోజు విద్యార్థులు బడి ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేయడం, అలంకరించడం వంటి పనుల్లో మునిగి పోయారు. నేడు(మంగళవారం) పాఠ్య, నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వపాఠశాలలు ఉండగా 80వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కోవిద్యార్థికి రెండు జతల చొప్పున 1.5 లక్షల యూనిఫారాలు అందజేయాల్సి ఉంది. ఇంకా ఇవి సిద్ధం కాలేదు. 5,27,290 పాఠ్యపుస్తకాలు, 5,21,904 నోటు పుస్తకాలు స్కూళ్లకు చేరాయి. పలు పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఆనందంగా టిఫిన్ చేయ డం కనిపించింది. పాఠ్యపుస్తకాలు అందజేత దౌల్తాబాద్: మండలంలో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు అంతంతమాత్రమే హాజరయ్యారు. ఉద యం విద్యార్థులకు టిఫిన్ అందజేశారు. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు పంపిణీ చేశారు. దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాలలో 80 మంది విద్యార్థులు ఉండగా 30 మంది వచ్చారు. 40శాతమే హాజరు యాలాల: మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలలో 40 మందికి పైగా విద్యార్థులు ఉండగా, కేవలం 15 మంది మా త్రమే హాజరయ్యారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించారు. మండల వ్యాప్తంగా సుమారు 4,600 మంది విద్యార్థులు ఉండగా 40 శాతం మంది మాత్రమే హాజరైనట్లు ఎంఈఓ మహిపాల్రెడ్డి తెలిపారు. సమస్యలతో స్వాగతం సందడిగా పాఠశాలలు ఆటపాటలతో.. ధారూరు: మొదటి రోజు విద్యార్థులు ఇళ్ల నుంచి ఉత్సాహంగా పాఠశాలలకు బయలుదేరారు. రోజంతా ఆటపాటలు, క్రీడలతో సరదాగా గడిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమై వారితో కలిపి ఆటల పోటీల్లో పాల్గొన్నారు. పుస్తకాలను పంపిణీ చేశారు. ఘన స్వాగతం నవాబుపేట: మండలంలోని 11 ఉన్నత, 5 ప్రాథమికోన్నత, 26 ప్రాథమిక, ఒక కేజీబీవీ, జ్యోతిబాపూలే, ఆదర్శ పాటశాలలు ఉన్నాయి. వీటిలో ఏటా దాదాపపు 2,300 మంది వరకు చదువుకుంటున్నారు. సోమవారం పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుఽలకు ఘనంగా స్వాగతం పలికారు. మొదటి రోజు చిన్నారులు ఉత్సహంగా గడిపారు. పండుగలా ప్రారంభమైన పాఠశాలలు -
రేపు ఆరుట్ల పబ్లిక్ స్కూలు ప్రారంభోత్సవం
మంచాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఈ నెల 17న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇదే వేదికగా అల్పాహారం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల సందర్శన, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, నూతనంగా ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు. పాఠశాలకు సమీపంలోని అమ్మోరుతల్లి దేవాలయం సమీపంలో హెలీప్యాడ్ పనులు చేపట్టారు. అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 20 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఆరుట్లకు సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, ఎంపీడీఓ వసంతలక్ష్మి, ఏసీపీ రాజు, సర్పంచ్ శోభ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాజరు కానున్న సీఎం రేవంత్రెడ్డి ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం -
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసులు
బషీరాబాద్: ఇసుక అక్రమ రవాణాపై ఆదివారం రాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు మూడు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఎక్మాయికి చెందిన గోపాల్రెడ్డి, సిద్దిక్ మైముద్దీన్ ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ఎరువుల శ్రీనివాస్ కుప్పన్కోట్కు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ విఠల్ హెచ్ఛరించారు. అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ సర్వే నంబర్ 24లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన ప్రహరీని సోమవారం తహసీల్దార్ సుదర్శన్రెడ్డి ఆదేశాల మేరకు గిర్దవార్ రాంబాబు, జీపీఓలు జేసీబీ సాయంతో కూల్చివేయించారు. ఈ మేరకు కందకం తవ్వించి అధికారిక బోర్డును ఏర్పాటు చేశారు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీ నిర్మాణం చేపట్టారని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కందుకూరు: ఫ్యూచర్సిటీలో నిర్మిస్తున్న 330 అడుగుల రేడియల్ రహదారి నిర్మాణ పనులను సోమవారం మండల పరిధిలోని బేగరికంచె రైతులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని నిలదీశారు. వీరికి సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుబ్బాక రాంచందర్, మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్ మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు వారి వద్దకు వచ్చారు. కలెక్టర్తో గతంలో నిర్వహించిన సమావేశంలో ఎకరాకు రూ.35 లక్షలు ఇస్తామని అంగీకరించారని, మళ్లీ ఎందుకు పనులు అడ్డుకుంటున్నారని తహసీల్దార్ గోపాల్ వారిని ప్రశ్నించారు. ఎకరాకు రూ.40 లక్షలు పరిహారం ఇవ్వాలని, ఏఏ రైతు భూమి రోడ్డు నిర్మాణంలో పోతుందో లిస్టు ప్రదర్శించాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్డీఓను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని తహసీల్దార్ వారికి సూచించి పంపించారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: పంచాయతీ సర్పంచులు, పారిశుద్ధ్య కార్మికుల వేతన బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసింది. డిసెంబర్ 22 నుంచి మే 2026 వరకు జిల్లాలోని 515 మంది సర్పంచులకు మొత్తం రూ.1,78,13,850 విడుదల చేసింది. మరో పది మంది సర్పంచుల ఆధార్ నంబర్లు ఇతర ఖాతాలతో అనుసంధానమై ఉండటం, ఇతర శాఖల నుంచి వేతనాలు పొందుతుండటంతో వేతనాలను నిలిపివేశారు. మాడ్గుల మండలం నర్సంపల్లికి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వ హించలేదు. ఆ గ్రామ పంచాయతీకి గౌరవ వేతన చెల్లింపు చేయలేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని 2,907 మంది పంచాయతీ సిబ్బందికి నెలకు రూ.9,500 చొప్పున మే నెలకు సంబంధించిన వేతనాలు రూ.2,68,94,500 ఆయా ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ప్రకటించారు. -
డయేరియాపై అవగాహన అవసరం
ఇబ్రహీంపట్నం రూరల్: వర్షాకాల సీజన్లో డయేరియా ప్రబలకుండా నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి డయేరియా క్యాంపెయిన్, పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ఈనెల 15 వరకు సన్నాహక దశగా, 16 నుంచి జూలై 31 వరకు అమలు దశగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అంగన్వాడీ, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈనెల 28న నిర్వహించనున్న పల్స్పోలియో ద్వారా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లలకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో డీ వార్మింగ్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న ఇంటింటీకి తిరిగి మాత్రలు అందిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం
● ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసింది ● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తాండూరు: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యా వ్యవస్థ విద్యార్థులను జీతాలకు పని చేసే బానిసలుగా తయారు చేసేలా ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని హంసా గ్రాండ్ కన్వెన్షన్లో పట్టణానికి చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యావంతులతో మేధో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్ డవలప్మెంట్ విద్య లేకపోవడంతో స్వశక్తితో పరిశ్రమలు నెలకొల్పే విధంగా నైపుణ్య విద్య అందడం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి ప్రభుత్వ పాఠశాలలు తీరు మారలేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ప్రహ్లాద్రావు, మనోహర్రావు, డాక్టర్ సంపత్కుమార్, రమేష్కుమార్, జయప్రసాద్, బాలేశ్వర్గుప్తా, వీరేందర్, మురళీకృష్ణ, సాహు శ్రీలత తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత పనుల పట్ల చిన్నచూపు వద్దు యాలాల: వ్యక్తిగత పనుల పట్ల కొందరు చిన్నచూపు చూస్తుంటారని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎవరి పనులు వారే చేసుకుంటారని.. ఆ దిశగా మనం కూడా ముందుకు సాగాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో జేకేఎంఆర్ ఆధ్వర్యంలో మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మన సమాజంలో బడులు, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా నిర్వాహణ మాత్రం జరగడం లేదన్నారు. నిర్వాహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావిస్తే సమస్య ఉండదన్నారు. ఏటా తన కోటా కింద రూ.5 కోట్లు ఉంటాయని, ఆ నిధుల్లో ప్రభుత్వ బడుల అభివృద్ధికి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారాలన్నారు. కేజీబీవీ, కళాశాల సందర్శన అనంతరం స్థానిక కేజీబీవీ, కళాశాలను ఎంపీ సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, మెనూ అమలుపై కేజీబీవీ ఎస్ఓ మంగమ్మను అడిగి తెలుసుకున్నారు. వంట తయారీపై ఆరా తీశారు. ఏ గ్యాస్ వాడుతున్నారని ప్రశ్నించగా, డొమెస్టిక్ గ్యాస్ వాడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. ఇందుకోసం నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తున్నట్లు ఎంపీకి వివరించారు. కమర్షియల్ గ్యాస్ వాడొచ్చుగా అని అక్కడే ఉన్న ఎంఈఓ, ఎస్ఓకు సూచించారు. త్వరలో భారీ గ్యాస్ పొయ్యిలు వస్తాయని, అప్పటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, జిల్లా కార్యదర్శి యూ రమేష్కుమార్, తహసీల్దార్ గాయత్రి, ఎంపీడీఓ శ్రీనిజ, ఎంఈఓ మహిపాల్రెడ్డి, హెచ్ఎం సిద్రామేశ్వర్, నాయకులు వెంకటేశ్, యాదగిరి, రవీందర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు ● రోడ్లపై నిలిచిన వరదనీరు తాండూరు టౌన్: పట్టణ పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. గాలి తీవ్రతకు మాతాశిశు ఆస్పత్రి గేటు పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫార్మర్పై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు విద్యుత్ శాఖాఽధికారులకు సమాచారం ఇవ్వగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిసింది. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధుల్లో వరదనీరు నిలవడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. దంచికొట్టిన వాన యాలాల: మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. గాలి తీవ్రతకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో కరెంటు సరఫరా ఆగిపోయింది. యాలాలకు చెందిన మల్లేశం కొత్త ఇంటి పైకప్పు రేకులు ఎగిరి పోయాయి. యాలాల – లక్ష్మీనారాయణపూర్ మార్గంలో ఓ భారీ చెట్లు నేలకొరిగింది. తడిసిన జొన్న బస్తాలు ధారూరు: మండలంలోని మునూక్నరుసోమారం కొనుగోలు కేంద్రంలో వర్షానికి జొన్నల బస్తాలు తడిసిపోయాయి. తూకం వేసిన జొన్నలను తరలించకపోవడంతోనే నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. -
మా భూముల్లోకి మమ్మల్ని వెళ్లనివ్వండి
ఇబ్రహీంపట్నం రూరల్: మా భూముల్లోకి మమ్మల్ని వెళ్లనివ్వండి .. వ్యవసాయం చేసుకొని బతుకుతాం అని అధికారులను కాస్బాగ్ రైతులు వేడుకున్నారు. సోమవారం నాదర్గుల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాదర్గుల్ సర్వే నంబర్ 613లో తమ భూములు ఉన్నాయని, అక్కడ అడ్డుగా ఉన్న బ్లూషీట్స్ తొలగించి రోడ్డు మార్గం చూపించాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. నాదర్గుల్ నుంచి కలెక్టరేట్ వరకు రైతుల పాదయాత్ర -
రక్తదాతకు గవర్నర్ ప్రశంస
అనంతగిరి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 118వ సారి రక్తదానం చేసిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి చౌదరిని ఆదివారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నగరంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. యువత దేశానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని గవర్నర్ పిలుపునిచ్చారు. భవిష్యత్లో సైతం రక్తదానం చేయడానికి ముందుకు వస్తానని సాయి చౌదరి పేర్కొన్నారు. కొడంగల్ రూరల్: స్థానిక బంజారా భవన్లో జులై 1వ తేదీన నిర్వహించనున్న లంబాడ హక్కుల పోరాట సమితి(ఎల్హెచ్పీఎస్) 30వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలో నాయకులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని, ఎస్టీలు సాగుచేస్తున్న లావుణి, సీలింగ్, పోడు భూములకు పూర్తి హక్కులతో అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బంజారా నాయకులు సామ్యానాయక్, రవినాయక్, లోక్యానాయక్, బాబ్యాయక్, కమ్లీబాయి, బిక్కిబాయి, సెంక్రిబాయి తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ రూరల్: గ్రామాల్లో సర్వే నిర్వహించే సమయంలో బీఎల్ఓలకు సంపూర్ణ సహకారం అందించేందుకు కృషి చేయాలని ిసీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఇందనూర్ బషీర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యదర్శి ఎండీ మహిమూద్ అధ్యక్షతన మండలాల కార్యదర్శుల ఆధ్వర్యంలో బీఎల్ఏల నియామక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పూర్తి స్థాయిలో అవగాహనతో సర్వేలో పొందుపరిచే విధంగా సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో నేతలు శ్యాంసుందర్, మల్లప్ప, ఎండీ రహీం, వెంకటప్ప, శ్రీనివాస్, మోహన్సింగ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు టౌన్: పట్టణంలోని కొడంగల్ రోడ్డు మార్గంలోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తాండూరు పద్మశాలి సమాజ సభ్యులు, మార్కండేయ కాలనీవాసుల ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం అలంకరణ, అభిషేకం, మహామంగళ హారతి, గణపతి హోమం, మధ్యాహ్నం మహా నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీశివానంద గిరి స్వామి హాజరై ప్రవచనాలు వినిపించారు. అనంతరం పలువురు భక్తులు గీతాపారాయణం గావించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
మీర్పేట: టిప్పర్ రూపంలో దొసుకొచ్చిన మృత్యువు ఇద్దరు ఆటోడ్రైవర్లను బలిగొంది. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రంగూడ ఆదిత్యనగర్కు చెందిన సునీల్ (35) ఆటో శనివారం రాత్రి 10.30 గంటలకు మందమల్లమ్మ చౌరస్తా వద్ద పాడైపోవడంతో స్నేహితుడైన గుర్రంగూడ అరవింద్నగర్ కాలనీకి చెందిన ప్రసాద్కు ఫోన్ చేసి రమ్మన్నాడు. ప్రసాద్ తనకు పరిచయం ఉన్న మరో ఆటోడ్రైవర్ సంతోష్ (35)కు ఫోన్ చేసి రిపేరు కోసం సాయపడాలని పిలిపించాడు. ముగ్గురూ కలిసి సునీల్ ఆటోను తరలించేందుకు మరో ఆటోకు కట్టారు. ప్రసాద్ తన ఆటోను రోడ్డుకు అవతలి వైపు నిలపడంతో రోడ్డు దాటుతుండగా సునీల్, సంతోష్ ఆటోల పక్కన నిల్చున్నారు. అదే సమయంలో ఎల్బీనగర్ నుంచి ఓవైసీ వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్ (ఏపీ29వీ 3873) ఢీ కొట్టింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా, సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంతోష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి, గాయపడ్డ సునీల్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీల్ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. సంతోష్ది మాడ్గుల మండలం రాందుగ్యాల గ్రామం కాగా నగరానికి వచ్చి రెండ్రోజులు ఆటో నడిపి తిరిగి గ్రామానికి వెళ్తుంటాడు. సునీల్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన జావాళ సురేష్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్ (ఫైల్)సునీల్ (ఫైల్) ఆగివున్న ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన టిప్పర్ అక్కడికక్కడే ఒకరి దుర్మరణం చికిత్స పొందుతూ మరొకరి మృతి -
నిందితులను శిక్షించాలని డిమాండ్
తాండూరు టౌన్: పనికోసం వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తలారి హరికృష్ణది హత్యేనని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని సీతారాంపేట్ కమ్యూనిటీ హాల్లో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన తలారి హరికృష్ణ అనే యువకుడు ఏప్రిల్ 29న పని నిమిత్తం రుద్రారం వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. అయితే అతని మృతిపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. హరికృష్ణది ముమ్మాటికే హత్యేనని ఆరోపించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. వెంటనే నిందితులను అరెస్టు చేయని ఎడల పెద్ద ఎత్తున ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పలు ప్రజాసంఘాల నాయకులు కె.శ్రీనివాస్, మల్కయ్య, చంద్రయ్య, అబ్దుల్ వాహద్, గుమ్మడి రత్నం, బుగ్గప్ప, బలరాం, రవి, ఆంజనేయులు, లక్ష్మి, సాయిలు, వెంకటయ్య, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం -
రూ.25 కోట్లతో భవన నిర్మాణం
కొడంగల్: హైదరాబాద్లోని కోకాపేట్లో రూ.25 కోట్లతో మున్నూరు కాపు భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య తెలిపారు. ఆదివారం కొడంగల్లో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి మున్నూరు కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేషన్ ద్వారా కుల బంధువులను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. మున్నూరు కాపు సంఘానికి ఐదు టవర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.25కోట్లతో మొదటి టవర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 17న రవీంద్రభారతిలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, బీసీ సంక్షేమ శాఖ సలహాదారులు హన్మంత్రావు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మిలను సన్మానిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం నియోజకవర్గం నుంచి కాచిగూడ మహాసభకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాకారం చంద్రశేఖర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొండారెడ్డిపల్లికి చెందిన మున్నూరు బిచ్చప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం కొడంగల్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మల్లయ్య, కోశాధికారి కానుకుర్తి నర్సిరెడ్డి, యువక మండలి రాష్ట్ర కార్యదర్శి శేఖర్రెడ్డి, నేతలు బిచ్చప్ప, శ్యాంసుందర్, వెంకటయ్య, వీరేశం, మాసన్న, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య -
మేలైన దిగుబడి
పంట మార్పిడి..కొడంగల్: ఖరీఫ్ సాగు(వానకాలం) సీజన్ మొదలైంది. కొద్ది రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకే రకమైన పంటలను ఏళ్ల తరబడి సాగు చేయడంతో దిగుబడి రాక అనేక సమస్యలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీడ పీడల బెడద అధికం కావడంతో పాటు భూమి సారం తగ్గుతుందని పంట మార్పిడితోనే ప్రయోజనం పొందవచ్చని ఆదర్శ రైతులు చెబుతున్నారు. పత్తి, వరి, కంది అధికం జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నప్పటికీ రైతులు వరి, పత్తి, కంది పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల బెడద పెరిగి రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో భూమి సారం కోల్పోయి పంట ఎదుగుదల క్షీణించి దిగుబడి రాక అన్నదాతలు నష్టపోతున్నారు. వానాకాలంలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా పంటలను సాగు చేస్తున్నారు. మరి కొందరు ఇతర పంటల సాగు విధానం తెలియక ఇబ్బంది పడుతున్నారు. మార్పుతోనే మేలు పంట మార్పిడి చేయాలంటే అంతకు ముందు వేసిన పంటకు భిన్నంగా ఇతర పంటను ఎంచుకోవాలి. ఒక ఏడాది కందులు వేస్తే మరుసటి ఏడాది జొన్నలు, పత్తి, ఇతర పంటలు వేయాలి. పంట మార్పిడి విధానంలో ప్రతి సంవత్సరం సాగు చేసే పంటలను మార్పు చేయాల్సి ఉంటుంది. పంట మార్పిడి చేసే రైతులు భూమి నుంచి పోషకాలను గ్రహించే పంటలకు బదులుగా భూమికి పోషకాలను అందించే పంటలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నలరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించే రైతులు మరుసటి ఏడాది సోయా చిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి ఆకులు పూర్తిగా రాలి తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ ఎరువును అందిస్తు్ంది. చీడపీడల నివారణ కోసం కొన్ని రకాల తెగుళ్లు కొన్ని పంటలను అధికంగా ఆశించి వ్యాప్తి చెందుతాయి. అలాంటి పంటలను వరుసగా వేసుకోకుండా మార్పిడి చేసుకోవాలి. పత్తి, వరి పంట వేయకుండా పప్పు ధాన్యపు పంటలు, నూనె గింజల పంటలు వేసుకోవాలి. జొన్న, సజ్జ, రాగి, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. దీంతో ఆయా పంటల్లో పురుగులను నివారించవచ్చు. వేసుకోవాల్సిన పంటలు కొడంగల్ నియోజకవర్గంలో అధిక మొత్తంలో కంది, పత్తి వేస్తారు. ఈ పంటలతో పోలిస్తే మినుము, పెసర, సోయచిక్కుడు పంటలకు కాయ తొలుచు పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. గతంలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్లో మొక్క జొన్న పంట వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. శనగ పంట వరుసగా వేసుకుంటే కాయ తొలుచు పురుగుల తాకిడి పెరుగుతుంది. ఈ పురుగుల దాడి తక్కువగా ఉండే జొన్న, నువ్వులు, ఉలవ పంటలు వేసుకోవచ్చు. ఒకే రకం పంటల సాగుతో నష్టం ఖరీఫ్ సాగులో మెలకువలు ముఖ్యం వ్యవసాయ పనులు మొదలుపెట్టిన కర్షకులు -
బలవుతున్నా.. పరిహారమేది?
● విద్యుదాఘాతానికి మృతి చెందుతున్న మూగజీవాలు ● అవగాహన లేక పరిహారం పొందలేకపోతున్న బాధితులు దుద్యాల్: విద్యుదాఘాతానికి మూగజీవాలు బలవుతున్న సంఘటనలు అధికమవుతున్నాయి. దీనిపై అవగాహన లేక చాలా మంది నష్ట పరిహారం పొందడం లేదు. ప్రస్తుతం వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి కింద పడుతుంటాయి. పశువులు, పశువుల కాపరులు, రైతులు కింద పడిన విద్యుత్ తీగలను గమనించకుండా వాటికి తగిలి మృత్యువాత పడుతున్న సంఘటనలు ఉంటాయి. ఈ ప్రమాదాల్లో నష్టపోయిన కుటుంబాలకు విద్యుత్శాఖ పరిహారం అందిస్తుంది. కానీ ప్రభుత్వం అందించే పరిహారంపై అధిక శాతం మందికి అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారు. ఒక వైపు పశువులు, మరో వైపు మనుషులు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడుతున్నారు. పరిహారం పొందే విధానం గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పరిహారం అందుకునే విధానం విద్యుత్ ప్రమాదం జరిగిన వెంటనే పరిహారం కోసం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కేసు నమోదైన తర్వాత పశువైద్యుల సహాయంతో శవ పంచనామా చేయించాలి. కేసుకు సంబంధించిన పత్రాలతో విద్యుత్ శాఖ సహాయక ఇంజనీర్ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. మరణ ధ్రువపత్రం, ఎఫ్ఐఆర్, పంచనామా నివేదిక, ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం తదితర కాపీలను జతపరిచి విద్యుత్ ఏఈకి అందజేయాలి. ఏఈ నుంచి పత్రాలు ఏడీఈకి చేరుతాయి. ఆ పత్రాలు ఉన్నతాధికారులకు అందిన తర్వాత నష్ట పరిహారం బాధితుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. మానవులకు ప్రమాదం జరిగితే విద్యుత్ ప్రమాదంతో అంగ వైకల్యం కలిగితే ప్రమాద విషయాన్ని వెంటనే విద్యుత్శాఖ అధికారులకు తెలియజేయాలి. వైద్యం నిమిత్తమైన ఖర్చుకు సంబంధించిన బిల్లులు, ఇతర ఖర్చుల వివరాలకు సంబంధించి ధ్రువ పత్రాలు దరఖాస్తుకు జతపరిచి ఏఈకి అందించాలి. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి నష్ట పరిహారం మంజూరు చేస్తారు. మూగజీవాలకు అయితే.. పశువులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందితే ముందుగా సంబంధిత విద్యుత్శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించాలి. పశువైద్యాధికారి నుంచి పశువు ఖరీదు తెలిపే పత్రం, మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. మృతి చెందిన పశువు నిమిత్తం పరిహారం బాధితుడికి అందిస్తారు. పశు వైద్యులు సూచించిన మేరకు నష్ట పరిహారం అందుతుంది. అర్హులకే ఇస్తాం విద్యుత్ ప్రమాదాలకు సంబంధించిన బాధిత కుటుంబాలు అర్హులైతే పరిహారం తప్పకుండా అందుతుంది. ప్రమాదం జరిగిన స్థాయిని బట్టి పరిహారం ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. మూగ జీవాల విషయంలో పశువైద్యాధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకుంటున్నాం. – ఆనంద్, విద్యుత్ ఏఈ, దుద్యాల్ పరీక్షలు చేస్తాం మూగ జీవాలకు విద్యుత్ ప్రమాదం సంభవించిన వెంటనే పశువైద్యులకు తెలియజేయాలి. ప్రమాదం జరిగిన పశువుకు నిర్ధారణ పరీక్షలు చేస్తాం. నిజ నిర్ధారణ తర్వాత పశువుకు సంబంధించి మరణ ధ్రువ పత్రం, పరీక్షకు సంబంధించి పత్రాలు పశువు యాజమానికి అందిస్తాం. – పరమేశ్వర్, పశువైద్యాధికారి, కొడంగల్ ఇటీవల సంఘటనలు దుద్యాల మండలం పోలేపల్లి తండాకు చెందిన రాథోడ్ చందు నాయక్కు సంబంధించి రూ.70 వేల విలువ చేసే పాలిచ్చే గేదె తండాలోనే ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మండలంలోని పల్లెగడ్డకు చెందిన ముకుంద రెడ్డికి సంబంధించి రూ.60 వేల విలువ చేసే ఎద్దు విద్యుత్ షాక్ గురై మృత్యువాత పడింది. కొడంగల్ మండలం పల్గురాళ్ల తండా మునేగారి సాయిలుకు చెందిన రూ.50 వేల విలువ చేసే ఎద్దు విద్యుదాఘాతానికి గురై మరణించింది. రోటిబండ తండాకు చెందిన పాండు నాయక్(61) పశువులకు మేత కోసి వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. అలాగే సేవ్యానాయక్ చెందిన రూ.90 వేల గేదె విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాత పడింది. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
పూడూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని మంచన్పల్లి అనుబంధ గ్రామమైన మాటుగూడలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితో కలిసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు అందుతున్నాయంటే ఆ మహనీయుని పుణ్యమని చెప్పారు. రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రఘునాథ్రెడ్డి, సర్పంచ్ రాఘవేందర్, ఉప సర్పంచ్ ఆరీఫ్, ఆర్టీఐ కన్వీనర్ వెంకటయ్య, నాయకులు లక్కం సత్యనారాయణ, షకీల్, అబ్రాహం తదితరులు పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య దోమ: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని తన భార్యతో ఘర్షణకు పాల్పడిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. ఎస్ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బాలయ్య(47)కు మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్య సత్యమ్మతో తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో గొడవకు దిగాడు. అదే గ్రామంలో ఉంటున్న తన బంధువు ఇంటికి సత్యమ్మ వెళ్లింది. ఈ క్రమంలో బాలయ్య అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం భార్య ఇంటికి రాగా తలుపులు తెరుచుకోలేదు. దీంతో ఆందోళన చెంది చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వాళ్లొచ్చి ఇంటి తలుపులు పగుల గొట్టగా అతను ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఓ కూతురు ఉంది. సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ప్రత్యేక పూజలు చార్మినార్: అధిక మాసంలో పూజలు నిర్వహిస్తే మిగతా నెలలన్నింటిలో లభించని పుణ్యం ఈ మాసంలో లభిస్తుందని జగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి అన్నారు. ఆదివారం మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఫర్టిలైజర్ యాప్తో పరేషాన్
కొందుర్గు: ఎరువుల కొనుగోలుకు రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దని.. విక్రయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపికచేసింది. ‘ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్’ యాప్ ద్వారా డీలర్లు ఎరువులు విక్రయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వివరాల నమోదులో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఇవీ ఇబ్బందులు ● రైతులకు యాప్పై అవగాహన లేకపోవడం. ● రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం. ● యాప్లో వివరాల నమోదు సమయంలో ఎర్రర్స్ తలెత్తడం. ● యాప్లో పొందుపరిచిన పంటల పేర్లు వాడుక భాషలో లేకపోవడంతో రైతులకు పంటల పేర్ల నమోదులో ఇబ్బందులు. ● కొన్ని పంటల పేర్లు డీలర్లు, అధికారులకు సైతం అర్థం కాకపోవడం విశేషం. ● రైతులు నగదు చెల్లించి ఎరువులు కొనలేని పరిస్థితి. ఈ సమయంలో రెగ్యులర్గా కొనుగోలు చేసే డీలర్ వద్ద తమకు అవసరమైన ఎరువుల స్టాకు లేకపోవడం. ● రైతుల భూమి వివరాలు యాప్లో పూర్తిస్థాయిలో కనిపించకపోవడం. ● డీలర్ వద్ద ఉన్న ఎరువుల స్టాకు యాప్లో ఎప్పటికప్పుడు అప్డెట్ కాకపోవడం. స్టాకు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపించడం. ● రైతుల భూముల వివరాలు హెక్టార్లలో చూపడంతో అయోమయం. ● హాకా రైతు కేంద్రాల అడ్రస్ పూర్తిస్థాయిలో కనిపించకపోవడం. ● ఒకే రైతు రెండు రకాల కాంప్లెక్స్ ఎరువులు తీసుకోవడానికి వీలు లేకపోవడం. ● సింగిల్ సూపర్ పాస్పేట్ యాప్లో కనిపించకపోవడం. ఇలా చేస్తే మేలు ● రైతులకు అనుకూలంగా ఉండేలా యాప్ను సులభతరం చేయాలి. ● పంటల నమోదును డైరెక్టుగా వాడుక భాషలో నమోదు చేసుకునేందుకు వీలు కల్పించాలి. ● గ్రామాలవారీగా సదస్సులు నిర్వహించి రైతులకు యాప్పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. ● పంటల అవసరం మేరకు ఏ రకం ఎరువులైనా బుక్చేసుకునే వీలు కల్పించాలి. ● ప్రభుత్వమే ప్రతి గ్రామంలో వలంటీర్లను నియమించేలా చూడాలి. ● ఎండోమెంట్, వక్ఫ్ తదితర భూములు కౌలుకు తీసుకొని సాగుచేసుకునే రైతుల కోసం ప్రత్యేకంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు పూర్తిస్థాయిలో అవగాహన కరువు వినియోగంలో అడుగడుగునా ఎర్రర్స్ ఆందోళనలో అన్నదాతలు ఎరువుల కోసం డీలర్లు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలుప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. విత్తనాలు నాటేందుకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో సర్కారు ఇలాంటి యాప్లు తీసుకురావడం బాగాలేదు. మాలాంటి రైతులకు చాలా ఇబ్బంది. రెండు మందు బస్తాల కోసం నాలుగైదు రోజులు తిరిగాను. నేరుగా అమ్మడమే బాగుండేది. – కుర్వ నర్సింలు, కొందుర్గు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యాప్లో ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో రైతులు సునాయసంగా వినియోగించేలా మారుతుంది. సమస్యలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయిస్తున్నాం. యాప్తో రైతులు ఇబ్బంది పడకుండా వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. – రాజేందర్ రెడ్డి, ఏఓ, జిల్లేడ్ చౌదరిగూడ -
ప్రారంభానికి సిద్ధం
ప్రారంభానికి సిద్ధమైన కోట్పల్లి కేజీబీవీ హాస్టల్ భవనం● అన్ని హంగులతో పూర్తయిన కేజీబీవీ హాస్టల్ భవనం ● హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు త్వరలోనే ప్రారంభిస్తాం కేజీబీవీ హాస్టల్ భవనం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ప్రహరీ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభిస్తాం. విద్యుత్ సౌకర్యం, తరగతి గదుల్లో ఫ్యాన్లు అమర్చడంతో పాటు ఇతర పనులన్నీ పూర్తి చేశారు. ఆరు నుంచి పదోతరగతి వరకు 250, ఇంటర్లో 160 మంది విద్యార్థినులు చదువుకునే అవకాశం ఉంది. – చంద్రప్ప, ఎంఈఓ, కోట్పల్లి బంట్వారం: మూడేళ్ల కిందట పనులు ప్రారంభించిన కోట్పల్లి కేజీబీవీ హాస్టల్ భవనం ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమైంది. రూ 3.5 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో కరీంపూర్ గేటు వద్ద పనులు మొదలు పెట్టి మూడు అంతస్తులు పూర్తి చేశారు. విద్యార్థినులకు అవసరమైన వసతులతో అందంగా తీర్చిద్దారు. పక్కా భవనం లేకపోవడంతో కొన్నేళ్లుగా కోట్పల్లి కేజీబీవీ తాత్కాలికంగా ప్రాథమిక పాఠశాల భవనంలోనే కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలో ఇంగ్లిష్ మీడియం చదువుకునే అవకాశం ఉంది. తాత్కాలిక భవనంలో సరైన వసతులు లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులకు గురువుతున్నారు. ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన భవనం నిర్మించడంపై బాలికలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
పీఆర్సీ ప్రకటించకపోతే యుద్ధమే
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం తప్పదని సీఐటీయూ జిల్లా కమిటీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యాపీఠ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ.. ప్రతి ఊరు, ప్రతి తండాలో పాఠశాలలు ఉండడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రిగా ప్రకటించిన విషయాన్ని మరిచి, స్కూల్స్ సంఖ్యను కుదిస్తామని అనడం సమంజసం కాదన్నారు. 27 వేల పాఠశాలలను 4 వేలకు తగ్గిస్తామని రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించడం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని పేర్కొన్నారు. జూన్ చివరి నాటికి పీఆర్సీ రిపోర్ట్ ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై సమరం కొనసాగిస్తామని, ఉపాధ్యాయులంతా సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధ్యక్షులు జమున, కోశాధికారి మొయిజ్ఖాన్, సభ్యులు కృష్ణవేణి, బాబురావు, పవన్కుమార్, వెన్నెల, రత్నం, బస్సప్ప, ముత్య ప్ప, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప -
అర్హులైన ఓటర్లను కాపాడుకుందాం
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులైన ఓటర్లను కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ ఆదేశాల మేరకు బొంగ్లూర్లోని ప్రమీదా కన్వెన్షన్ హాల్లో ఆదివారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్స్కు శిక్షణ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్రెడ్డి, పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో కాంగ్రెస్ ఓట్లు పెద్ద ఎత్తున తొలగించబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వహిస్తే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. బీఎల్ఓలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో సాగుతూ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా కాపాడుకోవాలన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై జరిగే కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ట్రైనింగ్ కమిటీ చైర్మన్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. నియోజకవర్గ బీఎల్ఓల శిక్షకుడు కృష్ణారెడ్డి ఓటరు జాబితా పరిశీలన, సవరణల ప్రక్రియ, ఇంటింటికీ నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో మల్రెడ్డి అభిషేక్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, నాయకులు శేఖర్గౌడ్, రాచర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
వేళాయె
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026బడి గంటకువిద్యార్థులకు స్వాగతం పలకనున్న సమస్యలువికారాబాద్: సుదీర్ఘ 53 రోజుల వేసవి సెలవుల తరువాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దశలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. ఎప్పటిలాగే మళ్లీ వారికి సమస్యలే ఆహ్వానం పలకనున్నాయి. విద్యా హక్కుచట్టం అమల్లోకి వచ్చి పదేళ్లు దాటినా? రెండు–మూడేళ్లు వరుసగా మనఊరు–మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలలు లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టినా సర్కారు బడులు ఆశించిన మేర విద్యార్థులను ఆకర్శించలేకపోతున్నాయి. ప్రభుత్వ బడులలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం చేపట్టిన రెండు కార్యక్రమాలు ముగిశాక కూడా సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఇంకా వందకు పైగా పాఠశాలల్లో మరమ్మతులు అవసరమని అధికారులే తేల్చారు. సమస్యల పరిష్కారం వేగవంతం చేయాల్సిన తరుణంలోనూ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. కొత్తగా అల్పాహార పథకం ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనం అందజేస్తుండగా ఈసారి కొత్తగా అల్పాహారం సై తం ఇస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ని కొడంగల్, బొంరాస్పేట, దుద్యాల్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పాఠశాలలో గతేడాది నుంచే అల్పాహారం అందిస్తున్నారు. కాగా ఈసారి నుంచి జిల్లాకు చెందిన మరో ఆరు మండలాల్లో అల్పాహార పథకం ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పరిగి, దోమ, కుల్కచర్ల, తాండూరు, బొంరాస్పేట, యాలాల మండలాల్లో ఈ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు చేర వేసింది. మొదటి రోజు నుంచే పుస్తకాలు జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 65,503 మంది విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీ, ఆదర్శ, గురుకుల పాఠశాలలు కలుపుకొంటే 84,208 మంది చదువుకుంటున్నారు. ఏటా పాఠశాలల పునః ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు బడులకు చేరడంలో జాప్యం జరిగేది. కానీ ఈసారి వారం రోజులు ముందుగానే పాఠ్య, నోట్ పుస్తకాలు బడులకు చేర్చారు. విద్యార్థులకు అందాల్సిన యూనిఫాంలు ఇంకా బడులకు చేరలేదు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, డీఈఓలు ఈసారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గడిచిన పదేళ్లలో ప్రభుత్వ బడులకు సమాంతరంగా ప్రైవేటు పాఠశాల వ్యవస్థ తయారైంది. పదేళ్ల క్రితం వరకు 20 శాతం మాత్రమే ప్రైవేట్ బడుల్లో అడ్మిషన్లు ఉండేవి. ప్రస్తుతం అది 60 శాతానికి పైగా చేరుకుంది. 40 శాతం విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలలో కొత్తగా చేరుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు 40శాతం వరకు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,063 ప్రభుత్వ బడులలో 84,208 మంది విద్యార్థులు ఉండగా.. కేవలం 185 ప్రైవేట్ పాఠశాలలలో 45,042 మంది విద్యార్థులున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఐదారు ఏళ్లలో ప్రైవేట్ బడులలో ప్రస్తుత సంఖ్య రెండింతలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుద్యాల్: మండల వ్యాప్తంగా మూడు గిరిజన తండాల్లో ప్రభుత్వ పాఠశాలలు రెండేళ్లుగా మూతపడ్డాయి. సోమ్లానాయక్ తండా, వాల్యా నాయక్ తండా, రోటిబండ తండాలలో బడులు నిర్వీర్యమైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతోనే పాఠశాలలు మూతబడ్డాయని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను కేటాయిస్తే తప్పకుండా తన పిల్లలను సర్కారు బడులకు పంపిస్తామని చెబుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న తరుణంలో ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకంజ ఇంకా సిద్ధం కాని యూనిఫాంలు ప్రభుత్వ బడులకు తగ్గుతున్న అడ్మిషన్లు జిల్లాలోని పాఠశాలల్లోఒకటో తరగతి అడ్మిషన్లు ఇలా.. ప్రభుత్వ ప్రైవేట్ పదేళ్ల క్రితం 9,500 2,640 ప్రస్తుతం 6,124 7,522 నాలుగేళ్లలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు ఇలా..విద్యాసంవత్సరం చేరిన విద్యార్థులు 2022–23 9,085 2023–24 7,784 2024–25 7,078 2025–26 6,124 -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
శంకర్పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ (జీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో ఏర్పాటు చేసిన ఎథినిక్ రన్ (జీరో వేస్ట్ రన్)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న స్వచ్ఛంద సంస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రూపొందించిన జాతీయ వేదిక శ్రీస్వచ్ఛ సేతుశ్రీ యాప్ని ప్రారంభించారు. 3కే, 5కే, 10కే రన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. గండిపేట్ వెల్పేర్ సోసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్వచ్ఛ సేతు’ యాప్ ఉద్యమంలో ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ పాల్గొనాలని పిలుపునిచ్చారు. భూమిలో కరిగే వస్తువుల వాడకంపై దృష్టి సారించాలని, తద్వారా పర్యావరణం విషతుల్యం కాదని అభిప్రాయపడ్డారు. జీడబ్ల్యూఎస్ ప్రతినిధి తిమ్మయ్యగారి వాణి మాట్లాడుతూ.. వ్యర్థాలను నియంత్రించే కార్యక్రమంలో భాగంగానే ఈ ఏడాది జీరో వేస్ట్ రన్ ఏర్పాటు చేశామని, ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతి తుమ్మల, ఎక్స్పీరియం ఎండీ రాందేవ్ రావు, వాటా ఫౌండేషన్ ప్రతినిధి ఉదయ్ కుమార్, జేఎస్ఆర్ అన్నమయ్య, మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనర్ -
స్టేషనరీ విక్రయాలపై చర్యలు తీసుకోవాలి
షాద్నగర్: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బేగరి మహేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు విక్రయిస్తున్నారని అన్నారు. విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ తల్లిదండ్రులపై అధనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. అక్రమ వసూళ్లు, పుస్తకాల దందాను అరికట్టాలన్నారు. విద్యను లాభార్జన సాధనంగా మార్చడం సమాజానికి హానికరమన్నారు. విద్యాశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇబ్రహీంపట్నం: సమాజాభివృద్ధికి విద్య బలమైన పునాది అని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కురుమ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పది, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన కురుమ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం, నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. క్రమశిక్షణతో విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కురుమలంతా ఐకమత్యంతో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. కురుమలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సరితతిరుపతయ్య, ది మిషన్ వ్యవస్థాపకుడు, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, ప్రముఖ ఇంపాక్ట్మోటివేషనల్ స్పీకర్ గాజుల శేఖర్, ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు శ్రీశైలం, జంగయ్య, బీరప్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ సూపర్మంచాల: ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ చాలా బాగుందని ఆర్టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి అన్నారు. ఆదివారం స్కూల్ను సందర్శించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు, ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు.. విద్యా బోధన అమలు తీరు.. సదుపాయాలపై ఆరా తీశారు. కార్పొరేట్ కంటే చాలా బాగుందని కితాబిచ్చారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు శివారెడ్డి, చారకొండ వెంకటేశ్, పద్మజాష, డీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, ఎంఈఓ రాందాస్, హెడ్ ఆఫ్ ది స్కూల్ గిరిధర్గౌడ్, ఆరుట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాములు, నోడల్ ఆపీసర్ కిషన్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. 17న సీఎం రేవంత్ రెడ్డి రాక! ఈ నెల 17న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించినట్టు తెలిసింది. చీరకు ఆర్డర్ పెడితే ఖాతా ఖాళీ అయ్యింది బంజారాహిల్స్: ఇన్స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఏ.శిల్ప అనే మహిళ ఇన్స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం
చందానగర్ : రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 సంవత్సరాల మోదీ పాలనలో రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు వచ్చాయన్నారు. కొత్త లైన్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయన్నారు.హఫీజ్పేట్, హైటెక్ సిటీ స్టేషన్లు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, కేశవులు, అనిల్ గౌడ్, రామరాజు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి -
ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం
షాద్నగర్రూరల్: ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యంగా రైతుల ముంగిటకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తేవడం జరిగిందని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయశాఖ అధికారులతో కలిసి శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. నందిగామ మండలంలో యాప్ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయశాఖ కార్యాలయంలో డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎరువులు కొనుగోలు చేయడానికి రైతులు గంటల తరబడి పడిగాపులు కాయడం, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం లాంటివి చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని అందుబాటులో తెచ్చిందని చెప్పారు. ఈ యాప్ద్వారా సులభంగా ఇంటినుంచే ఎరువులను బుక్ చేసుకోవచ్చని, దీంతో సమయం ఆదా అవుతుందని, పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. యాప్పై గ్రామాల్లోని ఆదర్శ రైతులతో పాటు రైతులందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్తో పాటు మరో ఐదు జిల్లాల్లో అమలు చేయడం జరుగుతోందన్నారు. సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శైలజ, ఏడీలు మాధవి, సత్యంబాబు, ఏడీఏ రమాదేవి, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్ -
తహసీల్దార్ల బదిలీ
అనంతగిరి: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ దీపక్ తివారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కోట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ను కలెక్టరేట్కు బదిలీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆనంద్రావును కోట్పల్లికి బదిలీ చేశారు. మోమిన్పేట తహసీల్దార్ రవీందర్ను దోమ మండలానికి, ఇక్కడ పనిచేస్తున్న గోవిందమ్మను వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయ డీఏఓగా బదిలీ చేశారు. కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న మునీరొద్దీన్ను మోమిన్పేటకు బదిలీ చేశారు. శుభ్రత తప్పనిసరి ఎంఈఓ మహిపాల్రెడ్డి యాలాల: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణలో శుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఎంఈఓ మహిపాల్రెడ్డి ఆదేశించారు. శనివారం యాలాలలోని పీఎం శ్రీ బాలురు ఉన్నత పాఠశాలలో హెచ్ఎంలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లను పరిశుభ్రతంగా ఉంచాలన్నారు. ఉదయం అల్పాహార పథకం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలో అన్ని పాఠశాలల్లో అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. గతేడాది నాలుగు కాంప్లెక్స్ పరిధిలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను సంతృప్తికరంగా విధులు నిర్వహించిన మధ్యాహ్న భోజన ఏజెన్సీల మహిళలను ఎంఈఓ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంలు కృష్ణయ్య, శాంతప్ప, సిద్రామేశ్వర్, శివకుమార్, మహేష్, వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యాభై బ్యాచ్ల అపూర్వ సమ్మేళనం
షాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975– 1976లో టెన్త్ పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి, స్కూల్లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులను సన్మానించి, ఆశీర్వాదాలు పొందారు. 1992– 93 బ్యాచ్కు చెందిన కొండ విజయ్కుమార్, ప్రవీణ్, మల్లికార్జున్ ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. మూడు వేల మందికి పైగా హాజరైన ఈ వేడుక ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో రాష్ట్ర హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్, జిల్లా హాకీ చైర్మన్ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, కాంగ్రెస్ నేత పామెన భీంభరత్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పద్య పదభారతి నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతగిరి: పద్య పదభారతి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బందప్ప గౌడ్ శనివారం తెలిపారు. అధ్యక్షుడిగా రాఘవేంద్ర చారి, వ్యవస్థాపక అధ్యక్షుడిగా శతావధాని మలుగ అంజయ్య, ఉపాధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, రఘురాం రెడ్డి, అనంత కిషన్, రెడ్యా రాథోడ్, ప్రధాన కార్యదర్శిగా మల్కనెల్లి లాల్రెడ్డి, సహ కార్యదర్శులుగా జంగయ్య, మొగులయ్య, సుధాకర్ రెడ్డి, దివాకర శాస్త్రి, సాంస్కృతిక కార్యదర్శిగా గడ్డమీది యాదయ్య, కోశాధికారిగా శ్రీనివాస్ చారి, మహిళా విభాగం కార్యదర్శగా కొండపురం లక్ష్మి, కార్యవర్గ సభ్యులుగా కందాడ విఠల్రెడ్డి, అడవి రెడ్డి, భగవద్గీత రాములు, శ్రీరాములు, మీనపల్లి ముకుంద్ రెడ్డి, బుచ్చన్న, వెంకట్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలుగు భాష మన అమ్మ భాష అని, ఈ భాషకు పద్యం వెన్నెముక లాంటిదన్నారు. పద్యం ఉన్నంత కాలం తెలుగు భాష నిలిచి ఉంటుందన్నారు.. కార్యక్రమంలో పలువురు కవులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు కుల్కచర్ల: రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కుల్కచర్ల మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. శనివారం ముజాహిద్పూర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారని, ఎవరూ ఆందోళన చెందరాదన్నారు. తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగొలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో వరి కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు. జొన్న కొనుగోలుకేంద్రం ప్రారంభం బంట్వారం: జొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి అన్నారు. శనివారం కోట్పల్లి మండలం లింగంపల్లి చౌరస్తాలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.3,699 మద్దతు ధర ప్రకటించిందన్నారు. తేమ శాతం 12 ఉండాలన్నారు. ఆరబెట్టిన జొన్నలనే తేవాలని రైతులకు సూచించారు. పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులతో పాటు, పంట సాగు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంజయ్య, సొసైటీ సీఈఓ శ్రీనివాస్, ఏఓ కరుణాకర్రెడ్డి, డైరెక్టర్లు సుదర్శన్రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, రాధాకృష్ణగౌడ్, మధుసూదన్రెడ్డి, మాణెయ్య, నాయకులు మహేశ్వర్రెడ్డి, నక్కల బందెయ్య పాల్గొన్నారు. అనంతగిరిలో అధికమాస యజ్ఞాలు అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట అనంతపద్మనాభ స్వామి ఆలయంలో అధికమాసం సందర్భంగా 30 రోజుల పాటు యజ్ఞాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం కృష్ణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అధికమాసంలో యజ్ఞాలు నిర్వహించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని ఆలయ పురోహితులు తెలిపారు. కార్యక్రమంలో పరిగి మాజీ సర్పంచ్ పార్థసారథి, బీఆర్ఎస్ యువ నాయకుడు కొప్పుల అనిల్రెడ్డి, దోమ మండల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి నిరూపిస్తే రాజీనామా
చేవెళ్ల: అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఇటీవల ఆయనపై బీఆర్ఎస్ నాయకుడు, విద్యా మౌలిక వసతుల సంస్థ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తన 35ఏళ్ల రాజకీయ చరిత్ర ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. నాగేందర్ గౌడ్కి రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తి మాజీ మంత్రి చంద్రశేఖర్ అని, ఆయన్ని సైతం మోసం చేశారన్నారు. నవాబ్పేట్ ఎంపీపీగా ఉన్నప్పుడు వేయని రోడ్లకు నిధులు మంజూరు చేయించుకున్నాడని, విద్యామౌలిక వసతుల సంస్థ చైర్మన్గా ఉండి ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటికై నా అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్, గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య -
ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు
దుండిగల్: దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) భారత వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు. పరేడ్ సందర్భంగా వైమానిక దళాధిపతి ఏపీసింగ్ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ఎంఎక్–2, హాక్, కిరణ్, చేతక్ శిక్షణ విమానాలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. ‘ఆకాశ్ గంగ’ స్కైడైవింగ్ బృందం, ‘శక్తి’ ఉమెన్ ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానం, సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
ఆకలి తీరాలి.. చదువు సాగాలి
తాండూరు: ఏ విద్యార్థీ ఆకలిలో పాఠశాల గడప తొక్కొద్దని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలు పునఃప్రారంభం రోజు(సోమవారం) నుంచే బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది. గత ఏడాది కొడంగల్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేశారు. సత్ఫలితాలు రావడంతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి మరో 10 మండలాకు విస్తరించాలని నిర్ణయించారు. జిల్లాలో 1,030 పాఠశాలలు జిల్లాలో 20 మండలాలు.. 1,030 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 70వేల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఉదయం చాలా మంది విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు వస్తుంటారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం వారి ఆకలి తీర్చాలని నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పది మండలాల్లోని 556 ప్రభుత్వ పాఠశాలల్లో 44,246 మంది విద్యార్థులకు ఉదయం బడి గంట మోగగానే బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. హరేకృష్ణ ఫౌండేషన్కు బాధ్యతలు అల్పాహార పథకం బాధ్యతలను ప్రభుత్వం హరేకృష్ణ ఫౌండేషన్కు అప్పగించింది. ఈ సంస్థకు కొడంగల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంది. గతేడాది కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట్, దౌల్తాబాద్, దుద్యాల్, కొడంగల్ మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించింది. ఈ ఏడాది కొత్త పాఠశాలల బాధ్యతలు కూడా ఈ ఫౌండేషన్కే అప్పగించారు. మెనూ ఇలా.. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం 9 గంటలకు ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం అల్పాహారం అందించనున్నారు. సోమవారం దోసె చట్నీ, చపాతి – కూర, పాలు, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ(రెండు), సాంబార్, రాగిజావ, బుధవారం రెండు పూరీలు ఆలూ కుర్మా, పాలు, గురువారం మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, రాగిజావ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా, పొంగల్ చట్నీ, పాలు, శనివారం రెండు బొండాలు, చట్నీ, రాగిజావ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సర్కారు బడుల్లో అల్పాహార పథకం ఎంపిక చేసిన మండలాలు ఇవే.. మండలం పాఠశాలల సంఖ్య విద్యార్థుల సంఖ్య బషీరాబాద్ 61 4,264 బొంరాస్పేట్ 46 2,657 దోమ 66 4,506 దౌల్తాబాద్ 40 3,308 దుద్యాల్ 26 1,742 కొడంగల్ 54 4,405 కుల్కచర్ల 66 3,831 పరిగి 64 5,202 తాండూరు 74 9,474 యాలాల 59 4,857 -
కక్ష గట్టి.. కేసు పెట్టి
తాండూరు రూరల్: పది రోజుల క్రితం జరిగిన చిన్నపాటి రోడ్డు ప్రమాదాన్ని.. హత్యాయత్నం కేసుగా మార్చిన పెద్దేముల్ పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుకోకుండా జరిగిన చిన్న యాక్సిడెంట్లో ఆస్పత్రి ఖర్చులు ఇప్పిస్తారనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కు వెళ్తే.. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఉద్దేశపూర్వకంగా పోలీసులే పెద్ద కేసులు నమోదు చేసి, ఓ యువకుడి జీవితాన్ని నాశనం చేశారని, జిల్లా ఎస్పీ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫిర్యాదుదారుడే ఓ వీడియో విడుదల చేయడం గమనార్హం. ఏం జరిగిందంటే.. పెద్దేముల్ మండలం మంబాపూర్కు చెందిన మర్పల్లి శ్రీనివాస్, అనితారాణి దంపతుల కుమారుడు అనిర్వేష్(20) ఈనెల 2న తన స్కూటీపై గ్రామంలో పోస్టల్ ఉత్తరాలను బట్వాడా (పంపిణీ) చేస్తున్నాడు. ఈక్రమంలో స్పీడ్ బ్రేకర్ వద్ద తన వాహనాన్ని స్లో చేశాడు. ఈ సమయంలో ఇదే ఊరికి చెందిన జాఫర్ తన భార్యతో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్)పై వెనక నుంచి వచ్చి సడెన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి రెండు వాహనాలు పక్కనుంచి ఒకదానికొకటి తాకాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న అనిర్వేష్తో పాటు బుల్లెట్ పైనున్న జాఫర్ కిందపడ్డారు. బుల్లెట్ బైక్ జాఫర్ పైన పడటంతో అతని ఎడమ చేతికి స్వల్ప ఫ్రాక్చర్ అయింది. ఈ ఘటనపై జాఫర్ అన్న మోయిజ్ అదే రోజు పెద్దేముల్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అనిర్వేష్పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఈ నెల 8న రిమాండ్కు తరలించారు. దీంతో 9న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన బాధితడు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడు. ఫిర్యాదుదారుడి వీడియోతో కీలక మలుపు తాము హత్యాయత్నం కింద పోలీసులకు ఎలాంటి కంప్లైంట్ చేయలేదని ఫిర్యాదుదారుడు మోయిజ్ శనివారం ఓ వీడియో విడుదల చేశాడు. తాము సాధారణ ప్రమాదమని మాత్రమే ఫిర్యాదు చేశామని, పోలీసులు దీన్ని పెద్ద కేసుగా మార్చేసి, చదువుకున్న యువకుడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టారని వీడియోలో పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర స్పందించి అతనికి న్యాయం చేయాలని కోరాడు. మోయిజ్ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ కేసుపై కొత్త చర్చ ప్రారంభమైంది. చిన్న ప్రమాదాన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేయడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ ఇంత పెద్ద కేసు పెట్టేది కాదని అభిప్రాయపడ్డారు. నా కొడుకుకి న్యాయం చేయండి ఇదిలా ఉండగా పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్వర్ధన్ ఈ కేసులో అత్యుత్సాహం చూపడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడరని, అతని చర్యతో తన కొడుకు జీవితం నాశనమైందని యువకుడి తల్లిదండ్రులు శ్రీనివాస్, అనితారాణి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కొడుకుకు ఉద్యోగం రాకుండా అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరికించిన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ స్నేహమోహ్రతో పాటు డీఐజీ, గవర్నర్కు స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకే కేసు మర్పల్లి అనిర్వేష్ అనే యువకుడు బైక్తో వెనక నుంచి ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడని జాఫర్ సోదరుడు మోహిజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయి. బాధితుల ఆరోపణలు అవాస్తవం – ప్రశాంత్వర్ధన్, ఎస్ఐ -
ప్రకృతి వ్యవసాయం మేలు
మహేశ్వరం: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగారంలో కుండె వెంకటేశ్ ఫామ్ హౌస్లో బీజేపీ కిసాన్మోర్చా ఆధ్వర్యంలో శనివారం ప్రకృతి వ్యవసాయంపై రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. సేంద్రియ ఎరువులతో దిగుబడి అధికంగా రావడంతో పాటు పండించిన ధాన్యం, కూరగాయాలు, పండ్లు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. బీజేపీ, కిసాన్మోర్చా నాయకులు రైతుల వద్దకు వెళ్లి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం మొక్కలు నాటి, గోమాతకు పశుగ్రాసం వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు బస్వ పాపయ్య గౌడ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేఎస్ రత్నం, పొరెడ్డి నర్సింహారెడ్డి, కంజర్ల ప్రకాష్, ముత్యాల భాస్కర్, కడారి జంగయ్య యాదవ్, మిద్దె సుదర్శన్రెడ్డి, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు టి.యాదీష్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
విత్తన అక్రమార్కులపై వేటు
కొడంగల్: నియోజకవర్గంలో వేరుశనగ విత్తనాలు రైతులకు ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న వ్యవసాయాధికారులపై కలెక్టర్ దీపక్ తివారి వేటు వేశారు. బొంరాస్పేట మండలం మెట్లకుంట క్లస్టర్ ఏఈఓ జగదీశ్వర్రెడ్డి, దౌల్తాబాద్ మండలం గోకాపస్లావాద్ ఏఈఓ మమతలనుసర్వీస్ నుంచి తొలగించారు. దుద్యాల్ మండల వ్యవసాయాధికారి నాగరాజును సస్పెండ్ చేశారు. జవాబుదారీ తనాన్ని, చిత్తశుద్ధిని కాపాడే ఉద్దేశంతో తదుపరి చర్యల కోసం కొడంగల్ (ఏడీఏ) వ్యవసాయ సహాయ సంచాలకులు శంకర్ రాథోడ్ను సరెండర్ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. అసలేం జరిగిందంటే.. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు చెందిన రైతుల కోసం వేరుశనగ విత్తనాలు సరఫరా చేసింది. వాటిని ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉండగా తూతూమంత్రంగా కొంత మంది రైతులకు ఇచ్చి మిగిలిన విత్తనాలను పెద్ద మొత్తంలో బహిరంగ మార్కెట్లో విక్రయించారనే ఆరోపణలు వచ్చా యి. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. రెండు రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో విచారణ చేశారు. రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. తమకు విత్తనాలు ఇవ్వలేదని రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. -
వ్యాక్సినేషన్ పూర్తి చేయండి
జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ కుల్కచర్ల: వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్యాధికారి సుధా కర్ లాల్ ఆదేశించారు. శనివారం మండలంలోని బొంరెడ్డిపల్లి సబ్ సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోరింత దగ్గు, పోలి యో, హైపటైటీస్, మీజిల్స్ సంబంధ వ్యాధుల నివారణకు పిల్లలకు టీకాలు వేయించాలని సూచించారు. ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినే షన్ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి కిరణ్కుమార్ గౌడ్, వైద్య సిబ్బంది రాధ, సుజాత పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో గేదె మృతి
దుద్యాల్: మండలంలోని రోటిబండ తండాలో విద్యుత్ వైర్లు తగిలి గేదె మృతి చెందింది. తండాకు చెందిన సేవ్యా నాయక్ వారం రోజుల క్రితం రూ.90 వేలు వెచ్చించి గేదెను కొనుగోలు చేశాడు. ఎప్పటిలాగే ఉదయం తన పొలంలో మేతకు వదిలాడు. ఇదురు గాలులకు పొలంలోని విద్యుత్ వైర్లు కిందికి జారాయి. వాటిని గేదె తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు సేవ్యానాయక్ కోరారు. డీసీఎం బోల్తా.. 600 కోళ్ల మృత్యువాత పరిగి: కోళ్ల లోడ్తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడిన ఘటన మండలంలోని చిగురాల్పల్లి సమీపంలో చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందపూర్ పౌల్ట్రీ ఫాం నుంచి విజయవాడకు కోళ్లను రవాణా చేస్తున్న డీసీఎం శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. వాహనం బోల్తా పడటంతో 600లకు పైగా కోళ్లు మృతి చెందాయి. లక్నాపూర్ రోడ్డు మరమ్మతు పనులు జాప్యం కావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అధికారులు స్పందించి మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్నాయక్ కొడంగల్ రూరల్: యువతకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్నాయక్ అన్నారు. శనివారం పట్టణంలోని వీబీఆర్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ భీమరాజ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ తప్పని సరిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యుడు ఆసిఫ్ఖాన్, ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్, ఫ్యాకల్టీ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. మహాసభలను జయప్రదం చేయాలి పరిగి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య పిలుపునిచ్చారు. శనివారం పరిగి పట్టణంలో ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో మహబూబ్నగర్లో మూడు రోజుల పాటు రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, కార్మిక సమస్యలపై చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రయ్య, నాయకులు సత్తయ్య, మొగులయ్య, రమేష్, శివ, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం లాలాగూడ క్యారేజ్ వర్క్షాప్లో తనిఖీ నిర్వహించారు.వర్క్షాప్లోని నిర్వహణ, మరమ్మతు కేంద్రాలను పరిశీలించారు. చీఫ్ వర్క్షాప్ మేనేజర్ సుమన వర్క్షాప్ పనితీరును జీఎంకు వివరించారు. ఈ తనిఖీల్లో సీనియర్ రైల్వే అధికారులు జీఎంతో పాటు పాల్గొన్నారు. వర్క్షాప్ను స్క్రాప్ రహిత (వ్యర్థాలు లేని) యూనిట్గా మారుస్తూ .. అక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలను ప్రశంసించారు. భారతీయ రైల్వేలలోని అత్యుత్తమ కోచ్ నిర్వహణ కేంద్రాలలో లాలాగూడ ఒకటని చెప్పారు. సిబ్బంది విధినిర్వహణ వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. -
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ఆరోపించారు. ఆమనగల్లులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం, ఆధిపత్యం కోసం బీజేపీ సర్కార్ ఇన్నాళ్లు ఓటు చోరీ చేసిందని, ప్రస్తుతం సీటు చోరీ చేసిందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సీటు చోరీ కుట్రలో భాగమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గద్దె దింపడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి బీజేపీ, బీఆర్ఎస్ పగటి కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, మహానీయుల జీవిత చరిత్రను ప్రజలకు వివరించి చైతన్యం చేయడానికి నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రెండు బస్సు యాత్రలు జూలై 2న అలంపూర్, మైసిగండిలో ముగుస్తాయని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, యూత్కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్, పార్టీ జిల్లా నాయకులు చెంచు రాములు, కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జగన్, మానయ్య, కాలె మల్లయ్య, శ్రీకాంత్, ఖాదర్ఖాద్రి, మండల మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు తదితరులు పాల్గొన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి -
దంచికొట్టిన వాన
ధారూరులో తడిసిన ధాన్యం బస్తాలు అనంతగిరి: వికారాబాద్లో జలమయమైన రోడ్డుదోమ – బాస్పల్లి మార్గంలో విరిగిపడిన చెట్టు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. శనివారం సాయంత్రంఏకధాటిగా కురిసింది. వానాకాలం సాగుకు సిద్ధమైన రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. వరి ధాన్యం చేతికొచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించకపోవడం, కళ్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. దోమ – బాస్పల్లి మార్గంలో ్ఢ పెద్ద చెట్టు విరిగి పడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.వికారాబాద్లో రోడ్లపై నీరు నిలిచింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ధారూరు మండలం మున్నూరు సోమారం గ్రామ కొనుగోలు కేంద్రంలో ఆరుబయట నిల్వ చేసిన జొన్నల బస్తాలు తడిసిపోయాయి. సకాలంలో గోదాంలకు తరలించపోవడమే కారణమని రైతులు ఆరోపించారు. పరిగిలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. శనివారం సంతకావడంతో రైతులు, కొనుగోలు దారులు ఇబ్బందులు పడ్డారు. – సాక్షి నెట్వర్క్ దుద్యాల్: పోలేపల్లిలోని ఓ ఇంట్లోకి చేరిన వర్షపు నీరు పరిగి మార్కెట్లో వ్యాపారుల పాట్లు పరిగిలో కురుస్తున్న వర్షం -
హైడ్రాలో బైక్ టీమ్లు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ముంపు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నా... ఏక్కడ ఏ ప్రమాదం జరిగినా... ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహించే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఈ బృందాలకు సంబంధించిన భారీ వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర వ్యాప్తంగా 27 బైక్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం నుంచి పని చేయడం ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో మెరుగైన సేవలు అందించాయి. ప్రతి బైక్పై ఇద్దరు సిబ్బంది.. ఇప్పటి వరకు హైడ్రా అధీనంలోని డీఆర్ఎఫ్కు 122 వాహనాలు ఉన్నాయి. వీటిలో డీఆర్ఎఫ్ తేలికపాటి వాహనాలతో పాటు 21 ట్రక్కులు వినియోగిస్తోంది. ఈ ట్రక్కుల్నే ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకు వాడుతున్నారు. వీటిలో ప్రత్యేక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఘనాస్థలికి చేరడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు ఇవి చేరేసరికి జరగాల్సిన నష్టం వాటిల్లుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ బైక్ టీమ్లను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి ఖరీదు చేసిన 37 ద్విచక్ర వాహనాల్లో 27 వాహనాలకు మార్పులు చేర్పులు చేసి బైక్ టీమ్లకు అందించారు. ప్రతి బైక్పైనా ఇద్దరు డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉపకరణాలు ఉంటాయి. వీటిని ఉంచడానికి వెనుక భాగంలో ప్రత్యేక పెట్టి ఏర్పాటు చేశారు. తొలిదశలో రంగంలోకి దింపిన 27 టీమ్ల్లో అత్యధికం ఐటీ కారిడార్తో పాటు ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో మోహరించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. దశల వారీగా ఈ బైక్ టీమ్ సంఖ్యను పెంచుతామన్నారు. విపత్కర సమయాల్లో వేగంగా స్పందించేలా.. తొలి దశలో 27 ఏర్పాటు చేసిన రంగనాథ్ ఇప్పటికే పనులు ప్రారంభించిన బృందాలు -
మద్యం మత్తులో కారు డ్రైవింగ్
మీర్పేట: ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అల్మాస్గూడకు చెందిన చక్రధర్ శుక్రవారం తన భార్య పుట్టినరోజు ఉండడంతో స్నేహితులను పిలిచి పార్టీ చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున స్నేహితులను ఆర్సీఐ రహదారిపై దించేందుకు కారు (టీజీ08ఏ 7887)లో వచ్చి తిరిగి సాయినగర్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కమలానెహ్రూనగర్లో నివసించే సోదరులు విఘ్నేశ్వర్ (21), అఖిలేశ్వర్ (18) తమ స్కూటీపై పాల ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపిన చక్రధర్ వీరిని ఢీ కొట్టాడు. విఘ్నేశ్వర్ కాలు ఫ్రాక్చర్ కాగా, అఖిలేశ్వర్ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడే ఉన్న స్థానికులు చక్రధర్ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు చక్రధర్ను, కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విఘ్నేశ్వర్ ఏవీఎన్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అఖిలేశ్వర్ ఇంటర్ పూర్తి చేశాడు. చదువుకుంటూనే పార్ట్టైంగా ఉదయం ఇంటింటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేస్తుంటారు. కాగా స్థానికంగా కమలానెహ్రూ నగర్లో బెల్టు షాపు ఉండడంతో చక్రధర్ మద్యం కోసమే వచ్చాడని, ఈ క్రమంలోనే అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను కారును అదుపు చేయలేక అన్నదమ్ముల్లిద్దరినీ ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. కారులో ఖాళీ మద్యం సీసాలు, బీర్ బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన వ్యక్తి అన్నదమ్ములకు తీవ్ర గాయాలు -
పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా..
కుల్కచర్ల: ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో తెలియదు కానీ పేగు తెంచుకు పుట్టిన ఇద్దరు పిల్లలను కడతేర్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన నవనీత (28) శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొడుకు విఘ్నేశ్ (7), కూతురు మధుప్రియ(5)కు ఉరి వేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ ఉరేసుకుని తనువు చాలించింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను చనిపోతే పిల్లలు అనాథలుగా మారుతారు. అందుకే నా పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా.. నన్ను ఎవరూ ఏమనలేదు. నాభర్తను ఏమనొద్దు’అని నవనీత రాసిపెట్టిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. భర్త జంబుల మల్లేశ్తోపాటు అతని కుటుంబ సభ్యుల కారణంగానే తమ బిడ్డ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందని మృతురాలి పుట్టింటి తరఫు బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. భార్యాపిల్లలు మృతిచెందినా రాత్రి పది గంటల వరకూ మల్లేశ్ ఇంటికి రాకపోవడం గమనార్హం. బతుకంతా కష్టాలే..: నవనీత జీవితమంతా కష్టాల్లోనే సాగింది. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్కు చెందిన ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పట్లో వీరు కూడా ఉరేసుకుని చనిపోయారు. దీంతో పెద్దనాన్న, బాబాయిలే నవనీతను పెంచారు. ఎనిమిదేళ్ల క్రితం మల్లేశంకు ఇచ్చి పెళ్లి చేయగా, కొన్నాళ్లపాటు సాఫీగానే సాగిన సంసారంలో నాలుగేళ్లుగా కలహాలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె చావే శరణ్యమని భావించినట్లు తెలుస్తోంది. -
ధాన్యం బస్తాలతో రైస్ మిల్లులు ఫుల్లు
● సొసైటీ గోదాంలకు తరలింపు ● మూడు నెలల పాటు నిల్వకు ఏర్పాట్లుబషీరాబాద్: జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు(సొసైటీలు), మార్క్ఫెడ్ ద్వారా సేకరిస్తున్న ధాన్యం, మక్కలను బషీరాబాద్కు తరలిస్తున్నారు. రైస్ మిల్లులు ఇప్పటికే పూర్తిస్థాయిలో ధాన్యంతో నిండిపోవడంతో ప్రత్యామ్నాయంగా సొసైటీ గోదాంలు, సొసైటీ రైస్ మిల్లులను నిల్వ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. బషీరాబాద్ సొసైటీకి చెందిన గోదాం, రైస్మిల్లులో మొత్తం 1,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉండటంతో వివిధ మండలాల నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. నావంద్గి, నవల్గా, మైల్వార్ కొనుగోలు కేంద్రాలతో పాటు యాలాల, ధారూరు మండలాల పరిధి సొసైటీలు, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన వరి, మక్కల బస్తాలను గోదాం, రైస్మిల్లులో నిల్వ చేస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైన రక్షణ చర్యలతో పాటు గోదాంల వద్ద ప్రత్యేక పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. ధాన్యం భద్రత కోసం సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో వాచ్మెన్ను నియమించినట్లు బషీరాబాద్ సొసైటీ సీఈఓ వెంకటయ్య తెలిపారు. మిల్లుల్లో ఖాళీ ఏర్పడే వరకు సుమారు మూడు నెలల పాటు ఈ గోదాంల లోనే ధాన్యం నిల్వ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
మసీద్ కమిటీ నియామకం
ధారూరు: మండల కేంద్రంలోని జామా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా ఎండీచాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత పెద్దల సమక్షంలో శుక్రవారం అధ్యక్షుడితో పాటు.. ఉపాధ్యక్షుడిగా ఖాజామున్నా ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షఫీ అహ్మద్, మరో 21 మంది సభ్యులను నియమించారు. ఇందులో మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు హఫీజ్, నాయకులు మోయిజ్ఖురేషి, ఇబ్రహీం, ఫజిల్ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత.. ఆరోగ్య భద్రత కుల్కచర్ల: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్య భద్రత లభిస్తుందని మండల వైద్యాధికారి కిరణ్కుమార్ గౌడ్, బండవెల్కిచర్ల సర్పంచ్ మడుగు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన డ్రైడేలో మాట్లాడారు. ప్రతివారం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఇంటి ముందర, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ కష్టాలు.. పట్టించుకోని పోలీసులు మోమిన్పేట: మోమిన్పేట పాత బస్టాండు ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ జాం అవుతోంది. రోడ్డు పైనే ఆటోలు నిలపడం వలన.. ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో ఇతర వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సదాశివపేట వైపు వెళ్తున్న క్రమంలో దర్గా వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని పరిసర ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి రహదారిపై అడ్డదిడ్డంగా ఆటోలు ఇతర వాహనాలను పార్కింగ్ చేయకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, దాంతో పాటే సదాశివపేట మార్గంలోని ఆటో స్టాండును ఉన్న ప్రాంతం నుంచి కాస్త ముందుకు జరపాలని ప్రజలు కోరుతున్నారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం దుద్యాల్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధి సంట్రకుంట తండా అనుబంధ గ్రామం నన్యానాయక్తండాకు చెందిన కవితకు సీఎంఆర్ఎస్ చెక్కు అందజేసి మాట్లాడారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఖరీదైన వైద్యం అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని, బాధితులు వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ మాణిక్య నాయక్, వార్డు సభ్యుడు సంతోష్, లక్షణ్ పాల్గొన్నారు. రోడ్డు విస్తరణకు ఇళ్ల కూల్చివేత దుద్యాల్: రహదారి విస్తరణలో భాగంగా మండల పరిధి హకీంపేట్లో ఇళ్ల కూల్చివేత కొనసాగుతోంది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ రవీంద్ర నర్సింహా రెడ్డి గ్రామస్తులతో మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను సమన్వయ పర్చగా.. వారు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఆ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. -
వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలి
కొత్తూరు: వర్షాకాలం కావడంతో అండర్పాస్ వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ఉపాధ్యాయ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అండర్పాస్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. రాయికల్ టోల్ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ విశ్వనాథ్రాజుతో మాట్లాడి పలు సూచనలు చేశారు. 40హెచ్పీ మోటారుతో అండర్పాస్లోకి వస్తున్న వర్షపు నీటిని తీసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టోల్ప్లాజా మేనేజర్ వివరించారు. అనంతరం ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో అండర్పాస్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ శంకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
పొలంలో రోడ్డు నిర్మాణం!
బషీరాబాద్: తన పొలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేశారని ఆరోపిస్తూ.. ముండల పరిధి క్యాద్గీరా గ్రామానికి చెందిన రైతు సిరెల్లి పెద్ద నాగప్ప కుటుంబీకులతో కలిసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. ఇదే విషయమై గతంలో తాండూరు సివిల్ కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్, డిప్యూటీ సర్వేయర్ సమక్షంలో మే 25న సర్వే చేసి, పిల్లనడక దారిని మాత్రమే వదిలారని పేర్కొన్నారు. అయినప్పటికీ సర్పంచ్, ఉప సర్పంచ్ వారి కుటుంబ సభ్యులు పంచాయతీ ట్రాక్టర్తో రెండు అడుగుల మేర నాపరాతి రాళ్లతో దారి వేసి, ఏర్పాటు చేసిన స్తంభాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఇదేమిటని ప్రశ్నించగాబెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ జైపాల్రెడ్డిని వివరణ కోరగా.. రైతుల రవాణా సౌకర్యార్థం రోడ్డు వేశామని తెలిపారు. పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు -
ప్రాజెక్టులు గడువులోపు పూర్తిచేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్కు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ అనంతరెడ్డి, ఏఓ సునీల్ ఘన స్వాగతం ఫలికారు. అనంతరం మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం తదితర ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. భూ సేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో కందుకూరు, ఇబ్రహీంపట్నం డివిజన్ల ఆర్డీఓలు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆమనగల్లు, మాడ్గుల తహసీల్దారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వికసించనున్న కమలం
● పుష్కరకాలం మోదీ పాలన అమోఘం ● ఇంటింటి ప్రచారంలో బీజేపీ శ్రేణులు తాండూరు టౌన్: పుష్కరకాలం మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్.. రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలం అయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై విసుగు చెంది ఉన్నారని, రాబోయే కాలంలో బీజేపీకి పట్టం కట్టనున్నారని పేర్కొన్నారు. ఇందులో బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ గాజుల శాంత్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కో కన్వీనర్ భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షుడు మల్లేశం, కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్, బండారి శ్రీకాంత్, దోమ కృష్ణ, బబ్లు తదితరులు పాల్గొన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
అనంతగిరి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారిని పనిలో పెట్టుకోరాదని మదన్పల్లి సర్పంచ్ బిల్లపాటి విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సెల్ న్యాయవాది వెంకటేశం మాట్లాడుతూ.. 14 ఏళ్లలోపు బాలబాలికలు ఎలాంటి పనులు చేసినా నేరమని, బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం 18 ఏళ్లలోపు వారు ప్రమాదకర పనులు చేయడం నిషేధమన్నారు. సాధన ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ నర్సింలు మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లాలో అనేక కార్యక్రమాలు అధికారుల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, ఏహెచ్టీయూ ఇన్చార్జి అలిమొద్దీన్, షీటీం ఇన్చార్జి బుచేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఆడపిల్లల సమానత్వ సమాఖ్య అధ్యక్షురాలు కీర్తన, ఐసీడీఎస్ సూపర్వైజర్ షాలిని, అంగన్వాడీ టీచర్లు, ఉపాద్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి అనంతరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.రాజు, కార్యదర్శి గ్యార పాండు మాట్లాడుతూ.. పంచాయతీ సిబ్బందికి ప్రతీ నెల 1న వేతనాలు చెల్లించడం లేదన్నారు. వేతనాలు గ్రీన్ చానల్ ద్వారా చెల్లించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నంబర్ 51ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనం తక్షణమే ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. ప్రమాదం జరిగి మరణిస్తే రూ.20 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జగన్ పోల్కంపల్లి, పోచమోని కృష్ణ, కోశాధికారి దేవదాస్, శేఖర్, మాధవి, యాదయ్య, జగన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సాయికుమార్పై పోక్సో కేసు
ధారూరు: మండలంలోని కేరెళ్లి గ్రామానికి చెందిన సాయికుమార్(27)పై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుమార్ ప్రేమ పేరుతో 17 సంవత్సరాల బాలికను వంచించి అఘాయిత్యం చేశాడని తెలిపారు. తర్వాత పెద్దేముల్ మండలం మారెపల్లి సమీపంలోని గుడి వద్దకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని వివరించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాయికుమార్పై కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మొయినాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ మహ్మద్ అలీఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో ఉన్న ఎస్బీఐ ఆర్సెటీ కేంద్రంలో నెల రోజుల పాటు మగ్గం వర్క్స్లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. 18–50 సంవత్సరాల వయసు ఉండి, పదో తరగతి చదివిన మహిళలు శనివారం ఆర్సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఎస్ఎస్సీ మెమో, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేయాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి, భోజన సౌకర్యంతోపాటు యూనిఫాం, టూల్ కిట్స్ అందజేస్తామన్నారు. వివరాలకు 85001 65190, 95506 06019 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మంచాల: మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ల తుది జాబితా విడుదల చేశారు. పాఠశాల హెడ్ ఆఫ్ ది స్కూల్ గిరధర్ గౌడ్ ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీ సమక్షంలో శుక్రవారం డ్రా తీశారు. మొత్తం 1,200 మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ పద్ధతిలో 300 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలలో అందుబాటులో ఉంచారు. త్వరలో అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు. మొయినాబాద్: ప్రజల జీవితాలతో మమేకమైన కళలు, సాహిత్యం సమాజ మార్పునకు శక్తివంతమైన ఆయుధాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాకురాలు విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్లో రెండు రోజులపాటు నిర్వహించిన సాంస్కృతిక శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు పాల్గొని ప్రజా సాంస్కృతికోద్యమ కర్తవ్యాలు, శాసీ్త్రయ సోషలిజం, ఆదివాసీ కళలు, సాహిత్యం, సాంస్కృతిక ఆధిపత్య సిద్ధాంతం వంటి అంశాలపై చర్చించారు. కళాకారులకు డప్పు, పాట, నాటకం వంటి ప్రజా కళారూపాలపై శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విమలక్క మాట్లాడుతూ.. శిక్షణ పొందిన కళాకారులు తమ కళలను సమాజ మార్పుకోసం ఉపయోగించాలన్నారు. ట్రాఫిక్ సీఐ శంకరయ్య షాద్నగర్రూరల్: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహననాలను నడపాలని ట్రాఫిక్ సీఐ శంకరయ్య అన్నారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్ట చౌరస్తా సమీపంలో ట్రాఫిక్ సీఐ శంకరయ్య వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన పత్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బైక్ నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్టు ధరించాలన్నారు. ప్రమాదరహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెప్పపాటులో జరిగే ప్రమాదం కుటుంబాలను, జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రోబోటిక్స్ వర్క్షాప్
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల పరిధిలోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 11,12 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్ వర్క్షాప్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. రోబోటిక్స్, ఎంబయోడెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ రంగాలకు సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ప్రారంభించగా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ అబ్దుల్ నబీ, రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ధనలక్ష్మి రోబోటిక్స్ విద్య, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా క్విజ్, ఫీడ్బ్యాక్ సెషన్ నిర్వహించారు. -
చేవెళ్ల ఎమ్మెల్యే అవకాశవాది
చేవెళ్ల: అభివృద్ధి కోసం అంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆపార్టీలో చేరి ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని బీఆర్ఎస్ వికారాబాద్ నాయకుడు నాగేందర్గౌడ్, చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు ఆంజనేయులు విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నవాబుపేట మండలం మలుమాడ గ్రామంలో జరిగిన ఇరువర్గాల దాడులు, 15 మందిపై కేసుల వెనుక ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రోద్భలం ఉన్నట్లుగా ఆయన వైఖరి తెలుస్తోందన్నారు. తన సొంత మండలంలో ఒక సర్పంచ్ వర్గం.. ఓడిపోయిన వర్గం మధ్య జరిగిన పసర్పసర దాడుల్లో ఇరువర్గాలకు నచ్చచెప్పి న్యాయం చేయాల్సింది పోయి ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. గాయపడిన వారిని వదిలేసి దాడిచేసిన వారి పక్షాన నిలబడి బెదిరింపులకుపాల్పడుతున్నాడని ఆరోపించారు. మాజీ మంత్రి సబితారెడ్డి మలుమాడ ఘటనపై స్పందించి ఇరువర్గాలను పరామర్శిచటానికి వస్తే ఆమె రావాల్సిన అవసరం ఏమందని ప్రశ్నించడం సిగ్గు చేటు అన్నారు. బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ వారిపై కేసులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. అభివృద్ధి కోసమే పార్టీ మారితే రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి చూపాలన్నారు. సత్తా ఉంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. కుటుంబ సభ్యులంతా పదవులు అనుభవించినా మండలానికి చేసిన అబివృద్ధి శూన్యమన్నారు. సబితారెడ్డిని గ్రామాలకు రావద్దనే అధికారం నీకు లేదని పార్టీ నాయకురాలుగా ఆమె అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీ శ్రేణులకు అండగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ శంకర్పల్లి, నవాబుపేట, చేవెళ్ల అధ్యక్షులు గోవర్ధన్రెడ్డి, దయాకర్రెడ్డి, పి.ప్రభాకర్, నాయకులు భరత్రెడ్డి, తలారి యాదయ్య, రవి, కృష్ణ, భాస్కర్రెడ్డి, రామగౌడ్, తదితరులు ఉన్నారు. అభివృద్ధి సాకుతో అధికార పార్టీలోకి కాలె యాదయ్య రాజీనాచేసి గెలవాలని బీఆర్ఎస్ నాయకుల సవాల్ -
ఎకరాకు రూ.60 లక్షలిస్తేనే..
యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సేకరణ అంశం మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను సవరించడంతో ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం పరిహారం పెంచాలని పట్టుబడుతున్నారు. గ్రామంలోని అసైన్డ్ సర్వేనంబర్లు 19, 68, 127తో పాటు పలు పట్టా సర్వే నంబర్లల్లోని 821.11 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ల కోసం సేకరించడానికి ప్రభుత్వం 2025 మార్చి 10న నోటిఫికేషన్ ప్రకటించింది. పట్టా భూముల సేకరణను తాత్కాలికంగా పక్కకు పెట్టిన అధికారులు.. ముందుగా 650 ఎకరాల అసైన్డ్ భూములు తీసుకోవాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ వెలువర్చిన ఏడాది తర్వాత 2026 మార్చిలో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈఏడాది కాలంలో పలు గ్రామాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఏడాది క్రితం యాచారం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎకరా ధర రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఇవే రూ.కోటికి పైగానే పలుకుతున్నాయి. అయితే, పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని బాధిత రైతులు మొదటి నుంచీ స్థానిక అధికారులతో పాటు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డిని కలిసి విన్నవించారు. నేటికీ పూర్తికాని ప్రక్రియ మొదట్లో ఎకరాకు రూ.22 లక్షల పరిహారం, ఎకరాకు 121 గజాల ప్లాటు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇందుకు రైతులు ససేమిరా అనడంతో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి నిర్వాసితులతో సమావేశమై ఎకరాకు రూ.30 లక్షల పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల ప్లాటు, అదనంగా కుటుంబానికి 121 గజాల ప్లాటు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించారు. భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నెల రోజుల్లో పరిహారం అందజేయాలని కోరారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో భూసేకరణ ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. రైతుల కబ్జా సర్వే కూడా ఈరోజు వరకూ పూర్తికాలేదు. రికార్డుల్లోంచి నకిలీల పేర్లను కూడా తొలగించలేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏకగ్రీవ తీర్మానం భూసేకరణకు నోటిఫికేషన్ ప్రకటించిన ఏడాది వరకు కూడా పరిహారం అందజేయకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో మొండిగౌరెల్లి రెవెన్యూ పరిధిలో భూముల మార్కెట్ విలువ ఎకరాకు రూ.5,62,500 ఉండగా, ఇటీవల సవరించిన వాల్యూ ప్రకారం రూ.9.84,375 పెరిగింది. దీంతో పరిహారాన్ని కూడా రూ.60 లక్షలకు పెంచి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మొండిగౌరెల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పెంచిన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పెంచి ఇవ్వాలని సర్పంచ్ కోలన్ రమాదేవి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసి తహసీల్దార్ అయ్యప్పకు అందజేశారు. ఈ విషయమై కలెక్టర్ను కలవనున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇండస్ట్రియల్ పార్కుకు భూములిస్తాం ఇటీవల పెంచిన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలి లేదంటే మరో ఉద్యమం తప్పదు తేల్చిచెబుతున్న మొండిగౌరెల్లి అసైన్డ్ రైతులు మొండిగౌరెల్లిలోని అసైన్డ్ భూములకు పరిహారం పెంచి ఇవ్వాలని రైతులు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వమని కోరుతున్నారు. పరిహారం పెంపు అంశం మా పరిధిలో లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వారే నిర్ణయించాల్సి ఉంటుంది. న్యాయం జరిగేలా మా వంతు ప్రయత్నం చేస్తాం. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తాం. – అయ్యప్ప, తహసీల్దార్, యాచారంఏడాది కింద నోటిఫికేషన్ ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకూ ప్రక్రియ పూర్తిచేయలేదు. త్వరగా సర్వే చేసి పరిహారం అందజేసి ఉంటే రైతులు మరో చోటకు వెళ్లి భూములు కొనుక్కునేవారు. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. సవరించిన మార్కెట్ విలువ ప్రకారం అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం ఇవ్వాలి. లేదంటే ఏ అధికారినీ గ్రామంలో అడుగు కూడా పెట్టనీయం. – కోలన్ రమాదేవి, సర్పంచ్, మొండిగౌరెల్లి -
ఖరీఫ్.. కష్టం
మోమిన్పేట: కోటి ఆశలతో ఖరీఫ్కు సిద్ధమవుతున్న కర్షకులకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఎరువులు ధరలకు రెక్కలు, విత్తనాల నాణ్యత తెలుసుకోలేక సతమవుతూనే.. మార్కెట్లో లభించిన గింజలతో పొలంబాట పట్టిన రైతన్నను.. మృగశిర కార్తె ప్రారంభంలో ప్రతాపం చూపడిన వరుణుడు ముఖం చాటేయడంతో ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. పూర్తిగా వర్షాధార పంటల సాగుకు ఎల్నినో దెబ్బతియనుందని వాతావరణ శాఖ తెలపడంతో ఆందోళన చెందుతున్నారు. యాసంగి వడ్లు అమ్ముడుపోక.. ప్రభుత్వ ‘భరోసా’ అందక, ఖరీఫ్కు పెట్టుబడి లేక కష్టాల కడలిలో ఎదురీదుతున్నారు. పశ్చిమాసియా సెగ పశ్చిమాసియా దేశాల యద్ధం ప్రభావం ఒక్క చమురుపైనే కాదు.. నిత్యావసరాల ధరలను నింగినంటేలా చేసింది. వాటితో పాటు ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్క డీఏపీ ధర మాత్రమే పెరగలేదు. మిగతా అన్ని రకాల కాంప్లెక్సు ఎరువులు బస్తాకు రూ.2 వేల పై మాటే. యూరియా సంగతి చెప్పనక్కర లేదు. యాప్ల ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏ రకమో తేల్చలేక ఏటా వానాకాలం సాగుకు ముందు అన్నదాతలను నకిలీ బెడద పట్టిపీడిస్తోంది. నాసిరకం విత్తనాలతో ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. కేటుగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి జిల్లాలోకి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నా.. అవి ఏ రకమో తేల్చలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పెట్టుబడికోసం.. ఖరీఫ్, రబీ సాగుకు ముందు ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమచేస్తేనే వారికి పెట్టుబడులకు అందుతాయి. ప్రస్తుతం వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నా.. వారికి భరోసా ఊసు లేదు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఎల్నినో ప్రభావం అన్నింటికీ ఓర్చి సాగుకు రైతన్న సిద్ధం అవుతున్న నేపథ్యంలో పిడుగులాంటి వార్త ఎల్నినో వారి నెత్తిపై పడినట్లు అయింది. సూపర్ ఎల్నినో రానుందని వ్యవసాయ శాఖ పేర్కొంటుండడంతో రైతుల్లో నిరాశ మొదలైంది. అప్పు చేసి, పెట్టుబడులు పెట్టి, ముందడుగు వేస్తే.. వానలు పడకపోతే.. ఎలా అని మదనపడుతున్నారు. మృగశిర కార్తెలో నైరుతి రుతు పవనాల రాకతో విత్తనాలు విత్తుకొందామంటే విస్తరించడంలో అలసత్వం వహిస్తున్నాయి. ఇన్ని సమస్యల నడుమ ముందుకు సాగుదామా.. కాడిని వదిలేద్దామా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎరువుల ధర మోత నకిలీ విత్తనాల బెడద ముఖం చాటేసిన వరుణుడు వెంటాడుతున్న ఎల్నినో అందని సర్కారు భరోసా -
టిప్పర్ టైర్ కింద నలిగి..
తల్లి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు యాచారం: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆరోగ్యం బాగా లేక కొడుకుతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తూ తల్లి అనంతలోకాలకు వెళ్లగా, కొడుకు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. కందుకూరు మండలం బేగరికంచె గ్రామానికి చెందిన ఢిల్లీ భారతమ్మ (45), ఆమె కుమారుడు అఖిల్కుమార్ శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో మోటార్సైకిల్పై ఆకులామైలారం గ్రామానికి వచ్చారు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో అధిక బరువుతో వస్తున్న టిప్పర్ (టీజీ07ఎక్స్–1400) డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని వెనక్కు తీస్తూ ఢీకొట్టాడు. టిప్పర్ తల్లీకొడుకులపై నుంచి వెళ్లడంతో భారతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ అఖిల్కుమార్ను చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు రండి
పూడూరు: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దళిత నాయకులు వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధి మాటుగుడ గ్రామంలో నిర్వహించే అంబేడ్కర్ విగ్రహావిష్కరకు తరలిరావాలని కోరారు. శనివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రహీస్ఖాన్, దళిత నాయకులు లక్కం సత్యనారాయణ, నీరటి నర్సింలు, క్రిష్ణ పాల్గొన్నారు. ఉపాధిని వినియోగించుకోండి బొంరాస్పేట: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వీబీ జి రామ్ జీగా పేరు మార్చడమే కాకుండా.. ఉపాధి పనిదినాలను 125లకు పెంచిందని బీజేపీ నాయకులు అన్నారు. శుక్రవారం మండల పరిధి ఏన్కెమీదితండాలో కూలీలకు ఫలహారం అందించారు. పని దినాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మాజీ కార్యవర్గ సభ్యుడు బాబయ్యనాయుడు, మండల అధ్యక్షుడు ఉప్పరి జగదీశ్వర్, నాయకులు నాగూరావు, సీహెచ్ నర్సింలు, ఉప్పు జగదీశ్, దశరథ్, సంతోష్ తదితరులున్నారు. మహేశ్రెడ్డి అరెస్ట్ బాధాకరం దోమ: రైతులు చేపట్టిన శాంతియుత నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించేందుకు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని అక్రమంగా చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సర్పంచుల సంఘం జిల్లా మాజీ నేత రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం నగరం నుంచి పరిగి తన నివాసానికి వస్తున్న క్రమంలో మహేశ్రెడ్డిని పరిగి మండల పరిధి రంగాపూర్ గేట్ ప్రాంతంలో నిలిపి అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఆర్టికల్19(1) ప్రకారం ఎవరికై నా నిరసన, నిరాహార దీక్షలు చేపట్టే హక్కు ఉందన్నారు. మసీదు కమిటీ అధ్యక్షుడుగా రజాక్బషీరాబాద్: జామా మసీదు కమిటీ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్ను మత పెద్దలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎండీ జహూర్ను నియమించారు. కమిటీలో మరో పది మంది సభ్యులు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, మసీదు నిర్వహణతో పాటు ఇమామ్, మోజిన్లకు సంబంధించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. -
సుస్థిర వ్యవసాయ పద్ధతులతో మేలు
కొందుర్గు: రైతులు భూసార పరీక్షలను విధిగా చేయించుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఖురేషి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిని పెంపొందించడంలో భాగంగా భారత నూనెగింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నూనెగింజలు పండించే గ్రామాలను ఎంపికచేశారు. మండలంఓని రేగడిచిల్కమర్రి గ్రామాన్ని ఎంపికచేసిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఖురేషి, డాక్టర్ శాంత, స్ఫూర్తి పౌండేషన్ హైదరాబాద్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ రత్నాకర్ రైతులకు నూనెగింజల సాగులో మెలకువలను వివరించారు. భూసార పరీక్షలపై అవగాహన కల్పించి పలువురి రైతుల పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖురేషి మాట్లాడుతూ.. నూనెగింజల ఉత్పాదకత, నేల సారవంతం, సుస్థిర వ్యవసాయ పద్ధతులు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయన్నారు. సమగ్ర పోషక నిర్వహణ, సేంద్రియ ఎరువుల వినియోగం, సమతుల్య రసాయన ఎరువుల వాడకం, సూక్ష్మజీవ ఆధారిత బయో ఇనాక్యులెంట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతు రవీందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ ఖురేషి -
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
● పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించండి ● బడిబాటలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులుతాండూరు రూరల్: సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని జినుగుర్తి సర్పంచ్ శరణయ్య స్వామి అన్నారు. శుక్రవారం గ్రామంలో హెచ్ఎం నాగప్ప ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందుతోందని, అనుభవమైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతోందని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తోందన్నారు. పెద్దేముల్లో.. పెద్దేముల్ జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జి హెచ్ఎం ద్యావరి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అనంతరం ఎస్ఐ ప్రశాంత్వర్ధన్ను కలిసి షీటీం.. బాల్య వివాహాలపై అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు శ్రీధర్, జయశ్రీలు ఉన్నారు. బడీడు పిల్లలను.. దోమ: ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, బడీడు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మండల విద్యాధికారి వెంకట్ అన్నారు. శుక్రవారం మండల పరిధి మోత్కూర్, దిర్సంపల్లి గ్రామాల్లో సర్పంచులు ఆనంద్, విజయలక్ష్మి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. -
మహాసభలను జయప్రదం చేయండి
దోమ: వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర స్థాయి మహాసభ కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలతో ప్రతీ ఒక్కరు ఇబ్బంది పడుతున్నారన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, ఆకలి, వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని బలహీనపరిచే చర్యలు కార్మికుల జీవితాలను మరింత దుర్భరం చేస్తున్నాయని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 20,21,22 తేదీల్లో మహబూబ్నగర్ పట్టణంలో సభలు నిర్వహిస్తున్నామని, కార్మిక, కర్షకులు, పేదలు, భూమిలేని కూలీలు హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సత్తయ్య, మండల కార్యదర్శి రఘురాం తదితరులు పాల్గొన్నారు. -
రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం
పూడూరు: నేల తల్లిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న రైతుల భూములను.. అభివృద్ధి పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటుందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. శుక్రవారం మండల పరిఽధి మన్నెగూడలో ఆయన మాట్లాడారు. రేవంత్ బ్రదర్స్ భూముల దందా చేస్తూ.. రైతులను రోడ్డు పాలు చేస్తున్నారని విమర్శించారు. రాపోల్, కాడ్లాపూర్ గ్రామాల రైతుల పొలాలను ఫార్మాసిటీ పేరిట బలవంతంగా గుంజుకోవడం ఏంటని ప్రశ్నించారు. రైతుల పక్షాన నిలబడిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని అడ్డుకుని, చన్గోముల్ పోలీస్స్టేషన్లో తరలించడం దారుణమన్నారు. నగరం నుంచి ఇంటికి వెళ్తున్న తనను పోలీసులు వెళ్లనీయకపోవడం సరైందికాదన్నారు. మహేశ్రెడ్డిని వెంటనే వదిలిపెట్టాలని పార్టీ శ్రేణులతో కలసి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం మహేశ్రెడ్డిని వదిలిపెట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇన్చార్జి గట్టు రాంచందర్రావు, మాజీ ఎంపీపీ మల్లేశం, సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రహీస్ఖాన్, వైస్ ఎంపీపీ మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ -
మా భూముల జోలికి రావొద్దు
పరిగి: ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మా భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని రైతులు తేల్చి చెప్పారు. గురువారం మండలంలోని రాపోల్ గ్రామంలో తహసీల్దార్ వెంకటేశ్వరీ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సభ నిర్వహించారు. ఆర్డీఓ వాసుచంద్ర ముఖ్య అతిథిగా హాజరై రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తోందని తెలిపారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రైతులు ఆందోళన చెందరాదని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మెరుగైనా పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిరాకరించిన రైతులు పరిశ్రమల కోసం రాపోల్ గ్రామంలో 600 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 509 ఎకరాల ప్రభుత్వ భూమి, 101 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. అయితే తమకు జీవనాధారమైన మొత్తం భూమిని లాక్కుంటే రోడ్డు న పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదన్నారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే చావు ఒక్కటే శరణ్యమని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పరిహారంపై అధికారులు స్పష్టత నివ్వడం లేదు. భారీ బందోబస్తు మధ్య.. ప్రజాభిప్రాయ సభను భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ముగ్గురు డీస్పీలు, 13 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డులు, ఇంటలిజన్స్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్ విభాగం అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్దకు గ్రామ రైతులను మాత్రమే అనుమతించారు. -
ఫ్యూచర్లో విధులు షురూ
ఎఫ్సీడీఏ కార్యాలయంలో పనులు ప్రారంభించిన కమిషనర్ శశాంకకందుకూరు: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) కార్యాలయంలో అధికారులు విధులు ప్రారంభించారు. ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించగా గురువారం కమిషనర్ శశాంకతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చుని విధులు నిర్వహించారు. కాగా 2025 సెప్టెంబర్ 28న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నూతన భవనానికి శంకుస్థాపన జరగ్గా, డిసెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించారు. ఆరు నెలల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన కార్యాలయ భవనంలో ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు, బయో ఎస్టీపీ ద్వారా మురుగు నీటి శుద్ధి వ్యవస్థ, సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ వంటి పర్యావరణ అనుకూల సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించేలా ఎఫ్సీడీఏ కార్యాలయం మోడల్గా నిలవనుంది. 56 గ్రామాల పరిధితో ప్రారంభమైన ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రజల కోరిక మేరకు అదనంగా కందుకూరు, మహేశ్వరం, యాచారం మండలాలకు చెందిన మరికొన్ని గ్రామాలను చేర్చారు. దీంతో ఎఫ్సీడీఏ పరిధి విస్తృతం కానుంది. ఎఫ్సీడీఏ పరిధిలోని గ్రామాల్లో కొత్తగా లేఅవుట్లు వేయాలన్నా, కమర్షియల్ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలన్నా ఇక్కడి నుంచే అనుమతులు పొందాలి. మరోపక్క గ్రామాల్లో 300 మీటర్లకు పైబడిన స్థలాల్లో నివాసాలతో పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఇకపై ఎఫ్సీడీఏ పర్మిషన్ తప్పనిసరి కానుంది. తన ఛాంబర్లో విధులు ప్రారంభించిన కమిషనర్ శశాంకకు ఎఫ్సీడీఏ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
జంట హత్యల కేసు ప్రధాన నిందితురాలి మృతి
తాండూరు/తాండూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన కరీమాబీ(50) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాండూరులోని రాజీవ్గృహకల్ప కాలనీలో నివాసం ఉండే కరీమాబీ తనకు పరిచయమున్న మహిళల వద్ద అప్పులు తీసుకుంది, డబ్బుల కోసం ఒత్తిడి చేసిన వారిని అంతమొందించేందుకు పథకం వేసింది. ఈక్రమంలో తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబ్బీ(58), బషీరాబాద్ మండలం కాశీంపూర్కు చెందిన అంగన్వాడీ ఆయా అబేదాబేగం(60)లను మొయినాబాద్లోని ఓ ప్రైవేటు ఫాంహౌస్లో హత్య చేసి, అక్కడే పూడ్చిపెట్టింది. ఇందుకు రహ్మాన్, నయీం అనే ఇద్దరు వ్యక్తుల సాయం తీసుకుంది. మహిళల మిస్సింగ్పై విచారణ చేపట్టిన పోలీసులు కాల్డాటా ఆధారంగా నిందితులను పట్టుకుని, విచారించారు. వాష్రూమ్ క్లీనర్ తాగి.. తాండూరులోని సీఐ కార్యాలయంలో గత నెల 17న పోలీసులు కరీమాబీని విచారించారు. ఈ సమయంలో వాష్రూమ్కి వెళ్తానని చెప్పిన ఆమె అక్కడే ఉన్న బాత్రూమ్ క్లీనర్(ఫినాయిల్) తాగింది. వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం నగరానికి తరలించారు. 25 రోజులుగా చికిత్స పొందిన కరీమా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో నిమ్స్ ఆస్పత్రిలో చనిపోయింది. ఆమె మృతదేహానికి తాండూరులో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు బాడీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమాబీ ఆత్మహత్యాయత్నం చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ స్నేహ మెహ్ర గత ఆదివారం కానిస్టేబుళ్లు సునీత, బస్వరాజ్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఏం జరిగిందంటే.. తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజీవ్గృహకల్పకు చెందిన కరీమాబీ ఇదే కాలనీకి చెందిన అబ్దుల్ రహ్మాన్తో సహజీవనం చేసేది. వీరిద్దరూ అధిక వడ్డీ ఆశచూపి అమాయక మహిళల వద్ద అప్పులు చేశారు. ఈ సొమ్ముతో జల్సాలు చేస్తూ గడిపారు. వాయిదా ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడి చేయగా, వీరి పక్కనే ఉండే మహబూబ్బీని హత్య చేయాలని పథకం వేశారు. మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్హౌస్కు వస్తే డబ్బులు ఇస్తామని నమ్మించారు. నయీంపాష అనే మరో వ్యక్తితో కలిసి మార్చి 27న ఆమెను హత్యచేశారు. అనంతరం కాశీంపూర్ గ్రామానికి చెందిన అబేదాబేగంను సైతం ఫామ్హౌస్కు రమ్మని మే 5న హతమార్చారు. మృతుల సెల్ఫోన్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పోలీసు వర్గాల్లో ఆందోళన కరీమాబీ మృతి పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఆమెకు మెరుగైన చికిత్స అందేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సొంత ఖర్చులతో కార్పొరేట్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యానికి సైతం వెనకాడలేదని తెలుస్తోంది. కరీమాబీ చనిపోతే తమ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుందనే కారణంతో ఇదంతా చేశారని సమాచారం. కానీ ఆమె మృతితో కథ మొదటికి వచ్చినట్లైంది. -
మళ్లీ ఇసుక లొల్లి!
ఇసుక టిప్పర్లను అడ్డుకుంటున్న యువకులు తహసీల్దార్తో యువకుల వాగ్వాదం తాండూరు రూరల్: మండలంలోని చంద్రవంచ గ్రామంలో మళ్లీ ఇసుక పంచాయితీ మొదలైంది. గత శుక్రవారం గ్రామ శివారులోని కాగ్నా నది నుంచి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను ప్రజలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కూడా అధికారులు, కాంట్రాక్టర్లను మందలించారు. ఇవేవీ లెక్క చేయని కాంట్రాక్టర్ గురువారం మరోసారి ఇసుక తరలింపునకు టిప్పర్లతో వచ్చాడు. విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ అక్రం, వార్డు సభ్యులు, గ్రామ యువకులు వాగు వద్దకు వెళ్లి టిప్పర్లను అడ్డుకున్నారు. వాహనాల ముందు బైఠాయించారు. కరన్కోట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్లను అడ్డుకోవద్దని యువకులను సూచించారు. కాదని మెండికేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినా యువకులు బెదరలేదు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తహసీల్దార్తో వాగ్వాదం తహసీల్దార్ తారాసింగ్ సిబ్బందితో కలిసి చంద్రవంచ గ్రామానికి చేరుకున్నారు. ఉప సర్పంచ్, యువకులతో మాట్లాడారు. ఇసుక తరలింపునకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం వరకు పెద్దేముల్ మండలం కోట్పల్లి ప్రాజెక్టు మరమ్మతుల కోసం వందలాది టిప్పర్లను ఇసుకను తరలించారని తెలిపారు. ప్రస్తుతం వాగులో ఇసుక లభ్యత లేదన్నారు. ఉన్న కొద్ది పాటి నిల్వలను తరలిస్తే భవిష్యత్లో తాగునీటికి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఇసుక తరలింపును మాత్రం ఒప్పుకోమన్నారు. పర్మిషన్ పేరుతో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. తహసీల్దార్ ఎంత చెప్పినా యువకులు వినలేదు. దీంతో ఆయన వెనుదిరిగారు. టిప్పర్లు కూడా ఖాళీగా వెళ్లిపోయాయి. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని జినుగుర్తి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ వినోద్ రాథోడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన తుంగళి జగన్(50) మెకానిక్, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మార్కెట్ కమిటీ డైరక్టర్ అజ్మత్ అలీ పొలంలో పైప్లైన్ పనులు చేసేందుకు వెళ్లాడు. పనులు ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు జగన్కు తగిలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కరన్కోట్ ఏఎస్ఐ రాములు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కారును ఢీకొన్న లారీ పరిగి: వెనుక నుంచి కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. గురువారం పరిగి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శాంతకుమార్ స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దుకాణంలోకి దూసుకెళ్లిన కారు బొంరాస్పేట: మండలంలోని రేగడిమైలారంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు ఓ దుకాణంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన మహ్మద్ గులామ్ ఫకాన్ తన కారులో కర్ణాటక రాష్ట్రం గుర్బర్గాకు వెళ్తున్నారు. వాహనం ఉదయం గ్రామంలోని శ్యామలయ్యగౌడ్ కిరాణ దుకాణంలోకి దూసకెళ్లి బోల్తా పడింది. దుకాణాదారు పుష్పమ్మతోపాటు కారులో ఉన్న ఐదురుగురికి కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దెబ్బతిన్న కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. 15న జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు కుల్కచర్ల: ఈ నెల 15వ తేదీన జిల్లా సర్పంచుల చైతన్య సదస్సును నిర్వహిస్తారని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్లో జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ఉంటుందని చెప్పారు. సర్పంచుల సమస్యలు, జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చా కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా పరిధిలోని సర్పంచులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. యువకుడికి రిమాండ్ కడ్తాల్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని పోలీసు లు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కడ్తా ల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మూడ చరణ్ ఓ యువతిని కొంత కాలంగా ప్రేమ పేరిట వేధిస్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తి చేస్తున్నాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించసాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజ రుపరచగా రిమాండ్కు తరలించారన్నారు. నిందితుడిపై కేసు నమోదు బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బాధిత మహిళకు మైలారం ప్రవీణ్తో గత పదేళ్లుగా పరిచయం ఉంది. గతంలో ఆమె అతడి ఇంట్లో అద్దెకు ఉండేది. ఏడాది క్రితం వివాహం జరిగినప్పటికీ భర్త వారం రోజులకే వదిలి వెళ్లిపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ సమయంలో ప్రవీణ్ తనకు అండగా ఉంటానని నమ్మకం కల్పించి సన్నిహితంగా మెలిగాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భోజనం తీసుకుని తన ఇంటికి వచ్చిన బాధితురాలిపై ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివాహం చేసుకుంటానని చెప్పడంతో అతని మాటలు నమ్మింది. ఈ నెల 5న మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
సీఎం ఇలాకాలో విత్తన దోపిడీ!
కొడంగల్/బొంరాస్పేట/దౌల్తాబాద్: సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయాధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలను దోచేశారు. బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గురువారం కొడంగల్, దుద్యాల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాల్లో అక్రమాలు జరిగినట్లు బహిర్గతం అయింది. వంద, యాభై శాతం సబ్సిడీపై పంపిణీ చేయాల్సిన విత్తనాలను వ్యవసాయాధికారులు గట్టు చప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాలతో విచారణ చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ జరిగింది. పంచాయతీ కార్యదర్శులు రైతుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. 90 శాతం మందికి పైగా విత్తనాలు తీసుకోలేదని తెలిసింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు రైతుల నుంచి సంతకాలు తీసుకున్నారు. అక్రమాల నేపథ్యంలో దుద్యాల్ ఏఓ, ఇద్దరు ఏఈఓలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దుద్యాల్, రేగడిమైలారం ఏఈఓల దగ్గర ఉన్న రికార్డులను జిల్లా విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బొంరాస్పేట్ మండలం మెట్లకుంట, బుర్రితండా, కాకర్లగండి తండా, బురాన్పూర్, మదన్పల్లి, లోతికుంటతండా, కొత్తూరు, సాలిండాపూర్, వడిచర్ల గ్రామాల్లో జీపీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో విత్తన అక్రమాలపై ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు వివరాలు సేకరించారు. బొంరాస్పేట్: రైతులతో పంచాయతీ కార్యదర్శులు దౌల్తాబాద్: తిమ్మారెడ్డిపల్లిలో రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు నాలుగు మండలాల్లో విచారణ -
స్కూల్.. ఫుల్!
తెలంగాణ పబ్లిక్ స్కూల్కు విశేష ఆదరణ ● నో అడ్మిషన్ బోర్డు పెట్టేసిన సిబ్బంది మంచాల: విద్యార్థులు లేక పలు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్న ప్రస్తుత తరుణంలో.. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇందులో చేరడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ ప్రవేశాలు రావడంతో ఉపాధ్యాయులు సైతం చేతులెత్తేశారు. ● మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1,605 మంది చదువుతున్నారు. ● ప్రీ ప్రైమరీ పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పించడానికి నలుగురు ఉపాధ్యాయులు, నలుగురు ఆయాలను నియమించారు. ● ఒకటి నుంచి 5వ తరగతి వరకు 495 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క తరగతిలో 3 సెక్షన్లు, ఒక్క సెక్షన్కు 33 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి చదువు చెప్పడానికి 18 మంది ఉపాధ్యాయులను నియమించారు. ● ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు 960 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క తరగతిలో 4 సెక్షన్లు, ఒక్కో సెక్షన్లో 40 మంది చొప్పున 160 మంది విద్యార్థులున్నారు. వీరికి బోధించేందుకు 28 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ● ప్రస్తుతం మంచాల మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న 37 గ్రామాల నుంచి ఇక్కడికి చదువు కోసం వస్తున్నారు. వీరి రాకపోకల కోసం ఐదు బస్సులు నడిపిస్తున్నారు. ● ఎక్కువ మందిని చేర్చుకోవడం పాఠశాల నిబంధనలకు విరుద్ధమే కాకుండా, నిర్వహణ కష్టంగా మారుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్ద నోఅడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యార్థులను చేర్చుకున్నాం. ప్రస్తుతం 1,605 మందికి పైగా ఉన్నారు. మరింత మందిని తీసుకుంటే బోధన కష్టమవుతుంది. అందుకే నో అడ్మిషన్ బోర్డు పెట్టాం. – జి. గిరిధర్ గౌడ్ (హెడ్ ఆఫ్దీ స్కూల్)నాణ్యమైన, సృజనాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటాం. – జహీర్, ఉపాధ్యాయుడు -
పనుల్లో వేగం పెంచండి
కొడంగల్/అనంతగిరి: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. గురువారం కొడంగల్ మున్సిపల్ పరిధిలో పర్యటించి నిర్మాణ దశలో ఉన్న పనులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పని చేసి పురోగతి సాధించాలని సూచించారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు, బాలుర వసతి గృహం నిర్మాణ పనులు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలను సందర్శించారు. గుండ్లకుంట గ్రామంలో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్ పాల్గొన్నారు. వేగవంతంగా పూర్తి చేయాలి వికారాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులు, తాగునీటి సరఫరా తదితర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల శుభ్రత, మురుగు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు విక్రమ్ సింహారెడ్డి, బలరాంనాయక్, మల్లేశ్, రాకేష్ రెడ్డి, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు. -
మోదీతోనే సుస్థిర పాలన
● తెలంగాణలో ఒంటరిగానేఅధికారం చేపడతాం ● అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డిమహేశ్వరం: జైశ్రీరామ్ అంటూనే తెలంగాణను అభివృద్ధి చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండల పరిధిలోని చిన్న తూఫ్ర, సిరిగిరిపురం, డబిల్గూడ గ్రామాల్లో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుస్థిర పాలన మోదీతోనే సాధ్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 1.40 కోట్ల టన్నుల ధ్యానం కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 55 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించిందన్నారు. రైతుల అభ్యున్నతి కి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి చేసిన వరంగల్ డిక్లరేషన్ అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని.. నియోజకవర్గ పునర్విభజనలో మహేశ్వరం రెండు నియోజకవర్గాలు ఏర్పడుతుందని రెండు స్థానాల్లోనూ కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఇటీవల అమిత్షా చెప్పారని సొంతంగానే కొట్లాడి అధికారంలోకి వస్తామ న్నా రు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు టి.యాదీశ్, పెద్దమ్మ తండా, డబిల్గూడ, సిరిగిరిపురం సర్పంచ్లు రవి నాయక్, యాదమ్మ, కృష్ణవేణి, బీజేపీ రాష్ట్ర నాయకులు పాపయ్యగౌడ్, అనంతయ్యగౌడ్, రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, ఓబీ సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సుదర్శన్ యాదవ్ పాల్గొన్నారు. -
యజమాని అజాగ్రత్తతోనే భారీ దోపిడీ
గచ్చిబౌలి: గచ్చిబౌలి హిల్రిడ్జ్ విల్లాస్లో జరిగిన భారీ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 7.837 కిలోల బంగారు నగలు, 1.367 కిలోల వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విల్లా నంబర్ 73లో నివసించే ప్రకాష్ పాయ్ వద్ద నేపాల్కు చెందిన కమల్ షాహీ, విమల్ షాహీ దంపతులు వాచ్మెన్, సర్వెంట్లుగా చేరారు. ఈ నెల 6న యజమాని కుటుంబం ముంబై వెళ్లగా, ప్రధాన సూత్రధారి సురేష్ షాహీ ప్లాన్ ప్రకారం వారు లోపలికి చొరబడ్డారు. బెడ్రూమ్లోని కలశంలో ఉన్న తాళం చెవితో లాకర్ తెరిచి భారీగా నగలు దోచుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి రైలులో ఉత్తరప్రదేశ్కు పరారయ్యారు. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కొత్త సిమ్ కార్డ్ ఆధారంగా యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ పోలీసుల సహకారంతో నేపాల్ సరిహద్దుకు రెండు గంటల ముందే నిందితులను ఉదంపూర్లో పట్టుకున్నారు. కమల్, విమల్, కల్పన, భిశ్వకర్మలను అరెస్ట్ చేయగా, సురేష్ షాహీ పరారీలో ఉన్నాడు. లాకర్ తాళం చెవిని అక్కడే వదిలేయడం యజమాని అజాగ్రత్తను తెలియజేస్తోందని సీపీ అన్నారు. మొదట్లోనే ’డయల్ 100’కు కాల్ చేసి ఉంటే ఇంత శ్రమ ఉండేది కాదన్నారు. హిల్రిడ్జ్ విల్లాస్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, నేపాలీ పనివారిని చేర్చుకునే ముందు జాగ్రత్తలు వహించాలని సీపీ సూచించారు. 7.837 కిలోల బంగారు ఆభరణాలు,1.36 కిలోల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ -
నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
తాండూరు టౌన్: కూలి పనికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తలారి హరికృష్ణ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పలు కుల, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన తలారి హరికృష్ణ పని నిమిత్తం ఏప్రిల్ 29న రుద్రారం గ్రామానికి వెళ్లాడు. అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, నేటి వరకు నిందితులను పట్టుకోలేదన్నారు. హరికృష్ణది ముమ్మాటికే హత్యేనని, పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. బీసీలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం స్పందించాలన్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేయని ఎడల ఆందో ళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి, ముదిరాజ్ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు లొంక నర్సిములు, రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహిద్, ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కప్ప, గుమ్మడి రత్నం, జయప్రసాద్, బుగ్గప్ప, రవికాంత్, బసంత్, మగ్దూం, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంట మార్పిడితో ప్రయోజనం
కేంద్రియ సమగ్ర సస్యరక్షణ సెంటర్ ఇన్చార్జ్ వెంకట్రెడ్డి మోమిన్పేట: పంట మార్పిడితో అధిక దిగు బడి, లాభాలు పొందవచ్చని కేంద్రియ సమగ్ర సస్యరక్షణ సెంటర్ ఇన్చార్జ్ వెంకట్రెడ్డి అన్నా రు. గురువారం మండలంలోని మొరంగపల్లి లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ ఒకే రకం పంట వేయడం ద్వారా పెట్టుబడులు పెరగడంతోపాటు దిగుబడి తగ్గుతుందన్నారు. పంట మార్పిడితో ఈ సమస్య నుంచి బయట పడొచ్చని తెలిపారు. రైతులు విధిగా మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వాటి ఫలితాల ఆధారంగానే సాగు చేయాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడొద్దన్నారు. భూసారం పెంచేందుకు పచ్చి రొట్ట ఎరువులు వాడాలన్నారు. గడ్డి మందు, కీటక మందుల వాడకం తగ్గించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కొంటే విధిగా రసీదు పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ప్లాంటు ప్రొటెష్షన్ ఆఫీసర్ హోనప్ప, అసిస్టెంట్ ఆఫీసర్ ఉదయ్ శంకర్, ఏఓ రామకృష్ణారెడ్డి, ఏఈఓలు స్వాతి, పెంటయ్య, రైతులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమం కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి కొడంగల్: నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదింటిలో పెళ్లి జరిగితే ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రమేష్ బాబు, పర్సాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ హమీద్ పాల్గొన్నారు. కంది విత్తనాల పంపిణీ కొడంగల్: పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. ఒక్కో కిట్ నాలుగు కిలోల చొప్పున 400 కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్తో విత్తనాలను ఉచితంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీ ఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, ఏడీఏ శంకర్ రాథోడ్, ఏఓ శ్రీలత, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. తమ్మలి సంఘం జిల్లా కమిటీ ఎన్నిక అనంతగిరి: తమ్మలి సంఘం జిల్లా నూతన కమిటీని గురువారం వికారాబాద్లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శి గా వెంకటరాములు, కోశాధికారిగా పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా రమేష్, అశోక్, జగదీశ్వర్, వ ర్కింగ్ ప్రసిడెంట్గా శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా రమేష్, శరణప్ప, అశోక్, శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోహర్, శ్రీనివాస్, వీరేశం, మహిళ కార్యదర్శులుగా ప్రభావతి, రేణుక, షర్మిల, సలహాదారులుగా సురేందర్, శ్రీనివాస్, చంద్రమౌళి, సంగయ్య, సత్యనా రాయణ, విఠల్, రాజేందర్ ఎన్నికయ్యారు. -
ఖనిజాల ఖిల్లా
ఉపయోగం ఇలా.. వికారాబాద్: జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలను గుర్తించిన కేంద్రం వాటిని తవ్వి తీసేందుకు సిద్ధమైంది. మన సరిహద్దు ప్రాంతంలో (ఆర్ఈఈ) రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. టైటానియం, వెనేడియం మూలకాలు మన ప్రాంతంలో ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే జియాలాజికల్ సర్వే నిపుణులు పరిశోధనలు పూర్తి చేశారు. మైనింగ్ కోసం కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. దక్కించుకునేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిడ్లు వేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. దేశ వ్యాప్తంగా ఐదారేళ్ల క్రితమే మొదటి విడత మైనింగ్ కేటాయింపులను పూర్తి చేయగా.. ప్రస్తుతం రెండో విడత కేటాయింపులకు కసరత్తు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల అరుదైన ఖనిజాలను గుర్తించగా మన రాష్ట్రంలో మూడు చోట్ల ఉన్నాయని తేల్చారు. ఇందులో ఒకటి సిద్దిపేట జిల్లాలో.. మరొకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. ఇంకొకటి వికారాబాద్ – సంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు తేల్చారు. మన జిల్లా పరిధిలోని మోమిన్పేట్, మర్పల్లి మండలాలతో పాటు సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్ మండలంలో 203 చదరపు కిలో మీటర్లలో ఈ టైటానియం, వెనేడియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఆనందంతోపాటు భయాందోళన టెండరు దక్కించుక్ను సంస్థలు మైనింగ్కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. త్వరలో టైటానియం, వెనే డియం నిక్షేపాలను వెలికి తీయనున్నారు. దీని ద్వా రా జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధి అవకాశాలు కూ డా పెరుగుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో పక్క ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మైనింగ్ కారణంగా ఈ ప్రాంతం దుమ్మూధూళితో నిండిపోతుందనే భయం కూడా ఉంది. టైటానియం తవ్వకాలతో ప్రమాదం తక్కువే అయినా వెనేడియంతో వాతావరణం కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. వెనేడియంతో అనేక ఉపయోగాలు ఉన్నా ఇది విషపూరిత మూలకం కావడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అయితే గ్రామ సభలు, అభిప్రాయ సేకరణ చేయకుండా మైనింగ్కు సిద్ధం కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తమవుతోంది. మనవ మనుగడకు విఘాతం కలిగించే చర్యలకు దిగితే అడ్డుకుంటామని పలువురు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో అరుదైన నిక్షేపాలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 118 మూలకాలను గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో టైటానియం 22వ మూలకంగా.. వెనేడియాన్ని 23 వ మూలకంగా గుర్తించారు. టైటానియం తేలికై న మూలకం.. ఇది ఉక్కు కంటే కూడా గట్టిగా ఉంటుంది. లభ్యత చాల తక్కువ కావడంతో అరుదైనదిగా గుర్తింపు పొందింది. దీన్ని దంతాలకు వేసే తొడుగుల తయారీకి, ఆర్థోకు సంబంధించి శరీరం లోపల అమర్చే వైద్య పరికరాల తయారీకి వినియోగిస్తారు. విమానాల విడి భాగాలు, అంతరిక్ష పరికరాలు, మిస్సైల్ తయారీలో వినియోగించే పరికరా లు ఈ టైటానియంతోనే తయారు చేస్తారు.ఈ మూ లకానికి తుప్పు పట్టే గుణం తక్కువగా ఉన్నందున జలాంతర్గాముల తయారీ,ఇతర సముద్రంలో ప యనించే వాహనాల తయారీకి వినియోగిస్తారు. స ముద్ర జలాల శుద్ధికి సైతం ఉపయోగ పడనుంది. దీని ధర స్టీల్తో పోలిస్తే 40 నుంచి 50 రెట్లు అధికంగా ఉంటుంది. వెనేడియం మూలకాన్ని విద్యుత్ శక్తి నిల్వ చేసే పరికరాల తయారీకి వినియోగిస్తారు. బ్యాటరీల తయారీకి ఉపయోగ పడనుంది. -
విత్తనాలు కొంటేనే ఎరువులా?
ధారూరు: రైతులను ఇబ్బంది పెట్టే ఎరువుల దుకాణాలపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరించారు. మంగళవా రం మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, మన గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధారూరుకు 29 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ఆన్లైన్లో నమోదు కాకపోవడంపై ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుతోనే లబ్ధిదారులకు ఇళ్ల బిల్లు లు రావడం లేదని కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రెండు రోజుల్లో ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. వారానికి ఒక్కసారి కూడా మిషన్ భగీరథ నీరు రావడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బాబాఖాన్ ఫిర్యాదు చేశారు. నీటి సరఫరాలోనే సమస్య ఉందని మిషన్ భగీరథ అధికారి చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. అనంతరం మన గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. విత్తనాలు, క్రిమి సంహారక మందులు కొన్న వారికే డీఏపీ, యూరియా ఇస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. స్థానిక వ్యవసాయ అధికారి ఏం చేస్తున్నారని డీఏఓ రాజరత్నంను ప్రశ్నించారు. ఇకముందు ఇలా చేస్తే పోలీస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధరల బోర్డు డిస్ప్లే చేయాలని నిర్వాహకులకు సూచించారు. 460 బస్తాల యూరియా ఉన్నా ఆన్లైన్లో బుక్ కాకపోవడంపై ఆరా తీశారు. ఎందుకిలా జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన వడ్లు, జొన్నలను వెంటనే మిల్లులు, గోదాంకు తరలించాలని తెలిపారు. అనంతరం తాండూరు – హైదరాబాద్ మార్గంలోని ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిగ్గా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు బాబాకాన్, అమరేశ్ర్రావు, ఇబ్రహీం ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సాజిదాబేగం, ఏఓ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం ట్యాంకు ఎక్కి నిరసన
మీర్పేట: తాగునీటి సదుపాయం కల్పించాలని లెనిన్నగర్ డబుల్ బెడ్రూం వాసులు మంగళవారం ఖాళీ బిందెలతో ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా మంచినీటి సౌకర్యం కల్పించలేదని, కార్పొరేషన్గా ఉన్నప్పుడు జిల్లా, స్థానిక ఎమ్మెల్యే, హౌసింగ్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల ఉన్న ఒక్కగానొక్క బోరు కూడా పాడైపోయిందన్నారు. ఆనుకునే మిషన్ భగీరథ ట్యాంకు ఉన్నప్పటికీ మంచినీరు తాగే భాగ్యం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే మంచినీటి సరఫరాకు సంబంధించి పైపులైన్ పనులు ప్రారంభించి కనెక్షన్ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలారవినాయక్, స్థానిక బీజేపీ అధ్యక్షుడు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, చెవ్వ శ్రవణ్, తిరుపతిరెడ్డి, పూజారి శంకర్, బాలునాయక్ పాల్గొన్నారు. -
సీఎం సభకు భారీ ఏర్పాట్లు
ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఎఫ్సీడీఏ భవనంనిర్మాణంలో సభా వేదిక కందుకూరు: ఫ్యూచర్సిటీలో నిర్మించిన ఎఫ్సీడీఏ భవనం ప్రారంభోత్సవంతో పాటు ఆ సమీపంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ఎఫ్సీడీఏ భవనంలో పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటడం, గడ్డిపరిచే పనులు చేపట్టారు. భవనం వెనుక వైపు ఉన్న ప్రాంతంలో సభ కోసం పెద్దపెద్ద షెడ్లు వేస్తున్నారు. మరోవైపు జనాలు భారీగా సభకు వచ్చేలా కాంగ్రెస్ పెద్దలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఏఫ్సీడీఏ భవనంతో పాటు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్సిటీ
కందుకూరు: ఫ్యూచర్సిటీని అత్యంత ప్రమాణాలతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. ఫ్యూచర్సిటీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఎఫ్సీడీఏ భవనంతో పాటు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏఐ సిటీతో పాటు డాటా సెంటర్ల వంటివి ఏర్పాటు కానున్నాయన్నారు. ఇక్కడ నెలకొల్పే సంస్థలో పని చేయడానికి నైపుణ్య శిక్షణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఫ్యూచర్సిటీలో నెలకొల్పే ప్రతి సంస్థ కాలుష్యరహితంగానే పని చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగులుతున్నా ఇక్కడి ప్రజల కోసం చేపట్టిన నగర నిర్మాణాన్ని ఆపేదిలేదన్నారు. భవిష్య నగరానికి పునాదులు వేస్తున్నామని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎఫ్సీడీఏ భవనం ప్రారంభోత్సం, అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, టీజీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్రెడ్డి, సరికొండ మల్లేష్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
పరిగి: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి నేతలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు. బీఎల్ఏలు సర్ ప్రక్రియలో పాల్గొని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను విస్మరించి ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క గ్యారంటీనీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్, కేటీఆర్లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచనే లేదని మండి పడ్డారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీషీ
వికారాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక ఆక్యుపెన్సీ రేటు భారీగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలు, ట్రాన్స్ జెండర్లకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. జిల్లాలో మూడు డిపోలు(వికారాబాద్, పరిగి, తాండూరు) ఉండగా వీటి పరిధిలో 200 బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 5.68కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.209.33 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో బస్సులో రోజుకు సగటున 300 నుంచి 350 మంది ఉచితంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల్లో 70 శాతానికి పైగా నారీమణులే ఉంటున్నారు. మహాలక్ష్మి పథకంతో.. గడచిన దశాబ్ద కాలంలో ఆర్టీసీ అనేక సంస్కరణలు చేపట్టినా ఆక్యుపెన్సీ పెరిగిన దాఖలాలు లేవు. మహాలక్ష్మి పథకం అమలయ్యాక ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సీ్త్రలతోపాటు పురుషుల సంఖ్య కూడా పెరిగింది. ఇది ఆక్యుపెన్సీ రెండింతలు అవడానికి దోహదం చేసింది. గతంలో 50 నుంచి 60 లోపే నమోదయ్యే ఆక్యుపెన్సీ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే 95 నుంచి 120 శాతానికి చేరింది. స్టాపుల్లో ఆగని బస్సులు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో సిబ్బందికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. బస్సుల్లో నిలుచుకోవడానికి కూడా స్థలం ఉండని పరిస్థితి నెలకొంది. గతంలో చెయ్యెత్తిన చోట బస్సు ఆపేవారు. ఆడిగిన చోట దించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సగం స్టాపుల్లో బస్సులు ఆపకుండానే వెళ్తున్నారు. ఇదిలా ఉండగా మహిళా ప్రయాణికులను కండక్టర్లు, డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారు. వారికి పురుష ప్రయాణికులు గొంతుకలుపుతున్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మహిళలకు కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలనే స్లోగన్ ఇప్పుడు మచ్చుకై నా కనిపించడంలేదు. మహిళల సీట్లలో పురుషులే కూర్చుంటున్నారు. డబ్బులు ఇచ్చి టికెట్ కొంటున్నారంటూ కండక్టర్లు సైతం వారికే సపోర్టు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం బస్సుల్లో వారు ఎదుర్కొంటున్న బాధలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సులన్నీ రద్దీగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ -
అప్రమత్తంగా ఉండండి
తాండూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోందని.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులోని వినాయక కన్వెన్షన్లో నియోజకవర్గంలోని 269 మంది బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్, ప్రత్యేక ట్రైనర్ వెంకటరమణ బీఎల్ఏలకు, పార్టీ నాయకులకు డిజిటల్ స్క్రీన్పై శిక్షణ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వచ్చేలా కృషి చేయాలన్నారు. అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. ఓటరు జాబితా సవరణలో నకిలీ, డబుల్, మరణించిన వారి పేర్లు తొలగించాల్సి ఉంటుందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి, మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల్ల నర్సింహులు, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం కనుసన్నల్లోనేసర్ ప్రక్రియ -
అందని సాగుసాయం!
వికారాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేయలేదు. బ్యాంకర్లు పంట రుణాల ఊసెత్తడం లేదు. దీంతో అన్నదాతలు పంట పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల గడప తొక్కుతున్నారు. పంట రుణాలు ఇస్తారా.. ఇవ్వరా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆయా పంట రకాలను బట్టి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉన్నందున వడ్దీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రుణ లక్ష్యం రూ.3,829 కోట్లు ఏటా ఖరీఫ్ ప్రారంభానికి ముందే బ్యాంకర్లు రుణ ప్రణాళికను సిద్ధం చేస్తారు. జిల్లాలో ఎంత మంది రైతులు ఉన్నారు..? ఎన్ని ఎకరాల సాగు భూమి ఉంది..? ఇవ్వాల్సిన రుణాలు ఎన్ని వంటి పూర్తి వివరాలు సేకరిస్తారు. గతేడాది రూ.3,829 కోట్ల రుణ లక్ష్యంగా పెట్టుకోగా 60 శాతానికి మించి ఇవ్వలేదు. ఈ ఏడాది ఇంత వరకు రుణ ప్రణాళికే ప్రకటించలేదు. జిల్లాలో 2.5 లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు ప్రక్రియను ప్రా రంభించారు. చాలా మంది రైతులు చేతిలో చిల్లిగ వ్వ లేక బ్యాంక్ రుణాల కోసం ఎదురు చూస్తు న్నారు. కొన్ని బ్యాంకులు రుణాలిచ్చే ప్రక్రియను ప్రారంభించినా కొర్రీలు పెడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. పలు కారణాలతో చాలా మందికి రుణమాఫీ కాలేదు. అలాంటి రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు ఎటూ తేల్చడంలేదు. సాగు అంచనాలు 5.90లక్షల ఎకరాలు జిల్లాలో 5.90లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఏటా ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, డీసీసీబీ తదితర బ్యాంకులు సగటున రూ.3,500 నుంచి రూ.3,800 కోట్ల వరకు వ్యవసాయ రుణాలు ఇచ్చేవారు. ఈ ఏడు ఎంతే మేర ఇస్తారనేది ఇప్పటి వరకు తేలలేదు. జిల్లాలోని 3.20 లక్షల మందికి రైతు భరోసా నిధులు రూ.320 కోట్ల వరకు అందాల్సి ఉంది. సీజన్ ప్రారంభమైనా పంట పెట్టుబడి సాయం ఊసే లేదు. పంట రుణాల విషయమై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరిని వివరణ కోరగా త్వరలో రుణ ప్రణాళిక ప్రకటించి అమలు చేస్తామని తెలిపారు. రైతు భరోసా ఊసెత్తని ప్రభుత్వం పంట రుణాలివ్వాలి ఏటా ఖరీఫ్ ప్రారంభం కాగానే బ్యాంకర్లు లోన్లు ఇచ్చేవారు. రెండు మూడేళ్లుగా సక్రమంగా పంట రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకులకు వెళ్లినా సరైన సమాధానం చెప్పడం లేదు. రైతు భరోసా నిధులు కూడా అందలేదు. ప్రభుత్వం, బ్యాంకర్లు వెంటనే చర్యలు చేపట్టాలి. – కాశయ్య, రైతు, మల్లెపల్లి జిల్లాలో రైతుల సంఖ్య 3.20 లక్షలు సాగు విస్తీర్ణం 5.90 లక్షల ఎకరాలు అందాల్సిన రైతు భరోసా రూ.320 కోట్లు -
ఆక్రమణలను అడ్డుకోండి
మున్సిపల్ కమిషనర్కు బీజేపీ కౌన్సిలర్ల వినతి తాండూరు టౌన్: పట్టణ పరిధిలోని మల్రెడ్డిపల్లి సర్వే నంబర్ 52లోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి తోపాటు రాఘవేంద్ర కాలనీ వాసులు కోరారు. మంగళవారం ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 52లోని 13.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. అందులో మూడు ఎకరాలను మున్సిపల్ శాఖకు, ఐదు ఎకరాలను విద్యుత్ శాఖకు, రెండు ఎకరాలను రాఘవేంద్ర కాలనీకి కేటాయించినట్లు తెలిపారు. 3.12 ఎకరాల భూమి మిగిలి ఉందన్నారు. ఈనెల 7న జిల్లా మెథడిస్ట్ చర్చి, విలియంమూన్ స్కూల్ సభ్యులు, ఇతర వ్యక్తులు ఆక్రమించి ప్రహరీ నిర్మించడానికి యత్ని స్తున్నారని తెలిపారు. వెంటనే విచారణ చేపట్టాలని వారు కోరారు. కొనసాగుతున్న ఆందోళన దౌల్తాబాద్: మండలంలోని గోకఫసల్వాద్ గ్రామంలో ఆక్రమణకు గురవుతున్న శివాలయ భూమిని కాపాడాలంటూ చేపట్టిన ఆందోళన రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. సోమవారం గ్రామానికి చెందిన పలువరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయగా మంగళవారం వచ్చి సర్వే చేస్తామని అధికారులు తెలిపారు. వారు రాకపోవడంతో తహసీల్దార్ వచ్చి తిరిగి ధర్నా నిర్వహించారు. ఆలయ భూమిని కాపాడాలని పలువురు డిమాండ్ చేశారు. 15న తలనీలాలసేకరణకు బహిరంగ వేలం అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం నందు ఏడాదిపాటు తలనీలాల సేకరణకు ఈ నెల 15న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరేందర్, ధర్మకర్త పద్మనా భం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై ఒకటి నుంచి 2027 జూన్ 30 వరకు తలనీలాలు సేకరించుకోవచ్చని తెలిపారు. 15వ తేదీ ఉదయం 11గంటలకు ఆలయం ఆవరణలో వేటం ఉంటుందని, ఆసక్తి గల వారు రూ.50 వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని వారు తెలిపారు. ప్రజాదర్బార్ పుస్తకావిష్కరణ పూడూరు: బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎం ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో ఎంపీ ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ప్రజాదర్బార్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ ప్రాంతం నుంచి బీసీ ఉద్యమాన్ని ప్రారంభించి జాతీయ స్థాయిలో ముద్ర వేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఆర్ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలి చేవెళ్ల: మొయినాబాద్ మండలంలోని కనకమామిడి ఫామ్హౌస్ కేసులో కొడిచెర్ల సాయికుమార్ మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు నరేందర్, జిల్లా కార్యదర్శి శివశంకర్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏసీపీ కిషన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగి 20 రోజులు అవుతున్నా ఈ కేసులో ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు కల్పించుకొని, నిందితులను అరెస్ట్ చేసి బాధితకుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఊరెంట ప్రవీణ్, నరేశ్, ప్రేమ్సాగర్, నగేశ్, రాజు తదితరులు ఉన్నారు. -
తలారి హరికృష్ణది హత్యే..
తాండూరు టౌన్: కూలీ పనికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తలారి హరికృష్ణది ముమ్మాటికే హత్యేనని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఈమేరకు మంగళవారం ముదిరాజ్, దళిత, మైనార్టీ, ప్రజాసంఘాల నాయకులు తాండూరులో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన యువకుడు తలారి హరికృష్ణ ఏప్రిల్ 29న పని నిమిత్తం రుద్రారం గ్రామానికి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని, ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 11న తాండూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు రమేశ్ ముదిరాజ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, టీఎస్ఎంఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, చంద్రయ్య, రత్నం, సాధిక్, బలరాం, రాజు, శానప్ప, శ్రీకాంత్ తదితరులు తెలిపారు. ● నిందితులను అరెస్ట్ చేయాలి ● ప్రజాసంఘాల నాయకులు -
ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి మృతి
శంకర్పల్లి: నిర్మాణ కంపెనీలో పని చేస్తు న్న ఓ యువకుడు ప్ర మాదవశాత్తు గుంత లో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అనంతవరం గ్రామానికి చెందిన రాజు, రేణుక దంపతులు. వీరికి ఇద్దరూ కుమారులు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్పల్లి మండలం మోకిలకి వచ్చి నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. వీరి పెద్ద కొడుకు అశోక్(25) స్థానికంగా ఎస్ఎస్ఐ బహుళ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నారు. మధ్యాహ్నం ఆయన పని చేస్తుండగా బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద ఉన్న కుంటలో పడ్డాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మురుగు కాలువలో మృతదేహం లభ్యం పహాడీషరీఫ్: మురుగు కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై దయాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద డ్రైనేజీ మురుగు కాలువలో యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, మృతుడి వయసు 35–40 ఏళ్ల నడుమ ఉంటుందని, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడాన్ని గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేకాట స్థావరాలపై దాడులు కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్పహాడ్లో పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఈ దాడుల్లో రూ.60,800 నగదు, ఏడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
ఎన్నికల హామీ మేరకు బస్సులు
మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి మోమిన్పేట: రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల మహిళ సమాఖ్యకు ప్రభుత్వం అందించిన బస్సును కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హమీ మేరకు మహిళ సంఘాలకు బస్సులను అందించామన్నారు. పలు మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులను ఏర్పాట్లు చేశామని వివరించారు. రూ.36లక్షల విలువైన బస్సుతో ప్రతీ నెల స్థిరమైన ఆదాయం వస్తుందని చెప్పారు. ఆర్టీసీ అద్దెకు ఇస్తే ప్రతీ నెలకు రూ.69 వేల చొప్పున మహిళా సమాఖ్యకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్, మహిళ సమాఖ్య మండల అధ్యక్షురాలు భాగ్యమ్మ, నాయకులు సంగమేశ్గౌడ్, నర్సింలు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య అభివృద్ధికి కృషి దోమ: మహిళా సమాఖ్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీఎం శోభ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నూతన ఆర్టీసీ బస్సును కొనుగోలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సమాఖ్యకు ప్రభుత్వం రూ.30లక్షలు ఇవ్వగా, రూ.6 లక్షలతో నూతన బస్సు కొనుగోలు చేశామన్నారు. హైదారాబాద్లో నిర్వహిస్తున్న సీఎం సభకు నూతన బస్సులో మహిళలను తరలించి సభను విజయవంతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యం కుల్కచర్ల: మహిళ సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు శేఖర్, మాజీ అధ్యక్షుడు ఆశోక్ కుమార్ అన్నారు. మంగళవారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నూతనంగా బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నాగరాజు, నరసింహ నాయక్, నవీన్, రామ్మోహన్ శర్మ, శివరాములు, ఉమాపతిరెడ్డి, రామాంజనేయులు, వెంకటయ్య, మహిళ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జొన్నలకు రూ.3,699 మద్దతు ధర
అనంతగిరి: జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతుతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం వికారాబాద్లోని మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ఫెడ్–డీసీఎంఎస్ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రూ.3,699 మద్దతు ధర పొంది అధిక లాభం గడించాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేఽశం, డైరక్టర్లు రమేశ్నాయక్, పాపిరెడ్డి, పాండురంగారెడ్డి, ప్రభాకర్, విజేందర్రెడ్డి, డీసీఎంఎస్ మేనేజర్ సుదర్శన్రెడ్డి, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ -
నిర్వాసితులకు పరిహారం
58 మందికి రూ.1.37 కోట్లు కొడంగల్: మహబూబ్నగర్–చించోలీ జాతీ య రహదారి విస్తరణకు పట్టణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు మంగళవారం పరిహారం చెక్కులు అందజేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 58 మంది లబ్ధిదారులకు రూ.1,37,55,105 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, తహసీల్దార్ రాంబాబు, కమిషనర్ బలరాం నాయక్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్, రమేశ్బాబు, సోమశేఖర్, దాము పాల్గొన్నారు. తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం రుక్మాపూర్ సర్పంచ్ బాల్రాజ్ కాంగ్రెస్లో చేరారు. మంగళవారం ఆయనకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ సుమిత్రభాయ్, సీనియర్ నాయకులు శోభారాణి, ఎల్లారెడ్డి, గోపాల్రెడ్డి, రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో హద్దులు నిర్ణయించి, ఫెన్సింగ్ వేసేందుకు నిర్ణయం పహాడీషరీఫ్: బాలాపూర్ మండల పరిధిలోని జల్పల్లి గ్రామ బిజాన్గుట్ట ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయమై సాక్షి దినపత్రికలో ‘బిజాన్గుట్టపై అక్రమార్కుల కన్ను’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి ఆదేశానుసారం ఆర్ఐలు జమీల్, సుధాకర్లు జీపీవోలతో కలిసి ఉదయమే బిజాన్గుట్టకు చేరుకున్నారు. అధికారుల రాక విషయం తెలుసుకున్న వ్యక్తులు ప్రొక్లెయినర్ను అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రీ కాస్ట్ వాల్ ప్రహరీని ఈ సందర్భంగా కూల్చివేశారు. త్వరలోనే స్థలానికి హద్దులు నిర్ణయించి, కబ్జా బారిన పడకుండా శాశ్వత పెన్సింగ్ నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఈ భూమిలో ఎవరైనా కబ్జాకు పాల్పడినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. వెల్జర్లలో విషాదఛాయలు షాద్నగర్: బిడ్డ బంగారు భవిష్యత్తును ఆశించిన తల్లిదండ్రుల ఆశ నెరవేర లేదు. బంగారు భవిష్య త్తు కోసం రెక్కలు ముక్క లు చేసుకొని కొడుకును చదివిస్తే అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో షాద్నగర్ పరిధిలోని వెల్జర్లకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలమణి, కృష్ణయ్యల కుమారుడు కార్తీక్ (26) పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటూ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం తోటి స్నేహితులు గుర్తించి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. తండ్రి కృష్ణయ్య సోమ వారం ఉదయమే కొడుకును హాస్టల్లో విడిచిపెట్టివచ్చాడు. కార్తీక్కు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియరాలేదు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఏళ్ల నుంచి ఎదురుచూపులే..
కుల్కచర్ల: ప్రజా అవసరాలు, జనాభా, ప్రాదేశిక దూరాల ప్రకారం మండల పరిధిలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని మండల వాసులు ఏళ్ల నుంచి ప్రభుత్వాలను కోరుతున్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సైతం కుల్కచర్ల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఎర్పాటుచేయాల్సిన అవసరం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఏడాది గడిచినా అతీగతీ లేకుండా పోయింది. అగ్నిప్రమాద ఘటనలు వాటి నివారణకు అవసరమైన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ప్రజలు కోరుతున్నారు. దూరభారంతో నష్ట తీవ్రత అగ్నిమాపక కేంద్రం సమీపంలో లేక ప్రజల ఆస్తులు కాలిబూడిదవుతున్నాయి. ప్రమాదం జరిగిందంటే అక్కడ నష్టం వాటిళ్లడం తప్పితే అగ్నిమాపక వాహనం వచ్చి ఆర్పి నష్ట నివారణ చేసిన ఘటనలు మచ్చుకు కూడా లేవు. ప్రస్తుతం పరిగి నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఉంది. కుల్కచర్ల మండల కేంద్రానికి పరిగి 22 కిలోమీటర్ల దూరం ఉంది. కుల్కచర్ల నుంచి ఇతర ప్రాంతాలు సైతం దూరంగా ఉండటంతో ఫైరింజన్ వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. చౌడాపూర్, మక్తవెంకటాపూర్, కుస్మసముద్రం, అనంతసాగర్, సాల్వీడు, చెల్లాపూర్ తదితర గ్రామాలకు వెళ్లాలంటే మరో 10–15 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఫైరింజన్ చేరుకునేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మండల పరిధిలో జరిగిన ప్రమాదాలు ● రెండేళ్ల క్రితం మండల కేంద్రంలో చందు బట్టలదుకాణం అగ్నికి ఆహుతైంది. ● గతేడాది ఫిబ్రవరిలో గోరిగడ్డతండాలో వడిత్య పాండు ఇంట్లో గ్యాస్ లీకై న ఘటనలో మంటలు చెలరేగి కుటుంబీకులంతా తీవ్రంగా గాయపడ్డారు. ● ఏ ఏడాది ఫిబ్రవరిలో సాల్వీడులో పాలెపల్లి రాములు గడ్డివాము దగ్ధమైంది. ● ఏప్రిల్లో మందిపల్ ఓంకారేశ్వరాలయంలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం జరిగింది. ● రెండు నెలల క్రితం పేపర్ ప్లేట్ల దుకాణంలో మంటలు చెలరేగి తీవ్ర నష్టం వాటిళ్లింది. ● వారం క్రితం వరి పంట కోస్తున్న సమయంలో పర్సపురం మైపాల్కు చెందిన హార్వెస్టర్ మంటలు చెలరేగి రూ.25 లక్షలు నష్టపోయాడు. అగ్నిమాపక కేంద్రం హామీలకే పరిమితం అసెంబ్లీలో ప్రస్తావించినా అమలుకు నోచుకోని వైనం కాలిబూడిదవుతున్న ఆస్తులు -
బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్
తాండూరు టౌన్: అతివేగం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది, సీఐ పరమేశ్వర్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన రాధాకిషన్రావు(45) వికాట్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగి. మధ్యాహ్నం ఆయన తన బైక్పై బాబుతో కలిసి గౌతాపూర్ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో గౌతాపూర్ నుంచి తాండూరుకు నాపరాతి లోడ్ ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ఎదురుగా అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన రాధాకిషన్ రావు కాళ్ల మీదుగా ట్రాక్టర్ ప్రయాణించగా తీవ్రంగా గాయపడ్డారు. బాబు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాధాకిషన్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు. ఆయన్ను నగరానికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య మనోజ్ఞ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ నాగరాజు పరారీలో ఉన్నాడు.● ద్విచక్ర వాహనదారుడి మృతి ● మరొకరికి గాయాలు -
జిల్లావ్యాప్తంగా ఆరు లక్షల మొక్కలు
పరిగి: ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించుకోవాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జాఫర్పల్లిలోని ఎకో అర్బన్ పార్కులో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని ఎంచుకున్నామన్నారు. మొక్కలతోనే మానవ జీవన విధానం ముడిపడి ఉందన్నారు. జాఫర్పల్లిలో 120 ఎకరాల్లో ఎకో అర్బన్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పార్క్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ప్రతిమ, సర్పంచ్ మహేశ్కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లాల్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు
మోమిన్పేట: విత్తనాలు, ఎరువులను అదిక ధరలకు విక్రయిస్తే పీడీయాక్టు నమోదు చేస్తామని తహసీల్దార్ రవీందర్ హెచ్చరించారు. మంగళవారం టాస్క్ఫోర్స్ బృందం మండల కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్, విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలన్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు తప్పక ఇవ్వాలని సూచించారు. బీజీ–3 త్తనాలను అమ్మిన, స్టాకు ఉన్నా పీడీ యాక్టు ఉంటుందన్నారు. ఎరువులు, వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను స్టాకు బోర్డుపై ఉదయాన్నే ప్రదర్శించాలని చెప్పారు. నిబంధనలు పాటించని వారి లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. రికార్డులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి రామకృష్ణారెడ్డి, ఎస్ఐ భరత్భూషణ్ తదితరులు ఉన్నారు. తహసీల్దార్ రవీందర్ -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
పూడూరు: రెండు రోజుల క్రితం గొంగుపల్లిలో జరిగిన అనుమానాస్పద హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థికలావాదేవీలు, వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు నిర్ధారించారు. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. చౌడాపూర్ మండలం గోగ్యానాయక్ తండాకు చెందిన నేనావత్ మంగ్యానాయక్ (43)కు అడవి వెంకటాపూర్కు దర్మ్యానాయక్ తండాకు చెందిన కాట్రావత్ విజయమ్మతో పరిచయం ఏర్పడింది. ఆమె తండాలో ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం తర్వాత విజయమ్మ కుటుంబంతో కలిసి నగరంలోని కిస్మత్పూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ కూలీ పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో మంగ్యానాయక్ తరచూ ఫోన్ చేసి కలవాలని ఒత్తిడి చేశాడు. తనకు ఇంటి నిర్మాణ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని.. తన కూతురు వివాహం సమీపిస్తుందని ఒత్తిడి పెంచడంతో హత్యచేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ నెల 6న మన్నెగూడలో కలుసుకుని అక్కడి నుంచి గొంగుపల్లి సమీపంలోని అటవీప్రాంతం వైపునకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత సీతమ్మ గుడి సమీపంలో అదును చూసి బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. నిందితురాలుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.40వేలు నగదు, మృతుడిని చంపడానికి ఉపయోగించిన రాయిని స్వాధీనం చేసుకుని ఆమెను రిమాండ్కు తరలించారు. నిందితురాలికి రిమాండ్ -
నేను చనిపోతున్నా.. బతకాలని లేదు
భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య పహాడీషరీఫ్: ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అంటూ ఓ వ్యక్తి భార్యకు వీడియో కాల్ చేసి, ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంనాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన పెరుమాళ్ల నరేష్(37) జీహెచ్ఎంసీలో పనిచేస్తూ తుక్కుగూడలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పదిహేనేళ్ల క్రితం శంషాబాద్కు చెందిన శ్రీలతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో శ్రీలత తన పెద్ద కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తనతో పాటే ఉన్న చిన్న కుమారుడిని నరేష్ ఈనెల 8న భార్య వద్ద వదిలేసి వచ్చాడు. రాత్రి 12:30 గంటలకు శ్రీలతకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అని ఫోన్ కట్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె నరేష్ మేనమామ రవీందర్కు చెప్పి, తుక్కుగూడకు వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మున్సిపల్ అభివృద్ధికి కృషి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడుతానని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ సమావేశం హాలులో చైర్పర్సన్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వార్డు సభ్యులు తమ వార్డుల పరిధిలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 22 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్పర్సన్ తెలిపారు. వర్షాకాలంలో మున్సిపల్ పరిధిలో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వీధి దీపాలు నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. అధికారులు, వార్డు అధికారులు కౌన్సిలర్లను సమన్వయం చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు . ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, కమిషనర్ విక్రం సింహారెడ్డి, కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అనన్య -
కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రాచారి మీర్పేట: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలన్నింటిని తక్షణమే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి డిమాండ్ చేశారు. ఆదివారం లెనిన్నగర్లోని పార్టీ కార్యాలయంలో బాలాపూర్ మండలంలోని ‘సమస్యలు–పరిష్కారం’ పై నాయకులతో రవీంద్రాచారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో గత 15 ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైపులు ప్రస్తుతం పెరిగిన జనాభాతో సామర్థ్యం సరిపోక తరచూ ఉప్పొంగుతున్నాయన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, దివ్యాంగులకు పెంచుతామన్న చేయూత పెన్షన్లు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తామని రెండున్నరేళ్లు పూర్తయినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు సుమారు 80వేల గుడిసెలు వేయించిన ఘనత సీపీఐ పార్టీదని గుర్తుచేశారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, పిచ్చిరాజు, గిరిజన సమాఖ్య నాయకులు రెడ్యానాయక్, ఛత్రునాయక్, శ్రీనునాయక్, రమేష్, హుస్సేన్, విజయ్కుమార్, లక్ష్మి, యాదమ్మ పాల్గొన్నారు. -
సాంకేతికతపై పట్టు.. ప్రగతికి మెట్లు
తాండూరు టౌన్: విద్యార్థులు చదువుతో పాటు.. ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని, అప్పుడే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సుభాన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కంప్యూటర్ మిషన్ ఆధ్వర్యంలో ఎఎస్ కంప్యూటర్స్ సాఫ్ట్ స్కిల్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ నూతన ఒరవడితో మార్పులు చెందుతోందన్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు ఏఐ ఆధారిత కోర్సులపై దృష్టి సారించాలని సూచించారు. మిషన్ఆధ్వర్యంలో 150 మంది శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్ కంప్యూటర్స్ డైరెక్టర్ అన్నపూర్ణ, శిక్షకులు పద్మనాభ రెడ్డి, వివేకానంద, సంఘం కమిటీ సభ్యులు వీరభద్రప్ప, మహేశ్వర్ రెడ్డి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తుకు పునాది కుల్కచర్ల: పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెంపొందిచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్ఐ రమేష్ అన్నారు. మండల కేంద్రంలోని కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఆదివారం సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. కాలాన్ని వృథా చేయకుండా.. భవిషత్తుపై దృష్టి సారించాలని సూచించారు. చదువుతో పాటు.. కంప్యూటర్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే.. ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిత్వ వికాసం, జీవనోపాధి కల్పించే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. క్షణిక సంతోషాలకు సమయం ఇవ్వరాదని చెప్పారు. టీయూడబ్ల్యూజే జాతీయ కార్యదర్శి శివకుమార్ గౌడ్, కేపీఎం కళాశాల ప్రిన్సిపాల్ విష్ణు, నిర్వహకులు సాయి భరత్, స్థానికులు వినోద్తదితరులు పాల్గొన్నారు.చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం: వక్తలు -
అవసరం లేకున్నా అతిగా కొని..
మొయినాబాద్: మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న అధికారులు.. అవినీతిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని వస్తువులు అవసరం లేకున్నా అతిగా కొనుగోలు చేసి అందులో వాటాలు దండుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఇటీవల అధికారులు సున్నం బస్తాలు కొనుగోలు చేశారు. ఒక్కో గ్రామంలో సుమారు 300ల బస్తాలను వార్డు కార్యాలయాల్లో వేశారు. బ్లీచింగ్ పౌడర్లో కలిపి రోడ్లపక్కన చల్లడానికి వాటని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఏడాది మొత్తానికై నా సుమారు వంద బస్తాలు కూడా వినియోగించే అవకాశం లేదని.. వారు తమ కమీషన్ల కోసం ఎక్కువ కొనుగోలు చేసి వార్డు కార్యాలయాల్లో వృథాగా పడేశారని మున్సిపల్ సిబ్బందే వాపోతున్నారు. సున్నం బస్తాలు సరఫరా చేసే కాంట్రాక్టర్తో మున్సిపాలిటీలోని ఇద్దరు ముగ్గురు అధికారులు కుమ్మకై ్క ఒకేసారి తెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై కొందరు కౌన్సిలర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు లేవని చెప్పే అధికారులు.. అనవసర ఖర్చులు చేసి కమీషన్లు దండుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సున్నం బస్తాల కొనుగోలులో అధికారుల చేతివాటం -
మద్యం అమ్మితే రూ.5 లక్షలు జరిమానా
అనంతగిరి: ‘మద్యం మత్తులో గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి. యువత పెడదారి పడుతోంది. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గ్రామంలో వెంటనే మద్యం విక్రయాలు నిషేధించాలి’ అని వికారాబాద్ మున్సిపల్ పరిధి ధన్నారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మద్యం మత్తులో జీవితాలు ఆగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం అమ్మితే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని, కొనుగోలు చేసిన వారికి రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎకై ్సజ్, పోలీసు శాఖలు సహకరించాలని కోరారు. -
సొసైటీ చైర్మన్కు ఎమ్మెల్యే పరామర్శ
యాలాల: సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డిని ఆదివారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పరామర్శించారు. ఇటీవల సురేందర్రెడ్డి కాలికి శస్త్రచికిత్స చేసుకున్న సంగతి విధితమే. ఈ మేరకు ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ నర్సింహులు, మాజీ చైర్మన్ బాల్రెడ్డి, సంగెంకుర్దు మాజీ సర్పంచ్ హన్మంతు తదితరులు ఉన్నారు. కాగా.. సొసైటీ చైర్మన్ను ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు ఉన్నారు. పేదలకు వరం ‘ఇందిరమ్మ’ కొడంగల్: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరమని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. మండల పరిధి ప్యాలమద్ది, ఐనన్పల్లి గ్రామాల్లో పలువురు లబ్ధిదారుల ఇళ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు చైర్మన్ను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, దాము, శ్రీనివాస్రెడ్డి, ఆసీఫ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పట్టుదలతో ఏదైనా సాధ్యం దోమ: దేశానికి సేవ చేసేందుకు అగ్నివీర్కు గ్రామం నుంచి ఏడుగురు ఎంపిక కావడం హర్షణీయమని సర్పంచ్ రజిత భాస్కర్గౌడ్ అన్నారు. మండల పరిధి ఐనాపూర్ నుంచిఆర్మీకి ఎంపికై న వారిని ఆదివారం శాలువాలు కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని యువకులు నిరూపించారని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటల్లో రాణించాలని, అప్పుడే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని సూచించారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి తాండూరు టౌన్: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన శనివారం మండల పరిధిలో చోటుచేసుకుంది. గోనూరు గ్రామానికి చెందిన మాల మాణిక్యప్పకుచెందిన ఎద్దు.. కోలి రామప్ప పొలంలో మేత మేస్తుండగా గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కరెంటు స్తంభాలకు ఉన్న విద్యుత్ తీగలు తెగి ఎద్దుపై పడటంతో షాక్తో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఎద్దు మృతితో నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. తాగునీటి సమస్యకు పరిష్కారం బొంరాస్పేట: మండల పరిధి మేడిచెట్టుతండా సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో 5వ వార్డు బోడబండతండాలో ఆదివారం తాగునీటి సమ స్య తీర్చేందుకు బోరు వేయించారు. పార్టీలకు అతీతంగా గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్నామని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచు సోనారాజునాయక్, నాయకులు రమేశ్నాయక్, భాస్కర్, లక్ష్మణ్, రతన్, హన్మ్యా, సక్రియా, సేవ్యా, రుకాలిబాయి తదితరులున్నారు. -
వంతెనలపై ‘రక్షణ’ కరువు
● ప్రమాదపుటంచున ప్రయాణం ● కూలిన అన్నాసాగర్ బ్రిడ్జి రేలింగ్.. ● శిథిలావస్థలో కోట్పల్లి వంతెన సైడ్వాల్స్ బంట్వారం: రహదారులను అభివృద్ధి చేసి, రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగు పరుస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. వాస్తవరూపం దాల్చడం లేదు. కొత్తమార్గాలు, విస్తరణ సంగతి ఎలా ఉన్నా.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వలన అధ్వాన రోడ్లు, శిథిలావస్థకు చేరువన వంతెనలు, ఇరు వైపులా ఉన్న రేలింగులు సైతం మరమ్మతుకు నోచుకోవడం లేదు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తప్పనిసరిగా ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు. 40 ఏళ్ల క్రితం.. కోట్పల్లి మండల కేంద్రంలోని తాండూరు– సదాశివపేట మార్గంలోని వాగుపై సుమారు 40 ఏళ్ల క్రి తం వంతెన నిర్మించారు. అదే సమయంలో అన్నాసాగర్ వాగుపై కట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. కాలక్రమేణా రెండు బ్రిడ్జిలకు ఇరు వైపులా ఉన్న సైడ్ రేలింగ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. పెచ్చులు ఊడుతున్నాయి. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. అదుపు తప్పితే.. తాండూరు– సదాశివపేట రహదారి వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. సిమెంటు, నాపరాయి లోడ్తో వాహనాలు ఈ మార్గం గుండా సదాశివపేట జాతీయ రహదారి 9 వైపు వెళ్తుంటాయి. కోట్పల్లి ప్రాజెక్టుకు టూరిస్టులు తమ వ్యక్తిగత వాహనాలతో దూసుకుపోతుంటారు. ఈ క్రమంలో ఈ రెండు వంతెనల వద్ద ఏమాత్రం ఆదమర్చినా ప్రమాదం బారిన పడే అవకాశాలు లేకపోలేదు. అన్నాసాగర్ వంతెనపై రక్షణగా ఉన్న రేలింగ్ ఎక్కడికక్కడ ఊడిపోగా.. కోట్పల్లి బ్రిడ్జి పై కూలడానికి సిద్ధంగా ఉంది. ఈ దారిలో ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా.. వాగులో పడాల్సిందేనని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ప్రమాదాలు జరగముందే రేలింగుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఘనంగా పైలెట్ జన్మదిన వేడుకలు
తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు మణికొండలోని పైలెట్ నివాసానికి తరలివెళ్లారు. రోహిత్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ సందల్ రాజుగౌడ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింహులు, కౌన్సిలర్లు నవీనసంతోష్గౌడ్, ఇర్షాద్, మాజీకౌన్సిలర్లు వరాల శ్రీనివాస్రెడ్డి, ఇర్ఫాన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, గద్దె శ్రీనివాసచారి,సంతోష్గౌడ్లు ఉన్నారు. కాగా.. తాండూరు ప్రభుత్వ జిల్లా, మాతాశిశు ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన నిర్వహించారు. పట్టణంలోని పైలెట్ నివాసంలో నాయకులు వేడుకలు జరుపుకొన్నారు. యాలాలలో.. యాలాల: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు చందాపురం రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నగరంలోని నివాసంలో రోహిత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాకప్పిసన్మానించారు. భారీ కేక్కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ మాజీ వైస్ చైర్మన్ వడ్డే రాములు, మాజీ సర్పంచ్లు రవికుమార్గౌడ్, అరవింద్, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్, గణేశ్, విక్రాంత్, శరణుభూపాల్, లాలు ముదిరాజ్ తదితరులు ఉన్నారు. నవాబుపేటలో.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. బీఆర్ఎస్ మండల ముఖ్య సలహాదారు, మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇందులో పార్టీ నాయకులు శాంతికుమార్, పురుషోత్తం, నరేందర్ రెడ్డి, మహేశ్ రెడ్డి, సుధాకర్, శ్రీకాంత్ గౌడ్, శేఖర్, బద్రి, మల్లేశ్, వినోద్, మాణిక్ రెడ్డి, తలారి శేఖర్, అనంతయ్య, అనిల్, నవీన్, బక్కని శేఖర్, కిషోర్, రాజు, బక్కని కుమార్ పాల్గొన్నారు.


