breaking news
Vikarabad
-
సరిహద్దు మండలం.. సమస్యలకు నిలయం
బషీరాబాద్: ఒకప్పుడు రాజకీయ, పరిపాలనా పరంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బషీరాబాద్ మండలం ప్రస్తుతం అభివృద్ధి, సమస్యలతో సతమతమవుతోంది. నిజాం కాలంలో జిల్లా పరిపాలనా కేంద్రంగా వెలుగొందిన ఈ ప్రాంతం నేడు సాగునీటి కొరత, నిధుల లేమి, మౌలిక సదుపాయాల సమస్యలతో వెనుకబడిన మండలంగా మారింది. కర్ణాటక సరిహద్దులో ఉండటం కూడా అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని 39 గ్రామ పంచాయతీలు.. సుమారు 31 వేల మంది ఓటర్లు ఉన్నారు. జీపీలకు ప్రత్యేక నిధులు లేక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులతోనే నెట్టుకొస్తున్నాయి. ఎత్తిపోతలకు మోక్షం ఎప్పుడో? జీవన్గీ, నావంద్గీ, ఇందర్చెడ్ ప్రాంతాల్లో కాగ్నా నదిపై నిర్మించిన మూడు ఎత్తిపోతల పథకాలు ఏళ్లుగా మూతపడి ఉన్నాయి. ఒకప్పుడు వీటి ద్వారా 1,750 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేది. నిర్వహణ లోపం, మరమ్మతులు చేయకపోవడంతో పథకాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో వందల ఎకరాలు బీడుగా మారాయి. రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. 38,417 ఎకరాల సాగుభూమి మండలంలో 38,417 ఎకరాల సాగుభూమి ఉండగా, అందులో 32,728 ఎకరాలు మెట్ట, 5,689 ఎకరాలు మాత్రమే తరి భూములు ఉన్నాయి. సాగునీటి వసతి లేక రైతులు వర్షాధార పంటలైన పత్తి, కంది, మినుము, పెసర, శనగ, జొన్నల సాగు చేస్తున్నారు. మండలంలో 51 చెరువులు, కుంటలు.. 2,338 ఎకరాల ఆయకట్టు ఉంది. కేవలం 500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. భారీగా వలసలు మండలంలో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటంతో వేలాది మంది వలస బాట పడుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో గుర్తించిన వివరాల ప్రకారం గిరిజన, వడ్డెర, బుడగజంగం, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన సుమారు 9 వేల మంది హైదరాబాద్, ముంబై తదితర నగరాలకు వలస వెళ్లారు. అనేక గ్రామాల్లో ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. మండలంలో అపార నాపరాతి ఖనిజ సంపద ఉన్నా పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. పరిశ్రమలు నెలకొల్పితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గే అవకాశం ఉంది. మౌలిక వసతులు కరువు మండలంలోని అనేక గ్రామాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. బషీరాబాద్, జీవన్గీ, మైల్వార్, ఎక్మాయి, కాశీంపూర్, మంతట్టి, దామర్చెడ్, నవల్గా, నీళ్లపల్లి తదితర గ్రామాల్లో అంతర్గత రహదారులు అసంపూర్తిగా ఉన్నాయి. కాలువల నిర్మాణం పూర్తికాక మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. వర్షాకాలంలో అనేక కాలనీలు చిత్తడిగా మారుతున్నాయి. జీవన్గీ ఎస్సీ కాలనీలో చిన్న వర్షానికే ఇళ్లలోకి నీరు చేరుతోంది. బాద్లాపూర్, బాబునాయక్, హంక్యానాయక్, తౌర్యానాయక్, నంద్యానాయక్, కంసాన్పల్లి తండాలకు సరైన రవాణా సౌకర్యాలు లేవు. కొన్ని ప్రాంతాలకు బీటీ రోడ్లు లేక అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కూడా చేరలేని పరిస్థితి నెలకొంది. 15వ ఆర్థిక సంఘం నిధులే దిక్కు గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల జీపీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.1.35 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు తాగునీరు, పారిశుధ్య నిర్వహణకే సరిపోతున్నాయని సర్పంచులు చెబుతున్నారు. వెనుకబడిన మండలంగా గుర్తింపు పొందిన బషీరాబాద్కు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అవసరమని ప్రజాప్రతినిధులు, రైతులు, సర్పంచులు కోరుతున్నారు. నేడు మండల సాధారణ సమావేశం మండల సాధారణ సమావేశం మంగళవారం జరగనుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి హాజరుకానున్నారు. సాగునీరు, నిధులు, మౌలిక వసతులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మూతపడిన మూడు ఎత్తిపోతల పథకాలు బీడుగా 1,750 ఎకరాల ఆయకట్టు ఉపాధి కోసం వేలాది మంది వలస బాట నేడు మండల సాధారణ సమావేశం గళం విప్పనున్న సర్పంచులు -
నేడు 108 కలశాలతో అభిషేకం
ధారూరు: మండల కేంద్రంలో కొలువుదీరిన కపిలేశ్వర స్వామికి మంగళవారం 108 కలశాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి చెన్న బసవయ్య స్వామి సోమవారం తెలిపారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బొంరాస్పేట: దుద్యాల మండలం హకీంపేటలో కొనసాగుతున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను బుధవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ పరిశీలించనున్నట్లు కేఎల్ఎస్ఆర్ జనరల్ మేనేజర్ హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. హకీంపేట సమీపంలో 248 ఎకరాల్లో రూ.వేయి కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాల, పశువైద్యశాల, ఇంజనీరింగ్ కళాశాల, వసతి గృహా నిర్మాణాలను శ్రీధర్ పరిశీలించనున్నారు. కొడంగల్ రూరల్: నాగార్జునసాగర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సోమవారం దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి ఉన్నారు. తాండూరు టౌన్: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన రమేష్ కుమార్ సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును నగరంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రమేష్కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం తాండూరులో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌక్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీలు, పరిశ్రమల కార్మికులకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చి పూర్తిగా కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. కనీస వేతనాలను అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, నాయకులు చంద్రప్ప, లాలప్ప, అంబరప్ప, వెంకటప్ప, గోవిందు, శ్రీశైలం, నర్సిములు, గుండప్ప, లక్ష్మి, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
చేతులెత్తేస్తారా..?
రైతులపైనే రవాణా! మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. యూరియా బస్తాల రవాణా మరింత భారమైంది.ఛేదిస్తారా.. వికారాబాద్: నకిలీ డీఏపీ వ్యవహారం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన డీఏపీ పంటలకు మేలు చేస్తుందా..? లేక కీడు చేస్తుందా..? అనే ఆందోళనలో ఉన్నారు. అక్రమ దందాపై నిగ్గు తేల్చాల్సిన పోలీసు, వ్యవసాయ శాఖలు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ ర్యాకెట్ జిల్లా వ్యాప్తంగా విస్తరించగా.. ఓ ట్రాన్స్ పోర్టర్ను మరో డీలర్ను రిమాండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. టన్నుల కొద్ది నకిలీ డీఏపీని రైతులకు అంటగట్టి లక్షలు కొల్లగొట్టారు. అన్నదాతలకు అపార నష్టం కలిగించిన ఈ దందాను పోలీసులు సాధారణ కేసులా వ్యవహరించటం అనుమానాలకు తావిస్తోంది. నామమాత్రపు విచారణతో సరిపెడుతున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి శాంపిళ్లు ల్యాబ్కు పంపి చేతులు దులుపుకున్నారు. అక్రమార్కులు రైతుల అవసరం, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకున్నారు. కేసు విచారణలో వైఫల్యం పెద్ద మొత్తంలో నకిలీ డీఏపీ పట్టుబడుతోంది. అయితే ఎక్కడ తయారు చేశారు..? ఇందుకు ఉపయోగించిన ఫార్ములా ఏమిటి?.. సాంకేతికత అందించింది ఎవరు. ? అంత పెద్ద మొత్తంలో ఆర్థిక వనరులు ఎవరు సమకూర్చారు..? వారి వెనుకు ఉన్నది ఎవరు ?.. కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేశారు..? అనే విషయాలు బయటికి రాకపో వడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు విచారణ సజావుగా సాగడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం కొందరిని అరెస్టు చేసి చేతులు దులుపుకోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మొత్తం వ్యహారం బయటికి వస్తుందని బాధిత రైతులు అంటున్నారు. నకిలీ దందాను సీసీఎస్ లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే మూలాలు బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. పదిహేను రోజులుగా నకిలీ డీఏపీ భాగోతం జిల్లా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. తరచూ ఎక్కడో ఓ చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పరిగి, చన్గోముల్, బంట్వారం, యాలాల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రవాణా చేసిన వారిని, విక్రయించిన డీలర్లపై కేసులతో సరి పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పరిగి మండలం బపసిరెడ్డిపల్లి, లఖ్నాపూర్, రంగాపూర్, చిగురాల్పల్లి, పూడూరు మండలం మంచన్పల్లి, పెద్దేముల్ తదితర చోట్ల ఈ వ్యవహారం బయట పడింది. పదుల సంఖ్యలో నకిలీ డీఏపీ బస్తాలు బయటపడుతుండటం దాందా ఏ తరహాలో జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. రాజకీయ ఒత్తిడులు, అమ్యామ్యాలకు తలొగ్గి కొందరిని రిమాండ్ చేయకుండా తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అంతటా విక్రయం పదిహేను రోజులుగా నకిలీ డీఏపీ భాగోతం జిల్లా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. తరచూ ఎక్కడో ఓ చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పరిగి, చన్గోముల్, బంట్వారం, యాలాల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రవాణా చేసిన వారిని, విక్రయించిన డీలర్లపై కేసులతో సరి పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పరిగి మండలం బపసిరెడ్డిపల్లి, లఖ్నాపూర్, రంగాపూర్, చిగురాల్పల్లి, పూడూరు మండలం మంచన్పల్లి, పెద్దేముల్ తదితర చోట్ల ఈ వ్యవహారం బయట పడింది. పదుల సంఖ్యలో నకిలీ డీఏపీ బస్తాలు బయటపడుతుండటం దాందా ఏ తరహాలో జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. రాజకీయ ఒత్తిడులు, అమ్యామ్యాలకు తలొగ్గి కొందరిని రిమాండ్ చేయకుండా తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ప్రయాణం.. నరకప్రాయం
మండలంలోని ప్రధాన రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాక టెండర్లు కాలేదు. ఉన్నతాధికారులతో చర్చించి రోడ్లు పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం. ఆర్కతల చౌరాస్తా నుంచి చిట్టిగిద్ద రైల్వేస్టేషన్ వరకు బీటీ రోడ్డు కోసం రూ.70 లక్షలు, ఎల్లకొండ నుంచి లింగంపల్లి మీదగా పులమామిడి వరకు రూ.3.80 కోట్లు, నారేగడ నుంచి కౌకుంట్ల గేట్ వరకు రూ.3 కోట్లు, చిట్టిగిద్ద – పెండ్లీ మడుగు వరకు రూ.3 కోట్లు, ఎల్లకొండ గేట్ నుంచి పూలపల్లి గేట్ వరకు రూ.7 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం. – కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల నవాబుపేట: మండల కేంద్రంలోని బీటీ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. మరమ్మతులకు నిధులు మంజూరైనా కాంట్రాక్టర్లు ముందకు రావడం లేదు. చాలా కాలంగా రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. లింగంపల్లి – పులుమామిడి బీటీ రోడ్డు దారుణంగా మారింది. ఈ మార్గంలో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. ఆర్కతల చౌరస్తా నుంచి చిట్టిగిద్ద మీదగా రైల్వేస్టేషన్ వరకు ఉన్న మూడు కిలోమీటర్ల బీటీ గుంతల మయంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. గొల్లగూడ రైల్వేస్షేషన్కు సైతం మండలంలోని చాలా గ్రామాల ప్రజలను వస్తుంటారు. ఈ రోడ్డు పూర్తిగా పాడైంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లకొండ నుంచి గొల్లగూడ, గంగ్యాడ నారేగూడ, పూలపల్లి వరకు ఉన్న ఆర్అండ్బీ రోడ్డు, నారెగూడ – కౌకుంట్ల గేట్ రోడ్లు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు మరింత దెబ్బతిన్నాయి. అధ్వానంగా గ్రామీణ రోడ్లు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు పట్టించుకోని అఽఽధికారులు -
పంద్రాగస్టుకు యూనిఫాం!
తాండూరు: విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫాం అందలేదు. ఆగస్టు 15వ తేదీ జెండా వందనం నాటికి ప్రతి విద్యార్థీకి యూనిఫాం అందించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దుస్తులు కుట్టే బాధ్యతలు మహిళా సంఘాల సభ్యులకు అప్పటించారు. పంద్రాగస్టుకు మరో నాలుగు రోజులే ఉండటంతో పూర్తిస్థాయిలో పంపిణీ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా ప్రతి విద్యార్థికీ రెండు జతల చొప్పున యూనిఫాం అందజేస్తారు. జిల్లాలో మొత్తం 1,066 ప్రభుత్వ పాఠశాలలు.. 93,205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి రెండు జతల చొప్పున 1,86,410 ఇవ్వాల్సి ఉంది. 1,134 మంది దుస్తులు కుడుతున్నారు. ఇప్పటి వరకు 45,885 జతలు పూర్తయ్యాయి. ఇందులో 29,774 యూనిఫారాలను ఆయా పాఠశాలలకు పంపిణీ చేశారు. మరో 23,243 కుట్టాల్సి ఉంది. కూలి సరిపోవడం లేదు ఒక జత యూనిఫాం కుట్టినందుకు ప్రభుత్వం రూ.75 చెల్లిస్తోంది. రెండు జతలకు కలిపి రూ.150 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ మొత్తం స్టిచ్చింగ్ మెటీరియల్కు కూడా సరిపోవడం లేదని మహిళా సంఘాలకు చెందిన దర్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్క జత యూనిఫామ్ కుడితే రూ.500లకు పైగా తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కూలి రేటు పెంచాలని వారు కోరుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,066 విద్యార్థుల సంఖ్య 93,205 మంది అవసరమైన దుస్తులు 1,86,410 ఇప్పటికే 70శాతం మేర రెడీ ఒక్కో జతకు చెల్లిస్తున్న మొత్తం రూ.75 కూలి సరిపోదంటున్న మహిళలు ప్రతి విద్యార్థికీ ఒక జత పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న మహిళా సంఘాల సభ్యులు -
కేంద్రానికి బుద్ధి చెబుతాం
అనంతగిరి: వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్ హెచ్చరించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సీఐటీయూ, ఏఐకేఎంఎస్, ఏఐకేఎస్, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యాన వికారాబాద్లో నిరసన చేపట్టారు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ఎమ్మార్పీ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. బీజేపీ తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లతో పాటు విద్యుత్ సవరణ చట్టం, ఉపాధి కూలీలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వీబీజీరామ్జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని నీరుగారుస్తున్న మోదీ సర్కార్ మొండి వైఖరి వీడాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల ముఖ్య నాయకులు మహేందర్, సురేష్, సతీష్, గోపాల్రెడ్డి, తేజ, శ్రీనివాస్, అనసూయ, లక్ష్మి, నవీన్, మల్లేశ్, లక్ష్మమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్లో కార్మిక సంఘాల నిరసన మోదీ సర్కార్ మొండి వైఖరి వీడాలని నినాదాలు -
రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి
అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హరిప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి రెండు గంటలకు టాటానగర్ యశ్వంతపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇంజన్కు గుర్తుతెలియని మహిళ మృతదేహం చిక్కుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించాడు. ఈ విషయాన్ని వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, చామనఛాయ కలిగి ఉందని, తలపై నలుపు మరియు తెలుపు రంగు జుట్టు పురుషుల మాదిరిగా కత్తిరించి ఉందని తెలిపారు. బాడీని వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని, ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అదుపుతప్పి లారీ బోల్తా కొడంగల్ రూరల్: మండల పరిధిలోని ఉడిమేశ్వరం గేటు సమీపంలో ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన సోమవారం చోటుచేసుకొంది. వివరాలు.. తాండూరు– మహబూబ్నగర్ హైవే పనులు కొనసాగుతుండగా, తాండూరు నుంచి కొడంగల్ వైపు సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఉడిమేశ్వరం సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తాపడింది. గమనించిన పరిసరవాసులు డ్రైవర్, క్లీనర్ను లారీ క్యాబిన్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్ఐ యాదయ్య తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ధారూరు: ఇంటి స్థలాన్ని దాయాది ఆక్రమించడంతో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన శాంత్కుమార్(20) ఇంటి ముందు ఉన్న స్థలాన్ని దాయాది మల్కప్ప ఆక్రమించాడు. ఈ నెల 2న శాంత్కుమార్ గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. మల్కప్ప, మంగమ్మ, మల్లయ్య కలిసి ప్రశాంత్కుమార్, అతని తల్లి భూమని నిర్మలమ్మపై గొడవకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన శాంత్కుమార్ పురుగు మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని నగరంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తల్లి నిర్మలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నమ్మి పెట్టుబడి పెడితే నట్టేట ముంచారు మరో పేరుతో హోటల్ నిర్వహణ.. ఏడుగురిపై కేసు గచ్చిబౌలి: భాగస్వాముల మధ్య విబేధాలు తలెత్తడంతో హోటల్ను స్వాధీనం చేసుకున్న వర్గంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూ.5 కోట్ల పెట్టుబడితో రెస్టారెంట్ ఏర్పాటు చేయగా తమ భాగస్వామి కొత్త పేరుతో నిర్వహిస్తున్నాడని ఎలెవెన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కాంతి దత్ లాల్ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. నామి పాటిస్సేరి, దక్షింత పేర్లతో హోటల్ నిర్వహిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవన యజమాని నుంచి 10 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2023లో పాటిస్సేరిలో 35 వాతం వాటా, శ్రీ సమేరా హోటల్ హస్పిటాలిటీలోను 35 శాతం వాటా సౌజన్యకు ఉందన్నారు. ఇతర వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉండగా కుట్ర పూరితంగా వ్యవహరించి లీజును అక్రమంగా రద్దు చేసి, కొత్త లీజు డీడ్లు సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు. రెస్టారెంట్ ప్రాంగణంతో పాటు, సామగ్రి, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. హోటల్ పేర్లను తొలగించి కేఫ్ ప్లైన్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. భాదితుడి ఫిర్యాదుతో సౌజన్య జూపల్లి, అక్షయ్నాగ్ ముని, సుమంత్ మానుకొండ, దీపికా రాజు, సర్ధార్ నౌనిహాల్ సింగ్, రామ రుద్ర నూనె, సునీత నూనైపె కేసు నమోదు చేశారు. -
రైతులపైనే రవాణా!
తాండూరు రూరల్: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. ఓ పక్క ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవక, ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతుండగా, ప్రస్తుతం యూరియా బస్తాలపై రవాణా ఛార్జీలు పెంచడం మరింత భారంగా మారింది. ప్రస్తుతం సాగు చేసిన వరి, పత్తి పంటలకు యూరియా వేయడం అత్యవసరం. కానీ ప్రభుత్వం ఎరువులు పొందేందుకు కొత్త యాప్ ఎఫ్ఎఫ్ఎస్(ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్)ను తీసుకొచ్చింది. చాలా మంది రైతుల వద్ద పాత యూరియా యాప్ మాత్రమే ఉంది. కొత్త యాప్పై ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. దీంతో యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొంత మంది కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకున్నా.. అందులో తాండూరు ప్రాంతంలోని దుకాణాల్లో యూరియా కొరత, స్టాక్ లేదని చూపిస్తోందని చెబుతున్నారు. ఒక్కో బస్తాపై రూ.43 అదనం ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో యూరియా బస్తా ధర రూ.267 నిర్ణయించింది. గతంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించేది. దీంతో ఎరువుల దుకాణం యజమానులు మద్దతు ధరకే యూరియాను విక్రయించేవారు. తాజాగా జూలై 15నుంచి ట్రాన్స్ఫోర్ట్ ఛార్జీలను రైతులే చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కో యూరియా బస్తాపై రూ.43 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈలెక్కన బస్తా ధర రూ.310కి పెరిగింది. సాగు సంకటంగా మారిన ప్రస్తుత తరుణంలో రైతులపై అదనపు భారం మోపడం సరికాదని ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. దూరాన్ని బట్టి.. దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారులోని మేడ్చల్, మూసాపేట్, తిమ్మాపూర్ ప్రాంతాల నుంచి జిల్లాలోని వివిధ సొసైటీ కార్యాలయాలతో పాటు, ఫెర్టిలైజర్ దుకాణాలకు ఎరువులు వస్తాయి. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు పెంచారు. వికారాబాద్ ప్రాంతంలో ఒక్కో ఎరువు బస్తాపై రూ.28, కొడంగల్ నియోజకవర్గం హస్నాబాద్లో రూ.44, తాండూరులో రూ.43, బషీరాబాద్కు రూ.51 ధర నిర్ణయించారు. ఈమొత్తాన్ని రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. ఒక్కో బ్యాగుపై రూ.28 నుంచి రూ.51 అదనం ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతల ఆందోళన ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ఎరువుల బస్తాల రవాణా ఛార్జీలను గతంలో ప్రభుత్వమే చెల్లించేది. తాజాగా జూలై 15నుంచి రైతుల వద్దే వసూలు చేయాలని నిర్ణయించింది. దూరాన్ని బట్టి ఛార్జీలు అమలవుతున్నాయి. తాండూరులో ఒక్కో యూరియా బస్తాపై రూ.310 ధర ఉంది. – కొమురయ్య, ఏఓ, తాండూరు సరైన నిర్ణయం కాదు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను రైతుల నుంచి వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. గతేడాది అతివృష్టి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు లేక పంటల దిగుబడి కష్టంగా ఉంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నాం. రవాణా ఛార్జీలు మోపడం అన్యాయం. – భద్రు, రైతు, సిరిగిరిపేట్ -
చెప్పినట్లు వినలేదని చితకబాదారు
ఉప్పల్లోని ఓ డిగ్రీ కాలేజీలో ఘటన ● తోటి విద్యార్థిపై ముగ్గురి దాడిఉప్పల్: ఉప్పల్లోని ఓ డిగ్రీ కాలేజీలో తోటి విద్యార్థి చెప్పినట్లు వినలేదనే సాకుతో ముగ్గురు విద్యార్థులు తోటి విద్యార్థిపై దాడిచేశారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో నాగోల్ ప్రాంతానికి చెందిన భువన మోహిత్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదుతున్నాడు. అదే కళాశాలకు చెందిన ఛత్రీష్, యశ్వంత్, వినయ్లు చెప్పినట్టు వినలేదని మోహిత్పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ నెల 3 కళాశాల వాష్రూమ్లోకి తీసుకెళ్లి దాడి చేశారు. అతని మొబైల్ ఫోన్ను విసిరి కొట్టారు. ఈ సంఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో కూడా పలుమార్లు ఆ విద్యార్థితో దురుసుగానే ప్రవర్తించినట్లు బాధితుడు తెలిపారు. అయినప్పటికీ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధితుడి తండ్రి తెలిపారు. ఈ నెల 4న ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై కళాశాల ప్రిన్సిపల్ను వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు. ‘పది’విద్యార్థుల పైశాచికంజవహర్నగర్: ఓ కార్పొరేట్ పాఠశాల హస్టల్లో పదోతరగతి విద్యార్థిపై తోటి విద్యార్ధులు దారుణంగా దాడిచేశారు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ స్కూల్లో చోటుచేసుకుంది.తల్లిదండ్రులు, ఏసీపీ చక్రపాణి తెలిపిన మేరకు...కామారెడ్డికి చెందిన ఓ విద్యార్థి (15) దమ్మాయిగూడలోని కార్పొరేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి విద్యార్థిపై 9 మంది తోటి విద్యార్ధులు కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై దారుణంగా కొట్టారు. దీంతో స్పృహతప్పిపడిపోయాడు. వార్డెన్ గమనించి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మెట్ల కిందపడి గాయాలయ్యాయని చెప్పారు. దీంతో వారు కుమారుడిని తీసుకెళ్లి కామారెడ్డిలోని ఆస్పత్రిలో చేర్పించారు. ర్యాగింగ్ పేరుతో దాడి చేసినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా కుమారుడిని చంపినా ఇంతేనా ..? కార్పొరేటర్ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిస్తారని నమ్మకంతో చేర్పించామని.. తోటి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టి హింసించినా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విద్యార్ధి తల్లి శోభ మండిపడ్డారు. మా వాడిని చంపినా ఇంతేనా?అని వాపోయారు. సీసీ కెమెరాలను చూపించాలని చెప్పినా అవి పనిచేయడం లేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిచేసిన విద్యార్థులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అసలే లేటు.. ఆపై లోటు
వానలు సరిగాలేక తూర్పు గొంతెండుతోంది.. సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో వాన విచిత్రం.. పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జోరుగా కురవగా, నగరానికి తూర్పు దిక్కుల్లో విస్తరించి ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలులేవు. ఈ సీజనల్లో ఆలస్యంగా వర్షాలు మొదలుకాగా, అందులోనూ లోటు వర్షపాతం నమోదైంది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో నమోదవాల్సిన సగటు వర్షపాతంలో తూర్పు వైపున గణనీయమైన లోటు కనిపిస్తోంది. ఆకాశంలో మేఘాలు దట్టంగా పడుతున్నా, గాలి మళ్లిపోవడమో, లోకల్ మైక్రో–కై ్లమేట్ ప్రభావమో చినుకులు నేలను తాకకుండానే దాటిపోతున్నాయి. దీంతో ఈ ప్రాంత భూగర్భజలాలకు ఆశించిన స్థాయిలో నీటిచేరిక లభించలేదు. రుతుపవన మేఘాల గమనం పశ్చిమ నియోజకవర్గాల మీదుగా సాగడం వల్ల ఈ దిక్కుల్లో జలకళ తొణికిసలాడుతోంది. గచ్చిబౌలి, శంషాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, హైటెక్ సిటీ, మాదాపూర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ను ఆనుకుని ఉన్న పరిసరాల్లో కురిసిన భారీ వర్షాలు సగటు నమోదును’అధిక’కేటగిరీకి చేర్చాయి. రానున్న రోజుల్లో నగరంలో తుఫాను ద్రోణి గమనంలో మార్పులు వస్తే తప్ప తూర్పు ప్రాంతంలోని లోటు భర్తీ అయ్యే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. నగరం మొత్తం సగటు వర్షపాతం గణాంకాల ప్రకారం సాధారణ స్థాయికి సమీపంలో కనిపించినప్పటికీ, భౌగోళికంగా చూస్తే మాత్రం తూర్పు దాహం తీరాల్సి ఉంది. మహానగరంలో లోటు వర్షపాతం సెం.మీ.లలో ఇలా.. ప్రాంతం సాధారణం కురిసింది లోటు శాతందుండిగల్ 35.77 19.71 45 మేడ్చల్ 32.85 19.35 41 ఘట్కేసర్ 34.25 20.19 41 కీసర 31.08 18.59 40 తిరుమలగిరి 33.70 21.03 38 కాప్రా 29.28 18.99 35 అల్వాల్ 30.00 19.54 35 మల్కాజిగిరి 30.10 19.74 34 ఉప్పల్ 33.41 22.29 33 ఇంకా 27 శాతం తక్కువ వర్షపాతం సాధారణ స్థితిలో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు -
ప్రమాదకరంగా బీటీ రోడ్లు!
బొంరాస్పేట: సీఎం రేవంత్రెడ్డి చొరవతో, లక్షల, కోట్ల నిధులతో మండలంలోని ప్రతి గ్రామానికి, గిరిజనతండాలకు సైతం బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల ఆదరబాదరాగా పనులు పూర్తి చేసి, బిల్లులు తీసుకుంటున్నారు. పలుచోట్ల ఇటీవల నిర్మించిన బీటీ రోడ్లకు ఇరువైపులా వేసిన మట్టి వర్షాలకు కొట్టుకుపోయింది. ఇలా మూడుమామిళ్లతండా, బీక్యానాయక్తండాల మధ్య సైడ్బర్మ్లు కోతకు గురవడంతో ప్రమాదకరంగా మారాయి. అధికారులు స్పందించి క్షేత్ర సందర్శన చేసి మట్టి పనులు చేపట్టాలని ఆయా గ్రామాల, గిరిజన తండాల ప్రజలు, వాహనాదారులు కోరుతున్నారు. -
గుప్త నిధుల పేరుతో రూ.7.5 లక్షలు స్వాహా
రాజేంద్రనగర్: ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. గుడిమల్కాపూర్కు చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), జవహర్ నగర్ ఫర్హాన్ నగర్కు చెందిన సయ్యద్ అలీ అష్రఫ్ (40), బాలాజీ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ హాజీ (25), కీసర మండలం యాదగిరిపల్లికి చెందిన బైక్ మెకానిక్ మహ్మద్ సల్మాన్ (29)లు స్నేహితులు. మునావర్ పాత నేరస్థుడు. కార్ల పెయింటింగ్, డెంటింగ్ పనుల్లో వచ్చే ఆదాయం సరిపోక.. సులభంగా డబ్బు సంపాదించాలని కుట్రపన్నాడు. ఈ ఏడాది మార్చి 26న రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఆసిఫ్ను నిందితులు కలిశారు. జగిత్యాలలో నివాసం ఉండే ఆసిఫ్ స్నేహితుడు ఇమ్రాన్ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించారు. వాటిని తీయడానికి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయారు. దీంతో ఆసిఫ్ ఈ నెల 7వ తేదీన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం మహ్మద్ మునావర్, అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లను, నకిలీ బంగారు నాణేలు, బొగ్గును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు వివిధ ప్రాంతాల్లో 11 మందిని ఇలాగే మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. రవి, సబ్ ఇన్స్పెక్టర్లు మన్సూర్ అలీ, నర్సింగ్ రావు, ఎస్. శేషు, టాస్క్ఫోర్స్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో ఈ ముఠాను పట్టుకున్నారు. నలుగురి అరెస్ట్ -
సర్కారు బడి.. రూపురేఖలు మారి!
మొయినాబాద్ రూరల్: తళుక్కున మెరిసే గోడలు, సర్వాంగ సుందరమైన తరగతి గదులు, నిగనిగలాడే బ్లాక్ బోర్డులు, పక్కన మహనీయుల వ్యాఖ్యలు.. ఇవన్నీ వింటుంటే ఇదేదో కార్పొరేట్ పాఠశాలలా ఉంది కదూ.. అలాంటిది కానే కాదు.. సకల హంగులతో మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలలో ఇవన్నీ చూడవచ్చు. స్థానిక సర్పంచ్, దాతల సహకారంతో సర్కారు బడి రూపురేఖలే మారిపోయాయి. దాదాపు రూ.5–6 లక్షలు వెచ్చించి పాఠశాలలో గోడలకు రంగులతో పాటు బ్లాక్ బోర్డులు, బొమ్మలు, కొటేషన్లు, మెరుస్తున్న పెయిటింగ్లు వేశారు. ఇవే కాకుండా ఫర్నిచర్, టాయిలెట్ల సౌకర్యం తదితర వసతులు సమకూర్చారు. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రాథమిక పాఠశాల కళకళలాడుతోంది. దాతల సహకారంతో పాఠశాలలకు నూతన హంగులు పాఠశాల అభివృద్ధే లక్ష్యం ప్రభుత్వంతో పాటు తమ వంతుగా పాఠశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. ప్రైవేటుకు దీటుగా అన్ని వసతులు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోంది. ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించాం. గతేడాది కంటే ఈసారి ఎక్కువ విద్యార్థులు చేరారు. – పద్మసంజీవరెడ్డి, సర్పంచ్, నాగిరెడ్డిగూడ -
రోడ్ల మరమ్మతులు, ఫ్రీ లెఫ్ట్లపై దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వర్షాకాల సన్నద్ధత, ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండాముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఎం.రమేష్ వివిధ విభాగాల అధికారుల్ని కోరారు. సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ట్రాఫిక్ నిర్వహణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లు, గుంతలకు మరమ్మతులతోపాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవసరమైన చోట్ల కొత్తగా ఫ్రీ లెఫ్ట్ల ఏర్పాటు, ఉన్న వాటి అభివృద్ధి, కీలక కూడళ్లలో కొత్త ట్రాఫిక్ సిగ్నళ్ల అమరిక, పని చేయనివాటి పునరుద్ధరణపై చర్చించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని నిర్ణయించారు. పాదచారుల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో ఫుట్పాత్ల అభివృద్ధి, మరమ్మతులపై దృష్టి సారించారు. పెండింగ్లో ఉన్న పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే, ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గితే సురక్షిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. వాటర్బోర్డ్ ఎండీ అశోక్రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి.పాటిల్, టీజీఐఐసీ వీసీ కె.శశాంక, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) సన్ప్రీత్ సింగ్, ట్రాఫిక్ డీసీపీలు, శాంతిభద్రతల విభాగం డీసీపీలు, సీసీఎంసీ జోనల్ కమిషనర్లు, హైడ్రా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయి అన్ని విభాగాల సమావేశంలోసైబరాబాద్ సీపీ రమేష్ -
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఎంఆర్ఆర్ ఫౌండేషన్, మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో మల్రెడ్డి అభిషేక్రెడ్డి నేతృత్వంలో పోలీసు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ యువతకు ఇచ్చే ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆదివారం ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగార్థులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మన జిల్లాకు పోలీసు ఉద్యోగాల పోస్టులు లేవని ఆందోళన చెందొద్దని.. కొన్ని కారణాలతో ఇక్కడి ప్రక్రియ ఆగిందని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి వరకు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాయపోల్ గ్రామంలో మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో రూ.20 లక్షలతో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిరించనున్న సీసీ రోడ్డు, రూ.50లక్షల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహిపాల్, పాండురంగారెడ్డి, ఈసీ శేఖర్గౌడ్, జయమ్మ, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, కౌన్సిలర్లు ఇందూరి శ్రీనివాస్, బాను, రాందాసు, రాయపోల్ సర్పంచ్ మమత శ్రీశైలం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
విద్యార్థులకు ఉపకారం
తుక్కుగూడ: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నిరుపేదలు ఉన్నత విద్యను చదువుకునేందుకు ఈ ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడనుంది. ఆర్థిక కారణాలతో ఉన్నత చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్ షిప్ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రోత్సాహకంగా ఉపకార వేతనం ఇస్తుంది. అర్హతలు ఇవీ.. ● ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ● ఏడో తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ● తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి. ● కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ● అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో ఫారాలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలి. ఇంటర్ సెకండియర్ వరకు.. ప్రభుత్వ ఎయిడెడ్, మోడల్, గురుకుల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పొందిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. ఆన్లైన్లో పరీక్ష రుసుం పరీక్షకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష రుసుం ఆన్లైన్లో చెల్లించి www.bse.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ఈనెల14 తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో రాసే వెసులుబాటు కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్రం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రవేశపెట్టింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకంగా ఉపకార వేతనం అందించనుంది. వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 14వ తేదీ తుది గడువు.. అక్టోబర్లో పరీక్ష ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న వారు అర్హులు ఎంపికై న స్టూడెంట్స్కు ఏడాదికి రూ.12వేల స్కాలర్షిప్ -
నవ వధువు కిడ్నాప్
మంచాల: ఓ నవ వధువు కిడ్నాప్ అయిన సంఘటన మంచాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మధు కథనం ప్రకారం.. మండలంలోని చిత్తాపూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ప్రవీణ్, నగరంలోని ఐఎస్ సదన్కు చెందిన కళ్యాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మంచాల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమ్మాయి తరఫున ఎవరూ రాలేదు. ఇద్దరూ మేజర్ కావడంతో తిరిగి వెళ్లిపోయారు. చిత్తాపూర్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కళ్యాణిని కారులో ఎత్తుకెళ్లారు. ఆదివారం ప్రవీణ్ తన భార్యను జ్యోతిబస్ అనే యువకుడితో పాటు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి అబ్దుల్లాపూర్మెట్ : సైకిల్పై వెళ్తున్న వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడడంతో తీవ్రగాయాలతో మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నరావిరాల గ్రామానికి రామిడి బాల్రెడ్డి (73) ఆదివారం తెల్లవారు జామున 4.25 గంటల సమయంలో సైకిల్పై పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో చిన్న రావిరాలలోని గిజ్జ కుంట సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాల్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా సాయంత్రం మృతిచెందాడు. మృతుడి కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొత్తూరు: ఓ కార్మికుడి మొబైల్ ఫోన్ చోరీ చేయడమే కాకుండా ఫోన్ అన్లాక్ చేసి ఆన్లైన్లో నగదు అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నివాసం ఉంటున్న లింగాల జగన్గౌడ్ గత నెల 21న విధులు నిర్వర్తించే పరిశ్రమకు వెళ్లేందుకు కొత్తూరు బస్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అతడి సెల్ఫోన్ దొంగిలించాడు. అనంతరం గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు సుమారు రూ.1.55 లక్షలు ఆయా అకౌంట్లు, ఆన్లైన్ ద్వారా బదిలీ చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మంచాల: ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మంచాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లోయపల్లి గ్రామానికి చెందిన సుగూరి వెంకన్న, కళమ్మ దంపతుల కుమారుడు నర్సింహ (30) వృత్తిరీత్యా కూలీ. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వచ్చి చూడగా నర్సింహ విగత జీవిగా కనిపించాడు. ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై తక్కళ్లపల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వార్డు సభ్యుడు మృతి చెందారు. వివరాలు.. కొత్తపల్లి పంచాయతీ పదో వార్డు సభ్యుడు పోలె శివ (40) ఆదివారం యాచారం నుంచి స్కూటీపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. తక్కళ్లపల్లి గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా మాల్ వైపు నుంచి అతి వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన శివను ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మమత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రమాదానికి కారకులైన వారు మాడ్గుల మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆలయాలు హిందూ చరిత్రకు మూలం
కుల్కచర్ల: ఆలయాలు హిందూ చరిత్రకు మూలమని బీజేపీ రాష్ట్ర నాయకుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ఘనపూర్లో శివరామగుర్గా క్షేత్రంలో ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ఆలయాలను మనమే పరిరక్షించుకోవాలని, హిందూ ధర్మానికి చరిత్రకు ఆలయాలే మూలాధారమన్నారు. అనంతరం బుయ్యని విజయలక్ష్మీవెంకటరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఘణపురం వెంకటయ్య, కుల్కచర్ల సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, ఘనపూర్ మాజీ సర్పంచ్ విజయలక్ష్మిగోపాల్, దిశ కమిటీ జిల్లా సభ్యుడు జానకిరాం, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యవర్గసభ్యులు మైపాల్, కాటనిపల్లి అంజిలయ్య, పీఎన్పీఎస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంధర్ గౌడ్, నాయకులు అంజనేయులు, రాంచంద్రయ్య, సాయికిరణ్, చంద్రయ్య, జి.మైపాల్, డి.అంజిలయ్య, మోహన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రహ్లాదరావు -
ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు బుగ్గి
లంగర్హౌస్: ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు బూడిద అయింది. ఈవీ చార్జింగ్ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లంగర్హౌస్ బాపునగర్లో మూడంతస్తుల భవనంలో దశరథ్గౌడ్ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. కింద పార్క్ చేసిన ద్విచక్రవాహనానికి రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్తో చార్జింగ్ పెట్టారు. ఆదివారం ఆషాడమాసం బోనాల వేడుకల్లో అందరూ అమ్మవారి ఆలయానికి బోనంతో వెళ్లారు. కొద్దిసేపటికి ఈ చార్జర్ వల్ల రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. నిమిషాల్లోనే మంటలు వ్యాపించి ఆ అంతస్తు పూర్తిగా దగ్ధం అయింది. మంటలు పక్క ఇళ్లలోకి వ్యాపించే సమయంలో స్పందించిన మురళి అనే స్థానికుడితోపాటు మరో వ్యక్తి కలిసి పక్క భవనం నుంచి దూకి ప్రాణాలకు తెగించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే వేడిగా మారిన రెండు సిలిండర్లను పోలీసులు జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించారు. దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈవీ చార్జింగ్తో అగ్ని ప్రమాదం -
పూర్వ విద్యార్థుల అర్ధశతాబ్దపు వేడుక
కొడంగల్ రూరల్: అర్ధశతాబ్దం తర్వాత పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంతో ఒక్కచోట చేరారు. పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 1965–70 ప్రభుత్వ మల్టీపర్పస్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం పట్టణంలోని కేఎస్వీ(మురారి) ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞాపకాలను నెమరేసుకుని సందడిగా గడిపారు. ఈ సందర్భంగా ఆధునిక క్యాన్సర్ థెరానోస్టిక్స్, ఫొటోఆక్టివ్ సిస్టమ్స్పై పరిశోధనలు చేస్తున్న పూర్వ విద్యార్థి డాక్టర్ రాకేశ్ మెంగ్జీని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్రెడ్డి సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.గురునాథ్రెడ్డి, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి ఈ.జగన్నాథ్రెడ్డి, ఉస్మానియా వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, రిటైర్డ్ జీహెచ్ఎం ఎం.రాంరెడ్డి, కంటి వైద్యులు డాక్టర్ కేవీ రాములు, రిటైర్డ్ ప్రిన్స్పాల్ పి.జనార్దన్రావు, కన్వీనర్ యూ.శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. -
ఆలయ హుండీలో డాలర్
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ పోచమ్మ ఆలయం హుండీలో ఓ భక్తుడు అమెరికన్ డాలర్ వేశారు. ఆదివారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొందరు అమ్మవారి హుండీలో కానుకలు సమర్పించారు. ఓ భక్తుడు అమ్మవారి హుండీలో ఒక డాలర్ వేశాడు. సాయంత్రం ఆలయ నిర్వాహకులు హుండీ తెరిచి లెక్కించడంతో డాలర్ బయటపడింది. అది హుండీలో ఎవరు వేశారోనని స్థానికంగా చర్చ జరుగుతోంది. పరిసర ప్రాంతాల్లోని ఫాంహౌస్ల్లో ఉన్నవారు వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. -
పారిశ్రామిక వాడలో ప్లాట్ కొనలేం!
తాండూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లోని నాపరాతి పాలిషింగ్ యూనిట్ల కారణంగా కాలుష్యం పెరుగుతోంది. దీంతో గత ప్రభుత్వం పాలిషింగ్ యూనిట్లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు మండల పరిధిలోని జిన్గుర్తిలో రూ.వందల కోట్లు వెచ్చించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు భూ సేకరణ చేపట్టింది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వ్యాపారులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. దేశంలోనే అత్యధిక కాలుష్యం నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వేలాది ఎకరాల్లో నాపరాతి నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. తాండూరు నాపరాతికి మార్కెట్లోనూ డిమాండ్ అధికం. ఈ ప్రాంతంలో 700 వరకు నాపరా తి పాలిషింగ్ యూనిట్లు కొనసాగుతున్నాయి. వీటి కారణంగా దేశంలో తాండూరు పట్ణంలోనే అత్యధిక కాలుష్యం నమోదైందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. దీంతో వాటిని తరలించాలని స్థానికుల నుంచి ఒత్తిడి పెరిగింది. 262 ఎకరాల భూ సేకరణ తాండూరు లైమ్స్టోన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణ, అభివృద్ధి పనుల ను ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించింది. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.12 లక్షల చొప్పు న 262 ఎకరాల భూమికి సుమారు రూ.314 కోట్ల పరిహారం చెల్లించారు. అందులో 10.2 శాతం గ్రీన్ కారిడార్కు స్థలం కేటాయించారు. మిగిలిన భూమిలో 422 ప్లాట్లు ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం టీజీఐఐసీ నుంచి రూ.21.30 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. 2023 అక్టోబర్లో నాటి మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి పారిశ్రామిక వాడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా బీటీ రోడ్డు, విద్యుత్, తాగునీటి సరఫరా, మురుగునీటి కాలువలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పనులు కొనసాగుతున్నాయి. చదరపు గజం రూ.3వేలు లైమ్స్టోన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్లో పాలి షింగ్ యూనిట్ యజమానులు పరిశ్రమలను ఏర్పా టు చేసేందుకు టీజీఐఐసీ చదరపు గజం రూ.3 వేలు గా నిర్ధారించింది. గతేడాది వ్యాపారుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. కానీ పాలిషింగ్ యూనిట్ నిర్వాహకులు ఎవరూ ముందుకు రాలేదు. చదరపు గజానికి రూ.3 వేలు పెట్టి స్థలం కొనుగోలు చేయలేమని నాపరాతి పాలిషింగ్ నిర్వాహకులతో పాటు తాండూరు స్టోన్ మర్చంట్స్ అసోషియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉచితంగా స్థలాలను అందించాలని లేదంటే నామినల్ ధరలకు కేటాయించాలని ఇటీవల సంబంధిత శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును కలిసి విన్నవించారు. జీఎస్టీ భారం.. రాయల్టీ బాదుడు నాపరాతి పరిశ్రమలపై ప్రభుత్వం అధికంగా పన్నుభారం మోపుతోందని వ్యాపారులు వాపోతున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ను ప్రోత్సహించి పన్నుల భారం తగ్గించిందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అధిక భారం మోపుతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయల్టీ, జీఎస్టీ పన్ను భారం తగ్గించాలని కోరుతున్నారు. జిన్గుర్తిలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ లైమ్స్టోన్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు 422 ప్లాట్లు చదరపు గజానికి రూ.3 వేలుగా నిర్ధారించిన టీజీఐఐసీ ఏడాది క్రితం ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం ముందుకు రాని నిర్వాహకులు -
చెంచులు ఐక్యంగా ఉండాలి
తాండూరు రూరల్: అడవిని కాపాడుతూ.. ప్రకృతిని ప్రేమిస్తున్న చెంచులు ఐక్యంగా ఉండాలని ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి జనార్దన్ అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండలం చైతన్యనగర్ గ్రామంలో సర్పంచ్ మాదాసి గౌరమ్మ అధ్యక్షతన ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచులు చదువు, రాజకీయాలు, ఉపాధి, హక్కులు, సామాజిక అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు. పిల్లలను ఉన్నత చదువుల్లోనే రాణించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ స్కాలర్ిషిప్, రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని, వ్యవసాయం, పశుపోషణ, చిన్న పరిశ్రమల ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచించారు. చెంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, గ్రామస్తులు అంజిలయ్య, శ్రీనివాస్, లాలయ్య, రాములు, రాజన్న, విక్రమ్సింగ్, హన్మంత్, భరత్, లింగం, తిరుపతి, లాలు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి జనార్దన్ -
ఈ– కేవైసీతోనే సిలిండర్
● లేదంటే గ్యాస్ బండ రావడం కష్టమే ● గ్రేటర్లో లక్షల మంది దూరంగానే.. ● గడువు మరో వారం రోజులే ● ఎస్ఎంఎస్లు పంపుతున్న సంస్థలుసాక్షి, సిటీబ్యూరో: పంజాగుట్టకు చెందిన సుమతి గత నెల 25న ఆన్లైన్లో ఎల్పీజీ సిలిండర్ బుక్ చేశారు. 15 రోజులైనా సిలిండర్ రాలేదు. ఈ– కేవైసీ పూర్తి చేయకపోవడంతో డెలివరీ నిలిపివేసినట్లు తెలిసింది. వెంటనే ఏజెన్సీకి వెళ్లి ఈ–కేవైసీ చేసుకోవడంతో మరుసటి రోజే సిలిండర్ వచ్చింది. ప్రస్తుతం నగరంలో చాలామంది వినియోగదారులు ఈ–కేవైసీ ప్రక్రియతో ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నెల 16లోగా ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు గడువు విధించాయి. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ కంపెనీలు నేరుగా వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. గడువు మించితే సిలిండర్లు అందవని స్పష్టం చేశాయి. నేరుగా ఏజెన్సీ వద్ద, యాప్ల ద్వారా మొబైల్లో లేదా ఇంట్లోనే బయోమెట్రిక్ ద్వారానూ ఈ–కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ మహా నగరంలో ఇంకా లక్షలాది మంది ఈ పని చేయలేదు. కాగా.. కంపెనీల అధికారిక యాప్లు, వెబ్సైట్ల ద్వారానే ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆధార్, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ– కేవైసీ చేసుకునేదిలా.. ఇండియన్ ఆయిల్ (ఇండేన్): ప్లేస్టోర్ నుంచి ‘ఇండియన్ ఆయిల్ వన్ ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్ను డౌన్్లోడ్ చేసుకోవాలి. లింక్ అయిన ఫోన్ నంబరు, మెయిల్తో పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలి. మొదటి సారి యూజర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. గ్యాస్ క్యాష్మెమో లేదా సబ్స్క్రిప్షన్ ఓచర్పై ఉన్న 16 అంకెల ఎల్పీజీ ఐడీని లింక్ చేయాలి. అందులో కస్టమర్ వివరాలు కనిపిస్తాయి. లాగిన్ అయ్యాక హోమ్ పేజీలో ప్రొఫైల్పై క్లిక్ చేస్తే ఆధార్ లింక్ అండ్ ఈ–కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. పచ్చ రంగు టిక్ మార్క్ ఉంటే మీ కేవైసీ పూర్తయినట్లు. కాకపోతే అక్కడే రీ–అథెంటికేషన్ బటన్ నొక్కి మీ ముఖాన్ని స్కాన్ చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయి ఉంటే మొదట దాన్ని అన్లాక్ చేయాలి. భారత్ గ్యాస్: ప్లేస్టోర్ నుంచి ‘హలో బీపీసీఎల్ ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి లాగిన్ కావాలి. యాప్ హోమ్ పేజీలోనే ఈ–కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మరోసారి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. అనంతరం ప్రాసెస్కు సూచనలు చేస్తుంది. వాటిని పాటించాలి. హెచ్పీ గ్యాస్ : ప్లేస్టోర్ నుంచి ‘హెచ్పీ పే’తో పాటు ‘ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ తెరిచాక రిజిస్టర్డ్పై క్లిక్ చేసి అకౌంట్ లింకింగ్ కోసం మొబైల్ నంబరు నమోదు చేయాలి. ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ కావాలి. హోమ్ పేజీలో ‘మై హెచ్పీ గ్యాస్’ సెక్షన్కు వెళ్లి ‘ఎల్పీజీ’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ ఈ–కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్క్రీన్పై కనిపించే సూచనలు పాటించాలి. అనంతరం కెమెరా ఫేస్పై క్లిక్ చేస్తే కొన్ని సూచనలు చేస్తుంది. ముఖాన్ని స్కాన్్ చేస్తే ఈ–కేవైసీ పూర్తవుతుంది. -
బోర్డు తిప్పేసిన నగల దుకాణం?
కుల్కచర్ల: మండల పరిధిలో మరొక మార్వాడీ బంగారు దుకాణం బోర్డు తిప్పేసింది. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. చాపలగూడెం గ్రామానికి చెందిన రాములు ఏప్రిల్ 1వ తేదీన నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు, గొలుసు చేయాలని కేసరియా జ్యూవెలర్స్ దుకాణ యజామని కై లాస్కు రూ.4 లక్షలు చెల్లించాడు. ఇటీవల దుకాణం తెరవడం లేదు. ఈ నెల 26న బాధితుల ఇంట్లో వివాహం ఉండడంతో ఆయన్ను సంప్రదించినా స్పందించడం లేదు. దీంతో ఆదివారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇటీవల అజయ్ జ్యూవెలర్స్ యజమాని సైతం సూమారు రూ.కోటి ఆస్తులతో పరారవ్వగా నేటికీ ఆచూకీ లభించలేదు. ప్రైవేట్ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. -
నేటితో సర్ ముగింపు
కొడంగల్లో వంద శాతం ఎన్యూమరేషన్ పూర్తివికారాబాద్/బషీరాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్)కు నేటితో తెరపడనుంది. జిల్లాలో 47రోజుల పాటు సాగిన ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగగా మొత్తం 10,17,671 మంది ఓటర్లను ఎన్నికల సిబ్బంది పరిశీలించారు. ఇందులో 8,06,348 మంది ఓటర్లు క్రియాశీలంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 2,07,689 మంది ఓటర్లు ఏఎస్డీ (అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్) జాబితాలోకి వెళ్లారు. అక్టోబర్ 15వరకు వివరాల సేకరణ జిల్లాలో తొలుత ఎన్యూమరేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించినా కలెక్టర్ చొరవతో పుంజుకుంది. 2002లో చివరగా ఎస్ఐఆర్ నిర్వహించారు. 2025లో తిరిగి ప్రారంభించిన ఎస్ఐఆర్కు 2002 ఓటరు జాబితాను ప్రామానికంగా తీసుకుని ప్రస్తుత జాబితాతో పోల్చి చూశారు. 2025లో ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండి 2002 లేకుంటే ఆ ఓటర్లను మ్యాపింగ్ చేసి వారి కుటంబీకుల పేర్లతో పోల్చి చూశారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, చిరునామా వద్ద అందుబాటులో లేని వారు, రెండు ఓట్లు నమోదు ఉన్న వారి వివరాలను ప్రత్యేకంగా గుర్తించారు. జిల్లాలో దాదాపు 2.07 లక్షల ఓట్లు తొలగింపునకు అర్హమైనవిగా తేల్చారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తుది పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం అనంతరం వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం వరకు 8.06 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. ఏఎస్డీ ఓటర్లను కలుపుకొని చూస్తే జిల్లా పురోగతి 99.64 శాతానికి చేరింది. కేవలం 3,634 ఫారాలే పెండింగ్లో ఉండడంతో ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 17వరకు నోటీసులు ఇచ్చి అక్టోబర్ 15వ తేదీ వరకు వివరణ తీసుకోనున్నారు. తాండూరులో 64,413 ఓట్లు గల్లంతు జిల్లాలో అత్యధిక ఏఎస్డీ ఓటర్లు తాండూరు నియోజకవర్గంలో నమోదయ్యారు. మొత్తం 64,413 మంది ఓటర్లు జాబితాలో కనిపించలేదు. ఉపాధి, ఉద్యోగాలు, విద్య తదితర కారణాలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. కొడంగల్ అగ్రస్థానం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఎస్ఐఆర్లో అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ వంద శాతం ప్రక్రియ పూర్తి అయింది. ఒక్క ఫారం పెండింగ్లో లేకపోవడం విశేషం. పరిగి నియోజకవర్గం 99.99 శాతం, వికారాబాద్ నియోజకవర్గం 99.08 శాతం పురోగతిని నమోదు చేశాయి. నాలుగు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి డేటా సేకరించారు. 10.17 లక్షల ఫారాల పరిశీలన పెండింగ్లో 3,634 ఫారాలు తాండూరులో అత్యధికంగా ఓట్లు గల్లంతు!ఎస్ఐఆర్ గణాంకాలు జిల్లాలో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టాయి. మొత్తం ఓటర్లలో 20.40 శాతం మంది ఏఎస్డీ జాబితాలోకి వెళ్లారు. అంటే ప్రతి ఐదుగురు ఓటర్లలో ఒకరు తమ నమోదిత చిరునామా వద్ద లేరని తేలింది. మరణాలు, వలసలు, చిరునామా మార్పులు, ద్వంద నమోదులు ఇందుకు కారణాలుగా గుర్తించారు. తుది జాబితా విడుదల తర్వాత జిల్లాలో క్రియాశీల ఓటర్ల సంఖ్య 8.06 లక్షల వద్దే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ నేటితో ముగియడంతో ఇప్పుడు ఎన్నికల యంత్రాంగం తుది ఓటరు జాబితా రూపకల్పనపై దృష్టి సారించనుంది. రాబోయే ఎన్నికల్లో మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా అందుబాటులోకి రానుంది. దీంతో జిల్లాలో ఓటరు జాబితా ప్రక్షాళనకు కీలక అధ్యాయం ముగిసినట్టయింది. -
ఆర్టీసీలో అప్రెంటిస్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
రేపు హైదరాబాద్లో ప్రత్యక్ష ఎంపిక తాండూరు టౌన్: టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ పరిధిలో అప్రెంటిస్షిప్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏడాది పాటు శిక్షణ ఉంటుందన్నారు. అర్హులైన వారు నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నెలకు రూ.16 వేల నుంచి రూ. 19 వేల వరకు, అర్హతల ప్రకారం నిర్దేశిత స్టైఫండ్ ఉంటుందన్నారు. ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ రెండో అంతస్తులో నిర్వహించే ప్రత్యక్ష ఎంపికకు హాజరుకావాలన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాల ఒరిజినల్స్, జిరాక్స్ సర్టిఫికెట్లు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, పాస్పోర్టు సైజు ఫొటోలు, నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. పరిగి: కాలమిస్ట్, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి డాక్టర్ భాస్కరయోగి ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుని కలిసారు. నగరంలోని బీజేపీ అధ్యక్షుడి నివాసంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై చర్చించారు. అనంతరం భాస్కరయోగి రాసిన పలు పుస్తకాలను ఆయనకు అందించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదారాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ బేటీ ఆసక్తికరంగా మారింది. భాస్కరయోగి బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆశిస్తున్నట్టు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ధారూరు: సెల్ఫీ సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన మండల కోట్పల్లి ప్రాజెక్టు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్ఫీదిగేందుకు యత్నించారు. ఇద్దరూ ఒకే వైపు వచ్చి సెల్ఫీ దిగుతున్న క్రమంలో బోట్ అదుపుతప్పి ప్రాజెక్టు నీటిలో పడిపోయారు. వారు లైఫ్జాకెట్స్ ధరించడంతో ప్రమాదం తప్పింది. గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమై వారిని బోట్లో ఒడ్డుకు చేర్చారు. హుడాకాంప్లెక్స్: హైడ్రా ఉద్యోగాల ఎంపికకు అనూహ్యంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకావడంతో దేహదారుఢ్య పరీక్షల గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. తొలుత రెండు రోజులపాటు నిర్వహించాల్సిన ఈవెంట్స్కు వేలాదిమంది తరలిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు మాత్రమే ఉన్నప్పటికీ.. హాజరైన ప్రతి అభ్యర్థికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం: డా.బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ 2026–27 ప్రవేశాల గడువును సెప్టెంబర్ 9 వరకు పెంచినట్లు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, సెంటర్ కో–ఆర్డినేటర్ శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఓపెన్ స్టడీ సెంటర్–172లో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో కోర్సుల్లో చేరేందుకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై, రెండేళ్ల ఐటీఐ కోర్సు చేసిన విద్యార్థులు సైతం ప్రవేశాలకు అర్హులని చెప్పారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించాలన్నారు. -
అథ్లెటిక్స్లో ధనాంజనేయులు సత్తా
అబ్దుల్లాపూర్మెట్: బాటసింగారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటాడు. శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ 12వ రాష్ట్రస్థాయి జావెలిన్ డే సెలబ్రేషన్ పురుషులు, మహిళలు, సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026లో అండర్–16 బాలుర జావెలిన్ త్రో విభాగంలో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. ఆగస్టు 1న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సత్తాచాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన ధనాంజనేయులు పతకం సాధించడంపై హెచ్ఎం ప్రతాప్, ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ గౌరీ శంకరాచారి, ఉపసర్పంచ్ వెంకటేశ్, తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
అద్దె గూటికి గురుకులం
సొంత భవనాలకు తాళం.. మొయినాబాద్: కళాశాల విద్యార్థుల వసతి గృహం కోసం రూ.కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వ భవనం నిర్మించారు. ఇందులో వసతి గృహానికి బదులుగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. కొంత కాలం పాటు గురుకులాన్ని నడిపించి సరిపడా వసతులు లేవని అదనపు గదులు, ప్రహరీ నిర్మించారు. చివరికి ఈ భవనాన్ని వదిలి గురుకులాన్ని ప్రైవేటు భవనంలోకి మార్చారు. అక్కడ రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తూ.. ప్రభుత్వ భవనాలను వృథాగా వదిలేశారు. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ అధికారుల పనితీరు. రూ.2 కోట్లు వెచ్చించి.. మొయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పదేళ్ల క్రితం కళాశాల విద్యార్థుల(బాలికల) వసతిగృహాన్ని నిర్మించారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రూ. కోటి నిధులతో భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. కానీ కళాశాల బాలికల హాస్టల్ను మాత్రం అందులో ఏర్పాటు చేయలేదు. అంతలోనే ప్రభుత్వం కొత్త గురుకులాలు ఏర్పాటు చేయడంతో శంకర్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఈ భవనంలో ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడంకోసం ఈ భవనంపై విడతలవారీగా అదనపు గదులు, వంటశాల, ల్యాబ్ నిర్మించారు. మరో రూ.కోటితో ప్రహరీ నిర్మించారు. ఏడాది క్రితం వరకు శంకర్పల్లి గురుకులం ఇక్కడే కొనసాగింది. గతేడాది శంకర్పల్లి గురుకులాన్ని ఇక్కడి నుంచి పెద్దమంగళారం సమీపంలోని ఆజాద్ కళాశాలకు చెందిన ప్రైవేటు భవనంలోకి మార్చారు. రూ.లక్షల్లో అద్దె చెల్లింపు ప్రభుత్వ భవనాలను వదిలి ప్రైవేటు భవనంలోకి గురుకులాన్ని తరలించిన అధికారులు అక్కడ నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం శంకర్పల్లి గురుకులం కొనసాగుతున్న ఆజాద్ కళాశాల భవనానికి నెలకు రూ.5 లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు భవనాల యజమానులు ఇచ్చే కమీషన్లకు ఆశపడే అధికారులు గురుకులాలను వాటిలోకి మారుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొయినాబాద్ మండలంలో వివిధ ప్రాంతాలకు చెందిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రైవేటు కళాశాలలకు చెందిన అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వృథాగా మారిన ప్రభుత్వ భవనాలు శంకర్పల్లి బాలికల గురుకులాన్ని ప్రైవేటు అద్దె భవనంలోకి మార్చడంతో ప్రభుత్వ భవనం వృథాగా మిగిలిపోయింది. ఏడాది క్రితమే ఇక్కడ ల్యాబ్ నిర్మించారు. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించకుండానే నిరుపయోగంగా వదిలేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి నిర్మించిన ప్రభుత్వ భవనాలను నిరుపయోగంగా మార్చిన అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు భవనానికి నెలకురూ.5 లక్షల పైనే కిరాయి చెల్లింపు నిరుపయోగంగా మారిన సర్కార్ భవనాలు అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం ఏడాది క్రితం వరకు గురుకుల పాఠశాలను మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న ప్రభుత్వ భవనంలోనే కొనసాగించాం. గురుకుల సొసైటీ సెక్రటరీ సూచన మేరకే గురుకులాన్ని ఆజాద్ కళాశాలకు చెందిన భవనంలోకి మార్చాం. గత ఏడాది ఆ భవనంలో ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తయిన తరువాత భవనం ఖాళీగా ఉంది. ఈ ఏడాది కూడా ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. – కృష్ణవేణి, ప్రిన్సిపల్, శంకర్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల -
దివ్యాంగురాలిపై లైంగికదాడి
నిందితుడికి రిమాండ్దోమ: దివ్యాంగురాలైన యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘంటన దోమ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి గూడూర్లో గ్రామానికి చెందిన మంగళి వెంకటేశ్(30).. ఈ నెల 6న మాటలు రాని, సరిగా నడవలేని యువతి(18)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బాధితురాలి తల్లికి తెలియడంతో.. ఆమె తన తమ్ముడికి తెలిపింది. అతను శుక్రవారం సాయంత్రం నిందితుడిని ప్రశ్నించగా, ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో సదరు వ్యక్తికి దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. వెంకటేశ్ నేరం అంగీకరించాడు. ఈ మేరకు అతని కేసు నమోదు చేశారు. శనివారం పరిగి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, రిమాండ్కు తరలించామని ఎస్ఐ తెలిపారు. మీర్పేట: టీకేఆర్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘క్వాంటం అరీనా హ్యాకథాన్’ జాతీయ స్థాయి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ తీగల హరినాథ్రెడ్డి, కోశాధికారి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 విద్యార్థులు, డెవలపర్లు పాల్గొని సరికొత్త ఆలోచనలతో డిజిటల్ పరిష్కారాలైన అప్లికేషన్లు, వెబ్సైట్లు, ఏఐ మోడల్స్ కనిపెట్టే కోడింగ్ పోటీలతో పాటు మెషిన్ లెర్నింగ్, వెబ్, యాప్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నూతన సాంకేతికతలపై టాస్క్లు ఇవ్వడం జరిగిందన్నారు. 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి తక్కువ సమయంలో ఎక్కువ బృందాలుగా ఏర్పడి కొత్త ఆవిష్కరణలను సృష్టించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామస్వామిరెడ్డి, వివిధ విభాగ అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహిత అదృశ్యం
యాలాల: వివాహిత అదృశ్యమైన సంఘటన మండల పరిధి కిష్టాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందినలక్ష్మిని పదిహేనేళ్ల క్రితం ఇదే మండలం బెన్నూరుకు పెద్దపులి శ్రీనుకి ఇచ్చి వివాహాం చేశారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శనివారం భర్తతో గొడవపడిన లక్ష్మి.. మధ్యాహ్నం కిష్టాపూర్లోని పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో కుటుంబీకులు పొలం పనుల్లో ఉన్నారు. లక్ష్మి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు పెద్ద కిష్టప్ప.. ఇంటికి వచ్చి చూడగా.. సోదరి కనిపించలేదు. ఇదే విషయమై ఫోన్లో లక్ష్మి అత్తగారిని సంప్రదించగా.. ఆమె ఇక్కడికి రాలేదని తెలిపారు. అనంతరం ఆమె కోసం తెలిసిన వారి వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కిష్టప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఇబ్రహీంపట్నం: బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ను శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పరామర్శించారు. ఇటీవల క్యామ మల్లేశ్ స్వల్ప అస్వస్థతకు గురై వనస్థలిపురంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం హరీశ్రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొత్తూరు: మేకగూడ సింగిల్విండో చైర్మన్గా ఎస్బీపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయనతో పాటు నూతనంగా ఎన్నికై న డైరెక్టర్లకు నియామకపు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన కార్యాలయంలో పాలకవర్గంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే ప్రతీ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో పదవిని అప్పగించడం పట్ల ఆయన ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘రేడియల్’ రయ్ రయ్
సాక్షి, సిటీబ్యూరో: రేడియల్ రోడ్డు పనులపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్గా దృష్టి సారించింది. రావిర్యాల నుంచి ఆమనగల్లు వరకు చేపట్టిన మొదటి దశ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ అనుబంధ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్)లో అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. అక్కడక్కడా అడ్డంకులు.. ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్సిటీ మీదుగా ఆమన్గల్ వరకు రెండు దశల్లో నిర్మించనున్న 41.5 కి.మీ రేడియల్ రోడ్డు కోసం భూసేకరణ తుది దశకు చేరుకున్నా.. అక్కడక్కడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కొన్ని చోట్ల న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. భూసేకరణలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు రెవెన్యూ తదితర విభాగాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, సకాలంలో నిర్మాణ పనులను చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నాటికి పురోగతి.. వచ్చే డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ నాటికి రేడియల్ రోడ్డు మొదటి దశ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు 6–లేన్లతో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే చేపట్టి 8– లేన్లకు విస్తరించనున్నారు. మొదటి దశలో రావిర్యాల్ నుంచి మీర్ఖాన్పేట్ వరకు 19.2 కి.మీ అంచనా వ్యయం రూ.1,282.30 కోట్లు. రెండో దశలో మీర్ఖాన్పేట్ నుంచి ఆమనగల్లు వరకు 22.3 కి.మీ.ఉంటుంది. దీని అంచనా వ్యయం రూ.1,538.31 కోట్లు. భూసేకరణ పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో బుద్వేల్– కొడంగల్కు టెండర్లు.. ఓఆర్ఆర్ బుద్వేల్ ఎగ్జిట్ నుంచి కొడంగల్ వరకు నిర్మించనున్న సుమారు 81 కి.మీ రేడియల్ రోడ్డు–2 ప్రాజెక్టు డీపీఆర్లను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో ఆన్లైన్ బిడ్డింగ్ నోటిఫికేషన్ను వెలువరించనున్నట్లు హెచ్జీసీఎల్ అధికారులు తెలిపారు. ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు వివిధ ప్రాంతాల్లో 16 చోట్ల ఈ తరహా రేడియల్ రోడ్లను దశలవారీగా నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. డిసెంబర్ నాటికి రావిర్యాల– ఆమన్గల్ రోడ్డు మొదటి దశ పూర్తి భూసేకరణ, నిర్మాణ పనులపై హెచ్ఎండీఏ కమిషనర్ సమీక్ష -
అనుమతి పేరిట అధిక వసూళ్లు!
పరిగి: అనుమతుల పేరిట పంచాయతీ కార్యదర్శి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రూప్ఖాన్పేట్ గ్రామస్తులు శనివారం ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహేశ్, హమీద్లు తమ ఇళ్ల అనుమతుల కోసం కార్యదర్శిసంతోషను సంప్రదించగా.. ఆమె రూ.32 వేలకు బదులు 45 వేలు డిమాండ్ చేసింది. ఈ మేరకు సదరు వ్యక్తులు కార్యదర్శి భర్తకు ఫోన్పే ద్వారా నగదు చెల్లించారు. అయినప్పటికీ అనుమతి పత్రాలు అని పేర్కొంటూ నకిలీ పత్రాలు అందజేశారని వారు పేర్కొన్నారు. ఇలా తమ వద్దే కాకుండా.. చాలామంది దగ్గర కార్యదర్శి అధికంగా డబ్బులు వసూలు చేసిందన్నారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఎంపీఓ ఖరీంను వివరణ కోరగా.. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బీజేపీది ప్రజా వ్యతిరేక పాలన
తాండూరు టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలో అడ్డుకట్ట వేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ అన్నారు. శుక్రవారం బద్లావ్ జరూరీ హై కార్యక్రమంలో భాగంగా పాత తాండూరు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ధరలు ఆకాశాన్నంటాయని ఆరోపించారు. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం కరువైందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర చెల్లించడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చి కార్మిక హక్కులను కాలరాయడం, దేశ సంపదను అదానీ, అంబానీలకు దారధత్తం చేయడమే బీజేపీ ఎజెండాగా మారిందన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించి దొంగ చాటున అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. భవిష్యత్లో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బదలావ్ జరూరీహై పేరుతో జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన పాదయాత్రలు నిర్వహించి, ప్రజలను చైతన్యవంతులను చేస్తామని అన్నారు. సెప్టెంబర్ ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తదుపరి కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పీర్మహ్మద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్, అబ్దుల్లా, రవీందర్, మునీర్, అహ్మద్, రాజు, నరసమ్మ, బాలమ్మ, లక్ష్మి, మాణెమ్మ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమం సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ పాత తాండూరు నుంచి పాదయాత్ర ప్రారంభం -
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● బోనమెత్తిన ఊరు వాడఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఉదయం పోచమ్మ, ఊరడమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి నైవేద్యం సమర్పించారు. వేడుకల్లో ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. – అనంతగిరిబొంరాస్పేట: మెట్లకుంటలో బోనాలతో మహిళలు ధారూరు: స్టేషన్ ధారూరులో.. -
చట్టాలపై అవగాహనతో రక్షణ
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక ● చెంచుపల్లిలో న్యాయ అవగాహన సదస్సు పూడూరు: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, అప్పుడే రక్షణ పొందగలుగుతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎ.రాధిక అన్నారు. శుక్రవారం మండలంలోని చెంచుపల్లి గ్రామంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని తెలిపారు. గృహహింస, బాల్యవివాహాలు, మహిళా చట్టాలు, బాలల హక్కులు, సైబర్ నేరాలు వంటి వాటిని లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు సంస్థను సంప్రదిస్తే ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. చెంచుపల్లిలో ప్రభుత్వ భూముల సమస్య తమ దృష్టికి వచ్చిందని, బాధితులు దరఖాస్తు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అంకిత సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి, సర్పంచ్ దయాకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వెంకటేశ్, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్, ఉపసర్పంచ్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి/కుల్కచర్ల: మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కుల్కచర్ల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజినల్ కోఆర్డినేటర్ నాగార్జున్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపారు. కుల్కచర్ల గురుకుల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ, గురుకుల పాఠశాలలో పీజీటీ, ఇంగ్లిష్, పీజీటీ ఫిజికల్ సైన్స్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించగల అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 11న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని మానసా హిల్స్లో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్, గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జిరాక్స్ సెట్లతో డెమో మరియు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. బొంరాస్పేట: ఉప సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా బొంరాస్పేటకు చెందిన ఉప్పరి నందిని ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్నాయక్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉపసర్పంచుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. -
చికిత్స కోసం వచ్చి.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి
● వికారాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన ● డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబీకులు, బంధువులునరేష్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులుఅనంతగిరి: ఛాతిలో మంట రావడంతో చికిత్స కోసం వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన నరేష్(33) షాద్నగర్లో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన సాయంత్రం స్నేహితులతో కలిసి నవాబుపేటకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా ఛాతిలో మంట రావడంతో మధ్యాహ్నం వికారాబాద్లోని మెడిక్యూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం నరేష్ను వైద్యులు డిశ్చార్ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన వైద్యులు పీసీఆర్ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే నరేష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రఘుకుమార్, డీఎస్పీ అంజయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి
అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ కుల్కచర్ల: మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక పురోగతి సాధించడం తోపాటు.. వారు నిర్వహించే కార్యక్రమాలు రైతులకు మేలు జరిగేలా ఉండాలని అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ సూచించారు. శుక్రవారం చౌడాపూర్ మండల కేంద్రంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేయనున్న పశువుల దాణా విక్రయ కేంద్రానికి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘాల సభ్యులతో నిర్వహించారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. మండలంలో పశు సంపద, పాడి పశువులు తదితర అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సోమలింగం, ఎంఈఓ రామచందర్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం నవాబుపేట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి వెంటనే ఓపీఎస్ను ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం కోరారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం మండలంలోని మీనాపల్లి కలాన్ ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని ప్రకటించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలకు గుదిబండగా మారిన జీఓ నం.25ను వెంటనే రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, గోవిందమ్మ, విజయ్, మాణిక్య ప్రభు, మల్లేశం, ముస్తఫా, రవీందర్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రాష్ట్ర అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని కుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సంబంధిత రిజిస్టర్లలో సంతకాలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ అలీ తదితరులు పాల్గొన్నారు. తాండూరు టౌన్: తాండూరు గోశాల సేవా సమితి, రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఆర్బీఓఎల్) ఆధ్వర్యంలో ఈ నెల 15న రైతులకు ఉచితంగా కోడెలను పంపిణీ చేయనున్నట్లు గోశాల ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సార్డా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు నియోజకవర్గ రైతులకు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు గోశాలలో నిర్ణీత రుసుం చెల్లించి ఈ నెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కోడెలను ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9440872526, 6300383211, 9030056755లలో సంప్రదించాలన్నారు. -
రెండింతలు!
వికారాబాద్: జిల్లాలో లక్ష్యానికి మించి ఆయిల్ పామ్ పంట సాగవుతోంది. 90శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ఇస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండటం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. భవిష్యత్ అవసరాలు, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యాన శాఖ అధికారులకు టార్గెట్ విధించింది. రెండేళ్ల క్రితం వరకు ఈ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఎవరూ ముందుకు రాలేదు. పామాయిల్ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం సాగుపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించింది. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇటీవల ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు హకీంపేట్లో 30 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. త్వరలో పరిశ్రమ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ దీపక్ తివారి సాగు విస్తీర్ణం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా తోటలను పరిశీలిస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులతో కలిసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడి నేలలు అనుకూలం జిల్లాలో గత ఏడాది టార్గెట్కు రెండింతలు సాగు చేశారు. ప్రస్తుత సంవత్సరంలో లక్ష్యానికి మించి రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాలో 5.93 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఇందులో ఉద్యాన పంటలు 50వేల ఎకరాల్లో ఉంటాయి. ఆయిల్ పామ్ సాగుకు 50వేల ఎకరాలు అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గత ఏడాది 2వేల ఎకరాలు లక్ష్యం పెట్టుకోగా 4,500 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుత ఏడాదిలో మరో 2,400 ఎకరాలు టార్గెట్ ఇవ్వగా ఇప్పటికే 3,300మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. అధికారులు మాత్రం 20వేల ఎకరాల్లో సాగయ్యేలా టార్గెట్ పెట్టుకున్నారు. 7,800 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులను ఒప్పించారు. అంతర పంటల సాగుకు.. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తోంది. ఐదెకరాల వరకు సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై మొక్కలు అందజేస్తోంది. మరో 90శాతం సబ్సిడీపై డ్రిప్ పైపులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అంతర పంటల సాగుకు ఎకరాకు ఏడాదికి రూ.2,100 చొప్పున రైతులకు చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు మొక్కలు, డ్రిప్ పైపులు ఉచితం. తొమ్మిది ఎకరాల నుంచి 12 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేసే రైతులకు మొక్కలు, డ్రిప్ పరికరాలు 80శాతం రాయితీపై ఇవ్వనున్నారు. గత ఏడాది లక్ష్యం 2,400 ఎకరాలు సాగు చేసింది 4,500 ఎకరాల్లో ఈ ఏడు టార్గెట్ 2,400 ఎకరాలు పేర్లు నమోదు చేసుకున్న రైతులు 3,300 మంది అధికారులు పెట్టుకున్న లక్ష్యం 20వేల ఎకరాలు పామాయిల్ పరిశ్రమకు కేటాయించిన భూమి 30 ఎకరాలు ఆయిల్ పామ్ సాగుపై అసక్తి ఉన్న రైతులు ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఎకరాకు రూ.1,750 చొప్పున డీడీ తీసి ఇవ్వాలి. బోరు, నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. తాండూరు సమీపంలోని కోకట్ నర్సరీలో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. – సత్తార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారిజిల్లాలో లక్ష్యానికి మించి ఆయిల్ పామ్ సాగు 90శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు రైతు వాటా ఎకరాకు రూ.1,750 ఎస్సీ, ఎస్టీలకు ఉచితం ఆసక్తి చూపుతున్న అన్నదాతలుఆయిల్పామ్ దీర్ఘకాలిక పంట. సాగు చేసిన మూడున్నర ఏళ్ల నుంచి కాపునకు వస్తుంది. ఐదవ ఏట నుంచి 35 సంవత్సరాల పాటు ఏడాదికి 10 నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.2.5 లక్షల ఆదాయం రానుంది. ఎకరం పొలంలో 57మొక్కలు మాత్రమే నాటుకోవాలి. అంతర పంటలుగా శ్రీగంధం, సర్వి, ఉల్లి, మిరియాలు, పసుపు, కూరగాయల పంటలు సాగు చేసుకోవచ్చు. వీటి ద్వారా మరింత ఆదాయం వస్తుంది. -
ధర లేక ధరణికే..
బంట్వారం: టమాటా, ప చ్చిమిర్చికి గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో పలువురు రైతులు పంట దిగుబడులను పొలంలోనే వదిలేస్తున్నారు. బంట్వా రం గ్రామానికి చెందిన పోచారం వెంకటేశం మూడున్నర ఎకరాల్లో టమాటా, మిర్చి పంటలు సాగు చేశాడు. అప్పు చేసి రూ.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి చేతికి రావడంతో నగరంలోని వివిధ మార్కెట్లకు తరలించాడు. అక్కడ కనీస ధర కూడా పలకలేదని తెలిపాడు. మార్కెట్లో దళారులు సిండికేట్గా ఏ ర్పడి తక్కువ ధరకు టమాటా, పచ్చిమిర్చి కొనుగో లు చేస్తున్నారని ఆరోపించాడు. రవాణా ఖర్చులు కూడా రాలేదని వాపోయాడు. దీంతో పొలంలోనే పంటను వదిలేశానని కంటతడి పెట్టుకున్నాడు. పెట్టుబడి మొత్తం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అప్పులు మిగిలాయని, వడ్డీ కట్టలేని పరిస్థితితో ఉన్నట్లు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వెంకటేశం కోరాడు.● గిట్టుబాటు ధర రాక పొలంలోనే వదిలేసిన టమాటా పంట ● ఆందోళనలో రైతులు -
ఘనంగా నిర్వహిద్దాం
● స్వాతంత్య్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయండి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ప్రధాన వేదిక, వీఐపీల గ్యాలరీ, వివిధ శాఖల స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షం పడే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదన్నారు. వేడుకల విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంలో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, అటవీ శాఖ జిల్లా అధికారి విశాల్ బత్తుల, డీఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ ఫర్హీన బేగం తదితరులు పాల్గొన్నారు. జిల్లా జనగణన హ్యాండ్ బుక్తో ప్రయోజనం జిల్లా జనగణన హ్యాండ్ బుక్ తయారీకి అవసరమైన అన్ని వివరాలు సేకరించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా జనగణన హ్యాండ్ బుక్ తయారీపై సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారి జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా సమగ్ర సమాచారంతో హ్యాండ్ బుక్ తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, సీసీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున రైతులను అప్రమత్తం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శుక్రవారం నగరం నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాలం సాగు, వన మహోత్సవం, పంట కుంటలు, స్మార్ట్ రేషన్ కార్డుల జారీపై సమీక్ష చేశారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎల్నినో నేపథ్యంలో పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు, వనమహోత్సవం లక్ష్యాలపై ఆదేశాలు జారీ చేశారు. -
బురద రోడ్డు.. ఆపై గొయ్యి
పూడూరు: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఛిద్రమవుతున్నాయి. ఏ మాత్రం ఆదమర్చినా ప్రమాదం బారిన పడకతప్పదని ఇక్కడ చూస్తున్న చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. పూడూరు మండలం చన్గోముల్– మన్నెగూడ ఆర్ఆండ్బీ రహదారి.. కల్వర్టు ప్రాంతంలో రూపం కోల్పోయింది. పూర్తిగా గోతులు ఏర్పడి, నీరు చేరింది. అడుగుతీసి పెట్టలేనంతగా బురద పేరుకుపోయింది. కల్వర్టు వద్ద భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే భయంభయంగా ఉందని పేర్కొంటున్నారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే కల్వర్టు గుంత వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు.. రోడ్డు మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అభ్యంతరాలుంటే తెలపండి
అనంతగిరి: ల్యాబ్ టెక్నీషియన్, సూపర్వైజర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను ఆన్లైన్లో పొందుపరిచినట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్, సూపర్వైజర్పోస్టుల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో పొందుపరచడం జరిగిందన్నారు. సెలవు దినాల్లో కూడా ఆఫీసు పనివేళలల్లో అభ్యంతరాలను స్వీకరించడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. నవాబుపేట: మండలంలోని గొల్లగూడ రైల్వే స్టేషన్ గేటు ఏడు రోజులపాటు మూసి వేయనున్నట్లు ఆ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10నుంచి 17వ తేదీ వరకు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎందుకు గాను ఏడు రోజులపాటు రైల్వే గేటును మూసి వేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు వివిధ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. శంకర్పల్లి: బండ్ల బోనాల జాతరలో ఘర్షణకు దిగిన 15 మందిని శంకర్పల్లి పోలీసులు శుక్రవారం బైండోవర్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు ఫత్తేపూర్లో ఈనెల 6నుంచి 10వ తేదీ వరకు బండ్ల బోనాల జాతర నిర్వహిస్తున్నారు. గురువారం వార్డులోని రెండు వర్గాల మధ్యన ఘర్షణ తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు వారికి చెదరగొట్టారు. శుక్రవారం మళ్లీ గొడవ జరగ్గా.. పోలీసులు 15మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేవెళ్ల కోర్టు అనుమతితో వారిని తహసీల్దార్ ముందు హాజరు పరిచి, బైండోవర్ చేసి వదిలేశారు. మళ్లీ గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. కేశంపేట: మండల పరిధిలోని అల్వాల గ్రామ శివారులోని తులవానిగడ్డ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న ఆవుల మందను లారీ ఢీకొన్న ఘటనలో ఒక ఆవు మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. తులవానిగడ్డకు చెందిన సంగనమోని నరేష్ వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.ఉదయం ఆవుల మంద రోడ్డు దాటుతుండగా ఎక్లాస్కాన్పేట నుంచి కేశంపేట వైపు వెళ్తున్న లారీ వాటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. లారీని నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, ఆవు మృతికి కారణమైన లారీ డ్రైవర్ సాబేర్పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నరహరి తెలిపారు. కేశంపేట: పొలం నుంచి ఇంటికి వచ్చేందుకు రోడ్డు పక్కన నిల్చున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో గాయాలైన సంఘటన మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి నర్సింహారెడ్డి తన పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం రోడ్డుపైన నిల్చున్నాడు. అటువైపు నుంచి బైక్పై వెళ్తున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ని ఢీకొట్టారు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయమై బాధితుడి కుమారుడు రాజేందర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు. -
సిమెంట్ ఫ్యాక్టరీలో విద్యుత్ షాక్
తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో విద్యుత్ షాక్కు గురై ఇద్దరు రైల్వే కార్మికులు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ సిబ్బంది, ఆస్పత్రి వర్గాల వివరాల ప్రకారం.. పట్టణంలోని రైల్వే కాలనీలో నివాసముంటున్న రాహుల్ రాథోడ్, కరుణాకర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ హైటెన్షన్ విభాగంలో మెకానిక్లుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధులకు వెళ్లిన వీరు పనులు చేస్తుండగా షాక్కు గురయ్యారు. గమనించిన కార్మికులు వీరిని అంబులెన్స్లో తాండూరులోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఫ్యాక్టరీ హెచ్ఆర్ ప్రతినిధి శ్రీకాంత్ను అడగగా.. సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు కాదన్నారు. గూడ్స్ రైలుకు సంబంధించి రైల్వే కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న కార్మికులని చెప్పారు. ఇద్దరు రైల్వే కార్మికులకు గాయాలు -
విదేశీ పర్యటనలో టీఆర్ఆర్
పరిగి: అమెరికా పర్యటనలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి బీజీగా ఉన్నారు. ఆటా(అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభలో ప్రభుత్వం తరుఫున మంత్రులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అక్కడి తెలుగు వారితో ఈ నెల 10వ తేదీ వరకు ముగియనున్న సర్ కార్యక్రమంపై చర్చించారు. జూమ్ మీటింగ్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారం పూరించి, ఆన్లైన్ విధానంతో తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలైన ప్రవాస భారతీయులతో మాట్లాడానని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు వివరించారు. బొంరాస్పేట: మండల పరిధి గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి. లింగన్పల్లి గ్రామ అధ్యక్షుడిగా ఈడ్గి రమేశ్, జానకంపల్లి– గోపాల్, మహంతీపూర్– తలారి అంజిలయ్య, వడిచర్ల– రఘునందన్రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇందులో సర్పంచ్ గోపాల్రెడ్డి, పార్టీ నాయకులు మహిపాల్, కాశప్ప, జానకంపల్లి అంజిలయ్యలు ఉన్నారు. అనంతగిరి: వికారాబాద్ అనంతగిరిగుట్టకు శుక్రవారం పర్యాటకులు తరలివచ్చారు. అనంతపద్మనాభ స్వామిని, బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇందులో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలు పరిపూర్ణ, నిజామాబాద్కు చెందిన 22 మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. మర్పల్లి: ముర్రుపాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని బూచన్పల్లి సర్పంచ్ వెంకట్రామ్ రెడ్డి అన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవంలో ఆయన మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రు పాలు పట్టించాలని సూచించారు. ఉప సర్పంచ్ శెఖుల్, అంగన్వాడీ కార్యకర్తలు అనుసూజ, సరోజ, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు. బొంరాస్పేట: రైతులకు ఎరువుల పంపిణీని మరింత పాదర్శకం, సులభతరం చేసేందుకు నూతనంగా ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని దుద్యాల మండల వ్యవసాధికారి తులసి తెలిపారు. శుక్రవారం దుద్యాల మండలం హకీంపేట, పోలెపల్లి గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణ నిర్వాహకులకు అవగాహన కల్పించారు. కొందుర్గు: పొట్టకూటి కోసం వందల మైళ్లు దాటుకొని వచ్చి జీవన పోరు సాగిస్తున్న ఓ వలస కూలీని పాముకాటు బలిగొంది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కొందుర్గులో చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన శాంతమ్మ(45), రంగస్వామి దంపతులు. వీరితోపాటు మరో పదిమంది వారం రోజుల క్రితం కూలి పనుల కోసం లూర్దునగర్కు చెందిన పోతిరెడ్డి శౌరెడ్డి వద్దకు వచ్చారు. శుక్రవారం అందరూ కలిసి ఉమ్మెంత్యాల గ్రామంలో శౌరెడ్డికి చెందిన కౌలుకు తీసుకొని సాగుచేసిన పత్తి పంటలో కలుపు తీయడానికి వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం శాంతమ్మను పెంజర పాము కాటు వేసినట్లు తోటి కూలీలు గమనించారు. వెంటనే చికిత్స కోసం కొందుర్గు పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేర నియంత్రణకు నిరంతరం కృషి
మహేశ్వరం: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం తుక్కుగూడలోని మహేశ్వరం జోన్ డీసీపీ కార్యాలయంలో ఏసీపీలు, సీఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించి నేరరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, మహిళలపై నేరాలు, పీడీ యాక్ట్, రౌడీషీటర్ల వ్యవహారాలు, సైబర్ నేరాలు, సీసీటీవీ కవరేజ్, కాల్ డిటైల్ రికార్డులు (సీడీఆర్), గ్రేవ్ కేసుల దర్యాప్తును ప్రాధాన్యతగా పూర్తి చేయాలని సీఐలను ఆదేశించారు. అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై సమర్థవంతమైన నిఘా, సీసీటీవీ వ్యవస్థల బలోపేతం, విజిబుల్ పోలీసింగ్ అమలు, శాంతిభద్రతల కట్టుదిట్టమైన నిర్వహణపై అన్ని ఎస్హెచ్ఓలకు దిశానిర్దేశం చేశారు. కేసుల ఛేదన రేటును పెంచేందుకు వృత్తిపరమైన, ఫలితాల ఆధారిత దర్యాప్తు విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, మహేశ్వరం జోన్కు చెందిన సీఐలు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి -
108కు తప్పుడు సమాచారం
ధారూరు: 108 సిబ్బందికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామానికి వెళ్లిన వారిపై ఓ మందుబాబు దాడికి పాల్పడిన ఘటన ధారూరు మండలం రాజాపూర్లో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బంటు నర్సింహులు 108కు ఫోన్చేసి మా ఫ్రెండ్స్ కొట్టుకున్నారు, గాయాలయ్యాయి, వారిని ఆస్పత్రికి తరలించాలని చెప్పాడు. దీంతో దోమ, బొంరాస్పేట్ మండలాలకు చెందిన రెండు 108 వాహనాలు రాజాపూర్ చేరుకున్నాయి. గాయపడిన వారు ఎక్కడున్నారని కల్లు దుకాణంలో కూర్చుని తాగుతున్న నర్సింహులును ప్రశ్నించారు. తాగిన మైకంలో సిబ్బందిని నానా బూతులు తిడుతూ, ఈఎన్టీ నిఖిల్పై దాడిచేసి కొట్టాడు. రక్తగాయాలైన బాధితుడు ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. మెడకింది భాగంలో గాయాలు తొడకింది భాగంలో గాయం రెండు అంబులెన్స్లతో వెళ్లిన సిబ్బందిపై మందుబాబు దాడి కేసు నమోదు చేసిన ధారూరు పోలీసులు -
పంచాయతీ కార్మికుడిపై దాడి
కొందుర్గు: మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామంలో రోడ్డుకు అడ్డంగా నిలిపిన ట్రాక్టర్ను తొలగించాలని కోరిన గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు బేగరి యాదయ్యపై దాడి జరిగిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. చెత్త సేకరణ కోసం ట్రాక్టర్తో గ్రామంలోకి వెళ్లిన యాదయ్యకు, కబీరు భూషయ్య తన ట్రాక్టర్ను రోడ్డుపై నిలిపి ఎరువుల బస్తాలు దింపుతున్నాడు. బస్తాలు దింపిన అనంతరం కూడా ట్రాక్టర్ను తొలగించకపోవడంతో యాదయ్య దానిని పక్కకు తీసేయాలని కోరాడు. దీంతో భూషయ్య, అతని కుమారుడు వీరేశం కలిసి యాదయ్యపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. -
ఎంపీడీఓ కార్యాలయంలో మాజీ సర్పంచ్ హల్చల్
బషీరాబాద్: పాత పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నంద్యానాయక్తండాకు చెందిన మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్ శుక్రవారం బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో హల్చల్ చేశాడు. ప్రస్తుత సర్పంచ్ సుమ్మీబాయి, ఆమె భర్త శ్రీనునాయక్ తన బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హడలెత్తించాడు. దీంతో కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా అధికారులపై దుర్భాషలాడుతూ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించాడు. ఇదిలా ఉండగా తనను చంపేస్తానని శంకర్ రాథోడ్ బెదిరించాడని పంచాయతీ కార్యదర్శి దశరథ్ ఎంపీడీఓ సంపత్కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మాజీ సర్పంచ్ను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. -
ధర్మన్నగూడలో స్వల్ప ఉద్రిక్తత
యాచారం: మండల పరిధిలోని ధర్మన్నగూడలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉప సర్పంచ్ నాగరాజు గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన బండ చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనివాస్లు పనులను అడ్డుకుని ఉప సర్పంచ్తో వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం మేరకు యాచారం పోలీసులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. దాడిపై ఉప సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
సమస్యల పరిష్కారం.. పీఆర్టీయూ లక్ష్యం
దోమ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ నిరంతరం పోరాడుతుందని యూనియన్ మండల అధ్యక్షుడు ఆర్.కేశవులు, ప్రధాన కార్యదర్శి బి.ప్రవీణ్ సింగ్ అన్నారు. శుక్రవారం మండల పరిధి వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డి.అమర్నాథ్ మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ పునరుద్ధరణ, పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన నేపథ్యంలో సెప్టెంబర్ 1న చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కిష్టాపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు లాల్య నాయక్, రాష్ట్ర బాధ్యులు గోపాల్, కుందేటి వెంకటయ్య, పాండు, జిల్లా బాధ్యులు వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డి, విజయ్ కుమార్, భీమ్య నాయక్, ప్రవీణ్ కుమార్, శ్రీశైలం, మండల బాధ్యులు వెంకటాచారి, సేవ్య నాయక్, సూరి, శ్రీనివాస్, అనంతయ్య, సత్యనారాయణ, యాదగిరి, మహబూబ్, కృష్ణ, సతీష్, రామచంద్ర రెడ్డి, చైతన్య, రాజ్ కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
పహడీషరీఫ్: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడిని టిప్పర్ వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పహడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన యెద్దుల ఇంద్రారెడ్డి(23) నగరంలోని టీకేఆర్ కమాన్ వద్ద నివాసముంటూ ఆర్జీఐ విమానాశ్రయంలో టెక్నీషియన్గా విధులు నిర్వహి స్తున్నారు. కాగా ఇంద్రారెడ్డి శుక్రవారం తెల్లవారుజామున ఎల్బీనగర్ నుంచి ఆర్జీఐ విమానాశ్రయానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. మార్గమధ్యలో విద్యాదయాని కళాశాల వద్ద రాగానే వెనుక నుంచి వేగంగా నిర్లక్ష్యంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన ఇంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్రం
తుర్కయంజాల్: జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ కోరారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూర్, తుర్కయంజాల్ డివిజన్లలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కరపత్రాలను అందజేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణలను వేగంగా అమలు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను తొలగించారని మండిపడ్డారు. వాటి స్థానంలో కార్పొరేట్లకు, పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ఫైనల్ రూల్స్ నోటిఫై చేసిందని పేర్కొన్నారు. రోజువారి పనిదినాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని ఆరోపించారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు అరుణ్కుమార్, కార్మికులు కృష్ణ, సాలయ్య, రవి, వెంకట్రెడ్డి, గోపాల్, సంతోష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కిషన్ -
పట్టాభూముల్లో ఎంజాయ్మెంట్ సర్వే
బొంరాస్పేట: దుద్యాల్ మండలం ఈర్లపల్లి, సండ్రకుంటతండా, నాన్యానాయక్తండాల్లో రెండో రోజు శుక్రవారం ఎంజాయ్మెంట్ సర్వే చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బలగాల పహారాలో నిర్వహించారు. ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు ఇస్తున్న బాధిత రైతులకు.. ప్రభుత్వం న్యాయం చేస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. 148 ఎకరాల్లో పట్టాభూముల్లో సర్వే చేశామని తహసీల్దార్ కిషన్నాయక్ తెలిపారు. సర్వే అనంతరం నెగోషియేషన్ కమిటీలో రైతుల పరిహారం నిర్ణయించడం జరగుతుందన్నారు. సర్వేలో నాలుగు బృందాలు పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో తహసీల్దారు, సర్వేయర్, ఆర్ఐ, బీఎల్ఓల చొప్పున 16మంది అధికారులు తహసీల్దారు కిషన్నాయక్ ఆధ్వర్యంలో.. ప్రక్రియ నిర్వహించారు. -
కరెంటుతో ఆటలొద్దు
● రైతులు, వినియోగదారులుస్వయం మరమ్మతులు చేయొద్దు ● అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అవగాహన కల్పించాలి ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఏ సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయో తెలియదు. తప్పని పరిస్థితిలో కొంత మంది రైతులు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, మోటార్ల వద్ద స్వయంగా మరమ్మతులు చేస్తుంటారు. అలా చేయకుండా అవగాహన కల్పించాలి. – అర్జున్రెడ్డి, రైతు, శివారెడ్డిపల్లి జాగ్రత్తలు తప్పనిసరి కరెంటు సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ లైన్మెన్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. పొలాల్లో తీగలు వేలాడినా, కిందికి జారిపడినా, ట్రాన్స్ఫార్మర్ నడవకపోయినా వెంటనే సమాచారం ఇవ్వాలి. రైతులు నేరుగా మరమ్మతులు చేయడం ప్రమాదకరం. – అహ్మద్, విద్యుత్ ఏఈ, దోమ దోమ: వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో కరెంటు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇళ్ల వద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోరుబావులు, వాగులు, పొలాల వద్ద విద్యుత్ మోటర్ల ద్వారా రైతులు పంటలకు నీళ్లు అందిస్తారు. విద్యుత్ వినియోగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. మూడింటికే పరిహారం.. విద్యుత్ సంస్థలు కేవలం ప్రాణ నష్టాలకు మాత్రమే పరిహారం అందిస్తాయి. మనుషులు, పశువులు మరణిస్తే ఆర్థిక సాయం అందుతుంది. కానీ గాయాలపాలైతే ఎలాంటి పరిహారం రాదు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మనుషులు చనిపోతే రూ.8 లక్షలు, ఆవులు, గేదెలు మృతి చెందితే రూ.45 వేలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడితే రూ.5 వేల చొప్పున పరిహారం అందిస్తాయి. ప్రమాద స్థలంలోని ఫొటోలతో పాటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, శవ పంచనామా రిపోర్ట్ను సంబంధిత శాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. మూగజీవాలకై తే ఫొటోలతో పాటు వెటర్నరీ డాక్టర్ పోస్టుమార్టం నివేదిక తప్పనిసరి. పరిహారం వీరికే.. ● అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగి కింద పడినప్పుడు వాటికి తగిలి మనుషులు, పశువులు మరణిస్తే నష్ట పరిహారం అందిస్తారు. ● ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు వాటికి తగిలి మృతి చెందిన ఘటనల్లోనూ పరిహారం అందుతుంది. ● తక్కువ ఎత్తులో వేలాడుతున్న తీగలు తగిలి మృత్యువాత పడినా ఇది వర్తిస్తుంది. పాటించాల్సిన జాగ్రత్తలు.. ● బావిలోని మోటర్లను నేలపై కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెలపై ఏర్పాటు చేసుకోవాలి. ● స్టార్టర్ బోర్డు తడవకుండా చూసుకోవాలి. ● మోటార్లు నడవకపోయినా, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైనా సంబంధిత మెకానిక్లను పిలిపించి, బాగు చేయించాలి. ● సర్వీస్ వైర్లు, మోటర్కు నాణ్యమైన తీగలు వాడాలి. ● వైర్లు దెబ్బతింటే వెంటనే వాటికి టెపు వేసేలా చర్యలు తీసుకోవాలి. ● సబ్ మెర్సిబుల్ మోటార్లలో వైరు తెగితే పైన ఉండే వస్తువుల వరకూ విద్యుత్ సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. పైన ఉండే పైపులు, స్టార్టర్ డబ్బాలను నేరుగా పట్టుకోకుండా, చేతితో తాకి పరీక్షించాలి. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రత్యేక దృష్టి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఈ మేరకు గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లిలోని దుర్గాకన్వెన్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. సమావేశానికి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్లమెంట్ ఇన్చార్జులు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నమోదు ప్రక్రియలో ఎక్కడా.. ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. నాయకులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని, పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకొని ప్రతి గ్రాడ్యుయేట్ను కలవాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
కట్టెల వ్యాపారం పేరిట కోట్లు స్వాహా
మోమిన్పేట: కట్టెల వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఓ వ్యక్తి ఆశ చూపి కోట్ల రూపాయలు కాజేశాడు. ఈ ఘటన మోమిన్పేటలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం డ్రైవర్ కాలనీకి చెందిన అజారొద్దీన్ కొన్నేళ్ల నుంచి మోమిన్పేటలో కట్టెల వ్యాపారం చేస్తూ ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. చుట్టు పక్కల వారితో పరిచయం పెంచుకున్నాడు. కట్టెల వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టాడు. దీంతో పలువురు రూ.లక్షల్లో డబ్బులు కట్టారు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఈ నెల 3వ తేదీ డబ్బులిచ్చిన వారందరికీ అజారొద్దీన్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. వ్యాపారంలో కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, తాను తిరిగి వచ్చిన తర్వాత అందరికీ డబ్బులు చెల్లిస్తానని మెసేజ్ పెట్టి సెల్ఫోన్లో సిమ్ కార్డు తీసేశాడు. ఈ నెల 4న బాధితులు అజారొద్దీన్ ఇంటికి వెళ్లారు. అప్పటికే సదరు వ్యక్తి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఇంటి యజమానికి ఆరు నెలల అద్దె తోపాటు అతని వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోమిన్పేటకు చెందిన మరో వ్యక్తి ఫైసల్ కట్టెల వ్యాపారంలో రూ.66 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అందులో రూ.22 లక్షలు అజారొద్దీన్ తిరిగి చెల్లించాడు. మరో రూ.44 లక్షలు ఇవ్వాల్సి ఉందని ఫైసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరికొంత మంది బాధితులు కూడా ఉన్నట్లు తెలిసింది. పలువురి నుంచి భారీగా డబ్బు తీసుకున్న నిందితుడు రూ.3 కోట్లతో పరారీ ఆలస్యంగా వెలుగులోకి.. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు -
‘ఏక్ పేడ్ మాకే నామ్’ ప్రారంభం
నవాబుపేట: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం తమ బాధ్యతగా భావించాలని మండలంలోని మీనపల్లి కలాన్ సర్పంచ్ వెంకటమ్మ అన్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పొలాల వద్ద, రహదారుల పక్కన కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.వెంకటరత్నం, వార్డు సభ్యురాలు లక్ష్మమ్మ, యువకుడు రమేష్, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, గోవిందమ్మ, వెంకటయ్య, విజయ్, మాణిక్య ప్రభు, మల్లేష్, రవీందర్, శ్రీలత, గ్రామ కార్యదర్శి వరలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు అరుణ జ్యోతి, దేవమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల నిరసన మంచాల: తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అవమానానికి గురిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. జాపాల జీపీ కార్యదర్శి మురళీమోహన్చారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అవమానపర్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తక్షణమే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి బొల్లారం: తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ సుభాష్నగర్కు చెందిన నర్సింగరావు కుమారుడు తేజస్ (19) బొల్లారంలోని ఎల్ఆర్ఎంజీ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అల్వాల్కు చెందిన కన్నయ్య కుమార్ (18)తో కలిసి గురువారం ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్తుండగా లాల్బజార్ కల్లుకంపౌండ్ సమీపంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న తేజస్ అక్కడికక్కడే మృతి చెందగా, వాహనం నడుపుతున్న కన్నయ్య కుమార్కు రెండు చేతులు విరిగాయి. చిక్కడపల్లి: పోక్సో కేసులో న్యాయవాది మల్లేష్కు మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి 12వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 2021లో చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బాలికను దూషిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తరచుగా వేదిస్తున్నారని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజు వు కావడంతో బుధవారం మల్లేష్కు జైలు, జరిమానా విధించారని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ మధుబాబు గురువారం తెలిపారు. -
‘బ్లూకోట్’తో నిలిచిన ప్రాణం
● చనిపోతున్నానని డయల్ 100కు ఫోన్ చేసిన యువకుడు ● సకాలంలో స్పందించి, రక్షించిన బ్లూకోట్ కానిస్టేబుళ్లు యాలాల: ‘అప్పులు ఎక్కువయ్యాయి.. ఇక బతకాలని లేదు.. అందుకే రైలు కిందపడి చనిపోవాలనుకుంటున్నా’ అని ఓ యువకుడు 100 నంబర్కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన బ్లూకోట్ కానిస్టేబుళ్లు సదరు వ్యక్తి ఫోన్ నంబర్ లొకేషన్ను ట్రేస్ చేస్తూ.. రైలు పట్టాలపై కనిపించిన అతన్ని కాపాడి, అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని కోకట్ శివారులో జరిగింది. గ్రామానికి చెందిన అక్తర్ పాష బుధవారం రాత్రి వేళ కోకట్ శివారు నుంచి రైల్వే పట్టాల వద్దకు చేరుకొని, తనకు అప్పులు ఎక్కువయ్యాయని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నానని 100కు ఫోన్ చేసి చెప్పాడు. హెడ్క్వార్టర్స్ నుంచి వచ్చిన డయల్ 100 అలర్ట్ కాల్తో అప్రమత్తమైన బ్లూకోట్ కానిస్టేబుళ్లు ప్రశాంత్రెడ్డి, జగదీశ్.. పాష సెల్ ఫోన్ నంబర్ను ట్రేస్ చేస్తూ, అతనితో ఫోన్ మాట్లాడుతూ.. రైలు పట్టాల వద్దకు చేరుకుని, అతన్ని పట్టుకున్నారు. కుటుంబ సభ్యులను పిలిపించి, గ్రామస్తుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. సకాలంలో స్పందించిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్ఐ విఠల్రెడ్డి అభినందించారు. టీజీ సీపీ గెట్లో అశ్వినికి 23వ ర్యాంక్ దోమ: ఇటీవల విడుదలైన టీజీ సీపీ గెట్ –2026 ఫలితాల్లో దోమ మండలం, శివారెడ్డి పల్లికి చెందిన దర్పల్లి అశ్విని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంఎస్సీ ఫిజిక్స్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించారు. అశ్వినిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, బంధువులు, స్నేహితులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బంగారు దుకాణంలో చోరీ 10 గ్రాముల నెక్లెస్ మాయం తాండూరు టౌన్: పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో చోరీ జరిగింది. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాంధీచౌక్ సమీపంలోని గంజిపల్లి సాయి జ్యుయెల్లర్స్కి గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు వచ్చారు. షోకేస్లోని 10 గ్రాములు నెక్లెస్ను చూపించాలని కోరారు. తర్వాత మరొకటి చూపించాలని అడగగా వర్కర్ లోపలికి వెళ్లాడు. వెంటనే నక్లెస్ను బ్యాగులో వేసుకున్నారు. తర్వాత ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. యజమాని షోకేస్లోని నక్లెస్ లేకపోవడాన్ని గుర్తించాడు. వెంటనే సీసీ ఫుటేజీని పరిశీలించగా మహిళలు చోరీ చేసినట్లు నిర్ధారించుకున్నారు. యజమాని ఠాకూర్ అమన్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పంద్రాగస్టు నాటికి యూనిఫాంల పంపిణీ బషీరాబాద్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి యూనిఫాంలు అందజేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి తెలిపారు. గురువారం బషీరాబాద్ ఎంపీపీఎస్లో టీచర్లతో కలిసి విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే తొలి జత యూనిఫాంల పంపిణీ పూర్తయిందని, రెండో జత కుట్టు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని వివరించారు. ప్రభుత్వం సరఫరా చేసిన వస్త్రంతో ఒక్కో విద్యార్థికి రూ.74 వ్యయంతో మహిళా సంఘాలే యూనిఫాంలను కుట్టి అందిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అస్మాఖతామ్, ఉపాధ్యాయులు చంద్రకళ, ఐఆర్పీ జ్యోతి, మహిళా సంఘాల ప్రతినిధి భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. సాగుకు అడ్డు తగులుతున్న వ్యక్తి అరెస్ట్ మోమిన్పేట: పంట సాగుకు అడ్డు పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ భరత్భూషణ్ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలోని బూర్గుపల్లికి చెందిన మేక ల శ్రీనివాస్, మేకల నగేశ్, మేకల శోభరాణి గత నెల 27న అదే గ్రామానికి చెందిన మంతెన కృష్ణం రాజు భూమిలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పారిశ్రామిక వాడ భూముల్లో సర్వే
కొడంగల్: దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడలో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని రెవెన్యూ అధికారులు అన్నారు. కలెక్టర్ దీపక్తివారి ఆదేశాల మేరకు గురువారం ఈర్లపల్లి, సండ్రకుంటతండా, నాన్యానాయక్తండాల్లో భూ ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి 16మంది అధికారులు తహసీల్దార్ కిషన్నాయక్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. కబ్జాలో ఉన్న పలువురు రైతులకు పట్టాలు లేవని, పట్టా ఉన్న కొంతమంది కబ్జాలో లేరని గుర్తించారు. సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిగి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐలు శ్రీశైలం, సత్యనారాయణ, వేణుకుమార్, తహసీల్దార్లు మునీరొద్దీన్, విజయ్కుమార్, లక్ష్మీనారాయణ, స్థానిక డీటీ శివకుమార్, ఆర్ఐలు నవీన్, సంజయ్కుమార్, వెంకట్ రమణ, సుదర్శన్, గోవర్ధన్, సర్వేయర్లు మహేశ్, హేమలత, భాగ్యస్వాతి, మహేశ్, జీపీవోలు గోపాల్, రమేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
దౌల్తాబాద్: స్థానిక రైతువేదికలో గురువారం ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేకాధికారి పంచాయతీరాజ్ డీఈ సురేష్బాబు హాజరై మాట్లాడారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మండలంలోని సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించగా సర్పంచులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. పీఆర్డీఈ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామైక్య సంఘాల భవనాల నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భూగర్భజలాల పెంపునకు జలసిరి కార్యక్రమం కింద నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు వెంకట్స్వామి, వైద్యాధికారిణి అమూల్యప్రియదర్శిని, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పోరుబాట
వికారాబాద్: అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూమిపూజ చేసి ప్రారంభించకుండా వదిలేసిన పనులపై వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పార్టీ క్యాడర్తో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సొంత నియోజకవర్గం నుంచే నిరసనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మంజూరై నిర్లక్ష్యానికి గురవుతున్న పలు పనులతో పాటు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో శిలాఫలకాలు వేసి పనులు చేపట్టని పనులపై ఉద్యమిస్తున్నారు. బుధవారం బీఆర్ఎస్ నేతలు వికారాబాద్ పట్టణంలో శిలాఫలకాల వద్ద కేక్కట్ చేసి రెండవ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సీఎం వివక్షపై గళం ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే తన సొంత నియోజకవర్గం కొడంగల్ సమగ్రాభివృద్ధి కోసం కడా(కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అయితే మిగతా నియోజకవర్గాలు వికారాబాద్, పరిగి, తాండూరుపై వివక్ష చూపారనే విమర్శలు వచ్చాయి. ఏడాది క్రితం జిల్లా పరిధిలోని అన్ని జీపీలు, మున్సిపాలిటీలను కలుపుతూ వుడా(వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. జీఓ మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదని ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వుడా అంశంపై కూడా బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది. కడా తరహాలోనే వుడాను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. ఏడాదిన్న కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. పరిగి – వికారాబాద్, పరగి – షాద్నగర్ రోడ్లు మినహా మిగతా ఏ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కొడంగల్ మినహా మిగతా మూడు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి పరిధిలో పెద్దగా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు విజయం కోసం భారీగా శ్రమించాల్సి వచ్చింది. జిల్లాలో అనేక రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. పనుల జాప్యంపై ఎమ్మెల్యేలు సైతం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటిపై బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో పోరుబాటకు సిద్ధమైంది. ప్రభుత్వ వైఖరి, వివక్షపై గళం వినిపించేందుకు ఆ పార్టీ నేతలు కార్యాచరణ రూపొందించారు. పెండింగ్ పనులపై వినూత్న నిరసన శిలాఫలకాలకు పుట్టిన రోజు వేడుకలు స్పీకర్ నియోజకవర్గం నుంచే మొదలు సీఎం వివక్ష ధోరణిపై నేతల మండిపాటు వికారాబాద్ పట్టణంలో ఏడాది క్రితం ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణానికి భూమిపూజ చేసి వదిలేశారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి నుంచి గెరిగేట్పల్లి మీదుగా వెళ్లే రోడ్డు పనులకు శిలాఫలకం వేసి ఏడాది పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. కొత్తగడి నుంచి మద్దులపల్లి బీటీ రోడ్డు శిలాఫలకానికే పరిమితమైంది. వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు పనులు ప్రారంభం కాగా కాంగ్రెస్ వచ్చాక నిలిచిపోయాయి. హైదరాబాద్, పరిగి తదితర ప్రాంతాలకు వెళ్లేందుక కనెక్టివిటీగా ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేయగా పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. మోమిన్పేట మండలం ఎన్కెతల గ్రామంలో ఏడాది క్రితం పారిశ్రామిక వాడ ఏర్పాటుకు శిలాఫలకం వేసి వదలేశారు. తాండూరు – వికారాబాద్ మధ్య బీటీ రోడ్డు మంజూరైందని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి రెండేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. తాండూరులో పారిశ్రామిక వాడకు ఏడాది క్రితం శిలాఫలకం వేసి వదిలేశారు. తాండూరు నియోజకవర్గం రాంపూర్ తండా, కరన్కోట్, జీవన్గీ రోడ్లు పూర్తి కావడం లేదు. పరిగి మున్సిపల్ పరిధిలో రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు శిలాఫలకాలు వేసి ఏడాది దాటింది. పరిగి – లఖ్నాపూర్ రోడ్డు పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. గడిసింగాపూర్ – రంగారెడ్డిపల్లి రోడ్డు పనులను ప్రారంభించి వదిలేశారు. -
తప్పుడు నివేదికతో తప్పించారు
బషీరాబాద్: సీ్త్రనిధి రుణాల బకాయిలను వసూలు చేసి దుర్వినియోగం చేశారంటూ తమపై సస్పెన్షన్ వేటు వేయడం వెనక ఆడిటర్ల తప్పుడు నివేదికలే కారణమని ఎక్మాయి గ్రామ మహిళా సమాఖ్య వీఏఓలు స్వప్న, వాణీశ్రీ ఆరోపించారు. తాము వసూలు చేసిన డబ్బులను సీ్త్రనిధి ఖాతాల్లో జమ చేసినప్పటికీ వాటిని లెక్కల్లో చూపకుండా, మహిళల వద్ద ఉన్న మొండి బకాయిలను తమపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్మాయిలో విలేకరులతో మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బులు వాడుకున్నట్లు రాయించుకున్నారు ఎక్మాయి గ్రామ సమాఖ్య వీఏఓ– 1 స్వప్న మాట్లాడుతూ.. తన పేరుపై రూ.4.58 లక్షల బకాయి చూపించారని తెలిపారు. అందులో రూ.2 లక్షలను జూలై నెలలోనే సీ్త్రనిధి ఖాతాలో జమ చేశానని చెప్పారు. మిగిలిన రూ.2.58 లక్షలు ఏడు సంఘాలకు చెందిన ఎనిమిది మంది మహిళల వద్ద మొండి బకాయిలుగా ఉన్నాయని వివరించారు. ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తానే డబ్బులు వాడుకున్నట్లు లేఖ రాయించుకుని ఆడిటర్ సంగీత అన్యాయం చేశారని ఆరోపించారు. మొండిబకాయిలను లెక్క చూపారు వీఏఓ– 2 వాణీశ్రీ మాట్లాడుతూ.. తన పేరుపై రూ.3.05 లక్షల బకాయి ఉన్నట్లు ఆడిటర్ సంగీత బలవంతంగా లేఖ రాయించుకున్నారని ఆరోపించారు. తాను ఇప్పటికే రూ.1.74 లక్షలను సీ్త్రనిధి ఖాతా నంబర్ 79005829606లో జమ చేశానని తెలిపారు. మిగిలిన మొత్తం బాలాజీ, అర్చన పొదుపు సంఘాలకు చెందిన మహిళల వద్ద మొండి బకాయిలు ఉందని వివరించారు. సీసీ నిర్లక్ష్యమే.. బకాయిల వసూళ్లలో జాప్యానికి అప్పటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ) రాములు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఇద్దరు వీఏఓలు ఆరోపించారు. పలుమార్లు సమాచారం ఇచ్చినా మూడు నెలల వ్యవధిలో ఒక్కరోజు కూడా గ్రామానికి వచ్చి వసూళ్లపై దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. ఆడిట్ అధికారులు, సీ్త్రనిధి యాజమాన్యం వాస్తవాలను పక్కనపెట్టి తమపై చర్యలు తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జమ చేసిన మొత్తాలకు సంబంధించిన బ్యాంకు రశీదులు, లావాదేవీల ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై పునర్విచారణ జరిపి న్యాయం చేయాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు. సూత్రధారి సీసీ రాములేనా..? ఈ వ్యవహారంలో అప్పటి సీసీ రాములే ప్రధాన సూత్రధారి అనే చర్చ ఐకేపీ వర్గాల్లో సాగుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలతో పాటు ఓ మహిళా సీసీతో సన్నిహితంగా ఉంటూ అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ అతన్ని విధుల నుంచి తొలగించారు. దీంతో ఎక్మాయి సీ్త్రనిధి వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. పునర్విచారణ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత వీఏఓలు కోరుతున్నారు. సీ్త్రనిధి అక్రమాలపై వీఏఓల ఆవేదన ఖాతాలో జమచేసిన డబ్బులు లెక్కల్లో చూపలేదని వెల్లడి రశీదులు, ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటన పెండింగ్ మొండి బకాయిలను తమపై మోపారని కన్నీటి పర్యంతం సీసీ నిర్లక్ష్యమే వీటన్నింటికీ కారణమని ఆరోపణ -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు అదృశ్యం
శంకర్పల్లి: వెల్డింగ్ కార్మికుడు అదృశ్యమైన ఘటన మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన ప్రకారం.. కేరళం రాష్ట్రానికి చెందిన అనిల్కుమార్(45) బతుకుదెరువు నిమిత్తం మోకిలకు వచ్చాడు. మిత్రుడు హేమంత్తో కలిసి ఉంటూ కొండకల్ అపర్ణ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. హేమంత్ ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. అదృశ్యమైన బాలిక తిరుపతిలో ఉన్నానని ఫోన్ పహాడీషరీఫ్: మానసిక స్థితి సరిగ్గా లేక ఐదు నెలల క్రితం అదృశ్యమైన ఓ బాలిక, తాను తిరుపతిలో ఉన్నట్లు రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. బాలాపూర్ ఎస్ఐ సోహెల్ తెలిపిన ప్రకారం.. కాచిగూడ నింబోలి అడ్డాకు చెందిన రాజు కుమార్తె పూజ(17)కు మానసిక స్థితి సరిగ్గా లేదు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రిఫరెన్స్తో ఈ ఏడాది మార్చి మొదటివారం షాహిన్నగర్ సమీపంలోని ఐఎఫ్టీ బాలికల హోమ్లో చేర్పించారు. ఇదే నెల 10న బాలిక ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. హోమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ తెలిస్తే బాలాపూర్ పీఎస్లో లేదా 87126 62366 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కుటుంబ కలహాలతో యువకుడు.. మాడ్గుల: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు అదృశ్యమైన ఘటన మాడ్గుల ఠాణా పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ వేణుగోపాల్రావు తెలిపిన ప్రకారం.. చాంద్రాయణపల్లికి చెందిన మానుపాటి నరేశ్(24)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 3వ తేదీన సాయంత్రం జరిగిన గొడవలో మనస్థాపంతో నరేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నరేశ్ తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
శంకర్పల్లి: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ‘సైబర్ జాగ్రుక్తా దివస్’లో భాగంగా ప్రాచీన్ గ్లోబల్ స్కూల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లను వినియోగించడంతో సైబర్ నేరాలు జరగుతున్నాయన్నారు. అపరిచితులు మాయమాటలు చెప్పి బ్యాంకు ఖాతాల నుంచి కోట్లు కొల్లగొడుతున్నట్లు స్పష్టం చేశారు. ఫోన్లకు వచ్చే ఓటీపీ, కాల్స్కి స్పందించొద్దని, ఇంటి పరిసరాల్లో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మోకిల ఎస్ఐ సురేశ్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సీఐ శ్రీనివాస్రెడ్డి -
డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తత అవసరం
తాండూరు టౌన్: డిజటల్ ప్రపంచంలో అప్రమత్తత ఎంతో అవసరమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. బుధవారం తాండూరులోని ఇందిరా చౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింక్లు ఓపెన్ చేయరాదని, నకిలీ పెట్టుబడి ఆఫర్లు, పార్ట్టైం ఉద్యోగాల వలలో చిక్కరాదన్నారు. ఓటీపీ, సీవీవీ వివరాలు ఎవరికీ చెప్పరాదన్నారు. సైబర్ భద్రతపై విద్యార్థులు సైతం అవగాహన పెంచుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పొరపాటున నేరగాళ్ల ఫోన్కాల్స్కు ఓటీపీ నంబర్లను చెప్పరాదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ, రూరల్ సీఐలు పరమేశ్వర్, ప్రవీణ్ కుమార్, డివిజన్ ఎస్సైలు, పలు పాఠశాలల విద్యార్థులు, పట్టణ వాసులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు సైబర్ భద్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి ఎస్పీ స్నేహ మెహ్ర -
నావంద్గీ సొసైటీలో కలకలం
బషీరాబాద్: నావంద్గీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో గోల్డ్ లోన్ మంజూరు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సంఘం బ్యాంకుకు చెందిన ఓ ఉద్యోగికి నిబంధనలకు విరుద్ధంగా బంగారు రుణం మంజూరు చేసినట్లు అనుమానం రావడంతో బుధవారం సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి జిల్లా సహకార అధికారి (డీసీఓ)కు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీఓ ఆదేశాల మేరకు లక్ష్మీనారాయణపూర్ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ డి.మమత సొసైటీలో విచారణ చేపట్టారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ డీసీసీబీ బ్యాంకులో కలెక్షన్ అధికారిగా పనిచేస్తున్న పి.రాములు ఈ నెల 4న నావంద్గీ సొసైటీలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.3.50 లక్షల రుణం పొందాడు. అయితే ఈ రుణం మంజూరులో నిబంధనలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అప్రైజర్ ద్వారా బంగారం విలువ నిర్ధారణ చేయకుండానే సీఈఓ వెంకటయ్య రుణం మంజూరు చేసినట్లు తేలింది. ఫిర్యాదుకు ముందు చైర్మన్ వెంకట్రామ్రెడ్డి సొసైటీ లాకర్, స్ట్రాంగ్రూమ్ను సీజ్ చేశారు. విచారణకు వచ్చిన లక్ష్మీనారాయణపూర్ డీసీసీబీ బ్యాంకు మేనేజర్ డి.మమత లాకర్లో ఉన్న 510 గోల్డ్ లోన్ ఖాతాలు, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విచారణలో పి.రాములు గతంలో మే 7న కూడా ఇదే సొసైటీ నుంచి రూ.3.50 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అనంతరం జులై 4న రుణాన్ని చెల్లించి, తిరిగి ఈ నెల 4న మరోసారి అదే మొత్తంలో రుణం పొందినట్లు రికార్డుల్లో తేలింది. విచారణ అనంతరం డి.మమత మాట్లాడుతూ.. గోల్డ్ లోన్ మంజూరుకు ముందు అప్రైజర్ వేదాంతచారి బంగారు ఆభరణాలను పరిశీలించి విలువ నిర్ధారించడం తప్పనిసరి అని తెలిపారు. అయితే సంబంధిత రుణం విషయంలో అప్రైజర్ పరిశీలన లేకుండానే సీఈఓ వెంకటయ్య రూ.3.50 లక్షల రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇది సహకార సంఘాల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతోనే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చైర్మన్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సహకార వర్గాలు తెలిపాయి. ఉద్యోగికి బంగారు రుణంపై అనుమానాలు డీసీఓకు చైర్మన్ ఫిర్యాదు.. లాకర్ సీజ్ విచారణ జరిపిన డీసీసీబీ మేనేజర్ నిబంధనల ప్రకారం రుణం ఇవ్వలేదని తేటతెల్లం -
ఉపాధి పథకం ఎత్తివేతకు కుట్ర
● రాష్ట్రాల వాటా ఉపసంహరించుకోవాలి ● స్పీకర్ ప్రసాద్ కుమార్ డిమాండ్ బంట్వారం: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోపించారు. బుధవారం బంట్వారం, కోట్పల్లిలో మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారు ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. వలసల నివారణ కోసం కాంగ్రెస్ తెచ్చిన ఈ పథకం పేరు మార్చడం సరికాదన్నారు. రాష్ట్రాల చెల్లింపు వాటా 40 శాతాన్ని ఉప సంహరించుకోవడంతోపాటు పాత పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు రూ.8.25 లక్షల కోట్లకు నెలనెలా రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నట్లు తెలిపారు. అయినా సంక్షేమం, అభివృద్ధి ఆపడం లేదన్నారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ పథకాలు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ సమస్యపై సర్పంచ్లు మల్లేశం, గోరేమియ, సంజీవులు ట్రాన్స్కో ఇన్చార్జ్ ఏఈని నిలదీశారు. సమస్య చెబుదామని ఫోన్ చేస్తే స్పందించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నచ్చజెప్పి సదరు ఏఈని మందలించారు. వెంటనే సమస్యల పరిష్కారాని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఎంపీడీఓలు రాములు, హేమంత్, తహసీల్దార్లు విజయ్ కుమార్, ఆనంద్ రావు, డీఎస్పీ అంజయ్య, ఎంపీఓలు నాగరాజు, సురేందర్రెడ్డి, పీఆర్ డీఈ శ్రీనివాస్, ఏఓలు కరణాకర్రెడ్డి, శ్రావ్య, హార్టీకల్చర్ ఆఫీసర్ కమల, మెడికల్ ఆఫీసర్లు మజీద్ ఖాన్, మేఘన తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే ఉన్నత శిఖరాలు
● విద్యార్థులంతా కష్టపడి చదవాలి ● పల్లవి డీఈడీ కాలేజీ కరస్పాండెంట్ కొప్పుల అనిల్రెడ్డి పరిగి: తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పల్లవి డీఈడీ కళాశాల కరస్పాండెంట్ కొప్పుల అనిల్రెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం పట్టణ కేంద్రంలోని కాలేజీలో ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం, బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. మంచి ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. విద్యతో ఏదైనా సాధ్యమనే విషయాన్ని గుర్తించి, కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. -
పంట మార్పిడితో ప్రయోజనం
ఇక్రిశాట్ ప్రిన్సిపాల్ సైంటిస్టు హరికిషన్ నందిని దౌల్తాబాద్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలబించాలని ఇక్రిశాట్ ప్రిన్సిపాల్ సైంటిస్టు హరికిషన్ నందిని సూచించారు. ఆరుతడి పంటలు పప్పు ధాన్యాల సాగు, ఆయిల్ పామ్ తోటలు పెంచాలన్నారు. బుధవారం మండలంలోని చల్లాపూర్ గ్రామంలో శాస్త్రవేత్తలు, నిపుణుల బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ పరికరాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ తులసి, ఆయిల్ పాం ఫీల్డ్ ఆఫీసర్ మల్లికార్డున్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు టౌన్/తాండూరు రూరల్: పాలిషింగ్ యూనిట్ల వద్ద ఎండు గంజాయి విక్రయిస్తున్న ఓ బీహారీని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...బీహార్ రాష్ట్రం కటిహార్ జిల్లా బైరియా గ్రామానికి చెందిన మ్మద్ ముస్తకీమ్ అనే వ్యక్తి తాండూరు మండలం గోపాన్పల్లి సమీపంలోని పాలిషింగ్ యూనిట్ల వద్ద గంజాయి విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో తాండూరు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ రాణి ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఎంఆర్ఐ ప్రేమ్ కుమార్ తుర్కయంజాల్: వరుసగా వివాదాలకు కారణమైన అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ సర్వే నెంబర్ 338లోని భూమిని స్వాధీనం చేసుకున్నామని ఎంఆర్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ భూమి పూర్తిగా రెవెన్యూ విభాగం ఆధీనంలో ఉందని.. ఎవరైనా ప్రవేశించినా, స్థలాన్ని కొనుగోలు, విక్రయాలు చేసినా, అనుమతి లేని నిర్మాణాలు చేపట్టిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం కొత్తూరు: అంత్యక్రియలు నిర్వహించిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన పాత్లావత్ నరేష్(27) జేపీదర్గాలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. గత నెల 15న దర్గా నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఉస్మానియాకు తరలించారు. బాధితుడి అన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత పోలీసులు, ఆస్పత్రి వర్గాలకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు నరేశ్ను ఇంటికి తీసుకురాగా, రెండు రోజుల క్రితం మృతిచెందాడు. దీంతో అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. నరేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తంకావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మంగళవారం ఉస్మానియా నుంచి వచ్చిన నలుగురు వైద్యుల బృందం పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించింది. ఫాక్స్కాన్ ఉద్యోగుల గదుల్లో చోరీ ఇబ్రహీంపట్నం రూరల్: ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న వియత్నాం దేశానికి చెందిన ప్రతినిధుల గదుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రమేశ్ తెలిపిన ప్రకారం. రోచీష్మతి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వియత్నాం దేశానికి చెందిన ఫాక్స్కాన్ ఉద్యోగుల గదుల్లో అదే డార్మిటరీ సూపర్వైజర్గా పని చేస్తున్న మారినేని చిన్న వెంకటరావు నగదు దొంగిలిస్తున్నాడు. ఓ ఉద్యోగి పెట్టిన స్పై కెమెరాలో చోరీకి పాల్పడిన వీడియో రికార్డయింది. రూ.7 వేలు నగదు దొంగిలిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అపార్ట్మెంట్లోని ఆరు ఇళ్లలో రూ.లక్ష వరకు నగదు అపహరించాడని బాధితులు ఫిర్యాదు చేశారని.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రమేష్కుమార్
తాండూరు: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా యూ రమేష్కుమార్ నియమితులయ్యారు. బుధవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్రావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తాండూరు నియోజకవర్గం నర్సాపూర్ గ్రామానికి చెందిన రమేష్కుమార్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. గతంలో పీఏసీఎస్ డైరక్టర్గా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. జిల్లా అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ పడగా పార్టీ అధిష్టానం రమేష్కుమార్కు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుకు, కేంద్ర మంత్రులు, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు టౌన్: పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ (బాలుర – పెద్దేముల్) గురుకుల కళాశాలలో ఇంటర్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ గ్రూపులో 12, బైపీసీలో 10 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పాట్ అడ్మిషన్కు, అర్హత, ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు. బూర్గుపల్లి గురుకులంలో.. అనంతగిరి: వికారాబాద్ మండలం బూర్గుపల్లి గురుకుల పాఠశాల, కళాశాల(బాలికలు)లో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఉషాకిరణ్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. 2026లో పదో తరగతితో ఉత్తీర్ణులైన బాలికలు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నుంచి 11వ తేదీ వరకు దోస్త్ ద్వారా డిగ్రీ స్షెషల్ ఫేజ్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెబ్ ఆప్షన్స్ ఎంపిక ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ డా. బీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. దోస్త్ చివరి దశలో చేరిన విద్యార్థులకు సైతం స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. కళాశాలలో బీఏ, బీకామ్, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, బీఎస్సీ హెల్త్కేర్ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీదేవి వికారాబాద్ డిపో వద్ద గేట్ మీటింగ్ అనంతగిరి: నష్టాల్లో ఉన్న డిపోను లాభాల్లోకి తీసుకురావడానికి డిపో కార్మికులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీదేవి సూచించారు. బుధవారం ఆమె వికారాబాద్ డిపోను సందర్శించారు. ఉద్యోగులతో గేటు మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రూ.1.50 కోట్ల నష్టాల్లో ఉన్న వికారాబాద్ డిపోను అందరం సమర్థవంతంగా పనిచేసి లాభాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఉద్యోగి మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పెయి డ్ ప్యాసింజర్ను పెంచుకోవాలని, స్పెషల్ హైర్ బుకింగ్స్ పెంచుకోవాలని యాత్ర దానం స్పెషల్ బుకింగ్ లాంటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ సరస్వతి, వికారాబాద్ డీఎం నమ్రత, షెడ్యూల్ సీఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల కొరత తీర్చండి
● సంగెంకలాన్ సర్పంచ్ మీనాక్షి ● పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన తాండూరు రూరల్: మండలంలోని సంగెంకలాన్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆ గ్రామ సర్పంచ్ మీనాక్షి డిమాండ్ చేశారు. బుధవారం పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, హెచ్ఎంతో కలిపి నలుగురు ఉపాధ్యాయులే ఉన్నారన్నారు. ఇందులో ఓ టీచర్ ప్రసూతి సెలవుల్లో వెళ్లిందన్నారు. మరో టీచర్ నాగలక్ష్మిని డిప్యూటేషన్పై దోమ మండలానికి వేశారని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతో ఏడు తరగతులు నిర్వహించడం చాలా కష్టంగా ఉందన్నారు. ఇంగ్లిష్, గణిత సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక పాఠాలు సాగడం లేదన్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాజేందర్రెడ్డి, శ్రీనివాస్, పరికప్ప, శ్రీకాంత్రెడ్డి, జగదీష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కలిసిసాగితేనే అభివృద్ధి
పరిగి: అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తానని పీఏసీఎస్ మాజీ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్ అన్నారు. ఆషాఢ బోనాలను పురస్కరించుకుని పట్టణంలోని నాలుగో వార్డు సయ్యద్మల్కాపూర్ పోచమ్మ ఆలయం చుట్టూ తన సొంత డబ్బులతో కాంక్రీట్ చిప్స్ పోయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులోని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని స్పష్టంచేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలతో పాటు ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, బురద, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాలనీ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భాగంగా తన సతీమణి, కౌన్సిలర్ చంద్రకళ వార్డు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టంచేశారు. దశలవారీగా సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. ప్రజలందరి సహకారంతోనే కాలనీ పురోగతి సాధ్యమని తెలిపారు. ఈవిషయంలో సమష్టిగా ముందుకు సాగాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్ పోచమ్మ ఆలయం చుట్టూ కాంక్రీట్ చిప్స్ డంపింగ్ -
రైతు సంక్షేమానికి ప్రాధాన్యత
నిబంధనలకు తూట్లు దౌల్తాబాద్ పీఏసీఎస్ కమిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ల వ్యవహారం రోజుకో చర్చకు దారి తీస్తోంది.● పునరావాస, పునర్నిర్మాణానికి కృషి ● భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ● కలెక్టర్ దీపక్ తివారి కొడంగల్: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటూ పునరావాస, పునర్నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. దుద్యాల మండలంలో టీజీఐసీ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు బుధవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని ఓ పంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల రైతులకు పట్టాలు అందజేశారు. హకీంపేటలో 288 మందికి, లగచర్లలో 227 మందికి, పోలేపల్లిలో 38 మందికి పట్టాలు ఇచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ మూడు గ్రామాల పరిధిలో పలు అభివృద్ధి పనులకు 1,358 ఎకరాల భూమిని సేకరించించినట్లు తెలిపారు. అందరి సహకారంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఎడ్యూకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఇండస్ట్రియల్ పార్కు వస్తుందన్నారు. హైదరాబాద్ – కొడంగల్ రేడియల్ రోడ్డుకు సహకరించాలన్నారు. రైతులకు ధన్యవాదాలు అభివృద్ధికి సహకరించి భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతులందరినీ ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్ వెంకటాచాని, అదనపు ఎస్పీ రాజేష్మీన, తాండూరు ఆర్డీఓ అనిత, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, హకీంపేట, పోలేపల్లి, లగచర్ల సర్పంచులు రవీంద్ర నర్సింహారెడ్డి, జింకల చంద్రయ్య, వెంకట్రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్ కృష్ణంరాజు, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుకు చర్యలు కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఉద్యాన, పట్టు పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్తివారి తెలిపారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంపై చర్చించారు. ప్రముఖ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, భారత ప్రభుత్వ సంస్థలు, శాస్త్రవేత్తలు, నిపుణుల బృందాలు పాల్గొన్నాయి. పంట ఉత్పత్తి విధానాలు, ఉద్యాన పంటల అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ, సాగునీటి వనరులు, మార్కెట్ అనుసంధానం, ఆహార ప్రొసెసింగ్, రైతు సంస్థలు, అనుబంధ వ్యవసాయ రంగాలపై చర్చించారు. ఇక్రిశాట్ సీనియర్ సైంటిస్ట్, నిపుణుల బృందం చైర్మన్ డాక్టర్ హరికిషన్ చిట్లపల్లిలో పర్యటించారు. అక్కడి కొడంగల్ ఫార్మర్ సర్వీస్ ప్రొడ్యూసర్ కంపెనీని సందర్శించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పర్యటన వివరాలు, తమ సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి డైరెక్టర్ డీఏఓ, ఏడీ ఉద్యాన శాఖ జేడీ శ్రీబాబు, హార్టీకల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఏ భగవాన్, డీహెచ్ఎస్ఓ ఎంఏ సత్తార్, పట్టు పరిశ్రమ జేడీ లత, డీఆర్డీఏ కొడంగల్ హెచ్ఓ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే
తాండూరు: స్థానిక ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి బర్త్ డే వేడుకలను బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాల్లో పాల్గొని కేక్లు కట్ చేశారు. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి రక్తదానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ఎమ్మెల్యే తనయులు అవినాష్రెడ్డి, శివారెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, బాల్రెడ్డి, అబ్దుల్ రజాక్, పురుషోత్తంరావు, సంతోష్, ప్రభాకర్గౌడ్, హబీబ్లాల, కౌన్సిలర్లు వెంకట్, స్వరూప, వేణుగోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ప్రవాసభారతీయులు, మంత్రి జూపల్లి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. గౌతాపూర్ చౌరస్తాలో.. తాండూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్కుమార్ ఆధ్వర్యంలో గౌతపూర్ చౌరస్తా వద్ద కేక్కట్ చేశారు. సీనియర్ నాయకులు మల్కాపూర్ జనార్దన్రెడ్డి, నాగప్ప పాల్గొన్నారు. వేర్వేరుగా వేడుకలు బషీరాబాద్: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజవర్ధన్రెడ్డి, అజయ్ ప్రసాద్ వర్గీయులు ఒకవర్గంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాధవ్రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్రెడ్డి, రోహిత్ మహారాజ్, మాణిక్రెడ్డి, రాము నాయక్, కలాల్ నర్సింలు, పవన్ ఠాకూర్, కాశప్ప తదితరులు మరోవర్గంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. -
పసందైన భోజనం
కొడంగల్: వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లోని 670 ప్రభుత్వ పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలల్లో ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల ఆకలి కేకలు వినించరాదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పసందైన భోజనం పెట్టిస్తున్నారు. హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్టు ఈ బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టింది. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొంరాస్పేట, దుద్యాల, దౌల్తాబాద్, పరిగి, తాండూరు, దోమ, కుల్కచర్ల, బషీరాబాద్, యాలాల, అలాగే నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. కొడంగల్, పరిగి, తాండూరు, బషీరాబాద్, బొంరాస్పేట, హకీంపేట, దోమ, కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లోని 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 3,200 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ పీఆర్ మేనేజర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. రోజూ ఉదయం 42 వాహనాల్లో టిఫిన్ను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మెనూ ఇలా.. ఇడ్లీ సాంబారు, మిల్లెట్ ఇడ్లీ సాంబార్, దోశ చట్నీ, పూరీ ఆలూ కుర్మా, ఉప్మా చట్నీ, ఉగ్రాని – పొంగల్ – చట్నీ, బోండా చట్నీ రోజూ ఏదో ఒకటి అందిస్తున్నారు. రోజు విడిచి రోజు పాలు ఇస్తున్నారు. వేడి వేడి రుచికరంగా ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అంటూ విద్యార్థులు ఆస్వాదిస్తున్నారు. కొడంగల్లోని సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లో వంటలు చేస్తున్నారు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, వయాట్రీస్ సంస్థ, సింగరేణి సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తోంది. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ) నిధులతో నడిపిస్తున్నారు. ప్రధాన కంపెనీలు వారి ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఈ పథకానికి కేటాయిస్తున్నారు. ఆశయం వెనుక ఐదుగురు పేద విద్యార్థులకు ఉదయం పూట బలవర్ధకమైన అల్ఫాహారం అందించే పథకం వెనుక ఐదుగురు వ్యక్తుల కృషి ఉంది. అందులో మొదటి వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి. ఆయన చొరవతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస ప్రభూజీ, వయాట్రీస్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ఇండియా హెడ్ మిచెల్ డొమినికా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, తెలంగాణ సోషల్ ఇంఫాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ సహకారం ఎంతో ఉంది. సర్కారు బడుల్లో రోజూ 52వేల మందికి అల్పాహారం 3,200 మందికి మధ్యాహ్న భోజనం 670 పాఠశాలలు, 12 జూనియర్ కళాశాలలకు ప్రయోజనం ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు -
వసూళ్ల పర్వం!
ఆర్టీఏ కార్యాలయంలో అంతులేని అవినీతి ● ఒక్కో పనికి ఒక్కో రేటు ● వాహనాలు చూడకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ● ఏజెంట్లను నియమించుకొని దండుకుంటున్న వైనం ● రవాణా శాఖ మంత్రి దృష్టికి కరప్షన్ భాగోతం వికారాబాద్: ఆర్టీఏ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన రుసుంకు ఏ ఒక్క సేవ కూడా అందడం లేదు. కొన్ని పనులకు రెండింతలు, మరికొన్నింటికి ఐదింతలు దండుకొంటున్నారు. ద్విచక్ర, ఫోర్ వీలర్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ ఇలా ఏ పని కావాలన్నా కార్యాలయంలోని అధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఏజెంట్లను నియమించుకొని దందాకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ వ్యవహారం రవాణా శాఖ మంత్రి వరకు వెళ్లినట్లు తెలిసింది. కొంత మంది బ్రోకర్లు.. ఆర్టీఏ అధికారుల మధ్య పంపకాల వివాదం తలెత్తి చివరకు మంత్రిని కలిసి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. డీటీఓ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బీజేపీ నేతలు బాధితులతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. ఆర్టీఏ అవినీతిపై ఏసీబీ అధికారులు సైతం నిఘా పెట్టినట్టు సమాచారం. ఇటీవల కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కనకం మైబమ్మ ట్రాక్టర్ కొనుగోలు చేసింది. దాన్ని వ్యవసాయ అవసరాల నిమిత్తం రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంది. భూమి లేదనే కారణంతో ఆర్టీఏ అధికారులు రిజక్ట్ చేశారు. అయితే మైబమ్మ భర్త పేరిట ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ విషయాన్ని సదరు మహిళ అధికారుల దృష్టికి తెచ్చినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రేటు ఫిక్స్ చేసి.. ఆర్టీఏ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. బ్రోకర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, లెర్నింగ్ లైసెన్స్, లైసెన్స్, ట్రయల్ రన్ ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూ వీలర్ లెర్నింగ్ లైసెన్స్కు రూ.300, ట్రయల్ రన్కు రూ.1,200, ఫోర్ వీలర్(కారు)లెర్నింగ్కు రూ.450, ట్రయల్ రన్కు రూ.1,350 రుసుం వసూలు చేయాలి. అలాగే ఆటో ఫిట్నెస్ సర్టిఫికెట్కు రూ.800, క్యాబ్ వెహికల్కు రూ.1,000, లారీకి రూ.1,200 తీసుకోవాలి. కానీ ఆటోకు రూ.2 వేలు, లారీకి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు దండుకొంటున్నారు. డబ్బులు ఎక్కువ ఇస్తే వీడియో కాల్లో వాహనాన్ని చూసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వెళితే ముందుగా కౌంటర్ వేసి ప్రాసెస్ను ప్రారంభిస్తారు. కౌంటర్ వేయడానికి డీటీఓ సంతకం చేయాలి. ఇక్కడి నుంచే వసూళ్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆర్డర్కు రూ.1,000, కౌంటర్కు రూ.300, ఏఓకు రూ.500, వాహనాన్ని చెక్ చేసే ఇన్స్పెక్టర్కు రూ.600, వాహనం చూపించిన కానిస్టేబుల్కు రూ.200 ఇవ్వాల్సిందే. వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్కు రూ.1,500 రుసుం చెల్లించాలి. కానీ రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొర్రీలు పెట్టి తిప్పి పంపుతున్నారు. జిల్లాలో మూడు చోట్ల(వికారాబాద్, పరిగి, తాండూరు) ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. పరిగిలో మాత్రమే టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్ ఉంది. వికారాబాద్, తాండూరులో బహిరంగ ప్రదేశాల్లో డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి లైసెన్సులు జారీ చేస్తున్నారు. దీంతో వచ్చీరాని డ్రైవింగ్తో పలువురు రోడ్లపైకి వాహనాలతో వచ్చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1.3లక్షల వాహనాలు ఉండగా ఏటా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది.ప్రభుత్వ నిబంధనల మేరకే ఆర్టీఏ సేవలు అందేలా చూస్తున్నాం. రైతు పేరిట ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే కచ్చితంగా సదరు వ్యక్తి పేరిట భూమి ఉండాలి. కుటుంబ సభ్యుల పేరిట భూమి ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. ఆర్టీఏ సేవల కోసం ఎవరూ బ్రోకర్ల వద్దకు వెళ్లరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుసుం చెల్లించి సేవలు పొందాలి. – సుభాష్రెడ్డి, డీటీఓ, వికారాబాద్ -
జేబు దొంగలకు రిమాండ్
మొయినాబాద్: ఇటీవల ఓ కార్యక్రమంలో పిక్పాకెటింగ్కు పాల్పడిన ఇద్దరు జేబు దొంగలను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న మున్సిపాలిటీలోని జేపీఎల్ కన్వెన్షన్లో పట్నం రుక్కమ్మ దశదిన కర్మ కార్యక్రమం జరిగింది. దీనికి చాలా మంది ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆరు మంది జేబుల్లో నుంచి నగదును దొంగించారు. వారంతా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. లంగర్హౌస్కు చెందిన మహ్మద్ షకీల్ అలియాస్ లంగ్డా అలియాస్ మోటా, పాతబస్తీకి చెందిన దేవరకొండ దుర్గారావు అలియాస్ శ్రీనులను సోమవారం అరెస్టు చేశారు. ఇద్దరిని మంగళవారం రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు శ్రీరామ్ గోపి పరారీలో ఉన్నాడు. నిందితులపై నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
దంచికొట్టిన వాన
కొడంగల్: మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో ఎడ్యుకేషన్ హబ్లో నిర్మాణంలో ఉన్న డీగ్రీ కళాశాలలోకి భారీగా వరద చేరడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ధారూరులో 32.5 మి.మీల వర్షపాతం ధారూరు: మండలంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. జిల్లాలోని కొడంగల్లో అత్యధికంగా 108.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మర్పల్లిలో 1.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎబ్బనూర్ చెరువు పూర్తిగా నిండిపోగా కోట్పల్లి ప్రాజెక్టులో 22 అడుగుల వరకు నీరు చేరింది. మరో రెండు అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది. పొంగిపొర్గిన వాగులు, వంకలు -
బట్టి చదువులకు స్వస్తి పలకండి
తాండూరు: ప్రైవేటు విద్యా సంస్థల్లో బట్టి చదువులకు స్వస్తి పలికి మానసిన వ్యక్తిత్వ వికాస విలువలతో కూడిన విద్యా భోధనను విద్యార్థులకు అందించాలని బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్ఎస్మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తాండూరు అధ్యక్షుడు మోహన్కృష్ణగౌడ్, గౌరవ అధ్యక్షులు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేశ్గౌడ్, సలహాదారు సోహెల్ఉమ్రిలను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠశాల బోధనకే పరిమితం చేయకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భానుప్రసాద్, మహేశ్, శేఖర్, సాయి, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్ -
లిఫ్టు ఎక్కుతుండగా.. ఇరుక్కొని మహిళ మృతి
చందానగర్: అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందిందని చందానగర్ పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ నల్లగండ్లలోని అపర్ణ జినిత్లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్మెంట్లో ఉండే మేనమామ గోవింద్ వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్లోకి అతను ఎక్కగానే, ఆమె కూడా అందులోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా లిఫ్టు తలుపులు మూసుకొని పైఅంతస్తులకు దూసుకెళ్లింది. దీంతో ఆమె శారీర సగభాగం లిఫ్టు లోపల, మిగతా భాగం తలుపుల మధ్యలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ కొద్దిగా పైకి వెళ్లి ఆగిపోయింది. వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో హుటాహుటిన వచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు
తాండూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్ కమిషనర్ రాకేశ్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 135లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండదండలతోనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాపోయారు. ఇప్పటికే సర్వేనెంబర్ 111 వివాదాస్పద భూమిలో పూర్తి స్థాయిలో ఆక్రమించి నిర్మాణాలు పూర్తి చేశారని తాజాగా సర్వేనెంబర్ 135లోను నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు షేక్ ఇర్షద్, యోగానంద్, పార్టీ నాయకుడు సంతోష్గౌడ్ ఉన్నారు. చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు -
పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంచుదాం
అనంతగిరి: పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సేవలందించాలని, స్టేషన్కు వచ్చే బాధిత మహిళలతో గౌరవంగా వ్యవహరించి ధైర్యం చెప్పాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. మంగళవారం వికారాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సిబ్బంది పనితీరు, కేసుల విచారణ, పురోగతి, బాధిత మహిళలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల్లో వేగం పెంచి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలపై వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులు వంటి ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా, వేగవంతంగా స్పందించాలన్నారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా, నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో ఆలస్యం వహించరాదని, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించడం, పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట్రాం నాయక్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రోక్తా దివస్ కార్యక్రమంలో భాగగా జిల్లా వ్యాప్తంగా అన్ని పీఎస్ల పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ స్నేహమెహ్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పోలీసులు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మార్కెట్ ప్రాంతాలు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు. ఆకస్మిక తనిఖీ ఎస్పీ కార్యాలయ ఆవరణలోని డీసీఆర్బీ కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేసుల రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల వివరాలు, నేర గణాంకాల నిర్వహణ, సీసీటీఎన్ఎస్లో కేసుల నమోదు విధానం, రికార్డుల భద్రపరిచే విధానం తదితర అంశాలను పరిశీలించారు. మహిళల కేసుల్లో సున్నితంగా వ్యవహరించాలి ఎస్పీ స్నేహ మెహ్ర -
చరాస్తులను జప్తు చేయండి
అనంతగిరి: వికారాబాద్లో నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఓ భూ పరిహారం కేసు సంచలన మలుపు తిరిగింది. బాధిత రైతు శశాంక్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రైతుకు చెల్లించాల్సిన రూ.61.29 లక్షల పరిహారం అందించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన వికారాబాద్ సీనియర్ సివిల్ కోర్టు ఏకంగా ఆర్డీఓ కార్యాలయంలోని చరాస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్టు కార్యాలయానికి చేరుకుని జప్తు ప్రక్రియ చేపట్టి జప్తు వస్తువులను తిరిగి కార్యాలయ కస్టడీకి అప్పగించారని తెలిపారు. కాగా అధికారులు మరింత గడువు కావాలని కోరడంతోపాటు విషయాన్ని ఉన్నతాధికారులకు, రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 1986– 87 సంవత్సంలో పట్టణంలోని రైల్వే లైన్ కోసం రైతు శశాకాంక్రెడ్డి కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పట్లో గజానికి రూ.50 మాత్రమే పరిహారం నిర్ణయించారు. దీనిపై బాధిత రైతు కోర్టును ఆశ్రయించగా ఇటు బాధితుడు అటు ప్రభుత్వం మధ్య జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం కొనసాగింది. చివరికి గజానికి రూ.125 చొప్పున పరిహారం పొందే హక్కును బాధిత రైతు సాధించుకున్నారు. ఈ విషయంలో 2018లో పరిహారం కోసం సీనియర్ సివిల్ కోర్టులో ఈపీ దాఖలుచేశారు. కాగా సంవత్సరం క్రితం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కార్యాలయాలనికి వచ్చినపుడల్లా అధికారులు గడువు కోరుతున్నారని, పరిహారం ఇవ్వడం లేదని రైతు శశాంక్రెడ్డి తెలిపారు. వికారాబాద్ సీనియర్సివిల్ కోర్టు ఆదేశం భూనిర్వాసితుడికి పరిహారం చెల్లింపులో జాప్యంపై అసంతృప్తి -
తాగునీటికి అధిక ప్రాధాన్యత
మోమిన్పేట: జిల్లాలో తాగు, సాగునీటి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. మంగళవారం మోమిన్పేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తాగునీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండొద్దన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు తెస్తే గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్తో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు నీరిచ్చే అవకాశం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జూరాల నుంచి జిల్లాకు సాగునీరు ఇవ్వాలని కోరామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. నియోజకవర్గంలో రూ.300 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖ ఏఈఈ అందుబాటులో ఉండడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని పలువురు సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. అధికారుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు ఫోన్ చేస్తే స్పందించాలని సూచించారు. మన ఊరు – మన బడి పథకం కింద చేసిన పనులకు దాదాపు రూ.25 లక్షల బిల్లు రావాల్సి ఉందని టేకులపల్లి సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. వెంటనే మంజూరయ్యేలా చూస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాలను కూల్చి వేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఎన్కేపల్లి సర్పంచ్ సురేందర్ కోరారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. సర్పంచ్లు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్, మండల ప్రత్యేకాధికారి సదానందం, ఇన్చార్జ్ ఎంపీడీఓ రాజమల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలకు పెద్దపీట మర్పల్లి: అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సీఎం రేవంత్రెడ్డి భారీగా నిధులు సమకూరుస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్కుమార్ తెలిపారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి వెంకటకృష్ణారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఎంపీడీఓ శాంత, డీఎస్పీ అంజయ్య, పంచాయత్ రాజ్ శాఖ డీఈ శ్రీనివాస్, హార్టీకల్చర్ అధికారి అక్షిత రెడ్డి, పట్లూర్ పీహెచ్సీ డాక్టర్ మానస, ససర్పంచ్ రామేశ్వర్, ఈఓపీఆర్డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జూరాల నుంచి జిల్లాకు సాగునీరు సీఎం సానుకూలంగా ఉన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు
దోమ: నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని ఎంపీడీఓ గ్యామా, వ్యవసాయాధికారి ప్రభాకర్ రావు, డీటీ నర్సింలు హెచ్చరించారు. మంగళవారం వారు మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నకిలీ ఎరువులు విక్రయించేందుకు యత్నిస్తే ఉపేక్షించమన్నారు. ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన ఎరువులు, డీఏపీలు, విత్తనాలను మాత్రమే అందించాలని సూచించారు. ఈ కారక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి మోమిన్పేట: ఇరవై ఏళ్లుగా ఉపాధి హామీ (వీబీజీరామ్జీ) పథకంలో పనిచేస్తున్న తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పథకం సిబ్బంది కోరారు. ఈ మేరకు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది, ఫీల్డ్అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఎరువుల విక్రయాలకు ‘ఎఫ్ఎఫ్ఎస్’ వ్యవసాయ శాఖ ఏడీఏ అరుణ తాండూరు రూరల్: ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన యాప్ వ్యవస్థను ప్రకటించిందని వ్యవసాయ శాఖ తాండూరు డివిజన్ ఏడీఏ అరుణ అన్నారు మంగళవారం ఆమె తన విలేకరులతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) యాప్ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం(6వ తేదీ)నుంచి అమలులోకి వస్తోందని తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రస్తుతం అమలులో ఉన్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు ప్రభుత్వం నిలిపివేయనుందన్నారు. నూతన యాప్ ద్వారా రైతులు తమ ఆధార్ ఆధారిత ధృవీకరణతో సులభంగా ఎరువులు పొందవచ్చన్నారు. ఎఫ్ఎఫ్ఎస్ విధానం ద్వారా మీ సేవా కేంద్రాల్లోనూ ఎరువులు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ప్రతీ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యాజమాన్యం స్వచ్ఛందంగా సేవకులను నియామించాలని ఆదేశించారు. నేడు బంట్వారానికి స్పీకర్ ప్రసాద్కుమార్ బంట్వారం: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే సర్వసభ్య సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఎంపీడీఓ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధి కారులు సకాలంలో హాజరు కావాలన్నారు. మండల అభివృద్ధిపై సమీక్ష ఉంటుందన్నారు. కోట్పల్లిలో.. కోట్పల్లి మండల సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్న 2.30 గంటలకు ఉంటుందని ఎంపీడీఓ హేమంత్ తెలిపారు. ముఖ్య అతిథిగా స్పీకర్ ప్రసాద్కుమార్ హాజరవుతారన్నారు. సర్పంచ్లు, అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. టీచర్ డిప్యూటేషన్ రద్దుకు వినతి తాండూరు రూరల్: మండల పరిధిలోని సంగెంకలాన్ ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న టీచర్ నాగలక్ష్మి డిప్యూటేషన్ను రద్దు చేయాలని గ్రామ సర్పంచు మీనాక్షి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్, డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ– కర్ణాటక సరిహద్దులోని తమ గ్రామంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వంద మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈసమయంలో ఎలాంటి సమాచారం లేకుండా నాగలక్ష్మి అనే ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్పై దోమ మండలానికి పంపించారని తెలిపారు. వెంటనే ఆమె డిప్యూటేషన్ను రద్దు చేయాలని లేదంటే మరొకరినైనా నియమించాలని కోరారు. -
అరుణాచలం ఆర్టీసీ సర్వీసు హర్షణీయం
తాండూరు టౌన్: తాండూరు డిపో నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంకు బస్సు నడపడం అభినందనీయమని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అన్నారు. మంగళవారం ఆమె తొలి సర్వీస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించిందన్నారు. భక్తుల కోసం తాండూరు నుంచి అరుణాచలంకు బస్సు సర్వీసు నడపడం హర్షణీయమన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం డిపో మేనేజర్ ప్రవీ ణ్కుమార్ మాట్లాడుతూ.. అరుణాచలం ఆధ్యాత్మిక టూర్ పేరుతో భక్తుల కోసం ఈ సౌకర్యాన్ని కల్పించామన్నారు. భక్తులకు కాణిపాకంలోని వరసిద్ధి వినాయక ఆలయం, వెల్లూర్లోని గోల్డెన్ టెంపుల్తో పాటు అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తామన్నారు. ఫుల్ టికెట్ రూ.3,600, హాఫ్ టికెట్ రూ.2వేలు ఉంటుందన్నారు. ఇందుకు భక్తులు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9948947422, 8309348157 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, ట్రాఫిక్ ఇన్చార్జి వెంకటేశం, ఆర్టీసి అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ -
నేడు ప్లాట్ల పంపిణీ
● ఏర్పాట్లు పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు ● పారిశ్రామిక వాడ భూ నిర్వాసితుల హర్షం కొడంగల్: దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడలో భాగంగా భూములు అప్పగించిన లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంటతండా రైతులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. హకీంపేట్ సమీపంలో సుమారు వంద ఎకరాల్లో ప్రత్యేకంగా రూపొందించిన డీటీసీపీ లేఔట్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి రెడీ అయ్యాయి. 570 మందికి బుధవారం లక్కీడిప్ విధానంలో ప్లాట్లను కేటాయించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాండూరు ఆర్డీఓ అనిత, స్థానిక తహసీల్దార్ కిషన్ తెలిపారు. కొడంగల్లోని బసిరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ప్లాట్ల జాబితాలో పేరున్న రైతులు హాజరు కావాలని సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు. ఎకరా పట్టా భూమిని కోల్పోయిన ఒక్కో రైతుకు 150 గజాలు, ఎకరా అసైన్డ్ భూమిని ఇచ్చిన వారికి 120 గజాలు, అర ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి కోల్పోయిన వారికి 80 గజాల చొప్పున నివాస స్థలం ఇవ్వనున్నారు. ఎనిమిది ఎకరాలు ఇచ్చాం.. మా కుటుంబానికి సంబంధించి ఎనిమిదెకరాల భూమిని పారిశ్రామిక వాడ కోసం ప్రభుత్వానికి ఇచ్చాం. పరిహారం అందింది. బుధవారం ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు సమాచారం ఇచ్చారు. ఎకరానికి ఒకటి చొప్పున మాకు ఎనిమిది ప్లాట్లు వస్తాయి.. చాలా సంతోషంగా ఉంది. – దొరమోని అనంతమ్మ, హకీంపేట్ -
కక్షపూరిత రాజకీయాలు సరికాదు
● ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత పునరుద్ధరించాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్యక్షత్రియపరిగి: రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్యక్షత్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత కుందింపునకు నిరసనగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు భద్రత కుదింపు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కక్షపూరితంగానే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నక్సల్స్, టెర్రరిస్టుల నుంచి ప్రమాదం ఉన్నందునే గత ప్రభుత్వాలు బుల్లెట్ ఫ్రూప్ వాహనం, భద్రతా సిబ్బందిని కల్పించాయని సర్కార్కు గుర్తుచేశారు. వెంటనే భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, సురేందర్, పట్టణ అధ్యక్షుడు అంజయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుందఅశోక్కుమార్, జాక్ రవి, కృష్ణ, రవికుమార్, ఆంజనేయులు, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కొడంగల్: దుద్యాల మండలం హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణాల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం వివిధ విద్యాలయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవసరం అయితే కూలీల సంఖ్యను పెంచుకొని సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ హబ్ అధికారులు షఫీ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ● ముగ్గురు రైతులకు నష్టం ● అధికారుల దర్యాప్తులో వెలుగులోకి యాలాల: మండలంలోని రాస్నం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. రైతులు విక్రయించిన ధాన్యం డబ్బులు వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ధాన్యం సొమ్ము దారి మళ్లిందా? అనే శీర్షిక కథనం ప్రచురితమైంది. డీఆర్డీఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, సీసీ శ్రీశైలం, అకౌంటెంట్ చిరంజీవి గ్రామంలో విచారణ చేపట్టారు. ఆరుగురు రైతులు తమ ధాన్యం డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి జమ అయ్యాయని చేసిన నేపథ్యంలో కేంద్ర నిర్వాహకులు, వీఓఏను విచారించారు. ముగ్గురు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బిల్లుల చెల్లింపులకు సంబంధించి గ్రామ వీఓఏ ఓపీఎంఎస్ సైట్లో సకాలంలో నమోదు చేయకపోవడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. గడువు ముగిసిపోవడంతో ఓపీఎంఎస్ సైట్ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసింది. దీంతో బాధిత రైతులకు సంబంధించి సుమారు రూ.2 లక్షలకు పైగా ధాన్యం డబ్బులు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, వీఓఏలు చెల్లించాల్సి ఉంటుందని ఏపీఎం శ్రీనివాస్ తెలిపారు. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి ఆదేశాల మేరకు సిబ్బందిపై చర్యలు ఉంటాయని ఏపీఎం తెలిపారు. కొడంగల్ రూరల్: పట్టణ పరిధి ఉడిమేశ్వరం గేటు సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ బీ రామదాసు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 9.30 నుంచి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. బాలుర విభాగంలో ఎంపీసీలో ఎస్సీ 8, మైనారిటీ 1 మొత్తం 9 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. బైపీసీలో ఎస్సీ 1, ఎస్టీ 1, ఓసీ 1, మైనారిటీ 1 మొత్తం నాలుగు సీట్ల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2025 – 26 విద్యా సంవత్సంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ఎస్ఎస్సీ మార్కుల మెమో, బోనాఫైడ్, కుల, ఆదాయ ధ్రువ పత్రాలతో ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్లతో హాజరుకావాలని తెలిపారు. కొడంగల్: మండలంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు నిండుగా ప్రవహించాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరింది. కుండపోత వానకు కంది, పత్తి, మినుము, పెసర పంట పొలాల్లో నీరు నిలిచింది. కొడంగల్, హస్నాబాద్, పెద్ద నందిగామ, పర్సాపూర్, అంగడిరాయిచూర్ నోటీఫైడ్ చెరువుల్లోకి నీరు చేరింది. చిట్లపల్లి నుంచి ఖాజాఅహ్మద్పల్లి, అన్నారం వెళ్లే దారిలో వాగు రోడ్డుపై నుంచి పొంగి ప్రవహించింది. ఖాజాఅహ్మద్పల్లి గ్రామస్తులకు రాకపోకలు నిలిచాయి. అంగడిరాయిచూర్ వాగు నిండుగా ప్రవహించింది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ బంట్వారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ సూచించారు. మంగళవారం బంట్వారం పీహెచ్సీని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవుట్ పేషెంట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్పై ఆరా తీశారు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. బాధ్యతగా పని చేసి వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మజీద్ ఖాన్, సీహెచ్ఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వెలుగులో రూ.12 లక్షల దోపిడీ!
బషీరాబాద్: పేద మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలవాల్సిన ‘వెలుగు’ వ్యవస్థలోనే భారీ అక్రమాలు బయటపడ్డాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు కష్టపడి చెల్లించిన సీ్త్ర నిధి రుణ వాయిదాలను బ్యాంకుల్లో జమ చేయకుండా సిబ్బంది దుర్వినియోగం చేశారు. ఎక్మాయి గ్రామంలోని 20 మహిళా సంఘాల సభ్యుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.12 లక్షల మేర నిధులు గల్లంతైనట్లు ఆడిటింగ్లో తేలడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మహిళల సొమ్మును స్వాహా చేసిన ఇద్దరు వీఏఓలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంలో పర్యవేక్షణ లోపాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించినట్లు సమాచారం. 2020లో లోన్.. 2020లో సీ్త్రనిధి పథకం కింద ఏక్మాయికి చెందిన సుమారు 20 స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలు పొందారు. అనంతరం గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వీఏఓలకు ప్రతినెలా డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. కానీ, ఈ మొత్తం సంబంధిత బ్యాంకు ఖాతాలకు చేరలేదు. ప్రాథమిక విచారణలో మహిళా సంఘాల సభ్యుల నుంచి వీఏఓ స్వరూప రూ.4,05,761, మరో వీఏఓ వాణిశ్రీ రూ.3,05,498 వసూలు చేసినట్లు రికార్డులు వెల్లడించాయి. ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేయలేదని ఎంకై ్వరీలో తేలింది. అంతేకాకుండా మరో రూ.4 లక్షలకు పైగా లావాదేవీలపై కూడా స్పష్టత లేకపోవడంతో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. తాము చెల్లించిన మొత్తాన్ని కూడా రుణ బకాయిలుగానే చూపిస్తున్నారని పలువురు సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆడిటింగ్లో గుట్టు రట్టు జూలై 3న నిర్వహించిన ప్రత్యేక ఆడిట్లో అధికారులు సీ్త్ర నిధి రుణాల లావాదేవీలను పరిశీలించారు. రుణాలు తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నప్పటికీ బ్యాంకు రికార్డుల్లో బకాయిలు కొనసాగుతుండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహిళా సంఘాల సభ్యుల వాంగ్మూలాలు, రశీదులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా వసూలు చేసిన నగదు బ్యాంకుల్లో జమ కాలేదని తేలింది. దీంతో విషయం జిల్లా అధికారుల దృష్టికి చేరింది. రంగంలోకి దిగిన సీ్త్ర నిధి ప్రత్యేక అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. మహిళల నుంచి వివరాలు సేకరించి, చెల్లింపుల రికార్డులను పరిశీలించారు. వసూలైన డబ్బు లు బ్యాంకు ఖాతాలకు చేరకపోవడం, రఽశీదులు, ఖాతాల మధ్య వ్యత్యాసాలు ఉండటంతో అక్రమా లు జరిగినట్లు నిర్ధారించారు. అయితే తేడా వచ్చిన డబ్బులు తాము చెల్లిస్తామని ఇద్దరు వీఏఓలు ఆడిటింగ్ అధికారులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. ఇద్దరిపై వేటు విచారణ నివేదిక ఆధారంగా డీఆర్డీఓ శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. వీఏఓలు స్వరూప, వాణిశ్రీని విధుల నుంచి తొలగిస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తాము ఏ తప్పు చేయలేదని, ఎక్కడో జరిగిన పొరపాటు తమపై పడిందని స్వరూప, వాణిశ్రీ తెలిపారు. సీ్త్రనిధి రుణాల వసూళ్లలో భారీ అక్రమాలు మహిళల నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో జమ చేయని సిబ్బంది ఆడిటింగ్లో బయటపడిన అవకతవకలు ఇద్దరు వీఏఓలపై సస్పెన్షన్ వేటు ఏపీఎం, సీసీకి మెమోలుఈ కేసులో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించిన బషీరాబాద్ ఏపీఎం పద్మారావు, ప్రస్తుతం ఎక్మాయిలో విధులు నిర్వహిస్తున్న సీసీ కవితకు సైతం డీఆర్డీఓ మెమోలు జారీ చేసినట్లు సమాచారం. రుణాల రికవరీలో అవకతవకలు తెలిసినా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా, వాస్తవాలను దాచిపెట్టినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. -
వాము సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
● ఎకరాకు రూ.8 వేల సబ్సిడీ ● రైతులు ముందుకు రావాలి ● జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్ అనంతగిరి: ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వాము సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి ఎంఏ సత్తార్ మంగళవారం తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వస్తే ఎకరాకు ప్రభుత్వం రూ.8వేల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. వాము పంటకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఔషధ, మసాలా పరిశ్రమలు పంట దిగుబడిని కొంటాయని తెలిపారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి అవసరంతో పంట చేతికి వస్తుందని, అధిక ఆదాయం పొందచ్చని తెలిపారు. ప్రస్తుతం సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద వాము సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున, గరిష్టంగా 5 ఎకరాల వరకు ఆర్థిక సహాయం అందించనున్నుట్ల వివరించారు. వాము సాగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తక్కువ నీటితో పంట చేతికొస్తుందన్నారు. స్వల్ప కాల వ్యవధిలో (120 – 150 రోజులు) పంట కోతకు వస్తుంది. ఔషధ, మసాలా పరిశ్రమల్లో డిమాండ్ ఉంటుంది. నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు అనుకూల ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. వర్షాధార ప్రాంతాల్లో కూడా విజయవంతంగా సాగు చేయవచ్చు. పంటల మార్పిడి విధానంలో అనుకూలమైన పంట. సాగు విధానం ● నీటి పారుదల కలిగిన ఎర్ర నేలలు, ఇసుక, మిశ్రమ నేలలు అనుకూలం ● ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విత్తడం ఉత్తమం ● ఎకరాకు సుమారు 2.5 కిలోల నాణ్యమైన విత్తనం అవసరం ● వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 –15 సెం.మీ. దూరం పాటించాలి. ● భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. ● ప్రారంభ దశలో కలుపు నివారణ, అవసరమైన సమయంలో తేలిక పాటి నీటి పారుదల కల్పించాలి. ● సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులను అ నుసరిస్తే మంచి దిగుబడి, నాణ్యత లభిస్తుంది. ● గత సంవత్సరం ఈ పథకం కింద వాము సాగుకు సబ్సిడీ పొందిన రైతులు ఈ సంవత్సరం అర్హులు కారు. పరిమిత లక్ష్యాల మేరకు ముందుగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులకు ప్రాధాన్యత కల్పిస్తాం. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ● పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ ఖాతా బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫొటో ● అర్హులైన రైతులు సంబంధించిన మండల ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. -
‘పాలమూరు’తో సస్యశ్యామలం
ధారూరు: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొ న్నారు. సోమవారం ధారూరు రైతు వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇళ్ల నుంచి వృథాగా పోయే నీటిని కాపాడుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తుందని తెలిపారు. త్వరలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తామన్నారు. మండలంలో ఎన్ని ఇరిగేషన్ చెరువులు, కుంటలు ఉన్నాయి.. ఏయే పనులు చేయాల్సి ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏఈ జ్యోతిని ఆదేశించారు. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో తిష్టవేసిన ఐకేపీ సీసీలు రాజకీయం చేస్తున్నారని, వీరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని పలువురు సభ్యులు స్పీకర్ను కోరారు. ఏపీఎం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, వెలుగు కార్యాలయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందని ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. కొత్త గ్రామ పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదని, ఎఫ్ఏలు ఎవరి మాట వినడం లేదని పలువురు ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని స్పీకర్ ఆరోపించారు. అధికారులు బాధ్యతగా.. జవాబుదారీగా పనిచేయాలని ఆదేశించారు. ధారూరుకు ఇందిరమ్మ ఇళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ ప్రమీల గౌడ్ స్పీకర్ను కోరారు. అల్లాపూర్ పాఠశాల పక్కన పెద్దగుంత ఏర్పడి విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని, వెంటనే దాన్ని పూడ్చివేయాలని సర్పంచ్ విజయలక్ష్మి కోరారు. మండలంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాల్లో 16 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు విన్నవించారు. ధారూరు, నాగసమందర్ గ్రామాల్లో పశు వైద్యులు లేరని, దీంతో జీవాలకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ధారూరు – పగిడాల మీదుగా దోన్నాల్, రాస్నం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న ధారూరు – పీలారం రోడ్డును పూర్తి చేయాలని కోరారు. మండలానికి కొత్తగా 1,814 రేషన్ కా ర్డులు మంజూరైనట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. పూలు, ఉల్లి సాగు చేసే రైతులకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు ఉద్యాన వన మండల అధికారి యమున తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సుధీర్, ఎంపీడీఓ నర్సింహులు, పీఆర్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు త్వరలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం స్పీకర్ ప్రసాద్ కుమార్ -
నిషేధిత జాబితా నుంచి తీసేయండి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు డీటీసీపీ అనుమతులు ఉన్న సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో తప్పుగా నమోదు చేయడం జరిగిందని, వాటిని తీసేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం బాధితులతో కలిసి కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని అనుమతులు ఉన్న పలు సర్వే నంబర్లను పీఓపీలో పెట్టడంతో ప్రజలు క్రయ, విక్రయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ తప్పు జరిగిందో వెంటనే గుర్తించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధితులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ప్రతిపాదనలు పంపండి
అనంతగిరి: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి జాబితాను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. మొదటి విడతలో మంజూరై పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని మండలాల ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితాను పంపాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. వర్షాలు పడుతున్నందున వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, హౌసింగ్ పీడీ ముక్రం బాబా, డీఆర్డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. సర్ వేగవంతానికి చర్యలు నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 78శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు పేర్కొన్నారు. సోమవారం నగరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ ఎన్నికల ఎన్నికల అధికారికి వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 110 వినతులు ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచరాదని, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 110 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్ఓ స్వర్ణలత, డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వం కార్డు అందజేత రెడ్ క్రాస్ సొసైటీలో కలెక్టర్ దీపక్ తివారి సభ్యత్వం తీసుకోవడంతో ఇందుకు సంబంధించిన కార్డును ఆ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో కలిసి కార్డును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్ తదితరులు పాల్గొన్నారు. 15లోగా అర్హుల జాబితా అందాలి కలెక్టర్ దీపక్ తివారి -
మండలాల వారీగా విడుదలైన నిధులు
బషీరాబాద్: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024 – 25 సంవత్సరానికి గాను జిల్లాలోని 594(16 గ్రామాలు మినహా) జీపీలకు రూ.24.23 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలు రోజువారీ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాగునీటి మోటార్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, చెత్త సేకరణ వాహనాల నిర్వహణ వంటి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తాజాగా విడుదలైన గ్రాంట్లతో గ్రామాల్లో అత్యవసర పనులకు కొంత మేర పరిష్కారం లభించనుంది. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి వసతుల మెరుగుదల, పైప్లైన్ల మరమ్మతులు, బోర్లు, నీటి మోటార్ల నిర్వహణ, మురుగు కాలువలను శుభ్రం చేయించడం, చెత్త సేకరణ వ్యవస్థ బలోపేతం, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. ఆన్లైన్ కాక.. జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ విడతలో 578 జీపీలకే నిధులు అందాయి. మిగిలిన 16 వాటికి గ్రాంట్ అందలేదు. నిధుల విడుదల సమయంలో కొన్ని జీపీల బ్యాంక్ ఖాతాలు ఆన్లైన్ వ్యవస్థకు అనుసంధానం కాకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నిధులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యలు పరిష్కరించిన అనంతరం తదుపరి విడతలో ఆయా గ్రామాలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. చేపట్టిన పనులు, చెల్లింపులు, పనుల పురోగతిని డిజిటల్ విధానంలో నమోదు చేయాల్సి ఉంటుంది. నిధులను నిబంధనలకు అనుగుణంగా వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పనులకే నిధులను వినియోగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిధుల సక్రమ వినియోగంతో మౌలిక వసతులు మెరుగుపడటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. మండలం జీపీలు నిధులు (రూ.లక్షల్లో..) బంట్వారం 11 56.63 బషీరాబాద్ 36 134.90 బొంరాస్పేట 33 118.60 చౌడాపూర్ 24 87.30 ధారూరు 33 125.65 దోమ 36 154.29 దౌల్తాబాద్ 31 143.41 దుద్యాల్ 19 70.57 కొడంగల్ 25 119.13 కోట్పల్లి 18 68.34 కుల్కచర్ల 32 137.56 మర్పల్లి 28 160.45 మోమిన్పేట 28 140.40 నవాబుపేట 32 129.50 పరిగి 32 115.26 పెద్దేముల్ 37 145.59 పూడూరు 31 136.37 తాండూరు 33 158.96 వికారాబాద్ 21 84.00 యాలాల 38 136.45 578 24.23 కోట్లు -
చెత్తాచెదారం.. పందుల విహారం!
మురికికూపంలా తాండూరు బస్టాండ్తాండూరు: నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తాండూరులోని ఆర్టీసీ బస్టాండ్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఈప్రాంగణంలోనే వంద బస్సులతో డిపో కూడా కొనసాగుతోంది. 355 మంది ఉద్యోగులు విధులు ని ర్వర్తిస్తుండగా.. 35 రూట్ల ద్వారా ప్రతిరోజు 35 వేల నుంచి 40 వేల మంది ప్రయాణికులు గ మ్యస్థానాలకు వెళ్తుంటారు.. ఇలా ఆర్టీసీకి ని త్యం రూ.16 లక్షలు, బస్టాండ్ ప్రాంగణంలోని దుకాణాల ద్వారా ప్రతినెలా రూ.3 లక్షల ఆదా యం సమకూరుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా బస్టాండ్లోకి వెళ్లే ప్రధాన దారితో పాటు పరిసరాలు మురుగు కూపాన్ని తలపిస్తున్నా యి. ఎక్కడ చూసినా పందులు, కుక్కల సంచా రం, చెత్తాచెదారం దర్శనమిస్తోంది. భరించలేని కంపుతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
హక్కుల సాధనకు పోరాటం
బంట్వారం: విద్య, ఉద్యోగ అవకాశాల్లో సరైన న్యాయం జరగాలంటే మాదిగలంతా సంఘటితం కావాల్సిందేనని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కే మల్లికార్జున్ మాదిగ అన్నారు. సోమవారం బంట్వారంలో మండల కమిటీని నియమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల సాధన కోసం మాదిగ జాతి నడుం బిగించి పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలబడి ప్రశ్నిస్తుందన్నారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రవీణ్కుమార్(తొర్మామిమిడి), అధికార ప్రతినిధిగా ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా ఎం.ప్రేమ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా బి.కుమార్, కార్యదర్శిగా శ్రావణ్కుమార్, కోశాధికారిగా సాయికుమార్, సలహదారుడిగా డి.సుధాకర్, ప్రచార కార్యదర్శిగా ఆర్.ప్రేమ్కుమార్, కార్యవర్గ సభ్యులుగా శ్యాంసన్, రాజు ,శ్రీకాంత్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భరత్కుమార్, ప్రతినిధులు గోపాల్, శ్రీనివాస్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మాదిగలంతా సంఘటితం కావాలి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ -
నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
అనంతగిరి: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఏఎస్పీ రాజేష్ మీనా అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ, విస్తరణ చర్యలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పోలీస్ స్టేషన్ల వారీగా సీసీ కెమెరాలను ఆయా పీఎస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రతి పీఎస్ పరిధిలో నిఘా నేత్రాల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్ర ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బాధితుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆమె తెలిపారు.ఏఎస్పీ రాజేష్ మీనా -
తల్లిపాలు అమృతంతో సమానం
డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ కుల్కచర్ల: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ అన్నారు. సోమవారం కుల్కచర్ల పీహెచ్సీలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు పడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు పట్టాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా.కిరణ్కుమార్ గౌడ్, సిబ్బంది యాదమ్మ, రాజు, సిరాజ్, జంగమ్మ, మంగమ్మ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతగిరి: మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలలో నషా ముక్త్ యువ వికసిత్ భారత్ పేరిట జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జానపద సంగీతం, నృత్యం, లఘుచిత్రం, మైమ్, స్లామ్పోయెట్రీ, వకృత్వం, చిత్రలేఖనం, నినాద రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా యువజన క్రీడల అధికారి నర్సింలు మాట్లాడుతూ.. ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మై భారత్ డిప్యూటీ డైరక్టర్ స్నేహల్ బసుత్కర్, మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ ఖలీల్, మై భారత్ వంటీర్లు దాసరి శ్రీశైలం, ర వి, ఖాజా కరీమొద్దీన్, కార్తీక్, అర్చన, సింహాద్రి, వైద్య విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు. యాలాల: మండలంలోని రాస్నం వరి కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యం డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయనే ఆరోపణలపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం సొమ్ము దారి మళ్లిందా? అనే శీర్షికన ప్రచురితమైన కథనం మండలంలో చర్చకు దారి తీసింది. ఇదే అంశంపై ప్రజా సంఘాల నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాగా కొనుగోలు కేంద్రం బాధ్యతలు తీసుకున్న ఐకేపీ సిబ్బంది, బుక్ కీపర్లను విచారించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా మంగళవారం గ్రామంలో ఐకేపీ సిబ్బందిని విచారించే అవకాశాలున్నాయి. కుల్కచర్ల: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిభా అన్నారు. ఇటీవల తాండూరులో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి అరుణ్కుమార్ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. సోమవారం బాలుడిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బొంరాస్పేట: మండలంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 9గంటల వరకు వాన దంచికొట్టింది. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరి నాట్లు వేసేందుకు ఇదే సరైన సమయమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో సాగు మార్గదర్శక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి బదులు ఆయిల్పామ్, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఎంపిక చేసుకోవా లని తెలిపారు. నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శక పుస్తకం రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలపై అవగాహన కల్పించి, మెరుగైన దిగుబడులు సాధించడానికి దోహదపడుతుందని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ మార్గదర్శకాలను రైతులకు విస్తృతంగా చేరవేసి, అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. ప్రజావాణికి 120 ఫిర్యాదులు ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. ఈ వారం ప్రజావాణికి 102 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ ఏడాది తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం.. సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి, జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి స్వర్ణలత, ఏఓ సునీల్, సీడీపీఓలు, డీహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘ఇండస్ట్రియల్’ సర్వే ప్రారంభం
దోమ: ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూ సేకరణలో భాగంగా సోమవారం రైతుల పొలాల్లో సర్వే ప్రారంభించారు. మండల పరిధిలోని కొండాయపల్లిలో నలుగురు తహసీల్దార్లతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేస్తున్నారు. పోలీసుల పహారా మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు రోజుల్లో సర్వే పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్డీఓ వాసుచంద్ర, స్థానిక తహసీల్దార్ రవీందర్ సర్వేను పరిశీలించారు. పారదర్శకంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు సర్వేకు సహకరించాలని కోరారు. భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని తెలిపారు. అనంతరం రేడియల్ రోడ్డుకు భూమిని సేకరిస్తున్న రైతుల పొలాలను పరిశీలించారు. బట్లచందారంలో పర్యటించి, భూ నిర్వాసితులతో మాట్లాడారు. పలువురు రైతుల అభిప్రాయాలను సేకరించారు. తగిన పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్, సీనియర్ అసిస్టెంట్ ఫర్వేజ్, సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ వసంత్ జాదవ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాలుగు ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న పనులు మూడు రోజుల్లో పూర్తి చేస్తామంటున్న అధికారులు కొండాయపల్లి, బట్లచందారంలో ఆర్డీఓ వాసుచంద్ర పర్యటన -
విద్యుత్ షాక్తో పాడి ఆవు మృతి
బొంరాస్పేట: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్కు గురై పాడి ఆవు మృతిచెందిన ఘటన మండలంలోని ఎన్కేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జబ్బార్మియా సోమవారం ఉదయం చనిపోయిన ఆవును చూసి బోరుమన్నాడు. పాడి ఆవు మృతితో రూ.60 వేల నష్టం వాటిల్లిందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరాడు. రుక్కమ్మ అస్తికల నిమజ్జనం తాండూరు: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సోదరులు సోమవారం కాశీలోని గంగానదిలో తమ తల్లి రుక్కమ్మ అస్తికలను నిమజ్జనం చేశారు. అనంతరం రుక్కమ్మ మనవళ్లు అవినాష్రెడ్డి, ప్రకాశ్రెడ్డి తదితరులతో కలిసి కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. యూనిఫాం మరింత ఆలస్యమే! తాండూరు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫాంల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. మున్సిపల్ పరిధిలో 33 ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహ విద్యార్థులకు సంబంధించి యూనిఫాం కట్టే బాధ్యతలను మహిళా సమాఖ్య సంఘాలకు అప్పగించారు. 7,224 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,022 మాత్రమే సిద్ధం చేశారు. మరో 12,955 యూనిఫామ్లను కుట్టాల్సి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావస్తున్నా యూనిఫామ్ల పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలి ఇబ్రహీంపట్నం రూరల్: మండలంలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరారు. ఈ మేరకు సోమవారం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఓలు, ఈసీలు, టీఏ, సీఓ సమ్మెలో పాల్గొంటే తాము విధుల్లో ఉన్నామని తెలిపారు. సమ్మెతో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు దాన య్య, బాల్రాజ్, రామలింగం పాల్గొన్నారు. చేవెళ్ల: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వడ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తుక్కుగూడలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కులకోసం, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. -
ఒకరి తప్పు.. మరొకరికి శిక్ష!
ధారూరు: ఓ కానిస్టేబుల్ నిర్వాకంతో ఏ తప్పూ చేయని ఓ లారీ డ్రైవర్తో పాటు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి సిమెంట్ బస్తాల లోడ్తో ఓ లారీ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈసమయంలో బైక్పై వెళ్తున్న ఓ మందుబాబు ఫుళ్లుగా తాగి లారీ వెనకాల కొద్ది దూరంలో అదుపు తప్పి పడిపోయాడు. ఇది గమనించి సదరు కానిస్టేబుల్ లారీ ఢీకొట్టడంతోనే వాహనదారుడు పడిపోయాడంటూ డ్రైవర్ను బెదిరించాడు. ప్రమాదానికి కారణం తాను కాదని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. ప్రమాదానికి గురైన వ్యక్తి వచ్చి తానే పడిపోయానని, ఇందులో లారీ డ్రైవర్ తప్పేమీ లేదని చెప్పినా కానిస్టేబుల్ వినిపించుకోలేదు. లారీని పీఎస్కు తీసుకురావాలని ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక స్టేషన్కు బయల్దేరాడు. పీఎస్ పక్కన ఉన్న పొలంలో లారీని పార్క్ చేయమని కానిస్టేబుల్ ఆదేశించడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు కిందకు దించగానే అక్కడే దిగబడిపోయింది. దీంతో 18గంటల పాటు డ్రైవర్ ఇక్కడే ఇరుక్కుపోయాడు. సంచులను కిందికి దింపి, లారీని బయటకు లాగిన అనంతరం మళ్లీ లోడ్ చేయించుకుని సోమవారం సాయంత్రం ఉసూరుమంటూ వెళ్లిపోయాడు. తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పినా కానిస్టేబుల్ పట్టించుకోలేదని వాపోయాడు. ఉద్దేశపూర్వకంగానే లారీ డ్రైవర్ను ఇబ్బంది పెట్టాడని పలువురు వాహనదారులు తెలిపారు. -
జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి సూచనలు..
● పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గాల్లో తేమశాతం పెరగడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. శరీరం ఈ మార్పులకు అలవాటు పడేందుకు కొంతసమయం పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్లూ కారక వైరస్లు సులభంగా వ్యాపిస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంటాయి. ఈ లక్షణాలతో కన్పించే పిల్లలను బడికి పంపకపోవడం ఉత్తమం. ● ప్రస్తుతం చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. వరదతో పాటే అనేక రకాల బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా శుద్ధి చేయని ఈ నీటిని తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కలుషిత నీరు పైపుల నుంచి ఇంట్లోకి సరఫరా అవుతుండడం, విషయం తెలియక వాటిని అలాగే తాగడం ద్వారా వాంతులు, విరేచనాల బారినపడుతుంటారు. ● సాధ్యమైనంత వరకు ఇంటికప్పుపై ఉన్న ఖాళీ బా టిళ్లు, కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూత పెట్టాలి. మస్కిటో కాయిల్స్, మస్కిటో మ్యాట్, కిటికీలకు జాలీలను ఏర్పాటు చేసుకోవడం, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం, దోమ తెరలను వాడటం వంటి స్వీయ జాగ్రత్తలతో డెంగీని దరిచేరనీయకుండా చూసుకోవచ్చు. ● సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకొవద్దు. నిల్వ చేసిన ఆహారానికి బదులు ఇంట్లో అప్పుడే తాజాగా వండివార్చిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. కాచి చల్లార్చిన నీటిని తాగడం, సీవిటమిన్ పుష్కలంగా లభించే తాజా పండ్లు తినడం ద్వారా సీజనల్ వ్యాధుల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
జీపీ వర్కర్స్ సంఘం కోశాధికారిగా రాంచంద్రయ్య
కేశంపేట: గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర కోశాధికారిగా మండల కేంద్రానికి చెందిన ఆదిరాల రాంచంద్రయ్య ఎంపికయ్యారు. గత నెల 26న ఖమ్మం జిల్లా రఘనాథపాలెంలో పంచాయతీ వర్కర్స్ సంఘం రాష్ట్రస్థాయి 3వ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో సంఘం రాష్ట్ర కోశాధికారిగా కేశంపేట పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న రాంచంద్రయ్యను ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు. రాష్ట్ర కమిటీ నుంచి రాంచంద్రయ్య సోమవారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. -
ఆఖరి మజిలీకి అవస్థలు!
తాండూరు రూరల్: శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఆఖరి మజిలీకి అవస్థలు తప్పడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే అంతిమయాత్ర గగనంగా మారుతోంది. పెద్దేముల్ మండలం తింసాన్పల్లి గ్రామ శివారులో పల్లె చెల్మ వాగు ఉంది. దీనికి అవతలి వైపు ఎస్సీ శ్మశానవాటికతో పాటు పలువురు రైతుల వ్యవసాయ పొలాలున్నాయి. వానా కాలం వస్తే తరచూ వాగు పారి అవతలి గట్టుకు వెళ్లే పరిస్థితి ఉండటం లేదు. దీంతో రైతులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు బయల్దేరారు. వాగు వద్ద పారుతున్న నీటిలో నుంచి నడుస్తూనే పాడె మోశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంటే దాటలేని పరిస్థితి ఉంటుందని, ఒక్కోసారి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించి శ్మశానవాటికకు దారి చూపాలని వేడుకున్నారు. వాగు దాటితేనే శ్మశానవాటికకు చేరేది వరద పారితే వెళ్లడం కష్టమే బ్రిడ్జి నిర్మించాలని తింసాన్పల్లివాసుల వినతి -
ఎక్కువ సామర్థ్యం ట్రాన్స్ఫార్మర్లు అమర్చండి
దుద్యాల్: ఓవర్ లోడ్ కారణంగా మండలంలోని దుద్యాల్, ఈర్లపలి తదితర గ్రామాల్లో వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతున్నాయని, ఎక్కవ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేరుగు శ్రీకాంత్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్ కోరారు. సోమవారం కొడంగల్లో కడా ప్రత్యేక అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దుద్యాల్ చెరువ సమీపంలో దుద్యాల్, అల్లిఖాన్పల్లి గ్రామాల రైతుల కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారని, వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో తరచూ ట్రాన్స్ఫార్మర్, బోరు మోటార్లు కాలిపోతున్నట్లు తెలిపారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. వినతి పత్రం అందించిన వారిలో యువజన కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, వడిత్య కృష్ణ తదితరులు ఉన్నారు. యూత్ కాంగ్రెస్ మండల నాయకులు -
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం
హుడాకాంప్లెక్స్: పుట్టిన ప్రతి బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సరూర్నగర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గర్భిణి కాన్పు జరిగిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు ఇవ్వాలని సూచించారు. ఈ పాలలో ఇమ్యూనిటీ ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఉంటుందని, ఇది బిడ్డకు సహజ యాంటీ బయోటిక్గా పనిచేస్తుందని తెలిపారు. ఇందులో బిడ్డకు సరిపోయే ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తినిపించొద్దని, కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సత్యవతి, డీఐఓ డాక్టర్ షీబా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన, సుష్మిత, మాస్మీడియా అధికారులు మంజుల, శ్రీనివాసులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శ్రీనివాసులు, పరాంకుశం, ఆరోగ్య విస్తరణ అధికారులు పోల శ్రీధర్, కె.శ్రీనివాసులు, పీహెచ్ఎన్ మల్లీశ్వరి, సూపర్వైజర్లు అజయ్, ఉమ, ఇందిర, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ముసురు’తున్నాయ్!
చాపకింది నీరులా సీజనల్ వ్యాధులు జిల్లాలోని వనస్థలిపురం, కొండాపూర్ సహా జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవఖానాల ఔట్పేషంట్ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ (వనస్థలిపురం) ఆస్పత్రిలో బయటి రోగుల సంఖ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపైంది. రోగుల నిష్పత్తి మేరకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులతో పాటు వైద్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం కమ్యూనిటీ సెంటర్లలోనూ రద్దీ పెరిగింది. 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 70 బస్తీ దావఖానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల సాధారణ ఓపీల్లో 40 శాతం మంది జ్వర పీడితులే కన్పిస్తున్నారు. కునుకు లేకుండా చేస్తున్న దోమలు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇళ్ల చుట్టూ మురుగు నీరు చేరి, దోమలకు నిలయంగా మారుతున్నాయి. చిరుజల్లులకు రాత్రిపూట ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట ఇంట్లో నిద్రించే పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా వారు విపరీతమైన జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్నారు. వీల్ చైర్లో తీసుకెళ్లేవారులేక తన భార్యను స్వయంగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్న భర్తవనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రద్దీవర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుతున్నాయి. పారిశుద్ధ్యలోపం, నీటి కాలుష్యం, దోమకాటుతో రోగాలు వ్యాపిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అనేక మంది దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. – సాక్షి, రంగారెడ్డిజిల్లా ఆస్పత్రులకు క్యూ కడుతున్న జ్వరపీడితులు యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు కిటకిట మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిలో గతంలో ఓపీకి రోజుకు సగటున 500 మంది వస్తే ప్రస్తుతం 1,600 దాటింది. ఇక్కడికి వస్తున్న వారిలో మెజార్టీ బాధితులు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వాళ్లే. 220 పడకలు, మూడు ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాలు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టం రెడీగా ఉంది. ఎంత మంది వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చిన వారికి మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు పొందొచ్చు. – డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, మహేశ్వరం మెడికల్ కాలేజీ -
నేడు రక్తదాన శిబిరం
కొడంగల్ రూరల్: ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కొడంగల్లోని ప్రభుత్వాస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు యువసేన ఫ్రెండ్స్ అసోషియేషన్ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందన్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం మరొకరికి ప్రాణదానం లాంటిదన్నారు. బొంరాస్పేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న కొత్తగూడెంలో జరిగే గిరిజన సభను విజయవంతం చేయాలని ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ కోరారు. శనివారం చలో కొత్తగూడెం సోషల్ మీడియా పత్రాన్ని ఆవిష్కరించారు. గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవం కోసం నిర్వహిస్తున్న సభకు బంజారాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కుల్కచర్ల: దూరవిద్యా విధానం ద్వారా డిగ్రీ చేయాలనుకునే వారు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించే డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చని శ్రీ రామలింగేశ్వర డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ ఇన్చార్జ్ వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసి.. అట్టి ధ్రువీకరణ పత్రాలను కుల్కచర్లలోని శ్రీ రామలింగేశ్వర కళాశాలలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9441679846లో సంప్రదించాలన్నారు. కుల్కచర్ల: చౌడాపూర్, కుల్కచర్ల మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కుల్కచర్ల సెంటర్కు అలవేలు, పుట్టపహాడ్కు మమత, బండవెల్కిచర్లకు లక్ష్మిదేవి, కుస్మసముద్రంకు ఫరానా బేగం, ముజాహిద్పూర్కు రవలికను ఎంపిక చేశారు. చౌడాపూర్ మండలం మరికల్ సెంటర్కు మాలతి, వీరాపూర్కు మహేశ్వరి, చౌడాపూర్కు సంధ్య, కొత్తపల్లికి ఎల్లమ్మ, చాకల్పల్లికి బొమ్మరాసి మహేశ్వరి ఎంపికయ్యారు. ఆయా కేంద్రాలకు ఆయాలను కూడా నియమించారు. కేశవరావును కోరిన టఫ్ నాయకులు కొడంగల్ రూరల్: ఉద్యమకారుల కమిటీ చైర్మన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావును శనివారం నగరంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టఫ్) చైర్ పర్సన్ విమలక్క అధ్యక్షతన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలయ్యేలా చూడాలని కోరారు. స్పందించిన కేశవరావు నాయకులు అందించిన ప్రతిపాదనలను కమిటీతో చర్చించి అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లాకన్వీనర్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా బాధ్యులు కొర్ర పాండు తదితరులు పాల్గొన్నారు. హయత్నగర్: టీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్నగర్–1 డిపో మేనేజర్ లావణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ వాహన లైసెన్స్ కలిగి, కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు సైజు ఫొటోను జత చేసి ఈనెల 8వ తేదీలోపు డిపోలో నేరుగా దరఖాస్తు చేయాలన్నారు. -
వెల్కమ్ కిట్!
● ఇంటర్ విద్యార్థులకు ఏడు రకాల సామగ్రి ● సంఖ్య పెంచేందుకుప్రభుత్వం సరికొత్త ఆలోచన ● మొదటి విడతలో బూట్ల పంపిణీ ● ఐదువేల మందికి ప్రయోజనం దౌల్తాబాద్: జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు వెల్కమ్ కిట్ అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వేల రూపాయలు వెచ్చించనుంది. ఇది ఆర్థిక భారమైనా ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కాకూడదని భావిస్తోంది. పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో కూడా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ఏడు రకాల వస్తువులతో కూడిన కిట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 14 జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో 5వేల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఒక్కొక్కరికి రూ.4,100 చొప్పున ప్రతి విద్యార్థికీ సుమారు రూ.4,100 విలువ చేసే వస్తువులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. రెండు జతల యూనిఫాం, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, కాలేజీ బ్యాగ్, గుర్తింపు కార్డు, బెల్టు, దాదాపు నోట్బుక్స్ అందించనుంది. మొదటి విడతగా బూట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విద్యార్థుల వివరాలు సేకరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రయోజనాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులకు బ్రాండెడ్ కంపెనీ వస్తువులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్లో డ్రాపౌట్లను అడ్డుకోవడానికి ప్రభుత్వం సరి కొత్త ఆలోచన చేసింది. పదో తరగతి తర్వాత ఆర్థిక ఇబ్బందులతో పేద విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతీయువకులు చదువు ఆపేస్తున్నారు. అలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే జిల్లాలోని ఎనిమిది కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అమలు చేస్తున్నాం. – శంకర్నాయక్, డీఐఈఓ, వికారాబాద్ -
ముర్రుపాలు అమృతంతో సమానం
● శిశువు పుట్టిన గంటలోపే పట్టాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్ అనంతగిరి: శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాపించాలని, ఈ పాలు పిల్లల పాలిట అమృతంతో సమానమని డీఎంహెచ్ఓ డాక్టర్ కే సుధాకర్ లాల్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను (ఆగస్టు ఒకటి నుంచి 7వ తేదీ వరకు) పురస్కరించుకొని శనివారం వికారాబాద్ పట్టణం రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు. పుట్టిన పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలన్నారు. తల్లిపాలలో రోగ నిరోధక శక్తి ఉంటుందన్నారు. పిల్లల మెదడుకు, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. తల్లి బిడ్డల మధ్యలో అనుబంధం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అమృత లక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ సౌమ్య, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, మురళి, మహేశ్కుమార్, వైద్యారోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలు బిడ్డకు శ్రీరామ రక్ష
● శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టాలి ● ఆరు నెలల వరకు తల్లిపాలే తాగించాలి ● 7వ తేదీ వరకు వారోత్సవాలు దుద్యాల్: పుట్టిన బిడ్డకు తొలి ఆహారం, మొదటి టీకా అమ్మపాలే. పిల్లలకు తల్లిపాలు ఎంతగానో తోడ్పడుతాయని వైద్యులు చెబుతున్నారు. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు తాగించాలని సూచిస్తున్నారు. ఆ పాలు తాగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచే తల్లిపాల ఆవశ్యకత, బిడ్డ పోషణ, ఆరోగ్యంపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. లేనిపోని అపోహలతో బిడ్డను తల్లిపాలకు దూరం చేయరాదంటున్నారు. ఎంత త్వరగా ముర్రుపాలు పడితే శిశువు అంత ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కొడంగల్ సీడీపీఓ సరోజ తెలిపారు. మండలంలో 20 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 10 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు. వీరికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామని అంగన్వాడీ సూపర్ వైజర్లు తెలిపారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ముర్రుపాలలో విటమిన్ – ఏ, – బీ, తగినంత ఐరన్ ఉంటుంది. ఈ పాలు శిశువు జీర్ణశక్తిని పెంచుతాయి. కామెర్లు, విరేచనాల వంటి వ్యాధుల నుంచి బిడ్డను కాపాడతాయి. -
సన్న బియ్యం బోనస్ కోసం అన్నదాతల ఎదురుచూపులు
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026రూ.6.42 కోట్లువికారాబాద్: సన్న బియ్యం బోనస్ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. రెండు సీజన్లకు సంబంధించిన డబ్బు జమకాలేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్వింటాలు సన్నరకం వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధాన్యం విక్రయించి ఏడాది కావస్తున్నా బోనస్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. నిర్వాహకులు ఈ రోజు రేపంటూ కాలయాపన చేస్తున్నారు. 2025 యాసంగికి సబంధించిన బోనస్ డబ్బులు పెండింగ్లో ఉండగా 2026లో రికార్డు స్థాయిలో సన్నాలు సేకరించారు. డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండంతో పలువురు రైతులు ఈ సారి ప్రైవేటుగా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. రికార్డు స్థాయిలో.. రెండు మూడు సీజన్లతో పోలిస్తే గత యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించారు. 92వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రైవేటుగా పోనూ 90వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నులు కొను గోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. లక్ష్యం మేరకు సేకరించారు. దొడ్డు రకం తోపాటు 8,421మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన బోనస్ డబ్బులు రూ.4.46 కోట్లు రైతులకు చెల్లించలేదు. 2026 యాసంగిలో 90వేల ఎకరాల్లో వరి పంట వేయగా 1.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటితో పాటు 3,900 మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు సేకరించారు. ఇందుకు సంబంధించి రూ.1.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు సీజన్లుగా జమకాని నగదు 2025 యాసంగిలో సేకరించిన ధాన్యం 8,421 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సిన మొత్తం రూ.4.46 కోట్లు 2026 యాసంగిలో 3,900 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సిన డబ్బు రూ.1.96 కోట్లు -
పొలాలకు దారి చూపండి
తహసీల్దార్కు మంబాపూర్ రైతుల వినతి తాండూరు రూరల్: తమ పొలాలకు వేళ్లేందుకు దారి చూపాలని పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ రైతులు కోరారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్ వెంకట్ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని 115 నుంచి 117 సర్వే నంబర్లకు సంబంధించిన సుమారు ఇరవై మంది రైతులు పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక నిత్యం అవస్థలు పడుతున్నారన్నారు. గ్రామానికి చెందిన ఒకరిద్దరు రైతులు పానాదిని ఆక్రమించడంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై బాధితులమంతా కలిసి హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. పానాదిని క్లియర్ చేయాలంటూ న్యాయస్థానం నుంచి వచ్చిన ఆదేశాల కాపీని తహసీల్దార్, ఎస్ఐకి అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచు ప్రకాశం, రైతులు బిచ్చయ్య, దస్తయ్య, లాలయ్య, శ్రీనివాస్, సావిత్రమ్మ, దశరథ్, కిరణ్, బాలయ్య, భీమయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళ కడుపులో పది కిలోల కణతి
ఆపరేషన్ ద్వారా తొలగించిన వినాయక ఆస్పత్రి వైద్య బృందం తాండూరు: పట్టణంలోని వినాయక ఆస్పత్రిలో ఓ మహిళ కడుపు లోనుంచి పది కిలోల బరువున్న కణతిని తొలగించారు. తాండూరుకు చెందిన శశికళ కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. స్కానింగ్ నిర్వహించగా భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. ఆందోళనకు గురైన శశికళ కుటుంబ సభ్యులు శాంతినగర్ పార్క్ ఎదుట ఉన్న వినాయక ఆస్పత్రిలో సంప్రదించగా గైనకాలజిస్ట్ డాక్టర్ అమృత్, సర్జన్ అర్జున్, మత్తు వైద్యుడు హరీష్ బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. శశికళ కడుపు లోనుంచి 10.06 కిలోల కణతిని తొలగించారు. -
నకిలీ డీఏపీ పట్టివేత
49 బస్తాలు స్వాధీనం బంట్వారం: నకిలీ డీఏపీ 49 బస్తాలు పట్టుబడ్డాయి. ఈ సంఘంటన మండల పరిధి రొంపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ రైతులు కొందరు.. పెద్దేముల్కు చెందిన పి.రాజు దగ్గర డీఏపీని కొనుగోలు చేశారు. శనివారం పంటలకు వేసే సమయంలో అనుమానం రావడంతో వ్యవసాయ అఽధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఏఓ శ్రావ్య, ఎస్ఐ విమల గ్రామానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి డీఏపీని పరిశీలించారు. ఐదు మంది రైతుల వద్ద 49 అనుమానాస్పద బస్తాలను స్వాధీనం చేసుకున్నామని ఏఓ తెలిపారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించామన్నారు. నకిలీ డీఏపీ విక్రయించిన రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు, చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే ఎరువులు కొనుగోలు చేయాలని, బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. -
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
పూడూరు: వరుస వర్షాలతో గ్రామీణ ప్రాంతాల దారులన్నీ ఛిద్రమయ్యాయి. గోతులు ఏర్పడి, నీరు నిలిచి ప్రమాదాలకు నిలయంగా మారాయి. వాహనం నడపాలంటే వెన్నులో వణుకుపుడుతోందని చోదకులు వాపోతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. పూడూరు మండల పరిధి అంగడిచిట్టంపల్లి– లాల్పహాడ్ రోడ్డు పూర్తిగా రూపం కోల్పోయింది. అంగడిచిట్టంపల్లి, మీర్జాపూర్, పూడూరు, కంకల్, చన్గోముల్ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారాయి. ఇందులో లాల్పహాడ్– కంకల్ రహదారి విస్తరణ పనులను సదరు కాంట్రాక్టర్ మధ్యలో వదిలేయడంతో ఆ మార్గం మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్డు కుంటను తలపిస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, రహదారుల మరమ్మతు, నిర్మాణ పనులు నాణ్యతగా త్వరంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ధర్నాకు తరలిన తపస్ నేతలు
కుల్కచర్ల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్ నిర్విరామంగా కృషిచేస్తోందని ఆ సంఘం మండల అధ్యక్షుడు స్వయంప్రకాశ్ అన్నారు. చలో ఇందిరాపార్క్ మహాధర్నా కార్యక్రమానికి శనివారం కుల్కచర్ల నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పీఆర్సీ సాధన, డీఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పందించే వరకూ తమ పోరాటం సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర బహదూర్, రవికుమార్, బుచ్చిలింగం, వెంకటయ్య, శ్రీనివాస్గౌడ్, శ్రీను, కృష్ణయ్య, గాంగ్యనాయక్ తదితరులు పాల్లొన్నారు. -
స్నేహమేవ జయతే
హుడాకాంప్లెక్స్: ‘అల్లాయే దిగివచ్చి.. ఏమి కావాలంటే..? మిద్దెలొద్దు.. మేడలొద్దు.. పెద్దలెక్కే గద్దెలొద్దంటా.. ఉన్ననాడు.. లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే.. ఒక్క దోస్తే చాలంటా.. స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమేరానాకున్నది.. స్నేహమే నాపెన్నిధి’ అంటూ సినీనటుడు కై కాల, ఎన్టీఆర్ ఏళ్ల క్రితం ఆలపించిన ఆ పాట చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇదే స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లా హస్తినాపురానికి చెందిన రాందేశ్పాండే 2008లో స్నేహితుల కలయిక కోసం ‘స్నేహమేవ జయతే’ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. కేవలం నలుగురు మిత్రులతో మొదలైన ఈ స్నేహ ప్రస్థానం.. ప్రస్తుతం మూడు వందల మందికిపైగా విస్తరించింది. ‘స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా’ అంటూ దోస్తీ గొప్పతనాన్ని నేటి తరానికి వివరిస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆగస్టు 2న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరంతా ఒకే వేదికపై కలుసుకుని, ఆర్థికంగా వెనుకబడిన స్నేహితులకు అండగా నిలబడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తుంటారు. ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంటారు. వీధుల్లో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చే కార్యక్రమం సహా స్నేహం విలువను చాటి చెబుతుంటారు. పర్యావరణ పరిరక్షణ, నీటిపొదుపు, పాలిథిన్ బ్యాగుల నిషేధం, అనాథ శరణాలయాల్లో అన్నదానం జాతి నేతల గొప్పతనంపై కరపత్రాల పంపిణీ, రాఖీ రోజున ఫ్రెండ్షిప్ బాండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతూ నవతరం స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నలుగురితో మొదలై.. నేడు 300 మందికి విస్తరణ స్నేహం విలువను చాటి చెబుతున్న స్నేహమేవ జయతే సంస్థ సభ్యులు -
జైల్భరోను జయప్రదం చేయండి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న చేపట్టనున్న జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరిస్తుందని ఆరోపించారు. వ్యాపార వేత్తలకు లబ్ధిచేకూరే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, వెంకటయ్య, బుగ్గప్ప, రామకృష్ణ పాల్గొన్నారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
మొయినాబాద్: పాఠశాల విద్యార్థులను తరలించే ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. వీరి చర్యలతో పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వెళ్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొయినాబాద్లోని హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై ఎన్నో యూటర్న్లు ఉన్నా.. శ్రీచైతన్య స్కూల్ బస్సులు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రాంగ్ రూట్లోనే ప్రయాణం సాగిస్తున్నాయి. వీరి చర్యలను చూసి మిగిలిన వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు. పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్ల బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూల్ బస్సులు -
వాగ్వివాదాల నడుమ అభివృద్ధి పనులపై చర్చ
గ్రామసభ.. రసాభాస బొంరాస్పేట: గ్రామ సమస్యలు, అభివృద్ధి పనుల గురించి చర్చించాల్సిన గ్రామసభ రసాభాసగా మారింది. మండల కేంద్రమైన బొంరాస్పేటలో సర్పంచ్ వీరేశలింగం అధ్యక్షతన శనివారం నిర్వహించిన సభలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం గ్రామ సమస్యలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. పారిశుధ్యం అంశాలపై చర్యలు తీసుకోవాలని సభదృష్టికి తెచ్చారు. సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలన్నారు. వీధిలైట్లు, ప్రమాదకరంగా ఉన్న కరెంటు తీగలు సరిచేయాలన్నారు. ఉప్పరికాలనీ, గొల్లవాడలకు తాగునీటి సమస్య తీర్చాలన్నారు. అంగన్వాడీలు పాఠశాలల ఆవరణల్లో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామ సభలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని నేతలు సూచించారు. ఇందులో ఎంపీఓ రవినాయక్, పీహెచ్సీ మెడికల్ అధికారి హేమంత్కుమార్, గ్రామ కార్యదర్శి సుచిత్ర, ఉప సర్పంచ్ నందిని, బీజేపీ మండల అధ్యక్షుడు జగదీశ్సాగర్, రామకృష్ణగౌడ్, అనిల్, సంగాయిపల్లి నర్సింలు, రాములు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
కాంగ్రెస్ నేత బుయ్యని శ్రీనివాస్రెడ్డి దోమ: ఆలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బుయ్యని శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దొంగ ఎన్కేపల్లిలో శివాయల నిర్మాణానికి రూ.50 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ్కుమార్, గ్రామస్తులు సంతోష్రెడ్డి, వెంకన్న, సాయి, బాబు, గోపాల్, శేఖర్రెడ్డి, శ్రీపివాస్రెడ్డి, ఆలయ అర్చకుడు శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. నియామకం మర్పల్లి: తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం జిల్లా కన్వీనర్గా మర్పల్లి మండలం పంచలింగాల గ్రామానికి చెందిన విజయ్కుమార్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపకులు బొట్ల కార్తీక్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం వికారాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ ఫోరం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం గౌరవ అధ్యక్షుడు కనకమామిడి విష్ణు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ప్రశాంత్, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అల్పాహారం పంపిణీ తాండూరు: మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి దంపతులు శనివారం తాండూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆస్పత్రి ఆవరణలో పేదలు, రోగులకు అల్పా హారం పంపిణీ చేశారు. ఈనెల 5న ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పుట్టిన రోజు ఉందని, ఆయన అమెరికా పర్యటనలో ఉన్నందున ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్నంకు పైలెట్ పరామర్శ తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి.. శనివారం శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిలను పరామర్శించారు. అనంతరం మహేందర్రెడ్డి తల్లి రుక్కమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. యువకుడికి విద్యుత్ షాక్ తాండూరు: రోడ్డు దాటుతున్న యువకుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. సైకిల్ టైర్ సహాయంతో బయట పడ్డాడు. ఈ ఘటన తాండూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన నవీన్ తాండూరులోని అంబేడ్కర్ చౌక్ సమీపంలో గల అపోలో ఫార్మసీలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బహిర్భుమికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తాకాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టింది. గమనించిన యువకులు సైకిల్ టైర్ సాయంతో నవీన్ను పక్కకు నెట్టేశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. -
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
ధారూరు: మండలంలోని కేరెళ్లిలో ఆదివారం ఉచిత కంటివైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కేరెళ్లి సత్యసాయి సార్వజనిక కేంద్ర నిర్వాహకులు ఎం.ప్రేమ్కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈఅవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల ఇబ్బందులు తొలగించాలి అనంతగిరి: ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లో రైతుల ఇబ్బందులు తొలగించాలని బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్చార్జి మారుతి కిరణ్ బూనేటి కోరారు. శనివారం జిల్లా ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. రైతులకు నిబంధనలు తెలియజేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన విధానం అమలు చేసి, అర్హులైన రైతుల ట్రాక్టర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పేర్కొన్నారు. దుకాణంలోకి నాగుపాము తాండూరు: పట్టణంలోని ఓ షాపులోకి శనివారం నాగుపాము ప్రవేశించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ దాన్ని పట్టుకొని బయట వదిలేశారు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని ఓ కిరాణంలోకి నాగుపాము వచ్చింది. కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ఆ ఇంటికి వెళ్లి నాగుపామును పట్టుకొని బయట వదిలేశారు. శంకర్పల్లి: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు(60) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. గమనించిన లైన్మెన్ వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి, వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు కదులుతున్న రైలులో నుంచి పడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మీర్పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్పేటకు చెందిన ఎర్రమల్ల భీమరాజు కుమార్తె శాలిని(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. గత నెల 20వ తేదీన శాలిని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు
కుల్కచర్ల: అదుపు తప్పిన కారు చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల్కచర్లకు కారులో వస్తుండగా ముందు టైరు పేలడంతో రోడ్డు కిందకు వేగంగా దూసుకెళ్లింద. వాహనంలోని ఇద్దరు పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి. రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం హుజూర్నగర్: మార్కెట్లో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ దందాకు తెరలేపారు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ డీఏపీని తయారు చేసి అక్కడి నుంచి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రైతులకు నకిలీ ఎరువు బస్తాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈనెల 15న మఠంపల్లి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు రఘునాథపాలెంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మఠంపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో ఇద్దరు పిచ్చిరెడ్డి ఇచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్మెట్లోని జగదీష్ అలియాస్ జక్కప్ప, ఆనంద్ రావుకు సంబంధించిన తయారీ కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 1000 డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షించగా.. నకిలీదని తేలింది. దీంతో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి, వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామానికి చెందిన పొలే వెంకటేశ్వర్లు, ఏపీలోని కర్నూలు పట్టణానికి చెందిన పింజారి మౌలాలి, జోగులాంబ గద్వాల జిల్లాలోని లింగనవాయి గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్, కర్నాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లా దేవరౌప్పరి తాలూకా మానూర్ గ్రామానికి చెందిన హీర్లకొండ సంతోష్ కుమార్, మఠంపల్లి మండలం బక్కమంతుగూడేనికి చెందిన పింగళి గంగామహేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి డీసీఎం, ఓ కారు, ఐదు సెల్ఫోన్లు, వివిధ కంపెనీల లేబుల్ కలిగిన నకిలీ డీఏపీ బస్తాలు, నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్, నకిలీ పాస్పేట్, దాదాపు రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్, జగదీశ్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐలు ప్రవీణ్, నవీన్, ఏఎస్ఐ బలరాం రెడ్డి, సిబ్బంది శంభయ్య, నాగరాజును అభినందించారు. షాబాద్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన నాగరగూడ ఎక్స్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగరగూడ ఎక్స్ రోడ్డు వద్ద షాద్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును శంషాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి నాగరగూడ శ్రీనివాస ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన నామ మమత, శంషాబాద్ మండలం సుల్తాన్పల్లికి చెందిన శిరీష, మరో ఇద్దరు ఉన్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట చేవెళ్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్గుప్తా ఉన్నారు. షాద్నగర్: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నందిగామ సీఐ వీరబాబు అన్నారు. శుక్రవారం నందిగామ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. 80 వాహనాలు తనిఖీ చేసి 53 వాహనాలకు పెండింగ్లో ఉన్న చలాన్లను క్లియర్ చేయించారు. ఎనిమిది మంది వాహనదారులకు స్పాట్ చలాన్లు విధించారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వీరబాబు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టామన్నారు. -
గుప్త నిధుల పేరిట మోసం!
బషీరాబాద్: గుప్తనిధి ఆశ చూపించాడు.. ఇంటి ఆవరణలో కోట్ల విలువైన నిధి దాగి ఉందంటూ నమ్మించాడు. ప్రత్యేక పూజలు, తంత్రాలు చేస్తే అది బయటపడుతుందని చెప్పాడు. ఇందుకోసం విడతలవారీగా రూ.8 లక్షలు వసూలు చేసి, మాయమయ్యాడు. నమ్మకంగా వల.. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా జీవన్గీకి చెందిన ఇద్దరు వ్యక్తులకు గతేడాది ఆగస్టులో హైదరాబాద్ దూల్పేట వాసి లక్ష్మణ్సింగ్ హజారీ పరిచయమయ్యాడు. అతీంద్రియ శక్తులు కలిగిన బాబాగా తనకు తాను చెప్పుకొన్నాడు. ఒకరోజు జీవన్గీకి వచ్చి ఓ ఇంటిని పరిశీలించిన సదరు బాబా.. ఇంట్లో కోట్ల విలువైన బంగారు నిధి ఉందని, ప్రత్యేక పూజలు, మంత్రాలతో వెలికి తీస్తానని నమ్మించాడు. ఆతర్వాత నిధికి నాగబంధం ఉందని, దాన్ని తొలగించేందుకు ప్రత్యేక హోమాలు, అరుదైన పూజా సామగ్రి అవసరమని చెప్పాడు. ఇందుకోసం దశలవారీగా ఇద్దరి నుంచి సుమారు రూ.8 లక్షలు వసూలు చేశాడు. మట్టి కుండతో మాయాజాలం ఓ రోజు నిధిని బయటకు తీస్తానని చెప్పిన బాబా.. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి, ఎవరినీ రావొద్దన్నాడు. అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించి, తవ్వకాలు చేపట్టి ముందుగానే పాతిపెట్టినట్లు అనుమానిస్తున్న ఓ మట్టి కుండను వెలికి తీశాడు. అందులో నుంచి ఓ బంగారు రంగున్న బిల్లను చూపించి నిధి బయటపడిందని చెప్పాడు. దీంతో తవ్వకాలు చేయించినవారు ఎంతో సంతోషించారు. అయితే నాగబంధం పూర్తిగా తొలగిపోలేదని, వారం రోజుల్లో తిరిగి వచ్చి, ప్రత్యేక పూజల అనంతరం పూర్తి నిధిని అప్పగిస్తానని, అప్పటి వరకు కుండను ఎవరు తాకినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఆరోజు నుంచి నకిలీ బాబా తిరిగిరాలేదు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కుండను తెరిచి చూడగా అందులో 78 బంగారు రంగు బిళ్లలను గుర్తించారు. వీటిని కర్ణాటకలోని ఓ బంగారం వ్యాపారి వద్దకు తీసుకెళ్లి పరీక్షించగా నకిలీవని తేలడంతో మోసపోయామని గుర్తించి లోలోపలే మదనపడ్డారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎలాగైనా తమను మోసగించిన బాబాను పట్టుకోవాలని పలుమార్లు దూల్పేట్లోని అతని ఇంటికి వెళ్లినా ఆచూకీ లభించలేదు. అతడి భార్య దివ్యభాయి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లిందని చుట్టుపక్కల వారు చెప్పడంతో బాధితులు నిరాశగా తిరిగి వచ్చినట్లు సమాచారం. గుప్తనిధులు తవ్వించిన ఇద్దరు వ్యక్తులు.. బాబాకు సమర్పించిన రూ.8 లక్షల్లో.. మరికొంత మంది వద్ద తీసుకున్న డబ్బులు కూడా ఉన్నాయి. నిధి దొరికిన తర్వాత పెద్దమొత్తంలో తిరిగిస్తామని చెప్పడంతో వారు కూడా సరేనన్నారు. కానీ, ఏడాది కావస్తున్నా ఇచ్చిన డబ్బులైనా చేతికి అందకపోవడంతో సదరు వ్యక్తుల ఇళ్లకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. బాబా ఎవరో తమకు తెలియదని, మిమ్మల్ని నమ్మి ఇచ్చాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈవిషయం ఈనోటా ఆనోటా బయటకు పొక్కింది. ఇద్దరి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసిన నకిలీబాబా జీవన్గీలో నాటకీయంగా వెలుగుచూసిన ఘటన -
సమన్వయంతో పనిచేయండి
నవాబుపేట: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ సుధీర్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్షాసమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, ఆర్అండ్బీ, ఉద్యాన, ఎకై ్సజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, వెటర్నరీ తదితర శాఖల అధికారులతో మాట్లాడి ఆయా విభాగాల పురోగతిని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఈఓ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధకారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. వీబీజీరాజ్జీ పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్అండ్బీ ఏఈ సుస్మిత సభలో నివేదికను వివరిస్తుండగా.. ఆర్అండ్బీ రోడ్లు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఎందుకు నిర్మించడం లేదని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొండల్ యాదవ్ ప్రశ్నించారు. రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలె యాదయ్య చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదన్నారు. ఈవిషయంపై దాతాపూర్ సర్పంచ్ బల్వంత్రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్యే గ్రామాలను అభివృద్ధి చేశారని, రోడ్ల నిర్మాణం కూడా జరుగుతోందని చెప్పడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు, అధికారులు కలగజేసుకొని ఇద్దరికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మండల ప్రత్యేక అధికారి కవిత అధ్యక్షతన, ఎంపీడీఓ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంఈఓ అబ్దుల్ రహమాన్, ఎంహెచ్ఓ రోహిత్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్రెడ్డి, ఎంపీఓ విజయ్కుమార్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించండి జెడ్పీ సీఈఓ సుధీర్ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష -
సాగు కళకళ
● పొలం బాటలో అన్నదాతలు ● వరినాట్లు వేసేందుకు కరిగెట్లు ● ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి అన్నదాతలు పొలం బాట పట్టారు. ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతులను వరుణుడు కరుణించాడు. దీంతో వరి నాటు వేసేందుకు కరిగెట్లు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి. – షాబాద్ నరెడ్లగూడలో పత్తి పంట మల్లారెడ్డిగూడలో కళకళలాడుతున్న మొక్కజొన్న -
నకిలీ డీఏపీ పట్టివేత
తాండూరు రూరల్: నియోజకవర్గంలో నకిలీ డీఏపీ కలకలం రేపుతోంది. ఇప్పటికే పరిగి, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీని వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. శుక్రవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో నకిలీ డీఏపీ పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కరన్కోట్ పోలీసులు 89 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు ఏడీఏ అరుణ, పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం గ్రామంలోని పలువురి రైతుల ఇళ్లల్లో తనిఖీ చేశారు. 89 బస్తాలను స్వాధీనం చేసుకొని కరన్కోట్ పోలీస్స్టేషన్కు తరలించారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజు, ఆత్కూర్కు చెందిన శివకుమార్ వీటిని విక్రయించినట్లు తేలింది. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన సూత్రధారి పెద్దేముల్ వాసి జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయించడంలో పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజుగా పోలీసులు గుర్తించారు. పరిగి, యాలాల కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. చెంగోల్లో దాదాపు 200 బస్తాలు విక్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం 89 బస్తాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన 111 బస్తాలను రైతులు పొలాల్లో వరి, పత్తి పంటలకు వాడినట్లు అధికారులు గుర్తించారు. రైతులు నకిలీ డీఏపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏడీఏ అరుణ, మండల అధికారి కొమురయ్య సూచించారు. ● 89 బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ● చెంగోల్లో ఘటన -
రైతుల త్యాగం గుర్తుండిపోతుంది
● భూ సేకరణకు సహకరించాలి ● బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ● తాండూరు ఆర్డీఓ అనితబొంరాస్పేట: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతుల త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తాండూరు ఆర్డీఓ అనిత అన్నారు. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలువ నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు రూ.20 లక్షల చొప్పన నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. శుక్రవారం మండలంలోని చౌదర్పల్లి భూ సేకరణలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 1,400 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 900 ఎకరాలు, బొంరాస్పేట మండలంలో 200 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి, నీటూరు, మాటూరు, కొడంగల్ మండలం పెద్దనందిగామ, దుద్యాల్ మండలం గౌరారం, హంసాన్పల్లి, బొంరాస్పేట మండలం చౌదర్పల్లి, తుంకిమెట్ల తదితర గ్రామాల మీదుగా కాలువ వెళ్తుందన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. భూగర్భ జలాలు పెరిగి సస్యశ్యామలం అవుతుందన్నారు. భూములు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, ఇరిగేషన్ అధికారి కృష్ణమోహన్గౌడ్, ఆర్ఐ శిరీష, సర్పంచ్ కల్పనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పరిగి: తెలంగాణ ఉద్యమకారుల రెండు తరాల అపూర్వ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సమ్మేళనం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 16న నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల న్యాయమైన హక్కులు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించడం స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు నక్క రమేష్, సురేష్, రహీం, పీర్మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు: మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. పది రోజుల పాటు వర్జీనియా రాష్ట్రంలో పర్యటించనున్నారు. లీస్బర్గ్లోని స్టోన్ టవర్ వైనరీని పరిశీలించారు. వైనరీల తయారీ విధానం, ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అనంతగిరి: జర్నలిస్టుల సమస్యలు, ఇళ్ల స్థలా ల సాధన కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్143) ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం సాగిస్తామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చి న హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయా లని డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్లో జిల్లా అడహక్ కమిటీ సన్నాహక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాల కేటాయించాలన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా నూతన అడహక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్గా ఎం.రవీందర్, కోకన్వీనర్లుగా ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నర్సింలు, ఆనంద్, జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ, రాజేందర్ గౌడ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాఽ దికారి యేగానంద్, జాతీయ కౌన్సిల్ స భ్యుడు తిరుపతినాయక్, కన్వీనర్ ఆసీఫ్ హు స్సేన్, జిల్లా నాయకులు రవీందర్, ఆసీఫ్ ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నర్సింలు, ఆనంద్, జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ పాల్గొన్నారు. ఘన సన్మానం అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సే వలే చిరకాలం నిలిచిపోతాయని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ఉద్యోగ విరమణ పొందన చంగోముల ఎస్ఐ చంద్రయ్య, డీసీఆర్బీ ఎస్ఐ అబ్దుల్ గఫార్, బషీరాబాద్ ఏఎస్ఐ చంద్ర శేఖర్, నవాబ్పేట్ పీఎస్ కానిస్టేబుల్ ఇర్షాద్ అలీని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. -
ఆయిల్ పామ్తో స్థిర ఆదాయం
చేరువైన దూరవిద్య! చదువు మానేసి, చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా దూరవిద్య అందనుంది.● రైతులు మొగ్గు చూపాలి ● త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ● కలెక్టర్ దీపక్ తివారి పరిగి: ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని, రైతులు మొగ్గు చూపాలని కలెక్టర్ దీపక్ సూచించారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్పూర్ తండాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను, అంతర పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందజేస్తోందని తెలిపారు. త్వరలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిగి మండలంలో వెయ్యి ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారుల సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్(ట్రైయినీ) సచిన్ బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుడిగాలి పర్యటన బొంరాస్పేట: మండలంలో శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారి పర్యటించారు. బొంరాస్పేట్ పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాల, పూరిళ్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. వంటలను తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం తుంకిమెట్ల శివారులో గల రెండు ఎకరాల భూమిని కేటాయించాలని తహసీల్దార్ పద్మావతికి సూచించారు. నాగిరెడ్డిపల్లిలో పూరింట్లో ఉన్న వారిని పలకరించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, డీటీడీఓ జనార్దన్, ఇంచార్జ్ ఎంపీడీఓ వెంకన్గౌడ్, వైద్యాధికారి హేమంత్కుమార్, హెచ్ఎం విక్రమంసింగ్, వార్డన్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచండి దుద్యాల్: హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ఎస్సీ స్నేహమెహ్రతో కలసి ఎడ్యుకేషన్ హబ్లో పర్యటించారు. నర్సింగ్ కళాశాల, పార మెడికల్, ఫిజియోతెరపీ, వెటర్నరీ హాస్పిటల్, మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న వనరులు సరిపోకుంటే మరిన్ని యంత్రాలు సమకూర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్(ట్రైయినీ) సచిన్ బస్వరాజ్ గుట్టూర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● రోగులకు మెరుగైన వైద్యం అందాలి ● డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ దోమ: పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులు, ఆస్పత్రి గదులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో పెరిగిన గడ్డిని సిబ్బందితో కలిసి తొలగించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రజిత, సర్పంచ్ మాలిష్ శివకుమార్ రెడ్డి, హెచ్ఈఓ ప్రభులింగం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని స్కైలార్క్ డయాగ్నస్టిక్స్ సెంటర్ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ శుక్రవారం తనిఖీ చేశారు. ప్రయోగశాల, మౌలిక వసతులు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. -
చివరికి చిక్కారు
చోరీబాట పట్టారు..ఇబ్రహీంపట్నం రూరల్: తాళాలు పగులగొట్టి ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను ఆదిభట్ల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏసీపీ ప్రదీప్రెడ్డి, సీఐ రమేష్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం జుజువార్ గ్రామానికి చెందిన ముకేష్ చౌదరి (35) హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటూ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గతంలో యాప్రాల్లో హార్డ్వేర్ దుకాణం నిర్వహించిన అతను చెడు అలవాట్లకు లోనై వ్యాపారంలో నష్టాలు రావడంతో చోరీబాట పట్టాడు. అతనిపై పీడీయాక్ట్ కూడా నమోదైంది. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.ఆరు లక్షల విలువైన బంగారం, 30 తులాల వెండి అభరణాలు, మొబైల్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయా పోలీస్స్టేషన్లలో 17 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు బైక్ దొంగల అరెస్టు పార్కింగ్ చేసిన బైక్లను దొంగిలిస్తున్న యువకులను ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్ ఖాసీం హుస్సేన్ (18), మహమ్మద్ కరీమ్ (19) బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. నిందితులను శుక్రవారం ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన ఎస్ఐ నోయల్రాజ్, క్రైమ్టీం ఎల్.రవికుమార్, కిరణ్రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్రెడ్డి, సందీప్, శివచంద్ర, సంతోష్కుమార్, సంతోష్, భరత్కుమార్గౌడ్ను ఏసీపీ అభినందించారు. ఆయా కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్టు బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
‘ఫీజు’ బకాయిలు చెల్లించాలి
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ ● ఆర్డీఓ కార్యాలయం ముట్టడి తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ మాట్లాడారు. ఏళ్ల తరబడిగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కళాశాల యాజమాన్యాలకు చెల్లించకపోవడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే బకాయి పడిన రూ.8 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మధులత, జిల్లా నాయకులు వెంకటేష్, వీరమణి, బస్వరాజ్, జోసఫ్, రాజుగౌడ్, పరమేష్, తాండ్ర నరేష్, రాజు, రాము, కిరణ్, పలు కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
● బ్రహ్మోత్సవాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కావాలి ● సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనుల్లో వేగం పెంచాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు అన్నారు. శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కొడంగల్లో పర్యటించారు. శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలను గమనించారు. పనుల్లో పురోగతి సాధించాలని కాంట్రార్లకు సూచించారు. అనంతరం కడా కార్యాలయంలో ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీ, ప్లానింగ్ డిజైనర్స్, కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేయాలన్నారు. సంప్రదాయ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, ప్రత్యేక అవసరాల గదులు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు నిర్మించాలన్నారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ట్రైయినీ అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్, డీఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది
అనంతగిరి: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. వికారాబాద్ మండలం సిద్దులూర్ జెడ్పీహెచ్ఎస్ జీహెచ్ఎం రామకృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పదన్నారు. విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. రామకృష్ణారెడ్డి ఎక్కడ విధులు నిర్వహించినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. విద్యార్థులతో మమేకమై విద్యాబుద్ధులు నేర్పించారని కొనియాడారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, మున్సిపల్ వైస్చైర్మన్ సుధాకర్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్, సీనియర్ నాయకులు కిషన్నాయక్, ఎండీ హఫీజ్, సిద్దులూర్ సర్పంచ్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బాదం అనురాధ అశోక్, రమ్య శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ -
పట్నం కుటుంబానికి పరామర్శ
షాబాద్: శాసన మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌర్ పరామర్శించారు. మహేందర్రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనరెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రమేశ్మహరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధూసూదన్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, పామెన భీంభరత్, కాలె శ్రీకాంత్, పెంటారెడ్డి, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
హడల్!
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026సీజనల్..వికారాబాద్: సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి. జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులతో ప్రజలు మంచాన పడుతున్నారు. అంటువ్యాధులతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరోచనాలతో చేరుతున్న వారి సంఖ్యలో క్రమంగా పెరుగుతోంది. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వందకుపైగా ఓపీ నమోదు అవుతోంది. ఇందులో 50కి పైగా సీజనల్ వ్యాధుల బారిన పడిన వారే ఉన్నారు. పది మందికి పైగా వాంతులు, విరేచనాలతో చేరుతున్నారు. వికారాబాద్ జనరల్ ఆస్పత్రిలో 400 పైగా ఓపీ నమోదు అవుతోంది. వందకు పైగా సీజనల్ వ్యాధులతో చేరుతున్నారు. ఓపీలో 50 వరకు వాంతులు విరేచనాలతో వస్తున్న వారు ఉంటున్నారు. పది మందికి పైగా అడ్మిట్ అవుతున్నారు. ఇంతకు రెండు మూడు రెట్లు ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. చికన్గున్య, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఫీవర్ సర్వే నిర్వహించగా వందల సంఖ్యలో రోగులు మంచం పట్టినట్టు తేలింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,77,452 ఇళ్లకు వెళ్లి 4,82,798 మందికి చెందిన శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించారు. ఇందులో 1,980 జ్వర పీడితులు ఉన్నారు. డెంగీ కేసులు మూడు నమోదయ్యాయి. గురువారం రాత్రి వాంతులు విరేచనాలతో ఓ మహిళ మృతి చెందింది. నవాబుపేట మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి కాంతమ్మ వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పడకేసిన పారిశుద్ధ్యం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండగా.. పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ప్రస్తుతం వరుసగా వర్షాలు కురుస్తుండటంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. మున్సిపాలిటీల్లో చెత్త సక్రమంగా సేకరించడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా డంప్ చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధంతోపాటు దోమలు, ఈగలు పెరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. గతంలో పట్టణ ప్రగతి పేరుతో హడావిడి చేసిన మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల సమయంలో వీధుల్లో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెద్దేముల్ మండలం మంబాపూర్ బీసీ గురుకుల పాఠశాల గేటు ముందు మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పలు సార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం నిత్యం పదుల సంఖ్యలో చేరుతున్న రోగులు జిల్లాలో నమోదైన ఫీవర్ కేసులు 1,980 డెంగీ కేసులు 3 వాంతులు విరేచనాలతో మహిళ మృతి రోజురోజుకూ పెరుగుతున్న పారిశుద్ధ్య సమస్య జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వాటి పరిధిలోని చాలా కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఇళ్ల మధ్య మురుగు చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడంతో పందులు సంచరిస్తున్నాయి. అధికరులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. -
సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్గా అరుంధతి
షాద్నగర్: ఉమ్మడి జిల్లా సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్గా ఫరూఖ్నగర్ మండలం నాగులపల్లికి చెందిన అరుంధతి ఎన్నికయ్యారు. మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పని చేస్తున్న ఆమె ఇటీవల నిర్వహించిన బోర్డు ఎన్నికల్లో విజయం సాధించారు. గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ కుల్కచర్ల: చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ అన్నారు. గురువారం మండలంలోని సాల్వీడు గ్రామంలో పర్యటించారు. అధికారులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం కింద కాలనీకి రూ.1.72 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందుకు అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ సంధ్యారాణి, పంచాయతీ కార్యదర్శి హర్శద్ తదితరులు పాల్గొన్నారు. యాలాల: రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన 43 బస్తాల నకిలీ డీఏపీని అధికారులు పట్టుకున్నారు. గురువారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల వ్యవసాయ అఽధికారి శ్వేతరాణి తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్లో నకిలీ డీఏపీ రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రాచూరి ఆశన్న, శంకిరి బిచ్చప్ప ఇంట్లో నిల్వ ఉన్న 43 నకిలీ డీఏపీ బ్యాగులను గుర్తించారు. వీటిని పెద్దేముల్ మండలానికి చెందిన పోల రాజు అనే వ్యక్తి విక్రయించినట్లు గుర్తించామన్నారు. నకిలీ డీఏపీ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఇలా విక్రయించే వారి విషయంలో వ్యవసాయ శాఖ, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కుల్కచర్ల: ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు నష్టపోకుండా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మాలె కృష్ణయ్య, రైతుబంధు మాజీ అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ మాజీ డైరక్టర్ కొండయ్య, నాయకులు మహేశ్వరం రాములు, జనార్దన్ రెడ్డి, మొగులయ్య, బిచ్చయ్య, సత్యయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో సర్పంచ్లే కీలకం
డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి కేశంపేట: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలకపాత్ర పోషించాలని డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లతో పాటుగా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మండల స్థాయి సమావేశంలో సర్పంచ్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను మళ్లీ నిర్వహించే మండల స్థాయి సమావేశం లోపు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇంటింటికి ఇంకుడుగుంతలను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీటి సరాఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. జలసిరి పథకంలో భాగంగా రైతులు వ్యవసాయ పొలాల్లో ఫాంపాండ్లు నిర్మించుకోవాలలని చెప్పారు. అనంతరం కేశంపేట, అల్వాల గ్రామాల్లో విబిజీ రామ్జీ పథకంలో భాగంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీఓ దయానంద్, విద్యుత్ ఏఈ ఈశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ నర్సింగ్రావు, ఎంపీఓ అజీజ్, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
శరవేగంగా డిజిటలైజేషన్
● ఇప్పటి వరకు 83శాతం ప్రక్రియ పూర్తి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 10,17,671 ఓటర్లకు గాను ఇప్పటి వరకు 7,96,005 డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు. 83 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. 1,13,092 ఏఎస్డీ(ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్) ఓటర్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రదర్శించడం జరిగిందన్నారు. జాబితాలో ఏవైనా సమస్యలు ఉంటే రాజకీయ పార్టీ ప్రతినిధులు, బూతు స్థాయి ఏజెంట్లు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఆగస్టు 3వ తేదీ నాటికి 100 శాతం పూర్తి చేసేలా అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1,200 మంది ఓటర్లు ఉంటే అదనంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటు అనేది చాలా ముఖ్యమని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎస్ఐఆర్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్ఓ స్వర్ణలత, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్ వెంకటాచారి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జెడ్పీ సీఈఓ సుధీర్, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి
కోట్పల్లి ఎస్ఐ శైలజ బంట్వారం: వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోట్పల్లి ఎస్ఐ శైలజ తెలిపారు. గురువారం ఆమె ఠాణాలో విలేకరులతో మాట్లాడారు. ఉధృతంగా పారే వాగులు, వంకలు దాడకూడదన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చిన్నపిల్లలు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించే వారిని గుర్తించి ఖాళీ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు సరికాదు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ మొయినాబాద్: పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ తీరు ‘ఒడెక్కే వరకు ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అనే చందంగా ఉందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ అన్నారు. గురువారం మొయినాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భీంభరత్, మాజీ ఎంపీ రంజిత్రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి పనిచేయడంతోనే దర్శన్ సతీమణి సోనియాకు మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కిందన్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే యాదయ్యపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించి, పరిష్కరించుకోవాలని అంతేకానీ బహిరంగ వేదికలపై విమర్శలు చేయడగం తగదని హితవుపలికారు. -
చేప పిల్లల అంచనాలు సిద్ధం
వికారాబాద్: చేప పిల్లల పంపిణీకి మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకూలంగా ఉన్న చెరువులను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనుమతులు రాగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా 779 చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. 1.29 కోట్ల చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువుల్లోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఆగస్టు మొదటి రెండో వారంలో చేప పిల్లలు వదిలే అవకాశం కనిపిస్తోంది. లక్ష్యానికి దూరంగా పంపిణీ చెరువుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోతోంది. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే వదిలి చేతులు దులుపుకొంటున్నారు. ఈ ఏడాది అయిన చెరువుల్లో సరిపడా చేపపిల్లలు వదలాలని మత్స్య సహకరా సంఘాలు కోరుతున్నాయి. నాసిరకం పిల్లలు ఏటా నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మూడు నుంచి నాలుగు ఇంచులు ఉండాల్సిన పిల్ల ఒక ఇంచుకు మించి ఉండటంలేదని తెలిపారు. గతంలో ఇలాంటి వాటిని మత్స్యకారులు వెనక్కు పంపారు. అధికారులతో గొడవలు కూడా జరిగాయి. లక్ష చేప పిల్లల వదిలితే అందులో 50వేలు కూడా బతకడం లేదని తెలిపారు. సైజు కూడా రావడం లేదన్నారు. ఈ సారైనా. అధికారులు దృష్టి సారించి నాణ్యమైన చేపపిల్లలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చేరిన నివేదిక జిల్లాలో మొత్తం చెరువులు 1,179 చేపలు వదిలేందుకు ఎంపిక చేసినవి 779 మత్స్య సహకార సంఘాలు 152, సభ్యులు 5,665 మందిజిల్లాలోని చెరువుల ఆధారంగా ఎన్ని చేప పిల్లలు అవసరం అనే దానిపై అంచనాలు సిద్ధం చేశాం. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపాం. ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. అనుమతులు రాగానే టెండర్ ప్రక్రియను ప్రారంభించి చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తాం. – వెంకయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి -
చన్గోముల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
● ప్రజాసంఘాల నేతల డిమాండ్ ● బాధితుడిపైనే కేసు నమోదు చేశారని ఆందోళన బొంరాస్పేట: దళితుడి భూమి ఆక్రమణకు సహకరిస్తూ బాధితుడిపైనే కేసు నమోదు చేసిన పూడూరు మండలం చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొంరాస్పేటలో గురువారం వారు మాట్లాడుతూ.. పూడూరు మండల సోమన్గుర్తి గ్రామానికి చెందిన దళిత రైతు జైదుపల్లి నర్సింలుకు చెందిన సర్వే నం.120లో 1.35 ఎకరాల్లోని 30గుంటల భూమిని ఏసీఈ టైర్స్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించిందన్నారు. దీనిపై విచారణ చేయకుండా స్థానిక ఎస్సై దళిత రైతుపై కేసు పెట్టారని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ఆక్రమించిన భూమిని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుడి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నర్సింలు, ప్రజాసంఘాల నాయకులు రమేశ్, మొగులయ్య, రాములు, ఎల్లప్ప, వెంకటయ్య, నరేశ్, ప్రవీణ్, రాంచందర్ తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం
● బీజేవైఎం జిల్లా నేత సాయిచరణ్రెడ్డి ● ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలకు డిమాండ్ తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయిచరణ్రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. మూడేళ్లుగా రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్ కిరణ్ ముదిరాజ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు తాండ్ర నరేష్, నాయకులు శోభన్, శ్రీనివాస్, హర్షవర్ధన్రెడ్డి, మంజునాథ్రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


