breaking news
Vikarabad
-
విజయవంతం చేయాలి
వేడుకలను విజయవంతం చేయాలని మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. పిరమిడ్ ఆవరణలో గురువారం ట్రస్ట్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో భాగంగా వివిధ దేశాలు, రాష్ట్రా లకు చెందిన గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, మేధావులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతిరోజు 25 వేల మంది ధ్యానులు, సందర్శకులు హాజరుకానున్నారని, ఈమేరకు 10 లక్షల మందికి ఉచి త అన్నదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పా రు. 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు దామోదర్రెడ్డి, మాధవి, జేజీ నారాయణ, చంద్రశేఖర్, మహేశ్వరి, మీడియా ఇన్చార్జి భాస్కరానంద, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, సర్పంచ్లు సేవ్యా, శ్రీను పాల్గొన్నారు. -
ధ్యాన యాగం.. ఆధ్యాత్మిక యోగం
కడ్తాల్: ధ్యాన మహాయాగం కోసం మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం ముస్తాబవుతోంది. మండల కేంద్రం సమీపంలోని పత్రీజీ శక్తి స్థల్లో ఈ నెల 21న (ఆదివారం) వేడుకలు ప్రారంభమై, 31 వరకు కొనసాగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ప్రముఖ ఆధ్యాత్మిక, ధ్యాన గురువులు హాజరుకానున్నారు. ఈ మేరకు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పదమూడు సంవత్సరాలుగా.. 13 సంవత్సరాలుగా ఏటా డిసెంబర్లో ఇక్కడ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుంచి వేలాది మంది ధ్యానులు తరలిరానున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఉత్సవాలను విజయవంతం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే ధ్యానులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నారు. ఉచిత అన్నదాన కేంద్రం, శాశ్వత గదులతో పాటు తాత్కాలిక వసతి గృహాలు, కుటీరాలు నిర్మిస్తున్నారు. వేడుకలు జరిగినన్ని రోజులు ధ్యానం చేసేందుకు వీలుగా భారీ సభా ప్రాంగణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక సిద్ధం చేస్తున్నారు. శుద్ధమైన తాగునీటి సౌకర్యంతో పాటు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలు.. ధ్యాన మహాయాగంలో భాగంగా ప్రతిరోజు పత్రీజీ వీడియో సందేశం, ప్రముఖ ధ్యాన గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి. నిత్యం ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు సామూహిక వేణుగాన ధ్యానం, అఖండ ధ్యానం, ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ధ్యాన గురువుల సందేశాలు, గురు సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. -
పంట మార్పిడి తప్పని సరి
మోమిన్పేట: వ్యవసాయంలో రైతులు తప్పని సరి గా పంట మార్పిడి పద్ధతి పాటించాలని కేంద్రియ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఇన్చార్జ్ సునీత సూచించారు. గురువారం మండలంలోని చక్రంపల్లిలో రబీ సాగులో సమగ్ర సస్యరక్షణపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పంట మార్పిడి తప్పనిసరి అన్నారు. సాగులో పురుగు ఉధృతి తెలుసుకునేందుకు ఎర పంటలు, మిత్ర పురుగులు పెంపకం, విత్తన శుద్ధి చేయాలన్నారు. శత్రు పురుగులను గుర్తించి వెంటనే నాశనం చేస్తేనే పంట దిగుబడులో నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించకపోతే మొక్క పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. లింగార్షక బుట్టలు వాడే విధానాన్ని రైతులకు వివరించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకట్రెడ్డి, ఉదయశంకర్, హొన్నప్పగౌడ, ఏఓ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ బాలరాజుగౌడు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమం అభివృద్ధికి పట్టం
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పంచాయతీ ఎన్నికల్లో పరిగి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గంలో 206 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 137 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారన్నారు. జిల్లాలోనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది పరిగిలోనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి ఘనత సీఎం రేవంత్రెడ్డికు దక్కుతుందన్నారు. సర్పంచ్లకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. పంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయిస్తామన్నారు. పరిగిని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని అన్నారు. జిల్లాను లక్ష కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం రోజే పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, పూడూరు మండల అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, నాయకులు చిన్ననర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
‘ఉపాధి’కి సరికొత్త రూపు
దుద్యాల్: ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 20 ఏళ్లుగా అమలులో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో కొత్త చట్టం తేనుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్ జీ) పేరును ప్రతిపాదించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు నిబంధనలు సైతం మారనున్నాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అయితే పథకం అమలులో లోపాలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరును పక్కదారి పట్టించడం, చేపట్టిన పనులకు పెట్టిన ఖర్చులకు పొంతన లేకపోవడం వంటి అనేక లోపాలు ఈ వ్యవస్థలో కనిపించనట్లు సమాచారం. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేసి మరింత ఆధునిక, పారదర్శక విధానాలతో కూడిన కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ బిల్లుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వలసలను నియంత్రించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. రైతులు, కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమగ్ర ప్రయోజనాలు చేకూరేలా ఈ చట్టాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. పని దినాలు పెంపు ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పించేవారు.కొత్త చట్టంతో 125 రోజుల పనిది నా లు కల్పించనున్నారు. పెంచిన రోజుల్లో నైపు ణ్య అవసరమైన పనులు చేయడానికి ముందుకొచ్చే వారికి మాత్రమే 125 రోజులు వర్తస్తాయి. పని దినాలు పెరగడంతో కూలీలకు వార్షిక ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సకాలంలో వేతనాల చెల్లింపు కూలీలకు ప్రతి వారం వేతనాలు చెల్లించాలని, గరిష్టంగా పదిహేను రోజులు మించి ఆలస్యం చేయరాదని బిల్లులో స్పష్టంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది. దీంతో కూలీలు పని చేసిన వారం నుంచి రెండు వారాల్లో వేతనాలు అందుకోవచ్చు. గతంలో ఆరు నెలలైనా వేతనాలు అందని పరిస్థితి ఉండేది. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తు న్నారు. పొలాల్లో విత్తనాలు వేస్తున్న సమయంలో, కలుపు తీసే తరుణంలో, ఇతర వ్యవసాయ పనులకు ఉపాధి కూలీలను కేటాయిస్తే రైతుకు కొంత భారం తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పెరిగిన దినసరి కూలీల రేట్లకు వ్యవసాయం చే యాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెట్టు బడులు అధికమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మండలంలో ఉపాధి కూలీలు మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీల్లో 4,459 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. అందులో ఎస్సీలు 1,234 మంది, ఎస్టీలు 1,807 మంది, ఇతరులు 3,613 మంది ఉన్నారు. -
బీజేపీ కుట్రలు సాగవు
అనంతగిరి: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం పిలుపు మేర కు గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టా రు. ముందుగా క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు దేశ స్వాతంత్య్రోద్యమంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎంతో కీలకంగా పనిచేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే మా పార్టీ అధినేతలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.బీజేపీ పెట్టిన అక్రమ కేసులను నేషనల్ హెరాల్డ్ వ్యవహారా నికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్ స్వీకరించలేమని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసిందన్నారు. అక్రమ కేసులతో పీడించాలనుకుంటే చూస్తు ఊరుకోబోమన్నా రు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి చెంప పెట్టులాంటిదన్నారు. ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు పెట్టి అణచివేయాలనుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి,రత్నారెడ్డి, మల్లేశం, పెండ్యాల అనంతయ్య, గుడిసె లక్ష్మణ్, శ్రీనివాస్, లక్ష్మ ణ్, రెడ్యానాయక్, దీపు, వెంకట్రెడ్డి, అబ్దుల్ ఖాలెద్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
మత్తుకు బానిస కావొద్దు
మొయినాబాద్: విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో డీఎస్పీ సైదులు అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ రెవెన్యూలో ఉన్న కేఎల్హెచ్ యూనివర్సిటీలో గురువారం ఎన్ఎస్ఎస్ యూని ట్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో లైన్స్క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం పబ్ సంస్కృతి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చెడు అలవాట్లకు దారితీస్తుందని అరు. కేసులు నమోదైతే విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. వృత్తిపరమైన అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. యువత, విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండి.. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు మల్లేష్, చంద్రశేఖర్, వెంకటరాజు, భవానిసుష్మ, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇలాకాలో హస్తం హవా
అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులుకొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. మెజార్టీ గ్రామాలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా జరిగిన మూడు విడతల ఎన్నికల్లోనూ ఇదే జోరు కనిపించింది. కాంగ్రెస్ ఊపును చూసి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి నుంచే ప్రాదేశిక స్థానాల్లో పోటీ చేయడానికి పోటీ పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు డిమాండ్ పెరిగింది. కొత్త సర్పంచులే గెలిపిస్తారని పలువురు ఆశావహులు భావిస్తున్నారు. మూడు విడతల్లోనూ.. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11న జరిగాయి. కొడంగల్, దుద్యాల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండల్లాలోని 262 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 179 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 72 మంది, బీజేపీ తరఫున ఇద్దరు, ఇతరులు 9 మంది విజయం సాధించారు. కొడంగల్ మండలంలో ఒకటి, దౌల్తాబాద్లో మూడు, బొంరాస్పేటలో 7, దుద్యాల్లో 2, తాండూరు మండలంలో ఆరు, బషీరాబాద్లో 5, యాలాలలో 10, పెద్దేముల్లో 5 గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండో విడతలో.. రెండో విడత ఎన్నికలు ఈ నెల 14న జరిగాయి. వికారాబాద్, ధారూర్, మోమిన్పేట, నవాబుపేట, బంటారం, మర్పల్లి, కోట్పల్లి మండలాల్లోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 110 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 34, బీజేపీ 8 మంది, ఇతరులు 23 మంది గెలిచారు. కొడంగల్ నియోజకవర్గంలో.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల్, కోస్గి, గుండుమాల్, మద్దూరు, కొత్తపల్లి మండలాల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. కొడంగల్ మండలంలో 25 గ్రామ పంచాయతీలకు గాను 24 గ్రామాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. దుద్యాల్లో 20 జీపీలకు గాను 15 కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్, ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బొంరాస్పేట మండలంలో 35 పంచాయతీలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 29 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు ఐదుగురు, ఒకరు స్వతంత్రులు విజయం సాధించారు. దౌల్తాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 22 మంది, బీఆర్ఎస్ 10 మంది, ఒకరు స్వతంత్రఅభ్యర్థులు గెలిచారు. ఇదే ఊపు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సర్పంచ్లతో సఖ్యతగా ఉంటూ ప్రాదేశిక స్థానాలను సొంతం చేసుకునేందుకు బాట వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి చేరువ కావాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ తరఫున గెలిచిన వారి అండదండలతో ముందుకు సాగాలని భావిస్తున్నారు. తుది పోరులో.. మూడో విడత ఎన్నికలు ఈ నెల 17న జరి గాయి. పరిగి, పూడూరు, చౌడాపూర్, దోమ, కుల్కచర్ల మండలాల్లో 157 గ్రామాలకు గానూ కాంగ్రెస్ మద్దతుదారులు 100 మంది, బీఆర్ఎస్ 42 మంది, బీజేపీ ముగ్గురు, ఇతరులు 12 మంది గెలిచారు. మూడు విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అధిక పంచాయతీల్లో విజయం సాధించింది. -
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
దోమ: జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన ఆర్మీ జవాన్ అంత్యక్రియలు గురువారం మండలంలోని దాదాపూర్ గ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన తోకని అంజయ్య, తల్లి కనకమ్మ కుమారుడు శ్రీనివాస్(22) రెండేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. పంజాబ్ రాష్ట్రంలో అతను విధులు నిర్వహిస్తుండగా, ఈ నెల 16న తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో అధికారులు అక్కడే వైద్య పరిక్షలు అందించారు. పరిస్థితి విషమించి మృతి చెందారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆర్మీ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.రామ్మెహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి హాజరై మృతదేహానికి నివాళులర్పించారు. -
అంత్యక్రియలకు ఖర్చులు ఇవ్వండి
కమిషనర్కు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తాండూరు టౌన్: మున్సిపల్ కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియల నిమిత్తం ఖర్చులు చెల్లించాలంటూ తాండూరు మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గురువారం పట్టణ మున్సిపల్ కమిషనర్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల కార్మికులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం రూ.20 వేలు అందజేయాలని నిబంధనల్లో ఉన్నప్పటికీ మున్సిపల్ కార్యాలయం నుంచి ఇవ్వడం లేదన్నారు. అనారోగ్యం కారణంగా గురువారం మృతి చెందిన జోన్ 3లో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికురాలు నర్సమ్మ అంత్యక్రియల ఖర్చులకు నగదు అందజేయాలని కమిషనర్ను కోరినట్లు యూనియన్ నాయకులు గోపాల్, అశోక్, వెంకటప్ప, యాదగిరి, భాస్కర్, రమేష్, రాములు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన రూ.10 వేలు అంత్యక్రియల ఖర్చులకు అందజేశారన్నారు. నిబంధనల్లో పొందుపరిచిన విధంగా భవిష్యత్లో కార్మికులకు ఆర్థికసాయం అందజేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. -
పారదర్శకంగా గ్రామాభివృద్ధికి కృషి
నవాబుపేట: సర్పంచ్ అంటే పదవి కాదని, ప్రజలకు సేవ చేసే మార్గమని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరినీ శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామస్తులు మీపై ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పదన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టి, పారదర్శకంగా గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్, రంగారెడ్డి, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య -
కుష్టు అనుమానితుల గుర్తింపు
కొడంగల్ రూరల్: లెప్రసీ వ్యాధిగ్రస్తులను(కుష్టు) గుర్తించేందుకు వైద్యాధికారులు గురువారం నుంచి సర్వేను ప్రారంభించారు. గ్రామాల్లో ఉదయం ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వేలో అనుమానితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్, పాతకొడంగల్ గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తుండగా ఏఎన్ఎంలు పరిశీలించారు. ఈ నెల 31వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు ఏఎన్ఎంలు తెలిపారు. పరిశీలన సమయంలో అనుమానితులుగా గుర్తిస్తే సంబంధిత వ్యక్తుల ఫోన్ నంబర్, ఆధార్కార్డు జిరాక్స్, ఇంటి చిరునామాలను సేకరిస్తూ ఉన్నతాధికారులకు రిపోర్టు చేయనున్నట్లు సూచించారు. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం వ్యాధి ఉన్నట్లు గుర్తించివారికి మందులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం మనెమ్మ, ఆశ కార్యకర్తలు మంజుల, రాధ, ఇందిరమ్మ, సునిత, అనిత తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ దుద్యాల్: మండల వ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే సర్వే గురువారం ప్రారంభమైంది. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేపడుతున్నారు. దుద్యాల్, లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, ఈర్లపల్లి, గౌరారం, చెట్టుపల్లి తండా, అల్లిఖాన్పల్లి, వాల్యా నాయక్ తండా, నాజుఖాన్పల్లి, చిలుముల్ మైల్వార్ తదితర గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఒక్క ఆశ కార్యకర్త ప్రతి రోజు 20 ఇళ్లను సర్వే చేస్తున్నారు. ప్రారంభమైన లెప్రసీ సర్వే -
బడా నేతలకు ఝలక్!
యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ నేతలను ఖంగు తినేలా చేశాయి. పార్టీలోనే కీలక పదవులు.. కానీ సొంత గ్రామాల్లో మాత్రం ప్రజల నుంచి వారికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం పార్టీలో కీలక పదవుల్లో కొనసాగుతున్న నేతల స్వగ్రామాల్లో వారు పోటీలో నిలబెట్టిన సర్పంచ్, వార్డు సభ్యులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. రూ.లక్షలాధి ఖర్చు చేసి, కాళ్లకు గజ్జలు కట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా తమ మద్దతుదారులను గెలిపించుకోకపోవడం గమనార్హం. ఏళ్లుగా రాజకీయాల్లో అరితెరిన నాయకులు ఓటమిపాలు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. మద్దతు దారుల ఓటమిని తెలుసుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలు తమ పార్టీ నేతల వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. యాచారంలో ఉల్టా.. పల్టా! మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మేజర్ గ్రామాలైన యాచారంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న కొప్పు బాషా గ్రామ పంచాయతీ సర్పంచ్గా తన భార్య కొప్పు సుకన్య(మాజీ ఎంపీపీ)ను పోటీలో నిలబెడితే ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అంగోత్ వెంకటేష్ తక్కళ్లపల్లి తండాలో తన భార్య విజయను బరిలో పెడితే ఓడిపోయారు. గునుగల్లో పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్రెడ్డి సర్పంచ్గా పోటి చేసి ఓటమి పాలయ్యారు. మంతన్గౌరెల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ తన మద్దతుదారుడైన పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్యగౌడ్ను సర్పంచ్గా పోటీలో నిలబెడితే పరాజయం చెందారు. నక్కర్తమేడిపల్లిలో సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తన భార్య లావణ్యను సర్పంచ్ బరిలో నిలబెడితే ఓటమి చెందారు. నందివనపర్తిలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బిలకంటి చంద్రశేఖర్రెడ్డిలు కాంగ్రెస్ నుంచి పేరుమల్ల రవిని పోటిలో నిలబెడితే పరాజయం చెందారు. ఆయా పార్టీల్లో కీలక నేతలున్న గ్రామాల్లో వారి మద్దతుదారులు ఓటమిపాలు కావడంతో మండలంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఊర్లల్లో బోల్తాపడిన ఉద్దండులు పంచాయతీ ఎన్నికల్లో పలువురికి భంగపాటు ఊహించని ఓటమితో అంతర్మథనం రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వైనం -
భవనం నుంచి జారిపడి మేసీ్త్ర మృతి
శంకర్పల్లి: నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ప్రమాదవశాత్తు ఓ మేసీ్త్ర కాలు జారి పడి మృతి చెందిన సంఘటన శంకర్పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జాహంగీర్ అలం, అనరులోహక్ సోదరులు. ఇద్దరూ కలిసి ఏడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్పల్లి పట్టణానికి వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనరులోహక్(31) గురువారం పట్టణంలోని శాంటమ్ హోమ్స్లో సీలింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి పోయాడు. దీంతో తోటి మేసీ్త్రలు, కూలీలు శంకర్పల్లిలోని ఓ ఆసుపత్రికి, తర్వాత పటాన్ చెరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మేసీ్త్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భవన నిర్మాణ యాజమాన్యం కార్మికులకు ఎలాంటి భద్రతని ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
● ధాన్య సేకరణలో వేగం పెంచాలి ● డీసీఎస్ఓ సుదర్శన్ దుద్యాల్: రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా.. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంను నిల్వ ఉంచరాదని, సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్వహకులు, రైస్ మిల్లర్లకు జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్ సూచించారు. దుద్యాల్ రైతు వేదికలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. మాట్లాడారు. నిర్లక్ష్యం చేయకుండా రైతులు తెచ్చిన వరిని ఎప్పటికప్పుడు విక్రయించి మిల్లర్లు తరలించాలని సూచించారు. బిల్లులు సకాలంలో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లడుతూ.. వాహనాల్లో వచ్చిన ధాన్యంను వెంటనే అన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. నిల్వ ధాన్యం తరలింపు హస్నాబాద్ గ్రామంలో పది రోజులుగా కొనుగులు ప్రక్రియ నిలిచిపోవడంతో బుధవారం రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ‘దయుంచి.. స్పందించి’ ధాన్యం కొనండి శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. కొనుగోలు కేంద్రం వద్ద ట్రాక్టర్లలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొడంగల్, గౌరారంలోని రైస్ మిల్లర్లకు పంపించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, కొనుగోలు కేంద్రం నిర్వహకుడు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
ప్రమాణస్వీకారాన్ని ఆపేయండి
తాండూరు రూరల్: గాజీపూర్లో ఈనెల 11న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు సర్పంచ్ ప్రమాణ స్వీకారాన్ని ఆపేయాలని కోరుతూ గురువారం ఎన్నికల కమిషనలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్నను కలిసి, మద్దతుకోరారు. వీరిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు తిప్పన్నచారి, మాజీ సర్పంచులు ఈడ్గి సాయిలుగౌడ్, తలారి వీరప్ప, ఉప సర్పంచ్ గడ్డమీది ఏల్లప్ప, వార్డు సభ్యులు మంగళి భీమప్ప, కారుకొండ అనిల్ తదితరులు ఉన్నారు. గాజీపూర్వాసుల ఫిర్యాదు -
రూ.42 కోట్ల పత్తి కొనుగోళ్లు
దుద్యాల్: చెరువుల కింద యాసంగి వరి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే దుద్యాల్ గ్రామంలోని గోపన్ చెరువు కిందనున్న 120 ఎకరాల పొలాలకు సాగు నీరు అందించేందుకు జేసీబీతో కాలువల మరమ్మతులు గురువారం చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు నిండాయి. నీరు సాఫీగా చివరి పొలం వరకు సులువుగా అందేందుకు కాలువలు పూడిక చేపట్టినట్లు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య తెలిపారు. పనులు పూర్తవ్వగానే నీటి విడుదలకు తీర్మానం చేసి పంటలను సాగుకు ముందుకెళ్తామని పేర్కొన్నారు. బంట్వారం: యూరియా బుకింగ్ యాప్పై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా బంట్వారం, కోట్పల్లి మండలాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు వీసీని తిలకించారు. యూరియా బుకింగ్కు సంబంధించిన పలు అంశాలపై అధికారులు వీసీలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓలు కరుణాకర్రెడ్డి, శ్రావ్య, ఏఈఓలు సందీప్, మశ్చేందర్ డీలర్లు, రైతుల తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించి.. పెళ్లి చేసుకుని..
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ యువకుడు ఏడాది తిరగకుండానే భార్యను హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్లో గురువారం ఈ ఘటన జరిగింది. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం కరన్కోట గ్రామానికి చెందిన దస్తప్ప, చంద్రమ్మ దంపతుల కూతురు అనూష (20). భర్త మరణానంతరం చంద్రమ్మ తన కుమార్తెతో కలిసి సాయిపూర్లో ఉండేవారు. ఇదే కాలనీకి చెందిన పరమేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒకే సామాజికవర్గానికి చెందిన పరమేశ్, అనూష మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇరుకుటుంబాల అంగీకారం మేరకు ఈ ఏడాది మార్చి 12న వీరి వివాహం చేశారు. వివాహం జరిగిన మూడు నెలలనుంచే పరమేశ్.. కట్నం, బంగారం తేవాలంటూ తరచూ భార్యను వేధించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు సైతం అతనికే వంతపాడటంతో తరచూ అనూషను కొడుతుండేవాడు. గురువారం కూడా తన కూతురును కొట్టాడని తెలియడంతో కరన్కోట్లో ఉన్న తల్లి వచ్చి, అనూషను పుట్టింటికి తీసుకెళ్తుండగా మధ్యలో అడ్డుకున్న పరమేశ్ ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కర్రతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అనూష తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పరమేశ్తో పాటు అతని తల్లిదండ్రులు పరారయ్యారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లి, బంధువులు విగతజీవిగా పడి ఉన్న అనూషను చూసి బోరున విలపించారు. చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. -
ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే
షాబాద్: పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన మండల సర్పంచ్లను జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి అభినందించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో వివిధ గ్రామాల సర్పంచ్లు అవినాశ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఎన్నికలు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అంతారం, లక్ష్మరావుగూడ తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు అవినాశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ మేరకు ఆయన వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి -
పోలింగ్ కేంద్రంలో ఇరువర్గాల దాడి
పరిగి: పోలింగ్ కేంద్రంలో జరిగిన ఇరు వర్గాల దాడిలో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మాధారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మూడో విడత ఎన్నికలో భాగంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. ఓ సర్పంచ్ అభ్యర్థిపై ఓ వర్గం వారు దాడి చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దాడిలో గాయపడిన ఓ వర్గానికి చెందిన రాములును పరిగి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మరో వర్గంపై దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయించారు. ఎంపీ నిధులతో అభివృద్ధి అనంతగిరి: బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచిన గ్రామాల్లో ఎంపీ నిధుల కింద రూ.10 లక్షలు మంజూరు చేసుకుని, అభివృద్ధి చేస్తామని బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు అన్నారు. వికారాబాద్ మండలం మైలార్ దేవరాంపల్లి గ్రామంలో ఉపసర్పంచ్గా గెలుపొందిన బసంత బస్వలింగంను బుధవారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కేంద్రం ఇచ్చిన నిధులే ఉన్నాయన్నారు. పీఎం నరేంద్రమోదీ గ్రామాలభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న భావనతో అన్ని విధాలా నిధులు కేటాయించనున్నారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో గ్రామాలను తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బస్వలింగం పాల్గొన్నారు. పోలింగ్ ప్రశాంతం: కలెక్టర్ అనంతగిరి: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం పరిగి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 83.56 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారని తెలిపారు. చేవెళ్ల: సర్పంచ్లందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామ సర్పంచ్గా గెలిచిన తిప్పని మాధవిరాంరెడ్డి, ఉపసర్పంచ్ మహేశ్వరీరాములు, ఎన్కేపల్లి సర్పంచ్ బి.మహిపాల్రెడ్డి, ముడిమ్యాల సర్పంచ్ గౌడిచర్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన సర్పంచ్లు, వార్డుసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే పోటీ ఉండాలని, గ్రామాల అభివృద్ధికి అంతా కలిసిమెలసి పనిచేసుకోవాలని సూచించారు. అభివృద్ధికి తనవంతు కృషిని అందిస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్రెడ్డి, మాజీ సర్పంచ్లు పి.ప్రభాకర్, శ్రీనివాస్గౌడ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకారం శంకర్పల్లి: మండలంలోని సంకేపల్లి గ్రామ సర్పంచ్ దేశ్పాండే శ్రీనివాస్ బుధవారం వార్డు సభ్యులు, మద్దతుదారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
నిద్రలోనే నూరేళ్లు నిండాయి
● ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం ● దుకాణంలోకి దూసుకెళ్లిన కారు మైలార్దేవ్పల్లి: అతివేగం.. డ్రైవింగ్లో నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన తండ్రీకొడుకులు అసువులు బాశారు. నిద్రలోనే వారికి నూరేళ్లు నిండాయి. మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విశ్వనాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే యువకుడు తన స్నేహితులు మరో ఐదుగురితో కలిసి శంషాబాద్ నుంచి ఇన్నోవా కారులో తెల్లవారుజామున తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ప్రభు మహారాజ్ కుటుంబ సభ్యులు దుర్గానగర్ ప్రాంతంలో దుప్పట్లు, రగ్గుల విక్రయ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోజు మాదిరిగానే వారు దుకాణంలో నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కారు అతివేగంతో వచ్చి అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో నిద్రిస్తున్న ప్రభు మహరాజ్ (60), దీపక్ (25), సంతునాథ్ (27)పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రభు మహరాజ్, దీపక్ అక్కడికక్కడే మృతి చెందారు. సంతునాథ్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సయ్యద్ హుస్సేన్ నిద్ర మత్తులో ఉండటంతో పాటు మంచు కురుస్తుండటంతో కారు బీభత్సం సృష్టించిందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జోక్యం చేసుకోలేం..
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై పిటిషన్ల దాఖలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వార్డుల్ఢసంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డీలిమిటేషన్లో భాగంగా చేపట్టిన జనాభా వివరాలు, మ్యాప్లు బహిర్గతం చేయడంతో వచ్చే నష్టమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 24 గంటల్లో వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించింది. వీటిపై అభ్యంతరాలు సమర్పించేందుకు పిటిషనర్లు, ప్రజలకు మరోరెండు రోజులు అవకాశం ఇచ్చింది (వాస్తవానికి ఈ నెల 17తో అభ్యంతరాలకు గడువు ముగిసింది). విభజనలో లోపాలున్నాయన్న పిటిషనర్ల వాదనపై.. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నిబంధనలు పాటించలేదు.. జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్యను పెంచుతూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పొన్న వెంకట్ రమణ, మరో ఇద్దరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లు (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996 ప్రకారం నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. అలియాబాద్ ప్రాంతాన్ని రెండు వార్డులుగా విభజించడంతో ప్రజా సౌకర్యాల లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ స్థానిక స్వపరిపాలనకు అంతరాయం కలిగిస్తుందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన అధ్యయన నివేదిక ఆధారంగా, జీవో 266 ప్రకారం డీలిమిటేషన్ కసరత్తు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అభ్యంతరాలపై రెండ్రోజులు గడువు పెంచిన హైకోర్టు మ్యాప్లు, జనాభా లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సూచన స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి న్యాయస్థానం విముఖత విస్తృత అధ్యయనం చేసిన తర్వాతే.. ‘డీలిమిటేషన్ నిబంధనల్లోని 5వ నిబంధన ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా వార్డుల ఏర్పాటు తప్పనిసరి. వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించకూడదు. విభజన తర్వాత వార్డుల జనాభా గణాంకాలను వెల్లడించలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో మ్యాప్లు, సరిహద్దు వివరణ, ఇంటి సంఖ్య వివరాలు లేవు. ఇలా ఉంటే ప్రజలు వార్డు పరిమితులను గుర్తించడం అసాధ్యం. అలాగే ప్రభుత్వం పరిపాలనా, భౌగోళిక సామీప్యతను ఉల్లంఘించింది. కొన్ని వార్డులు బహుళ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ప్రాథమిక నోటిఫికేషన్ను జీహెచ్ఎంసీ ప్రతినిధి జనరల్ బాడీ ముందు సరిగా ఉంచలేదు’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వార్డుల విభజన ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. విస్తృత అధ్యయనం, చర్చల తర్వాత చేపట్టామన్నారు. ‘ఇది ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు మున్సిపాలిటీల విస్తరణతో పరిపాలనలో సత్ఫతాలిస్తుంది. ఇప్పటికే 3,102 అభ్యంతరాలు వచ్చాయి. ప్రతిదానికీ ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాం. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, తగిన విధంగా స్పందిస్తాం’ అని చెప్పారు. పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జె. ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను అర్థవంతంగా పరిగణించలేదని, వార్డుల వారీగా జనాభా డేటాను బహిర్గతం చేయలేదన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి.. వార్డుల విభజన ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించారు. కాగా.. పారదర్శకత అవసరమని నొక్కి చెప్పారు. వార్డుల వారీగా జనాభా వివరాలు, ప్రామాణీకరించిన మ్యాప్లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలు రెండు రోజుల వ్యవధిలో మరిన్ని అభ్యంతరాలు లేవనెత్తవచ్చని హైకోర్టు సూచించింది. -
పరిగిలో ‘కారు’ జోరు
19 స్థానాల్లో బీఆర్ఎస్, 12 చోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ పరిగి: మండలంలో బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. ఈ జీపీలో మొత్తం 32 గ్రామ పంచాయతీలు ఉండగా రెండు ఏకగ్రీవం అయ్యాయి. 30 పంచాయతీలకు పోలింగ్ జరగ్గా 19 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. 12 స్థానాలను కాంగ్రెస్, ఒకచోట బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందడంపై ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప యాలాల: ఉపాధి హా మీ పథకంలో మా ర్పులకు గాను తెస్తున్న 20 25 కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు. 2005 తెచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2025 పేరతో 197 బిల్లును కేంద్ర ప్రభు త్వం తీసుకువస్తోందని, ఈ బిల్లు చట్టమైతే తలలేని మొండెంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బిల్లులో ఉపాధి అవకాశాలు, మెరుగుపరిచే చర్యల గురించి ప్రస్తావన లేదన్నారు.కొత్త బిల్లులో పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్లు చెప్పి, 60 రోజులు పని నిషేధం విధించారన్నారు. ఇప్పటి వరకు 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్రం వాటా ఉండేదని, ప్రస్తుత బిల్లు చట్టమైతే రాష్ట్రాల వాటా 40 శాతం ఉండాలనే నిబంధన పథకాన్ని నిర్వీర్యం చేసే పనికి నిదర్శనమన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సలామ్.. సీమాసుల్తానా బషీరాబాద్: బాధ్యతలు తీసుకోకముందే బాధ్యతెరిగిన ఓ నూతన సర్పంచ్ యాక్షన్లోకి దిగారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. సొంత డబ్బు ఖర్చు చేసి తాగునీటి సమస్యకు చెక్ పెట్టి అందరి మన్ననలు పొందుతున్నారు. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామ సర్పంచ్గా వరుసగా రెండో సారి ఎన్నికై న సీమాసుల్తానా గ్రామ సమస్యలపై ఫోకస్ పెట్టారు. పలు కాలనీల్లో పాడైన బోరుబావులకు, మోటార్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. కొత్త మోటార్లు బిగిస్తున్నారు. మొదటి వార్డు ఉప్పరివాడ, రెండో వార్డు బీసీ కాలనీలో పాడైన రెండు చేతి పంపులను తొలగించి వాటి స్థానంలో కొత్త బోరు మోటార్లు బిగించారు. 4వ వార్డు మద్దూర్ వాడ, 7వ వార్డు టవర్ గల్లీ, 8వ వార్డు జోగు కాలనీల్లో కాలిపోయిన మూడు బోరు మోటార్లకు బుధవారం మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను రెండోసారి సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుర్వ తమ్మణ్ణ, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ ఖాలీద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాయిచరణ్ ఆమనగల్లు: జాతీయ స్థాయి అండర్–17 విభాగం కబడ్డీ పోటీలకు మండల పరిధిలో ని దయ్యాలబోడు తండాకు చెందిన ఎన్.సాయిచరణ్ ఎంపిక్యాడు. ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాయి చరణ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు మధ్యప్రదేశ్లో నిర్వహించనున్న జాతీయ పోటీలకు ఆయన్ను ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, అధ్యాపకబృందం విద్యార్థిని అభినందించారు. -
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి
నేడు మెజార్టీతో భార్య విజయం దౌల్తాబాద్: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. సర్పంచ్లకు పూర్తి సహకారం మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి తాండూరు రూరల్: నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నూతన సర్పంచులకు పూర్తి సహకారం అందిస్తానని మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. పెద్దేముల్ సర్పంచ్గా ఎన్నికై న డీవై చిన్న నర్సింలును బుధవారం సన్మానించారు. అనంతరం గ్రామంలోని జితేందర్రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మంచన్పల్లి పొలాలకు కోట్పల్లి ప్రాజెక్టు నుంచి నీరు వదలాలని కలెక్టర్ ప్రతీక్జైన్కు ఫోన్ చేసి కోరారు. కార్యక్రమంలో నాయకులు గాజీపూర్ నారాయణరెడ్డి, లక్ష్మారెడ్డి, మహిపాల్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, నరేష్రెడ్డి, రవిశంకర్, మ ధుసూదన్రెడ్డి, గోపాల్రెడ్డి, అంజిల్రెడ్డి, నారాయణ గౌడ్, రాములు నాయక్, గోపి నాయక్, మన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రోహింగ్యా యువకుడి దారుణ హత్య
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శరణార్థులుగా నివాసం ఉంటున్న బర్మా దేశస్తుల(రోహింగ్యాలు) క్యాంప్లో ఓ యువ కుడు హత్యకు గురయ్యాడు. ఇన్స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ కాలనీలోని బర్మా(మయన్మార్) క్యాంప్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఆ దేశానికి చెందిన ముర్షీద్(19), అబ్దుల్లా (20) మద్యం మత్తులో చిన్న చిన్న విషయాలను మనసులో ఉంచుకొని పరస్పరం దూషించుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్లా ఇంట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి ముర్షీద్ వీపు, మెడ భాగాలలో విచక్షణా రహితంగా 15 పోట్ల వరకు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్లు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చిరు వివాదంతోనే 15 కత్తి పోట్లు పొడిచాడా? అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్త మవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
గోపాల్ ‘తీన్’మార్!
దోమ: మండలంలోని పెద్దతండాచిన్నతండా పంచాయతీలో బుధ వారం నిర్వహించిన సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ నువ్వా..నేనా.. అన్నట్లగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన నేనావత్ లక్ష్మణ్, బీఆర్ఎస్ మద్దతుతో ఆంగోత్ గోపాల్ బరిలో ఉన్నారు. వీరి మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్ష్మణ్పై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గోపాల్ విజయం సాధించారు. ‘గండిపేట’లోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం గలీజవుతోంది. సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఏన్నాళ్ల నుంచి జరుగుతుందోగాని బుధవారం స్థానికులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. బుధవారం ఇక్కడ ఉన్న కట్టపై ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలోకి వదులుతున్నారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ను నిలదీశారు. స్థానికులు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్ను ప్రశ్నించారు. శివనాయక్కు సంబంధించిన వాహనమని.. హిమాయత్నగర్ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నట్లు డ్రైవర్ చెప్పాడు. దీంతో డీజీఎం నరహరి మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రణాళికతో సాగండి
దుద్యాల్: మండలంలోని హకీంపేట్ శివారులో చేపట్టిన పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలని, ప్రణాళికతో ముందుకు సాగాల ని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి పారిశ్రామిక వాడ, ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. ఏఏ విద్యాసంస్థలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుతో అనేక కంపెనీలు వస్తాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని సూచించారు. ముందుగా రోడ్డు పనులను పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ కవిత, డీఈ శేషగిరి, ఎడ్యుకేషన్ హబ్ చీఫ్ ఇంజనీర్ షఫీ, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈఈ రాజయ్య, ఏఈలు విజయ భాస్కర్ రెడ్డి, జనార్దన మూర్తి, తహసీల్దార్ కిషన్, ఆర్ఐ నవీన్ కుమార్, సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమణలు తొలగించాల్సిందే
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలో రోడ్లను ఆక్ర మించి వ్యాపారం చేసుకుంటున్న వారు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలని, లేకుంటే తామే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి హెచ్చరించారు. మూడు రోజుల్లోగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించారు. బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి మార్కెట్ వరకు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు. వార్డుల్లో విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సమస్యల తక్షణపరిష్కారం కోసం సంబంధించిన ఇన్చార్జ్ల పేర్లు, ఫోన్ నంబర్లను గోడలపై రాశామన్నారు. ఫోన్ చేసి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అయినా పరిష్కారం కాకపోతే నేరుగా కార్యాలయానికి వచ్చి అక్కడి రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలోటౌన్ ప్లానింగ్ అధికారులు వంశీధర్, నరేష్, ప్రియ, శానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి.. నేడు భార్య ఘన విజయం
సిద్దిపేట జిల్లా: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. గోపాల్ ‘తీన్’మార్! దోమ: మండలంలోని పెద్దతండాచిన్నతండా పంచాయతీలో బుధ వారం నిర్వహించిన సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ నువ్వా..నేనా.. అన్నట్లగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన నేనావత్ లక్ష్మణ్, బీఆర్ఎస్ మద్దతుతో ఆంగోత్ గోపాల్ బరిలో ఉన్నారు. వీరి మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్ష్మణ్పై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గోపాల్ విజయం సాధించారు. -
ఇనుప పైపు పడి వ్యక్తికి గాయాలు
దుద్యాల్: బోరు వేసే వాహనం నుంచి ఇనుప పైపు పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని సంట్రకుంట తండాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాథోడ్ వెంకటేశ్ తన పొలంలో బోరు వేయడానికి వాహనాన్ని పిలిపించి వేయించారు. ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఇనుప పైపులు వాహనంలో సరిగా అమర్చకపోవడంతో పక్కన ఉన్న వెంకటేశ్పై పడ్డాయి. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడిని కుటుంబ సభ్యులు మహబూబ్నగర్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. మానసిక స్థితి సరిగా లేక వెళ్లిపోయిన వైనం యాలాల: మానసిక పరిస్థితి సరిగా లేని ఓ యువకుడు ఇంటి నుంచి ఐదేళ్ల క్రితం వెళ్లి పోయాడు. ప్రస్తుతం అతడు కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు అక్కడి అధికారులు తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యాలాల మండలానికి చెందిన శంకర్ మానసిక పరిస్థితి బాగా లేదు. ఐదేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి రైలెక్కి కేరళ రాష్ట్రానికి వెళ్లిపోయాడు. అప్పట్లో అతడి గురించి కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కేరళలో ఉంటున్న శంకర్ను అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించి వివరాలు సేకరించగా, తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ముద్దాయిపేట అని తేలింది. దీంతో అక్కడి యంత్రాంగం స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వాట్సాప్లో ఫొటో పంపడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుర్తు పట్టారు. దీంతో శంకర్ను కేరళ నుంచి తెలంగాణకు బుధవారం తీసుకురానున్నట్లు తెలిపారు. తాండూరు రూరల్: రైతుల పొలాల వద్ద ఉన్న బోరు మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ సంఘటన మండల పరిధిలోని వీర్ శెట్టిపల్లి, బెల్కటూర్, ఎల్మకన్నె గ్రామాల్లో చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన ప్రకారం.. వీర్శెట్టిపల్లి, బెల్కటూర్, ఎల్మకన్నె గ్రామాలు కాగ్నావాగు పరివాహన ప్రాంతాల్లో ఉన్నాయి. వాగులోంచి బోరు మోటార్ల ద్వారా నీటిని పొలాలకు పారిస్తుంటారు. గుర్తు తెలియని దుండగులు ఆ బోరు మోటార్లను దొంగలిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వీర్శెట్టిపల్లిలో బొప్పి హన్మంత్, బక్క మల్లప్ప, గుడిసె నర్సింలు, బలిజ జగదీశ్, పరమేశ్, గుడిసె అనంతప్ప, తూర్పు మల్లప్ప ఎల్మకన్నె గ్రామ రైతుల బోరు మోటర్లు చోరికి గురైనట్లు రైతులు చెప్పారు. ఈ మేరకు మంగళవారం కరన్కోట్ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. దోమ: జ్వరంతో బాధ పడుతూ ఓ ఆర్మీ ఉద్యోగి సోమవారం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దోమ మండలంలోని దాదాపూర్ గ్రామానికి చెందిన తోకని అంజయ్య, కనకమ్మల రెండో కుమారుడైన శ్రీనివాస్(22) రెండేళ్ల క్రితం ఆర్మీలో జవాన్గా చేరారు. ప్రస్తుతం పంజాబ్లో విధులు నిర్వహిస్తున్న ఆయన రెండు రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యం పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం దాదాపూర్లో అధికారిక లాంఛనాలతో శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య కడ్తాల్: మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన దంపతులు వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించారు. 2018లో జీపీగా ఆవిర్భవించిన ఈగ్రామంలో 2019లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా, ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో తండాపెద్దలు సమావేశమై లోకేశ్నాయక్ను ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈనెల 14న జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. దీంతో లోకేశ్నాయక్ సతిమణి నీలావతి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి అంజమ్మపై 35 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
కొనుగోల్మాల్!
బషీరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఐకేపీ నిర్వాహకులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు పంచాయతీ ఎన్నికల్లో తలమునకలవడంతో రైస్ మిల్లర్ల కనుసన్నల్లో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తూకాలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తాకు 40.6 కిలోలు తూకం వేయాల్సి ఉండగా ఐకేపీ, సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో 42.250 కిలోల నుంచి గరిష్టంగా 42.5 కేజీలుగా తూకాలు వేస్తున్నారు. ఇలా ఒక్కో బస్తాకు అదనంగా 1.65 కిలోల నుంచి రెండు కిలోల వరకు రైతుల నుంచి ధాన్యం అదనంగా లూటీ చేస్తున్నారు. మిల్లర్ల మాయాజాలం జిల్లాలో 29 ఐకేపీ కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు 2,252 మంది రైతుల నుంచి 2,58,315 బస్తాల ధాన్యం సేకరించారు. అయితే పాడి క్లీనర్ వేస్తే బస్తాకు 40.600 కేజీలు తూకం వేయాలని, శుభ్రంలేని వడ్లు గరిష్టంగా 41 కిలోలు వరకు తూకాలు వేయొచ్చని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడే మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. బస్తాకు కనీష్టంగా 42 కిలోల ధాన్యం లేకుంటే లారీలను వాపస్ పంపిస్తామని, అంతకంటే అదనంగా తూకాలు వేసి పంపితే ‘గుడ్విల్’ఉంటుందని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ కొనుగోలు కేంద్రంలో బస్తాకు 42.250 తూకం వేస్తుంటే.. యాలాల మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్లో గరిష్టంగా 42.500 కేజీలు తూకం వేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే రోజుల తరబడి వారి ధాన్యం తూకం వేయకుండా కాలయాపన చేస్తున్నారు. 3,874 క్వింటాళ్లు ధాన్యం దోపిడీ జిల్లాలో నేటికి 2,58,315 బస్తాలు తూకాలువేసి మిల్లులకు పంపించారు. అయితే ఒక్కోబస్తాకు కనీసం 1.5 కిలోలు చొప్పున లెక్క గట్టినా 3,874 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కలిసి దోపిడీకి ప్పాడినట్లు తేటతెల్లమవుతోంది. ఒక్క క్వింటాల్కు మద్దతు ధర రూ.2,390 చొప్పున దోపిడీ జరిగిన ధాన్యం విలువ రూ.9.25 లక్షల విలువ చేస్తుంది. ఇది కేవలం ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లకు సంబంధించిన అంచనా మాత్రమే. ఇంకా సొసైటీల ద్వారా జరిగిన కొనుగోళ్లలోనూ ఇదే తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. ఇంతా జరుగుతున్నా జిల్లా సివిల్ సప్లై అధికారులు గానీ, డీఆర్డీఓ ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయం. మిల్లర్ల కనుసన్నల్లో కొనుగోలు కేంద్రాలు ఒక్కో బస్తాపై రెండు కిలోల అదనంగా తూకం లేబర్ చార్జీల పేరిట క్వింటాల్కు రూ.50 వరకు వసూళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ధాన్యం అమ్మేందుకు తీసుకువస్తే బస్తాకు 42.2 కిలోల చొప్పున తూకం వేశారు. 364 బస్తాలకు 582 కిలోల ధాన్యం అదనపు తూకంతో దోచుకున్నారు. దీంతో సుమారు రూ.13 వేలు నష్టపోయా. అధికారులను ప్రశ్నిస్తే తూకాలు వేయకుండా అడ్డుకుంటున్నారు. – ప్రశాంత్రెడ్డి, రైతు, రెడ్డిఘణాపూర్ -
ఆమే కీలకం
● మండలంలోని పది గ్రామాల్లో మహిళా ఓటర్లే అధికం ● సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను శాసించనున్న అతివలు ఇబ్రహీంపట్నం: మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు, 140 వార్డులకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 31,835 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 15,780, మహిళలు 16,053 మంది, ఇతరులు ఇద్దరున్నారు. పురుషులకంటే 273 మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఒక్కో ఓటు కీలకమే.. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుల ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. అవే ఫలితాలను తారుమారు చేస్తాయి. ఏ ఒక్క ఓటు చేజారకుండా అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేశారు. అతి తక్కువగా కర్ణంగూడలో .. మండలంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామం కర్ణంగూడ. ఈ గ్రామంలో కేవలం 697 మంది ఓటర్లే ఉండటం గమనార్హం. అదేవిధంగా అత్యధికంగా దండుమైలారంలో 4,959 మంది ఉన్నారు. సుమారు రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికల కోసం నిరీక్షించిన అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో గెలవడం ఓ పరీక్షలా మారింది. అంగ, అర్థ, బంధు బలగాలతో ప్రచారంతోపాటు, ఓటర్లకు తాయిలాలను సమర్పించి ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీల మద్దతుదారులు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలతో పంచాయతీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం సాగింది. ఇక ఓటర్ల తీర్పు ఏరకంగా ఉంటుందో వేచిచూడాల్సిందే. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు గ్రామపంచాయతీ పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం చర్లపటేల్ గూడ 951 941 – 1,892 దండుమైలారం 2,456 2,503 – 4,959 ఎలిమినేడు 1,653 1,734 – 3,387 కప్పపహాడ్ 909 935 – 1,844 కర్ణంగూడ 339 358 – 697 ముకునూర్ 591 579 1 1,171 నాగన్పల్లి 865 864 1 1,730 నెర్రపల్లి 710 542 – 1,052 పోచారం 1,083 1,088 – 2,171 పోల్కంపల్లి 1,646 1610 – 3,256 రాయపోల్ 2,475 2,481 – 4,956 తుర్కగూడ 505 546 – 1,051 తులేకలాన్ 942 1,000 – 1,942 ఉప్పరిగూడ 855 872 – 1,727 -
కన్నతల్లే కర్కశురాలై
● అపార్ట్మెంట్ పైనుంచి బిడ్డను కిందకు తోసేసిన వైనం ● అక్కడికక్కడే మృతిచెందిన ఏడేళ్ల చిన్నారి మల్కాజిగిరి: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు నెట్టేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెల్పిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న వాదనలు.. చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విన్పిస్తున్నాయి. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
గెస్ట్ లెక్చరర్ నియామకాల్లో అవకతవకలు
తాండూరు టౌన్: అతిథి అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్ ఆరోపించారు. ఇందులో జిల్లా నోడల్ అధికారి శంకర్నాయక్ పాత్రపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం తాండూరు సబ్కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ.. తాజా నియామకాల సందర్భంగా పదేళ్లకు పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న మహేశ్తో పాటు పలువురిని అకారణంగా తొలగించడం అన్యాయమన్నారు. అనుభవం, అర్హత ఉన్న అధ్యాపకులు ఏళ్ల తరబడిగా చాలీచాలని జీతానికి సేవలందిస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారన్నారు. వారిని తొలగించడం సబబు కాదన్నారు. అతిథి అధ్యాపకుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై ఇంటర్మీడియెట్ జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్పై ఆరోపణలున్నాయని, తక్షణమే ఆయనపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, నాయకులు వెంకటేశ్, అనిత, జగదీశ్వరి, రాజు, జోసఫ్, బాబా గౌడ్, నరేందర్, రమేశ్, యాసర్ తదితరులు ఉన్నారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్కుమార్ -
పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలి
ఎమ్మెల్యే కాలె యాదయ్యచేవెళ్ల: స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని రావుపల్లి గ్రామ సర్పంచ్ గోటూరి రాంచంద్రయ్యగౌడ్, వార్డుసభ్యులతో కలిసి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను సన్మానించి.. స్వీట్లు తినిపించారు. ఆయనను కలిసిన వారిలో పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, ఉపసర్పంచ్ అనూషఅంజన్కుమార్, వార్డుసభ్యులు మల్లీశ్వరి, జ్యోతి వెంకటేశ్, గోపాల్, మాజీ ఉపసర్పంచ్ నాగిరెడ్డి, ప్రకాశ్రెడ్డి, గ్రామ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్లో చేరిక.. మండలంలోని నాల్యట గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎల్లయ్య, తన అనుచరులతో మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో న్యాలట గ్రామ నాయకులు, యవకులు ఉన్నారు. -
బీఆర్ఎస్ సర్పంచ్లను కాంగ్రెస్లోకి తీసుకోం
తాండూరు రూరల్: బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ సర్పంచులను తీసుకుంటే గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు మొదలై, ఘర్షణలు చెలరేగే ఆస్కారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరూ అపోహలకు పోవద్దని, కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి, అవకాశాలు వస్తూనే ఉంటాయని, అప్పటి వరకూ వేచి చూడాలని దిశానిర్దేశం చేసినట్లు వినికిడి. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన మాట వినేవారికే అవకాశం ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. అనంతగిరి: పనికోసం ఇంటి నుంచి వెళ్లిన కూలీ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సాలె రమేశ్ కుటుంబంతో కలిసి వికారాబాద్లో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో అతని భార్య లలిత ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పీఎస్లో సమాచారం ఇవ్వాలని కోరారు. -
నేడే ఫైనల్
వికారాబాద్/పరిగి: మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది మండల కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన గ్రామాలకు మంగళవారమే చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. మొత్తం 157 గ్రామపంచాయతీలు ఉండగా ఇప్పటికే 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 139 స్థానాలకు గాను 289 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,336 వార్డులకుగాను 138 వార్డులు ఏకగ్రీవం కాగా 1,198 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. బుధవారం ఉగయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు పోలింగ్ ఉంటుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఐదు మండలాలకు 1,202 టీంలు ఎన్నికలు నిర్వహించనున్న పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. రెండు దఫాలుగా రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో పాటుగా పీఓలు, ఓపీఓలు విధులు నిర్వహిస్తారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికలకు గాను 1,470 మంది పీఓలు, 1,726 మంది ఓపీఓలు, ఇద్దరు సభ్యులుండే టీంలు 988, ముగ్గురు సభ్యులుండే టీంలు 214 కలుపుకొని మొత్తం 1,202 టీంలు ఎన్నికల విధుల్లో పాల్గొంటాయి. 2,718 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీపీఓ జయసుధ ఇతర జిల్లా అఽధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 45 రూట్లు ఎన్నికల నిర్వహణకుగాను 45 రూట్లుగా విభజించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండడానికి గాను 800 మంది పోలీసుసిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నా రు. స్థానిక పోలీసు సిబ్బందితో బటయ నుంచి వచ్చిన (సుమారు 150 మంది) స్పెషల్ పోలీసు లు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మూడు విడతల ఎన్నికలకు గాను ఎప్పటికప్పుడు శాంతిభద్రతల సమస్యలను తెలుసుకోవడానికి ఎస్పీ కార్యాలయంలో పోలీసు కంట్రోల్రూం ఏర్పాటుచేశారు. మండలానికి ఒకరు చొప్పున డీఎస్పీ, సీఐలను నియమించి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వేచ్ఛగా ఓటేసేలా.. కలెక్టర్ ప్రతీక్జైన్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ఓటింగ్కు ఏర్పాట్లు పూర్తిచేశారు. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక ప్రతిభావంతులకు ఓటు వేసే సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీల్ చైర్లు తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రలోభాల పర్వంలో మునిగిపోయారు. ఓటర్ను పోలింగ్ బూత్కు తరలించేందుకు శాయశక్తులు ఒడ్డుతున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలు మూడో విడతలో ఐదు మండలాల్లో 157 పంచాయతీలకు గాను 18 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు 17 మంది ఉండగా కుల్కచర్ల మండలం దాస్యనాయక్ తండా నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కవిత సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. తుది విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఏకగ్రీవ సర్పంచ్లు వీరే..గ్రామం సర్పంచ్ పూడూరు కొత్తపల్లి దీపికారెడ్డి పరిగి మండలం మల్కచెర్వుతండా గోపాల్ రూప్సింగ్ తండా రమణిబాయి దోమ లింగన్పల్లి గోపాల్ కిష్టాపూర్ వరలక్ష్మి దోర్నాల్పల్లి సత్యానారాయణరెడ్డి పెద్దతండా సురేఖ చెట్లగొల్కతండా కవిత కుల్కచర్ల తిర్మలాపూర్ మాధవి బోట్యానాయక్ తండా సంతోశ్ ఎత్తక్వాతండా సీతారామ్ దాస్యనాయక్ తండా కవిత చౌడాపూర్ కిష్టంపల్లి రాధిక వాల్యానాయక్ తండా నర్సింహ నాయక్ కొత్తపల్లి రజిత నీర్సాబ్ తండా నారాయణ మక్తవెంకటాపూర్ కవిత లింగన్నపల్లి కిష్టమ్మ -
విజేతలెవరో?
ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 73 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల ఉంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజేతలెవరో తేలి పోనుంది. అలుపెరుగని ప్రచారం వారం రోజులుగా ఇంటింటికీ, గడపడపకూ తిరిగి అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగించారు. ప్రచార ఘట్టంలో ఎవ్వరినీ కాదనకుండా హామీల వర్షం గుప్పించారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు, ఆకట్టుకునేందుకు మందు, విందు, గిఫ్ట్లు, నగదు చెల్లింపులు చేశారు. ప్రత్యర్థి అంత ఇచ్చాడంటే దానికంటే కొంత ఎక్కువిచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతూ తాయిలాలు సమర్పించుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల వరకు వెచ్చించినట్టు సమాచారం. పైకి గంభీరంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మత్రం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఆదరించేనా.. తిరస్కరించేనా.. లక్షలు ఖర్చు చేసినా ఓటర్లు తమను ఆదరిస్తారా.. అందలం ఎక్కిస్తారో లేదోనన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. శతవిధాలా ప్రయత్నించినా ఓటరు నాడిని మాత్రం పసిగట్టలేకపోయారు. చివరి నిమిషంలో ఏం జరుగుతుందో.. ఓటరు కరుణా కటాక్షాలు ఎవరిపై ఉంటాయోనని టెన్షన్తో గడుపుతున్నారు. ఏలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. గ్రామంలో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో నివసించే వారిని రప్పించి ఓట్లు వేసేవిధంగా ఎవరికివారే ఏర్పాట్లు చేశారు. ఇందుకు ప్రత్యేక సదుపాయాలు, ప్యాకేజీలు సమర్పించారు. కొన్నిచోట్ల తమ స్థాయికి మించి ఖర్చు చేశారు. బుధవారం సాయంత్రంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓటర్లు ఎవరిని తిరస్కరిస్తారో.. ఎవరికి పట్టం కడతారో తేటతెల్లం కానుంది. -
●విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
దోమ: సమస్యాత్మక గ్రామాలపై పటిష్ట నిఘా పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. మంగళవారం ఆమె దోమ ఎన్నికల నిర్వహణ తీరుపై మండల ఎన్నికల సహాయ అఽఽధికారి గ్యామాను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. విధు ల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. మహేశ్వరం: మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు లు, అధికారులకు సహకరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆయ న ఏసీపీ జానకిరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమతి లేని వారిని, ఓటరు కానివారిని పోలింగ్ బూత్ల్లోకి అనుమతించొద్దని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
● సాధారణ ఎన్నికల జిల్లా అధికారి షేక్ యాస్మిన్ బాష
పరిగి: మూడో విడత పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల జిల్లా అధికారి షేక్ యాస్మిన్ బాష సూచించారు. మంగళవారం ఆమె పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా యాస్మిన్బాష మాట్లాడుతూ.. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను సరిచూకోవాలన్నారు. పోలింగ్లో లోపాలు ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు. ఆమె వెంట డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేదంలో హన్మంత్కు డాక్టరేట్
బొంరాస్పేట: పదిహేనేళ్లుగా ఆయుర్వేద వైద్యసేవలందిస్తున్న గుంజ హన్మంత్ డాక్టరేట్ పట్టా పొందారు. లింగన్పల్లికి చెందిన ఆయన ప్రకృతిలో ఉన్న వనమూళికలను ఆయుర్వేదంగా మార్చి ప్రజలకు వైద్యం అందిస్తున్నందుకు గాను చైన్నెలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ వర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ (ఆయుర్వేదం) ఈ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా హన్మంత్ మాట్లాడుతూ తన ఆయుర్వేద విద్యకు పునాదులు వేసిన డాక్టర్ చెన్మూర్ నారాయణరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, హీరాలాల్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: రాష్ట్రంలో పరిగి నియోజకవర్గాన్ని మోడ ల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మె ల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపల్ పరిధిలోని తిరుమల వెంచర్లో రూ.20 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్, తుంకుల్గడ్డలో రూ.15లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి ప్రాంత అభివృద్ధే తన లక్ష్యమన్నారు. ఓపెన్ జిమ్ను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. తుంకుల్గడ్డలో విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, పట్టణ అధ్యక్షుడు కృష్ణ, గోపాల్, చిన్న నర్సింలు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు జిల్లా వైద్యాధికారి స్వర్ణలత పరిగి: నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి స్వర్ణలత అన్నారు. మంగళవారం ఆమె పట్టణకేంద్రంలోని విజేత ఆస్పత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులు లేక పోవడంతో నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. నోటీలసుకు వెంటనే వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో అనుమతులు ఉన్న చికిత్సలే నిర్వహించాలన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం షాద్నగర్రూరల్: పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని గిరిజన గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్రెడ్డి విద్యార్థినులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, మైక్రోబయోలజీ హెడ్ కళాజ్యోతి, బోటనీ హెడ్ స్పందన పాల్గొన్నారు. -
వనజీవి రామయ్య బయోపిక్
అనంతగిరి: పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసి కోటి మొక్కలు నాటిప వనజీవి రామయ్య జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు. మంగళవారం చిత్ర యూ నిట్ వికారాబాద్ సమీపంలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో, పట్టణంలో పలు ప్రాంతాల్లో పలు సీన్ లు చిత్రీకరించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడ మే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ ఫిలిం బ్యా నర్ పై ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు డైరక్టర్ వేముగంటి తెలిపారు. వనజీవి రామయ్య పాత్రలో న టుడు బ్రహ్మాజీ నటించగా, ఆయన భార్య పాత్రలో నాగరాణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా బల్లె మోహన్, రైటర్ డాక్టర్ కళారంగా, కెమెరామెన్గా కేవీ రమణ, సహ నిర్మాత రవీందర్ నాథ్, నటులు జోగిని శ్యామల, ప్రభావతి, సిద్దిపేట తిరుపతి, వెంకట్, పైడిపల్లి, చైతన్య, వేణు గోపాల్, రవీంద్రనాథ్, దివాకర్ పాల్గొన్నారు. -
కన్హాలో ఏపీ సీఎం సందడి
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమ్లేష్ పటేల్తో కలిసి ఆశ్రమ పరిసరాలను పరిశీలించారు. శాంతివనంలోని పచ్చదనాన్ని, బాయోచార్, రెయిన్ ఫారెస్ట్, టిష్యూ కల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ రంగాలతో పాటు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు కన్హాకు వచ్చిన చంద్రబాబు సాయంత్రం 4గంటల వరకు ఉన్నారు. ఆశ్రమంలోని ప్రతీ అంశాన్ని ధ్యాన గురువు కమ్లేష్ పటేల్ను అడిగి తెలుసుకున్నారు. కన్హాలో పచ్చదనం బాగుందని, ఏపీలో సైతం కన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. కాగా చంద్రబాబు కన్హాను సందర్శించేందుకు వచ్చిన విషయం తెలిసిన మీడియా కన్హా ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. వ్యక్తిగత పర్యటన అని చెప్పారు. శాంతివనంలో పచ్చదనం బాగుందని కితాబు మీడియాకు అనుమతి ఇవ్వని నిర్వాహకులు వ్యక్తిగత కార్యక్రమమని వెల్లడి -
బీఆర్ఎస్తోనే ప్రజాసంక్షేమం
● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ● పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం పరిగి: బీఆర్ఎస్ హయంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాలేపల్లిలో సోమవారం సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జగన్మోహన్రెడ్డి కుమారుడు అజయ్కుమార్రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప్పరి యశోదతిరుపతి, నాయకులు పురుషోత్తం, గంపురి, ఆంజనేయులు, మణికంఠ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో విఫలం.. కుల్కచర్ల: బండవెల్కిచర్లలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జ్యోతిలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకునేలా ప్రయత్నిస్తున్నారని, వీరి కుయుక్తులను నమ్మకుండా బీఆర్ఎస్ పార్టీ బలర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలన్నారు. -
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
● మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ● నూతన సర్పంచ్లకు సన్మానం తాండూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ సర్పంచ్ భార్గవిశ్రీనివాస్, ఉప సర్పంచ్ మోహిజ్ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధన్రాజ్, జ్యోతి, శ్రీదేవి, స్వరూప, అశోక్, అనంతయ్య, నవీన్, సత్తార్మియా, లాజర్, ఎల్లప్ప, పుల్లప్ప పాల్గొన్నారు. గౌతాపూర్లో ఎమ్మెల్సీ సందడి.. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో మండలి చీఫ్ మహేందర్రెడ్డి సందడి చేశారు. గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ రాజప్పగౌడ్ ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పడిపూజకు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన రాంచెంద్రారెడ్డి ఇంటికి వెళ్లి నూతన సర్పంచు జెన్నె సుజనను సన్మానించి, కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జెన్నె నాగప్ప, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు తదితరులు ఉన్నారు. -
అభివృద్ధిలో కలిసి సాగండి
అనంతగిరి: ప్రజల ఆదరణతో సర్పంచ్లుగా గెలిచిన వారు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. విజయం సాధించిన పలువురు సర్పంచ్లు వికారాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తున్నాని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, మిగిలిన సమయంలో అందరూ కలిసి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్పీకర్ ప్రసాద్కుమార్ -
ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ● పలు గ్రామాల్లోపంచాయతీ ఎన్నికల ప్రచారందోమ: ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి సాఽ ద్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం తన స్వగ్రామం శివారెడ్డిపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు లక్ష్మమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం బొంపల్లి, బాస్పల్లిలో అభ్యర్థులు బోయిని సంతోష, తలారి అనంతయ్య తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచినీటి వసతి కల్పిస్తున్నారని స్పష్టంచేశారు. అధికార పార్టీకి సంబంధించిన వారిని గెలిపించుకుంటేనే పల్లెల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. -
ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
ఆమనగల్లు: ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ కోరారు. మాడ్గుల మండలం కొల్కులపల్లిలో సోమవారం సర్పంచ్ అభ్యర్థి బట్టు ధర్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్పార్టీ అమలు సాధ్యం కాని అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కేవలం మాయమాటలు చెబుతూ ప్రజలను వంచిస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ -
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి, నర్సాయిపల్లి, మాడ్గుల, రామ్దుగ్యాల గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కొల్కులపల్లిలో అభ్యర్థి బట్టు అనురాధతో కలిసి భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి, సామాజిక న్యాయం, నిరుపేదల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్రెడ్డి, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, నాయకులు కొండల్రెడ్డి, రమేశ్రెడ్డి, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
కేంద్ర నిధులతోనే గ్రామాభివృద్ధి
పరిగి: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు. సోమవారం ఆయన పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. మురుగు కాల్వలశుభ్రం, వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుత్నుఆయని చెప్పారు. ఉచిత రేషన్ బియ్యం కేంద్రమే అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచందర్, రాము యాదవ్, పెంటయ్యగుప్తా, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, సురేశ్, నర్సింలు, రాంచందర్ పాల్గొన్నారు.ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈశ్వరప్ప -
రచ్చకెక్కిన ‘పంచాయితీ’
● వ్యతిరేకంగా పనిచేశావంటూ ఫ్లెక్సీ చించివేత ● పరిస్థితిని చక్కదిద్దిన స్పీకర్ ప్రసాద్కుమార్అనంతగిరి: వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీ రగడ చోటు చేసుకుంది. పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేస్తున్నావంటూ ఆరోపిస్తూ.. ఓ నేత అక్కడి ఫ్లెక్సీలో ఉన్న మరో నాయకుడి చిత్రాన్ని తొలగించగా.. ఎందుకు అలా చేశావంటూ సదరు నేత ప్రశ్నించాడు. పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేస్తున్నావంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోగా.. ఇరు వర్గాల గులాబీ శ్రేణులుకల్పించుకొని మరింత ఆజ్యం పోశారు. పరిస్థితి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ దృష్టికి వెళ్లగా.. ఇరువురితో మాట్లాడి సయోధ్య కుదిర్చి, పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్పీకర్ను కలిసేందుకు వచ్చి.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. మదన్పల్లి సర్పంచ్గా రాజశేఖర్రెడ్డి తల్లి విజయలక్ష్మి విజయం సాధించగా.. వారంతా సోమవారం కార్యాలయంలో స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారు. కాగా.. అక్కడ ఉన్న పలు ఫ్లెక్సీల్లో సుధాకర్రెడ్డి చిత్రంఉండగా.. గమనించిన పలువురు మా అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశావంటూ ఆగ్రహిస్తూ.. ఆయన చిత్రాన్ని తొలగించారు. దీంతో గందరగోళం నెలకొంది. కొద్దిసేపటికీ స్పీకర్ అక్కడికి చేరుకున్నారు. నూతన పాలకవర్గ సభ్యులు ఆయనను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీల్లో తన బొమ్మను తొలగించారనే విషయం సుధాకర్రెడ్డికి, ఆయన అనుచరులకు తెలియగా.. వారు అక్కడికి చేరుకున్నారు. ఎందుకిలా చేశావంటూ రాజశేఖర్రెడ్డిని ప్రశ్నించారు. పార్టీలో ఉంటూ ఇలా వ్యతిరేకంగా పనిచేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. దీంతో ఇరువురి వాగ్వివాదం చేసుకోగా.. స్పీకర్ కల్పించుకుని వారిద్దరితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. -
రూ.10 కోట్ల మద్యం పంచేశారు!
● ‘ఫ్రెండ్లీ’గా వ్యవహరించిన పోలీసులు ● నామమాత్రపు తనిఖీలతోనే సరి ● నేతల ఒత్తిళ్లతో శంకర్పల్లి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు యథేచ్ఛగా మద్యం సరఫరా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో లక్షలాది రూపాయల సరుకు తీసుకెళ్తున్నా.. ఎక్కడికి, ఎందుకు వెళ్తుందోనని కూడా చూడటం లేదు. ఎవరైనా ఈవిషయాన్ని అడిగినా అదేం లేదు.. అని చెబుతుండటం గమనార్హం. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే రూ.10 కోట్ల వరకు మద్యం సరఫరా చేసినట్లు తెలుస్తోంది. నిత్యం పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నిత్యం మందు పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయకూడదని, ప్రలోభ పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాలను అడ్డుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అర్ధరాత్రి అనుకున్న చోటికి.. శంకర్పల్లి మండల పరిధిలో మొత్తం పది మద్యం దుకాణాలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువుగా ఉన్న షాపుల యజమానులతో మాట్లాడుకుని ఇక్కడి నుంచే మద్యం సరఫరా చేసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థి తరఫు వారు కాకుండా, షాపులకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అర్ధరాత్రి వేళ అనుకున్న చోటికి తరలించారు. ఇవన్నీ గమనిస్తున్న పోలీసులు దుకాణదారులకు ఫ్రెండ్లీగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. తనిఖీలు, కేసులు అంతంతే.. మండలంలో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ అవి తూతూమంత్రంగానే పని చేశాయి. పలు గ్రామాల్లో మద్యం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పటికీ.. పోలీసులు తమకేంటి అన్న విధంగా వ్యవహారించారని అభ్యర్థుల మద్దతుదారులు వాపోయారు. మరికొన్ని గ్రామాల్లో భారీ ఎత్తున మద్యం పట్టుబడితే, పరిచయం ఉన్న నాయకులు ఫోన్లు చేయడంతో కొంత మేర పట్టుకున్న కేసులు నమోదు చేసి మమ అనిపించారు. -
ప్రజలకు సుపరిపాలన అందించాలి
బంట్వారం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. కోట్పల్లి సర్పంచ్గా ఘన విజయం సాధించిన జంగం బసమ్మను సోమవారం ఆయన మండల కేంద్రంలో శాలువా పూలమాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంగయ్య స్వామి, జ్ఞానేశ్వర్, సమ్మయ్య, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు కేశంపేట: ఆర్టీసీ బస్సును కారు వెనుక నుంచి ఢీకొన్న సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం డిపోకు చెందిన బస్సు ఆదివారం రాత్రి శంషాబాద్ నుంచి మిడ్జిల్కు వెళ్తుండగా మండల పరిధిలోని కొత్తపేట శివారులో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారును డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి బస్సును ఢీ కొట్టాడని, బస్సు వెనుక భాగం ధ్వంసం అయిందని బస్సు డ్రైవర్ అబ్ధుల్లా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు. కారు ఢీకొని యువకుడికి గాయాలు కేశంపేట: బైక్ను కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధుతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన కొప్పు నందు ఆదివారం రాత్రి షాద్నగర్ నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా కేశంపేట శివారులో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సోమవారం బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలి రంగారెడ్డి డీఈఓ సుశీందర్రావు మహేశ్వరం: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు సమీపంలో ఉన్న భాష్యం బ్లూమ్స్ స్కూల్లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రమే కాదన్నారు. మన చుట్టూ జరిగే విషయాలను గమనించడం కూడా సైన్సేనని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కస్నా నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రయోగం కొందుర్గు: మహేశ్వంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో కొందుర్గు ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాలలో చదివే మణితేజ తయారు చేసిన ప్రయోగం రాష్ట్రస్థాయికి ఎంపికై నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్ తెలిపారు. ప్రాజెక్టు తయారీలో సైన్స్ టీచర్ రామకృష్ణ సహకరం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మణితేజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
సత్తాచాటారు.. సర్పంచ్లయ్యారు
శంకర్పల్లి: చిన్నచిన్న సంఘటనలు మినహా ఆదివారం నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన కొండకల్ అభ్యర్థి ఎరుకల శేఖర్ 730 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొందగా, ఎల్వర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మద్దతుదారులు మారెపల్లి భాగ్యలక్ష్మి 721 ఓట్లతో భారీ విజయం సాధించారు. గోపులారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తంగెడపల్లి రవీందర్రెడ్డి హోరాహోరీ పోరులో 10 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. కుర్వగూడ ‘సర్పంచ్ హ్యాట్రిక్’ షాబాద్: మండల పరిధిలో కుర్వగూడ సర్పంచ్ బుయ్యని సంధ్యరాణి హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా మూడోసారి ఆమె గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా మండలంలో బీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 41 పంచాయతీలు ఉండగా, 22 జీపీలను గులాబీ సానుభూతిపరులే సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ 17, బీజేపీ, ఇండిపెండెంట్కు చెరో స్థానం దక్కింది. ఒక్క ఓటు తేడాతో విజయం కడ్తాల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నార్లకుంటతండా సర్పంచ్ స్థానానికి హోరాహోరీగా పోటీ సాగింది. ఒకేఒక్క ఓటు తేడాతో అంగోతు రాంచందర్నాయక్ విజయం సాధించారు. తండాలో మొత్తం 462 ఓట్లు ఉండగా, 423 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అంగోత్ రాంచందర్నాయక్కు 206 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన జాటవత్ రమేశ్కుమార్కు 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 ఓట్లు పడగా, 9 ఓట్లు చెల్లకుండాపోయాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో రాంచందర్నాయక్ విజయం సాధించారు. ఆ రెండు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఘర్షణలకు దారితీసిన రెండు గ్రామాల్లో సోమవారం పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సింగప్పగూడ, రేగడిఘనాపూర్లో ఆదివారం స్వల్ప ఘర్షణలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ రెండు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సాధారణ పరిస్థితులు వచ్చే వరకు పికెటింగ్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు తుర్కయంజాల్: జీహెచ్ఎంసీ ఇటీవల ప్రకటించిన వార్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తుర్కయంజాల్ బీజేపీ నాయకులు సోమవారం కమిషనర్ కర్ణన్ను కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త కాలనీలు, ఇళ్లలో నివసిస్తున్న జనాభా ఆధారంగా విభజన చేపట్టాలని కోరారు. తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్లను మొత్తం నాలుగు డివిజన్లుగా చేయాలని, కోహెడ పేరుతో ఓ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
పరిగి: నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాసుచంద్ర అన్నారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ కమిటీ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్వహణ, సేఫ్టీ కిట్స్ వినియోగం, నిబంధనలు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. అనంతరం డీఆర్డీఓ పీడీ మాట్లాడుతూ.. విచారణ కమిటీలో పోలీసు, వైద్యశాఖ, కార్మిక శాఖ, కాలుష్య నివారణ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విచారణ వివరాలతో కలెక్టర్కు నివేదికను అందిస్తామన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఫ్యాక్టరీపై చర్యలుంటాయని చెప్పారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాసుచంద్ర -
ప్రైవేటు బ్యాంకు రుణాలతో తస్మాత్ జాగ్రత్త
శంకర్పల్లి: ప్రైవేటు బ్యాంకులు ప్రజలకు విరివిగా రుణాలిస్తున్నాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ ఇన్నోవేటివ్ హాబ్ సీఈఓ రాజేశ్ బన్సాల్ సూచించారు. దొంతాన్పల్లిలో ని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్యాంకింగ్ సదస్సుకు సోమవారం ఆయన, విశ్వవిద్యాలయ కులపతి, ఆర్బీఐ మాజీ గవర్నర్ డా. సి. రంగరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్బీఐలో పనిచేసి, పదవీ విరమణ పొందిన నిపుణులు రాసిన పుస్తకాన్ని రంగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మ్యూచువల్ ఫండ్ తదితర ఆర్థికపరమైన పెట్టుబడులు దేశ ఆర్థిక పురోభివృద్ధిని మారుస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. రానున్న కాలంలో బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు రానున్నాయన్నారు. సదస్సులో ఇక్ఫాయ్ సొసైటీ చైర్పర్సన్ శోభా రాణి యశస్వి, ఉప కులపతి డా. కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిన్న కళకళ.. నేడు వెలవెల
కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ పేరుతో ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రముఖులతో సీఎం ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రజలు, విద్యార్థుల సందర్శనార్థం 10 నుంచి 13వ తేదీ వరకు అనుమతించారు. ఈ నెల 13తో సమ్మిట్ పూర్తవడంతో తాత్కాలిక నిర్మాణాలను కార్మికులు తొలగించే పనులు చేపట్టారు. కొన్ని రోజులుగా డిజిటల్ స్క్రీన్లు, రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలు, వీఐపీల రాకతో సందడిగా మారిన ప్రాంగణం ప్రస్తుతం చిన్నబోయింది. -
కారు బేజారు!
పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించినా.. అభ్యర్థుల వెంట ఉండేది మాత్రం పార్టీలే. ఇప్పటికే రెండు విడతల ఎలక్షన్స్ పూర్తవగా.. ఫలితాల్లో అధికార పార్టీ ఆధిపత్యం కొనసాగింది. నదీ ప్రవాహంలా సాగిన గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. కమలం తొలి, మలి విడతల్లో పదిస్థానాలకు పరిమితవగా స్వతంత్రులు 31 పంచాయతీల్లో పంతం నెగ్గించుకున్నారు. వికారాబాద్: స్థానిక సమరంలో కారు డీలా పడింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు పై ‘చేయి’సాధించగా కొన్ని మండలాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సైతం గట్టి పోటీనే ఇచ్చారు. రెండవ విడతలో మాత్రం బీఆర్ఎస్ నేతల పోటీ నామమాత్రంగా మారింది. మొదటి విడతలో తాండూరు మాజీ ఎమ్మెల్యే సొంత మండలం బషీరాబాద్లో బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చింది. మిగిలిన ఏడు మండలాల్లో గులాబీ పార్టీ నామమాత్రపు పోటీతో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవాకొనసాగగా.. ఇద్దరు స్వ తంత్రులు గెలుపొందారు. కారు పార్టీ ఖాతా తెరవలేకపోయింది. రెండవ విడతలో బంట్వారం మండలంలో ఒకింత పోటీ ఇవ్వగా మిగిలిన మండలా ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. బీజేపీ మొదటి విడతలో రెండు స్థానాల్లో గెలుపొందగా.. ఎనిమిది గ్రామాల్లో కమలం వికసించింది. స్వంతంత్రులు బీజేపీకి మూడింతల స్థానాలతో 31 చోట్ల సత్తా చాటారు. వామపక్ష పార్టీ ప్రాభవం కరువైంది. ముఖ్య నేతలపై కేడర్ గుస్సా పార్టీ రహిత ఎన్నికలే అయినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు ఏమాత్రం పట్టించుకోలేదని గ్రామ, మండల స్థాయి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకుని తిరిగిన నేతలు మొహం చాటేయడంపై మండిపడుతున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వంద నుంచి 150 వరకు పంచాయతీలుండగా ముఖ్య నేతలు పది, ఇరవై గ్రామాలను కూడా సందర్శించిన దాఖలాలు లేవు. పోటీలో ఉండి ఖర్చు చేసేందుకు స్థోమతలేని వారికి సైతం సహకరించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి కొన్ని చోట్ల కేడర్కు అండగా నిలవగా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో కనీసం పట్టించుకోలేదని బీఆర్ఎస్ కేడర్ ముఖ్య నేతలపై గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి స్వగ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి చవి చూడటమే కాకుండా పదివార్డులు ప్రత్యర్థి వర్గానికే దక్కడం చర్చనీయాంశంగా మారింది. స్వతంత్రులకు గాలం రెండు విడతల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు సత్తా చా టారు. మొదటి విడతలో ఎనిమిది చోట్ల విజయం సాధించగా రెండ విడతలో 23 జీపీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీల్లో కలుపుకొనేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. మండల, గ్రామ స్థాయి నాయకులను పురమాయించి స్వతంత్రులను తమ పార్టీల్లోకి వచ్చేలా చూడాలనే వ్యూహంతో ముందుకెళుతున్నారు. స్వతంత్రులుగా గెలిచిన వారిలో ఎక్కువ శాతం కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి రెబల్గా పోటీ చేసిన వారే ఉన్నారు. గతంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ స్వతంత్రుల్లో ఎక్కువ శాతం అధికార పార్టీలో చేరే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు విడతల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ డీలా మొదటి, రెండు విడతల్లో పార్టీల వారీగా వివరాలుమండలం మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్రులు తాండూరు 33 22 11 – – బషీరాబాద్ 39 21 17 01 – యాలాల 39 23 12 01 03 పెద్దేముల్ 38 26 12 – – కొడంగల్ 25 23 – – 02 దౌల్తాబాద్ 33 21 11 – 01 బొంరాస్పేట్ 35 29 05 – 01 దుద్యాల 20 15 04 – 01 వికారాబాద్ 21 13 01 01 06 ధారూరు 34 22 06 04 02 మోమిన్పేట్ 29 15 09 – 05 నవాబుపేట్ 32 23 04 02 03 బంట్వారం 12 04 04 – 04 మర్పలి 29 21 08 – – కోట్పల్లి 18 11 03 01 03 మొత్తం 437 289 107 10 31 -
‘చలో విశాఖపట్నం’ విజవయంతం చేయండి
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తాండూరు టౌన్: సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌక్లో సీఐటీయూ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు చేయాల్సిన పోరాటాలపై సభలో దిశానిర్దేశం చేస్తారస్తాన్నారు. ఈ మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు రెగ్యులర్ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. జాతర ఏర్పాట్ల పరిశీలన యాలాల: ముద్దాయిపేట ఎల్లమ్మ జాతర ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పరిశీలించారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న జాతర ఉత్సవాల్లో సిడె ఊరేగింపు, రథోత్సవం, చుక్క బోనాల కార్యక్రమ వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు, వాహనాల పార్కింగ్ తదితర సౌకర్యాల గురించి జాతర గురించి జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పోలీసులకు వివరించారు. ఉత్సవాలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటలను చోటు చేసుకోకుండా జాగ్రత్తల తీసుకోవాలని సూచించారు. ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ఐ విఠల్రెడ్డి, సర్పంచ్ రుద్రమణి, మాజీ సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, ఉప సర్పంచ్ శివ, జాతర నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు భానుప్రసాద్ గౌడ్, గ్రామస్తులు రాజప్ప, వినోద్కుమార్ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై డీఆర్డీఓ పీడీ ఆగ్రహం పరిగి: మూడో దశ పోలింగ్ ఏర్పాట్లపై డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. మండల పరిషత్ అధికారులు సక్రమంగా నిర్వహించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ జూనియర్ క్రికెట్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు కుల్కచర్ల: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ముజాహిద్పూర్ మాడల్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.ఈ మేరకు పాఠశా ల ప్రిన్సిపాల్ జ్యోతిఎప్సిబా సోమవారం వారి ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ..క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. పాఠశాలలో అరుణ్, పాండు 9వ తరగతి చదువుతున్నారు. వారు రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 18 నుంచి 21 వరకు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రలో నిర్వహించే జాతీయ స్థాయి పాల్గొంటారని వివరించారు. -
ఎన్నికలు సమన్వయంతో పూర్తి చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: మూడో విడత పోలింగ్లోనూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. సోమవారం అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష్ చౌదరి ఎన్నికలు జరగనున్న పరిగి, కుల్కచర్ల, పూడూరు, చౌడాపూర్, దోమ మండలాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీఓ, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామగ్రి ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయాలని సూచించారు. పోలింగ్ సెంటర్ల వారీగా నంబర్లు ప్రకారం ఉండాలన్నారు. పోలింగ్ అధికారులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ వేగవంతంగా పూర్తి చేసేందుకు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిబ్బంది ఉదయమే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకుని మెటీరియల్స్ చెక్ చేసు కుని తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు పోలింగ్ రోజే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ కి సంబందించిన రిపోర్ట్లన్నీ నిర్దేశిత సమయంలో ఫార్మాట్ ప్రకారం టీపోల్లో పొందుపరచాలన్నా రు. ఈ కాన్ఫరెన్స్లో డీఆర్డీఓ శ్రీనివాస్, డీఆర్ఓ మంగీలాల్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, నోడల్ అధికారులు తదితరులు ఉన్నారు. సైలెన్స్ పీరియడ్ అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో మూడో విడత పరిగి, పూడూరు, కుల్కచర్ల, దోమ, చౌడాపూర్ మండలాల్లో పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దన్నారు. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా, సంగీత,నాటక, వినోద కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయొద్దన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
షూటింగ్ బాల్ విజేత వరంగల్
తాండూరు టౌన్: రాష్ట్ర స్థాయి అస్మిత(అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రో యాక్షన్) ఖేలో ఇండియా షూటింగ్ బాల్ విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. ఈనెల 13, 14వ తేదీల్లో తాండూరు సెయింట్ మార్క్స్ పాఠశాల మైదానంలో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో వరంగల్, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నల్గొండ, ఖమ్మం జట్లు నిలిచాయి. విజేతలకు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఐలయ్య ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహద పడతాయన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు విద్య, ఉద్యోగం, స్పోర్ట్స్ కోటాలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఆణిముత్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం టోర్నీ నిర్వహణ కార్యదర్శి ఎం.రాములు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులు జనవరి చివరి వారంలో ఉత్తరాఖండ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మార్క్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆరోగ్య రెడ్డి, పీడీ గౌరీశంకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం, జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, సీహెచ్ రాములు, ఆంజనేయులు, రాము, రవీందర్ రెడ్డి, శరణ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.రాములు తదితరులు పాల్గొన్నారు. -
తుది పోరుకు ర్యాండమైజేషన్
● 17న ఐదు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్జైన్ పరిగి: మూడో విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్జైన్, సాధారణ ఎన్నికల పరిశీలకురాలు షేక్ యాస్మిన్ బాష సూచించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధలను అనురిస్తూ ర్యాండమైజేషన్ నిర్వహించామన్నారు. ఐదు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నన్నట్లు వెల్లడించారు. మొత్తం 157 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 17 పంచాయతీలు ఏకగ్రీవమగా.. 140 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 1,340 వార్డులకు గాను 130 వార్డులు ఏకగ్రీవమవగా 1,202 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు 1,470, ఓపీఓలు 1,726, టూ మెంబర్ టీం 988, త్రీ మెంబర్ టీం 214లను ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించామన్నారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యనాయక్, సుధీర్, డీపీఓ జయసుధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఊరు.. ఓటుకు..కదిలారు
తొలి విడతతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం వికారాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. వికారాబాద్ రెవెన్యూ డివిజన్లో వికారాబాద్, ధారూరు, బంట్వారం, కోట్పల్లి, నవాబుపేట, మోమిన్పేట, మర్పల్లి 175 పంచాయతీలుండగా 20 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 155 పంచాయతీల్లో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 4 గంటలకే ఫలితాలు వెలువడ్డాయి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ట్యాబ్లతో వెబ్కాస్టింగ్ చిత్రీకరించారు. అవకతవకలు తావులేకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. మర్పల్లిలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవాబుపేట మండలం చించల్పేటలో చెవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ధారూరు మండలం కేరెళ్లిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఓటు వేశారు. వికారాబాద్ మండలం సర్పన్పల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మోమిన్పేట మండలం కోల్కుందలో సర్పంచ్ అ భ్యర్థి కీర్తి నిరసన తెలిపారు. అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మోమిన్పేట మండలం బాల్రెడ్డిగూడ, వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామాల్లో అభ్యర్థుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. 82.72 శాతం పోలింగ్ నమోదు జిల్లాలోని ఏడు మండలాల్లో జరిగిన పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో సగటున 82.72 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్ మండలంలో అత్యధికంగా 87.77 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా బంట్వారంలో 80.25శాతం ఓటింగ్ నమోదైంది. మొదటి విడత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. ఒంటింగట వరకు పోలింగ్ కేంద్రం ఆవరణలోకి వచ్చిన వారందరిని ఓటు వేసేందుకు అనుమతించారు. ఉదయం 9 గంటలకు 20.67 శాతం, 11 గంటలకు 52.35 శాతం మధ్యాహ్నం ఒంటి గంటలవరకు 78.30 శాతం నమోదయింది. చివరకు 82.72 శాతానికి చేరుకుంది. వృద్ధులను, దివ్యాంగులను కుర్చీల్లో, వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. మొత్తం ఓట్లు 2,09,847 ఓట్లలో 1,03,932 మంది పురుషులు, 1,05,914 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 86,968 మంది పురుషులు 83.68 శాతం ఓటు హక్కును వినియోగించుకోగా 86,625 మంది మహిళలు 81.99 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారుల పర్యవేక్షణ మలి విడత ఎన్నికల సందర్భంగా ఉన్నతాధికారులు పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు యాస్మిన్బాష పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. వసతులు, పోలింగ్ శాతం, తదితర వివరాలను రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎస్పీ స్నేహ మెహ్ర పలు పోలింగ్ స్టేషన్ను సందర్శించి భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. కౌంటింగ్ ముగిసి ఫలితాలను వెల్లడించే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలు, సంబురాలకు అనుమతి లేదని, అలా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకోవాలని ఆమె స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన అనంతగిరి: వికారాబాద్ మండలంలోని 21 పంచాయతీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షించారు. నారాయణపూర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రతీక్జైన్, ఎర్రవల్లి కేంద్రాన్ని జిల్లా సాధారణ పరిశీలకురాలు షేక్ యాస్మిన్ బాషా, పీరంపల్లిలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతగిరి: తొలిసారి ఓటేసిన యువతి ఓటు వేసేందుకు వెళ్తున్న వృద్ధురాలు వికారాబాద్లో అత్యధికంగా 87.77 శాతం, అత్యల్పంగా బంట్వారంలో 80.25 శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు గెలుపొందిన అభ్యర్థులకు అభినందనల వెల్లువ మండలం పురుషులు మహిళలు మొత్తం ఓట్లు పోలైనవి శాతం బంట్వారం 8,417 8,881 17,208 13,882 80.25 ధారూరు 16,573 17,385 33,958 28,712 84.55 కోట్పల్లి 8,537 8922 17,459 14,523 83.18 మర్పల్లి 22,202 21,834 44,036 36,094 81.96 మోమిన్పేట్ 17,723 18,104 35,828 28,950 80.80 నవాబుపేట్ 18,552 18,479 37,031 30,159 81.44 వికారాబాద్ 11,928 12,309 24,237 21,274 87.77 -
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
తాండూరు టౌన్: జిల్లా టాస్క్ఫోర్స్, తాండూరు, పరిగి, వికారాబాద్ ఎకై ్సజ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముగ్గురు వ్యక్తుల నుంచి ఎండు గంజాయి, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం తాండూరు రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. మద్యనిషేధ జిల్లా అధికారి విజయభాస్కర్ తెలిపిన ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబాయికి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తాండూరుకు గంజాయి రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు తాండూరు స్టేషన్లో మాటు వేసి రైలు దిగిన ముగ్గురు వ్యక్తుల వద్ద తనిఖీ చేయగా రెండు ప్యాకెట్లలో 7.6 కిలోల ఎండు గంజాయితో పాటు, 366 గ్రాముల గంజాయి చాక్లెట్లు లభించాయన్నారు. ఈమేరకు గంజాయిని సీజ్ చేసి ఒడిశాకు చెందిన శిశ్రు కుమార్ బెహ్రా, కర్నాటకకు చెందిన మహ్మద్ జిలాని, సత్తార్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి, డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు ప్రేమ్కుమార్రెడ్డి, రవికుమార్, సుతారి, వీరాంజనేయులు, సిబ్బంది హన్మంతు, భీమయ్య, రాధిక, రవికిరణ్, విష్ణు, మహేష్, ఫరీద్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. 7.6 కిలోల ఎండు గంజాయి, 366 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం -
గెలుపొందిన అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల జాబితా
మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్ర వికారాబాద్ 21 13 01 01 06 ధారూరు 34 22 06 04 02 మోమిన్పేట్ 29 15 09 – 05 నవాబుపేట్ 32 23 04 02 03 బంట్వారం 12 04 04 – 04 మర్పల్లి 29 22 07 – – కోట్పల్లి 18 11 03 01 03 మొత్తం 175 110 34 08 23 -
గ్రామాభివృద్ధికి కృషి చేయండి
కాంగ్రెస్ కొడంగల్ ఇన్చార్జి తిరుపతిరెడ్డి దౌల్తాబాద్: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గ సభ్యులు పనిచేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండల కేంద్రానికి రావడంతో నూతన పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, వెంకట్రెడ్డి, వీరన్న, దస్తప్ప, రెడ్డి శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఫర్టిలైజర్ షాప్లో షార్ట్ సర్క్యూట్
ధారూరు: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫర్టిలైజర్ షాపు దగ్ధమైంది. ఈ ఘటన స్థానిక బస్టాండు పక్కనే ఉన్న ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్లోని శ్రీసాయి సీడ్స్ అండ్ పెస్టిసైడ్ దుకాణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తాండూరు–హైదరాబాద్ మార్గం పక్కనే ఉన్న ఫర్టిలైజర్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో రాకపోవడంతో క్రిమి సంహారక ముందుల కాటన్లు, ఎరువులు బస్తాలు, వడ్లు, మొక్కజొన్న తదితర విత్తనాల బస్తాలు, ఖరీఫ్ సీజన్ నుంచి ఉన్న రికార్డులు ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దాదాపు రూ.25లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ధారూరు సీఐ రఘురామ్, సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్లియర్ చేశారు. బాధిత వ్యాపారి అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.రూ.25 లక్షల ఆస్తి నష్టం -
జాతరకు సర్వం సిద్ధం
ఎల్లమ్మ ఉత్సవాలకుఏర్పాట్లు ముమ్మరం ● ఈనెల 19 నుంచి ప్రారంభం యాలాల: మండల పరిధిలోని ముద్దాయిపేట జగన్మాత రేణుక ఎల్లమ్మమాత ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే జాతరకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దల సమక్షంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో రెండో అతిపెద్ద జాతరగా ఎల్లమ్మ జాతరకు పేరు ఉంది. ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు పొరుగు మండలాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇప్పటికే జాతరలో భాగంగా రంగుల రాట్నం, బ్రేక్ డ్యాన్స్, డ్రాగన్ రైలు లాంటి వినోద వస్తువులు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహించే మాదిరిగానే ఈసారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాల వివరాలు ఉత్సవాలు 18న రాత్రి అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభం కానున్నాయి. ఎల్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన సిడే ఊరేగింపును 19న(శుక్రవారం) సాయంత్రం నిర్వహిస్తారు. 20న (శనివారం) చుక్క బోనాలు, 21న(ఆదివారం) రథోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. కాగా ప్రతి రోజు ఆలయ ఆవరణలో భజన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ధర్మకర్త దేవగారి రాములు, సర్పంచ్ పంతుల రుద్రమణి, మాజీ సర్పంచ్లు విఠలయ్య, బిచ్చన్నగౌడ్, క్రిష్ణయ్యగౌడ్, గ్రామ పెద్దలు, యువకులు వివరించారు. నిర్వహణ కమిటీ ఏర్పాటు జాతర ఏర్పాట్లు విజయవంతం అయ్యేందుకు గ్రామ యువకులతో కూడిన నూతన కమిటీని గ్రామస్తులు ఎన్నుకున్నారు. జాతర ఆలయ కమిటీ అధ్యక్షుడిగా భానుప్రసాద్గౌడ్, ఉపాధ్యక్షులుగా బాలవర్ధన్గౌడ్, సభ్యులుగా సుదర్శన్గౌడ్, శేఖర్గౌడ్, బాలక్రిష్ణగౌడ్, గోవర్ధన్గౌడ్, శివకుమార్, క్రిష్ణయాదవ్, భీమ్ యాదవ్, చంద్రకుమార్, సంపత్గౌడ్, రమేశ్, శ్రీనివాస్, పవన్, విష్ణువర్థన్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధికి నిధులు కేటాయిస్తా
యాలాల: మండలంలోని ముద్దాయిపేట పంచాయతీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ బలపర్చిన రాజప్ప రుద్రమణి, ఉపసర్పంచ్ గొల్ల శివ, వార్డు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేజర్ పంచాయతీల్లో ఒకటైన ముద్దాయిపేట అభివృద్ధి బాధ్యత తీసుకుంటానన్నారు. తమ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్న నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ఎల్లమ్మ జాతర ఉత్సవాలకు రావాల్సిందిగా సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు దేవగారి రాములు, నాయకులు వాసిద్ఖాన్, ఆరిఫ్ హుస్సేన్, బస్వరాజ్, రమేష్, భాస్కర్గౌడ్, వెంకటమ్మ, రమేష్గౌడ్, పంతుల శేఖర్, ఫక్రుద్దీన్, రాజు, వెంకటయ్యగౌడ్, గొల్ల రమేష్, మల్లేష్, విజయ్కుమార్, శ్రావణ్కుమార్, నర్సింహులు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు
● పైలెట్ రోహిత్రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ ● డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్ తాండూరు: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లిన రోజే మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి రాజకీయ జీవితం అంధకారమైందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్ విమర్శించారు. ఆదివారం ఆయన తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధారాసింగ్ జాదవ్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపారన్నారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. పైలెట్ రోహిత్రెడ్డి దౌర్జాన్యాలను తట్టుకోలేక అప్పటి టీఆర్ఎస్ పార్టీ గెంటివేస్తే కాంగ్రెస్ అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రసాదించిందని గుర్తు చేశారు. నియోజకవర్గరంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 91 మంది, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 45 మంది విజయం సాధిస్తే 70 పంచాయతీల్లో గెలిచినట్లు ప్రకటించుకోవడం సిగ్గు చేటు అన్నారు. 11 మంది కాంగ్రెస్ రెబల్స్ పార్టీలోనే ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్లోళ్ల నర్సింలు, నాగప్ప, లొంక నర్సింలు, అప్పు, అనిల్ తదితరులున్నారు. -
సందేహాలుంటే సంప్రదించాలి
అనంతగిరి: పంచాయతీ ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు షేక్ యాస్మిన్బాష, ప్రత్యేకాధికారి, డీఆర్ఓ మంగీలాల్ అన్నారు. శనివారం ఆయన వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. మండలంలో 21 మంది ఆర్ఓలు, 182 మంది పీఓలు, 206మంది ఓపీఓలు ఉన్నారన్నారు. మండలాన్ని మొత్తం ఏడు రూట్లు, మూడు జోన్లుగా ఏర్పాటు చేశారన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలన్నారు. సందేహాలుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలంతా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఉదయం ఆర్ఓలు, పీఓలు, ఓపీఓలు సెంటర్ వద్దకు చేరుకుని సామగ్రిని సరిచూసుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత తమకు కేటాయించిన గ్రామాలకు ప్రత్యేక బస్సుల్లో సామగ్రితో చేరుకున్నారు. సాయంత్రం పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్కుమార్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీఓ దయానంద్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 144 సెక్షన్ అమలు మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఉన్నందున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ భీంకుమార్ తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల అనంతరం ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. ధారూరులో 11 రూట్లు ధారూరు: మండల పరిధిలో 29 పంచాయతీలకు ఆదివారం జరిగే ఎన్నికల ఏర్పాట్లను అధికారులు శనివారం పూర్తి చేశారు. తొలుత పంచాయతీల వారీగా విధులు నిర్వహించాల్సిన సిబ్బంది జాబితాను మైక్లో వినిపించారు. మధ్యాహ్నం బ్యాలెట్ పేపర్ల పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. మధ్యా హ్న భోజనం అనంతరం బ్యాలెట్ బాక్సులు, సామగ్రి సమకూర్చారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వీటిని పీఓలకు అందజేశారు. ప్రతీ గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, సామగ్రి, ప్యాకింగ్ సంచులను పంపిణీ చేశారు. పీఓలు తమకు కేటాయించిన సిబ్బందితో కలిసి బస్సుల్లో తరలివెళ్లారు. మండలాన్ని 11 రూట్లుగా చేసి 11 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఎలుకలు కొరికిన సామగ్రి పోలింగ్ సెంటర్, వార్డునంబర్తో కూడిన స్టాంపును పంపిణీ చేయాల్సి ఉండగా స్టాంపులు లేకపోవడంతో అధికారులు మండిపడ్డారు. ఓటర్లు ఒక వార్డుకు బదులుగా మరో బాక్సులో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ వేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మొదటి విడత విధులు నిర్వహించామని, అక్కడ సరిగ్గా ఉన్నాయని, ఇక్కడ మాత్రం స్టాంపులపై ఉన్న అక్షరాలను తీసివేసి పంపిణీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎలుకలు కొరికిన సామగ్రిని పంపిణీ చేశారని పలువురు ఉద్యోగులు వాపోయారు. -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
మోమిన్పేట్/అనంతగిరి: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. మోమిన్పేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ప్రతీక్జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు తమకు ఉన్న అధికారాలను వినియోగించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఆర్డీఓ వాసుచంద్ర, నోడల్ అధికారి సదానందం, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ సృజన తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్పై జాగ్రత్తలు తప్పనిసరి బంట్వారం: అధికారులు సొంత నిర్ణయాలతో కాకుండా ఎన్నికల నిబంధనల మేరకు పని చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. శనివారం ఆయన కోట్పల్లిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పఠిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఎంపీడీఓ హేమంత్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
యువతకు ఉపాధే లక్ష్యం
పరిగి: యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. టాటా కంపెనీ సౌజన్యంతో రూ.45 కోట్లు వెచ్చించి పరిగిలోని నస్కల్లో నిర్మించనున్న అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 115 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.4 వేల కోట్ల నిధులు వినియోగిస్తున్నామని తెలిపారు. వీటిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువతకు పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టంచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏటీసీలను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే లక్ష ఉద్యోగాలను భర్తీ చేశారని వెల్లడించారు. యువతకు సరైన ఉద్యోగాలు లభిస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో 22శాతం వరకు కార్మిక, మైనింగ్ విభాగాల నుంచే వస్తోందన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, తమ ఐదేళ్ల పాలనలో 17 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు,డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మలి సమరం
వికారాబాద్: రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.మండల కేంద్రాల నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామ గ్రి తో తమకు కేటాయించిన గ్రామాలకు శనివారం బ యలుదేరారు.బ్యాలెట్ బాక్సులు,బ్యాలెట్ పత్రాల ను పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తీసుకెళ్లా రు.మొత్తం 175 గ్రామపంచాయతీలు ఉండగా,ఇ ప్పటికే 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మి గతా 155 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నా యి.ఈ స్థానాల్లో 510 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.రెండవ విడతలో 1,510 వార్డులకుగాను 294 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన 1,2 26 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ వార్డుల ప రిధిలో 3,164 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది.భోజన వి రామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. తదనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. 2,22,457 ఓటర్లకు స్లిప్పుల పంపిణీ వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వికారాబాద్, బంట్వారం, ధారూరు, కోట్పల్లి, మోమిన్పేట, నవాబుపేట, మర్పల్లి మండలాల్లో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయింది. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణ పూర్తయింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారితో పాటుగా పీఓలు, ఓపీఓలు విధులు నిర్వహిస్తారు. పోలింగ్ నిర్వహించే ఏడు మండలాలలో 1,912 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. 1,226 మంది పీఓలు, 1,250 మంది ఓపీఓలు, మొత్తం 2,500 పైచిలుకు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 2,22,457 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 188 లొకేషన్లు.. 57 రూట్లు రెండవ విడతలో భద్రత పరంగా 188 లొకేషన్లు గుర్తించారు. ఈ విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 42 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణకుగాను 57 రూట్లుగా విభజించారు. 950 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటుచేస్తున్నారు. స్థానిక పోలీసు సిబ్బందితో పాటు సుమారుగా 150 మంది స్పెషల్ పోలీసులు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. శాంతిభద్రతల సమస్యలను తెలుసుకోవడానికి ఎస్పీ కార్యాలయంలో పోలీస్ కంట్రోల్రూంను ఏర్పాటుచేశారు. పోలింగ్ బూత్కు తీసుకురావడమే లక్ష్యం కలెక్టర్ ప్రతీక్జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీపీఓ జయసుధల పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక ప్రతిభావంతులకు ఓటు వేసే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వీల్ చైర్లు తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరి రోజు ప్రలోభాల పర్వంలో మునిగిపోయారనే చర్చలు వినిపిస్తున్నాయి. ప్రతీ ఓటరును పోలింగ్ బూత్కు తీసుకువచ్చేలా అభ్యర్థులు శాయశక్తులు ఒడ్డుతున్నారు. అబ్జర్వర్ ఆగ్రహం వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను శనివారం ఎన్నికల అబ్జర్వర్ యాస్మిన్బాష సందర్శించారు. ఇప్పటివరకు ఎంత మంది ఎన్నికల సిబ్బంది వచ్చారు? ఇంక ఎంతమంది రావాలనే విషయాన్ని అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11.30 గంటలు దాటినా మెజార్టీ సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ధారూరులోనూ ఇదే పరిస్థితి తలెత్తగా ఎంపీడీఓ ఉద్యోగులను మైకులో పదే పదే మందలించారు. కలెక్టర్కు రిపోర్ట్ చేస్తానని బెదించారు. దీంతో ఓ ఉద్యోగి కుప్పకూలాడు. ఆ సంఘటనను అదునుగా తీసుకున్న ఉద్యోగులు ఎంపీడీఓ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. రెండో దశ పోలింగ్ వివరాలుమండలం మొత్తం పంచాయతీలు ఏకగ్రీవం పోలింగ్ నిర్వహించనున్న జీపీలు ఓటర్లు వికారాబాద్ 21 – 21 24,237 ధారూరు 34 05 29 36,261 మోమిన్పేట్ 29 04 25 39,576 నవాబుపేట్ 32 02 30 37,786 బంట్వారం 12 01 11 17,589 మర్పల్లి 29 03 26 45,581 కోట్పల్లి 18 05 13 21,427 -
వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ సర్వే పూర్తి
కొడంగల్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి ఫీల్డ్ సర్వే పూర్తయినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు) తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. వికారాబాద్ నుంచి కృష్ణా వరకు 130 కిలోమీటర్ల దూరం నూతన రైల్వే లైన్ వేయడానికి భూ సేకరణ చేయాల్సి ఉంది. నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా రైలు మార్గం వేయడానికి అలైన్మెంట్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 130 కిలో మీటర్ల దూరం నిర్మించనున్న కొత్త రైల్వే లైన్కు సుమారు రూ.2,785 కోట్ల ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, బాలంపేట శివారులో కొత్తగా రైల్వే స్టేషన్ల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. వికారాబాద్ నుంచి పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, బాలంపేట, మద్దూరు, నారాయణపేట, మక్తల్, కృష్ణ జిల్లా వరకు కొత్త మార్గం వేయనున్నారు. 130 కిలోమీటర్ల దూరం పట్టాలు వేయడానికి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే క్షేత్ర స్థాయి సర్వే పూర్తయింది. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటారు. కొడంగల్ మీదుగా... ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు కొడంగల్ మండలం టేకుల్కోడ్ దగ్గర నిర్మించనున్న సిమెంట్ ఫ్యాక్టరీ మీదుగా రైల్వే నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, మద్దూరు, నారాయణపేట మీదుగా కృష్ణ జిల్లా వరకు రైల్వే లైన్కు మార్గం సుగమమైంది. -
ఓటు.. ఎటు!
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల పర్వం తుది దశకు చేరింది. విజేతలెవరో.. ప్రజలు ఎవరికి పట్టం కడతారో..? నేటితో తేలిపోనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు ప్రచారం ముగిసే వరకూ అనుచరులు, మద్దతుదారులతో హోరాహోరీగా గ్రామాల్లో మద్దతు కూడగట్టిన అభ్యర్థులు.. ఇక బ్యాలెట్ బాక్సుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండా ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులు గెలుపు కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఏఅంశంలో వెనకబడినా ప్రత్యర్థికి అవకాశం చిక్కుతుందనే ధోరణిలో ఒకరికి మించి ఒకరు ముందుకు సాగుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయమే పరమావధిగా పోరాడుతున్రాను. తెలిసినవారు, బంధువులు, స్నేహితుల ద్వారా ఓటర్లను మచ్చిక చేసుకుని, తమకే ఓటు వేసేలా చూసుకుంటున్నారు. ఎంతైనా ఇద్దాం.. గ్రామాల్లో ఇప్పటీకే అభ్యర్థులు ఇచ్చిన హామీలతోపాటు ప్రచారంలో భాగంగా రోజు కూలీ, మందు, విందులు పూర్తయ్యాయి. ఇక ఒక్కో ఓటుకు రేటు కట్టి పంపకాలూ జరిగిపోయాయి. ఉన్నదల్లా ఓటర్లను తీసుకెళ్లి అనుకూలంగా ఓటు వేయించుకోవడం ఒక్కటే మిగిలింది. ఈక్రమంలో ఓటరు దేవళ్లు ఎవరివైపు మొగ్గు చూపుతారోననే టెన్షన్ అందరు అభ్యర్థుల్లోనూ కనిపిస్తోంది. కొంత మంది అభ్యర్థులు ముందుగానే తాయిలాలు ముట్టజెప్పి, ఇక ప్రత్యర్థులు ప్రలోభ పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్యాకేజీలతో పిలుపు గ్రామాలకు బయట ఉండే ఓటర్లను కలిసిన అభ్యర్థులు ఇప్పటీకే వారికి ప్రత్యేక ప్యాకేజీలను అందజేశారు. ఎలాగైనా ఊరికి వచ్చి ఓటేయాలని ప్రాధేయపడ్డారు. రవాణాఖర్చులు ఇవ్వడంతో పాటు అన్ని సదుపాయాలూ సమకూరుస్తామని చెప్పారు. ఓటేసేందుకు తప్పకుండా రావాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా గ్రామాలకు వలస వచ్చిన వారికి సైతం స్థానికంగా ఓట్లు రావడంతో వారిని మచ్చిక చేసుకుని అన్ని హామీలు ఇచ్చేశారు. చివరి దశకు చేరిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఎలాగైనా గెలవాల్సిందే.. సర్వశక్తులూ ఒడ్డిన అభ్యర్థులు పోలింగ్ చివరి క్షణం వరకూ కొనసాగనున్న ప్రలోభాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలూ ప్రయోగం మిగిలింది ఓటు వేయించుకోవడమే -
కాంగ్రెస్తోనే గ్రామాభివృద్ధి
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ● పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం దోమ: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు గుండాల, కొత్తపల్లి, దాదాపూర్ గ్రామాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాలి శివకుమార్రెడ్డి, పార్వతమ్మకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులనే సర్పంచ్లుగా గెలిపించాలని కోరారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాల బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ బరిలో డాక్టర్
దోమ: ప్రజాసేవే లక్ష్యంగా తాను సర్పంచ్ బరిలో నిలిచానని డాక్టర్ కొప్పుల వెంకట్శ్రీయారెడ్డి అన్నారు. దోమ మండలం దొంగఎన్కేపల్లికి చెందిన కొప్పుల వెంకట్రెడ్డి, శైలజ దంపతుల పెద్దకూతురైన ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వెంకట్రెడ్డి కుటుంబం గత యాభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. ఆయన 2006 నుంచి 2011 వరకు సర్పంచ్గా ప్రజలకు సేవలందించారు. అనంతరం పేదలకు అండగా ఉంటూ తనవంతు సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం తన కూతురును సర్పంచ్ బరిలో నిలిపి, ప్రజల ఆశీర్వాదం కోసం చూస్తున్నారు. విద్యావంతురాలైన తన బిడ్డను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేలా చూస్తానని చెబుతున్నారు. -
పవర్ఫుల్ పదవి..
పల్లెకు సుప్రీం ప్రథమ పౌరుడే అయినా.. ఉప సర్పంచ్ పదవికి ప్రాధాన్యత సంతరించుకుంది. నిధుల వినియోగంలో సర్పంచితో పాటు సమానంగా పంచాయతీ రాజ్ చట్టం హక్కు కల్పించడంతో.. ఆ పదవికి బలం పెరిగింది. కుర్చీ కోసం పోటీ పెరిగింది. పరిగి: గ్రామ పాలనలో ఉపసర్పంచ్ పదవి కీలక భూమిక పోషిస్తోంది. నామమాత్రపు పాత్రకే పరిమితమైన ఆ పదవి.. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పవర్ఫుల్గా మారింది. గ్రామంలో నిధుల వినియోగంపై సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు కూడా ఉమ్మడి చెక్పవర్ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఆ పదవికి బలం చేకూర్చింది. దీంతో ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. వారి దృష్టంతా దానిపైనే.. పరిగి నియోజకవర్గంలో మూడో విడత పంచాయితీ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. అందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. సెగ్మెట్లో 157పంచాయతీలు ఉండగా, అందులో 18 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 139 గ్రామాలకు ఎన్నిక జరగనుంది. ఐదు మండలాల్లో 1,340 వార్డులు ఉండగా.. అందులో 306 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,033కి ఎన్నిక జరగనుంది. అయితే సర్పంచ్ని నేరుగా ఓటర్లే ఎన్నుకుంటుండగా.. ఉప సర్పంచ్ను మాత్రం వార్డు సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు. గతంలో ఈ పదవికి అంతగా డిమాండ్ఉండేది కాదు. వార్డు సభ్యుడికి ఉన్న అధికారాలేఉపసర్పంచ్కు ఉండటం వలన అది అలంకారప్రాయంగానే ఉండేంది. పంచాయితీ రాజ్ చట్టంఅమలుతో ఈ పోస్టుకు యమ గిరాకీ పెరిగింది. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఉప సర్పంచికి పోటీ పెరిగింది. ఆ స్థానానికి రిజర్వేషన్ వర్తింపజేయకపోవడంతో సర్పంచ్ గిరి ఆశించి భంగపడిన వారు.. దీనిపై నజర్ పెట్టారు. ఈ పదవితో కూడా గ్రామ రాజకీయాలను శాసించవచ్చని భవిస్తూ బరిలోనిలుస్తున్నారు. మంతనాలు షురూ వార్డు మెంబర్గా విజయం సాధించి, ఉపసర్పంచ్ని చేజిక్కించుకోవాలన్న ఎత్తుగడలో చాలా మంది ఉన్నారు. ఈ పోస్టుకు అవసరమైన సంఖ్యా బలాన్ని సమీకరించుకునేందుకు ఇప్పటి నుంచే వార్డు బడిరలో నిలిచిన వారు.. మిగతా వారితో మంతనాలు సాగిస్తున్నారు. ఈ మేరకు వార్డు మెంబర్లుగా గెలవాలనే తమ క్యాంపుల్లో చేరేలా సంప్రదింపులు జరుపుతున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటికే గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. నువ్వా.. నేనా! సర్పంచ్, ఉప సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. విధుల నిర్వహణ సర్పంచ్లకే ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అమలులో విఫలమైతే సర్పంచ్పై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టానికి ఉంది. ఉపసర్పంచ్ సహా పాలకవర్గాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయకపోవడం గమనార్హం. అంతే కాకుండా అక్రమ నిర్మాణాలు జరిగినా, నిర్ణీత వ్యవధిలో అనుమతులు మంజూరు చేయకున్నా సర్పంచ్పై వేటు పడుతుంది. ఉపసర్పంచ్కు మాత్రం మినాహాయింపు నిచ్చింది. పంచాయతీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్పవర్ కల్పించిన సర్కారు.. బాధ్యతలను మాత్రం పూర్తిస్థాయిలో సర్పంచ్లకే అప్పగించింది. దీంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పోస్టుకు నువ్వా నేనా అన్నట్టు పోటీ జరుగుతోంది.ఉప సర్పచ్ పదవి కోసంవార్డు సభ్యుల పోటాపోటీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్పవర్ బాధ్యతలు పూర్తిగా సర్పంచ్కే అయినా.. పవర్ కోసం ఆరాటం -
16 నుంచి ధనుర్మాసోత్సవాలు
మణికొండ: నార్సింగి సర్కిల్ పరిధిలోని మంచిరేవుల వేణుగోపాలాస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి జనవరి 15వ వరకు ధనుర్మాసోత్సవాలు, గోదాదేవి రంగనాయకుల స్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు అర్చకుడు వరదాచారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30న వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం, జనవరి 11న గంగాళాల ప్రసాద వితరణ, 15న గోదాదేవి రంగనాథస్వామి కల్యాణం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిరోజు గోదాదేవి సేవా కార్యక్రమం, దంపతులతో పూజ, ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు ఉంటాయని, నెల రోజుల పాటు గోత్రనామార్చన చేసుకునే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9347587786 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
విధులకు ఆలస్యంపై ఎంపీడీఓ ఆగ్రహం
● స్పృహతప్పి పడిపోయిన జూనియర్ అసిస్టెంట్ ● ధారూరులో ఘటన ధారూరు: ఎన్నికల విధులకు ఆలస్యంగా వచ్చిన ఓ ఉద్యోగిని ఎంపీడీఓ మందలించడంతో ఆందోళనకు గురై, స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరులోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. యాలాల మండలంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆదిశేషాచారికి.. ఓ జీపీలో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్గా విధులు కేటాయించారు. ఆయన సకాలంలో హాజరుకాకపోవడంతో ఎంపీడీఓ నర్సింహులు మండిపడ్డారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిసినా.. ఎందుకిలా వ్యవహరించారని మండిపడ్డారు. మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని అందరిముందూ మైక్లో గద్దించడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన మిగిలిన సిబ్బంది ఎంపీడీఓ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఏపీఓను ధారూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. అనంతరం ఇంటికి పంపించేశారు. -
సస్టైనబిలిటీ ఒక ట్రెండ్ కాదు., భవిష్యత్ జీవనశైలి
● లైఫ్ స్టైల్, ఫుడ్ టెక్ రంగాల్లో సిటీ స్టార్టప్ ఎల్మెంటోజ్ ● సిటీలో దేశంలోనే అతిపెద్ద స్మార్ట్ ప్రోటీన్ తయారీ కేంద్రంసాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి గ్లోబల్ సస్టైనబుల్ ఫుడ్ భవిష్యత్తుకు దారి చూపుతున్న స్టార్టప్ ఎల్మెంటోజ్ రీసెర్చ్... ఇప్పుడు లైఫ్ స్టైల్, ఫుడ్ టెక్ రంగాల్లో రాణిస్తోందని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జయశంకర్ దాస్ అన్నారు. జంతు పోషణను కేవలం వ్యవసాయ అంశంగా కాకుండా, ఆరోగ్యం– పర్యావరణం– సస్టైనబిలిటీతో ముడిపడ్డ ఆధునిక జీవన విధానంగా మార్చే దిశగా తమ సంస్థ అడుగులు వేస్తోందన్నారు. ఇండియా, నార్వే ఏంజెల్ ఇన్వెస్టర్ల మద్దతుతో లభించిన సీడ్ ఫండింగ్తో, బ్లాక్ సోల్జర్ ఫ్లై ఆధారిత దేశంలోనే అతిపెద్ద స్మార్ట్ ప్రోటీన్ తయారీ కేంద్రాన్ని ఎల్మెంటోజ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. జనవరి 2026 నుంచి ప్రారంభమయ్యే ఈ కేంద్రం నెలకు వేల టన్నుల పారిశ్రామిక వ్యర్థాలను విలువైన సస్టైనబుల్ ప్రోటీన్లుగా మారుస్తుంది. ఇది పర్యావరణంపై ఒత్తిడి తగ్గించడమే కాదు, భవిష్యత్ ఫుడ్ సిస్టమ్లకు కొత్త దారి చూపనుందన్నారు. యాంటీబయోటిక్లకు ప్రత్యామ్నాయంగా ఇమ్యూన్–స్మార్ట్ న్యూట్రిషన్, ప్రెసిషన్ ఫీడ్ ఫార్ములేషన్లతో ఫౌల్ట్రీ, ఆక్వాకల్చర్, పెట్ ఫుడ్ రంగాల్లో ఆరోగ్యకరమైన మార్పు తీసుకొస్తోంది. ‘‘సస్టైనబిలిటీ ఒక ట్రెండ్ కాదు, భవిష్యత్ జీవనశైలి’’ అనే సందేశాన్ని ఎల్మెంటోజ్ స్పష్టంగా ముందుకు తెస్తోందని సహ–వ్యవస్థాపకులు డాక్టర్ పద్మజ మోహంతి పేర్కొన్నారు. -
ఏకగ్రీవ వార్డు సభ్యుడి అనుమానాస్పద మృతి
మోమిన్పేట్: యునానిమస్ వార్డు మెంబర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా మక్తతండాలో శనివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మెగావత్ రవి (45) శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో నిద్రించి, తెల్లారేసరికి శవమయ్యాడు. మృతుడి ముక్కు, తలతో పాటు మర్మావయాలపై గాయాలైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట్ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రవి తల్లి సక్కుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీచేసిన రవి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. -
మృతదేహంతో ఆందోళన
హత్యేనని బాధితుల ఆరోపణ కుల్కచర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన కుల్కచర్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌడాపూర్ గ్రామానికి చెందిన రత్నయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో అనిత సన్నిహితంగా ఉంటోందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. రత్నయ్య మృతదేహాన్ని రామకృష్ణ ఇంటి ఎదుట ఉంచి, ఆందోళన నిర్వహించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రత్నయ్య మృతికి కారకులైన వారిని చట్టరీత్యా శిక్షిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. -
మేజర్ పంచాయతీల్లో భారీ మెజార్టీ
యాలాల: సర్పంచ్ ఎన్నికల్లో పలు పంచాయతీల్లో పోటీ రసవత్తరంగా సాగింది. ఆయా పంచాయతీల్లో వచ్చిన ఫలితాలు అభ్యర్థులతో పాటు ప్రజా ప్రతినిధులు ఊహించలేకపోయారు. మండల కేంద్రం యాలాల, పగిడియాల, చెన్నారం, దేవనూరు, గోరేపల్లి, అగ్గనూరు, కోకట్లో వంద నుంచి 435 వరకు మెజార్టీ సాధించారు. యాలాల మండల కేంద్రంలో బాలేశ్వర్ గుప్తా మద్దతుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్రాల శ్రీనివాస్ తనయుడు శ్యాంప్రసాద్ పోటీ చేయగా.. పేరి రాజేందర్ బలపరిచిన రిటైర్డ్ ఉద్యోగి శివయ్య గెలుపొందారు. దేవనూరులో తొలిసారి కారు పార్టీ ఖాతా తెరించింది. కోకట్లో బీఆర్ఎస్, బీజేపీ మద్దతులో రాజేందర్రెడ్డి ప్రథమపౌరుడిగా నిలిచారు. రాజేందర్రెడ్డి, సర్పంచ్, కోకట్ లక్ష్మీ, సర్పంచ్, గోరేపల్లి శివయ్య, సర్పంచ్ , యాలాల గ్రామం సర్పంచ్ పార్టీ మెజార్టీ పగిడియాల రిశిత కాంగ్రెస్ 435 చెన్నారం నవీన కాంగ్రెస్ 370 గోరేపల్లి లక్ష్మి బీఆర్ఎస్ 343 యాలాల సీహెచ్.శివయ్య కాంగ్రెస్ 244 అగ్గనూరు మంజుల కాంగ్రెస్ 240 దేవనూరు రేణుకాదేవి బీఆర్ఎస్ 164 కోకట్ రాజేందర్రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ 109 -
పారిశ్రామిక వాడలో హస్తం పాగా
దుద్యాల్: సరిగా ఏడాది క్రితం మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు.. ఏడాదిలోపే ఆ మూడు గ్రామాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే గెలుపొందడం సంచలనం. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలోని 20 గ్రామాలకు రెండు ఏకగ్రీవమవగా మిగిలిని 18 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా 13 కాంగ్రెస్, నలుగురు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. గత ఏడాది నవంబర్ 11న అధికారులపై రైతులు దాడి చేసి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ మూడు గ్రామాలు హస్తగతమయ్యాయి. పోలేపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారుడు జింకల చంద్రయ్య, హకీంపేట్లో కాంగ్రెస్ బలపరిచిన రవీంద్ర నర్సింహా రెడ్డి, లగచర్లలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వెంకట్రాములు గౌడ్లు విజయం సాధించారు. పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన రైతులు కాంగ్రెస్కు బలపరిచన అభ్యర్థులకు మద్దతు పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. హకీంపేట్లో కాంగ్రెస్ మద్దతుప్రకటించిన రవీంద్ర నర్సింహారెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఐశ్వర్య సాయికుమార్పై 421మెజార్టీతో గెలుపొందాడు. లగచర్లలో కాంగ్రెస్ మద్దతుదారుడు వెంకట్రాములుగౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థి గుండెమోని బసప్పపై 15 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించాడు. పోలేపల్లిలో కాంగ్రెస్ మద్దతు దారుడు జింకల చంద్రయ్య బీఆర్ఎస్ అభ్యర్థి పుర్ర రాఘవేందర్పై 35 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. -
ముగ్గురు మాజీలు మళ్లీ సర్పంచ్లు
బషీరాబాద్: సొంతూరుకు స ర్పంచ్గా సేవలు అందించడానికి అందరికీ అవకాశాలు రావు. రిజర్వేషన్తో పాటు అదృష్టం కలిసి రావాలి. మండల పరిధిలోని ముగ్గురు సర్పంచ్లకు మాత్రం రెండో సారి ఈ అదృష్టం వరించింది. 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మైల్వార్, గొట్టిగ కలాన్, బోజ్యానాయక్తండాకు సర్పంచ్లుగా ఎన్నికై న సీమాసుల్తానా, సాబేర్, శాంతిభాయి రిజర్వేషన్లు కలిసి రావడంతో రెండోసారి పోటీచేసి గెలుపొందారు. గతంలో పంచాయతీల్లో వారు చేసిన పనులకు నేటికీ బిల్లులు రాకపోయినా వారు చేసిన అభివృద్ధిని చూసి వారికే మళ్లీ పట్టం కట్టారు. తమకు మరింత బాధ్యత పెరిగిందని.. మరింత అభివృద్ధి చేసే బాధ్యత రెండో సారి సొంత గ్రామానికి సర్పంచ్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. అలాగే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. కుప్పన్కోట్ సర్పంచ్గా రెండో సారి పోటీ చేసిన మాజీ సర్పంచ్ పద్మ పరాజయం చెందారు. ఎఫ్ సాబేర్, సర్పంచ్, గొట్టిగకలాన్ శాంతిభాయి,సర్పంచ్, బోజ్యానాయక్తండా సీమాసుల్తానా, సర్పంచ్, మైల్వార్ -
● తల్లి సర్పంచ్గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి తల్లి సర్పంచ్ అభ్యర్థిగా, తనయుడు వార్డు సభ్యుడి గా పోటీ చేస్తున్నారు.మండలంలోని గొల్లగూడ సర్పంచ్ స్థానం జనరల్ మహిళగా రిజర్వ్ అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా పసూలాది లక్ష్మి పోటీలో ఉండగా అదే పంచాయతీలో 7వ వార్డు సభ్యుడిగా ఆమె కు మారుడు పి.మన్మోహన్ పోటీ పడుతున్నారు. స్పరంచ్గా తల్లికి, వార్డు సభ్యుడి గా తనకు అవకాశం కల్పించాలని తన వార్డులో కొడు కు ప్రచారం చేస్తున్నాడు. సర్పంచ్గా గెలిస్తే తల్లికి మద్దతుగా ఉండాలన్న ఆలోచనతో పోటీకి దిగారు. సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి వార్డు అభ్యర్థి మన్మోహన్ -
గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించండి
కొడంగల్: నూతన సర్పంచ్లు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్, మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ముఖ్యమంత్రి నివాసంలో మొదటి విడతలో కొత్త సర్పంచ్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. మండలంలో 25 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని అన్నారు. కొడంగల్కు రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందన్నారు. హుస్సేన్పూర్ సమీపంలో 300 ఎకరాల భూమి సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అప్పాయిపల్లిలో వ్యవసాయ వర్సిటీ, లగచర్ల పరిసరాల్లో 6 వేల ఎకరాల భూమిని సేకరించి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మెడికల్ కళాశాల, అనుబంధంగా 450 పడకల టీచింగ్ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతీ గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నయీమ్, సంజీవరెడ్డి, ఆసిఫ్ఖాన్, మహేశ్రెడ్డి, దీపక్రెడ్డి, బాల్రెడ్డి, అరిగె ఓం, సర్పంచ్లు దత్తాత్రేయరావు, చెన్ బస్కుమార్, అంజయ్య, నర్సప్ప, గడ్డం నర్సమ్మ, బెన్నూరు లక్ష్మమ్మ, సునీత, యాసర్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్ -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● కాంగ్రెస్ను విశ్వసించని ప్రజలు ● స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం ● మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు: ‘మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. అందుకే ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్రహ్మరథం పట్టారు. ఈ ఫలితాలతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అధ్యాయం ముగిసింది. మరో మూడేళ్లలో తిర్మలాపూర్ వెళ్లేందుకు మూటముల్లె సర్దుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన నివాసంలో పార్టీ మండల అధ్యక్షులు, నాయకులతో కలసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఇరు పక్షాల నుంచి పోటీ ఉంటుందని, అయితే బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెధిరింపులకు గురిచేశారని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. నియోజవకర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ బలపర్పించిన 70 మంది సర్పంచ్గా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉందని అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ స్థానాలను గెలిచి, జెడ్పీపీఠాన్ని కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను గెలిచి, ఎంపీపీలను దక్కించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు నర్సిరెడ్డి, వీరెందర్రెడ్డి, పంజుగుల శ్రీశైల్రెడ్డి, రాంలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన
యాలాల: మతిస్థిమితం లేని మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం జెట్టూరుకు చెందిన రమేశ్ ఈనెల 10న ఇందిరమ్మ కాలనీలో మతిస్థిమితంలేని ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం యా లాల పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులపై దాడి బషీరాబాద్: మండల పరిధిలోని కుప్పన్కోట్తండాలో గురువారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన ప్రకారం.. గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాంశెట్టి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పద్మ ఓటమిని జీర్ణించుకోలేక విచక్షణరహితంగా దాడి చేశారని బాధితులు శారుబాయి, శంకర్, మన్యనాయక్, లక్ష్మణ్ నాయక్ శుక్రవారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండాకు చెందిన కుల నాయకులు ఇరువర్గాల వారితో మాట్లాడి రాజీ కుదిర్చారు. విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ మీర్పేట: మనం అమెరికా వెళ్లడం కాదు.. అమెరికాలో ఉన్న వారిని మన దేశ అభివృద్ధికి తీసుకురాగల స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆకాంక్షించారు. మీర్పేట సర్కిల్లోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమా ల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి శుక్రవా రం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత విద్యార్థులు అదృష్టవంతులని, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఉన్నత విద్యావకాశాలు కల్పించామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ఏటీఏ సభ్యుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఏటీఏ అధ్యక్షులు చల్లా జయంత్రెడ్డి, చల్లా బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు పరిగి: బీఆర్ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరయ్యామని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమంతోనే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగామన్నారు. జైలుపాలు చేసిన ప్రజల కోసం నిలబడినందుకే కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, జగన్, సోయాబ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి తాండూరు రూరల్: ప్రజలు బీజేపీని గ్రామాల నుంచి బలోపేతం చేసేందుకు నడుంకట్టారని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి అన్నారు. మండల పరిధిలోని వీర్శెట్టిపల్లి సర్పంచ్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి తూర్పు లక్ష్మి విజయం సాధించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నూతన సర్పంచ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. మోదీ సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీజేపీని అధిక స్థానాల్లో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మిని సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ ఫిరంగి జర్నప్ప నాయకులు నర్సింలు, హరి, శ్రవణ్, పాల పరుశురాం, వాకిటి పరుశురాం, శంకర్, ఆనంద్ పాల్గొన్నారు. -
అక్రమ మైనింగ్పై
ఉక్కుపాదంసాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గుట్టుగా తవ్వకాలు జరిపి.. రాయల్టీ ఎగవేతకు పాల్పడిన అక్రమార్కుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణ యించింది. ఈ మేరకు ఆయా మైనింగ్/ సెల్లార్ యజమానులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్, సరూర్నగర్, హయ త్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, గండిపేట, శంషాబాద్ మండలాల్లో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఈ అంశంపై స్థానికుల నుంచి జిల్లా మైనింగ్ అధికారికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐలు క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్రమాలను గుర్తించడమే కాకుండా భారీ పెనా ల్టీలతో డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అక్రమ తవ్వకాలు, రాయల్టీ చెల్లించకుండా గుట్టుగా మట్టిని తరలించే లారీలపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఇటీవల ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, పహడీషరీఫ్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేయకపోగా, పరోక్షంగా వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ నోటీసులతోనే సరి.. అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ రెవెన్యూ సర్వే నంబర్ 167/2లో ఓ నిర్మాణ సంస్థ భారీగా తవ్వకాలు చేపట్టినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో రూ.9.5 కోట్లకుపైగా ఫైన్ వేశారు. తట్టి అన్నారం సర్వే నంబర్ 121/పీలోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. రూ.3.39 కోట్ల జరిమానా విధించారు. ఒక్క పైసా కూడా వసూలు చేయలేదు. సరూర్నగర్ మండలం మన్సూరాబాద్ సర్వే నంబర్ 38లో ఓ కన్స్ట్రక్షన్ సంస్థ ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారీ సెల్లార్ తవ్వుతోంది. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ.రెండు కోట్లతో డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఇప్పటి వరకు పైసా వసూలు చేయలేక పోయారు. గతంలో సెల్లార్ తవ్వుతుండగా, మట్టి కూలి నలుగురు కూలీలు మృతి చెందిన ప్రదేశంలోనూ యథావిధిగా తవ్వకాలు మొదలయ్యాయి. ఈ అక్రమ తవ్వకాల వెనుక కొంత మంది పెద్దల హస్తం ఉన్నట్లు తెలిసింది. శ్రీనగర్ రెవెన్యూ సర్వే నంబర్ 185,188, 189లోనూ ఓ మైనింగ్ ఏజెన్సీ అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపట్టి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. తవ్వకాలను ఆపాలంటూ రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులకు లేఖ రాసినా ఫలితం లేకపోయింది. తాజాగా మన్సూరాబాద్, హయత్నగర్ రెవెన్యూ పరిధిలోనూ అక్రమ సెల్లార్లను గుర్తించి, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంగం హోటల్ ఎదురుగా కృపా కాలనీలోనూ సెల్లార్ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బయటికి అమ్ముతున్నట్లు గుర్తించి, నోటీసులు జారీ చేశారు. అడ్డగోలు తవ్వకాలు, మైనింగ్ అమ్మకాలపై ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు తనిఖీలకు వెళ్లడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం మినహా పైసా కూడా వసూలు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. సీరియస్గా తీసుకున్న రెవెన్యూ యంత్రాంగం ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయం రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుకు సన్నాహాలు ఆర్ఆర్ యాక్ట్తో ఆదాయం నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఓఆర్ఆర్కు అటు ఇటుగా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. గండిపేట్, మంచిరేవుల, కోకాపేట్, బుద్వేల్, నార్సింగి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, శంషాబాద్, వనస్థలిపురం, తుర్కయంజాల్ కేంద్రంగా భారీగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగు తున్నాయి. ఈ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బహిరంగ మార్కెట్లో టిప్పర్కు రూ.5 వేల నుంచి రూ.6 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో గ్రానేట్ను సైజును బట్టి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఇక నిర్మాణాల్లో ఉపయోగించే రోబోశాండ్ టన్నుకు రూ.600 నుంచి రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రషర్లు ఏర్పాటు చేసి, ఎత్తయిన గుట్టలు, సెల్లార్ తవ్వకాల్లో భాగంగా వచ్చిన రాళ్లను క్రషర్లలో వేసి డస్ట్గా మారుస్తున్నారు. కనీస చర్యలు చేపట్టక పోవడంతో దుమ్ము, ధూళి సమీప కాలనీలను ముంచేస్తోంది. ప్రతి నెలా అడిగినంత ఇచ్చే వాళ్లకు రాచమర్యాదలు చేస్తూ.. నిరాకరించిన వాళ్ల టిప్పర్లపై కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్ తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.ఆరు వేల కోట్ల ఆదాయం వస్తే.. ఆర్ఆర్ యాక్ట్తో ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే మొండి బకాయిలు వసూలు చేయడం సహా రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,800 కోట్లు సమకూరే అవకాశం లేకపోలేదు. కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు రెవెన్యూ వాళ్లపై.. రెవెన్యూ వాళ్లు పోలీసులపై నెట్టేసి తప్పించుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ సీరియస్గా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్ఆర్ యాక్ట్ను అమలుతో ఇప్పటి వరకు తిన్నదంత కక్కించొచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ఈ ఫెనాల్టీల వసూళ్ల కోసం దీన్ని పకడ్బందీగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిసింది. -
మామిడిలో సస్యరక్షణ
పూత నిలిస్తేనే లాభాల పంట ● ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు చలి అనుకూలమే.. మొగ్గ దశలో చలి ఎక్కువ గా ఉండడం మొక్కకు చాలా ఉపయోగమే. నాకు 20 ఎకరాల మామిడి తోట ఉంది. అధికారుల సూచన లు, యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా. సకాలంలో మందులు పిచికారీ చేస్తున్నా. రాత్రి వేళల్లో చలి తీవ్రత 15 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే పూత బాగా నిలుస్తుంది. – పిట్ల మల్లేశ్, మామిడి రైతు, హస్నాబాద్ సూచనలు పాటించాలి మామిడి రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి. క్రమం తప్పకుండా తోటల ను పరిశీలించాలి. వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏ సమస్య ఉన్నా వెంట నే అధికారులను సంప్రదించాలి. ప్రతీ క్లస్టర్కు ఒక ఉద్యాన శాఖ అధికారి అందుబాటులో ఉంటారు. – ఎంఏ సత్తార్, ఉద్యాన శాఖ అధికారి దుద్యాల్: మామిడిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో 13 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పండే ప్రధాన పంటల్లో మామిడి కూడా ఒకటి. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. వాతావరణం అనుకూలంగానే ఉందని ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తోటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నారు. పూమొగ్గ బయటకు వచ్చే వరకు నీటి తడి ఇవ్వరాదు. మొగ్గ పగిలే దశలో పొటాషియం నైట్రేట్ (13:0:45) 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో మొగ్గ పడిలి పూత వచ్చే అవకాశం ఉంటుంది. జూన్– జూలై మాసంలో ఎరువులు వేయని మామిడి రైతులు ప్రస్తుత దశలో అరకిలో యూరియా, అరకిలో పొటాష్ను వేసువేసుకోవాలి. నీటి వసతి లేనివారు పిందె దశలో ఒక శాతం యూరియా ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. పూత ఆలస్యమైతే తోటలో కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవాలి. మామిడిపై చీడపీడల యాజమాన్యం.. ఆకులపై బూడిద మచ్చలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా సాఫ్ 2 గ్రాములను ఒక లీటర్ నీటికి కలిపి చెట్టుపై పిచికారీ చేసుకోవాలి. ఆకుపై నల్ల మచ్చలు ఉంటే పైకొమ్మలకు సోకి పూత రాలిపోతుంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 3 గ్రాముల ఆక్సీక్లోరైడ్ మందును కలిపి స్ప్రే చేయాలి. పూత, పిందె దశలో ఆకుమచ్చ పురుగు వ్యాప్తి చెందితే నివారణకు ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి 15 రోజు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. మొగ్గ తొందరగా విచ్చుకోవడానికి, పూల కాడ పొడవుగా పెరగడానికి పొటాషియం నైట్రేట్(13:0:45) 10 గ్రాముల మందును ఒక లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు అధికంగా ఉన్నప్పుడు లీటరు నీటికి ఫిఫ్రోనిక్ 2 మి.లీ లేదాఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోపాడ్(ట్రెసర్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సిన్(అక్టరా) 0.3 గ్రాముల మందులను లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. పిండినల్లి పురుగు నేల నుంచి చెట్టు పైకి పాకకుండా చెట్టు ప్రధాన కాండంపై గ్రీసు పూసిన ప్లాస్టిక్ పేపర్లను భూమి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు కాండం చుట్టూ చుట్టాలి. -
ఉల్లంఘిస్తే చర్యలు
అనంతగిరి: రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో రెండవ విడత బంట్వారం, మోమిన్పేట్, మర్పల్లి, వికారాబాద్, ధారూరు, కోట్పల్లి, నవాబుపేట్ మండలాల్లో ఎన్నికలుంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దని సూచించారు. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా సంగీత, నాటక, వినోద కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 సెక్షన్ 214(2) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పిదాలకు తావివ్వొద్దు రెండో విడత పోలింగ్ జరగనున్న మండలాల అధికారులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎటువంటి తప్పిదాలకు తావివ్వొద్దని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎన్నికలు జరుగనున్న ఏడు మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం తర్వాత పోలింగ్ మెటీరియల్ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలన్నారు. పోలింగ్ సిబ్బంది సమయ పాలనను పాటిస్తూ.. నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని ఆదేశించారు. చెక్ లిస్టుకు సామగ్రి తీసుకున్నది లేనిది సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో లైట్లు, సీటింగ్ అరేంజ్మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటింగ్ విషయంలో గోప్యత వంద శాతం అమలు జరిగేలా చూడాలన్నారు. గుర్తింపు లేని వ్యక్తులను సెంటర్లోకి అనుమతించొద్దన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా పూర్తయ్యేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్, ఆర్డీఓ వాసు చంద్ర, డీపీఓ జయసుధ, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ -
ఈవీఎం గోడౌన్ పరిశీలన
జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ప్రతీక్జైన్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్ తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసు చంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
నస్కల్లో ‘ఏటీసీ’
పరిగి: నియోజకవర్గ నిరుద్యోగులకు పాధి కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నానని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని ఏటీసీ(అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ శిక్షణ కేంద్రం టాటా కంపెనీ అనుబంధంగా రూ.70 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన నిరుద్యోగులకు సంస్థ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. కొండంగల్లో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడ లోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వివరించారు. ఈ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్రానికి రూ.6లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మన ప్రాంతంలోనూ పరిశ్రమలు వస్తాయన్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మంచి ఫలితాలు వచ్చాయని రెండు, మూడో విడతల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుల్కచర్ల ఏఎంసీ చైర్మ న్ ఆంజనేయులు, పూడూరు మండల అధ్యక్షు డు సురేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: వికారాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని ఎస్పీ స్నేహమెహ్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్, బంట్వారం, మోమిన్పేట్,మర్పల్లి, ధారూర్, కోట్పల్లి, నవాబుపేట్ మండలాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వంద మీటర్ల పరిధిలో గుంపులుగా చేరడం నిషేధమన్నారు. అక్రమంగా మద్యం రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడిన వారిపై, ప్రలోభాలకు గురిచేసే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలు, సంబురాలు నిషేధించినట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం యూనిట్ అధ్యక్షుడిగా శ్రీహరి అనంతగిరి: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం వికారాబాద్ యూనిట్ అధ్యక్షుడిగా శ్రీహరిని ఎన్నుకున్నారు. శుక్రవారం వికారాబాద్లోని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ అధ్యక్షుడిగా శ్రీహరి, సహాధ్యక్షుడిగా కిష్టయ్య, ఉపాధ్యక్షుడిగా గాలయ్య, జిల్లా కౌన్సిలర్గా గాలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు మాణిక్ప్రభు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. డీజే ఆపరేటర్లకు కౌన్సెలింగ్ అనంతగిరి: G°²-MýSÌS MøyŠæ AÐ]l$-Ë$ÌZ E¯]l²…§ýl$¯]l Ñf-Äñæ*™èlÞ-Ð]l-Æ>Å-ÎË$ °õÙ-«§ýl-Ð]l$-°.. ÐésìæMìS yîlgôæ Ýû…yŠæ íÜçÜt… ò³yìl™ól ïÜgŒæ ^ólĶæ$-yýl…™ø ´ër$ Ķæ$f-Ð]l*-¯]l$Ë$, Bç³-Æó‡-r-Æý‡ÏOò³ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólÝë¢Ð]l$° ïÜI Á…MýS$-Ð]l*ÆŠ‡ òßæ^èlaÇ…-^éÆý‡$. Gïܵ õܲçßæÐðl${çßæ B§ólÔ>ÌS Ðól$Æý‡MýS$ Ô¶æ${MýS-ÐéÆý‡… BĶæ$¯]l yîli Ķæ$f-Ð]l*-¯]l$Ë$, Bç³-Æó‡-r-Æý‡ÏMýS$ Mú¯ðlÞ-Í…VŠæ C^éaÆý‡$. A¯]l$Ð]l$† ÌôæMýS$…yé ¿êÈ Ôèæº-®…™ø çÜ…X™èl ç³ÇMýS-Æ>Ë$ ѰÄñæ*-WõÜ¢ ^èlÆý‡ÅË$ ™èlç³µÐ]l° òßæ^èla-Ç…-^éÆý‡$. ˘ 16 నుంచి ధనుర్మాస పూజలు కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి ధనుర్మాసం పూజలు ప్రారంభించనున్నట్లు ఆలయ ధర్మకర్త నందారం శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం ధనుర్మాసం పూజలు, తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు సన్నాయి, 5 గంటలకు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, 6 గంటలకు తిరుప్పావై ప్రవచనం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 6 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. జనవరి 14న మధ్యాహ్నం 2 గంటలకు గోదాదేవి కల్యాణోత్సవం, సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి ఉత్సవ ఊరేగింపు, 15న మకర సంక్రాంతి, 16న కనుమ, నీరాటోత్సవం, అలంకార తిరుమంజనం ఉంటుందన్నారు. అభిషేకం, అమ్మవారికి నోము తదితర పూజలను వైఖానస ఆగమ శాస్త్రోంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు రూ.1,551 చెల్లించి గోత్రనామాలతో పేరు నమోదు చేయించుకోవాలన్నారు. పొంగలి తళిహకు ప్రసాదం చేయించే భక్తులు ఆలయంలో రూ.450 చెల్లించాలన్నారు శ్రీమాన్ ధరూర్ శ్రీనివాసాచార్యులు తిరుప్పావై ప్రవచనం వినిపిస్తారని వివరించారు. -
చేస్తారో!
సరి సస్పెండ్వికారాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికారుల సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలింగ్కు వారం ముందు ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్ వేటుకు గురికాగా.. పోలింగ్కు ముందు రోజు ఏకంగా 17 మందిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి విషయంలో ఇది స్వాగతించాల్సిన విషయమైనా పలువురు తప్పు చేయకుండానే బలయ్యారు. ఎన్నికల విధుల కేటాయింపులో తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తింది. తాము ముందుగానే అవకతవకలు, ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాఠాలు నేరుస్తారా..? అధికారులు, ఉద్యోగులకు స్థానిక సంస్థల ఎన్నికల విధులు కేటయింపులో గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు, 5,058 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొదటి విడతలో తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు పూర్తవగా.. వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఆదివారం(14న) ఎన్నికలు జరగనున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులకు సంబంధించి విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. అయితే శిక్షణకు హాజరయ్యే విషయంలో మరియు పోలింగ్ డ్యూటీలు వేసే విషయంలోనూ ఉన్నతాధికారులు అవగాహన రాహి త్యంతో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని మండలాల్లో మొదటి విడతలో 60 మంది వరకు విధులు కేటాయించిన ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే ఆయా మండలాల ఎంపీడీఓల నిర్లక్ష్యం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. చాలా మంది ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఎన్నికల విధులకు సంబంధించిన ఆర్డర్లు సర్వ్ చేయకుండా వాట్సాప్లో షేర్చేసి చేతులు దులుపుకొన్నారని.. వారు ఆ ఆర్డర్లు చూసుకున్నారా..? లేదా కూడా గమనించలేదని పేర్కొంటున్నారు. దీంట్లో ఉన్నతాధికారుల తప్పిదం ఉన్నప్పటికీ కేవలం కిందిస్థాయి ఉద్యోగులపైనే చర్యలు తీసుకోవటం బాధాకరమని వాపోతున్నారు. మొదటి విడతలో చోటు చేసుకున్న అవకతవకలు రెండో విడతలోనైనా జరగకుండా చూస్తారా..? ఈ సారి అయినా పాఠాలు నేరుస్తారా..? లేదా అని ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది చర్చించుకుంటున్నారు. పర్యవేక్షణ అధికారుల్లో కనిపించని మార్పు ఎన్నికల ఏర్పాట్లలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. జిల్లా అధికారుల తీరుతో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. తొలివిడతలో మృతి చెందిన ఉద్యోగికి ఓ చోట, ఉద్యోగ విరమణ చేసిన వారికి మరోచోట, బదిలీపై వెళ్లిన వారికి సైతం విధులు కేటాయించిన విషయం విదితమే. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ ఇప్పటి వరకు 20 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో ముగ్గురు కిందిస్థాయి ఉద్యోగులుండగా మిగిలిన వారు ఉపాధ్యాయులు. సస్పెన్షన్ వేటుతో క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో మార్పు కనిపిస్తుండగా.. పర్యవేక్షణాధికారులుగా ఉన్న ఆయా శాఖల హెచ్ఓడీలు, ఇతర ఉన్నతాధికారుల్లో మాత్రం నిర్లక్ష్యపు నీడలు వీడడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గందరగోళంగా ఎన్నికల విధుల కేటాయింపు -
వైద్య సేవలపై అవగాహన అవసరం
అనంతగిరి: ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి అన్నారు. శుక్రవారం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మాతా, శిశు ఆరోగ్య సేవలు, వాక్సినైజేషన్, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశ్, డాక్టర్ సంగీత తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి మోమిన్పేట: ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి సర్ణకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రికి ఎక్కువగా పేదలే వస్తారని వారికి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఉద్యోగులు విధిగా సమయ పాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రుల్లో కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. -
సందడిగా ‘సమ్మిట్’ ప్రాంగణం
కందుకూరు: ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం శుక్రవారం మూడో రోజు విద్యార్థులు, సందర్శకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లనుఆసక్తిగా తిలకించారు. రోబోలతో స్వాగతం, ఏఐ ఫొటో ఇమేజ్లు తీసుకోవడం, స్టాళ్లలో ఏర్పాటు చేసిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదికలో ఎమర్జింగ్ టెక్నాలజీ అనే థీమ్తో రియల్ లైఫ్లో రిజిలియెన్స్ అనే అంశంపై చర్చ నిర్వహించారు. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జి.సత్యనారాయణ, చీఫ్ డెలివరీ ఆఫీసర్ జితేంద్ర పుచ్చ, మాస్టెక్ డిజిటల్ శ్రీనివాస్ ఆత్రేయ, సీటీఓ అవికా, క్యూవైఎల్ఐఎస్ సీఈఓ కిషోర్ ఉప్పలపాటి చర్చా వేదికలో పాల్గొన్నారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ యొక్క ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సిద్ధత తదితర అంశాలపై విద్యార్థుల సమక్షంలో విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించారు. అనంతరం కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్శనకు శనివారం చివరి రోజని, ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపుఅనంతగిరి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. గురువారం కలెక్టరేట్ సమావేశంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎన్నికల జనరల్ అబ్జర్వర్ షేక్ యాస్మిన్ బాషా సమక్షంలో ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండో విడతలో 7 మండలాలు 175 గ్రామ పంచాయతీలు ఉండగా 16 జీపీలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మిగిలిన 159 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మండలాల్లో 1,520 వార్డులు ఉండగా 122 యునానిమస్ అయినట్లు తెలిపారు. 1,398 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా మండలాల్లో ఎన్నికల విధులకు 1,701 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,127 మందితో కూడిన ఇద్దరు సభ్యుల టీంలను, 298 మందితో కూడిన ముగ్గురు సభ్యులు గల 28 టీంలును, 1,398 మందితో కూడిన నలుగురు సభ్యుల టీంలకు ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల విధులు కేటాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీపీఓ జయసుధ, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
అంజన్నా.. కరుణించన్నా..
జాతరకు తరలివచ్చిన భక్తజనం ప్రత్యేక అలంకరణలో స్వామివారు దుద్యాల్: అంజన్నా.. కరుణించన్నా అంటూ భక్తులు అడవిలో వెలసిన ఆంజనేయస్వామిని వేడుకున్నారు. దుద్యాల్ మండలం చిలుముల మైల్వార్ గ్రామ శివారులో కొలువుదీరిన మామిడికుంట ఆంజనేయస్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం పల్లకీ సేవ, సాయంత్రం పెరుగు బసంతం వేడక నిర్వహించారు. దుద్యాల్, బొంరాస్పేట్, కొడంగల్, కోస్గి, దౌల్తాబాద్ మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొక్కులు చెల్లించుకున్నారు. మహిళల భజన ఆకట్టుకుంది. ఏటా రెండు సార్లు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
తొలి పోరులో హస్తం హవా
వికారాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ దుందుబి మోగించింది. గురువారం కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లోని 225 జీపీలకు ఎన్నికలు జరిగాయి. బషీరాబాద్ మినహా మిగిలిన ఏడు మండలాల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే సొంత మండలం బషీరాబాద్లో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కనిపించింది. ఈ మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు చెరో సగం జీపీలు దక్కించుకున్నాయి. కొడంగల్లో కాంగ్రెస్కు పట్టం సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఫలితాలు దాదాపుగా ఏకపక్షంగా వచ్చాయి. మెజార్టీ జీపీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ ఐదారు జీపీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏకగ్రీవ జీపీల్లో సైతం కాంగ్రెస్ మద్దతుదారులే ఉన్నారు. ఓవరాల్గా కమలం పార్టీ ఒకటి రెండు చోట్లకే పరిమితమైంది. వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు ఖాతా తెరవలేదు. ‘చే’జిక్కిన పంచాయతీలు 173 పార్టీల వారీగా వివరాలుమండలం మొత్తంజీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్ర తాండూరు 33 22 11 – – బషీరాబాద్ 39 21 17 01 –– యాలాల 39 23 12 01 03 పెద్దేముల్ 38 26 12 –– –– కొడంగల్ 25 22 – 02 దౌల్తాబాద్ 33 21 11 – 01 బొంరాస్పేట్ 35 29 05 – 01 దుద్యాల 20 15 04 – 01 మొత్తం 262 179 72 02 08 -
జనం మెచ్చిన సర్పంచ్లు
వికారాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. మొదటి విడతలో నిర్వహించిన ఎనిమిది మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు ఉండగా తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్, దుద్యాల్ మండలాల్లో గురువారం ఎన్నికలు జరిగాయి. ఈ మండలాల్లో 262 జీపీలు ఉండగా 37ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల పోలింగ్ సాగింది. 2 గంటలకు కౌటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 4 గంటల నుంచే ఫలితాలు వెలువడ్డాయి. 81.21 శాతం పోలింగ్ తొలి విడత ఎన్నికల్లో 81.21 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బొంరాస్పేట మండలంలో అత్యధికంగా 84.50 శాతం, బషీరాబాద్లో అత్యల్పంగా 77.45 శాతం ఓటింగ్ నమోదైంది. చలి తీవ్రత కారణంగా ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 9 గంటలకు పుంజుకుంది. ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటలకు 20.19 శాతం, 11 గంటలకు 52.19 శాతం, మధాహ్నం ఒంటి గంట 73.82 శాతం నమోదైంది. నడవలేని వృద్ధులను, దివ్యాంగులను కుర్చీలు, వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల పరిధిలో 2,16,212 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,28,943 మంది పురుషులు,1,37,301 మంది మహిళలు ఉన్నారు. వీరి లో 1,06,110 మంది పురుషులు(82.29 శాతం), 1,10,098 మంది మహిళలు(80.19 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరలు ఎనిమిది మంది ఉండగా నలుగురు ఓటు వేశారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించిన ఉన్నతాధికారులు తొలి విడత పోలింగ్ సరళిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు యాస్మిన్ బాషా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ తీరు, వసతు లపై ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్జైన్ కలెక్టరేట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎస్పీ స్నేహమెహ్ర కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయిన వాళ్లు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి మౌనంగా అక్కడి నుంచి తప్పుకోగా, గెలుపొందిన అభ్యర్థులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విజయోత్సవాల్లో ముగిని తేలారు. మండలాల వారీగా పోలింగ్ వివరాలుమండలం పురుషులు మహిళలు మొత్తం ఓటు పోలైనవి శాతం తాండూరు 17,828 19,071 36,901 28,672 77.70 బషీరాబాద్ 18,299 20,193 38,492 29,811 77.45 యాలాల 16,093 17,807 33,901 27,287 80.49 పెద్దేముల్ 18,449 19,499 37,948 31,362 82.64 కొడంగల్ 15,066 15,666 30,732 25,583 83.25 దౌల్తాబాద్ 19,416 20,339 39,760 32,530 81.82 బొంరాస్పేట్ 14,055 14,418 28,473 24,061 84.50 దుద్యాల్ 9,737 10,308 20,045 16,906 84.34 మొత్తం 1,28,943 1,37,301 2,66,252 2,16,212 81.21 తాండూరు మండలంలో ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బషీరాబాద్లో 5, యాలాలలో 10, పెద్దేముల్లో 5, కొడంగల్లో 01, దౌల్తాబాద్లో 03, బొంరాస్పేట్లో 7, దుద్యాల్ మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడత పోలింగ్ ప్రశాంతం యునానిమస్ పంచాయతీలు -
కొత్త పాలకులొచ్చారు..
● మండలంలో 15 మంది కాంగ్రెస్ ● నలుగురు బీఆర్ఎస్, ఒకరు ఇండిపెండెంట్ సర్పంచులు దుద్యాల్: రెండేళ్ల అనంతరం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలకు కొత్త సర్పంచులు కొలువుదీరారు. దుద్యాల్ మండలం 20 పంచాయతీలకు రెండు ఏకగ్రీవం కాగా.. మిగతా 18కి గురువారం ఎన్నిక నిర్వహించారు. అందులో 13 మంది కాంగ్రెస్ పార్టీ బలపర్చిన వారు కాగా.. నలుగురు బీఆర్ఎస్, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. వీరే ప్రథమపౌరులు గ్రామం, కొత్త సర్పంచుల వివరాలు ఇలా ఉన్నాయి. దుద్యాల్– సంగీత(బీఆర్ఎస్), అల్లిఖాన్పల్లి– మ్యాకలి కథలయ్య(కాంగ్రెస్). వాల్యానాయక్ తండా– ముడావత్ దేవిబాయి(కాంగ్రెస్). లగచర్ల– వెంకట్రాములు గౌడ్(కాంగ్రెస్). రోటిబండ తండా– రుక్కమ్మ(బీఆర్ఎస్). హకీంపేట్– బి.రవీంద్ర నర్సింహారెడ్డి(కాంగ్రెస్). పోలేపల్లి– జింకల చంద్రయ్య(కాంగ్రెస్). ఈర్లపల్లి– పిట్ల మెగులప్ప(కాంగ్రెస్). సంట్రకుంట తండా– మాణిక్య నాయక్(కాంగ్రెస్). గౌరారం– కిష్టిబాయి(రెబల్). హంసంపల్లి– జెల్ల పుష్పమ్మ(కాంగ్రెస్). నాజుఖాన్పల్లి– క్యాసగారి సుజాత(బీఆర్ఎస్). ఎక్కచెరువు తండా– రాథోడ్ హన్మ్యనాయక్(కాంగ్రెస్). కుదురుమల్ల– రాంపూరం లాలప్ప(కాంగ్రెస్). ఆలేడ్– అన్నపూర్ణ గౌడ్(కాంగ్రెస్). సత్తర్కుంట తండా– మూడావత్ పూజ(బీఆర్ఎస్). చెట్టుపల్లి తండా– ముడావత్ గోపాల్(ఇండిపెండెంట్). చిలుముల్ మైల్వార్– చింతకుంట బాలప్ప(కాంగ్రెస్). సంగాయిపల్లి– వెంకట్ రెడ్డి(కాంగ్రెస్)ఏకగ్రీవం. సాగారం తండా– నరేశ్ రాథోడ్(కాంగ్రెస్) ఏకగ్రీవం. కొడంగల్ సర్పంచులు.. కొడంగల్ రూరల్: మండల పరిధి పర్సాపూర్ సర్పంచుగా కన్నం రాధ, అంగడిరాయిచూర్– సౌభాగ్యలక్ష్మి నాగప్ప, రుద్రారం– ఎల్లప్ప, రావులపల్లి– పద్మమ్మ, ఉడిమేశ్వరం– శ్రీనివాస్ గెలుపొందారు. -
ప్రలోభ పెట్టి.. ప్రాధేయ పడి
● వలస ఓటర్లను ప్రసన్నంచేసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థులు ● నిత్యం గ్రామాల్లో మందు,విందులతో సందడి చేవెళ్ల: ‘నమస్తే అన్నా, అక్కా, తమ్మీ, చెల్లి నేను మన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న మీ ఓటు నాకే వేయాలి’ అని వలస ఓటర్లను ప్రసన్నం చేసుకొని పనిలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. రెండో విడతలో జరుగుతున్న చేవెళ్ల డివిజన్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఓటరు జాబితాలో తిరగేసి మరీ ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఉన్న ఓటర్లను ఉదయం సాయంత్రం వేళల్లో కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మండల కేంద్రం, హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉన్న వారి కోసం వాకబు చేస్తూ ఫోన్ నంబర్లు తీసుకొని, అడ్రస్లు కనుక్కొని వారి ఎదుట ప్రత్యేక్షమవుతున్నారు. మన గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. 14వ తేదీన గ్రామానికి వచ్చి ఓటు వేసేందుకు రావాలని తాయిళాలు, వాగ్దానాలు ఇవ్వటంతోపాటు రవాణా సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు తీస్తూ దండాలు పెడుతూ కాళ్లు పట్టుకొని మరీ గెలిపించాలని కోరుతున్నారు. ఊరి బయట ఉండే ఓటర్లకు వారికి తెలిసిన వారితో ఫోన్లు చేయించి ఓట్లు రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు ఓటర్లకు మందు, విందులతో దావత్లు ఇస్తున్నారు. -
బషీరా‘బాద్షా’ వెంకటేశ్ మహరాజే
బషీరాబాద్: జిల్లాలో ఉత్కంఠ రేపిన బషీరారాబాద్ సర్పంచ్ పీఠం మహరాజులకే దక్కింది. గురువారం జరిగిన పల్లె పోరులో తన సమీప ప్రత్యర్థి అనూప్ ప్రసాద్పై 370 ఓట్ల భారీ మెజార్టీతో వెంకటేష్ మహరాజ్ విజయం సాధించారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఇద్దరు నేతలు పోటీ పడడంతో పార్టీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మహరాజులకు మద్దతు తెలుపడం కాంగ్రెస్లో దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే వర్గం పూర్తిగా అనూప్ ప్రసాద్కు అండగా నిలిచింది. బీఆర్ఎస్, బీజేపీ మహరాజ్ కుటుంబానికి బాసటగా నిలిచాయి. దీంతో వెంకటేశ్ మహరాజు గెలుపొందారు. ఐదో సర్పంచ్.. ఇప్పటి వరకు బషీరాబాద్ సర్పంచ్గా మహరాజుల ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నలుగురు నాయకులు సర్పంచులుగా సేవలు అందించారు. మొదటి సర్పంచ్గా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు తండ్రి నర్సప్ప మహరాజ్, ఆ తర్వాత అతని కొడుకు దివంగత మాజీ మంత్రి చంద్రశేఖర్మహరాజ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, రాకేశ్ మహరాజ్ జెడ్పీటీసీగా, సర్పంచ్గా బషీరాబాద్ ప్రజలకు సేవచేశారు. తాజాగా ఇదే ఇంటి నుంచి చంద్రశేఖర్ మహరాజ్ సొంత అల్లుడు వెంకటేశ్ మహరాజ్ ఐదో సర్పంచ్గా ఎన్నికయ్యారు. -
ప్రమాదశాత్తు కార్మికుడి మృతి
● స్టీల్ ఫ్యాక్టరీలో వరుస ఘటనలు ● మృత్యువాత పడుతున్న కార్మికులుపరిగి: పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు వలస కార్మికుడి మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి లక్ష్మీదేవిపల్లి గ్రామ సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బిహార్ రాష్ట్రానికి చెందిన సుహేల్ అన్సారీ(20) పనిచేస్తున్నాడు. బుధవారం ప్రమాదవశాత్తు మిషనల్ బెల్టులో దుర్మరణం చెందాడు. జరిగిన ఘటనను కర్మాగారం యాజమాన్యం గోప్యంగా ఉంచిందని పలువురు ఆరోపించారు. ఫ్యాక్టరీలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఫ్యాక్టరీని కొనసాగిస్తూ.. శ్రమజీవుల ఉసురు తీస్తున్నారని వాపోయారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రమాద విషయమై ఎస్ఐ మోహనకృష్ణను వివరణ కోరగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో.. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న స్టీల్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ వెంకటేశ్వరికి సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికులు బలవుతున్నారన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫ్యాక్టరీలోకిఎవరినీ అనుమతించడం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి యాజ్యమాన్యంతగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రచారం జోరు.. నేతలే లేరు
● పంచాయతీ ఎన్నికల్లోకనిపించని రాజకీయ నాయకులు ● చేవెళ్లలో సర్పంచ్ అభ్యర్థులకు దక్కని మద్దతు చేవెళ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాల జోరు మీదుంటే రాజకీయ నాయకులు మాత్రం మౌనముని పాత్రలో ఉండి పోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కడా ఏ పార్టీ నాయకులు తమ మద్దతుదారులను ఈ సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రకటించటం కానీ, ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కనిపించటం లేదు. అభ్యర్థులు మాత్రం జోరుగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో రెండో విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఆయా గ్రామాల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు పోటీలో ఉన్నప్పటికీ ఎక్కడా మాది పలాన పార్టీ అని స్పష్టంగా చెప్పుకోవటం లేదు. గ్రామంలో మాకు అన్నివర్గాల వారు మద్దతు ఇస్తున్నారని అభ్యర్థులు సైతం తమ పార్టీలను పక్కన పెట్టారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిశబ్దంలో ఉండిపోయాయి. కొన్ని గ్రామాల్లో మాత్రం తమ అభ్యర్థులుగా చెప్పుకొంటున్నా వారి వెంట ప్రచారం మాత్రం పార్టీ నాయకులు చేయడం లేదు. నిశ్శబ్దంలో రాజకీయ పార్టీలు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి, జిల్లా, మండలాల నాయకులుగా ఎంతోమంది ఉన్నా గ్రామాల్లో ప్రచారం చేయక పోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం ఇదే పరిస్థితిలో మౌనం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను మాత్రం తమ పార్టీ వ్యక్తిగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలను మాత్రం ముందుగానే వెళ్లి తమ పార్టీ అభ్యర్థులే అని ప్రకటించుకొని శాలువాలు కప్పి సన్మానించారు. పోటీలో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని గుసగుసలాడుతున్నారు. ప్రజలకు తమ పార్టీల పేరు చెబితే ఓట్లు పడవనే భయంలో అభ్యర్థులు ఉండిపోయారని చర్చించుకుంటున్నారు. -
హకీంపేట ప్రజలకు రుణపడి ఉంటాం
కాంగ్రెస్ నాయకుడు గజ్జల నర్సింహారెడ్డి దుద్యాల్: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ మద్దతుదారులకు విజయాన్ని అందించాయని ఆ పార్టీ నాయకుడు గజ్జల నర్సింహారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం అయన విలేకరులతో మాట్లాడుతూ.. హకీంపేట సర్పంచ్గా తన సతీమణి రవీంద్రను భారీ మెజార్టీతో ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని స్పష్టంచేశారు. ఈవిజయం మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డికి చెంప పెట్టులాంటిదని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న హకీంపేట్లో యువకులను రెచ్చగొట్టి, వారిని జైలు పాలు చేశారని మండిపడ్డారు. పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చిన రైతులే కాంగ్రెస్ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించారని సంతోషం వ్యక్తంచేశారు. ఈప్రాంతం అభివృద్ధికి మరింత బాధ్యతగా పనిచేస్తామని తెలిపారు. -
కాంగ్రెస్ జోరుకు.. కారు బ్రేక్!
● బషీరాబాద్ మండలంలో ఇరు పార్టీలకు సమాన జీపీలు ● బోణీ కొట్టిన బీజేపీ బషీరాబాద్: బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ జోరుకు బీఆర్ఎస్ బ్రేకులు వేసింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి సొంత మండలం కావడంతో ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇరు పార్టీల మద్దతుదారుల నడుమ తీవ్ర పోటీ సాగింది. బషీరాబాద్ మండలంలో 39 జీపీలకు గానూ, ఐదు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటికి పోలింగ్ నిర్వహించగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సమానంగా పంచుకున్నాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఓ అభ్యర్థి సర్పంచ్గా విజయం సాధించారు. విజేతలు వీరే.. బషీరాబాద్ సర్పంచ్గా వెంకటేశ్ మహరాజ్(కాంగ్రెస్), అల్లాపూర్, జంగం వెంకటయ్య (బీఆర్ఎస్), బాబునాయక్తండా జే.అనిత (కాంగ్రెస్), బహదూర్పూర్ నవనీత(కాంగ్రెస్) బహదూర్పూర్తండా ప్రకాశ్(కాంగ్రెస్), ఎక్మాయి శశికళ(కాంగ్రెస్), గంగ్వార్ సునీతారెడ్డి( బీఆర్ఎస్), గొట్టిగకుర్దు సావిత్రమ్మ( కాంగ్రెస్), గొటిగకలాన్ సాబేర్(బీఆర్ఎస్), హంక్యానాయక్తండా రాథోడ్అనిత (కాంగ్రెస్), ఇందర్చెడ్ కృష్ణకుమార్(బీఆర్ఎస్), ఇస్మాయిల్పూర్ నామ్యానాయక్(కాంగ్రెస్), జలాల్పూర్జైవీర్లాల్ (కాంగ్రెస్), కాంసన్పల్లి ఎం నరేందర్రెడ్డి(బీఆర్ఎస్), కాశీంపూర్ హరిత( కాంగ్రెస్), కంసన్పల్లి(బీ) సంగీత(బీజేపీ), కొర్విచెడ్ నవీన్రెడ్డి(బీఆర్ఎస్), కొర్విచెడ్ గని అంబమ్మ(బీఆర్ఎస్), కొత్లాపూర్ రాగిణిబాయి(బీఆర్ఎస్), కుప్పన్కోట్ రాంశెట్టి(బీఆర్ఎస్) క్యాద్గిరా జైపాల్రెడ్డి(బీఆర్ఎస్), మల్కన్గిరి నాగేశం(బీఆర్ఎస్), మంతన్గౌడ్ (ఏకగ్రీవం), మంతన్గౌడ్తండా అనుషబాయి(కాంగ్రెస్), మంతట్టి గిరిజ(బీఆర్ఎస్), మర్పల్లి వాల్మికి నరేష్(కాంగ్రెస్), మాసన్పల్లి సునీతాబాయి( కాంగ్రెస్), నంద్యానాయక్తండా సుమ్మిబాయి(కాంగ్రెస్), నవల్గ వెంకటమ్మ( బీఆర్ఎస్), నవాంద్గి శ్రీకాంత్(కాంగ్రెస్), నీళ్లపల్లి వేణుగోపాల్రెడ్డి(కాంగ్రెస్), పర్వత్పల్లి పాండురంగారెడ్డి(బీఆర్ఎస్), పరా్శ్య్ నాయక్తండా లక్ష్మిబాయి(కాంగ్రెస్), రెడ్డి గణాపూర్ బసంత్(కాంగ్రెస్), వాల్యానాయక్తండా లక్ష్మీబాయి( బీఆర్ఎస్), దామర్చెడ్ మాణేమ్మ(బీఆర్ఎస్) సర్పంచ్లుగా విజయం సాఽఽధించారు. -
షాద్నగర్లో గూడుపుఠాణి రాజకీయం
కొత్తూరు: షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గూడుపుఠాణి రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి ఆరోపించారు. నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని, కేవలం మాజీ ఎమ్మెల్యే తనయులు రవియాదవ్, మురళీకృష్ణయాదవ్లు చేసిన అరాచకాల కారణంగానే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందన్నారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తనయులు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలకు అతీతంగా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే కుట్రతో సొంత పార్టీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. నందిగామ మండలంలో ఓ ట్రస్ట్కు సంబంధించిన పొలంలో మాజీ ఎమ్మెల్యే తీరుపై ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ అదే వ్యవహారంలో చేస్తున్న లీలలు అందరికి తెలుసన్నారు. మాజీ ఎమ్మెల్యే తనయులు చేస్తున్న అరాచకాలకు ఎమ్మెల్యే వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. సీఐ క్షమాపణ చెప్పాల్సిందే నందిగామ సీఐ ప్రసాద్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ అనుచరులు, వార్డు సభ్యులుగా బరిలో ఉన్న వారిపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. మొదళ్లగూడలో శాంతియుత వాతావరణంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను లాఠీచార్జి చేసి భయోత్పాతంగా సీఐ చేసినట్లు ఆరోపించారు. అకారణంగా దాడి చేసిన వారికి సీఐ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై సీఐను వివరణ కోరగా ఓటర్లను వాహనాల్లో తరలించొద్దని మాత్రమే సూచించానని చెప్పారు. గుంపులుగా ఉన్న జనాలను వెళ్లాలనే మాత్రమే చెప్పా, లాఠీచార్జి చేయలేదని వివరించారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి -
ఆధ్యాత్మిక చింతన ఉండాలి
స్పీకర్ ప్రసాద్ కుమార్ అనంతగిరి: ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన ఉండాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బయలుదేరిన ప్రేమ ప్రవాహిని రథం బుధవారం వికారాబాద్ పట్టణంలోని భగవాన్ శ్రీ సత్యసాయి జ్ఞాన కేంద్రానికి చేరుకుంది. స్పీకర్ సాయిబాబాకు హారతి ఇచ్చి రథ యాత్రను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను బాబా భక్తుడని తెలిపారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఐక్యత బాబా తెలిపిన సందేశాలను వ్యాప్తి చేయడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మంజుల, మాజీ చైర్మన్ సత్యనారాయణ, సత్యసాయి సేవ సంస్థల జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ సింగ్, ఆధ్యాత్మిక విభాగం కోఆర్డినేటర బంధప్ప గౌడ్, కన్వీనర్ సత్యనారాయణ గౌడ్, యూత్ కోఆర్డినేటర్ బసవేశ్వర్, మహిళా కార్యకర్తలు అనురాధ, వర్దిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండల విద్యార్థి యాలాల: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) క్రీడల్లో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలకు మండల విద్యార్థి ఎంపికయ్యాడు. మండలంలోని గౌతమి పాఠశాలకు చెందిన శివప్రసాద్గౌడ్ అండర్ –14 విభాగంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి జిల్లా స్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కొండారెడ్డి, పీఈటీ మహేందర్ తెలిపారు. బుధవారం శివప్రసాద్ను ఘనంగా సన్మానించారు. పోలింగ్ సిబ్బందికి అందని భోజనం బషీరాబాద్: పోలింగ్ సిబ్బందికి భోజనాలు అందక ఇబ్బంది పడ్డారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి జోనల్, స్టేజ్ 2 అధికారులు, పీఓలు, ఓపీఓలు వచ్చా రు. మధ్యాహ్నం ఒంటి గంటకు వీరు భోజనం చేసేందుకు వెళ్లగా మొత్తం అయిపోయింది. దీంతో వారు ఎంపీడీఓ సంపత్కుమార్ను నిలదీశారు. అర్ధాకలితో ఎలా పనిచేయాలి అని ప్రశ్నించారు. కొందరు అధికారులు హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకొని తిన్నారు. అనంతరం వంటలు తయారు చేయించారు. అప్పటికే సిబ్బంది పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు వెళ్లిపోయారు. -
చలి పంజా
తాండూరు: జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రస్తుత సీజన్లో 14 మండలాల్లో 10 డిగ్రీల కనిష్ట టెంపరేచర్ నమోదవుతోంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 6 మండలాలను ఎల్లో అలర్ట్ జాబితాలో చేర్చింది. వారం రోజులుగా అనేక మండలాల్లో 8నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు మండలాల్లో 6.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఉదయం 9 గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. జనాలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం ఎండ.. సాయంత్రం చలి జనాలను ఇబ్బంది పెడుతోంది. ఈ ఏడాది జిల్లాలో భారీగా వర్షాలు పడటం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో వారం రోజులు చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. తెలిపారు. జిల్లాలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవడం పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాత్రి సమయంలో వరి నారు మడుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మండలాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు -
జోరుగా ‘పంచాయతీ’ ప్రచారం
● మహిళలకు నిత్యం రూ. 300, పురుషులకు రూ.500 కూలీ ● మద్యంతో పాటు మాంసం భోజనం యాచారం: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థులు ప్రజలను కలిసి తమకే ఓటు వెయ్యాలని వేడుకుంటున్నారు. నామినేషన్ల విత్డ్రాతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు మంగళవారం సాయంత్రం అధికారులు గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, పుట్బాల్ వంటివి కేటాయించగా, అదే వార్డు సభ్యులకు గౌను, గ్యాస్పొయ్యి, స్టూల్, సిలిండర్ లాంటివి ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ క్లస్టర్ కేంద్రాల్లో అధికారులు ఏ పోటీదారుడికి ఏ గుర్తు కేటాయించారో ముందస్తుగానే సమాచారం అందజేశారు. గుర్తుల కేటాయింపుతో అభ్యర్థుల ప్రచారం సామగ్రి కోసం నగరంలోని ప్రింటింగ్ ప్రెస్, ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఇక కేటాయించిన గుర్తులతో ప్రజల వద్దకు వెళ్లి మద్దతు కూడగట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రచార సామగ్రిని అధిక సంఖ్యలో తెచ్చేందుకు గాను పోటీ అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కూలీలకు భలే డిమాండ్.. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూలీలకు భలే డిమాండ్ ఏర్పడింది. నిత్యం ఉదయం, సాయంత్రం ప్రజలను కలిసి గుర్తులపై గుర్తుండేలా ప్రచా రం నిర్వర్తించడానికి పోటీ అభ్యర్థులు కూలీలను ఉపయోగించుకుంటున్నారు. ర్యాలీలు కూడా తీస్తున్నారు. మహిళలకై తే నిత్యం రూ.300, అదే పురుషులకై తే రూ. 500 అందజేస్తున్నారు. పంచా యతీ ఎన్నికల సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. కూలీ లు లేక పత్తి తీత పనులు నిలిచిపోయాయి. పత్తి తీయకపోవడంతో చెట్లపైనే రూ. లక్షలాది విలువ జేసే పత్తి వృథావుతోంది. పత్తి తీత పనులతో పాటు మిగితా వ్యవసాయ పనులకు కూడా కూలీ లు వెళ్లడం లేదు. రైతులు వ్యవసాయ పనులకు రావాలని ప్రాదేయపడిన స్పందన వెళ్లడంలేదు. మద్యం, మాంసం భోజనం.. ప్రచార హోరులో పాల్గొనేందుకు వెళ్లే కూలీలకు నిత్యం మద్యంతో పాటు మాసంతో కూడిన విందు భోజనం అందజేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న ప్రచారానికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మద్యం పంపిణీ చేస్తున్నారు. మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, మాల్, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, యాచారం తదితర గ్రామాల్లో కొద్ది రోజులుగా విందు భోజనం నిర్వహిస్తున్నారు. పోలింగ్కు ఒక రోజు ముందు పంపిణీ చేసే డబ్బు కంటే నామినేషన్ వేసినప్పటి నుంచి విందు భోజనాలకు రూ. లక్షల్లో ఖర్చవుతోంది. మొండిగౌరెల్లి, మల్కీజ్గూడ, గునుగల్, మాల్, మంతన్గౌరెల్లి, నందివనపర్తి తదితర గ్రామాల్లో పోటాపోటీగా అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
మా పాలనకు ‘ఏకగ్రీవాలే’ నిదర్శనం
పరిగి: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు.. కాంగ్రెస్ మద్దతుదారులను ఏకగ్రీవ సర్పంచ్లుగా ఎన్నుకుంటున్నారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. పరిగిలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గ చరిత్రలో తొలిసారి 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ జీపీకి రూ.20 లక్షల నిధులను మంజూరు చేయిస్తామని స్పష్టంచేశారు. ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ బలపరిచి అభ్యర్థులు ముందంజలో ఉన్నారన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అధికార పక్షంతోనే అభివృద్ధి సాధ్యమని సూచించారు. ప్రజాసేవకు చక్కటి అవకాశం దోమ: మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం కిష్టాపూర్, లింగన్పల్లి ఏకగ్రీవ సర్పంచులు ఏర్రోళ్ల గోపాల్, మెరుగ వరలక్ష్మి, ఆయా గ్రామాల వార్డు సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే చక్కటి అవకాశం కొత్త సర్పంచులకు వచ్చిందన్నారు. గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామా ల మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, నేతలు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం పూడూరు: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. పంచాయ తీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బుధవారం మండలంలోని కడుమూరు, మిట్టకంక ల్, మేడిపల్లికలాన్, అంగడిచిట్టంపల్లి, చింతలపల్లి, కంకల్, తుర్క ఎన్కేపల్లి తదితర గ్రామా ల్లో సర్పంచ్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశా రు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనందం, పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల సతీష్రెడ్డి, డీసీసీ కార్యదర్శి షకీల్ పాల్గొన్నారు. ఏకగ్రీవ సర్పంచ్కు సన్నానం కుల్కచర్ల: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వాల్యనాయక్ తండా సర్పంచ్గా నరసింహ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను బుధవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అభినందించారు. -
పాలకులొస్తున్నారు..
కొడంగల్: తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో నేడు (గురువారం) తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ఆ వెంటనే గెలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. గురువారం రాత్రి లోపు కొత్త పాలకులు కొలువు తీరనున్నారు. గ్రామ ప్రథమ పౌరునిగా ప్రమాణ స్వీకా రం చేసిన తర్వాత బాధ్యతలు చేపడతారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దుద్యాల్, దౌల్తాబాద్, తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబా ద్ మండలాల్లోని 225 గ్రామ పంచాయతీలు, 1,9 12 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేకాధిరులకు పాలకు తెర రెండేళ్లుగా గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగాయి. వారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పాలనా వ్యవహారాలు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. గ్రామ పాలకులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, తాగునీరు, ఇతర అవసరాలకు డబ్బు లేకపోవడంతో కార్యదర్శులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వడ్డీలకు డబ్బు తెచ్చి జీపీలను నడిపించారు. కొడంగల్ మండల పరిధిలో 25 గ్రామ పంచాయతీలు (రుద్రారం, అంగడిరాయిచూర్, రావులపల్లి, పెద్ద నందిగామ, హస్నాబాద్, పర్సాపూర్, కస్తూరుపల్లి, ఎరన్పల్లి, అన్నారం, టేకుల్కోడ్ పెద్ద గ్రామాలు ఉన్నాయి. వీటిలో అనేక సమస్యలుపరిష్కారానికి నోచుకోలేదు. కొత్త సర్పంచ్లు వస్తే మంచి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. రెండేళ్లుగా నిధులు లేవు గ్రామ సర్పంచుల పదవీకా లం ముగిసి దాదాపు రెండే ళ్లు కావస్తోంది. నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఆగిపోయాయి. ఏ చిన్న పని చేయాలన్నా నిధుల కొరత ఏర్పడంది. సొంత డబ్బు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నాం. కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిధులు వచ్చే అవకాశం ఉంది. – బాల రంగాచారి, సీనియర్ కార్యదర్శి, ఇందనూర్ -
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
● ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ● చింతలపల్లి, సింగంపల్లిలో ఎన్నికల ప్రచారం ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చింతలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పు శ్రీశైలం, సింగంపల్లిలో రాంబాబుకు మద్దతుగా ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమలో పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటేద్దాం రారండోయ్
తెల్లారింది లేవండోయ్దాదాపు రెండేళ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూసిన పంచాయతీ ఎన్నికలు రానేవచ్చాయి. మరికొన్ని గంటల్లో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు పదవుల కోసం నిరీక్షిస్తున్న వారి కలలు సాకారం కానున్నాయి.. నేటి నుంచే గ్రామ పాలన అందుబాటులోకి రానుంది. ప్రజలు సైతం ‘కొత్త’ పాలకుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వికారాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు బుధవారం బయలుదేరి వెళ్లారు. పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులు, పత్రాలను తీసుకెళ్లారు. మొదటి విడతలో 262 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 37 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 225 సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్ జరగనుంది. నేటి(గురువారం) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. వెంటనే ఫలితాల వెల్లడి ఉపసర్పంచ్ ఎన్నిక చేపడతారు. 1,912 పోలింగ్ కేంద్రాలు తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాండూ రు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల, కొడంగల్, బొంరాస్పేట్, దౌల్తాబాద్, దుద్యాల్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2,93,555 మందికి ఓటరు స్లిప్పులను పంపిణీచేశారు.పోలింగ్ అధికా రులు,సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. 8మండలాల్లో 1,912 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను సిద్ధం చేశారు. 2,351 మంది పీఓలు, 2,743 మంది ఓపీఓలు, ఇద్దరు సభ్యులతో కూడిన 1,607టీంలు, ముగ్గురు సభ్యులతో కూడిన 288టీంలు, నాలుగురు సభ్యులతో కూడిన 17 టీంలు ఎన్నికల విధుల్లో ఉంటాయి. కట్టుదిట్టమైన భద్రత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీపీఓ జయసుధ పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు ఓటు హక్కు విని యోగించుకునేందుకు అవసరమై న అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ కు కొన్ని గంటల సమయం మా త్రమే ఉండటంతో ఒటర్లను ప్రస న్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు ఇబ్బంది కలగొద్దు బొంరాస్పేట: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ పాయింట్ను బుధవారం కలెక్టర్ ప్రతీక్జైన్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ బాక్సులు, సౌకర్యాలు తదితర వాటిపై ఆరా తీశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా పంచాయతీలు, ఓటరు..మండలం మొత్తం యునానిమస్ పోలింగ్ మొత్తం జీపీలు అయిన జీపీలు జరగనున్నవి ఓటర్లుతాండూరు 33 06 27 46,646 బషీరాబాద్ 39 05 34 40,990 యాలాల 39 10 29 38,710 పెద్దేముల్ 38 05 33 40,828 కొడంగల్ 25 01 24 32,205 దౌల్తాబాద్ 33 03 30 40,977 బొంరాస్పేట్ 35 07 28 32,121 దుద్యాల్ 20 02 18 21,078 నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్ -
ఏకగ్రీవ ఉప సర్పంచులు వీరే
కుల్కచర్ల: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కుల్కచర్ల మండలంలో 4 గ్రామ పంచాయతీలు, చౌడాపూర్లో 6 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా పంచాయతీల్లో బుధవారం ఉప సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచులు.. తిర్మలాపూర్ ఉపసర్పంచ్ శివకుమార్, దాస్యనాయక్ తండాకు నూరిబాయి, బోట్యానాయక్ తండాకు కేతావత్ ప్రకాష్, ఎత్తుకాల్వ తండాకు జ్యోతి, వాల్యనాయక్ తండాకు రఘు రాథోడ్, కిష్టంపల్లికి రామచంద్రి, నీర్సాబ్ తండాకు చింగే నాయక్, లింగన్నపల్లికి యాదమ్మ, మక్తవెంకటాపూర్ కొర్ర లక్ష్మణ్లు ఏకగ్రీవం అయ్యారు. ‘న్యాయమే గెలిచింది’ అబ్దుల్లాపూర్మెట్: తప్పుడు ఆరోపణలతో తనపై పెట్టిన కేసులను న్యాయస్థానం కొట్టేసిందని పెద్ద అంబర్పేటకు చెందిన వ్యాపారవేత్త సామ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం పెద్దఅంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను నయీం పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు బీజేపీ జిల్లా నాయకుడు సామ రంగారెడ్డి 2016లో ఫిర్యాదు చేశారన్నారు. తొమ్మిదేళ్ల పాటు కొనసాగిన ఈకేసులో నిజానిజాలను నిర్ధారించిన న్యాయస్థానం నిరాధారమైన కేసును కొట్టేసిందని తెలిపారు. తనను రాజకీయంగా, వ్యాపారపరంగా ఎదుర్కోలేక కొంతమంది ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చివరికి న్యాయమే గెలిచిందని, కోర్టు తీర్పుతోనైనా ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టిన కారు మీర్పేట: వేగంగా వచ్చిన కారు డివైడర్కు ఢీకొని పల్టీ కొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శంకర్నాయక్ కథనం ప్రకారం.. సంతోష్నగర్కు చెందిన మొహిద్ సాహిల్(21) యాకుత్పురాకు చెందిన స్నేహితుడు సయ్యద్ సోఫ్యాన్ కారును తీసుకుని మంగళవారం అర్ధరాత్రి మరో మిత్రుడు హసన్తో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆర్సీఐ పాష్కాలనీ వద్దకు రాగానే సాహిల్ అతివేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న హసన్కు తీవ్ర గాయాలు కాగా, కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ హసన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుతో వలస కార్మికుడి మృతి అబ్దుల్లాపూర్మెట్: పాము కాటుకు గురై ఓ వలస కార్మికుడు మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన నారాయణ (50), పది రోజుల క్రితం బాచారంలోని ఓ వెంచర్ వద్ద లేబర్ పని చేసేందుకు వచ్చాడు. తోటి కార్మికులతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్లిన అతన్ని పాము కాటేసింది. ఈ విషయాన్ని తోటి కార్మికులకు చెప్పడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాసులుంటేనే ఫుట్బాల్ మ్యాచ్కు ఎంట్రీ సాక్షి, సిటీబ్యూరో: అర్జెంటీనా ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ ‘గోట్’ ఫుట్బాల్ మ్యాచ్కి పాస్ లేకుంటే అనుమతి లేదని రాచకొండ పోలీసులు ఆదేశించారు. ఈ నెల 13న (శనివారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి– మెస్సీతో ఉప్పల్ మైదానంలో మెస్సీ– గోట్ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద రద్దీ ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మిగతా వారికి ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మ్యాచ్కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం అమీర్పేట: అమీర్పేట మైత్రివనం చౌరస్తాలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని షాప్ నెం.105లో గల శివమ్ టెక్నాలజీ, 106లోని రామ్దేవ్ సొల్యూషన్స్లో ఉదయం 8 గంటలకు పొగలు రావడంతో స్థానికులు గమనించిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన సనత్నగర్ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పివేశారు. అప్పటికే షాపు లలోని కంప్యూటర్లు, ఇతర పరికరాలు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ పల్లే ప్రమా దం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. -
ఉన్నతాధికారుల తప్పిదం..
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల విధుల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఉన్నతాధికారుల తప్పిదంతో సిబ్బంది సస్పెన్షన్కు గురయ్యారు. ఒకే అధికారికి రెండు చోట్ల ఎలక్షన్ డ్యూటీ వేయడం.. ఒకచోట విధుల్లో చేరినా మరోచోట గైర్హాజరయ్యారనే కారణంతో వేటు వేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలకు ఉద్యోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలో ఉపాధి హామీ పథకం ఏపీఓగా పని చేస్తున్న శారదను స్థానిక జోనల్ ఆఫీసర్గా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారులు ఈమెకే దౌల్తాబాద్ పీఓగా డ్యూటీ వేశారు. శారద బషీరాబాద్లో ఎన్నికల విధుల్లో చేరారు. దౌల్తాబాద్లో విధులకు రాలేదనే కారణంతో ఆమె సస్పెండ్ చేశారు. ఇదే మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అయూబ్ పాషాను బషీరాబాద్ స్టేజ్ 2 ఆర్వోగా నియమించారు. ఇతనికే దౌల్తాబాద్ మండల పీఓగా బాధ్యతలు అప్పగించారు. బషీరాబాద్ ఎన్నికల డ్యూటీలో చేరడంతో అతన్ని కూడా సస్పెన్షన్ చేశారు. అతడి ఫోన్కు సస్పెన్షన్ ఆర్డర్ పంపారు. ఈ విషయాన్ని సదరు అధికారి సబ్కలెక్టర్ ఉమాశంకర దృష్టికి తీసుకెళ్లారు. తాను ఇక్కడ విధుల్లో ఉండగా దౌల్తాబాద్ పీఓగా అలాట్ చేశారని వివరించారు. అక్కడ రిపోర్టు చేయని కారణంగా సస్పెన్షన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ అధికారులు పలువురికి డ్యూటీలు వేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. ఒకే అధికారికి రెండు చోట్ల ఎన్నికల విధులు ఎలా వేస్తారని బాధిత ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అలాగే మండలానికి కేటాయించిన పీఓలు నసీమా రెహన, అన్నపూర్ణ, మానస విధులకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని ఎంపీడీఓ సంపత్కుమార్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సిబ్బందికి శాపం -
పోలింగ్కు సామగ్రి సిద్ధం
బషీరాబాద్: తొలివిడత పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేయాల్సిన స్టేషనరీ సామగ్రి కిట్లను, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఈ మేరకు మండలంలోని మోడల్ పాఠశాలలో అధికారులు పోలింగ్ స్టేషన్ వారీగా మూటలు కట్టి పెట్టారు. పోలింగ్ కేంద్రాలకు జెట్ కాయిల్స్ పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి దోమల నుంచి రక్షణ కల్పించేందుకు జెట్ కాయిల్స్ అందజేస్తున్నారు. బుధవారం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది వెళ్లనున్నారు. -
కందిలో గంజాయి సాగు
● తండ్రీకొడుకులపై కేసు నమోదు ● రూ.11 లక్షల విలువైన మొక్కలు, ఎండు గంజాయి స్వాధీనం తాండూరు టౌన్: కంది పంటలో గంజాయి సాగు చేసిన తండ్రీకొడుకులపై కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎకై ్సజ్ అధికారి విజయభాస్కర్ తెలిపారు. తాండూరులోని ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్పల్లి మండలం బార్వాద్ గ్రామానికి చెందని ఎర్రోళ్ల పెంటయ్య, ఇతని కొడుకు ప్రభాకర్ వీరి పొలంలో కంది పంట వేశారు. ఇందులో గంజాయి సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ఫోర్స్ బృందం, తాండూరు ఎకై ్సజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సుమారు రూ.11 లక్షల విలువైన 108 గంజాయి మొక్కలతో పాటు, కిలోన్నర ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొడుకు ప్రభాకర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, తండ్రి పెంటయ్య పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏఈఎస్ శ్రీనివాస్రెడ్డి, డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, తాండూరు ఇన్చార్జి సీఐ రాణి, డీటీఎఫ్ ఎస్ఐ ప్రేమ్కుమార్రెడ్డి, తాండూరు ఎస్ఐలు నిజాముద్దీన్, రవికుమార్, సిబ్బంది శివ, ప్రసాద్, హన్మంతు, రవికిరణ్, భీమయ్య, ఆసిఫా బేగం, మహేష్, రాధిక తదితరులు పాల్గొన్నారు. -
తటస్థులే టార్గెట్
తొలివిడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియడంతో అభ్యర్థులు తటస్థ ఓటర్లపై దృష్టి సారించారు. వార్డుల వారీగా ఓట్లు లెక్కగడుతూ ఓట్లు రాబ్టేందుకు తాయిలాలు సమర్పించుంకుటున్నారు. షాద్నగర్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు గంటల సమయమే ఉంది. అభ్యర్థులు తమ ప్రచారాలను మమ్మరం చేశారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన ప్రచారాల్లో పలు వర్గాల మద్దతు కూడగట్టుకున్న నేతలు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. వేల సంఖ్యలో తటస్థ ఓటర్లు యువకులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పలు రకాల వ్యాపారవర్గాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పరిశ్రమల్లో పనులు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఓటు హక్కు పొందారు. వేల సంఖ్యలో ఉన్న ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు చెబితే వారి ఓట్లు రాబట్టుకోవచ్చో తెలుసుకుని వారిని ఆశ్రయిస్తున్నారు. తాయిలాలతో ఎర ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు పగలు, రాత్రి లేకుండా ప్రతీ గల్లీ తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడుగా రాజకీయాలకు అతీతంగా ఉండే వారిని, పెద్ద కుటుంబాల వారిని, ఉద్యోగులను అభ్యర్థులు కలుస్తూ పాట్లు పడుతున్నారు. సామాజిక వర్గాల వారి ఓట్లను గంపగుత్తగా దండుకునేందుకు అభ్యర్థులు శత విధాలా యత్నిస్తున్నారు. కుల సంఘాల ఓట్లు కోసం అభ్యర్థులు తాయిలాలు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. కుల పెద్దలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. వలస ఓటర్లపై ఫోకస్ షాద్నగర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, హరియాణా, ఛత్తీస్ఘడ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ప్రముఖ ఫార్మా కంపెనీల్లో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పెయింటింగ్, ఉడ్వర్క్, మార్బుల్, సీలింగ్, డిజైనింగ్ తదితర నైపుణ్య పనులు చేసే వారు సైతం ఈ ప్రాంతంలో ఓటు హక్కు పొందారు. వీరంతా పార్టీలకు అతీతంగా తమ పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నిక ఏదైనా వీరి ఓట్లు కీలకంగా మారుతున్నాయి. ఈ ఓట్లు రాబట్టేందుకు నేతలు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతల తటస్థ ఓటర్లపై వల విసురుతున్నారు.పల్లె ఓటర్లకు పట్నంలో దావత్ ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని శివారులో ఈ హడావుడి కనిపిస్తోంది. ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రీత్యా పలువురు నగరంలో నివసిస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఓట్లను రాబట్టుకునే పనిలో పడ్డారు. నేరుగా నగరంలో వారు నివసిస్తున్న అడ్రస్లకు వెళ్లి ట్రాన్స్పోర్టు ఖర్చులు భరిస్తామని ఓటుకు సైతం కొంతమొత్తం ముట్టజెప్పుతామని హామీ ఇస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు నేరుగా యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరిని ఒకచోట చేర్చి దావత్లు సైతం ఇస్తున్నట్లు సమాచారం. మండలంలోని చింతలపల్లికి చెందిన ఓ అభ్యర్థి ఇటీవల దావత్ ఇచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఆకుతోటపల్లికి చెందిన పలువురు అభ్యర్థులు ఓటర్లను కలుసుకుని వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. -
కిడ్నాప్ కలకలం!
● మైల్వార్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భర్త అపహరణ ● ఇరువర్గాలపై కేసు హత్యకు కుట్ర రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థి సిఖిందర్ఖాన్ కిడ్నాప్ చేయించాడు. సర్పంచ్ ఎన్నికల్లో సిఖిందర్ఖాన్ కొడుకు ఓడిపోతాడని తెలిసి తనను హత్య చేయడానికి కుట్ర చేశాడు. సిఖిందర్ఖాన్ తన అన్న కొడుకు అంజద్, రఘునందన్ కిడ్నాప్ చేసి దాడి చేశారు. – అబ్దుల్ ఖాలీద్ బషీరాబాద్: పంచాయతీ ఎన్నికలు ఫ్యాక్షన్ రాజకీయాలను తలపిస్తున్నాయి. సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి భర్తను ప్రత్యర్థి వర్గం వారు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మంగళవారం తీవ్ర కలకలం రేపింది. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ ఖాలీద్ భార్య సీమాసుల్తానా మైల్వార్ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ మద్దతుతో సైఫ్ఖాన్ బరిలో నిలిచారు. ఇరు కుటుంబాలకు కొన్నేళ్లుగా రాజకీయ వైరం నడుస్తోంది. ఈ క్రమంలో సోమ వారం రాత్రి అబ్దుల్ ఖాలీద్ గుల్బర్గా నుంచి తన ఇన్నోవా వాహనంలో స్వగ్రామానికి వస్తున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రఘునందన్రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి సైఫ్ఖాన్ సో దరుడు అంజత్ఖాన్, దానం రాములు, నరేశ్, వి క్కి కర్ణాటక సరిహద్దులోని ఆడికి గ్రామం వద్ద అడ్డుకున్నారు. ఉన్నా డ్రైవర్ గౌస్, అనుచరుడు బ లరామ్, న్యాయవాది విశ్వనాథంను బెదిరించి కా రులోంచి దించేశారు. అదే కారులో అబ్దుల్ ఖా లీ ద్ను కిలోమీటర్ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి మ రోవాహనంలో ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రాత్రంతా హైడ్రామా అబ్ధుల్ ఖాలీద్ను బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని డ్రైవర్ గౌస్ వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన భార్య సీమా సుల్తాన తాండూరు, బీషీరాబాద్, కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ యాదయ్య, సీఐ ప్రవీణ్ కుమార్రెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. తాండూరులోని రఘునందన్ ఇంట్లోనే నిర్బంధించినట్లు తెలుసుకుని అబ్దుల్ ఖాలీద్ను కరణ్కోట్ ఠాణాకు తరలించారు. కిడ్నాపర్లపై దాడి ఖాలీద్ సోదరుడు ఖలీల్ అతడి అనుచరులు ఆసిఫ్, ముఖీద్, శెహబాద్, నవాజ్ వెంటనే కిడ్నాప్ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మైల్వార్ తిరిగి వస్తున్న అంజద్ను గుర్తించి తన సోదరుడిని ఎక్కడకు తీసుకెళ్లారో చెప్పాలంటూ దాడి చేశారు. కర్ణాటకలోని గుల్బర్గా, యాద్గీర్, గుర్మిట్కల్ ప్రాంతాల్లో ఉన్నాడంటూ రాత్రంతా తిప్పాడు. చివరకు ఆచూకీ తెలియడంతో పోలీసుల సూచనమేరకు గుర్మిట్కల్ పీఎస్ దగ్గర అంజద్ను వదిలేశారు. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామన్నారు. -
తాళం వేసిన ఇంటికి కన్నం
బంగారం, వెండి, నగదు చోరీ పరిగి: తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన ఘటన పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయంతి కాలనీలో నివాసముంటున్న మహేందర్ దోమ సబ్ స్టేషన్లో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. బంధువుల ఇంట్లో అయ్యప్ప పూజ ఉండటంతో సోమవారం సాయంత్రం కుటుంబం మొత్తం ఇంటికి తాళం వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న 6.5 తులాల బంగారు, 10 తులాల వెండి, రూ.70 వేల నగదును దోచుకెళ్లారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను సైతం తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహనక్రిష్ణ తెలిపారు. వైద్య విద్యార్థుల ధర్నా విరమణ ● సమస్యల పరిష్కారానికి డీఎంఈ హామీ ఇబ్రహీంపట్నం రూరల్: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులు డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) శివరామప్రసాద్ హామీతో శాంతించారు. రెండో రోజైన మంగళవారం వీరు నిర్వహించిన ధర్నాకు జూడాల సంఘం, ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఇక్కడి పరిసరాలు అడవులను తలపిస్తున్నాయని, కనీసం తాగునీరు, బస్సు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొడంగల్లో సకల ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, ఇక్కడి పరిస్థితిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డీఎంఈ శివరామప్రసాద్ కాలేజీకి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. క్యాంపస్లోనే హాస్టల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల రక్షణ కోసం సెక్యూరిటీ, పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ మొబైల్ తనిఖీలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా సౌకర్యం కోసం క్యాంపస్ నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. మరో ఆరు మాసాల్లో సొంత భవన నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పేరెంట్స్ కమిటీ, జూడాలతో కలిసి విద్యార్థులను శాంతింపజేసి, సమ్మెను విరమింపజేశారు. పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించకపోతే 50వేల మంది పేరెంట్స్తో మహేశ్వరం మెడికల్ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. మెడికో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రమేష్ కుమార్, కోశాధికారి రవికుమార్, సంయుక్త కార్యదర్శి రత్నప్రసాద్ ఉన్నారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఈమేరకు వికారాబాద్ పట్టణంలో మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి గ్లోబల్ సమ్మిట్ వేదికగా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్, వర్కింగ్ అధ్యక్షుడు సుభాన్రెడ్డి, అంజయ్య, షఫీ పాల్గొన్నారు. -
ఏకగ్రీవాల జోరు.. గ్రామాల్లో సంబురాలు
● ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ● పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలెల్లో సంబురాలు అలుగుపారుతున్నాయి. ఓ వైపు పార్టీలు, నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఓట్ల వేటలో ఉండగా.. మెజార్టీ గ్రామాలు ఏకగ్రీవాలకే జై కొడుతున్నాయి. పరిగి: మండలంలో రెండు పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. మల్కయాపేటతండా సర్పంచ్గా గోపాల్, రూప్సింగ్తండా సర్పంచ్గా రమణిబాయితో పాటు పాలకవర్గాన్ని ఎకగ్రీవమయింది. కుల్కచర్లలో పది.. కుల్కచర్ల: కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో పది పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. తిర్మలాపూర్ సర్పంచ్గా మాధవి, బోట్యానాయక్ తండాకు సంతోష్ నాయక్, దాస్యనాయక్ తండాకు కవిత, ఎత్తుకాల్వతండాకు సీతరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాల్యనాయక్ తండాకు నరసింహ నాయక్, కొత్తపల్లిలో రజిత, కిష్టంపల్లిలో రాధిక, నీర్సాబ్ తండాలో నారాయణ, లింగన్నపల్లిలో కిష్టమ్మ, మక్తవెంకటాపూర్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఐదు జీపీలు ఏకగ్రీవం దోమ: మండలంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఆయా పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఐదు జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలో 36 గ్రామ పంచాయతీలు, 308 వార్డులు ఉండగా, 31 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. కిష్టాపూర్, గొట్లచెల్కతండా, లింగన్పల్లి, పెద్దతండా, దోర్నాల్పల్లి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియామాక పత్రాలు అందజేశారు. ఎర్రోళ్ల గోపాల్, లింగన్పల్లిపాత్లావత్ కవిత,గోట్లచెల్కతండా నేనావత్ సురేఖ, పెద్దతండాసత్యనారాయణరెడ్డి,దోర్నాల్పల్లిసంతోష్ నాయక్, బోట్యానాయక్ తండాసీతరాం, ఎత్తుకాల్వ తండా నేనావత్ కవిత, దాస్యనాయక్ తాండ నరసింహ నాయక్, వాల్యనాయక్ తండాగోపాల్, మల్కయాపేటతండా వార్ల వాధవి, తిర్మలాపూర్ -
నాన్న గెలుపులో మీరు.. మీకోసం నేను
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ కూతురు అనన్య పాలుపంచుకున్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎర్రవల్లిలో సర్పంచ్ బరిలో నిలిచిన అడ్వకేట్ రబ్బానీకి మద్దతుగా ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్న గెలుపులో మీరు.. మీ విజయానికి నేను పాటుపడుతున్నానని చెప్పారు. ఈ ప్రచారంలో ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, నాయకులు తులసీదాస్, రంగారెడ్డి, పెంటయ్య, మాణిక్రెడ్డి సత్యనారాయణరెడ్డి, అశోక్, దయాకర్, శ్రీశైలం, సురేశ్, సంజీవరావు, గఫార్, చంద్రం, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. – అనంతగిరి -
పోలింగ్కు బందోబస్తు
అనంతగిరి: పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. మంగళవారం ఆమె పోలీసుల సన్నద్ధతపై సమీక్షించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో పోలీసులు అధికారులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో, వాటి పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచాలన్నారు. మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాల పంపిణీ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీ ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నిరోధించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ ఎస్పీ బి.రాములు నాయక్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్బీ సీఐ డీవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. విధుల్లో అప్రమత్తత అవసరం ఎన్నికల బందోబస్తు విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. గురువారం మొదటి దశ పోలింగ్ సందర్భంగా మంగళవారం ఎస్సీ కార్యాలయంలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు. విధు ల నిర్వహణలో ఇబ్బందులు లేదా సమస్యలు ఎ దురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా లని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా, క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రదర్శించినా అత్యంత తీవ్రమైన చర్యగా పరిగణించి చర్య లు తీసుకుంటామన్నారు. అదనపు ఎస్పీ బి.రాము లు నాయక్, ఆర్ఐ డేవిడ్ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ స్నేహ మెహ్రా -
హస్తం బలపరిచిన అభ్యర్థులకు ఆదరణ
కుల్కచర్ల: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం గాధిర్యాలో మండల పరిధిలోని ముజాహిద్పూర్కు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ముజాహిద్పూర్ సర్పంచ్ అభ్యర్థి చంద్రభూపాల్ దేశ్ముఖ్, కృష్ణయ్య, చంద్రయ్య, భా స్కర్, శ్రీనివాస్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర!
బషీరాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ప్రలోభాలకు తెరలేపారు. చివరి రోజు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి బల ప్రదర్శన చేశారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అధికార కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి ఒకటి రెండు గ్రామాల్లోనే ప్రచారం చేయగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారుల తరఫున మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఐదేళ్లలో గ్రామాల రూపురేఖలు మార్చేస్తాం అంటూ ఆయా పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేశారు. బషీరాబాద్, జీవన్గీ, మైల్వార్, పర్వత్పల్లి, నీళ్లపల్లి, కొర్విచెడ్ గని, ఇందర్చెడ్, దామర్చెడ్, ఎక్మాయి, బోజ్యానాయక్తండా, కాశీంపూర్, మంతట్టిలో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. కాగా ఐదు గ్రామాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. బషీరాబాద్పైనే అందరి దృష్టి మండల కేంద్రమైన బషీరాబాద్ పంచాయతీలో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు వెంకటేష్ మహరాజ్, అనూప్ ప్రసాద్ మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. ఇద్దరూ బలమైన రాజకీయ కుటుంబాల అభ్యర్థులు కావడంతో హోరాహోరీగా పోటీ ఉండనుంది. వెంకటేష్ మహరాజ్ తరఫున మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రాకేష్ మహరాజ్, రోహిత్ మహరాజ్ ప్రచారం చేయగా, అనూప్ తరఫున మాజీ ఎంపీపీ కరుణ, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ ప్రచారం చేశారు. జీవన్గీలో నర్సింలు, రామని బసప్ప మధ్య కూడా రసవత్తర పోటీ నెలకొంది. వలస ఓటర్లకు గాలం మండలానికి చెందిన సుమారు 5 వేల మంది ఓటర్ల వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. వారిని ఆకట్టుకునేందుకే అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జీపీల్లో వలస ఓట్లే అభ్యర్థులను నిర్ణయించే స్థాయిలో ఉండటంతో చివరి మూడు వారిని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్, పూణే, ముంబై వంటి నగరాల్లో బతుకు దెరువు కోసం వెళ్లిన వారిని గ్రామాలకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్కో వ్యక్తికి రూ.వెయ్యి నగదుతో పాటు రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న వారిని రప్పించడానికి వాహనాలను సైతం సమకూర్చుతున్నారు. ముగిసిన తొలివిడత ప్రచార పర్వం చివరి రోజు హోరెత్తించిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు వలస ఓటర్లపై నేతల ఫోకస్ అందరి దృష్టి బషీరాబాద్ ఎన్నికపైనే.. ప్రచార పర్వానికి తెరపడటంతో అభ్యర్థులు ప్రలోభాలను మొదలు పెట్టారు. ఓటర్లకు మద్యం పంపిణీ చేయడంతో పాటు చికెన్, మటన్ పంపిణీ చేస్తున్నారు. దావత్లు ఇస్తున్నారు. కులాలు, సంఘాల వారీగా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. దేవాలయాల నిర్మాణాలకు ప్రామిస్లు చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిద్దాం
పరిగి: పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. మంగళవారం రంగాపూర్ రైతుల వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు ఽశిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీఓ హరిప్రియ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర -
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్ప వని ఎస్పీ స్నేహమెహ్ర హెచ్చరించారు. మంగళవారం ఎన్నికల బందోబస్తుపై మాట్లాడా రు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే ఉపేక్షించమన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అర్హులు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలపై అప్రతమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం ర్యాలీలు, సబంరాలు, సభలు, సమావేశాలు నిషేధమన్నారు. -
కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు
తాండూరు రూరల్: కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరాదని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు, పెద్దేముల్ మండలాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని బూటకపు హామీలు ఇస్తున్నారని, ప్రజలు నమ్మరాదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు శ్రీలక్ష్మి
తాండూరు టౌన్: పట్టణంలోని అక్షర హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీలక్ష్మి రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం వికారాబాద్లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీ ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యింది. క్రీడాకారిణి శ్రీలక్ష్మి తోపాటు ఆమెకు శిక్షణ ఇచ్చిన పీడీటీలు రవీందర్ రెడ్డి, గోపాల్ నాయక్ను పాఠశాల ప్రిన్సిపాల్ మో హనకృష్ణ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మర్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరుతున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. మంగళవారం మర్పల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్లు కనెగెరి రాజు, దగ్గని సంగయ్య మరో 20 మంది అనుచరులు వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి స్పీకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ యాదవ్, కోటపల్లి రాచన్న, మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, మాజీ డైరక్టర్ గౌస్, నాయకులు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట: మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొట్లోనితండా, వడిచర్ల గ్రామాల్లో పర్యటించారు. సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందన్నారు. అధికార పార్టీ మద్దతుదారులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫోన్ చేసి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్రెడ్డి, యాదగిరి, నెహ్రూ నాయక్, సురేశ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి యాలాల: అధికార పార్టీ మద్దతుతో స్థానిక ఎన్నికల్లో బరిలో ఉన్న వారికి ఆదరించి గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దేవనూరు, యాలాల, అగ్గనూరు, పేర్కంపల్లి తదితర గ్రామాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించి గెలిపించాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అవసరమున్న చోటా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. సర్పంచ్లుగా ఎన్నికయ్యే వారికి అధికార పార్టీ ఎక్కువ నిధులు కేటాస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బాల్రెడ్డి, సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డి, నాయకులు హన్మంతు, పేరి రాజేందర్రెడ్డి, అక్బర్బాబా, భీమప్ప, వీరేశం, ఖాసీం, శ్రీనివాస్చారి తదితరులు ఉన్నారు. -
పోలింగ్ సాఫీగా సాగాలి
అనంతగిరి: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్నికలు జరగనున్న 8 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సాఫీగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో 10వ తేదీ ఉదయం 8 గంటలకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్న ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. చెక్ లీస్ట్కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరగాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్కు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సుధీర్, నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో 225 సర్పంచ్, 1,912 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. 45మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినుట్లు తెలిపారు. స్టేజ్ 2 ఆర్ఓలకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీకి కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్ సుధీర్, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగాలి పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్, జనరల్ అబ్జర్వర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మొదటి విడత ఎన్ని కల సిబ్బందికి మూడో విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఆర్ఓ మంగీలాల్, డీపీఓ జయసుధ, నోడల్ ఆఫీసర్ మాధవ రెడ్డి, డీఈఓ రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ ప్రతీక్ జైన్ -
నాడు స్నేహ హస్తం.. నేడు గులాబీ నేస్తం
సర్పంచ్ బరిలో మాజీ వైస్ ఎంపీసీ ఆనంద్ కడ్తాల్: మండల కేంద్రానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019 కడ్తాల్–2 ఎంపీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందాడు. మండల వ్యాప్తంగా పది ఎంపీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి నలుగురు చొప్పున, బీజేపీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఆనంద్ గెలుపొందాడు. నాడు ఆనంద్ మద్దతుతో కాంగ్రెస్కు ఎంపీపీ పదవి వరించగా.. అదే పట్టుదలతో ఆయన వైస్ ఎంపీపీ పదవిని దక్కి ంచుకున్నాడు. తదనంతర రాజకీయ సమీకరణా ల్లో ఆయన బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కడ్తాల్ మేజర్ పంచా యతీకి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలోదిగి మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. -
బషీరాబాద్లో ఎన్నికల కవాతు
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎస్పీ స్నేహమెహ్ర ఆధ్వర్యంలో బషీరాబాద్లో భారీ పోలీసు కవాతు నిర్వహించారు. జిల్లాలోని ఏఆర్ కానిస్టేబుళ్లు, సివిల్ పోలీసులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘనటలు జరుగకుండా, శాంతిభద్రత పరిరక్షణ కోసం కవాతు నిర్వహించినట్లు ఎస్సీ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామునాయక్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ఐలు నుమాన్అలీ, శంకర్, విఠల్రెడ్డి, వినోద్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న ఎస్పీ స్నేహమెహ్ర -
ఆదరించండి.. అభివృద్ధి చూపిస్తా
కడ్తాల్: బాలాజీనగర్ తండా సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరించి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి నేనావత్ అమర్సింగ్ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. గ్రామానికి చెందిన అమర్సింగ్ 15 ఏళ్ల క్రితం వ్యవసాయ పొలంలో పంపుసెట్ వద్ద జరిగిన ప్రమాదంలో తన కుడిచేతిని కోల్పోయాడు. అధైర్య పడకుండా డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామ యువత విద్యావంతుడిని సర్పంచ్ చేయాలనే పట్టుదలతో అమర్సింగ్కు మద్దతు తెలుపుతోంది. తన గెలుపుతో తండాను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నాడు. బాలాజీనగర్ తండా సర్పంచ్ అభ్యర్థి అమర్సింగ్ -
‘పది’పై శ్రద్ధ వహించాలి
కందుకూరు: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రంగారెడ్డి డీఈఓ సుశీందర్రావు సూచించారు. మండల పరిధిలోని నేదునూరు జిల్లా పరిషత్ పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, ఐఎఫ్పీ ప్యానెల్, పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ, మొక్కల పెంపకం, నీటి వసతి తదితర అంశాలను పరిశీలించారు. చదవడం, రాయడం సరిగ్గా రాని వెనకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, టీఎల్ఎం ద్వారా విద్యాబోధన నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్శర్మ, ఉపాధ్యాయులు గ్లోరి, శాంతకుమారి, కరుణాకర్, శ్రీవాణి, గిరిజ, డాక్టర్ ఎండీ బషీర్, అబ్దుల్లా, హసనొద్దీన్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనేపేదల సంక్షేమం
మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి బషీరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని శా సనమండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అ న్నారు.సోమవారం మండలంలోని నీళ్లపల్లిలో పర్యటించిన ఆయన సర్పంచ్ అభ్యర్థి సుధాకర్రెడ్డిని గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ కుటుంబం నుంచి సర్పంచ్గా ఉన్నారని అప్పుడు అనేక అభివృద్ధి పను లు జరిగాయని గుర్తు చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచినఅభ్యర్థు లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తం రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఆంజనేయస్వామి జాతర దుద్యాల్: మండలంలోని చిలుముల మైల్వార్ గ్రామ ఆటవీ ప్రాంతంలో కొలువుదీరిన మామిడికుంట ఆంజనేయ స్వామి జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 10న స్వామివారి రథోత్సవం, 11న పెద్ద జాతర ఉంటుంది. మధ్యాహ్నం స్వామివారికి పల్లకీ సేవ, సాయంత్రం పెరుగు బసంతం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి రాఘవేందర్చారీ, ధర్మకర్తలు రామారావు దేశ్పాండే, పురుషోత్తం దేశ్పాండే తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రజావాణికి 12 దరఖాస్తులు అనంతగిరి: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 12 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలన్నారు.కార్యక్ర మంలో ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్ఓ మంగీలాల్, డీఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు మోమిన్పేట: మండలంలోని మేకవనంపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. బాలికల విభాగం నుంచి ఎం.ధనలక్ష్మి, బాలుర విభాగం నుంచి జె.శ్రీకాంత్ ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌరిశంకర్, ఉపాధ్యాయుడు రమేశ్ అభినందించారు. జీపీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గోపాల్ దుద్యాల్: ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన జీపీవో(గ్రామ పాలన అధికారి)ల జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. మండలంలోని హస్నాబాద్ జీపీవోగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గోపాల్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా రమేశ్, కార్యదర్శిగా నర్పింలు, సభ్యుడిగా పక్కీరప్ప ఎంపికయ్యారు. వీరిని తహసీల్దార్ కిషన్ సన్మానించారు. కార్యక్రమంలో డీటీ శివకుమార్, ఆర్ఐ నవీన్ కుమార్, సిబ్బంది ఊషప్ప, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి
తుర్కయంజాల్: విత్తన బిల్లు 2025ను రైతులంతా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పిలుపునిచ్చారు. విత్తన బిల్లును వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం తుర్కయంజాల్లో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం 1966 విత్తన చట్టాన్ని రద్దు చేసి తీసుకువస్తున్న కొత్త చట్టంతో విత్తన సరఫరాలో బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ శక్తుల నియంత్రణ పెరుగుతుందని అన్నారు. ఆహార భద్రత, విత్తన స్వావలంబన, రాష్ట్రాల హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. వ్యవసాయ సంక్షోభానికి దారితీసే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, ఎలీషా, రాము, ముత్తయ్య, యాదగిరి, అండాలు, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
హస్తంతో షికారు!
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘కలిసి’పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఉప్పునిప్పులా నిత్యం విమర్శించుకునే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు బషీరాబాద్ మండలంలో స్నేహగీతం పాడుతున్నాయి. ఇదంతా గ్రామాల్లో మామూలే కదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఒక సర్పంచ్ పదవి కోసం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కలిసి ప్రయాణిస్తున్న హస్త షి‘కారు’తాండూరులో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విత్డ్రా తాండూరు రాజకీయాలకు కేంద్రబిందువైన బషీరాబాద్ మండలంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బషీరాబాద్ సర్పంచ్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు అల్లుడు వెంకటేశ్ మహరాజ్, సొసైటీ వైస్చైర్మన్ అజయ్ప్రసాద్ అన్న కొడుకు అనూప్ ప్రసాద్ తలపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అబ్దుల్ రజాక్ను తప్పించారు. దీంతో పోటీలో ఉన్న ఇద్దరునేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బషీరాబాద్ మండలంలో తమ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తన బాబాయి శ్రీశైల్రెడ్డి, ముఖ్య నాయకులతో కలిసి హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ‘కలిసి మెలిసి’ సహకారం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు అల్లుడు వెంకటేశ్ మహరాజ్ విజయానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పైలెట్ రోహిత్రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడి నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలకు పైలెట్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో తన నానమ్మ పంజుగుల శంకరమ్మ ఇందర్చెడ్ సర్పంచ్గా పోటీ చేస్తే ఆమె విజయానికి తాము మద్దతు ఇచ్చినట్లు నారాయణరావు గుర్తు చేశారు. అందేకే తాము ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న వెంకటేశ్కు సహకారం అందిస్తున్నట్లు రోహిత్రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇదే సమాయానికి అక్కడికి చేరుకున్న విలేకర్లను ఉద్దేశించి ఇరువురు నేతలు స్పందించారు. తాము రాజకీయ పార్టీలు వేరైనా ఒక్క మండలానికి చెందిన వారమని, తమకు కుంటుంబ సబంధాలు ఉన్నాయంటూ పైలెట్ చెప్పుకొచ్చారు. తమ పార్టీకి చెందిన స్థానిక నాయకత్వం అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మర్యాదపూర్వక భేటీనే.. ఇద్దరు ఒకే మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మర్యాద పూర్వదకంగా కలిసి మాట్లాడుకున్నారని మహరాజుల కుటుంబం మీడియాకు వివరణ ఇచ్చింది. బషీరాబాద్ ఎప్పుడు వచ్చిన రోహిత్రెడ్డి నారాయణరావు ఇంటికి వచ్చి పలకరిస్తుంటారని రోహిత్ మహరాజ్ చెప్పారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని ‘సహకారం’వ్యవహారాన్ని దాటవేశారు.బషీరాబాద్లో ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మహరాజులతో మాజీ ఎమ్మెల్యే చెట్టా పట్టాల్ సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపిన రోహిత్రెడ్డి వెంకటేశ్మహరాజ్ విజయానికి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు చర్చనీయాంశమైన మాజీల ‘సహకార రాజకీయం’ -
పోలింగ్ సామగ్రిని సరిచూసుకోండి
అనంతగిరి: ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించి, పోలింగ్ సజావుగా జరిగేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని వికారాబాద్ ఎంపీడీఓ వినయ్కుమార్ సూచించారు. సోమవారం మండలానికి చెందిన పీఓల రెండో దశ శిక్షణ కార్యక్రమం అంబేడ్కర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సామగ్రిని సరిచూసుకోవాలన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. ఏమైన సందేహాలు ఉంటే వెంటనే ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ దయానంద్, మాస్టర్ ట్రైనర్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసేవకులకే మద్దతు
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవీంద్ర నర్సింహారెడ్డికి ప్రజా మద్దతు కూడగట్టుకోవడంలో ముందున్నారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడు తూ.. ప్రజాసేవకులకే జనం మద్దతు లభిస్తుందని తెలిపారు. ఊరికి మంచి చేసే నాయకులకే ప్రజలు పట్టం కడుతారని స్పష్టంచేశారు. గ్రామంలో తన సొంత ఖర్చుతో ఆంజనేయ ఆలయం నిర్మించానని, గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే రూ.6 కోట్ల నిధులు తీసుకువచ్చానని చెప్పారు. హకీంపేట్ ప్రజల్లో తమకు సంపూర్ణ మద్దతు లభిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సహ కారంతో గ్రామాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని స్పష్టంచేశారు. అన్ని వర్గాల వారు సీఎంకు అండగా నిలవాలన్నారు. కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి -
వాట్సాప్లో ఎన్నికల విధులు
● అయోమయంలో సిబ్బంది ● ఎంపీడీఓలపై అదనపు కలెక్టర్కు ఫిర్యాదు అనంతగిరి: పంచాయతీ ఎన్నికలకు సిబ్బంది ఉత్తర్వుల జారీలో ఎంపీడీఓలు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ వెంకటర్నం, ఎ.రాములు అన్నారు. ఈ మేరకు సోమవారం వారు అదనపు కలెక్టర్ సుధీర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ.. ఎంపీడీఓలు ఎన్నికల ఉత్తర్వులను సంబంధిత సిబ్బందికి వ్యక్తిగతంగా ఇవ్వకుండా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తున్నారని చెప్పారు. ఒక్కో ఉద్యోగికి ఒకే విడతలో మూడు, నాలుగు మండలాల్లో ఎన్నికల విధులు కేటాయించడంతో వారు అయోమయంలో పడుతున్నారన్నారు. ఎన్నికల సిబ్బందికి ఆయా మండలాల అభివృద్ధి అధికారులు శిక్షణ కేంద్రాల్లో సరియైన భోజన వసతులు కల్పించలేక పోతున్నారన్నారు. ఆరు నెలల లోపు సర్వీసు నుంచి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులను, దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని కలెక్టర్ను కోరగా జిల్లా పంచాయతీ అధికారి జయసుధకు తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దశరథ్, అరవింద్, రాములు, శేఖరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘గుర్తు’ంచుకోండి.. గెలిపించండి
షాద్నగర్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమకు కేటాయించిన గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తెల్లవారింది మొదలు రాత్రి వరకు గడగడపనూ చుట్టేస్తున్నారు. మొదటి విడత షాద్నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల్లో 168 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరులో 12 పంచాయతీల్లో 110 వార్డులకు, నందిగామలో 18 పంచాయతీల్లో 170 వార్డులకు, కేశంపేటలో 28 పంచాయతీల్లో 260 వార్డులకు, కొందుర్గులో 19 పంచాయతీల్లో 186 వార్డులు, జిల్లేడు చౌదరిగూడలో 24 పంచాయతీల్లో 204 వార్డులు, ఫరూఖ్నగర్లో 46 పంచాయతీల్లో 410 వార్డులు, శంషాబాద్లో 21 పంచాయతీల్లో 190 వార్డులకు, సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి మిగిలింది ఒక్కరోజే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే ప్రచార పర్వం ముగియనుంది. ఒక్కరోజే మిగిలుండడంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. సర్పంచ్, వార్డు సభ్యులు వారికి కేటాయించిన గుర్తులను పోస్టర్లు, కండువాలపై ముద్రించి వాటిని ఇంటింటికీ వెళ్లి చూపిస్తూ ఒకటికి రెండుసార్లు గుర్తు చేస్తున్నారు. ఆటోలకు మైకులు అమర్చి, పాటలు, మాటల రూపంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నమూనా బ్యాలెట్ పేపర్లను ఇంటింటికీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. సామాజిక మాద్యమాల్లో.. ఈసారి సామాజిక మాద్యమాల్లో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందుకు గాను వాట్సాప్లో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారు. ఫేస్బుక్, ఇస్ట్రాగామ్లను సైతం వినియోగించుకుంటున్నారు. అభ్యర్థుల గుర్తులతో కూడిన ఫొటోలు, వీడియోలు రూపొందించుకొని సామాజిక మాద్యమాల ద్వారా ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రచారం చేస్తున్నారు. పల్లెల్లో ప్రచార జోరు గెలుపే లక్ష్యంగా పావులు ఓటర్లకు ఒకటికి రెండు సార్లు‘గుర్తు’ చేస్తున్న అభ్యర్థులు మొదటి విడత ఎన్నికలకు నేటితో ముగియనున్న ప్రచార పర్వం హామీలు గుప్పిస్తూ.. ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాము విజయం సాధిస్తే గ్రామాన్ని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీలు గుప్పిస్తున్నారు. గతంలో పదవులు చేపట్టి తిరిగి ఎన్నికల్లో నిలిచిన వారు గ్రామానికి ఐదేళ్ల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. తమకు మద్దతు తెలుపుతున్న పార్టీ అధికారంలో ఉందని, గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అఽధికార పార్టీ మద్దతుదారులు హామీలు ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధికి సొంత ఎజెండాను రూపొందించారు. -
సర్పంచ్ నుంచి శాసనసభ్యులుగా
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వగ్రామంలో సర్పంచ్లుగా ఎన్నికై ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చేరారు. అదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలుగా రాణించారు. వీరు ఇద్దరూ 1980లో సర్పంచ్లుగా గెలుపొంది ఇద్దరూ మూడుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. నిర్మల్ పురస్కార్ అవార్డు ఘనత నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిది అబ్దుల్లాపూర్మెట్ మండలం, తొర్రూర్ స్వగ్రామం. విద్యార్థిదశ నుంచే చురుగ్గా ఉండడంతో ఆయనకు ఓటు హక్కు వచ్చిన ఏడాది 1980లోనే తొర్రూర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించారు. ఆయన సర్పంచ్గా పని చేసిన కాలంలో గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఘనత దక్కింది. తదనంతరం నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీలో చేరి 1994లో మలక్పేట్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2004లో కాంగ్రెస్ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచాడు. తదనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు సార్లు పొటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2023లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లుగా సేవలందిస్తున్నారు. బాబాయ్పై గెలుపు ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్రెడ్డి. నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతుండగా గ్రామానికి చెందిన పెద్దలు ఆయన్ను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. 1980లో సర్పంచ్ ఎన్నికల్లో సొంత బాబాయ్పై గెలుపొందాడు. సర్పంచ్గా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాడు. తదనంతరం టీడీపీలో చేరి వివిధ పదవులను అలంకరించాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 2014లో రెండో సారి టీడీపీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో టీఆర్ఎస్ నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి ఇబ్రహీంపట్నం ప్రజలకు సేవలందించాడు. 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు. మంచిరెడ్డి, మల్రెడ్డి తొలుత ప్రథమపౌరులే.. ఇద్దరూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేలు తొలి ఓటు తనకే వేసుకున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యం కష్టపడి పని చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. రాజకీయాల్లో స్థిరత్వం అవసరం. టీడీపీ రాజకీయ భవిష్యత్ ఇస్తే కాంగ్రెస్ జీవితం ఇచ్చింది. పార్టీని నమ్ముకుని ఉండటం వల్లే నేడు మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచాను. స్థిరత్వంగా, నిలకడగా ఉండాలి. ప్రజలను నమ్ముకుని ఉండాలి. స్వార్థం లేకుండా పని చేశాం. అప్పట్లో ఓట్ల కోసం ఖర్చులు సైతం తక్కువే. ఇప్పుడు రాజకీయాలు ఫిరం అయ్యాయి. – మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం నిస్వార్థంగా సేవలందించాం ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి సర్పంచ్గా 1980లో పని చేశాను. అప్పట్లో యువకుడిగా ఉన్న సమయంలో ప్రజలు అవకాశం కల్పించారు. నిస్వార్థంగా సేవలందించి ప్రజల మన్ననలు పొందాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నిరంతరం ప్రజలతోనే ఉండటం వల్ల మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. స్వార్థం లేని జీవితంతో ముందుకు పోతే అవకాశాలు వస్తాయి. – మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం -
హస్తం బలపరిచిన అభ్యర్థులదే గెలుపు
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కుల్కచర్ల: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం మల్కాపూర్కు చెందిన బీజేపీ చౌడాపూర్ మండల ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే సర్పంచులుగా గెలవనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు అశోక్కుమార్, వెంకటయ్య, గోపాల్, రాజేందర్ రెడ్డి, పాల్గొన్నారు. రైతుల కోసం ధర్నా చేస్తే కేసులా..? పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి: రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడున్నారని ప్రశ్నించినందుకు ప్రభుత్వం కేసులు అక్రమం కేసులు పెట్టడం సరికాదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్లో రైతులకు యూరియా అందడం లేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆయనపై కేసు నమోదవడంతో సోమవారం పరిగి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి రైతులు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుందఅశోక్ కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సీనియర్ నాయకులు ప్రవీణ్రెడ్డి, సురేందర్, వెంకటయ్య రవికుమార్ పాల్గొన్నారు. తాళం వేసిన ఇంటికి కన్నం ● ఇద్దరు పాత నేరస్తులకు రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ షాద్నగర్రూరల్: జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు రిమాండ్కు తరలించారు. సోమవారం ఏసీపీ లక్ష్మీనారాయణ పట్టణంలోని పీఎస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా రామయ్యగూడకు చెందిన సురేందర్, తాండూరు మండలం నారాయణపూర్కు చెందిన నర్సింలు జైలులో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడిన వీరు మల్లీ చోరీల బాటపట్టారు. పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే కొండె కృష్ణయ్య ఈ నెల 3న తన స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం, చిన్నరేవళ్లికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం కృష్ణయ్య భార్య ఇంటికి తాళం వేసి టైలర్షాప్నకు వెళ్లింది. ఇది గమనించిన సురేందర్ తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బంగారం, నగదు దోచుకెళ్లాడు. చోరీ విషయంపై బాధితుడు కృష్ణయ్య అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నారు. సురేందర్ చోరీ చేసిన సొత్తును నర్సింలు కుదువపెట్టి ఇద్దరూ కలిసి జల్సాలు చేసేవారు. వీరు గతంలో ఎల్బీనగర్, మేడిపల్లి, సరూర్నగర్, చైతన్యపురి, బాలనగర్, చంద్రాయన్గుట్ట, భువనగిరి, గద్వాల, విజయనగర్, విరాకాబాద్, ఘట్కేసర్, సంగారెడ్డి, తిరుపతి, సైదాబాద్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. నిందితుల వద్ద ఒక బైక్, 3.2 తులాల బంగారం, రూ.62,600 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. సొంతింటి కల సాకారం చేవెళ్ల: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్లో సోమవారం సద్దుల ఈశ్వరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించి, అనంతరం వార్డులో 10లక్షల నిధులతో వేస్తున్న సీసీ రోడ్డుపనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబసభ్యలను శాలువాతో సన్మానించి అభినందించారు.


