breaking news
Vikarabad
-
ఎవరో పురాధీశులు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తికానుంది. ఇప్పటికే క్యాంపులకు వెళ్లిన అభ్యర్థులు నేరుగా మున్సిపాలిటీలకు చేరుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇక మ్యాజిక్ ఫిగర్ దాటక హంగ్ ఏర్పడిన మొయినాబాద్లో ఇప్పటికీ అదే ఉత్కంఠ కొనసాగుతోంది. స్వతంత్రుల మద్దతుతో చేజిక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీతో చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోబోతోంది. ఆమనగల్లులో రాజకీయ సమీకణాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యేందుకు యత్నిస్తున్నాయి. హస్తం గుప్పిట్లో ఆ స్వతంత్రులు మొయినాబాద్ పరిస్థితి రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు రూ.కోట్లు ఖర్చు చేసినా ఇక్కడి ప్రజలు మాత్రం ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. 26 వార్డుల్లో 10 అధికార కాంగ్రెస్ గెలుపొందగా, ఏడు బీఆర్ఎస్, నాలుగు బీజేపీ విజయం సాధించాయి. ఐదు స్థానాల్లో స్వతంత్రులు (ముగ్గురు బీజేపీ రెబల్స్, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్) గెలుపొందారు. ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. పాలకమండలి ఏర్పాటులో స్వతంత్రులే కీలకంగా మారారు. 8వ వార్డు కౌన్సిలర్ మంచె శంకరయ్యను అదేరోజు అధికార పార్టీ సభ్యులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ క్యాంపులో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రెబల్ 22వ వార్డు సభ్యుడు గరుగు రాజు సహా 21 వార్డు సభ్యురాలు అనసూయ, 11వ వార్డు సభ్యుడు మహేశ్ సైతం అధికార పార్టీకి మద్దతిచ్చేందుకు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు సైతం తిరిగి హస్తం గూటికి చేరుకున్నట్లు సమాచారం. ఎక్స్ అఫీషియో ఓటుతో అవసరం లేకుండానే అధికార పార్టీ ఈ పీఠాన్ని కై వసం చేసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కలిగిన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్లో కాకుండా శంకర్పల్లిలో ఓటు హక్కు నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. తేలనున్న భవితవ్యం అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులంతా ఆయా స్థానిక ఎమ్మెల్యేల మద్దతుదారులే కావడంతో చైర్మన్ పీఠం ఖరారు అంశం వారికి పెద్ద తలనొప్పిగా మారింది. నాకంటే.. నాకే ఇప్పించాల్సిందిగా వారు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తుండటంతో వారు ఎటూ తేల్చుకోలేక ఆ బాధ్యతను అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. ఖరారైన రిజర్వేషన్లకు అనుగుణంగా ఇప్పటికే చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులపై ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సీల్డ్ కవర్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం సోమవారం మధ్యాహ్నంలోపు తేలిపోనుంది. నేటితో ఉత్కంఠకు తెర సీల్డ్ కవర్లలో చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు మొయినాబాద్లో శ్రీఅధికారాశ్రీనికే స్వతంత్రుల మద్దతు కారు ఖాతాలోనే ఇబ్రహీంపట్నం ఆమనగల్లులో మారుతున్న సమీకరణాలు -
ఉద్రిక్తతకు దారితీసిన శివాజీ విగ్రహ ఏర్పాటు
పహాడీషరీఫ్: మహా శివరాత్రి పర్వదినాన మామిడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని నూతన విగ్రహావిష్కరణ కోసం గ్రామంలోని వార్డు కార్యాలయం ఎదుట పంచముఖి హనుమాన్ వ్యాయామశాల కమిటీ ఆధ్వర్యంలో దిమ్మెను నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎలాంటి అనుమతులు లేకుండా దిమ్మె నిర్మించి, విగ్రహం ఏర్పాటు విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ జల్పల్లి సర్కిల్ ఏఎంసీలు వినయ్, జ్యోతి ఆదివారం ఉదయం 6 గంటలకే చేరుకొని కూల్చివేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న వ్యాయామశాల కమిటీ, బజ్రంగ్దళ్ నాయకులు ఆర్జీఐఏ డివిజన్ ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్, పహాడీషరీఫ్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ గౌరీ నాయుడుతో చర్చించారు. అనుమతి లేకపోవడంతో కూల్చివేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో మామిడిపల్లి, జల్పల్లి, శ్రీరామ కాలనీలకు చెందిన వందలాది బజరంగ్దళ్, గ్రామయువకులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో బాలాపూర్, ఆర్జీఐఏ, ఆదిబట్ల, శంషాబాద్ పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సుధాకర్, కనకయ్య, రవికుమార్, పవన్ కుమార్ అదనపు బలగాలతో అక్కడికి చేరుకొని బందోబస్తు కొనసాగించారు. దిమ్మెను కూల్చబోమని, అనుమతులు తెచ్చుకునేంత వరకు విగ్రహాన్ని తొలగించుకోవాలని పోలీసుల సూచన మేరకు నిర్వాహకులు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
పైలెట్ అరెస్ట్ కోసం గాలింపు
తాండూరు: మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ కేంద్రం వద్ద పోలీసు విధులకు ఆటంకం కల్పించారంటూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోని వెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తన అనచరులతో కలిసి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా సీఐ సంతోశ్ అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రోహిత్రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం పైలెట్ రోహిత్రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు నగరంలోని మణికొండ మర్రిచెట్టు ప్రాంతంలో ఉన్న ఆయన నివాసానికి రాయదుర్గం సీఐతో పాటు జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడంతో పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. పోలీసు అధికారులు ఇంట్లోకి వచ్చిన వీడియోలను తీస్తున్న సిబ్బంది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చి సీసీ పుటేజీలు పరిశీలించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుందామనుకుంటే ఆయన ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. మరోవైపు తాండూరులోని పైలెట్ నివాసం వద్ద , మొయినాబాద్లోని ఫామ్ హౌస్లోనూ తనిఖీలు చేపట్టారు. రోహిత్రెడ్డి నగరం దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారా అనే అనుమానంతో శంషాబాద్లోని విమానాశ్రయంలో పోలీసు అధికారులు విచారించినట్లు సమాచారం. మణికొండలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో సోదాలు -
ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
7వ మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమాణం చేయనున్న అనన్య అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ 7వ పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7వ మున్సిపల్ చైర్పర్సన్గా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూతురు అనన్య ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాగా వైస్చైర్మన్ ఎవరనే విషయంలో స్పష్టత రాలేదు. వైస్చైర్మన్ రేసులో ప్రధానంగా సుధాకర్రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్కుమార్, విశ్వనాథం రాఘవేందర్, లంకా లక్ష్మీకాంత్రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కుల్కచర్ల: యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు బందయ్య అన్నారు. ఆదివారం చౌడాపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహా ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో బి.వెంకటేశ్, అశోక్, శివకుమార్, శ్రీకాంత్, కల్యాణ్, రాజు, నర్సింలు, లింగం, గౌరీశంకర్, రమేశ్, బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత పరిగి సివిల్ కోర్టు జడ్జి శిల్ప కుల్కచర్ల: ఆధ్యాత్మికచింతనతో మానసిక ప్ర శాంతత చేకూతుందని పరిగి సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. ఆదివారం ఆమె బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని పాంబండ రామలింగేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు భక్తిభావాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేశ్, ఆలయ ఈఓ బాలనర్సయ్య, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మైపాల్రెడ్డి, సర్పంచ్ శ్రీను, ఉపసర్పంచ్ గోవర్దన్రెడ్డి, అర్చకులు పాండు తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్ అత్తాపూర్: వెండి ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన సంఘటన అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్స్పెర్టర్ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సులేమాన్నగర్ ప్రాంతానికి చెందిన అజ్రాబేగం, భర్త వాజిద్తో కలిసి నౌనెంబర్ ప్రాంతంలోని ఓ నగల దుకాణంలో గోల్డ్లోన్కు సంబంధించి వడ్డీని చెల్లించేందుకు వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి బీరువా తెరిచి ఉండడంతో తనిఖీ చేయగా ఐదు గ్రాముల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా చింతల్మెట్కు చెందిన మహ్మద్ జూనూద్, సయ్యద్ నయాబ్లను నిందితులుగా గుర్తించి వారికి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితులపై గతంలో హత్యాయత్నం కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు. -
కౌన్సిలర్ అక్కమ్మను అప్పగించండి
పరిగి: పరిగి మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి గెలుపొందిన కుర్వ అక్కమ్మను బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని.. ఆమెను వెంటనే తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వారు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి అక్కమ్మ కనిపించకపోవడంతో కాంగ్రెస్ నాయకుల మద్దతుతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కౌన్సిలర్ భర్త నాగయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలే తన భార్యను కిడ్నాప్ చేఽశారని ఆరోపించారు. బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తన భార్యను తీసుకురావడంలో విఫలమయ్యారని తనకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాల్కృష్ణ, రహీంపటేల్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన -
ధర్మభిక్షంను ఆదర్శంగా తీసుకోవాలి
అబ్దుల్లాపూర్మెట్: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలు కొనసాగిస్తామని సీపీఐ నేతలు పేర్కొన్నా రు. ధర్మభిక్షం జయంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమానికి ధర్మబిక్షం కుమారుడు, గీతపనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మభిక్షం జీవితం నేటి సమాజానికి ఆదర్శమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో వేల ఎకరాల భూములు పంచిన గొప్ప ఆదర్శ కమ్యూనిస్ట్ యోధుడని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్ర చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కేవీఎల్, అబ్దుల్లాపూర్ సర్పంచ్ విజయగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బింగి దాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
వీడని చిక్కుముడి
● క్యాంపులో కొలిక్కిరాని చర్చలు ● శంకర్పల్లి చైర్మన్ పీఠం ఎవరికో.. ● నేడు సీల్డ్ కవర్లో రానున్న పేరు శంకర్పల్లి: అధికార పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠంపై చిక్కుముడి వీడడం లేదు. రెండు రోజుల నుంచి శామీర్పేటలోని ఓ రిసార్ట్లో క్యాంపు ఏర్పాటు చేసి, మంత్రి, చీఫ్ విప్, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, ఇన్చార్జిలతో చర్చలు సాగించినా ఎటూ ముందుకు వెళ్లడం లేదని తెలిసింది. అధికార, ప్రతిపక్ష, స్వతంత్రులంతా ఒక్కతాటిపై ఉన్న స్పష్టత రాకపోవడం కొసమెరుపు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులకు విప్ జారీ చేసి, తుది నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేస్తూ తీర్మానం చేశారు. సీల్డ్ కవర్లో వచ్చిన పేరుకే మద్దతు పలకాలని చెప్పారు. సీల్డ్కవర్లో చైర్మన్ పేరు మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్ ముందు నుంచీ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దండు రాజేశ్వర్ తాజాగా పోటీలోకి వచ్చారు. రెండు రోజుల నుంచి చర్చలు సాగినా తుది దశకు రాలేదు. ఆదివారం మధ్యాహ్నం మంత్రి శ్రీధర్బాబు, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జిలతో రేసులో ఉన్న ఇద్దరితో సమావేశం అయ్యారు. ఇద్దరు అభ్యర్థులు తమకే కావాలని భీష్ముంచుకొని కూర్చోవడంతో తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేసినట్టు సమాచారం. సోమవారం చైర్మన్ ఎన్నిక ఉండడంతో కాంగ్రెస్ సభ్యులందరికీ పార్టీ విప్ జారీ చేసి, ఉదయం మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సూచించారు. పార్టీలో వర్గపోరు చైర్మన్ పీఠం తమ వర్గం వారికే కావాలంటూ ఒకవైపు ఎమ్మెల్యే యాదయ్య, మరోవైపు మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి పోటీ పడుతున్నారు. ఆదివారం జరిగిన చర్చల్లో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. దీనిపై మంత్రి, డీసీసీ అధ్యక్షుడు కల్పించుకొని సముదాయించారు. తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలేసినట్లు తెలిసింది. దీంతో సోమవారం జరిగే చైర్మన్ ఎన్నికపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాగా వైస్ చైర్పర్సన్గా 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బైసోళ్ల సంధ్యారాణిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. -
పీఠంపై‘చేయి’
మొయినాబాద్: కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్పర్సన్ హస్తానికే దక్కనుంది. అధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. స్వతంత్రుల మద్దతుతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, మాజీ ఎంపీ రంజిత్రెడ్డితో పాటు ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, రాజేంద్రనగర్కు చెందిన జ్ఞానేశ్వర్ రంగంలోకి దిగి అధికారం చేజారకుండా ఎత్తులు వేశారు. 10 మంది కాంగ్రెస్ సభ్యులకు మరో ఐదు మంది స్వతంత్రుల మద్దతు కూడగట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యుడు కాంగ్రెస్ శిబిరంలోనే ఉండటంతో పార్టీకి బలం 16కు చేరింది. దీంతో కాంగ్రెస్ సభ్యురాలు దుబ్బ సోనియాను చైర్పర్సన్ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్లోనే మరో సభ్యురాలు గీతా వనజాక్షి సైతం చైర్పర్సన్ పదవీ కోసం పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ గూటికి స్వతంత్రులు.. స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఐదుగురు కాంగ్రెస్ శిబిరంలో చేరినట్లు తెలుస్తోంది. 22వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన గరుగు రాజు వైస్ చైర్మన్ పదవీ కోసం తీవ్ర ప్రయ్నాలు చేస్తున్నారు. తనకు ఎవరు వైస్ చైర్మన్ పదవీ ఇస్తే వారికి మరో ఇద్దరు స్వతంత్రులతో కలిసి మద్ద్దతు ఇస్తానని రెండు రోజులుగా వేరుగా శిబిరం పెట్టారు. ఇద్దరు స్వతంత్రులు గౌర అనసూయ, మహేశ్కు గరుగు రాజు ఇప్పటికే భారీగా నజరానా ఇచ్చినట్లు తెలిసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్తో గరుగు రాజు వైస్ చైర్మన్ పదవీ కోసం రాయబారం పంపి సఫలీకృతమైనట్లు సమాచారం. కాంగ్రెస్ వైస్ చైర్మన్ హామీ ఇవ్వడంతో గరురు రాజు ఇద్దరు స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లినట్లు తెలిసింది. ఇంకో ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్గా పోటీ చేసి గెలుపొందిన స్వతంత్రులు సైతం కాంగ్రెస్కే మద్దతు పలికారు. వారితో మంత్రి శ్రీధర్బాబు చర్చలు జరిపినట్లు తెలిసింది. వైస్ చైర్మన్ కోసం ‘పల్లగొల్ల’ పట్టు మొయినాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవీ కోసం ఓ వైపు స్వతంత్ర సభ్యడు గరుగు రాజుకు ఇస్తున్నట్లు వినిపిస్తుండగా.. మరోవైపు 10వ వార్డు కాంగ్రెస్ సభ్యురాలు పల్లగొల్ల విజయలక్ష్మి పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. జూబ్లీహిల్ ఎమ్మెల్యే నవీన్యాదవ్కు పల్లగొల్ల విజయలక్ష్మి దగ్గరి బంధువు కావడంతో ఆమెను వైస్ చైర్పర్సన్గా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అందుకోసం స్వయంగా నవీన్యాదవ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో వైస్ చైర్మన్ పదవీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రయత్నాలు చేసి వెనక్కి తగ్గిన బీఆర్ఎస్, బీజేపీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆదివారం తీవ్ర ప్రయ్నాలు చేశాయి. స్వతంత్రుల మద్ధతుతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కోరంకు కావాల్సిన సభ్యుల మద్ధతు కూడగట్టేందుకు శ్రమించారు. మాజీ మంత్రి సబితారెడ్డి సైతం రంగంలోకి దిగి ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీవైపే మొగ్గు చూపడంతో వారి ప్రయత్నాలు మానుకున్నారు.మొదటి చైర్పర్సన్గా కాంగ్రెస్కే అవకాశం వైస్ చైర్మన్పై గరుగు(రి) పట్టు వదలని ‘పల్లగొల్ల’ కాంగ్రెస్ శిబిరంలోకి చేరిన స్వతంత్రులు ప్రయత్నాలు చేసి వెనక్కి తగ్గిన బీఆర్ఎస్, బీజేపీ -
కొడంగల్ సింహాసనంపై నందారం?
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నందారం ప్రశాంత్ పేరు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వైస్ చైర్మన్ ఎవరనేది స్పష్టత రావాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం మాజీ చైర్మన్ జగదీశ్వర్రెడ్డికే అవకాశం కల్పిస్తారా.. వేరొకరిని ఎన్నుకుంటారా అనే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్తగా ఎన్నికై న 12 మంది కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11 గంటలకు కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్ ఆ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.కొడంగల్ ఓటర్లు కొత్త వారికే పట్టం కట్టారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో పది మంది కొత్తవారే కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. గత మున్సిపల్ పాలక వర్గంలో చైర్మన్గా పని చేసిన జగదీశ్వర్రెడ్డి, కౌన్సిలర్గా ఉన్న శంకర్నాయక్లు మాత్రమే రెండోసారి ఎన్నియ్యారు. -
కోట్పల్లి ఉపాధ్యాయురాలికి డాక్టరేట్
బంట్వారం: కోట్పల్లి జెడ్పీహెచ్ఎస్లో హిందీ టీచర్గా పని చేసే పాతీమాబేగంకు డాక్టరేట్ వరించింది. ఆమె సేవలను గుర్తించిన చైన్నె గ్లోబల్ వర్సీటీ రెండు రోజుల క్రితం చైన్నెలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆదివారం ఫాతిమాబేగం విలేకరులతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. డాక్టరేట్తో తన బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ చంద్రప్ప, ఉపాధ్యాయ బృందం ఆమెకు అభినందనలు తెలిపారు. ఆర్యూపీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ప్రధానకార్యదర్శి ఎజాజ్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. యాలాల: తెలంగాణ గురుకుల పాఠశాలలో(వీటీజీ సెట్ 2026) ప్రవేశం కోసం రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన మోడల్ పరీక్షకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని సేవ సమితి సభ్యులు, పగిడియాల జెడ్పీహెచ్ఎస్ జీహెచ్ఎం కృష్ణయ్య అన్నారు. ఫిబ్రవరి 22న జరగనున్న ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మోడల్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గతంలో నవోదయా, పోటీపరీక్షలకు మోడల్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మోడల్ పరీక్షలో ప్రతిభ సాధించిన విద్యార్థికి స్టడీ మెటీరీయల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి తాండూరు అధ్యక్షుడు బాలకృష్ణ, సభ్యులు మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రమేశ్, రాము తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పరోక్ష పద్ధతిలో సోమవారం జరగనుంది. షాద్నగర్ నుంచి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎక్స్అఫీషియోగా తన ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు కమిషనర్ సునీత తెలిపారు. మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 15 స్థానాల్లో కాంగ్రెస్, 11 చోట్ల బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 స్వతంత్రులు గెలుపొందారు. చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ ఇప్పటికే అందుకుంది. ఎమ్మెల్యే ఎక్స్అఫీషియోగా నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ బలం 16కు చేరింది. దీంతో సునాయసంగా చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంటుంది. మొయినాబాద్: ‘ఊళ్లో ఇప్పటి వరకు ఇజ్జత్తో బతికినం.. మా తమ్ముడికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.. కౌన్సిలర్గా గెలిచాడు.. ఇంటికొచ్చి జులూస్ చేద్దామనే లోపే నడీ రోడ్డుపై నుంచి మా తమ్మున్ని కాంగ్రెసోళ్ల ఎత్కపోయి మా ఇజ్జత్ తీస్తున్నారు. మా తమ్మున్ని మా దగ్గరకు పంపిస్తారా.. లేక మేము ఆత్మహత్య చేసుకోవాలా’ అంటూ 8వ వార్డు కౌన్సిలర్ మంచె శంకరయ్య సోదరులు మంచె పోచయ్య, మంచె సత్తయ్య, కుమారుడు మంచె నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అజీజ్నగర్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఆశ పెట్టి ఎత్తుకెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే పంపిచాలని, లేదంటే కుటుంబ సభ్యులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. షాద్నగర్రూరల్: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గులో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ప్రజా సంఘాల నాయకులు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మిస్తే షాద్నగర్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. పెన్షనర్స్ భవనంలో నిర్వహించే సదస్సుకు ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, నర్సింహారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, అర్జునప్ప, రవీంద్రనాథ్, తిరుమలయ్య, శ్రీకాంత్, ఈశ్వర్, రాంచందర్, సత్యనారాయణ, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తవారికే పట్టణం
తాండూరు: కొత్త వారికి ప్రజా ప్రతినిధులుగా అవకాశం కల్పించడంలో తాండూరు ప్రఖ్యాతి గాంచింది. ఎన్నికలు ఏవైనా కొత్తవారికే అవకాశం ఇస్తామనే తీర్పు తాండూరు మరోసారి తేటతెల్లమైంది. మున్సిపల్ పరిధిలో 36 వార్డులకు 135 మంది బరిలో నిలిచారు. హోరా హోరిగా జరిగిన పోరులో 32 మంది కొత్త కౌన్సిలర్లు సోమవారం కౌన్సిల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో 16 మంది, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మందిలో 11 మంది తొలిసారి గెలిచినవారే. మూడవసారి విజయం సాధించిన 12వ వార్డు కౌన్సిలర్ నీరజాబాల్రెడ్డికి చైర్పర్సన్గా, అబ్దుల్ రజాక్కు వైస్చైర్మన్గా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లలో ఇద్దరు తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని కౌన్సిలర్లుగా గెలిచారు. ఎంఐఎం నుంచి ఒకరు, ఇండిపెండెంట్ కౌన్సిలర్ మరొకరు ఉదయం 11గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఏడుగురు ఓటమి చవిచూశారు. 6వ వార్డు అభ్యర్థి అనిల్అర్మి, 7వ వార్డు నుంచి ఇర్షద్, 11వ వార్డు నుంచి బంటు వేణుగోపాల్, 16వ వార్డు నుంచి నారాశ్రీలత, 19వ వార్డు నుంచి జుంటిపల్లి వెంకట్, 20వ వార్డు నుంచి నవీన, 31వ వార్డు నుంచి మెగానంద్ తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీలతో విజయం సాధించారు. తాండూరు కౌన్సిల్లోకి 32 మంది నూతన కౌన్సిలర్లు -
వ్యక్తిగత విమర్శలు తగవు
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ ప్రజలు కాంగ్రెస్కు అండగా నిలిచారని పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్రెడ్డి అన్నారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఇబ్బందులు లేకుండా జరిగాయన్నారు. విజేతలకు అభినందనలు తెలిపారు. రిజర్వేషన్ అనుకూలించడంతో మా పార్టీ నాయకుల కోరిక మేరకు అనన్య వచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధారాల్లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. స్పీకర్పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. వికారాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఇప్పటికే మున్సిపల్లో టీయూడీఎఫ్సీ కింద రూ.60 కోట్లు, ఎస్డీఎఫ్ కింద రూ.18 కోట్లు, హెచ్యండీఏ నుంచి రూ.180 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. సంక్షేమంలో భాగంగా పట్టణంలోని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరక్టర్ కిషన్నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు చిగుళ్లపల్లి రమేష్కుమార్, సురేష్, కౌన్సిలర్ అనంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు షరీఫ్, మాజీ కౌన్సిలర్ మురళి, కిష్టారెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి -
స్వతంత్రుల సత్తా
● ప్రధాన పార్టీల అభ్యర్థులకు షాక్ ● భారీగా ఖర్చుపెట్టిన వార్డుల్లో ఇండిపెండెంట్ల గెలుపు మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు సైతం ఓటమి తప్పలేదు. ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల చేతుల్లో ఓటమి చవిచూశారు. సురంగల్ 13వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు భారీగా ఖర్చుపెట్టారు. ఈ వార్డులో వీరు ఖర్చు చేసిన మొత్తం సుమారు రూ.10 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో బీఫాం తీసుకుని పోటీ చేయగా, ముందు నుంచి టికెట్పై ఆశలు పెట్టుకున్న అభ్యర్థి గడ్డం లక్ష్మి వెంకట్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. మున్సిపల్ పరిధిలోనే అత్యధికంగా ఖర్చుపెట్టిన ఈ వార్డులో బీజేపీ అభ్యర్థి గుమ్మళ్ల శ్రావణిపై ఇండిపెండెంట్ గడ్డం లక్ష్మి 81 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి నిర్దుల అనిత మూడో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి యాలాల లావణ్య నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. 21, 22 వార్డుల్లోనూ.. చిలుకూరులోని 22వ వార్డులోనూ స్వతంత్ర అభ్యర్థి గరుగు రాజు విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థితోపాటు బీజేపీ అభ్యర్థి గున్నాల గోపాల్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గున్నాల సుధాకర్రెడ్డి భారీగా డబ్బు వెచ్చించారు. అయినా ఓటర్లు స్వతంత్ర అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. 21వ వార్డులోనూ ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కన పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి గౌర అనసూయను గెలిపించారు. ఈ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి సిద్దెంతి స్వప్నపై స్వతంత్ర అభ్యర్థి గౌర అనసూయ 136 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 11వ వార్డులో హోరాహోరీ ఎనికేపల్లిలోని 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అమ్డాపూర్ సునీల్, స్వతంత్ర అభ్యర్థి మద్యపాగు మహేశ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి 22 ఓట్ల తేడాతో గెలుపొందారు. హిమాయత్నగర్లోని 3వ వార్డులో సైతం ఓటర్లు స్వతంత్ర అభ్యర్థికే పట్టం కట్టారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి పైలి రమాదేవిపై స్వతంత్ర అభ్యర్థి బిల్లపాటి కవిత 130 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గడ్డం లక్ష్మి, 13వ వార్డు బిల్లపాటి కవిత, 3వ వార్డు మధ్యపాగ మహేష్, 11వ వార్డు -
మృతదేహంతో ఆందోళన
హయత్నగర్: హయత్నగర్లోని నార్ముల్ మదర్ డెయిరీ వద్ద శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. డెయిరీలోని ప్రీప్యాక్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న పసుమాములకు చెందిన తులసిగారి బాల్నర్సింహ(45) శుక్రవారం ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు అతన్ని ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి ఉస్మానియాకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. యాజమాన్యం నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో మానసికఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే బాల్నర్సింహ మృతిచెందా డని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు శనివారం డెయిరీ గేటు ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్నర్సింహ ముప్పైఏళ్లుగా డెయిరీలో పనిచేస్తున్నాడని, మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, ఈ క్రమంలో మెదడు నరాలు చిట్లిపోయి మృతి చెందాడని రోదించారు. ఆయన మృతికి పాలక మండలి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ డెయిరీలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగి, ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులతో ఫోన్లో మాట్లాడిన చైర్మన్ మధుసూదన్రెడ్డి తక్షణ సాయంగా రూ.50 అందజేస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మామీ ఇచ్చారు. పరిహారం విషయాన్ని బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పడంతో నిరసకారులు శాంతించారు. కార్మికుడి మరణంతో మదర్ డెయిరీ వద్ద ఉద్రిక్తత ఆర్థిక, మానసిక ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చైర్మన్ హామీతో సద్దుమనిగిన వివాదం -
చైర్మన్గిరిపై సోషల్ అలజడి!
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నంలో గెలుపొందిన స్వతంత్ర కౌన్సిలర్తో కలిపి బీఆర్ఎస్కు చెందిన 14 మంది, కాంగ్రెస్కు చెందిన 8 మంది అభ్యర్థులు వేర్వేరు క్యాంపుల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ శిబిరంలో చైర్మన్గిరీపై అలజడి మొదలైందని కాంగ్రెస్ శ్రేణులు, హస్తం శిబిరంలో లుకలుకలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి శిబిరాలకు సంబంధించిన ఫొటోలను వారు పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు తమతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ విజేతలు మావైపు వస్తారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అయితే, ఇవన్నీ వదంతులేనని తెలుస్తోంది. -
అల్లుడిని గెలిపించిన మామ ఆఫర్లు!
తాండూరు టౌన్: పట్టణంలోని 13వ వార్డులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సురేశ్నాయక్ కౌన్సిలర్గా గెలుపొందారు. ఇతని మామ, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్నాయక్ అల్లుడి విజయంలో కీలక పాత్ర పోషించారు. వార్డు నుంచి తలన అల్లుడిని గెలిపిస్తే తన వినాయక ఫంక్షన్హా ల్, వినాయక ఆస్పత్రి, వినాయక నర్సింగ్ కళాశాల లో 13వ వార్డు ప్రజలకు 50 శాతం రాయితీ ఇస్తాన ని ప్రకటించారు. అలాగే వినాయక కన్సల్టెన్సీ ద్వా రా నిరుద్యోగ యువతకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ప్రాధాన్యతి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అభిమానమో, విఠల్నాయక్ ఆఫర్లో తెలియదు కానీ మొత్తానికి సురేశ్ విజయం సాధించారు. -
రెండోసారి హస్తగతం
● ఈసారి కాంగ్రెస్దే షాద్నగర్ మున్సిపల్ పీఠం ● 15 వార్డుల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు ● హోరాహోరీ పోరులో 11చోట్ల గెలుపొందిన బీఆర్ఎస్షాద్నగర్: ముచ్చటగా మూడు సార్లు జరిగిన మున్సిప ల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. 2014లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 2020 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన మెజార్టీ కౌన్సిలర్లు విజయం సాధించారు. దీంతో మొదటి సారి చైర్మన్ పీఠాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. ఆతర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 28 వార్డులకు గాను 19 చోట్ల గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేశారు. మూడోసారి నిర్వహించిన ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ 11 చోట్ల గెలుపొందింది. 15 వార్డుల్లో విజ య దుందుబి మోగించిన కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనుంది. పుర పీఠం ఎవరికి దక్కేనో.. షాద్నగర్లో అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయోననే ఉత్కంఠ నెలకొంది. అగ్గునూరు బస్వం, మో హన్ చైర్మన్ రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరూ కొత్త గా ఎన్నికైన కౌన్సిలర్లే కావడం గమనార్హం. లేదంటే గతంలో చైర్మన్గా పని చేసిన అగ్గునూ రు విశ్వం సతీమణి విశాలకు అవకాశం కల్పిస్తారా వేచిచూడాల్సిందే. వీరెవరినీ కాదని, అధిష్టానం మరెవరివైపైనా మొగ్గు చూపుతుందా అనేది సోమవారం తేలనుంది.ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మె ల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్రెడ్డి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలోనూ వీరి నిర్ణయమే కీలకం కానుంది. క్యాంపు రాజకీయాలు.. కాంగ్రెస్ కౌన్సిలర్లును పార్టీ అధిష్టానం శుక్రవారం రాత్రే మేడ్చల్ శివారులోని ఓ రిసార్ట్కు తరలించింది. 16న కౌన్సిలర్లను క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ అధిష్టానం సైతం తమ అభ్యర్ధులను క్యాంపునకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమ అభ్యర్థులు కారు దిగి, హస్తం గూటికి చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. -
హ్యాట్రిక్ విజేత ఓటమి
తాండూరు: వరుసగా మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచి, హ్యాట్రిక్ సాధించిన బొబ్బిలి శోభారాణి శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 15వ వార్డు అంబేడ్కర్ నగర్ నుంచి ఏకధాటిగా 15 ఏళ్ల పాటు కౌన్సిలర్గా కొనసాగిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి దివిటి ఎల్లప్ప చేతిలో ఓటమి చవి చూశారు. ఈవార్డు నుంచి శోభారాణితో పాటు మైనార్టీ నాయకుడు బషరత్ బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. బీఫామ్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నిలిచారు. కౌంటింగ్లో శోభారాణికి 314 ఓట్లు రాగా, బషరత్కు 559 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి పోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఎలప్ప 582 ఓట్లు సాధించి, విజయకేతనం ఎగరేశారు. తాళం వేసిన ఇంట్లో చోరీ పరిగి: పట్టణ పరిధిలోని కిష్టమ్మగుళ్ల తండాలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సోమ్లనాయక్ ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లాడు. గుర్తు తెలియనిదొంగలు తాళం పగులగొట్టి బీరువాలోని నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన సోమ్లనాయక్ దొంగతనం జరిగిన విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మోహనకృష్ణ తెలిపారు. యువకుడిపై దాడి కుల్కచర్ల: ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరిన ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు దాడి చేసి గాయరిచారు. ఈ ఘటన కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండీడు మండలం కొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఘణాపూర్ గేటు వద్ద ఉన్న సమయంలో అంతారం గ్రామానికి చెందిన మనోజ్, విష్ణులు అతడితో గోడవ పడ్డారు. శ్రీకాంత్కు తీవ్రంగా గాయాలైయ్యాయి. ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరగా తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. గడ్డివాము దగ్ధం కుల్కచర్ల: ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాల్వీడు గ్రామానికి చెందిన పాలెపల్లి రాములు ఇంటి వద్ద రెండు గడ్డివాములు వేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం గడ్డివాము అంటుకుంది. ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకలేదు. సుమారు రూ. 40వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి యాచారం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ.. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన రావుల శ్రీశైలం (50) శనివారం సాయంత్రం ట్రాక్టర్తో మీరాఖాన్పేట సమీపంలోని ఓ క్రషర్ మిషన్ వద్దకుకంకర నింపుకోవడానికి వెళ్లాడు. ట్రాక్టర్లో కంకర నింపుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. తీవ్ర గాయాలైన శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు క్రషర్ మిషన్ వద్ద ఆందోళనకు దిగారు. మృతుడికి భార్య జయమ్మ, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. -
పూలతోట రామదాసుకు పూజలు
బషీరాబాద్: మండల పరిధిలోని జీవన్గీ గ్రామం బర్కాల్ పూలతోట రామదాసు మఠంలో భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. నవల్గా నుంచి ప్రారంభమైన స్వామివారి పల్లకీసేవ పాదయాత్రగా శుక్రవారం రాత్రి జీవన్గీ చేరుకుంది. పూలతోట రామదాసు ఆలయంలో పంచాక్షరి, అష్టాక్షరితో అఖండ శివనామస్మరణ చేశారు. ఓం నమో శివాయ, ఓం నమో నారాయణ అంటూ జపంతో 24 గంటల పాటు భక్తులు భక్తిశ్రద్ధలతో ముక్త నామస్మరణ పఠించారు. మఠం చైర్మన్ దాసరి కృష్ణ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజాము వరకు ఘనంగా భజనలు, ప్రత్యేక పూజలు సాగాయి. అనంతరం రామదాసు విగ్రహానికి, శివ లింగానికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పల్లకీ సేవ కొనసాగింది. ప్రతీ శివరాత్రికి నవల్గా నుంచి మొదలయ్యే పల్లకీ సేవా జీవన్గీ, కరన్కోట గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కర్ణాటకలోని మిర్యాణ్ రామదాసు సమాధి వరకు పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామదాసు భజనమండలి సభ్యులు అడ్వకేట్ నవల్గా విశ్వనాథం, సర్పంచ్ రామని బసప్ప, ఉప సర్పంచ్ జర్నప్ప, శాంతిగిరయ్య, వీరారెడ్డి, పల్లె నరేందర్రెడ్డి, ఏదుల మల్రెడ్డి, జగదీశ్వర్ స్వామి, కుక్కింద వెంకట్రామ్రెడ్డి, వాకారం వెంకట్రామ్రెడ్డి, అనంత్రెడ్డి, సోమశేఖరరెడ్డి, ఎనుముల అంజిలప్ప, పోతురాజు భీమప్ప, కుర్మ వీరప్ప, భీంరెడ్డి, భక్తులు భారీగా పాల్గొన్నారు. నవల్గా నుంచి కరణ్కోట వరకు పల్లకీసేవతో పాదయాత్ర పంచాక్షరి, అష్టాక్షరితో అఖండ శివనామస్మరణ భారీగా హాజరైన భక్తజనం -
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
బొంరాస్పేట: రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రేగడిమైలారం జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డీప్లానాయక్ తండాకు చెందిన మీసాల దేవ్లానాయక్(65) గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతున్నారు. తుంకిమెట్ల వైపు నుంచి కొడంగల్ వైపు వేగంగా వెళ్త్న్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవులానాయక్ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. ఆయనున్న వికారాబాద్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ద్విచక్ర వాహనదారుడు దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్కు చెందిన దాసరి రాజుగా గుర్తించామని తండా వాసులు తెలిపారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని ఆదివారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై బాల వెంకటరమణ తెలిపారు. మృతుడికి భార్య హేమ్లీబాయి, ఇద్దరు కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. -
నోటాకు 54.. చెల్లని ఓట్లు 102
శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదంటూ అన్ని వార్డుల్లో కలిపి 54మంది నోటాకు ఓటు వేయగా.. 102ఓట్లు చెల్లుబాటు కాలేదు. నోటాకు అత్యధికంగా 9వ వార్డులో 11 ఓట్లు పడగా, 2వ వార్డులో 18 ఓట్లు చెల్లకుండాపోయాయి. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతోనే చెట్లుబాటు కాని ఓట్లు నమోదయ్యాయని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. మరోసారైనా ఇలా కాకుండా చూడాలని సూచిస్తున్నారు. మాజీల గెలుపోటములు కొందరు విజయం, మరికొందరు పరా జయం ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికల్లో కొందరు మాజీలు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కప్పరి స్రవంతి మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్ సతీమణి శిరీషపై కౌన్సిలర్గా విజయం సాధించగా, మాజీ వైస్ చైర్పర్సన్ బర్ల మంగ పరాజయం పాలయ్యారు. మాజీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మాజీ కౌన్సిలర్లు భానుబాబు, కొండ్రు శ్రీలత, అల్వాల జ్యోతి, నీలం శ్వేత, ఎదుళ్ళ విజయలక్ష్మి గెలుపొందగా, మాజీ కౌన్సిలర్లు ఆకుల సురేశ్, ఈగల రాములు, భర్తకి జగన్లు ఓటమిపాలయ్యారు. రెండుసార్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండిగారి రాములు తనయుడు త్రిలోక్ కుమార్ 12వ వార్డు నుంచి విజయం సాధించారు. తులేకలాన్ మాజీ సర్పంచ్ చిలుకల బుగ్గరాములు ఇబ్రహీంపట్నం 21వ వార్డు కౌన్సిలర్గా విజయం సాధించారు. ప్రధాన పార్టీకి 12 ఓట్లు! ఇబ్రహీంపట్నం: పట్టణంలోని 24వ వార్డులో 133 చెల్లని ఓట్లు, నోటాకు 56 ఓట్లు పడ్డాయి. 15వ వార్డులో నోటాకు ఒక్క ఓటు కూడా పడలేదు. 18వ వార్డులో చెల్లని ఓట్లు నమోదుకాలేదు. ఇదిలా ఉండగా, 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కర్నె అరవింద్కు కేవలం 12 ఓట్లు రావడం గమనార్హం. బీజేపీ పట్టణ అధ్యక్షుడి రాజీనామా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం షాద్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ పటేల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్కు రాజీనామా పత్రం అందజేసినట్లు తెలిపారు. సాధారణ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి పాటుపడుతానని ప్రకటించారు. ఇదిలా ఉండగా షాద్నగర్లోని 10వ వార్డు నుంచి పోటీచేసిన అతని భార్య భాగ్యలక్ష్మి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ హరిభూషణ్ పటేల్కు సంబంధించిన ఓ వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఓట్లు వేయలేదని.. రోడ్డు బంద్!
● షాద్నగర్ 4వ వార్డులో ఘటన ● పోలీసుల జోక్యంతో సద్దుమనిగిన వివాదం షాద్నగర్: ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని ఓ పార్టీకి చెందిన నాయకుడు రాత్రికి రాత్రే కాలనీకి వెళ్లే రోడ్డును పూర్తిగా బంద్ చేసిన ఘటన షాద్నగర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ కౌన్సిలర్ రాజేందర్రెడ్డి తల్లి పుష్పమ్మ ఓటమి పాలయ్యారు. అయితే వార్డు పరిధిలోని సబ్బులోల్ల కాలనీకి చెందిన వారు తమ కు ఓటు వేయకపోవడంతోనే ఓటమి చెందామని ఆరోపిస్తూ రాజేందర్రెడ్డి శుక్రవారం రాత్రి తమ కాలనీకి వచ్చి, రోడ్డుకు అడ్డంగా సిమెంట్ పలకలు వేయించి, రహదారిని మూసేశారని కాలనీ వాసు లు తెలిపారు. తమకు ఓట్లు వేయలేదని దౌర్జన్యం చేశారని వాపోయారు. ఈ విషయమై పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసుకులు అక్కడికి చేరుకు ని రోడ్డును క్లియర్ చేయించారు. -
కేటీఆర్ను కలిసిన బీఆర్ఎస్ కౌన్సిలర్
కొడంగల్: కొడంగల్ రెండో వార్డు కౌన్సిలర్ వాణిశ్రీ యాదవ్ శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ శాలువా పూలదండతో వాణిశ్రీని సన్మానించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కొడంగల్లో విజయం సాధించినందుకు అభినందించారని మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, కొడంగల్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ గట్టు రాంచంద్రారావ్, భీములు, చిన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సన్మానం అనంతగిరి: బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సన్మానించారు. శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై పరిష్కారంలో ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నేత్రపర్వం.. శివపార్వతుల కల్యాణం షాద్నగర్: ç³rt-׿…ÌZ° àh-ç³-ÍÏ Æøyýl$zÌZ Ñf-ÄŒæ$-¯]l-VýS-ÆŠ‡-M>-ÌS-±ÌZ E¯]l² }ÒÆ>…-f¯ólĶæ$ çÜçßæç܈ Í…VóS-ÔèæÓ-Æý‡-ÝëÓÑ$ §ólÐé-ÌS-Ķæ$…ÌZ BÌSĶæ$ MýSÑ$sîæ A«§ýlÅ„ýS$yýl$ EÐ]l*-Ôèæ…-MýS-ÆŠ‡-Æð‡yìlz B«§ýlÓÆý‡Å…ÌZ Ôèæ°-ÐéÆý‡… ÕÐ]l-´ëÆý‡Ó-™èl$ÌS MýSÌêÅ×ê°² OÐðl¿¶æÐ]l…V> °Æý‡Ó-íßæ…-^éÆý‡$. ¿ýæMýS$¢ Ë$ ò³§ýlªçÜ…-QÅÌZ ™èlÆý‡Í-Ð]l-_a ç³NfË$ ^ólÔ>Æý‡$. M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ Mú°Þ-ÌSÆŠ‡ ´ëÅr AÔZMŠS, AÀ-Ð]l–¨® MýSÑ$sîæ VúÆý‡Ð]l A«§ýlÅ„ýS$yýl$ »êÌS-Vø-´ëÌŒæ, {糿ê-MýS-ÆŠ‡Æð‡yìlz, Ððl…MýSsŒæÆð‡yìlz, »êÌSĶæ$Å, ÝùÐól$ÔŒæ, }°-Ðé‹Ü, çÜ$Æó‡…§ýlÆŠ‡-Æð‡yìlz, ºÌSÓ…-™Œæ-Æð‡yìlz ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘ న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకోవాలి చేవెళ్ల: న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే చట్టం అమలు చేయాలని ప్రముఖ న్యాయ వాది కె.అశోక్ డిమాండ్ చేశారు. చేవెళ్లలోని కో ర్టు వద్ద బార్ అసోషియేషన్ సభ్యులు చేస్తున్న రిలే దీక్షకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. న్యాయవాద రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభు త్వం చట్టం అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. న్యాయవాదులపై హత్యలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటి నుంచి రక్షణ కోసం చట్టం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సత్యానందం, జైపాల్, శ్రీనివాస్, ప్రకాశం, రవీందర్, సాయిరామ్, మహేశ్ పాల్గొన్నారు. శివాలయం ముస్తాబు చేవెళ్ల: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని కొనగట్టు శివాలయం ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఆదివారం ఉపవాస దీక్షలతో భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో వారి దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం వద్ద అభిషేకాలు, భజనలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పట్టణంలోని శివాలయాలు, శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వైస్ చైర్మన్ రేసులో అబ్దుల్ రజాక్
తాండూరు: మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు విజ యం సాధించిన అబ్దుల్ రజాక్ వైస్ చైర్మన్ రేసులో నిలిచారు. 2014లో తొలిసారి కౌన్సిలర్గా విజయం సాధించారు. అప్పట్లోనే వైస్ చైర్మన్ పదవి దక్కాల్సి ఉండగా కౌన్సిల్ ఏర్పాటుకు కోరం లేకపోవడంతో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి కౌన్సిల్ ఏర్పాటు చేశారు. 2020లో అదే వార్డు నుంచి బరిలోకి దిగి గెలిచారు. మూడో సారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వీర విధేయులుగా ఉన్న నాయకులు అబ్దుల్ రవూప్ సోదరుడికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో జనరల్ స్థానం నుంచి చైర్మన్గా లక్ష్మారెడ్డి కొనసాగగా వైస్ చైర్మన్గా ఎంఏ అలీం వైస్ చైర్మన్గా పని చేశారు. ఈ సారి అదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అబ్దుల్ రజాక్కు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. -
అర్ధరాత్రి హైడ్రామా
పరిగి: పరిగి మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. చైర్మన్ ఎన్నికకు గెలిచిన ఇద్దరు స్వతంత్రలు కీలకంగా మారారు. వారిలో ఒకరు కాంగ్రెస్ నాయకుల వద్ద.. మరొకరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి వద్ద ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోలీసులు వెళ్లారు. ఒకటవ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అక్కమ్మను తమతో పంపాలని కోరగా బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గెలిచిన ఇద్దరూ బీఆర్ఎస్ రెబల్స్ అని ఆ పార్టీ నేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టకొని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకు పోలీసులను వాడుకుంటున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే అక్కమ్మను తీసుకెళ్లాలని చూస్తున్నారని తెలిపారు. పుర రాజకీయం రసవత్తరం పరిగి మున్సిపల్ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 8 వార్డుల్లో, బీఆర్ఎస్ పార్టీ 8 చోట్ల, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. చైర్మన్ పదవి పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 10 ఉండాలి. కానీ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో గెలిచిన స్వతంత్రులు కీలకమయ్యారు.వారి కోసం ఇరు పార్టీ లు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తు న్నాయి. ఇద్దరూ బీఆర్ఎస్ రెబల్స్ కావడంతో తమకే మద్దతు తెలుపుతారని ఆ పార్టీ నేతలు భావించారు. ఈ క్రమంలో మొదటి వార్డు నుంచి మొదటి రౌండ్లో విజయం సాధించిన అక్కమ్మను వారి వద్ద ఉంచుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కమ్మ కుమారుడు బాల్రాజ్ను తీసుకెళ్లారు. తదనంతరం తన తల్లి కిడ్నాప్కు గురైందంటూ బాల్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కమ్మను తమతో పంపాలని కోరారు. ఇందుకు బీఆర్ఎస్ నేతలు ససేమిరా అన్నారు. చివరకు అక్కమ్మే వచ్చి తాను ఇక్కడ సురక్షితంగా ఉంటానని భావించి వచ్చినట్లు చెప్పడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా చైర్మన్ పదవి చేజారి పోకూడదని భావించిన కాంగ్రెస్ నాయకులు మూడో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన హన్మంతును పోలీసుల సాయంతో తీసుకెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, పోలీసుల మధ్య తోపుపాట చోటుచేసుకుంది. ఉద్రిక్తల నడుమ పోలీసులు వారి వాహనాల్లో హన్మంతును తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గెలుపొందిన బీఆర్ఎస్ రెబల్స్తో మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి వాటిని ఎవరూ సహించరన్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇంటికి పోలీసులు -
వైభవం.. ఎల్లమ్మ రథోత్సవం
దుద్యాల్: పోలేపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శనివారం అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభంగా సాగింది. ఎల్లమ్మను తేరులో ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బుడగ జంగాలు, గొల్ల కురుమలు, బైండ్ల వారు అమ్మవారి కీర్తిని ఆట పాటలతో వివరించారు. వేడుకల్లో ఆలయ చైర్మన్ ముచ్చటి వెంకటేష్, ఈఓ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది పనితీరు భేష్ జాతర ఏర్పాట్లలో పంచాయతీ సిబ్బంది, మల్టీపర్పస్ వర్కర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు బాగా పనిచేశారని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ అన్నారు. శనివారం ఆమె అధికారులతో కలిసి జాతర వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు తాగునీరు. పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాలు కల్పించడంపై అభినందించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ ప్రవీణ్కుమార్, ఎంపీడీఓ జయపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైస్.. రేస్!
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026రమేశ్కుమార్ వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపిక కాంగ్రెస్కు కత్తిమీద సాములా మారింది. ఫలితాలు కూడా వెల్లడైన నేపథ్యంలో అందరి దృష్టి చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికపై పడింది. కాంగ్రెస్ బీఫాంపై 17 మంది అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఒకరు.. బీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో అధికార పార్టీ బలం 19కి చేరింది. చైర్పర్సన్ పీఠం దాదాపు ఆ పార్టీకే దక్కే అవకాశం ఉంది. పరిగి పురపాలిక సంఘంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఎనిమిది వార్డులు కై వసం చేసుకున్నాయి. ఇద్దరు బీఆర్ఎస్ రెబల్స్ గెలుపొందారు. ఒకరు గులాబీ పార్టీకి మరొ కరు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. దీంతో చైర్పర్సన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలియని పరిస్థి తి నెలకొంది. తాండూరు, కొడంగల్లో అధికార కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ రావడంతో చైర్ పర్సన్ ఎవరనే దానిపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఎటొచ్చి వైస్చైర్మన్లు ఎవరనేదే తేలా ల్సి ఉంది. ఈ విషయంలో ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే వికారాబాద్లో ఎక్కువ పోటీ కనిపిస్తోంది. ఎవరికి అవకాఽశం ఇవ్వాలి...?ఎవరిని బుజ్జగించాలి అనేది ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అందరూ హేమా హేమీలే... వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ రేసులో హేమా హేమీలు ఉండటంతో స్పీకర్కు తలనొప్పిగా మారింది. అందరూ నమ్మకస్తులే కావడం.. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నవారు. గతంలో ఆ కుటుంబాల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ పదవులు అలంకరించిన వారే. కొందరు కష్టకాలంలో పార్టీని ఆదుకోగా.. మరికొందరు ప్రసాద్కుమార్ను ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. వైస్ చైర్మన్ రేసులో ఐదారుగురు ఉండగా ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు. పట్టణానికి చెందిన సత్యంసేట్ పార్టీ సీనియర్ నాయకుడు. ఎనిమిది సార్లు కౌన్సిలర్గా.. ఒకసారి చైర్మన్గా, మూడు సార్లు వైస్చైర్మన్గా పని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కుమారుడు రాఘవేందర్ 23వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొందారు. వైస్ చైర్మన్ పదవి కోసం సత్యంసేట్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరో నాయకుడు చిగుళ్లపల్లి రమేశ్కుమార్ గతంలో నాలుగు సార్లు కౌన్సిలర్గా.. వైస్చైర్మన్గా పని చేశారు. ఈయన సతీమణి మంజుల ఇటీవలి వరకు చైర్పర్సన్గా పనిచేశారు. ఐదోసారి విజయం సాధించిన ఆయన కూడా రేసులో ఉన్నారు. మరోనేత లంక లక్ష్మీకాంత్రెడ్డి ఈయన రెండోసారి కౌన్సిలర్గా గెలుపొందారు. గతంలో ఈయన సతీమణి పుష్పలత చైర్పర్సన్గా పనిచేయగా ఇప్పుడు లక్ష్మీకాంత్రెడ్డి పదవి ఆశిస్తున్నారు. మరో సీనియర్ నేత ఆర్థ సుధాకర్రెడ్డి ఈయన వరుసగా మూడుసార్లు గెలుపొందారు. గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ పట్టణ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో కూడా స్పీకర్ ప్రసాద్కుమార్తో ఉంటూ సేవలందించారు. ఈయన కూడా రేసులో ఉన్నారు. దీంతో ఎంపిక జఠిలమైంది. వైస్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనేది 16వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. రాఘవేందర్సుధాకర్రెడ్డి లక్ష్మీకాంత్రెడ్డి ఎంపిక పెద్ద సవాల్వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్న వారందరూ స్పీకర్కు అత్యంత ముఖ్యులే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాద్కుమార్ గెలుపునకు శ్రమించారు. ఎంతో నమ్మకమై న నేతలు కూడా.. సుధాకర్రెడ్డి, చిగుళ్లపల్లి రమేశ్, సత్యంసేట్,రాంచంద్రారెడ్డి, లంకా లక్ష్మీకాంత్రెడ్డి, కిషన్ నాయక్, గుడిసె లక్ష్మణ్, రత్నారెడ్డి, ధారూ రు మండలానికి చెందిన రఘువీరారెడ్డి, మోమిన్పేట మండలానికి చెందిన నరోత్తంరెడ్డి, మర్పల్లి మండలానికి చెంది కొండల్రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయగా.. కొందరు ఓటమి పాల య్యారు. గెలిచిన నలుగురు వైస్చైర్మన్పై ఆశలు పెట్టుకున్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ తన రాజకీయ వారసురాలిగా రంగప్రవేశం చేసిన కూతురు అనన్యను చైర్పర్సన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతా కావాల్సిన వారే రేసులో ఉండటంతో వైస్ చైర్మన్ ఎంపిక పెద్ద సవాల్గా మారినట్లు తెలిసింది. ఎవరినీ నొప్పించకుండా లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. వైస్ చైర్మన్ ఎవరనేది 16వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. వికారాబాద్ పుర వైస్ చైర్మన్ ఆశావహుల్లో హేమా హేమీలు -
కాంగ్రెస్కు జై
తాండూరు: రెండు దశాబ్దాల తర్వాత తాండూరు మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ వశమైంది. పట్టణ పరిధిలోని 36 వార్డులు.. 77,025 మంది ఓటరు్ల్ ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో 52,025 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్కు 21,647 ఓట్లు, బీఆర్ఎస్కు 18,608, బీజేపీకి 5,212, ఎంఐఎం పార్టీకి 3,723 ఓట్లు పడ్డాయి. 2020 ఎన్నికల్లో బీజేపీకి 7,582 ఓట్లు రాగా ఈ సారి 5,212 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఎంఐఎం పార్టీకి 7,199 ఓట్లు రాగా ఈ సారి 3,723 ఓట్లు వచ్చాయి. మెజార్టీ స్థానాలు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనుంది. 2005లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్కు వచ్చాయి. అప్పట్లో చైర్మన్గా పీ లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సార్లూ కాంగ్రెస్కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. 2014లో 10 వార్డులకే పరిమితమైంది. 2020లో కేవలం నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలుపొంది చైర్మన్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. -
ప్రజల రుణం తీర్చుకుంటా
అనంతగిరి: ‘మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారు.. భారీ మెజారిటీతో గెలిపించారు.. వారి రుణం తీర్చుకునే సమయం వచి్చంది.. పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటించా.. ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యం.. నాన్న స్పీకర్ ప్రసాద్కుమార్ సహకారం.. ప్రభుత్వ అండదండలతో పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం’ అని 17వ వార్డు కౌన్సిలర్.. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అనన్య అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మీ విజయానికి దోహదం చేసిన అంశాలు? కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే నా విజయానికి దోహదం చేశాయి. 17వ వార్డు ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారు. నాన్న ఆశీర్వాదం ఫలించింది. అందరి ఆదరణతోనే విజయం సాధించా. ఏయే సమస్యలు గుర్తించారు? వార్డుల్లో పర్యటించినప్పుడు పలు చోట్ల డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య ఉన్నట్లు గుర్తించాం. తొలుత వీటి పరిష్కారానికి కృషి చేస్తాం. అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏంటీ? వికారాబాద్ పట్టణంపై పూర్తి అవగాహన ఉంది. నాన్న రాజకీయాల్లో ఉండటంతో చాలా నేర్చుకున్నా.. మున్సిపల్, ప్రభుత్వ నిధులతో వికారాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. -
కాంగ్రెస్ మ్యాజిక్!
మున్సిపల్ ఎన్నికల్లో పైచేయివికారాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ పైచేయి సాధించింది. బీఆర్ఎస్ సైతం గట్టి పోటీ ఇచ్చింది. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో శుక్రవారం ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. నాలుగింట రెండు చోట్ల కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. వికారాబాద్, పరిగిలో హంగ్ ఏర్పడింది. జిల్లాలో మొత్తం 100 వార్డులు ఉండగా ఏకగ్రీవం అయిన రెండు వార్డులతో కలిపి కాంగ్రెస్ 54 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ 32 వార్డుల్లో.. ఏడు చోట్ల బీజేపీ, మూడు వార్డుల్లో ఎంఐఎం, నాలుగు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. మొత్తం 12 వార్డులకు గాను 10 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. వికారాబాద్, తాండూరులోనూ చైర్పర్సన్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను దాటింది.పరిగిలో 18 వార్డులు ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఎనిమిది చోట్ల విజయం సాధించగామరో రెండు వార్డుల్లో స్వతంత్రలు సత్తా చాటారు. దీంతో హంగ్ ఏర్పడింది. ఇక్కడ స్వతంత్రులు మద్దతిచ్చిన వారే చైర్పర్సన్ కానున్నారు. వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి స్పీకర్ ప్రసాద్కుమార్ కూతురు గడ్డం అనన్యజిల్లాలోనే అత్యధికంగా 1,057 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప బీజేపీ అభ్యర్థి దయాకర్పై గెలుపొందారు. రోజంతా ఉత్కంఠే ఓట్లు లెక్కించినంత సేపు అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకుల్లో ఉత్కంఠ కనిపించింది. కొడంగల్ మినహా పరిగి, వికారాబాద్, తాండూరులో ఫలితాలు దోబూచులాడాయి. పరిగి మొదటి రౌండ్లో నాలుగు వార్డులను బీఆర్ఎస్ సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. రెండో రౌండ్లో ఫలితాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ ఆధిక్యతను కనబర్చింది. మూడో రౌండ్లో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంది. చివరకు చెరో ఎనిమిది వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వికారాబాద్ మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొందింది. రెండో రౌండ్లోనూ హవా కొనసాగింది. మూడో రౌండ్లో బీఆర్ఎస్ పుంజుకుంది. బీజేపీ సైతం నాలుగు వార్డు స్థానాల్లో గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ ఆధిపత్యానికి కాస్త గండి పడింది. తాండూరులో మొదట బీఆర్ఎస్ ఆధిక్యతను చాటగా.. రెండు, మూడు రౌండ్లలో కాంగ్రెస్ పుంజుకొని చైర్మన్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. పరిగిలో ఉద్రిక్తత పరిగిలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. చివరకు చెరో ఎనిమిది వార్డులు కై వసం చేసుకోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. గెలుపొందిన ఇద్దరూ బీఆర్ఎస్ రెబల్స్ కావడంతో ఒకరు ముందుగానే ఆ పార్టీ ముఖ్యనేతలతో వెళ్లి పోయారు. మరో అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. పరిగి, వికారాబాద్, కొడంగల్లో స్పష్టమైన మెజారిటీతో చైర్పర్సన్ పీఠాలు దక్కించుకుంది. తాండూరు ఇతర పార్టీల మద్దతులో చైర్పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అధికార పార్టీకి ఓటర్లు జై కొట్టారు. మూడింట స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. పరిగిలో మాత్రం సగం సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాండూరులో గత ఎన్నికల్లో బీజేపీకి 8, ఎంఐఎంకు 4 వార్డులు రాగా.. ఈ సారి రెండు పార్టీలు చితికిల పడ్డాయి. బీజేపీ మూడింటికి పడి పోగా.. ఎంఐఎం ఒక్క వార్డుకే పరిమితమైంది. గతంలో వికారాబాద్లో ఒకే వార్డుకు పరిమితమైన బీజేపీ ఈ సారి అనూహ్యంగా పుంజుకొని నాలుగు వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. నాలుగు మున్సిపాలిటీల్లో విజయోత్సవాలు మిన్నంటాయి. పార్టీల వారీగా గెలుపొందిన అభ్యర్థులుమున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం స్వతంత్రులు కొడంగల్ 12 10 01 00 01 00 పరిగి 18 08 08 00 00 02 తాండూరు 36 19 12 03 01 01 వికారాబాద్ 34 17 11 04 01 01 మొత్తం 100 54 32 07 03 04 -
అభివృద్ధే మా నినాదం
కొడంగల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ కొడంగల్: మున్సిపల్ పరిధిలోని 12 వార్డులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ పురపాలిక సంఘం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ అన్నారు. నాలుగో వార్డు నుంచి విజయం సాధించిన ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ప్రశ్న: మీ విజయానికి ఏయే అంశాలు కలిసొచ్చాయి? జవాబు: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి సీఎం రేవంత్రెడ్డి చేసిన అభివృద్ధి పనులే కారణం. పట్టణ పరిధిలో రూ.100 కోట్లతో అనేక పనులు జరుగుతున్నాయి. ప్రజలు మెచ్చి 10 మంది అభ్యర్థులను గెలిపించారు. ప్ర.: మీ వార్డులో గుర్తించిన సమస్యలు ఏంటి? జ.: పట్టణంలోని గాంధీనగర్ తోపాటు గుండ్లకుంట గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లను గుర్తించాం. త్వరలో అంతర్గత రోడ్లు, మురు గు కాల్వల నిర్మాణం చేపడతాం. ప్ర.: తొలి ప్రాధాన్యత దేనికి ? జ.: పాలక మండలి ప్రమాణ స్వీకా రం చేసిన వెంటనే ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రఽ దాన సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కరిస్తాం ప్ర.: మీరు ఇచ్చిన హామీలు ఏంటి? జ.: అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పిస్తాం. విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్ర.: ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? జ.: రానున్న రెండేళ్లలోపు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. అన్ని సమస్యలు తీరుస్తాం. -
పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
డీఎల్పీఓ సంధ్యారాణి మోమిన్పేట: పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని డీఎల్పీఓ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎన్కతల గ్రామాన్ని ఆమె సందర్శించారు. జీపీ రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే జిల్లా అధికారుల దృష్టికి తేవాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టి వర్షాకాలం నాటికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీఎం కోఆర్డినేటర్ లక్ష్మి, కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఫార్మా రంగంలో అపారమైన అవకాశాలు తుర్కయంజాల్: ఫార్మా రంగంలో విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కుమార్ మొలుగారం అన్నారు. తుర్కయంజాల్లోని సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఒక్కరోజు ఇండో–గల్ఫ్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్మా విద్యార్థుల్లో పరిశోధన సామర్థ్యం పెరగాలని, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం రాఘవ రెడ్డి, సుధీర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆమనగల్లు: మామిడిలో సరైన మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేశ్ అన్నారు. ఆకుతోటపల్లి రైతు వేదికలో శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రూట్ కవర్ వాడటం ద్వారా పండు ఈగ, వడగల్ల నుంచి కాయలను రక్షించుకోవచ్చన్నారు. ఎకరాకు 8వేల ఫ్రూట్ కవర్లను ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీపై అందజేస్తోందని వివరించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకృష్ణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఉద్యానశాఖ అధికారి సౌమ్య, అధికారులు శశిధర్, ప్రభు, భూదేవి, శ్రవణ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధి నివారణకు ప్రత్యేక చొరవ అబ్దుల్లాపూర్మెట్: కుష్టువ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని, వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందకుండా చికిత్సతో పాటు జాగ్రత్తలు తీసుకుంటే నయం అవుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి, డీఎల్ఓ డాక్టర్ పాపారావు అన్నారు. పెద్దఅంబర్పేటలోని శాంతినగర్ లెప్రసీ కాలనీలో శుక్రవారం నిర్వహించిన కుష్టువ్యాధి నివారణ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాధి గ్రస్తులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వారికి కావాల్సిన ఎంసీఆర్ చెప్పులు, సెల్ఫ్ కేర్ కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ష్లాప్ అధ్యక్షుడు రమేష్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఎంఓ డాక్టర్ ప్రియాంక, పీఎంఓ సులోచన, సీహెచ్ఓ లక్ష్మీనారాయణ, డీపీఎంఓ శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు. -
రణరంగంగా పరిగి
పరిగి: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. పరిగి పట్టణ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెరో 8 వార్డులు వచ్చాయి. దీంతో హంగ్ ఏర్పడింది. ఇద్దరు స్వతంత్రలు గెలుపొందారు. మొదటి వార్డు(నస్కల్) నుంచి కుర్వ అక్కమ్మ, మూడో వార్డు(నజీరాబాద్ తండా) నుంచి హన్మంతు భారీ మెజారిటీతో విజయం సాధించారు. వీరు బీఆర్ఎస్ రెబల్స్గా పోటీ చేసి విజేతలుగా నిలిచారు. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే వీరి మద్దతు తప్పనిసరి. వీరిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడ్డాయి. ఈ క్రమంలో నేతల మధ్య వాగ్వాదం, గొడవలు చోటుచేసుకున్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గెలుపొందిన ఇద్దరు స్వతంత్రలు తమ పార్టీకి చెందిన రెబల్స్ అని.. అన్యాయంగా పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసుల, గులాబీ పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నార ని ఆరోపించారు. బీఆర్ఎస్కు మద్దతిస్తామన్న వారిని కాంగ్రెస్ అండదండలతో బలవంతంగా తీసుకెళ్లడం దారుణమన్నారు. ఇదిలా ఉండగా మూడో వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన హన్మంతు.. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి అక్కడి నుంచి పోలీస్ వాహనంలో వెళ్లిపోయారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ కుర్వ అక్కమ్మ (స్వతంత్ర)ను బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె కుమారుడు బాల్రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. -
వెల్లివిరిసిన భక్తిభావం
దుద్యాల్: పోలేపల్లిలో స్వయం భూగా వెలిసిన రేణుక ఎల్లమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. శుక్రవారం భక్తులు అమ్మవారికి బోనాలు, కోడి పుంజులు సమర్పించారు. ఎల్లమ్మ దర్శనం కోసం తండోప తండాలుగా తరలివచ్చారు. గంటల కొద్ది క్యూలో ఉన్నారు. తెలంగాణ జిల్లాలతో పా టు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ రాజేందర్రెడ్డి, చైర్మన్ వెంకటేశ్ పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి దర్శించుకున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. నేత్రపర్వంగా సిడె వరాల తల్లి.. పోలేపల్లి రేణుక ఎల్లమ్మ సిడె వేడుక శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. శివసత్తుల శిగాలు, పోతురాజుల నృత్యాలు ఆకట్టుకు న్నాయి. సిరుల తల్లి.. రేణుక ఎల్లమ్మ రావమ్మా అంటూ భక్తులు వేడుకున్నారు. ఒగ్గుడోలు చప్పుళ్లతో జాతర ప్రాంగణం మార్మోగింది. గవ్వలు, పసుపు బండారు కలిపి సిడైపె చల్లారు. జాతర ప్రాంగణం జన సంద్రంగా మారింది. వికారాబాద్, నారాయణపేట్, నాగర్కర్నూల్ జిల్లాల పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నేడు(శనివారం) రథోత్సవం ఉంటుందని ఆలయ ఈఓ రాజేందర్రెడ్డి తెలిపారు. గురువారం సిడెకు తొట్టెల కట్టి ఉత్సవ మూర్తిని అందులో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. జన సంద్రం.. సిడె మహోత్సవం -
పండ్ల తోటలకు ప్రభుత్వ ప్రోత్సాహం
మోమిన్పేట: పండ్ల తోటలకు ఉపాధి హామీ పథ కం కింద ప్రోత్సహిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని మొరంగపల్లి పాఠశాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, మోమిన్పేటలో రైతు చారి సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించి మాట్లాడారు. ఉపాధి పథకం కింద తోటల పెంపకానికి నిధులు ఇస్తామన్నారు. జామ, మామిడి, డ్రాగన్ ఫ్రూట్, రేగు, అరటి, బొప్పాయి తదితర తోటలకు అవకాశం ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.60 వేల వరకు ఉపాధి నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్బీఎం ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. అందుకు రూ.12 వేలు వస్తాయన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలు సరిపోని పక్షంలో మండల మహిళా సమాఖ్య, గ్రామ సమాఖ్య, బ్యాంకు, సీ్త్రనిధి నుంచి రుణంఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సృజన సాహిత్య, ఏపీఓ శంకర్, ఈసీ వికాస్, టీఏలు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
జానపద కళాకారుల సంక్షేమమే ధ్యేయం
● టీఆర్జేకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్గౌడ్ ● సంఘం జిల్లా కమిటీ ఎన్నిక పరిగి: జానపద కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నిరంతరం పని చేస్తోందని ఆసంఘం(టీఆర్జేకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండల పరిధిలోని శ్రీసత్యసాయి మందిరంలో గురువారం సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవ, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లా కమిటీ చేస్తున్న పనులను ప్రశంసించారు. సంఘం నూతనంగా అమలు చేయబోతున్న సంక్షేమ నిధి వివరాలను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు విజయశ్రీ వివరించారు. సంఘం బలోపేతానికి మరింత కృషి చేయాలని రాష్ట్ర కమిటీ ప్రతినిధి కవిత సూచించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.కృష్ణయ్య ఈమేరకు జిల్లాలోని 15జానపద కళారూపాలున్న అందరిని చేర్చి అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా పరిగి వెంకటేశ్, కోశాధికారిగా కొడంగల్ నరేశ్, ఉపాధ్యక్షులుగా వెంకటయ్య, హన్మయ్య, చిన్నయ్య, సంసయుక్త కార్యదర్శులుగా వెంకటయ్య బసప్ప రాములు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా వెంకటయ్య, నర్సింలు, అనంతయ్య, ప్రచార కార్యదర్శులుగా రఘు, శివకుమార్, రాములు, చెన్నయ్య, ముఖ్య సలహాదారులుగా గంజిపల్లి పెద్ద రాములు, మల్లేశం, వెంకట్రెడ్డి ఎన్నికయ్యారు. అధ్యక్షురాలిగా శోభారాణి దోమ మండలం కిష్టాపూర్కు చెందిన శోభారాణి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానకార్యదర్శిగా ధారూరుకు చెందిన సీహెచ్ లలిత, కోశాధికారిగా తులసి, గౌరవ అధ్యక్షురాలిగా మాధవి, ఉపాధ్యక్షురాళ్లుగా రజిత, అంజిలి, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్ స్వప్న, కార్యనిర్వహణ కార్యదర్శులుగా వినోద, మంజుల, అపురూప, ప్రచార కార్యదర్శులుగా లావణ్య, అనురాధ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి రంగాపూర్ వ్యవస్థాపకులు వెంకట్రెడ్డి, నిర్వహకులు చిన్నయ్య ఆయా మండలాల ప్రతనిధులు మెట్లకుంట వెంకటయ్య, అనంతయ్య, హన్మయ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫలితం కోసం.. ఉత్కంఠ
అనంతగిరి: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ నేటితో పరిసమాప్తం కానుంది. వారం పది రోజులుగా జిల్లాలోని నాలుగు పురపాలక పరిధి వార్డుల్లో జోరుగా ప్రచారం సాగింది. అనంతరం ఈ నెల 11న పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లో భద్రంగా దాగుంది. శుక్రవారం ఉదయం లెక్కింపు ప్రారంభం కానుండగా.. ఫలితాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. విజయం మాదేనంటూ.. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 7 గంటలకు చేపట్టినా.. లెక్కింపు మాత్రం 8 గంటలకు ప్రారంభయ్యే అవకాశం ఉంది. ఫలితాలు వచ్చేందుకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ప్రక్రియలో ఏదైనా ఆటంకం కలిగితే.. ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమయ్యే ఆస్కారం లేకపోలేదు. 3 విడతల్లో కౌంటింగ్ ఓట్ల లెక్కింపు మూడు విడతలుగా చేసి, ఫలితాలు వెల్లడించానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో విడతకు 12 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏ విడతలో ఏ వార్డు కౌంటింగ్ జరుగుతుందో ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి విడత: 2, 4, 7,10,13, 16, 19, 22, 25, 28, 31, 33. రెండో విడత: 3, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29, 32, 34. మూడో విడత: 6, 9, 12, 18, 21, 24, 27, 30. ఎవరి ధీమా వారిదే గెలుపోటములపై అభ్యర్థుల అంచనాలు మధ్యాహ్నం 3 గంటల లోపు లెక్కింపు పూర్తి విజయం ఎవరిని వరించేనో32 వార్డులకు.. 112 మంది వికారాబాద్ మున్సిపాలిటీ పరిధి 34 వార్డుల్లో 2 (1, 15 )ఏకగ్రీవం కాగా, 32 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీల నుంచి 112 మంది బరిలో నిలవగా.. అందులోంచి 32 మంది విజేతలు ఎవరో నేటి మధ్యాహ్నం వెలువడనుంది. కాగా లెక్కింపు విషయమై ఎన్నికల అధికారులు గురువారం కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, అభ్యర్థులకు గుర్తింపు కార్డు తదితర వాటిని సిద్ధం చేశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ ప్రక్రియను పర్యవేక్షించి, పలు సూచనలు చేశారు. లెక్కింపు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. ఈయన వెంట మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి తదితరులు ఉన్నారు. -
భూసేకరణ.. ఆందోళన!
యాచారం: భూసేకరణ అన్నదాతల్లో కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఫ్యూచర్సిటీ, హైస్పీడ్ రైల్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణాల పేరుతో ఎప్పుడు.. ఏ గ్రామంలోని భూమిని సేకరిస్తుందోనని ఆందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీకి యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరించడానికి నిర్ణయించి 14,500 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఆ భూముల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ నిర్మాణానికి సంకల్పించింది. మరో నాలుగు వేల ఎకరాల భూమి పరిహారం అథారిటీలో జమ చేయడం, కోర్టు కేసులతో వివాదం నెలకొంది. ఏళ్లుగా భూములను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న రైతులకు భూసేకరణతో ఉపాధి కోల్పోతామనే భయం పట్టుకుంది. అనువైన భూములు ఉన్నందునే.. ఫ్యూచర్సిటీకి యాచారం మండలంలోనే అనువైన భూములున్నట్లు అధికారులు గుర్తించారు. మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, చింతుల్ల, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతపట్ల, నల్లవెల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు అధికంగా ఉండడం భూ సేకరణకు కలిసొస్తోంది. ఇప్పటికే మొండిగౌరెల్లిలో 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్లు వేయగా, కొత్తపల్లిలో 2,200 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమి సేకరణకు సర్వే చేసి, హద్దులు పాతి, గ్రామసభ ఏర్పాటు చేశారు. నందివనపర్తిలోని దేవాలయానికి చెందిన 1,100 ఎకరాల భూమిని సేకరించడానికి నిర్ణయించారు. యాచారం, చింతుల్ల, నల్లవెల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లో మరో పది వేల ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిని సేకరించడానికి అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూమితో పాటు డీటీసీపీ వెంచర్ చేసిన భూమికి నోటిఫికేషన్ వేశారు. ఇంత వరకు పరిహారం తేల్చ లేదు. –కోలన్ మల్లారెడ్డి, రైతు, మొండిగౌరెల్లి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ముందుకు వెళ్తున్నాం. పరిహారం ఇచ్చే అంశం సర్కార్ పరిధిలో ఉంటుంది. – అయ్యప్ప, తహసీల్దార్, యాచారం అసైన్డ్, పట్టా భూముల సేకరణపై సర్కార్ నజర్ ఫ్యూచర్సిటీ, హైస్పీడ్ రైల్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం.. కంటికి కునుకు లేకుండా గడుపుతున్న రైతులు -
శివాజీ విగ్రహం ఏర్పాటులో ఉద్రిక్తత
మహేశ్వరం: ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వివాదానికి కారణమైంది. మహేశ్వరం మండల కేంద్రంలో డా.బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రామ్ చౌరస్తాలో స్థానిక బీజేపీ నాయకులు వీధి లైట్లు, సీసీ కెమెరాలు బంద్ చేసి శివాజీ విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి ఏర్పాటు చేసేందుకు యత్నించారు. క్రైన్ సహాయంతో విగ్రహాన్ని దించుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని నాయకులకు చెప్పారు. అర్ధరాత్రి లైట్లు, సీసీ కెమెరాలు బంద్ చేసి విగ్రహం పెట్టడం సరికాదన్నారు. అప్పటికే విగ్రహం ఏర్పాటు చేయడంతో గురువారం ఉదయం విషయం తెలుసుకున్న దళిత సంఘాలు నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల పక్కన శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. తాము ఛత్రపతి శివాజీకి వ్యతిరేకం కాదని చెప్పారు. కాకపోతే వేరే అనువైన చోట పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం పక్కన శివాజీ ప్రతిమ ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని శివాజీ విగ్రహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం జరుగుతున్న శివగంగ రాజరాజేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాక గ్రామ పాలకవర్గం ఆమోదంతో శివాజీ విగ్రహానికి అనువైన చోటు నిర్ణయించనున్నారు. ఈలోపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మహేశ్వరం జోన్ అడిషనల్ డీసీసీ సత్యనారాయణ, ఏసీపీలు జానకిరెడ్డి, రాజు, సీఐ వెంకటేశ్వర్లు భారీగా పోలీసులను మోహరించారు. విద్వేషాలు, హింసను ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. -
ఆడారు.. సత్తాచాటారు
● సీఎం కప్లో క్రీడాకారుల ప్రతిభ ● 38 విభాగాల్లో జరిగిన పోటీలు ● రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధమైన విజేతలు హుడాకాంప్లెక్స్: శారీరక ధృడత్వానికే కాదు.. మానసికోల్లాసానికి తోడ్పడే క్రీడా పోటీలకు ప్రస్తుతం ప్రాధాన్యత పెరుగుతోంది. యువత పలు అంశాల్లో తమ ప్రతిభ చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి కప్–2026 పేరుతో పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా జనవరి 17 నుంచి 18 వరకు మండల స్థాయి, ఈనెల 9 నుంచి 12 వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు సరూర్నగర్ స్టేడియం వేదికై ంది. 8 నియోజకవర్గాలు.. 1,500 మంది క్రీడాకారులు జిల్లాలోని ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు చెందిన సుమారు 1,500 మంది యువ క్రీడాకారులు 38 అంశాల్లో పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. బాలురు, బాలికల విభాగంలో విజేతలుగా, రన్నర్స్గా నిలిచారు. వీరంతా ఈనెల 20 నుంచి 24 వరకు గచ్చిబౌలి స్టేడియం కేంద్రంగా నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. జిల్లా స్థాయి విజేతలు వీరే.. అభినందనీయం క్రీడాకారుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగ పడతాయి. ప్రభుత్వం సీఎం కప్ పేరుతో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహించడం అభినందనీయం. రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు పాల్గొని విజయం సాధించాను. ఐదు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలన్నదే తపన. – వేదాన్ష్, చెస్ జాతీయ క్రీడాకారుడు విజయవంతంగా నిర్వహించాం జిల్లా స్థాయి సీఎంకప్ 2026 పోటీలు విజయవంతంగా నిర్వహించాం. విజేతలు ఈనెల 20నుంచి గచ్చిబౌలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. యువ క్రీడాకారులు ఉత్సహంగా పాల్గొనడం అభినందనీయం. ప్రతి విద్యార్థి నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలి. అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి. అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. – వెంకటేశ్వర్ రావు, జిల్లా యువజన క్రీడాధికారి -
ఎల్లమ్మా.. సల్లంగ చూడమ్మా..
● పోలేపల్లి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● భక్తిశ్రద్ధలతో చక్రస్నానం.. పల్లకీ సేవ ● నేటి సాయంత్రం సిడె వేడుక దుద్యాల్: జగజ్జనని పోలేపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. తొలి రోజు కోనేరు నుంచి జల్దిబిందెలలో నీరు తెచ్చి గ్రామంలోని పూర్వ ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి చక్రస్నానం నిర్వహించారు. అక్కడి నుంచి ప్రధాన ఆలయం వరకు డప్పు చప్పుళ్లు. డోలు వాయిద్యాల నడుమ పల్లకీ సేవ సాగింది. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం సిడె నేటి సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. సిడెకు తొట్టెల కట్టి.. పూలు, నిమ్మకాయలతో అందంగా అలంకరిస్తారు. లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ ఈఓ రాజేందర్ రెడ్డి, చైర్మన్ ముచ్చటి వెంకటేశ్ తెలిపారు. కొడంగల్ సీఐ శ్రీధర్రెడ్డి, ఆరుగురు ఎస్ఐలు, 50 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. జాతరను పురస్కరించుకుని శుక్రవారం మండలం వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎంఈఓ శంకర్ తెలిపారు. -
ఫలితాలపై ఉత్కంఠ
● గెలుపోటములపై జోరుగా చర్చ ● ఎవరి అంచనాలు వారివే ● నేడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు కొడంగల్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బుధవారం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు అంచనాల్లో మునిగిపోయారు. విజయం వరిస్తుందో లేదోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విజయంపై అయోమయం నెలకొందని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయినా ఎవరి అంచనాల్లో వారున్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. 34 మంది అభ్యర్థులు పోటీ చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 75 శాతం పోలింగ్ జరిగింది. 11,565 మంది ఓటర్లు ఉండగా అందులో 8,760 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4,369 మంది పురుషులు, 4,391 మంది మహిళలు ఓటు వేశారు. బరిలో 34 మంది కొడంగల్ మున్సిపల్ బరిలో 34 మంది అభ్యర్థులు ఉన్నారు. 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, ఇద్దరు ఎంఐఎం, ఒకరు సీపీఐ(ఎమ్), 8 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. మొదటి వార్డులో జగదీశ్వర్రెడ్డి(కాంగ్రెస్), గుల్షన్(ఎవఐఎవ), రెండో వార్డులో ఊట్కూర్ మంజుల(కాంగ్రెస్), వాణిశ్రీ యాదవ్ (బీఆర్ఎస్), మూడో వార్డులో గొల్ల లక్ష్మమ్మ(కాంగ్రెస్), సోన (బీఆర్ఎస్), నాలుగో వార్డులో నందారం ప్రశాంత్ (కాంగ్రెస్), బాల్రాజ్ (బీఆర్ఎస్), ఐదో వార్డులో బాలమ్మ (కాంగ్రెస్), శ్యామమ్మ (బీఆర్ఎస్), ఆరో వార్డులో సయ్యద్ హమీద్ అలీ (కాంగ్రెస్), గంటి సురేష్కుమార్ సీపీఐ(ఎం), పవన్కుమార్ లాహోటీ, మహ్మద్ అలీ స్వతంత్ర అభ్యర్థులు, ఏడో వార్డులో కష్ణంరాజు (కాంగ్రెస్), మహేష్ బాబు (బీజేపీ) కె.వెంకటయ్య (స్వతంత్ర), 8వ వార్డులో శంకర్ (కాంగ్రెస్), కిషన్ (బీఆర్ఎస్), పూజ, వనితా స్వతంత్ర అభ్యర్థులు. 9 వార్డులో గంట మంజుల (కాంగ్రెస్), అమీనా బేగం (బీఆర్ఎస్), సన ఆప్రీనా (ఎంఐఎం), 10వ వార్డులో రాజశేఖర్ (కాంగ్రెస్), చంద్రశేఖర్ (బీఆర్ఎస్), 11వ వార్డులో అనిత (కాంగ్రెస్), మంజుల (బీఆర్ఎస్), లక్ష్మీ (బీజేపీ), 12వ వార్డులో సుష్మ (కాంగ్రెస్), లలిత (బీఆర్ఎస్), అంజిలమ్మ, బుడ్డ శ్రావణి, మాల శ్రావణి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చూడాలి. -
కౌన్సిలర్లు!
పోటీలో 341 మంది గెలుస్తామంటూనే.. కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి పటిష్ట భద్రత నడుమ.. తాండూరు: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో ఓట్ల లెక్కించనున్నారు. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 135 మంది తలపడ్డారు. 12 మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉంటారు. 12 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బంది మూడు విడతల్లో ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు ఇద్దరు ఆర్ఓలు, ఏఆర్ఓలు, ముగ్గురు కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. ప్రతి రౌండ్లో 12 వార్డుల ఫలితాలు వెల్లడిస్తారు. పరిగి: పట్టణంలోని నంబర్ వన్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో రౌండ్లో ఆరు వార్డుల ఫలితాలు వస్తాయని కమిషనర్ వెంకటయ్య తెలిపారు. మొత్తం 24 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని.. ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపునకు ఇద్దరు సిబ్బంది, ఆర్ఓ విధుల్లో ఉంటారని చెప్పారు. 135 పోస్టల్ బ్యాలెట్లకు గాను 109 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ముందుగా వీటినే లెక్కిస్తారు.పుర పోరులో విజేతలెవరో.. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం పైకి ధీమా.. లోపల గుబులు ఎవరి లెక్కలు వారివే పార్టీల వారీగా సమీక్షలు నేడే కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి -
ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం వికారాబాద్లో సీఐటీయూ, బీఆర్టీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, ఏఐకేఎస్, ఇద్వా, ఏఐకేఎంఎస్ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. భవన నిర్మాణ, హమాలీ, ట్రాన్స్పోర్టు కార్మికులకు రూ.10వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీపీఐ కార్యదర్శి గోపాల్రెడ్డి, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు గీత, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి మహేందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఐద్వా జిల్లా కార్యదర్శి అనసూయ, కేవీపీఎస్ జిల్లా నాయకులు నవీన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్ -
సర్పంచ్ సస్పెన్షన్ అన్యాయం
● కలెక్టర్ ఉత్తర్వులను ఉప సంహరించుకోవాలి ● గిరిజన సంఘాల నేతల డిమాండ్ పంజగుట్ట: మోకిలతండా సర్పంచ్ శాంతమ్మను సస్పెండ్ చేయడం అన్యాయమని, కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉప సంహరించుకోవాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి గౌరవాధ్యక్షుడు బానోతు మంగీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని స్పష్టంచేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్ చౌహాన్, తొలగింపునకు గురైన సర్పంచ్ శాంతాబాయితో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12వేల మంది సర్పంచ్లు ఉండగా ఎలాంటి కారణం లేకుండా ఒక గిరిజన మహిళా సర్పంచ్ను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న సర్పంచ్ను కేవలం పంచాయతీ పరిధిలో చెట్లను తొలగించారన్న కారణంతో పదవి నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై గిరిజన మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి స్పందించి వెంటనే సస్పెన్షన్ను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాంతమ్మ మాట్లాడుతూ.. తనపై కక్షగట్టి ఇలా చేశారన్నారు. తాను ఎంతో కష్టపడి ఇండిపెండెంట్గా గెలిచానని, సస్పెన్షన్ను రద్దు చేసి, న్యాయం చేయాలని కోరారు. -
26న శ్రీవారి బాలాలయ ప్రతిష్ఠాపన
కొడంగల్: కొడంగల్లోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26న శ్రీవారి బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు బుధవారం తెలిపారు. ఉదయం 9.10 నుంచి 10.20 నిమిషాలలోపు కార్యక్రమం జరుగుతుందన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు.నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహించడం కోసం శ్రీవారి బాలాలయాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు రోజలు పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. 23న ఆచార్య వచనం, మత్స సంగ్రహనం, అంకురార్పణ, 24న పుణ్యహ వచనం, వాస్తు హోమం, యాగశాల శుద్ధి, అగ్ని ప్రతిష్ఠ, కలశ ప్రతిష్ఠ, బాలాలయ శుద్ధి, 25న హోమాలు, అభిషేకం, నవ చతుర్ధశ కలష స్నపనం, మహాశాంతి, 26 పుణ్యవచనం, ఉక్త హోమాలు, మహా పుర్ణాహుతి, బాలాలయ ప్రవేశం, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ధర్మకర్తలు, అర్చకులు కోరారు. -
అన్ని ఏర్పాట్లు చేయండి
దుద్యాల్: పోలేపల్లిలో వెలసిన శ్రీరేణుక ఎల్లమ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో హెలిపాడ్ వద్ద జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశ్, ఈఓ రాజేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ నాయకులు మేరుగు వెంకటయ్య, ఆకారం వేణుగోపాల్, ఆలయ కమిటీ సభ్యులు నర్సిములు, ముని కుమార్, రాములు, వెంకటయ్య, మల్లేశం తదితరులు ఉన్నారు. -
మదర్ డెయిరీ జీఎంపై సస్పెన్షన్ వేటు
హయత్నగర్: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్ముల్ మదర్ డెయిరీ)లో చోటుచేసుకున్న పరిణామాలు ఇక్కడ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన జనరల్ మేనేజర్ కృష్ణ సస్పెన్షన్కు దారి తీశాయి. కృష్ణ అవకతవకలకు పాల్పడ్డారని, చైర్మన్కు చెప్పకుండా ఫైల్స్ టాంపరింగ్ (దిద్దడం) చేశారన్న ఆరోపణలపై ఇన్చార్జి ఎండీ లింగారెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డెయిరీ పరిధిలోని పాల శీతలీకరణ కేంద్రాలను పర్యవేక్షించకపోవడం, పాల విక్రేతలకు ట్రాన్స్పోర్ట్ కమీషన్ చార్జీలను ఏకపక్షంగా పెంచడం వంటి చర్యలతో డెయిరీకి తీవ్ర నష్టాలు వచ్చాయని సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఎండీ స్పష్టం చేశారు. బోర్డు నిర్ణయాలనే అమలు చేశాం మదర్ డెయిరీలో ఏ నిర్ణయమైనా పాలక మండలి ద్వారానే జరిగింది. వాటినే నేను అమలు చేశా అని జీఎం కృష్ణ తెలిపారు. సేల్స్ను పెంచేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారని, కమిటీ ప్రతిపాదించిన ధరలనే బోర్డు నిర్ణయించిందని, కమీషన్ పెంచడంతో సేల్స్ బాగా పెరిగిందన్నారు. ప్రస్తుత చైర్మన్ తమను చిల్లింగ్ సెంటర్ల తనిఖీకి వెళ్లనిచ్చే వారు కాదని స్పష్టంచేశారు. డెయిరీలో జరుగుతున్న కుర్చీల ఆటలో తనను బలిపశువును చేశారని, ఎలాంటి వివరణ తీసుకోకుండా, తనను సస్పెండ్ చేయడాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. -
పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత
అడిషనల్ డీసీపీ సత్యనారాయణ ఆమనగల్లు: మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మహేశ్వరం జోన్ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ బి.వి.సత్యనారాయణ చెప్పారు. ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో మంగళవారం మున్సిపల్ ఎన్నికల బందోబస్తు విధుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తు విధులపై సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. విధుల్లో సిబ్బంది ఎక్కడా అలసత్వానికి తావు ఇవ్వరాదని సూచించారు. సమావేశంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
హుడాకాంప్లెక్స్: జిల్లా స్థాయి సీఎం కప్–2026 క్రీడా పోటీలు మంగళవారం సరూర్నగర్ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగాయి. వాలీబాట్, బాక్సింగ్ పోటీల్లో సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్ బాలుర విభాగంలో కల్వకుర్తి టీం విజేతగా, షాద్నగర్ టీం రన్నర్గా నిలిచింది. బాలికల విభాగంలో కల్వకుర్తి టీం విజేతగా, ఇబ్రహీంపట్నం రన్నర్గా నిలిచాయి. విజేతలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎస్టేట్ ఆఫీసర్ పద్మావతి, జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకటేశ్వర్రావు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు. -
న్యాయం చేయాలని నిరసన
చేవెళ్ల: అడ్వకేట్ స్వప్న హత్యపై తక్షణం న్యాయం చేయాలని చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంగళవారం చేవెళ్ల బార్ అసోసియేషన్, సంగారెడ్డి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డిల పిలుపు మేరకు హైకోర్టు వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమాకంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి పోలీస్ భద్రత కల్పించకపోవటం, వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో చేర్చడం లాంటి నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో చేవెళ్ల న్యాయవాదులతోపాటు తెలంగాణ న్యాయవాదుల ఫెడరేషన్ సభ్యులు, బార్ కౌన్సిల్ మెంటర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా జర్నలిస్టులకూ తప్పని వేధింపులు
విశ్రాంత ఆచార్యులు పద్మజా షా బంజారాహిల్స్: భారతదేశంలో మహిళా జర్నలిస్టులకు చట్టపరమైన బెదిరింపులు, వృత్తిపరమైన ఒంటరితనం, ఆన్లైన్ ట్రోలింగ్ వేధింపులు తప్పడం లేదని ఓయూ జర్నలిజం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ పద్మజా షా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత పాత్రికేయులు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్.బషీరుద్దీన్ 90వ జయంతిని పురస్కరించుకుని వర్సిటీలో ‘జర్నలిజం– మహిళల ప్రభావం’అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. బషీరుద్దీన్ జర్నలిజం విభాగం భవిష్యత్తును ముందుచూపుతో గమనించి అభివృద్ధిబాటలో నడిపించారని, మహిళా జర్నలిస్టులను నిపుణులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. మహిళాజర్నలిస్టుల స్వతంత్ర అభిపాయాలకు అంతగా విలువ లేకుండా పాలకులు అడ్డుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని జాగృతం చేయడంలో మీడియా ఆశించిన మేర పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, జర్నలిజం విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్కుమార్ పోతన తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కటై కదులుదాం.. బాధ్యతను నిర్వర్తిద్దాం
షాద్నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. సకల సమస్యలకు పరిష్కారమార్గం.. నవభారత నిర్మాణానికి పునాది లాంటిది అంతటి ప్రాముఖ్యం ఉన్న ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు నిద్రాహారాలు మాని ప్రచారం చేసిన నేతల భవిత వ్యం బ్యాలెట్ పత్రం రూపంలో ఎన్నికల డబ్బాలో పదిలమవుతుంది. ఐదేళ్ల కాలానికి తమను పాలించేదెవరో ఓటరు దేవుడు నిర్ణయించబోతున్నారు. రాజకీయ పక్షాలతో పాటుగా ఈ ఎన్నికలు అధికార యంత్రాంగానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు పావులు కదిపితే.. పోలింగ్ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అధికారులు సిద్ధమయ్యారు. ఓటు పోటెత్తాలి ఒక్క ఓటుతోనే నాయకుల తలరాతలు మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటు విలువకు ఉన్న ప్రాధాన్యత, విలువ చాలా మందికి తెలియడం లేదు. పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గుతుంది. ఫలితంగా నిర్ణయాత్మక శక్తి తగ్గి పోతుంది. పల్లె ఓటర్లు చైతన్యం కనబరుస్తున్నా పట్టణ ప్రజలు పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి బద్దకిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం పెరిగితేనే ఓటు శాతం పెరుగుతుంది. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలి. ఒకటితో తారుమారు ఐదేళ్లకోసారి తమను పరిపాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం ఓటు రూపంలో లభిస్తుంది. ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎన్నికల ఫలితాల్లో ఒకటి, రెండు ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజల బాగోగులు పట్టించుకునే వారికి పదవి కట్టబెట్టి, మాయమాటలు చెప్పే వారికి బుద్ధి చెప్పే విలువైన వజ్రాయుధం ఓటు అని అందరూ గుర్తించాలి. ఓటు హక్కును ఉపయోగించుకొని భావితరాల అభివృద్ధికి బాటలు వేసే గురుతర బాధ్యతను స్వీకరించాలి. గెలుపు నీదే ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం ఓటు హక్కు ద్వారా కల్పించింది. నేతల భవిష్యత్తును ఓటు హక్కు ద్వారా తేల్చవచ్చు. సమర్థుడైన నేతను ఎన్నుకునే మార్గం ప్రజలకు ఓటు రూపంలో ఉంటుంది. మంచి నేత ను ఎన్నుకుంటే ఓటరుదే చివరికి గెలుపు అవుతుంది. అసమర్థుడిని, అవినీతి పరుడికి ఓటు వేస్తే ఓట మి ఓటరుదే అవుతుంది. ఓటర్లు చైతన్య వంతులై నేతలకు ఓటుతో కనువిప్పు కలిగించాలి. ప్రలోభాలను పటాపంచలు చేసి ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఐదేళ్ల పాలన సక్రమంగా సాగాలంటే మన చేతుల్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్నిగెలిపిద్దాం ఎన్నికలు అనే రణ రంగంలో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన సమయం ఆసన్నమైంది. పట్టణ ఓటర్లు తిరుగులేని నేతను పుర పాలకుడిగా ఎన్నుకోవాలి. అందరూ ఒక్కటై కదులుదాం.. ఎన్నికల పోరులో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుందా.. రండి.. కదలిరండి.. ఓటింగ్లో పాల్గొందాం... వందశాతం పోలింగ్ నమోదు చేద్దాం. చైతన్యంతోనే పోలింగ్ శాతం పెరుగుదల పుర ఎన్నికల్లో అంతిమ తీర్పు ఓటరుదే మార్మోగిన సోషల్ మీడియా శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికలకు 48గంటలకు ముందే మైకులు మూగబోయాయి. అయితేనేం సోషల్ మీడియా ఉంది కదా. అభ్యర్థులు చివరి రెండు రోజులు సోషల్ మీడియాని ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు. తాము గెలిచేందుకు విరివిగా ఎడిట్ చేసిన ప్రచార వీడియోలు, పాటలు, కరపత్రాలను పెద్ద ఎత్తున వాట్సాప్, ఇన్స్ట్రాగాం, ఎక్స్, ఫేస్బుక్లలో పోస్ట్ చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో తేలాల్సి ఉంది. -
ఉరుకులు.. పరుగులు
సుభాష్నగర్: గాజులరామారంలోని మెట్కానిగూడ పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది. మంగళవారం ఉదయం 10. 20 గంటల సమయంలో మెట్కానిగూడ, హెచ్ఏఎల్, ఓక్షిత్ ఎన్క్లేవ్, ఆదర్శనగర్ కాలనీలలో ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించడంతో అపార్ట్మెంట్లు, ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. గేటెడ్ అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గుంపులుగా చేరారు. భూమి కంపించడంతో స్థానిక పాఠశాలలకు యాజమాన్యాలుసెలవు ప్రకటించాయి. కొద్దిసేపటి దాకా ఇళ్లలోకి పోయేందుకు స్థానికులు భయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు భూకంపమా..? లేక ఇతర పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్దమా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. చివరికి ఏ విషయమూ అంతు చిక్కలేదని సూరారం సీఐ సుధీర్కృష్ణ తెలిపారు. ప్రగతి నగర్లోని ఇన్కాయిస్ అధికారులకు సంప్రదించగా.. ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని పేర్కొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
● 14 నుంచి మైసిగండికాశీవిశ్వనాథస్వామి ఉత్సవాలు ● ధ్వజారోహణంతో వేడుకలకు అంకురార్పణకడ్తాల్: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మైసిగండి పరిధిలో కొలువైన శివాలయంలో ఈనెల 14 నుంచి నిర్వహించనున్న కాశీ విశ్వనాథస్వామి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ కాశీవిశ్వనాథస్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇవి శనివారం ప్రారంభమై సోమవారం వరకు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జిల్లాతో పాటు సమీప జిల్లాల నుంచి భక్తులు తరలిరానుండటంతో శివాలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరిస్తున్నారు. అందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మైసిగండిలో ప్రస్తుత శివాలయ, రామాలయ క్షేత్రాలు రుగ్వేద కాలంలో గంగా గుళ్లుగా పిలువబడేదని ఆలయ చరిత్ర తెలుపుతోంది. ఆలయాల్లో గోల్కొండ నవాబుల కాలంలో అక్కన, మాదన్నల మహామంతుల్రుగా ఉన్న సమయం నుంచి పూజలు జరిగేవి. తర్వాతి కాలంలో ఆలయాన్ని వైభవంగా పునర్నిర్మించారు. కార్యక్రమాల వివరాలు ఉత్సవాల్లో మొదటిరోజు శనివారం విఘ్నేశ్వరపూజ, ధ్వజారోహణం, మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, 15వ మహాశివరాత్రిని పురస్కరించుకొని శివపార్వతుల కల్యాణ మహోత్సవం, రాత్రికి ప్రత్యేక అభిషేకం, అనంతరం రథోత్సవం, 16న స్వామివారికి ఏకాదశ కలశాభిషేకం, వసంతోత్సవం, పూర్ణహూతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో స్నేహలత, ఆలయ ట్రస్టీ శిరోలీ పేర్కొన్నారు.ఇబ్బంది కలగనీయం మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మైసిగండి శివాలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు తాగునీటి వసతి, సౌకర్యాలను కల్పిస్తున్నాం. మూడు రోజుల పాటు నవగ్రహ, గణపతి హోమం నిర్వహిస్తారు. – స్నేహలత, ఈఓ, మైసిగండి -
బెదిరింపుతోనే అభ్యర్థి ఆత్మహత్య!
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి తాండూరు టౌన్: కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతోనే మక్తల్ మున్సిపల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన తాండూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో హత్యా రాజకీయాలతో పాటు.. అభ్యర్థులను బెదిరించడం, దూషించడం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం లాంటివి ఉండేవన్నారు. కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయని, మళ్లీ కాంగ్రెస్తో పునరావృతమయ్యే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టు కోల్పోతున్నామని వచ్చిన ఇంటలిజెన్స్ రిపోర్టుతో అధికార పార్టీ నాయకులు ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో పోలీసులు కల్పించుకొని, బీజేపీ అభ్యర్థులకు రక్షణ కల్పించి, ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జి వడ్ల శ్రీధర్, తాండూరు కన్వీనర్ మనోహర్ రావు, సహ కన్వీనర్ పటేల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ బూత్లు తారుమారు
● ఒకదాని నంబర్ మరొక దానికి వేసిన అధికారులు ● గుర్తించి ఫిర్యాదు చేసిన నాయకులు అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని 9వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్లు తారుమారయ్యాయి. దీంతో ఓటర్లు, నాయకులు అధికారులను ప్రశ్నించారు. 9వ వార్డు పరిధిలోకి గంగారం సాయిబాబాకాలనీ, బూర్గుపల్లి గ్రామం కలిసి ఉన్నాయి. ఈ వార్డుకు రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. వాస్తవానికి బూర్గుపల్లి పోలింగ్ బూత్ నంబర్ 20 కాగా, సాయిబాబాకాలనీ పోలింగ్ స్టేషన్ నంబర్ 21గా ఉంది. ఈ రెండింటి దూరం దాదాపు 4 కిమీల వరకు ఉంటుంది. కాగా ఒక పోలింగ్ బూత్ నంబర్ మరో పోలింగ్ బూత్కు పడటంతో అధికారులు వాటి ఆధారంగా ఏర్పాట్లు చేశారు. పొరపాటును గుర్తించిన నాయకులు, ఓటర్లు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ బూత్ నంబర్లను వెంటనే మార్చాలని కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ను సంప్రదించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షుడు ఎన్.రాజు కోరారు. పట్టణంలోని దేవీ గ్రాండ్ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు దివాళా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల పద్ధతులను నిరసిస్తూ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, నాయకులు ఈశ్వర్, శ్రీకాంత్, శివ, భుజంగరెడ్డి, రాజు నాయక్, మహ్మద్ బాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాప్ ద్వారానే యూరియా పంపిణీ కందుకూరు: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే రైతులకు యూరియా పంపిణీ జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష సూచించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంతో పాటు ఫర్టిలైజర్ షాపుల్లో యాప్ ద్వారా చేపట్టిన యూరియా పంపిణీ ప్రక్రియను మంగళవారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులు క్యూకట్టే పద్ధతి, పడిగాపులు కాసే పరిస్థితి ఉండదన్నారు. నిర్ధారించిన పంట ఆధారంగా బుక్ చేసుకుంటే ఐడీ వస్తుందని, దాంతోనే బుక్ చేసుకున్న షాపుకు వెళ్లి 48 గంటల్లోపు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకోవడం రాని రైతులు ఏఈఓలు లేదా డీలర్ల వద్దకు వెళ్లి అక్కడ ఉండే వలంటీర్ల సాయం తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, రైతులు, ఫర్టిలైజర్ డీలర్లు పాల్గొన్నారు. షర్ఫూద్దీన్ బాబా సేవలో మాజీ మంత్రి సబితారెడ్డి పహాడీషరీఫ్: పహాడీషరీఫ్లోని బాబా షర్ఫూద్దీన్ దర్గా 760వ ఉర్సులో భాగంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మంగళవారం పూలు, చాదర్ సమర్పించారు. దర్గాకు విచ్చేసిన ఆమె తలపై బుట్టలో పూలు, చాదర్తో వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. -
మట్టి టిప్పర్ల పట్టివేత
కేశంపేట: టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని సీజ్ చేసిన సంఘటన మండల పరిధిలోని బైర్కాన్పల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామానికి చెందిన లక్ష్మణ్ బైర్కాన్పల్లి గ్రామ శివారులోని తట్టెకుంటతండా సమీపంలో మట్టిని తోడి అదే గ్రామంలో మరోచోటుకు తరలిస్తున్నారు. ఈ మేరకు పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో వాహనాలను స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు. -
జాతర గుర్తుండిపోవాలి
దుద్యాల్: మండలంలోని పోలేపల్లిలో స్వయంభూగా వెలిసిన రేణుకా ఎల్లమ్మ జాతర ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం ఆలయ అతిథి గృహంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రతీక్జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వారం రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. లక్షకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు సిబ్బంది అందుబాటు ఉండాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. జాతరకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏయే ప్రాంతంలో ఏయే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్కు స్థలాలు కేటాయించాలని తెలిపారు. అమ్మవారి దర్శనానికి ఇబ్బంది కలగకుండా క్యూలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొబైల్ టాయిలెట్స్, మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. అనంతరం అధికారులు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ జైపాల్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీధర్ రెడ్డి, ఆలయ ఈవో రాజేందర్ రెడ్డి, చైర్మన్ ముచ్చటి వెంకటేశ్, డీపీఓ జయసుధ, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, ఎస్ఐ శ్రీశైలం, ఎంపీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సర్పంచ్ చంద్రయ్య, యాదవ సంఘం మండల అధ్యక్షుడు నర్సింలు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుంటున్న కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు హాజరైన అధికారులు -
నేడే పోలింగ్
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి వికారాబాద్: మున్సిపల్ పోలింగ్కు కొన్ని గంటల సమయమే మిగిలింది. నేటి(బుధవారం) ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రితో కేటాయించిన కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లారు. వికారాబాద్ పట్టణంలోని మేరీ – ఏ నాట్స్ పాఠశాల, తాండూరులో సెయింట్ మార్క్స్ హైస్కూల్, పరిగిలో మినీ స్టేడియం, కొడంగల్లో జూనియర్ కళాశాల మైదానం నుంచి సిబ్బంది వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. కలెక్టర్ ప్రతీక్జైన్, అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 53 సమస్యాత్మక, 74 అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వెబ్కాస్టింగ్, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకురావడానికి ట్రై సైకిళ్లు, వీల్ చైర్లను సిద్ధంగా ఉంచారు. ప్రతి సెంటర్లో వలంటీర్లను నియమించారు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నాలుగు మున్సిపాలిటీలు.. వంద వార్డులు ఎజిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పురపాలికలు ఉన్నాయి. వీటి పరిధిలో 100 వార్డులు ఉండగా 1,74,529 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందు కోసం 261 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 58 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మరో 8 ఎస్ఎస్టీ టీంలు, 8 ఎఫ్ఎస్టీ టీంలతో పర్యవేక్షించనున్నారు. 313 మంది పీఓలు, 313 ఏపీఓలు, 940 మంది ఓపీఓలు విధుల్లో పాల్గొననున్నారు. సర్వం సిద్ధం పరిగి: మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిగి పురపాలిక వద్ద ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందజేశారు. పట్టణ పరిధిలో 18 వార్డులు, 27,600 మంది ఓటర్ల ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, స్వతంత్రులతో కలిసి 60 మంది బరిలో ఉన్నారు. 38 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెంకటయ్య తెలిపారు. 45 మంది ప్రిసైడింగ్ అధికారులు, 46 మంది ఏపీఓలు, 157 మంది ఓపీఎస్లు విధులు నిర్వహించనున్నారు. ఏడుగురు మైక్రో అబ్జర్వర్లు, మరో ఏడుగురు జోనల్ అధికారులు. 5 రూట్లలో పనిచేయనున్నారు. 158 మంది పోలీసులు, అధికారులు విధుల్లో ఉంటారు. ఆర్టీఓ వాసుచంద్ర ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సామగ్రితో సిబ్బంది కేంద్రాలకు తరలివెళ్లారు. పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బంది విధులకు వెళ్లారు. పట్టణంలోని 36 వార్డులకు గాను 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 585 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నట్లు డీఆర్ఓ మంగీలాల్ తెలిపారు. వీరితో పాటు అదనంగా మరో 20 శాతం మందిని సిద్ధం చేసినట్లు చెప్పారు. 9 రూట్లలో ఏర్పాటు చేసిన వాహనాల్లో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపినట్లు తెలిపారు. పట్టణంలోని 13 సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సిబ్బంది చూసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ మంగీలాల్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల వారీగా వార్డులు.. ఓటర్లు మున్సిపల్ వార్డులు పురుషులు సీ్త్రలు మొత్తం ఓటర్లు వికారాబాద్ 34 28,751 29,339 58,117 తాండూరు 36 37,547 39,558 77,110 పరిగి 18 13,822 13,792 27,614 కొడంగల్ 12 5,661 6,007 11,688 -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
తాండూరు: బీజేపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్కుమార్ అన్నారు. సోమవారం ఆయన పార్టీ 11వ వార్డు అభ్యర్థి ఇందూర్ రాములు తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మురుగు కాల్వలు నిర్మించా తాండూరు: ఓటు వేసి గెలిపిస్తే మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు అన్నారు. సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి 10వ వార్డులో ప్రచారం చేశారు. గతంలో సీసీరోడ్లు, మురుగు కాల్వలను నిర్మించానని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి, గెలిపించాలని కోరారు. ప్రశాంత్ విజయం ఖాయం కొడంగల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు అభ్యర్థి నందారం ప్రశాంత్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన అభ్యర్థి తరఫున గుండ్లకుంట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, కాంగ్రెస్కు ఓటు వేసి అభివృద్ధిని ఆస్వాదించాలని కోరారు. కాంగ్రెస్.. అభివృద్ధికి మారుపేరు పరిగి: కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి మారుపేరు అని ఎమ్మెల్యే సతీమణి ఉమారామ్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆమె పార్టీ 5వ వార్డు అభ్యర్థి షాహెదాబేగం తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అఽధికారం చేపట్టాక సంక్షేమం పరుగులు తీస్తోందని చెప్పారు. మరింత అభివృద్ధి జరగాలంటే పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజా సంక్షేమం.. బీఆర్ఎస్ లక్ష్యం తాండూరు టౌన్: ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని వికారాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు ప్రమోదిని అన్నారు. పార్టీ పట్టణ 24వ వార్డు అభ్యర్థి కొట్రిక నాగలక్ష్మి తరఫున సోమవారం ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నాగలక్ష్మిని గెలిపించాలని కోరారు. అందుబాటులో ఉంటా.. తాండూరు: ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ 16వ వార్డు అభ్యర్థి నారా శ్రీలత అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆమె పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. ఆదరిస్తే.. అందుబాటులో ఉండి, సేవ చేసుకుంటానని చెప్పారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. . -
మామా మజాకా
తాండూరు టౌన్: అల్లుడి గెలుపు కోసం అతని మామ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ 13వ వార్డు అభ్యర్థి సురేష్ నాయక్కు మద్దతుగా ఆయన మామ విఠల్ నాయక్ సోమవారం ఇంటింటి ప్రచారం చేశారు. అల్లున్ని ఆదరిస్తే.. తన వినాయక ఫంక్షన్ హాల్ రుసుము, వినాయక ఆస్పత్రి బిల్లు, దిల్సుఖ్నగర్లోని వినాయక నర్సింగ్ కళాశాలలో 50 శాతం రాయితీ ఇస్తానని ప్రకటించారు. వినాయక కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆఫర్లు తాండూరులో చర్చనీయాంశంగా మారింది. -
గుల్బర్గా టు వికారాబాద్
తాండూరు: తొలుత తాండూరు.. నిజాం పాలనలో కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో కొనసాగింది. నాడు తాలూకా తహసీల్దారులే పాలన కొనసాగించేవారు. కాలక్రమేణా నిజాం సంస్థానం 1952లో దేశంలో విలీనం కాగా.. 1953లో తాండూరు పట్టణం సుమారు 4 వేల మంది ఓటర్లతో పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. నాటి నుంచి 2010 వరకు మూడో శ్రేణి మున్సిపాలిటీగా కొనసాగింది. ఇదే ఏడు ప్రభుత్వం ద్వితీయ శ్రేణిగా పదోన్నతి(అప్గ్రేడ్) చేసింది. 1953 నుంచి 2005 సంవత్సరం వరకు మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉండగా.. 2005లో జరిగిన ఎన్నికల్లో వార్డుల విభజనతో ఆ సంఖ్య 27కు చేరింది. 2014లో మరోసారి వార్డుల విభజన జరగడంతో 31కి చేరింది. 2019లో శివారు ప్రాంతాలను విలీనం చేయగా.. ప్రస్తుతం 36 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి చైర్మన్గా ‘ముదెళ్లి’ మున్సిపాలిటీ ఆవిర్భవించిన అనంతరం తొలిసారిగా 1953 నవంబర్ 25న జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముదెళ్లి నారాయణరావు చైర్మన్గా ఎన్నికయ్యారు. గుల్బర్గా జిల్లా హైదరాబాద్ సంస్థానం(నిజాం స్టేట్)లో ఉండేది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో గుల్బర్గా జిల్లా నుంచి తాండూరు వీడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు పరిధి(హైదరాబాద్)లోకి వచ్చింది. నాడు హైదరాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ, ఏకై క పురపాలకసంఘం తాండూరు ఒక్కటే కావడం విశేషం. 2014లో వికారాబాద్లో విలీనం 1978లో హైదరాబాద్ జిల్లాను రెండుగా విభజించి, హైదరాబాద్ పట్టణాన్ని ఒక జిల్లాగా, నగర చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలను కలిపి రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పుడు కూడాఏకై క మున్సిపాలిటీ తాండూరే. జిల్లా ఆవిర్భావం తరువాత కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాను విభజించగా.. పురపాలక సంఘం వికారాబాద్ జిల్లాలో విలీనం అయింది. 9 సార్లు ఎన్నికలు.. 14 మంది చైర్మన్లు మున్సిపాలిటీకి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అధికంగా చైర్మన్గా కొనసాగారు. 1954 నుంచి 9 సార్లు ఎన్నికలు జరగగా.. 6 సార్లు ఆ పార్టీ ఏలగా.. ఒకసారి బీజేపీ, రెండు సార్లు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేశాయి. కాగా 9 సార్లు జరిగిన ఎన్నికల్లో 9 మంది చైర్మన్లను ఎన్నుకున్నారు. రెండు మూడు సార్లు చైర్మన్కు ప్రత్యేక్ష ఎన్నికలు జరిపి, నేరుగా ఎన్నుకున్నారు. కొందరు అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు. మొత్తం 14 మంది చైర్మన్లు కొనసాగారు. నాటి నుంచి అ విశ్వాస పరీక్షే.. తొలి చైర్మన్ నారాయణరావు పాలన సాఫీగా సాగింది. 1959లో ఎన్నికల్లో పుల్లా అనంత్రెడ్డి ఎన్నికయ్యారు. రెండేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానంతో పార్వతప్ప, శెట్టి చంద్రశేఖర్లు పదవిలో కొనసాగారు. 1981 ఎన్నికల్లో తిరిగి అనంత్రెడ్డి ఎన్నికయ్యారు. ఏడాది తర్వాత కౌన్సిల్ సభ్యుల అవిశ్వాస తీర్మానంతో బీజేపీకి చెందిన సత్తయ్యగౌడ్ కొనసాగారు. ఆయనపై అవిశ్వాసం పెట్టడంతో అనంత్రెడ్డి సోదరుడు పుల్లా మోహన్రెడ్డి కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మేజార్టీ రాక పోవడంతో బీఆర్ఎస్ మజ్లిస్తో కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. మొదట టీఆర్ఎస్ పార్టీకి అవకాశం రావడంతో కొట్రికె విజయలక్ష్మి రెండున్నరేళ్ల అనంతరం రాజీనామా చేశారు. చైర్మన్ ఎన్నికల్లో అనుహ్యూంగా కౌన్సిల్ సభ్యుల మద్దతు పొంది.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సునితసంత్ చైర్పర్సన్ ఎన్నికయ్యారు. 2020లో ఏర్పాటైన కౌన్సిల్లో సైతం ఫిఫ్టి ఫిఫ్టి ఒప్పందంతో తాటికొండస్వప్న, పట్లోల్ల దీపిక నర్సింహులు చెరోసగం ఐదేళ్ల పరిపాలించారు. 18 ఏళ్లు ప్రత్యేక పాలన మున్సిపాలిటీ ఆవిర్భవించిన 7 దశాబ్దాల చరిత్రలో సుమారు 20 ఏళ్లు పాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఇందుకు కారణం ప్రభుత్వాలు ఎన్నికల నిర్వహణకు ఆసక్తి చూపక పోవడమేనని తెలుస్తోంది. దీంతో 18 సంవత్సరాలు ప్రత్యేక పాలన జరిగింది. నిజాంకాలంలో వెలుగొందిన తాండూరు 1953లో 23వార్డులతో మున్సిపాలిటీ ఏర్పాటు ప్రస్తుతం 36 డివిన్లతో ద్వితీయ శ్రేణిగా అప్గ్రేడ్ తొలి చైర్మన్గా నారాయణరావు నాటి నుంచి బల్దియాలో రాజకీయ చైతన్యం 36 వార్డులు.. 77,025 మంది ఓటర్లు మున్సిపాలిటీ ఆవిర్భవించిన సమయంలో సుమారు 4వేల ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మొత్తం 77,025 మంది ఓటర్లు ఉండగా..అందులో పురుషులు 37,499, మహిళలు 39,525 మంది ఉన్నారు. మున్సిపల్ చైర్మన్లుగా కొనసాగిన వారు వీరే.. 15వ పీఠం ఎవరికో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ 2017లో అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ విజయ లక్ష్మిని రాజీనామా చేయించి, ఎంఐఎం పార్టీకి చైర్మన్గా చేసేందుకు కౌన్సిల్ సభ్యులతో అవిశ్వాస తీర్మానం చేశారు. అందులో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా ఉన్న సునితసంపత్కు మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు లభించడంతో.. చైర్పర్సన్గా కొనసాగారు. 2020లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను గెలిచి తాటికొండ స్వప్నపరిమళ్ చైర్పర్సన్గా ఐదేళ్లు కొనసాగారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ 15 సారి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
బాలికపై లైంగిక దాడి నిందితుడికి ఇరవై ఏళ్ల కారాగారం
అనంతగిరి: వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువర్చిందని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. 2023లో వికారాబాద్ మండలానికి చెందిన అత్వెల్లి నరేందర్ (అలియాస్ నరేష్) అనే వ్యక్తి ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సీహెచ్ చంద్రకిశోర్ సమక్షంలో విచారణ నిర్వహించారు. పోలీసులు సమర్పించిన శాసీ్త్రయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితుడిపై నేరం రుజువు కావడంతో పైశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పరంగా రూ.5 లక్షల నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి మొయినాబాద్: స్విమ్మింగ్ పూల్లో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మృగవని రిసార్ట్స్లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని బాగ్లింగంపల్లికి చెందిన ప్రకాశ్సింగ్ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రిసార్ట్లో ఏర్పాటు చేసిన బంధువుల సంగీత్ వేడుకకు వచ్చారు. ప్రకాశ్సింగ్ కుమారుడు సూర్యప్రకాశ్(10) ఆడుకుంటూ రిసార్ట్లోని స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్లి అందులో పడి నీటమునిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, రిసార్ట్స్, ఫాంహౌస్లలోని స్విమ్మింగ్ పూల్లలో ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు -
అభివృద్ధికి పట్టం కట్టండి
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని స్పీకర్ ప్రసాద్కుమార్ కోరారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉన్నందున ఇక్కడ కూడా మన వారే ఉంటే త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, మీ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. ఇప్పటికే వికారాబాద్ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి పనులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అనంతగిరి గుట్టను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకుని ముందుకు సాగుతామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలు అందజేస్తామన్నారు. నా బిడ్డ అనన్యను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
మీ బిడ్డగా వస్తున్నా.. ఆదరించండి
అనంతగిరి: ‘మీ బిడ్డగా వస్తున్నా.. తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అనన్య అభ్యర్థించారు. సోమవారం పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే వికారాబాద్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. స్పీకర్ ప్రసాద్కుమార్ కూతురిగా తనకు రాజకీయాలపై అవగాహన ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ సమస్యలు తనకు తెలుసని.. ప్రజల సూచనలు, సలహాలతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
పరిగిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
పరిగి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పట్టణా లు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం పరిగి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాడైన రోడ్లకు కనీస మరమ్మతులు కూడా చేయించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రోడ్లు బాగుపడ్డాయని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో పరిగి పట్టణంలో అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో రూ.250 కోట్లతో ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మరో ఏడాదిలో పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు. పరిగిని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని అన్నారు. అభివృద్ధిని చూసి కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉంటే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, నాయకులు పార్థసారథి పంతులు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిధులతోనే పురోగతి
పరిగి: బీజేపీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు. సోమవారం పరిగి మున్సిపల్ పరిధలోని 18వ వార్డు అభ్యర్థి ముకుంద జ్యోత్స్న తరఫున ప్రచారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, ము న్సిపాలిటీలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నా యకులు ముకుంద నాగేశ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్తో సొంతింటి కల సాకారం
తాండూరు: పట్టణ ప్రజల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారమైందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 8, 13, 14, 16, 17, 18 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరు కాలేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో తాండూరుకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. పెద్ద ఎత్తున నిధులు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు థారాసింగ్, నాయకులు ముజిబ్ఖాన్, అబ్దుల్ రవూఫ్, రవిగౌడ్, వడ్డె శ్రీనివాస్, అజయ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంటాం రానున్న మూడేళ్లలో తాండూరు మున్సిపాలిటీని ప్రగతి పథంలో నిలబెడతామని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2028 నాటికి మున్సిపాలిటీ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. అప్పటిలోగా రూ.550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. కాగ్నానది వద్ద రూ.30 కోట్లతో పంప్ హౌస్ నిర్మించి ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తామన్నారు. అమృత్ 2.0 ద్వారా రెండు ట్యాంక్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ మురళీకృష్ణా గౌడ్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు అబ్దుల్ రవూఫ్, ఆమేర్ అబ్దుల్లా, వడ్డె శ్రీనివాస్, జుబేర్లాల, గౌరి రాములు తదితరులు పాల్గొన్నారు. -
సప్పుడు బంద్
తూతూమంత్రంగా తనిఖీలురాజకీయ పార్టీలు ఓటరు స్లిప్పులు పంచరాదని అధికారులు చెబుతున్నా నేతలు పట్టించుకో వడం లేదు. పంపిణీ పేరుతో ఇళ్ల వద్దకు వెళ్తున్నారు. డబ్బు, మద్యం ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రలోభాల విషయంలో ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మద్యం ఏరులై పారుతున్నా.. యథేచ్ఛగా ప్రలోభాల పర్వం సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అభ్యర్థులు ప్రతి కాలనీలో రెండు మూడు చోట్ల టెంట్లు వేసి ఓటర్లకు కావాల్సిన భోజనం తయారు చేయించి పెడుతున్నారు. చెక్ పోస్టుల వద్ద కూడా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు. వికారాబాద్: మున్సిపల్ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. వారం రోజులుగా హోరెత్తిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు విరామం లేకుండా ప్రచారం చేశారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉంది. కొన్ని చోట్ల బీజేపీ, ఇండిపెండెంట్లు కూడా గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రచారం ముగియడంతో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను డబుల్ చేశారు. గెలుపే పరమావధిగా.. ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తాపత్రయం అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా పార్టీలు వారం రోజులు ముందుగానే మద్యం కొనుగోలు చేసి సురక్షిత ప్రాంతాల్లో డంప్ చేసినట్టు సమాచారం. ఖరీదైన బ్రాండ్లు కూడా నిల్వ చేసినట్లు తెలిసింది. ఓటర్లు ఏ బ్రాండ్ మద్యం అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వ్యక్తుల స్థాయిని బట్టి, వారు చేసే వృత్తులు, హోదాలను బట్టి మద్యం బ్రాండ్లు పంపిణీ చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అభ్యర్థులకు పట్టులేని చోట్ల డబ్బు ఎర వేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఓటుకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న అన్ రిజర్వ్డ్ వార్డుల్లో ఎంత ఖర్చు చేయడానికై నా వెనుకాడటం లేదు. గెలుపే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకున్నాయి. ఈ నెల 11న పోలింగ్ ఉండడంతో ఒకరోజు ముందుగా భారీగా ప్రలోభాలకు దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటర్లూ జర జాగ్రత్త ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధంతో స మానం. మన ఐదేళ్ల భవిష్యత్కు సంబంధించినది. విజ్ఞతతో ఆలోచించి సేవ చేసే వారికే ఓటు వేయా లని మేధావులు సూచిస్తున్నారు. ప్రలోభాలకు లొంగకుండా మంచివారిని ఎన్నుకోవాలంటున్నారు.ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం -
దేవర్ఫసల్వాద్కు జాతీయ అవార్డు
● రాష్ట్ర గ్రామీణాభివృద్ధి డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ దౌల్తాబాద్: జాతీయ అవార్డుకు ఎంపికై న గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ తెలిపారు. మండలంలోని దేవర్ఫసల్వాద్ గ్రామం సామాజిక న్యాయం–భద్రత కింద జాతీయ అవార్డుకు ఎంపిక కావడంతో సోమవారం గ్రామంలో స భ నిర్వహించారు. వసతులు, సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీ పీఓ జయసుధ మాట్లాడుతూ..గామం జాతీ య అవార్డుకు ఎంపిక కావడంతో భారీగా ని ధులు వస్తాయన్నారు. తాగునీరు, పచ్చదనం, జీవానోపాధి వంటివి మెరుగు పడతాయన్నా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీ ఎం వెంకటన్న, ఏపీఓ అంజిలయ్య, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లు జరగొద్దు అనంతగిరి: పోలింగ్ సామగ్రి పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సిబ్బందికి అందజేయాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఆదేశించారు. వికారాబాద్ పట్టణంలోని మేరీ నాట్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సోమవారం సందర్శించారు. ఇక్కడి సదుపాయాలను పరిశీలించారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజ న వసతి, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందించాలన్నారు. సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఎస్పీ స్నేహమెహ్ర అనంతగిరి: ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించాలని ఎస్పీ స్నేహ మెహ్ర సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం చేయరాదని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రచారం చేయరాదని తెలిపారు. ఇంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు అనంతగిరి: పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్, జనరల్ అబ్జర్వర్ రవి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఈఓ రేణుకాదేవి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రచారం చేయరాదని సూచించారు. పోలీస్ అధికారులు, ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలన్నారు. -
బలమైన శక్తిగా ఎదుగుతాం
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులను గెలిపించాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎంఐఎంకు రాజకీయ చదరంగం బాగా తెలుసన్నారు. ముస్లింలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మనం కూడా బలపడి రాజకీయంగా ఎదగాలన్నారు. మజ్లిస్ పార్టీ దేశ చరిత్రలో బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. మా నాన్న నుంచి ఈ ప్రాంతం మమ్మల్ని ఆదరించిందని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను ఎన్నటికీ మరిచిపోమన్నారు. పతంగి గుర్తుకు ఓటు వేసి సత్తా చాటాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై తాను ప్రత్యేక దృష్టి పెడుతానన్నారు. ముస్లింలపై దాడులు పెరుగుతున్నా అధికార, ప్రతిపక్షం స్పందించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బహదూర్పురా ఎమ్మెల్యే ముబీన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఉస్మాన్, సీనియర్ నాయకులు అలీం, బురాన్, కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకే పరిమితం కాదు.. తాండూరు: ఎంఐఎం ముస్లింలకే పరిమితమైనది కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాండూరులోని ఇద్గా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు హాది శహేరీ తదితరులు పాల్గొన్నారు. -
గుడ్ గవర్నెన్స్కు మోత్కుపల్లి జీపీ నామినేటెడ్
బంట్వారం: కోట్పల్లి మండలం మోత్కుపల్లి పంచాయతీని 2023 – 24 ఆర్థిక సంవత్సరం స్కోర్ ఆధారంగా గుడ్ గవర్నెన్స్కు నామినేటెడ్ చేసినట్లు డీఎల్పీఓ సంధ్యారాణి తెలిపారు. సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు అంశాలపై వీడియో చిత్రీకరణ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటి పన్నుల వసూలు, ఆన్లైన్ నమోదు, రికార్డుల నిర్వాహణ సంతృప్తికరంగా ఉందన్నారు. వీటి స్కోర్ ఆధారంగానే పంచాయతీని గుడ్ గవర్నెన్స్కు నామినేటెడ్ చేయడం జరిగిందన్నారు. ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హే మంత్, సర్పంచ్ అమృతమ్మ, ఉప సర్పంచ్ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. డీఎల్పీఓ సంధ్యారాణి -
ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య తుర్కయంజాల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో విఫలం అవుతున్నాయని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య ఆరోపించారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ ఆదిబట్ల సర్కిల్ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత బలోపేతానికి ఎలాంటి విధానాలను అమలు చేయడం లేదన్నారు. దేశ భవిష్యత్ అయిన యువతను విస్మరించి దేశాభివృద్ధిని నిర్మించలేమన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సభ్యులను సన్మానించారు. నూతన కార్యవర్గం ఏఐవైఎఫ్ ఆదిబట్ల సర్కిల్ అధ్యక్షుడిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా వంశీకృష్ణ, గణేశ్, మహే్శ్, కార్యదర్శిగా ఎన్.రాజుగౌడ్, సహాయ కార్యదర్శుగా శివ, వివేక్, కార్యవర్గ సభ్యులుగా రాజు, లోకేష్, రాహుల్నాయక్ తదితరులను ఎన్నుకున్నారు. -
తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్
అనంతగిరి: తల్లి, ఇద్దరు పిల్లలు తప్పిపోయిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ మండలం పులుమద్దికి చెందిన అనురాధ తన ఇద్దరు పిల్లలు ప్రణీత్, రిత్విక్లతో కలసి అమ్మవారి ఊరైన దోమ మండలం వొట్పల్లి గ్రామానికి వెళ్లింది. తిరిగి గత నెల 22న పులుమద్దికి బయలుదేరింది. ఈ క్రమంలో వికారాబాద్ వరకు వచ్చారు. 2 గంటల సమయంలో బస్టాండ్లో బస్సు ఎక్కారు. కానీ ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు.. వారి కోసం వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తల్లి చెన్నమ్మ ఈ నెల 3న పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రఘుకుమార్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వికారాబాద్ ఠాణాకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఉచిత వైద్య శిబిరం
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బుచ్చిగూడలో మాజీ ఎంపీ శేషయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కమ్మ సమైక్య వేదిక అధ్యక్షుడు సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శేషయ్యనగర్ కమ్యూనిటీ హాలులో నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వివ ఆస్పత్రి వైద్యులతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్గౌడ్, ఉపసర్పంచ్ మహేశ్యాదవ్, నాయకులు పాల్గొన్నారు. -
ఏడు మేకలు అపహరణ కేసు నమోదు
పూడూరు: మండల పరిధిలోని తిర్మలాపూర్లో ఏడు మేకలు గుర్తు తెలియని దుండుగులు అపహరించారు. చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పాత్లావత్ సోమ్లీబాయి రోజుమాదిరిగానే శనివారం ఇంటి ఎదురుగా పాకలో మేకలు ఉంచి నిద్రకు ఉపక్రమించారు. ఆదివారం ఉదయం లేచేవరకు కనిపించకపోవడంతో ఊరంతా వెతికారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై యాచారం మండల కేంద్రంలో ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం శ్రీ వేంకటేశ్వరతండాకు చెందిన జాటోత్ హర్యానాయక్(48) ఆదివారం ఉదయం వ్యక్తిగత పని మీద బైక్పై మండల కేంద్రానికి వచ్చారు. స్థానికంగా మొండిగౌరెల్లి మార్గం నుంచి హైవే పైకి వస్తుండగా ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వైపు వెళ్తున్న దేవరకొండ డిపోనకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఆయన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనుంచి బస్సు చక్రం కిందకు వెళ్లగా, హర్యానాయక్కు తీవ్ర గాయాలై ఎగిరి రెండు మీటర్ల దూరంలో పడిపోయారు. తలకు తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 అంబులైన్స్లోకి ఎక్కిస్తుండగానే ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య సుగుణతో పాటు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల ఆగ్రహం సాగర్రోడ్డుపై దేవరకొండ ఆర్టీసీ బస్సుల అతివేగంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. అతివేగం, డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సులను నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు మృతి చెందుతున్నారని ప్రజలు మండిపడ్డారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. నిందితులను శిక్షించాలని దీక్ష చేవెళ్ల: ఇటీవల అడ్వకేట్ స్వప్నను ఆస్తి కోసం సోదరుడు దారుణంగా హత్య చేయించిన సంఘటనలో న్యాయంకోసం కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో బార్ కౌన్సిల్ కంటెస్టింగ్ మెంబర్స్ తేజస్వినిరెడ్డి, జక్కుల వంశీకృష్ణలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు. దీనికి కారణమైన దీని వెనక ఉన్న వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాండురంగారెడ్డి, శంసోద్దీన్, బాలస్వామి, సత్యానందం, రాజశేఖర్, ఉదయ్, శివరాజ్, సాయిరాం, ఆనంద్, అభిలాస్రెడ్డి, శ్రావణ్, జ్యోతి, విఠల్, వినయ్, సందీప్, రవీందర్, స్నేహ, చందు తదితరులు పాల్గొన్నారు. వ్యభిచార గృహంపై దాడి వెంగళరావునగర్: మధురానగర్ పోలీసులు వ్యభిచార కేంద్రంపై దాడిచేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. మధురానగర్కాలనీలో ఇద్దరు మహిళలు ఓ గదిని అద్దెకు తీసుకొని వ్యభిచారం చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో శనివారం సాయంత్రం దాడిచేసి ఓ విటుడిని, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉంది. -
పరిగి ప్రగతిని పరుగులు పెట్టిస్తా
పరిగి: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం’ అని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఆదివారం పార్టీ 8వ వార్డుఅభ్యర్థి హబీబ్ ఉన్నిసా తరఫున ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. పరిగిని అన్నివిధాలాఅభివృద్ధి చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి జరిగిన అన్ని ఎన్నికల్లో తమ ఓటుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇప్పుడూ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నేతల తప్పుడు ప్రచారం నమ్మవద్దని, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, గెలిపించాలని కోరారు. డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ ఉన్నారు. -
కంప్రెషర్ యూనియన్ అధ్యక్షుడి నియామకం
తుర్కయంజాల్: గ్రేటర్ హైదరాబాద్ కంప్రెషర్ యూనియన్ అధ్యక్షుడిగా కుంచెపు రాజును ఆదివారం ఆదిబట్ల సర్కిల్ పరిధి తొర్రూర్ డివిజన్ కమ్మగూడలోని పూసల భవనంలో తుర్కయంజాల్ వడ్డెర సంఘం అధ్యక్షుడు నర్ర పాండు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడిని సన్మానించారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ కంప్రెషర్ వాహనాల యజమానులు ఐకమత్యంతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వరికుప్పల శేఖర్, మహేష్, వెంకటయ్య, చంద్రయ్య, వెంకటయ్య, కృష్ణ, యాదయ్య, రాంబాబు, శ్రీకాంత్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
‘గుర్తు’ంచుకొని.. ఓటు వేయమని
అభివృద్ధి మాతోనే సాధ్యం. మున్సిపాలిటీలో అన్ని వార్డులను కై వసం చేసుకుంటామని అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ 10వ వార్డు అభ్యర్థి సుధాకర్రెడ్డి, అదే పార్టీ 18వ వార్డు అభ్యర్థి చిగుల్లపల్లి రమేష్కుమార్, బీఆర్ఎస్ 7వ వార్డు అభ్యర్థి అనంత్రెడ్డి, కాంగ్రెస్ 22వ వార్డు అభ్యర్థి లక్ష్మీకాంత్రెడ్డి, అదే పార్టీ 25వ వార్డు అభ్యర్థి వినోద్కు మద్దతుగా ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజలు తమ పాలనే కోరుకుంటున్నారని, మర్చిపోకుండా చేతి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. – అనంతగిరిప్రచారం చేస్తున్న అభ్యర్థులు సుధాకర్రెడ్డి(కాంగ్రెస్), చిగుల్లపల్లి రమేష్కుమార్(కాంగ్రెస్), అనంత్రెడ్డి(బీఆర్ఎస్), లక్ష్మీకాంత్రెడ్డి(కాంగ్రెస్), వినోద్(కాంగ్రెస్)కు మద్దతుగా.. ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు తదితరులు అభివృద్ధి మాతోనే.. అన్ని వార్డులు మావే కాంగ్రెస్ గెలుపు ఖాయం కొడంగల్: అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ 7వ వార్డు అభ్యర్థి కృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి మున్సిపల్ పరిధి బూల్కాపూర్, ఐనన్పల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం ● మద్దతుగా సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు ● గెలుపే లక్ష్యంగా ప్రచారబాట ● నేటితో పరి సమాప్తంపురపాలిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో నాలుగు మున్సిపాలిటీల్లో హడావుడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తమ అభ్యర్థుల తరఫున వాడవాడన పర్యటిస్తున్నారు. రెండుపూటలా ఇంటింటికి వెళ్లి ‘గుర్తు’ంచుకొని, అభిృద్ధిని చూసి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని ఇరు పార్టీల నేతలు కోరుతున్నారు. నేటితో ప్రచారం ముగియనుంది. – సాక్షి, నెట్వర్క్ అధికార పార్టీతోనే అభివృద్ధి కొడంగల్: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అధికార పార్టీతోనే పట్టణం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థినందారం ప్రశాంత్ అన్నారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి గుండ్లకుంట, పాత కొడంగల్లో ఇంటింటి ప్రచారం చేశారు. మర్చిపోకుండా చేతి గుర్తుకు ఓటు వేసి, అభివృద్ధిని ఆస్వాదించాలని ఓటర్లను అభ్యర్థించారు. మోసం చేస్తున్న కాంగ్రెస్ పరిగి: మాయమాటలతో అధికారం చేపట్టి, మోసం చేస్తున్న కాంగ్రెస్ను ఓటుతో బుద్ధిచెప్పాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ కేంద్రంలోని 4వ వార్డు అభ్యర్థి శివానోళ్ల చంద్రకళ తరుఫున ఇంటింటి ప్రచారం చేశారు. రెండెళ్లలో ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, కారు గుర్తుకు ఓటువేసి, పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. ఆప్యాయత మీది.. సంక్షేమం నాది తాండూరు టౌన్: నమ్మకంతో గెలిపిస్తే వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ 36వ వార్డు అభ్యర్థి కల్వ సిరిచందన అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆమె పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తంగా కొనసాగిందన్నారు. అధికార పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి, అభివృద్ధిని ఆస్వాదించాలని కోరారు. -
ప్రచారం కై ్లమాక్స్
గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఫోకస్ వికారాబాద్: ప్రచారం ముగింపునకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో స్టార్ క్యాంపెయినర్ల దృష్టి వికారాబాద్ జిల్లాపై పడింది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలో దిగుతున్నారు. జిల్లాలోని నియోజకవర్గాలలో ప్రధానంగా కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్ అధికార పార్టీని ఎలాగైనా సరే ఓడించాలని పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ తరఫున ముఖ్యనేతలు రంగంలోకి దిగటంతో ప్రచారం తారాస్థాయికి చేరింది. మున్సిపాలిటీల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అధినేతలతో పాటుగా స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నారు. ప్రచారానికి కౌండౌన్ మొదలడవడంతో అధినేతలతో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జిల్లాలో పార్టీ ముఖ్యులను రంగంలోని దించుతున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. నేటీతో అంతా గప్చుప్ మున్సిపాలిటీల ఎన్నికలకు ప్రచారం సోమవారం సాయంత్రంతో పరిసమాప్తం కానుంది. వారం పది రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండడంతో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఆ తరువాత ఏపార్టీ ప్రచారం చేసుకునే వీలుండదు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. నాలుగు మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల తరఫున అగ్రనేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుంది. మాజీ మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి రోడ్షోలతో కారులో హుషారు మహారాష్ట్ర మంత్రులు, కొండాతో ప్రచారం చేయించిన కమలనాథులు పోటాపోటీగా ప్రచార సభలు, కార్నర్ మీటింగ్లు ముఖ్యమంత్రి సభతో హస్తం శ్రేణుల్లో జోష్ -
నయా నిజాంలా రేవంత్రెడ్డి పాలన
మొయినాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని.. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు కాలగర్భంలో కలిపేస్తారని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అప్పోజీగూడ, చిలుకూరు వార్డుల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం హిమాయత్నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముస్లిం ఓట్లకోసం మతపరమైన అంశాలను ముందుకు తీసుకొస్తున్నారన్నారు. పదేళ్లు కేసీఆర్ నియంత పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇస్తే రేవంత్రెడ్డి అంతకు మించి అవినీతి, భూదందాలకు తెరలేపారని ఆరోపించారు. దేశంలో మోదీ పాలన చూసి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎన్నికల ఇన్చార్జి సారిక చౌదరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర నాయకులు కంజర్ల ప్రకాష్, సన్వెల్లి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ -
మైసిగండి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి, ప్రధాన అర్చకుడు యాదగిరిస్వామి తదితరులు ఉన్నారు. హామీలు మరిచి గాలిమాటలు మొయినాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ గాలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం, మొయినాబాద్, సురంగల్, అప్పోజీగూడ, చిలుకూరు, హిమాయత్నగర్లోని వార్డుల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే ఇప్పటికీ కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు ఏం చేసిందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని నిలదీశారు. ప్రజలను మోసం చేస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జిలు జయసింహ, అమృత్లాల్ చౌహాన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
ఘనంగా బాలఏసు ఊరిపండుగ
● తరలివచ్చిన భక్తులు ● ప్రత్యేక ప్రార్థనలు తుర్కయంజాల్: కమ్మగూడలోని బాలఏసు వార్షిక మహోత్సవంలో భాగంగా ఆదివారం ఊరిపండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ముందుగా గోవిందు ఆరోగ్య స్వామి దివ్యబలిపూజ తెలుగులో, 5 గంటలకు బోనగిరి బాల ఆంథోని, 6 గంటలకు కూరపాటి జయ ప్రతాప్ ఇంగ్లిష్లో, 7 గంటలకు ఈరిపాల్ ప్రభాకర్ తెలుగులో, 8 గంటలకు పాస్టర్ ఏ.ఎస్.టోని తమిళంలో దివ్య బలిపూజలు నిర్వహించారు. 9.30 గంటలకు బాలఏసు మహోత్సవ దివ్య బలిపూజ ఇంగ్లిష్లో తాతిరెడ్డి జయరాజ్ రెడ్డి, 11.30 గంటలకు సిరిల్ తెలుగులో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నగరంలోని బోయిగూడ నుంచి బాలఏసు తేరు ప్రదక్షిణ ప్రారంభం కాగా, 11 గంటలకు తుర్కయంజాల్కు చేరుకుంది. చర్చి కమిటీ సభ్యులు, భక్తులు స్వాగతం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన భక్తులు వేల సంఖ్యలో బాలఏసును దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా వనస్థలిపురం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. -
ప్రజాప్రభుత్వానికి అండగా ఉండండి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం, రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్ పట్టణ అభివృద్ధికి వందల కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. అనంతగిరిని టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తానన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయా ణం, వడ్డీలేని రుణాలు అందించి సంక్షేమ పాలన అందిస్తున్నామని వివరించారు. మున్సిపల్ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మైపాల్రెడ్డి, కిషన్నాయక్, సత్యనారాయణ, కొండల్రెడ్డి, షరీఫ్, ముత్యంరెడ్డి, నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
వేడెక్కిన ప్రచారం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిగిలో నిర్వహించిన భహిరంగ సభలో పాల్గొని జిల్లాపై వరాల జల్లు కురిపించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదులుతున్నాయి. తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ పాలనను తూర్పార పట్టారు. కాంగ్రెస్ అన్నివర్గాల ప్రజలను వంచించిందని విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు. మాజీ మంత్రి సబితారెడ్డి సైతం బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున వికారాబాద్లో రోడ్షో నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున స్పీకర్ ప్రసాద్కుమార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, నేతలు తిరుపతిరెడ్డి, గురునాథ్రెడ్డి, బీఆర్ఎస్ తరఫున మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, రోహిత్రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ఆయా పార్టీలతో ఉన్న చీకటి ఒప్పందాలను, అనైతిక పొత్తులను ఒకరికొకరు బయటపెట్టుకుంటున్నారు. బీజేపీ సైతం మహారాష్ట్ర మంత్రులు, పార్టీ ఇన్చార్జిలు, ఎంపీ కొండాను రంగంలోకి దింపి అభ్యర్థుల తరపున ప్రచారం చేయిస్తోంది. ఎంఐఎం తమకు పట్టున్న వార్డులను కై వసం చేసుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఆయా పార్టీల ముఖ్య నేతల ప్రచారానికి రూ.500, భోజన వసతి కల్పిస్తూ భారీగా జనసమీకరణ చేస్తున్నారు. -
బీఆర్ఎస్ పదేళ్లలో చేసిందేమిటో చెప్పాలి
మొయినాబాద్: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిముద్దీన్ ప్రశ్నించారు. మొయినాబాద్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 1.85 లక్షల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రెండు సార్లు ఎంపీగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అజీజ్నగర్, ఎనికేపల్లి, మొయినాబాద్లో మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహాడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి తదితరులు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిముద్దీన్ -
అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలన్నారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్లో సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సూపర్వైజర్లకు, అసిస్టెంట్లకు సోమవారం మధ్యా హ్నం 2.30 గంటలకు వికారాబాద్లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత సిబ్బంది సమయానికి హాజరుకావాలని ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. యాలాల: కాంగ్రెస్ మండల నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్ ఆదివారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఇంట్లో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యుడు శివకుమార్, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు రవికుమార్, రాములు, వెంకటయ్య, నాయకులు కృష్ణకుమార్, లాలప్ప తదితరులు ఉన్నారు. ధారూరు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా వేదికను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నర్సింహులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి వరకు 34 పంచాయతీల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులపై చర్చ ఉంటుందన్నారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ఉపాధిహామి సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు. హయత్నగర్: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవింద్రాచారి డిమాండ్ చేశారు. ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పెద్దఅంబర్పేట్ డివిజన్ కుంట్లూర్ రావినారాయణరెడ్డి కాలనీలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కార్మిక వ్యతిరేక విదానాలను అవలంబిస్తోందని, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు అధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆజ్మీరా హరిసింగ్ నాయక్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి భయంతో అసత్య ప్రచారం
పరిగి: ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పరిగి మున్సిపాలిటీ ఎన్నికల్లో 18వార్డుల కౌన్సిలర్ల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు మా వేపే ఉన్నారని, ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. రూ.50 కోట్లతో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిగిని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికే పట్టణంలో రూ.50 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణాలు తదితర పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికీ కొమ్ము కాయదని, అభ్యర్థులు అందరూ గెలిచాక చైర్మన్ పదవికి సమర్థులైన వారిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం నమ్మకుండా.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్థసారథి, ఎర్రగడ్డపల్లి కృష్ణ, పాలాద్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చెర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదు విజయానంతరం సమర్థులను ఎన్నుకుంటాం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
కాంగ్రెస్ది భస్మాసుర హస్తం
తాండూరు/ నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు: ‘ముఖ్యమంత్రిని రైతు భరోసా ఇస్తా అంటివి కదా అని అడిగితే లాగులో తొండలు విడుస్తా అంటడు. మహిళలకు రూ.2 వేలు ఏమాయె అంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటుండు. తులం బంగారం ఎప్పుడంటే పేగులు తీసి మెడలేసుకుంటా అంటుండు. ఇంతకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రా లేక బోటీ కొట్టేటోడా అర్థం కావడం లేదు. ఇక నుంచి ఆయన్ను లాగుల తొండల్రెడ్డి అనాలేమో’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరుతోపాటు వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదని అది భస్మాసుర హస్తమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటుతున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కామారెడ్డికి ఎన్నికల ప్రచారానికి వెళితే ఓ పెద్దమ్మ మాట్లాడుతూ.. రూ.4 వేలు పింఛన్ తీసుకునేవారు కాంగ్రెస్కు, బీఆర్ఎస్ హయాంలో రూ.2 వేలు పెన్షన్ తీసుకున్నోళ్లు కారు గుర్తుకు ఓటేయాలని తాండూరు ప్రజలకు చెప్పమని పంపించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోనియాగాం«దీపై ఒట్టేసి రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారని.. ఫిబ్రవరి వచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందలేదన్నారు. రేవంత్రెడ్డి పాలనలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి ఎన్నికలకు ముందు పచ్చి అబద్ధాల వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పైసలు పంపడంలో మాత్రమే సక్సెస్ అవుతున్నదని, రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తోందన్నారు. దొంగ, పోలీస్ కలిసి వర్ధన్నపేట ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజునుద్దేశించి విమర్శించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్పైనే కేసులు మోపుతున్నారని, నన్నేమైనా అంటే పడతానని..మా అయ్య జోలికి వస్తే మూడు భాషల్లో తిడతానన్నారు. ఎన్నికలు వచ్చినపుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రోహిత్రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
● ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● మహిళా సంఘాలకు రూ.567 కోట్ల చెక్కు అందజేత పరిగి: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జిల్లాలోని 6,650 మహిళా స్వయం సహయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.567.69 కోట్ల చెక్కును అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ పథకంలో మహిళలను భాగస్వామ్యం చేసిందన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను అందించామని వీటిద్వారా ప్రతినెలా ఒక్కో బస్సుపై రూ.70 వేల ఆదాయం వస్తోందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను ఒక్క మహిళ కూడా కట్టిన పాపన పోలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ చీరలు ఎంతో బాగున్నాయని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి టీఆర్ఆర్ వినతి జోగులాంబ జోన్లోని గండీడ్, మహ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలపాలని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి శనివారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డిని కోరారు. కేపీలక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయిన నేపథ్యంలో భూసేకరణ చేసి త్వరగా పనులను ప్రారంభించాలన్నారు. ఈ ప్రాంతానికి సాగు నీరు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజవకర్గంలోని 500 చెరువులకు నీరందించవచ్చన్నారు. సీఎం కృషితోనే మన్నెగూడ, అప్పా జంక్షన్ నాలుగు లేన్ల రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఏడాది తిరిగే లోపు పరిగి రూపురేఖలు మారుతాయని ధీమా వ్యక్తంచేశారు. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
● హామీలతో ఆకట్టుకున్న నాయకులు ప్రజాసంక్షేమమే లక్ష్యం కొడంగల్: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపాలిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఒకటో వార్డు అభ్యర్థి జగదీశ్వర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి 1,9వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, చేయి గుర్తుకు ఓటువేసి, తనతో పాటు.. 9వ వార్డు అభ్యర్థి గంట మంజులను గెలిపించాలని కోరారు. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం ● అభ్యర్థుల తరఫున నేతల పరుగు పురపోరు నేపథ్యంలో జిల్లాలో రాజకీయ హడావుడి నెలకొంది. ప్రచార, పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులకు మద్దతుగా కుటుంబీకులు, బంధుజనం, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఇంటింటికి తిరుగుతూ హామీలు గుప్పిస్తున్నారు. ఆదరించండి.. వార్డులను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని అభ్యర్థిస్తున్నారు. –సాక్షి, నెట్వర్క్ అవ్వా.. నీ ఓటు నాకే అనంతగిరి: ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సేవ చేస్తాను. ఆదరించండి అని కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు అభ్యర్థి సుధాకర్రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. అభివృద్ధి అధికార పార్టీతో సాధ్యమని, చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే.. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కరపత్రం ఇచ్చి.. ‘కారు’కు ఓటేయని తాండూరు టౌన్: ప్రజా సమస్యలు మాకు తెలుసు. కౌన్సిలర్ అభ్యర్థులను ఆదరించండి. వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమె శనివారం బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు, పట్లోళ్ల దీపకు మద్దతుగా 9, 10 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా రోహిత్ చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. అనంతగిరి: అధికార పార్టీ కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆ పార్టీ 22వ ఆలంపల్లి వార్డు అభ్యర్థి లంకా లక్ష్మీకాంత్రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. అందుబాటులో ఉండి, వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ప్రచారం చేస్తున్న లక్ష్మీకాంత్రెడ్డి తదితరులు -
మహిళ ఆత్మహత్యాయత్నం
దాయాదుల దాడికి భయపడేనని ఫిర్యాదు ధారూరు: దాయాదుల దాడికి భయపడి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటన మండల పరిధిలోని శేరిగడ్డతండాలో శుక్రవారం చోటుచేసుకోగా శనివారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన లోక్యానాయక్, పాండునాయక్ దాయాదులు. వీరి మధ్య ఇంటి స్థలం, వ్యవసాయ పొలాలకు సంబంధించిన గొడవలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్య రేణుకపై దాయాది పాండునాయతో పాటు అతని తల్లి రుక్కిబాయి, భార్య బుజ్జిబాయి, చెల్లెలు బుజ్జిబాయి కలిసి దాచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూకుమ్మడి దాడితో హడలిపోయిన తన భార్య తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగిందని ఫిర్యాదు ఇచ్చారు. మెట్లకుంటలో అగ్నిప్రమాదం బొంరాస్పేట: మండల పరిధిలోని మెట్లకుంటలో శనివారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఈడ్గి ఆలమ్మ వాటర్ ట్యాంకు వద్ద హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. హోటల్లో టీ చేస్తుండగా.. పొయ్యిలోని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు అంటుకున్నాయి. దీంతో కట్టె లు, గడ్డితో నిర్మించిన హోటల్ అగ్నికి ఆహుతైంది. గాయపడిన ఆలమ్మను గాంధీ ఆస్పత్రికి తరలించారు. సర్పంచు ఉమాదేవి, నాయకులు నర్సింలునాయుడు, హాజీమలంగ్బాబా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలికి మెరువైద్యం అందేలా చూస్తామన్నారు. ఒగ్గు కథ కళాకారిణి మృతి యాచారం: ప్రముఖ ఒగ్గు కథ కళాకారిణి జమ్మ మల్లారి(85) శనివారం మృతి చెందారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన ఆమె ఒగ్గు కథలపై మక్కువ పెంచుకుంది. ఆమె ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల, కురుమల కుటుంబాల్లో శుభాకార్యాలు నిర్వహించేవారు. ఆమె మృతికి సంతాపంగా గొల్ల, కురుమ సంఘాల పెద్దలు నివాళి అర్పించారు. తల్లీకుమారుడు అదృశ్యం కడ్తాల్: మహిళ అదృశ్యమైన ఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల సరస్వతి బాలరాజు దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి రెండేళ్ల కుమారుడు శ్రీచరణ్ ఉన్నాడు. నెల రోజుల క్రితం సరస్వతి తన కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన బాలరాజు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికాడు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా బాలరాజు మొదటి భార్య చనిపోయిన తర్వాత సరస్వతిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు సంతానం. -
తాండూరుకు మహర్దశ మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
తాండూరు: మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని ఎలక్షన్ అబ్జర్వర్ రవి అధికారులను ఆదేశించారు. శనివారం తాండూరు పట్టణంలోని స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. ఎన్నికల అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సుధీర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు: మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొననున్ను ప్రభుత్వ ఉద్యోగులు శనివారం పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఈ నెల 6న 10 మంది, శనివారం మరో 38 మంది ఓటు వేశారు. ఇందులో మహిళా ఉద్యోగులు 14 మంది, పురుష ఉద్యోగులు 34 మంది ఉన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి శంకర్పల్లి: రాష్ట్ర విభజన తర్వాత అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని.. సొంత ఇళ్లులా చక్కబెట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కొనియాడారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేసిందేమీలేదని, పొద్దున లేచినప్పటి నుంచి కేసీఆర్ని తిట్టడం, ఆయన జపం చేయడం తప్ప అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలని, ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక సమ్మెను జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశ వ్యాప్తంగా తలపెట్టిన కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లేబర్ కోడ్లు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దు, జాతీయ విద్యుత్ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా కార్మిక లోకం సమ్మె చేపడుతోందన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి బొంరాస్పేట: కళాశాల విద్యతోనే యువత భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, అందుకు తగిన ప్రణాళికలు, లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వారం రోజులుగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించగా కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్కు శనివారం 968 సంచుల కందులు వచ్చాయి. క్వింటాలుకు ఎక్కువగా రూ.8,250 మధ్యస్థంగా రూ.8,100, తక్కువగా రూ.7,800కు వ్యాపారులు కొనుగోలు చేశారు. గత వారంతో పోలిస్తే క్వింటాలుకు రూ.300 తగ్గడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. డీపీఓ జయసుధ బషీరాబాద్: పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి డీపీఓ జయసుధ స్పందించారు. మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై శనివారం ఎంపీడీఓ సంపత్కుమార్ చర్చించారు. అనుమతులు లేని భవన నిర్మాణాలను వెంటనే ఆపేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి జయకర్ నోటీసులు ఇచ్చిన యజమానులతో మాట్లాడి అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపట్టాలని సూచించారు. ఇబ్రహీంపట్నం రూరల్: సైబర్క్రైమ్తో అప్రమత్తంగా ఉండాలని, వాటి జోలికిపోయి మోసవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఆదిబట్ల పోలీస్స్టేషన్ ఆధ్వ ర్యంలో శంషాబాద్ డీసీపీ రాజేష్ అధ్యక్షతన శనివారం కొంగరకలాన్లోని శ్లోకా కన్వెన్షన్ హాల్లో జాగృతి హైదరాబాద్–సురక్షిత్ హైదరాబాద్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సజ్జనార్ మాట్లాడుతూ.. రోజురోజుకూ సైబర్మోసాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతోందని, స్మార్ట్ ఫోన్లతో సమస్యలు వస్తున్నాయన్నారు. ఆఫర్ల పేరుతో ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అనవసర లింక్లు, ఏపీకే యాప్లు వస్తే ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓపెన్ చేయాలని, లేదంటే డిలీట్ చేయాలని సూచించారు. మహిళలు సామాజిక మాధ్యమాల్లో వారి వ్యక్తిగత ఫొటోలు పెట్టుకోవద్దన్నారు. -
పట్టణ రూపురేఖలు మారుస్తా
● చైర్పర్సన్ అభ్యర్థి గడ్డం అనన్య ● పాల్గొన్న స్పీకర్ ప్రసాద్కుమార్అనంతగిరి: ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి గడ్డం అనన్య అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానని, వాటిని పరిష్కరించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి సమస్యపై అవగాహన ఉందన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ సహకారంతో వికారాబాద్ పట్టణ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. తనతోపాటు పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
● రెండేళ్లలో తాండూరుకు రూ.100 కోట్లు తెచ్చాం ● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తాండూరు పట్టణ ప్రజలు మనశ్శాంతిగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణ పరిధిలోని 8వ వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో పర్యటించి సాయప్పను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అయిన రెండేళ్లలో తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు తెచ్చినట్లు తెలిపారు. పాత తాండూరులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించామని గుర్తు చేశారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, నాయకులు ముజీబ్ ఖాన్, అబ్దుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంకు ఘన స్వాగతం
దోమ: పరిగి మండలానికి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి వచ్చారు. వారిని నారాయణపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభకు తీసుకెళ్లారు. సైడ్ లైట్స్ ● మధ్యాహ్నం 3.30గంటలకు పరిగి మండలం రాంరెడ్డిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం హెలికాప్టర్ చేరుకుంది. ● 3.33 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగి సభాస్థలికి బయలుదేరారు. ● 4.22 గంటలకు ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో ప్రసంగించారు. ● 44 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ● 5.06 గంటలకు ప్రసంగం ముగించి అక్కడి నుంచి తిరిగి హెలిపాడ్ వద్దకు 5.12 నిమిషాలకు చేరుకున్నారు. ● కాసేపు బస్సులో విశ్రాంతి తీసుకున్నారు. ● 5.25 నిమిషాలకు హైదరాబాద్కు తిరిగి బయలుదేరారు. -
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
బహిరంగ సభకు హాజరైన కార్యకర్తలు, నాయకులుఎన్ని నిధులైనా ఇస్తాపరిగి/వికారాబాద్: గోదావరి జలాలను జిల్లాకు తెచ్చి పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండలం నారాయణపూర్ సమీపంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లాకు వరాల జల్లు కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టి మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రంగారెడ్డికి చుక్కనీరు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి ఉమ్మడి జిల్లా బలైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ మంత్రి అయిన సబితారెడ్డి జిల్లా ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డు అడ్డంకులను కూడా తొలగించలేక పోయారని విమర్శించారు. ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి కారకులయ్యారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఈ సమస్యను తన దృష్టికి తెచ్చి అడ్డంకులను తొలగించడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. పరిగి నలుమూలలా నాలుగు లేన్ల రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూ సేకరణ పనులు పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు తెచ్చి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ట్రిపుల్ ఆర్, రేడియల్తో మేలు జిల్లాను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారుస్తామని సీఎం అన్నారు. మన ప్రాంతం మీదుగానే రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్డు వెళ్తాయని తెలిపారు. వికారాబాద్ – తాండూరు రోడ్డు పనులు త్వరలో పూర్తి చేసే బాధ్యత తనదే అన్నారు. రెండేళ్ల తమ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నది నుంచి తాగునీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలోపు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేసి జిల్లా రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లో బీజేపీ టికెట్లు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఒకరు చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్ పదవులు తీసుకునేందుకు ఒప్పంద్దం జరిగిందన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లో బీజేపీ అభ్యర్థులకు బీఫారాలు ఇస్తున్నారని తెలిపారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి శ్రీధర్బాబు, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు టీ రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం కుల్కచర్ల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం జరిగిన సీఎం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పురపాలికలను కై వశం చేసుకుంటామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తాం మక్తల్, నారాయణపేట, కొడంగల్కు కృష్ణా జలాలు కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టకు త్వరలో భూ సేకరణ వికారాబాద్ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ప్రజా పాలన – ప్రగతి బాటలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు వరాల జల్లు నగరానికే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలను వికారాబాద్ వరకు పొడగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సీఎంను కోరారు. అనంతగిరిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి 5వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న టెక్స్టైల్స్ పార్కును ప్రారంభించి ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలని సీఎంను కోరారు. -
కాంగ్రెస్కు ఓట్లు అడిగే అర్హత లేదు
కొడంగల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జ్ గట్టు రాంచందర్ రావ్ అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎకరానికి రూ.15 వేలు, మహిళలకు రూ.2,500, వృద్ధులు, వితంతులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛను ఇవ్వలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ జాడే లేదన్నారు. తులం బంగారం ఏమైందో ప్రజలకు చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కొడంగల్లో హస్తం పార్టీని ఓడిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అవుతాయని పేర్కొన్నారు. కొడంగల్కు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను, విద్యా సంస్థలను లగచర్లకు తరలించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జ్ గట్టు -
వికారాబాద్ను అగ్రగామిగా నిలుపుతాం
● మున్సిపల్ ఎన్నికల్లో అనన్యను ఆదరించండి ● స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ● పలు వార్డుల్లో రోడ్ షో అనంతగిరి: వికారాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అయిన రెండేళ్లలో వికారాబాద్ అభివృద్ధికి రూ.100 కోట్లు తెచ్చానని తెలిపారు. జిల్లా నుంచి సీఎం ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఈ ప్రాంతానికి అధిక నిధులు వస్తున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న నా కూతురు గడ్డం అనన్యను ఆదరించాలని కోరారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర బడ్జెట్ గాడిలో పడుతోందన్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి 5వేల ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేయించినట్లు పేర్కొన్నారు. ఇతర పార్టీలకు ఓట్లు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు. మీ అందరి ఆశీర్వాదం నా బిడ్డ అనన్య మీద ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డు అభ్యర్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదం అనుమానాస్పదం: కిషన్ రెడ్డి
సాక్షి వికారాబాద్: కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన వికారాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతుందని అడిగారు.సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదా అనే దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఓటుకు నోటు లాంటి కీలక కేసులు విచారణలో ఉండగా అగ్నిప్రమాదం జరగడం ఏంటన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత రెండున్నర ఏళ్లుగా BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు డూప్ డైలాగ్ లు కొడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్యాంట్ లో తొండలు వేస్తా, గుడ్లు పీకుతా, నాలుక కోస్తా, జైల్లో చిప్ప కూడు తినిపిస్తా అంటూ రేవంత్ డమ్మీ డైలాగ్ లతో టైంపాస్ చేస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. ఇక ఇది చాలక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆ దమ్ము రేవంత్ కెక్కడిదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.బీజేపీ భూజాల మీద బంధూకు పెట్టి ఎక్కువ రోజులు నాటకాలు ఆడలేరని సీఎం పదవికి విలువ ఉంటుందని అనవసరంగా సీఎం బాధ్యతను ఇంకొకరిపై నెట్టకుడదని ఈసందర్భంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి పై విచారణ చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. -
ఆటో బోల్తా: పలువురికి గాయాలు
యాలాల: మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం మండలంలోని అచ్యుతాపూర్ గేటు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్దాయిపేట నుంచి తాండూరు వైపు వెళుతున్న ట్రాలీ ఆటో, మార్గమధ్యలో అచ్యుతాపూర్ గేటు మూలమలుపు వద్ద అదుపు తప్పింది. ఆటో వెనుక భాగంలో కూర్చున్న ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సులో తాండూరుకు తరలించారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. ● కష్టపడిన వారికి అవకాశం ● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తాండూరు: సంప్రదాయ రాజకీయాలకు చెక్ పెట్టి, పార్టీ కోసం కష్టపడిన వారికి మున్సిపాలిటీ ఎన్నికల్లో అవకాశం కల్పించానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని 6వ వారు నుంచి 10వ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని, బీఆర్ఎస్ను ఆదరిస్తే.. అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. రెండేళ్ల వ్యవధిలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. పాత తాండూరు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను మీ ఇంటి బిడ్డగా భావించి గెలిపించాలని కోరారు. అనంతరం 6వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డుల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనేఅభివృద్ధి సాధ్యం -
ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య
మర్పల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు పురుగు మందు తాగి ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ ఘటన మర్పల్లి మండల పరిధిలోని తిమ్మాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన హరిజన నర్సింలు (45) తనకున్న కొద్ది పాటి భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. రెక్కల కష్టంతోనే ఇద్దరు బిడ్డల వివాహం చేశాడు. కొడుకును హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. కూతుళ్ల వివాహాలకు చేసిన అప్పులు, కుమారుడి చదువు కోసం పెడుతున్న ఖర్చులు నర్సింలుకు తలకు మించిన భారంగా మారాయి. ఈక్రమంలో గురువారం సాయంత్రం పొలానికి వెళ్తున్నట్లు భార్య లక్ష్మికి చెప్పాడు. కొద్ది సేపటికే తాను పురుగు మందు తాగానని ఫోన్ చేయడంతో ఆందోళనకు గురై ఆమె స్థానికులను తీసుకుని పొలం వద్దకు వెళ్లగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే వికారాబాద్లోని మిషన్ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు నగరానికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం నర్సింలు మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవూఫ్ తెలిపారు. -
ఆ పార్టీలకు ఓట్లు వేస్తే.. ఎంఐఎంకి వేసినట్లే
● ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పింది ● బీజేపీ అధికార ప్రతినిధి, సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ● తాండూరులో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం తాండూరు: కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేస్తే ఎంఐఎం పార్టీకి వేసినట్లేనని బీజేపీ అధికార ప్రతినిధి, సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యూ రమేష్కుమార్, యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్గుప్తాతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాండూరులో ఏ ఇంటికి వెళ్లినా ప్రతి ఒక్కరూ బీజేపీ రావాలి.. కావాలంటున్నారని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ తాండూరుకు వస్తున్నట్లు తెలిసిందని, 40 ఏళ్లుగా హైదరాబాద్ను పాలిస్తున్న ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబాన్ని అభివృద్ధి చేసిందని ఆరోపించారు. కేవలం మత రాజకీయం చేస్తూ ముస్లిం మైనార్టీలను మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తీ చేస్తోందని ఆరోపించారు. మతం పేరుతో ఓట్లు అడిగేందుకు వస్తున్న ఎంఐఎం పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవుళ్లపై ప్రమాణం చేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి నో గ్యారంటీగా మిగిలారన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకుందన్నారు. ఆస్తి తగాదాలతో కుటుంబం గొడవ పడుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మనోహర్రావు, అభ్యర్థులు ఇందూర్ రాములు, కృష్ణ ముదిరాజ్, భద్రేశ్వర్, నాయకులు విజయ్కుమార్, సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చంపుతారనే భయంతో చంపేశా
● నేరాన్ని అంగీకరించిన నిందితుడు ● వివరాలు వెల్లడించిన ధారూరు సీఐ రఘురామ్ ధారూరు: తన తండ్రిని చంపిన వ్యక్తులు తనను కూడా చంపుతారనే భయంతోనే శంకర్నాయక్ను హత్యచేసినట్లు హంతకుడు సబావత్ సాయికిరణ్ పోలీసుల విచారణలో అంగీకరించాడని సీఐ రఘురామ్ తెలిపారు. ధారూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాంపూర్తండాకు చెందిన శంకర్నాయక్, మోహన్నాయక్ దాయాదులు. ఆగస్టు 1వ తేదీ, 2025 రోజున మోహన్నాయక్ కోడి, దాని పిల్లలు శంకర్నాయక్ ఇంట్లోకి వెళ్లాయి. కోడి చనిపోవడంతో మోహన్నాయక్ వెళ్లి వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన శంకర్నాయక్ అతని భార్య, కొడుకు కలిసి అతనిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్నాయక్ చనిపోయాడు. దీంతో నిందితులు ముగ్గురూ జైలుకు వెళ్లి, బెయిల్పై వచ్చారు. గ్రామంలో ఉంటే తమను చంపుతారనే భయంతో శంకర్నాయక్ కుటుంబం హైదరాబాద్కు మకాం మార్చింది. అయితే, జైలు నుంచి బయటకు వచ్చిన శంకర్నాయక్, అతని కొడుకు కలిసి తనను చంపుతారనే భయంతోనే వీరిని చంపేందుకు సాయికిరణ్ పథకం సిద్ధం చేసుకున్నాడు. గత నెల సంక్రాంతి పండుగ సందర్భంగా ధారూరు సంతలో కత్తి కొనుగోలు చేశాడు. ఒంటరిగా పింఛన్ డబ్బుల కోసం వచ్చిన శంకర్నాయక్ను స్కూటర్తో ఢీకొట్టి, కత్తితో గొంతులో పొడిచి హత్య చేశాడు. శుక్రవారం అరెస్టు చేసి కత్తి, స్కూటీని, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు
పరిగి: మండలంలో ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ స్నేహమెహ్ర పరిశీలించారు. నారాయణపూర్ సమీయపంలో సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40వేల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. హెలిప్యాడ్, వేదిక వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలాలు కేటాయించాలన్నారు. ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘రేడియల్’ సర్వే పకడ్బందీగా జరగాలి దోమ: రేడియల్ రహదారి నిర్మాణం కోసం పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. గురువారం దోమ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురాతన రికార్డులను భద్ర పరచాలని సూచించారు. పెండింగ్ ఫైళ్లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. రేడియల్ రోడ్డుకు రైతులు అభ్యంతరం తెలిపితే తమ దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ గోవిందమ్మ, డీటీ నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ పర్వేజ్, ఆర్ఐలు రాంజేంద్రర్రావ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ -
పుర పోరు నారీ జోరు
వికారాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో మేము సైతం అంటూ మహిళలు దూసుకెళ్తున్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో కదం తొక్కుతున్నారు. జనరల్ కేటగిరీలో సైతం సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. ప్రస్తుతం అన్ని వార్డు స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న పుర పాలనలో భాగస్వాములు కానున్నారు. జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు.. వంద వార్డులు ఉన్నాయి. రెండు చైర్పర్సన్ పదవులు, 44 వార్డులు మహిళలకు కేటాయించారు. పరిగి పుర పీఠం బీసీ మహిళకు, వికారాబాద్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. వికారాబాద్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూతురు గడ్డం అనన్యను అధికార కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించలేదు. పరిగిలో కాంగ్రెస్, బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థులు ఎవరనేది ఇంకా కొలిక్కి రాలేదు. బీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు శివన్నొళ్ల భాస్కర్ సతీమణి చంద్రకళను ప్రకటించారు. ఆమె 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ను బీసీ జనరల్కు, కొడంగల్ను జనరల్కు కేటాయించారు. ఈ రెండు చోట్ల కూడా ఎక్కువ మంది మహిళా అభ్యర్థులే బరిలో ఉన్నారు. అవకాశం కలిసొస్తే పుర పీఠాన్ని నారీమణులే దక్కించుకునే అవకాశం లేకపోలేదు. అత్యధికంగా మహిళలే.. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 341 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 149 మంది పురుషులు కాగా 192 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 50 శాతానికే మించి నారీమణులు పోటీ చేస్తున్నారు. పతులకు బదులు సతులు రిజర్వేషన్లు అనుకూలంగా రాని స్థానాల్లో ఆశావహులు తమ భార్యలను బరిలో నిలిపారు. పరిగి పుర పీఠం బీసీ మహిళకు, వికారాబాద్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న వారు.. ఆ సామాజిక వర్గాలకు కేటాయించిన వార్డుల్లో కాకుండా వారికి బలం ఉన్న జనరల్ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈ కారణంగా కూడా మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువైంది. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం ఊపందుకుంది. మహిళలు.. పురుషులకు దీటుగా జనంలోకి దూసుకెళ్తున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడించనున్నారు. పాలనలో వారు సైతం పుర పాలనలో మహిళలు భాగస్వాములు కానున్నారు. పురుషుల కంటే ఎక్కువగా పాలక వర్గంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న వారి సంఖ్య చూస్తే పురుష అభ్యర్థుల కంటే వారే ఎక్కువగా ఉన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో అత్యధికంగా ఎన్నికల బరిలో నిలిచారు. మున్సిపాలిటీల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులు వికారాబాద్లో.. వార్డులు – 34 పురుషులు – 50 మహిళలు – 62 తాండూరులో.. వార్డులు – 36 పురుషులు – 58 మహిళలు – 77 పరిగిలో.. వార్డులు – 18 పురుషులు – 26 మహిళలు – 34 కొడంగల్లో.. వార్డులు – 12 పురుషులు – 15 మహిళలు – 19 సగం స్థానాల్లో మహిళా అభ్యర్థుల పోటీ నాలుగింటిలో రెండు చైర్పర్సన్ పీఠాలు వారికే ఎన్నికలో బరిలో 341మంది అభ్యర్థులు మహిళలు 192, పురుషులు 149 పుర పాలనలో భాగస్వామ్యం కానున్న నారీమణులు -
మెరుగైన వైద్యం మన బాధ్యత
ధారూరు: ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి అన్నారు. గురువారం మండలంలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, మందులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిత్తశుద్ధితో పనిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారిని ఆప్యాయంగా పలకరించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నిషియన్ ప్రీతమ్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. పీహెచ్సీల సందర్శన బంట్వారం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి అన్నారు. గురువారం బంట్వారం, కోట్పల్లి పీహెచ్సీలను సందర్శించారు. వైద్యులు మజీద్ఖాన్, మేఘనతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రక్త నమూనాల సేకరణ, రిపోర్టుల అందజేతపై ఆరా తీశారు. పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. అనంతరం బార్వాద్ సబ్ సెంటర్ను, కరీంపూర్ పీహెచ్సీని తనిఖీ చేశారు. డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి -
మెజార్టీ మున్సిపాలిటీల్లో గెలుస్తాం
● ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ● బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం తాండూరు: చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మెజార్టీ మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 24, 25, 27, 33, 34వ వార్డుల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యూ రమేష్కుమార్తో కలిసి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో ప్రజల మద్దతు బీజేపీకే ఉందన్నారు. కార్యక్రమంలో 24వ వార్డు అభ్యర్థి సాహు శ్రీలత, పార్టీ స్థానిక సంస్థల జిల్లా కన్వీనర్ బాలేశ్వర్గుప్తా, నాయకులు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ అభ్యర్థి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న టి.ఆనంద్కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర నాయకుడు మహిపాల్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం అనన్యకు సంపూర్ణ మద్దతుగా అధికార పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం మర్యాదపూర్వకంగా స్పీకర్ ప్రసాద్కుమార్ను కలిశారు. కార్యక్రమంలో నాయకులు నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వికారాబాద్లో అభివృద్ధి ఎక్కడుంది?
● శాసన సభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ● స్పీకర్ ప్రసాద్ కుమార్పై పరోక్ష విమర్శలు వికారాబాద్: వికారాబాద్ పరిస్థితి చూస్తుంటే స్పీకర్ ప్రసాద్కుమార్ అచేతనత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని శాసనసభ మాజీ స్పీకర్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, విద్యామౌలిక వనరుల సంస్థ మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వికారాబాద్లో అభివృద్ధి ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. స్పీకర్ పదవి పెద్దదని, తాను కూడా గతంలో పనిచేశానని తెలిపారు. ఆహోదాలో ఉన్న వారు అనుకుంటే తమ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కానీ ప్రస్తుతం వికారాబాద్ను చూస్తుంటే బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి మినహా ఏమీ కనిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం వికారాబాద్కు నిధులు కేటాయిస్తే వాటిని కూడా రద్దు చేయించారని ఆరోపించారు. ప్రస్తుత స్పీకర్ను చూస్తుంటే జాలేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్రెడ్డితో పాటు ఆయన ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వచ్చాక వికారాబాద్లో ఒక్కరికై నా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. ఆయన(ప్రసాద్కుమార్)కు మాత్రం రాష్ట్రంలోనే పెద్ద ఉద్యోగం వచ్చిందని, ఇది చాలదన్నట్లుగా వికారాబాద్ మున్సిపాలిటీని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయించుకుని, ఆయన కూతురును బరిలో నిలిపారని ఎద్దేవా చేశారు. శుభప్రద్పటేల్ మాట్లాడుతూ.. వికారాబాద్లో సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారని, కొందరు నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాల్, వేణుగోపాల్రెడ్డి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పద్దు తప్పొద్దు హద్దు మీరొద్దు
వికారాబాద్: ఎన్నికల వ్యయాన్ని నియంత్రించడానికి ఎలక్షన్ కమిషన్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అభ్యర్థుల ఖర్చు విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు స్థానాలకు పోటీ చేసే వారు రూ.లక్షకు మించి ఖర్చు చేయరాదు.. ఒక వేళ నిబంధనలు అతిక్రమిస్తే.. గెలుపొందినా అనర్హత వేటు వేస్తారు. కానీ అభ్యర్థులు ఇవేవీ లెక్కచేయడం లేదు. పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు ధన ప్రవాహం పారుతోంది. రోజువారీ లెక్క తప్పని సరి అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని కట్టడి చేయడానికి ఈసీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. గతంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి అభ్యర్థులు వారు ఖర్చు చేసిన లెక్కల వివరాలు అధికారులకు అందజేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రచారం ప్రారంభించింది మొదలు రోజువారి లెక్కలు చూపించాల్సిందే. ఇందుకు సంబంధించిన పత్రాలను జిల్లా ఎన్నికల అధికారికి ఏరోజుకారోజు పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్సైట్లో పొందుపరచాలి. అదే విధంగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే వారి వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే అంతే.. ఎన్నికల ఖర్చు విషయంలో ఆయా పార్టీలు అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.. పొరపాట్లు జరిగితే గెలిచినా ఫలితం ఉండదని హెచ్చరిస్తున్నాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, వంద వార్డులు ఉన్నాయి. అందులో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా 98 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు జనం బాట పట్టారు. నిత్యం వాహనాలకు, మందు, విందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. జనరల్ వార్డుల్లో ఖర్చు ఎక్కువగా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతి వార్డులో టెంట్లు వెలిశాయి.. అక్కడే వంట తయారు చేసి వడ్డిస్తున్నారు. ప్రచారంలో మహిళలకు మంచి డిమాండ్ ఉంది. రోజుకు రూ.500, భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల అమలుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డబ్బు, మద్యం రవాణా కట్టడికి చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. అభ్యర్థుల ఖర్చుపై నిఘా ఉంచారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎవరైనా ఎక్కడైనా మద్యం నిల్వ చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ ఎన్నికల ఖర్చు సమర్పించాల్సిందే రూ.లక్ష దాటితే అనర్హత వేటే మార్గదర్శకాలు విడుదల చేసిన ఈసీ మున్సిపాలిటీల్లో మొదలైన ప్రచార పర్వం గల్లీకి నాలుగు షెల్టర్లు అక్కడే తినాలి.. రాత్రి వరకు తిరగాలి -
వివక్ష లేని సమాజమే లక్ష్యం
● ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి ● కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ స్నేహ మెహ్ర, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మార్పు రావాలన్న సదుద్దేశంతో ఏటా ఫిబ్రవరి 4న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సమానత్వం, న్యాయం, గౌరవం కోసం నిలబడాలని, ఏ రూపంలో అన్యాయం జరిగినా సమర్థించరాదన్నారు. అంబేడ్కర్ ఎన్నో విలువలతో కూడిన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని గుర్తుంచారు. రాజ్యాంగ సూత్రాలను సమర్థిస్తూ న్యాయమైన, సామరస్య పూర్వకమైన, సాధికారత కలిగిన తెలంగాణ కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రమేష్, జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, డీబీసీడీఓ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో సక్సెస్ చేద్దాం
● మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటిపొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు ● జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి అనంతగిరి: మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ రవి సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యతగా పని చేసి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. అభ్యర్థుల ప్రచార ఖర్చులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా కథనాలపై నిఘా ఉంచాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూసుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం పంపిణీని కట్టడి చేయాలని తెలిపారు. జోనల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల సామగ్రి పొందిన తర్వాత సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మద్యం, డబ్బు రవాణా కాకుండా తనిఖీలు చేపట్టామన్నారు. జిల్లాలో 36 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థి రూ.లక్ష వరకు ఖర్చు చేసుకోవచ్చని తెలిపారు. బ్యాంక్ ఖాతా తెరచి నామినేషన్ వేసిన నాటి నుంచి ప్రతిరోజు ఖర్చుకు సంబంధించి ఓచర్లపై సంతకం చేసి చూపించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, నోడల్, జోనల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ సహకరించాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి కోరారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కోడ్పై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమాలను విధిగా పాటించాలన్నారు. సమావేశాలు, ర్యాలీలకు ముందుగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రార్థన స్థలాల్లో ప్రచారం చేయరాదన్నారు. ప్రతి వార్డులో బూతు స్థాయి అధికారులు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారని చెప్పారు. పోలింగ్కు 48 గంటల ముందుగానే ప్రచారం ఆపేయాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీకి సుదర్శన్గౌడ్ రాజీనామా
తాండూరు టౌన్: భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోరేపల్లి సుదర్శన్ గౌడ్ ప్రకటించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున 28వ వార్డు నుంచి పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోన తన భార్యకు ఈసారి టికెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఏళ్ల తరబడిగా పార్టీ జెండా మోస్తున్న మా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. ఈసారి 28వ వార్డులో పార్టీ పట్టణాధ్యక్షుడు నాగారం మల్లేశంకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నట్లు చెప్పారు. ఆయన ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొత్తపల్లి గ్రామంలో ఓటు వేశారన్నారు. అక్కడ ఓటేసి ఇక్కడ పోటీ చేయడం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లేనన్నారు. ఆయన గెలిచినప్పటికీ ఆరు మాసాల్లో పదవి పోతుందన్నారు. తాండూరు, జిల్లా నాయకుల తీరు పట్ల అసహనంతో రాజీనామా చేసినట్లు చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి దృష్టికి తన విషయాన్ని తీసుకెళ్తే తనకు సంబంధం లేనట్లు మాట్లాడటం విడ్డూరమన్నారు. అందుకే రాజీనామా చేశానట్లు చెప్పారు. తాండూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తనను ఫోన్లో సంప్రదించి సానుభూతి వ్యక్తం చేశారన్నారు. తాను ఏ పార్టీలో చేరే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు. జిల్లా నాయకులపై తీవ్ర ఆరోపణలు -
చెక్డ్యాం పనుల్లో వేగం పెంచండి
యాలాల: మండలంలోని సంగెంకుర్దు శివారులో కాగ్నా నదిపై చేపడుతున్న చెక్ డ్యాం పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్ సీఈ(చీఫ్ ఇంజినీర్) సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఎస్ఈ రవికుమార్, ఈఈ అశోక్కుమార్, డీఈ స్వామి, ఏఈఈ భానుప్రసాద్ తదితరులతో కలిసి పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్ పనులను నిలిపివేయడంతో కొత్తగా వారికి అప్పగిస్తామని తెలిపారు. రూ.7 కోట్లతో నిర్మిస్తున్న చెక్డ్యాం 3.2 ఎత్తు, 280 మీటర్ల పొడువుతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, సైట్ ఇంజినీర్ రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఇరిగేషన్ సీఈ సత్యనారాయణరెడ్డి -
గోనెసంచిలో కాకులు
యాలాల: కాకులను పట్టుకొని ద్విచక్రవాహనంపై తరలిస్తున్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలల మండలం ముద్దాయిపేటలో గురువా రం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ముర్గీచౌక్, ఫలక్నుమా ప్రాంతానికి చెందిన రహమత్, అమీర్ బాగాయిపల్లి సమీపంలో పట్టుకున్న సుమారు యాభై కాకులను గోనెసంచిలో వేసుకుని స్కూటీపై ముద్దాయి పేటకు వచ్చారు. ఇది గమనించిన గ్రామస్తులు వీరిని అడ్డగించి, వివరాలు అడిగారు. తాము హైదరాబాద్కు చెందినవారమని, గత మూడు నెలలుగా పరిగి, కొడంగల్, మహబూబ్నగర్, కమాల్పూర్, బాగాయిపల్లి తదితర ప్రాంతాల్లో కాకులు పట్టుకుని తీసుకెళ్తున్నామని చెప్పారు. వీరి మాటలకు ఆశ్చర్యపోయిన స్థానికులు అనుమానంతో యాలాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి యువకులను పీఎస్కు తరలించారు. ఈ విషయమై ఎస్ఐ విఠల్రెడ్డిని వివరణ కోరగా.. కాకులను పట్టుకెళ్తున్న యువకులు వీటిని నగరంలో విక్రయిస్తున్నారని, చిన్నపిల్లలకు దిష్టి తగిలితే కుటుంబ సభ్యులు కాకిని కొనుక్కెళ్లి వారిపైనుంచి తిప్పి వదిలేస్తారని విచారణలో చెప్పారన్నారు. యువకులు పట్టుకున్న కాకులను అటవీ శాఖ అధికారుల సమక్షంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. అనంతరం ఇద్దరినీ స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి పంపించామన్నారు. కాకులను తీసుకెళ్లి దిష్టి తీసేందుకే వినియోగిస్తున్నారా? మరో కోణం ఏదైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బీజేపీ జాతీయ నాయకురాలు బంగారు శృతి
బీజేపీతోనే పట్టణ అభివృద్ధి అనంతగిరి: బీజేపీతోనే పట్టణాల అభివృద్ది సాధ్యమని బీజేపీ జాతీయ నాయకురాలు, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి బంగారు శృతి అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్ మున్సిపాలిటీల్లో 26 వార్డుల్లో బరిలో నిలిచామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మున్సిపల్ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులతోనే పట్టణాల అభివృద్ధి కొనసాగుతోందని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించిందన్నారు. వికారాబాద్ మున్సిపల్ను బీజేపీ కై వసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కో కన్వీనర్ నల్లకుంట కార్పొరేటర్ అమృత, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర నాయకులు శివరాజు, వడ్లనందు, శ్రీధర్రెడ్డి, నవీన్కుమార్, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, రాజేందర్రెడ్డి, సుచరితారెడ్డి, కేపీ రాజు, నందు, రాచ శ్రీనివాస్రెడ్డి, బస్వలింగం తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఉపాధ్యాయుడు మృతి
యాలాల: విద్యుదాఘాతంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి కోకట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ మహమూద్(46), రాస్నం ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్గా విధులు నిర్వహిస్తున్నాడు. వారికి చెందిన పిండి గిర్ని మర మ్మతుకు గురైంది. సమస్యను పరిష్కరించి, పాఠశాలకు వెళ్లాలన్న ఉద్దేశంతో రిపేర్ చేస్తుండగా.. కరెంట్ షాక్కు గురై అక్కడే పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు అతన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫర్జా న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, కూతుర్లు హుమేరా, నమీరా, జునేరా, కొడుకులు ముక్సీద్, రయాన్ ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పీఆర్టీయూ నాయకుల సంతాపం మహమూద్ మృతికి పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు సంతాపం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు మృతి బాధాకరమన్నారు. మృతుడు యూనియన్లో కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ రాజేందర్రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, మాజీ ఎంపీటీసీ శంకర్ తదితరులు పరామర్శించారు. -
బరి.. అభ్యర్థుల గురి
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో హడావుడి నెలకొంది. నామినేషన్ల పర్వం, స్క్రూట్నీ, బుజ్జగింపులు, ఉపసంహరణ, అభ్యర్థులు, వారికి గుర్తుల కేటాయింపు ముగిసింది. మద్దతుదారులతో ప్రచారం జోరందుకుంది. కొడంగల్: కొడంగల్ పురపాలకలో పార్టీల వారీగా అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఎన్నికల బరిలో 34 మంది పోటీలో ఉన్నారు. 12 వార్డులకు 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, బీఆర్ఎస్ 9, బీజేపీ రెండు, ఎంఐఎం రెండు, సీపీఐ(ఎం) ఒక వార్డు కాగా.. స్వతంత్రులు 8 మంది బరిలో ఉన్నారు. వార్డుల వారీగా.. ఒకటి జగదీశ్వర్రెడ్డి(కాంగ్రెస్), గుల్షన్(ఎంఐఎం), రెండులో ఊట్కూర్ మంజుల (కాంగ్రెస్), వాణిశ్రీ యాదవ్(బీఆర్ఎస్), మూడులో గొల్ల లక్ష్మమ్మ(కా), సోన(బీ), నాలుగులో నందారం ప్రశాంత్(కా), బాలరాజ్(బీ), ఐదులో బాలమ్మ(కా), శ్యామమ్మ(బీ), ఆరో వార్డులో సయ్యద్ హమీద్ అలీ(కా), గంటి సురేష్కుమార్ సీపీఐ(ఎం), పవన్కుమార్ లాహోటీ, మహ్మద్ అలీ స్వతంత్ర అభ్యర్థులు. ఏడులో కృష్ణంరాజు (కా), మహేశ్ బాబు (బీజేపీ), కె.వెంకటయ్య (స్వతంత్ర). 8లో శంకర్(కా), కిషన్(బీ), పూజ, వనితా స్వతంత్ర అభ్యర్థులు. 9లో గంట మంజుల (కా), అమీనా బేగం(బీ), సన ఆప్రీనా (మజ్లిస్), 10లో రాజశేఖర్ (కా), చంద్రశేఖర్ (బీ), 11లో అనిత (కా), మంజుల (బీ), లక్ష్మీ (బీజేపీ), 12లో సుష్మ(కా), లలిత(బీ), అంజిలమ్మ, బుడ్డ శ్రావణి, మాల శ్రావణి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పార్టీల వారీగా గెలుపుగుర్రాల ఎంపిక మద్దతు దారులతో విస్తృతంగా ప్రచారం కొడంగల్ మున్సిపాలిటీలో.. 34 మంది అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన నేతలు -
అన్ని వర్గాలకు సామాజిక న్యాయం
తాండూరు: మున్సిపాలిటీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేసిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. పురపోరు బరిలో నిలిచిన 36 మంది అభ్యర్థులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్తో కలసి బుధవారం బీ ఫారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత కల్పించామన్నారు. వార్డుల రిజర్వేషన్ల ప్రకారం అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని పేర్కొన్నారు. బీసీలకు 15, మైనార్టీలకు 9, ముదిరాజ్ సామాజిక వర్గానికి 5, కుర్వసామాజిక వర్గానికి 1, గౌడ 1, బ్రాహ్మణులకు 1, ఆర్యవైశ్యులకు1, వీరశైవులకు 4, ఎస్టీ 1, ఎస్సీలకు 3, ఉప్పరి 1, మున్నూర్ కాపులకు 3, రెడ్డిలకు 1 చొప్పున పోటీ చేసేందుకు అవకాశం కల్పించామని వివరించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారిని పట్టించుకోకుండా గెలుపు దిశగా ప్రచారంలో దూసుకుపోవాలని అభ్యర్థులకు సూచించారు. సమన్వయంతో.. బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి, రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన పనులను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అభ్యర్థులు, నాయకులదేనని స్పష్టం చేశారు. పార్టీ ఇన్చార్జిలతో అభ్యర్థులు సమన్వయంతో ప్రచారం కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, ఎన్నికల పరిశీలకులు రాంశెట్టి, కోఆర్డినేటర్ ఇఫ్తాకార్, అశోక్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు దక్కించుకుంటాం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ప్రతిపక్ష నాయకుల మాటలను పట్టించుకోవద్దు అభ్యర్థులకు దిశానిర్దేశం -
తాండూరులో 135 మంది
తాండూరు: మున్సిపాలిటీ ఎన్నికలకు పార్టీల వారీగా కౌన్సిలర్ అభ్యర్థుల ప్రకటన ముగిసింది. మొత్తం 183 నామినేషన్లు రాగా అందులో 48 మంది ఉపసంహరించుకున్నారు. మిగతా 135 మంది బరిలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 36 మంది, బీఆర్ఎస్ 36, బీజేపీ 28, ఎంఐఎం 15 మందితో పాటు.. స్వతంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వార్డుల వారీగా.. లలిత మిట్టి(1వ వార్డు), ప్రత్యుషమజ్దేవి(2), తయ్యబసుల్తానా(3), షేక్ మెహరున్నీసీ బేగం(4), తన్వీర్ సుల్తానా(5), బోయరవిరాజ్(6), రొయ్యల నాగరాజు(7), సాయప్ప(8), పట్లోళ్ల చైతన్య(9), అల్లాపూర్ శ్రీకాంత్(10), బంటు వేణుగోపాల్(11), పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి(13), జాదవ్ రాములు(13), మహియా అంజూమ్(14), దివిటి ఎల్లప్ప(15) నారా శ్రీలత (16), సన తబస్సుమ్(17), గౌరీ రాములు(18), జుంటిపల్లి వెంకట్(19), బిర్కట్ జ్యోతి(20), సబా ఫాతిమా(21), మణప్పురం రామకృష్ణ(22), దొరశెట్టి సత్యమూర్తి(23), బాలకృష్ణారెడ్డి(24), రొయ్యల మధుబాల(25), వైశాలిగౌడ్(26), ఉప్పరి స్వరూప(27), విజయభాస్కర్ (28), అబ్దుల్ రజాక్(29), మెహరాజ్ బేగం(30), మహేశ్సింగ్ ఠాకూర్(31), పొట్టి శిల్ప పాటిల్(32), ప్రహ్లాద్ కుల్కర్ణి(33), బంటారం మాలతి(34), అఫ్షమైనా(35), కల్వ సిరి చందన(36). బీఆర్ఎస్ నుంచి.. నాగలక్ష్మి అనంత్రెడ్డి(1), వినయశీల(2), నిషాటు నీసా(3), అనూషబాయి(4), ఇర్ఫానాబేగం(5), అనిల్ఆర్మి(6), ఇర్షద్(7), జావీద్(8), పట్లోళ్ల దీపనర్సింహులు(9), పట్లోళ్ల నర్సింహులు(10), రాజేష్చారి(11), ఎండీ యూనస్బాబా(12), సురేష్నాయక్(13), నాజియా సారా(14), బొబ్బిలి శోభారాణి(15), ఎర్రం వసంత(16), ఆఫ్రీన్ బేగం(17), సంజీవరావు(18), బాంబినో(19), నవీన(20), టిప్పు(21), భాస్కర్(22), పరిమళ(23), కోట్రికె నాగలక్ష్మి(24), నసీరా భాను(25), బంటారం రూపాలి(26), బొప్పి సుకన్య(27), అనురాధ(28), సిద్దుగౌడ్(29), సబియా ఫాతిమా(30), యోగానంద్(31), మహేశ్వరి(32), నరేందర్గౌడ్(33), సుప్రిత(34), ఫాతిమాసఫియా ఆసీఫ్(35), రపాపాటిల్(36). బీజేపీ నుంచి.. మహేశ్వరి(1), మౌనిక (2), లక్ష్మి(3), అర్చన (4), దోమకృష్ణ ముదిరాజ్(6), సుగంఽధి రోహిత్ కుమార్(8), కావలి కృష్ణ(10), రాములు(11), రజనికాంత్(12), సాయికుమార్ అద్వాని(13), రాము(15), మాలతి శోభారాణి(16), అభిలాష్ పండిత్(18), వినయ్కుమార్(19), ప్రహ్లద్రావు జాదవ్(21), బిచ్చప్ప(22). కిరణ్కుమార్(23). శ్రీలత(24). అంబిక ముదిరాజ్(25), సులోచన (26), అపర్ణ(27), మల్లేశం(28), రాజేష్(29), అంజలి(31), గాయత్రి(32, శ్రీకాంత్రెడ్డి(33), లావణ్య భద్రేశ్వర్(34), వనిత(36). ఎంఐఎం నుంచి.. అక్సాజహరా(3), అమీనాబేగం(4), హబీబాబేగం(5), అజారుద్దీన్(7), ప్రవీణ(14), అమీనాబేగం(17), మోయిజ్ఖాన్(18), విజయలక్ష్మి(19), షాహిన్బేగం(20), మోక్తార్ అహ్మద్(21), ఎంఏ హఫీజ్ శాహేరీ(22), అయోషాబేగం(26), మహ్మద్ అఫ్జల్(31), బాబియాసుల్తానా(32), ఆరీఫాబీ(35). -
ఒక్క అవకాశం ఇవ్వండి
తాండూరు టౌన్: కౌన్సిలర్గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ 19వ వార్డు అభ్యర్థి జుంటుపల్లి వెంకటేశ్ కోరారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆయన తన మద్దతుదారులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి ఆదరిస్తే.. వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దు ఆర్ఐ వెంకటేశ్ దోమ: రేడియల్ రింగు రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందొద్దని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని మోత్కూర్, ఖమ్మంనాచారం గ్రామాలలో రేడియల్ రింగు రోడ్డు వెళ్తున్న భూములను పరిశీలించి సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పరిహారం విషయంలో చర్చిస్తారని చెప్పారు. ప్రతీ రైతుకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ కిరణ్కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత యాలాల: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధి బానాపూర్ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను.. రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అను మతి లేకుండా ఆ గ్రామానికి చెందిన జర్పుల నీళ్యానాయక్ ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తిని కుటుంబీకులకు అప్పగింత కడ్తాల్: మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని గుర్తించిన కడ్తాల్ పోలీసులు కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గుడిబండతండాకు చెందిన బాణవత్ రాంచందర్ ఇటీవల మానసిక పరిస్థితి సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండల కేంద్రంలో అన్మాస్పల్లి కూడలిలో తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న కడ్తాల్ పోలీస్ సిబ్బంది, అతన్ని క్షేమంగా పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు రాంచందర్ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నీటి కటకట రానీయొద్దు
● రాబోయే పాలకవర్గానికి మున్సిపల్ ప్రజల సూచన ● గెలిచిన వెంటనే నీటి సరఫరాకు ప్రణాళిక రచించాలని అభ్యర్థన కొడంగల్: మున్సిపల్ పరిధిలోని కొండారెడ్డిపల్లి, బూల్కాపూర్, ఐనన్పల్లి, పాత కొడంగల్, పాత కొడంగల్తండా, గుండ్లకుంట గ్రామాల్లో ప్రజల అవసరాలకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. 2018లో కొడంగల్ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. అప్పటి నుంచి నేటి వరకు తమ నీటి అవసరాలు తీరడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నేటికీ పలు కాలనీలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదు. కొడంగల్ మున్సిపాలిటీలో 16 వేలకు పైగా జనాభా ఉంది. పట్టణంలోని కార్గిల్ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయితే కార్గిల్ కాలనీ, శాంతినగర్ కాలనీలకు నీటి సరఫరాలో ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. రోజూ కష్టమే నిత్యం తాగునీరు సరఫరా చేయాలి. ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడుతోంది. గతంలో బోరుమోటారు ద్వారా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కొడంగల్ నుంచి నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. రానున్న పాలకవర్గం ప్రజల అవసరాలకు అనుగుణంగా నిత్యం నీటి సరఫరా అందించాలి. – లక్ష్మి, కొండారెడ్డిపల్లి -
మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: జిల్లాలోని మోడల్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశాలకు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీలకు 2026–27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 19న అడ్మిషన్ టెస్ట్ ఉంటుందని చెప్పారు. వందశాతం సబ్సిడీపై రూ.75వేల ఆర్థికసాయం అనంతగిరి: ట్రాన్స్జెండర్ల పునారావాసం కోసం వంద శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిని బి.కృష్ణవేణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో అర్హులైన ఇద్దరు ట్రాన్స్జెండర్లకు రూ.75వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న అర్హులు అవసరమైన ధ్రువపత్రాలతో కలెక్టరేట్లోని మహిళ, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ శాఖ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య అనంతగిరి: ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన వికారాబాద్ ప్రభుత్వాస్పత్రి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం కార్మికచట్టాలను కాలరాస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లాలోని కార్మిక సంఘాలన్నీ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కొడంగల్ రూరల్: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని యువతకు 5వ తేదీన గురువారం పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్(బాలుర) ఆవరణలో అసెంబ్లీ లెవల్ సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సీఎం కప్ పోటీల ఇన్చార్జి ఎం.అనిల్కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగంలో (18 ఏళ్ల లోపు) వాలీబాల్, ఖోఖో, సీనియర్ విభాగంలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. 6న అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువత ఆయా రోజుల్లో ఉదయం 9గంటలకు పాఠశాల ఆవరణలో హాజరుకావాలన్నారు. డీఏఓ రాజారత్నం అనంతగిరి: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్తో యూరియా విక్రయాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 31 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో యాప్ ద్వారా పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు 9,103 బ్యాగులు, డిజిటల్ సంతకం లేని రైతులు 12 బ్యాగులు, కౌలురైతులు 29 బ్యాగులు కొనుగోలు చేయగా మొత్తం 9,144 బ్యాగులు విక్రయించారని చెప్పారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలుతో రైతులు లైన్లలో వేచియుంవాల్సిన అవసరం లేకుండా పోయిందని, జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలపై పూర్తి పారదర్శకత లభిస్తోందన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించడానికి వ్యవసాయ శాఖ కట్టుబడి ఉందన్నారు. రైతులందరూ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను వినియోగించుకొని తమ అవసరానికి అనుగుణంగా ఎరువులు పొందాలన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మొయినాబాద్: ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిప ల్ పరిధిలోని చిలుకూరు ఇంద్రారెడ్డి కాలనీ లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
ఆలయ వార్షికోత్సవాలకు హాజరైన స్పీకర్
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని వెంకటపూర్ తండాలో జగదాంబ భవాని మాత, జగద్గురు సేవాలాల్ మహరాజ్ ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన ఉత్సవాల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్ను సన్మానించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కిషన్నాయక్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు రూరల్: జాతీయ స్థాయి జూనియర్ మహిళల ఘాటింగ్ బాల్ టోర్నీకి ఐనెల్లి శివారు కేజీబీవీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఇందు ఎంపికై ంది. జనవరి 17, 18వ తేదీల్లో తాండూరులో రాష్ట్రస్థాయి సౌత్ జోన్ జూనియర్ ఘాటింగ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఇందును జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారని పాఠశాల ఎస్ఓ ఆశలత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఇందు తలపడుతుందని చెప్పారు. -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
తాండూరు రూరల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి హెచ్చరించారు. పీహెచ్సీ వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవడం లేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి మంగళవారం 3గంటల ప్రాంతంలో పెద్దేముల్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది హుటాహుటిన పీహెచ్సీకి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించిన డీఎంహెచ్ఓ డాక్టర్తో పాటు వైద్యసిబ్బందితో సమావేశమయ్యారు. పీహెచ్సీ సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మరోసారి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి -
నెలాఖరుకు సీఎంఆర్ బియ్యం అందజేయాలి
● అదనపు కలెక్టర్ రాజేశ్వరి ● పీఏసీఎస్, బాలాజీ రైస్మిల్లుల తనిఖీ యాలాల: సీఎంఆర్ బియ్యాన్ని ఫిబ్రవరి 28వ తేదీలోపు ఎఫ్సీఐలకు డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ రాజేశ్వరి ఆదేశించారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని పీఏసీఎస్, బాలాజీ రైస్మిల్లులను తనిఖీ చేశారు. పీఏసీఎస్ రైస్మిల్లో రూ.53 లక్షలు వెచ్చించి మిషన్ కొనుగోలు చేసిన సమయంలో అవకతవకలు జరిగాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, సీఈఓ వేణును విచారించారు. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎంత ఖర్చయిందని తదితర విషయాలను తెలుసుకన్నుఆరు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని బాలజీ రైస్మిల్ను తనిఖీ చేశారు. ఆమె వెంట డీసీఓ నాగార్జున, వ్యాపారి బాలేశ్వర్గుప్తా ఉన్నారు. -
సర్పంచ్, ఉప సర్పంచ్లకు డిజిటల్ ‘కీ’
బషీరాబాద్: సర్పంచ్లు నిధుల డ్రా కోసం చెక్కుల పై పెట్టే మాన్యువల్ సంతకాలకు చెక్ పడబోతుంది. ఇకపై సర్పంచ్, ఉప సర్పంచ్లు డిజిటల్ సంతకాలు పెట్టబోతున్నారు. గతంలో పంచాయతీకి సంబంధించిన నిధుల డ్రాకు సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ సంతకాలతో చెక్తో విత్డ్రా చేసేవారు. గతంలో ఉప సర్పంచ్ సంతకాలు ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరికీ డిజిటల్ సంతకాల కీ అందజేస్తున్నా రు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే కీలు తయారు చేసి ఎంపీడీఓ కార్యాలయకు చేర్చింది. ఎంపీడీఓలు సర్పంచ్, ఉప సర్పంచ్లకు గుర్తింపు కార్డులు సైతం జారీ చేస్తున్నారు. వీటిని త్వరలోనే సర్పంచ్లకు అందజేయనున్నట్లు బషీరాబాద్ ఎంపీడీఓ సంపత్కుమార్ తెలిపారు. మాన్యువల్ సంతకాలకు స్వస్తి -
విధులు సమర్థవంతంగా నిర్వహించండి
మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి తాండూరు: ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ నంబర్ 1 పాఠశాలలో పోలింగ్ అధికారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లో పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పించి, మాట్లాడారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల గురించి అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్రతువు ముగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు శిక్షణకు వచ్చిన సిబ్బంది దరఖాస్తులు అందజేశారు. మున్సిపల్ మెనేజర్ నరేందర్రెడ్డి, టీఓటీలు ముసవ్వీర్, సంతోష్, బస్వరాజ్, వీరేశం, పోలింగ్ అధికారులు తదితరులున్నారు. -
యాప్ ద్వారా యూరియా పంపిణీ
అనంతగిరి: వికారాబాద్ మండలంలో యాప్ ద్వారా మాత్రమే యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి ప్రసన్న లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎంతమేర యూరియా కావాలో బుక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏ మండలం నుంచైనా యూరియా పొందవచ్చని తెలిపారు. ముగిసిన అంత్యక్రియలు తాండూరు రూరల్: అప్పులు చెల్లించమని వేధించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామ ఎంపీటీసీ మాజీ సభ్యుడు ప్రవీణ్పటేల్ అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. గత గురువారం ఆయన పురుగు మందు తాగడంతో నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు ఆయన స్వగ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద అంతిమ సంస్కారాలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్పటేల్ భార్య రజిని మాట్లాడుతూ.. తన భర్త మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. అదృశ్యమైన వ్యక్తి మృతి ధారూరు: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు. ఎస్ఐ రాఘవేందర్, స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మైలారం పంచాయతీ అనుబంధ గ్రామమైన కొత్తతండాకు చెందిన పాత్లావత్ సుభాష్(31) మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మాన్పించాలని కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం అతనితో శివమాల ధారణ చేయించారు. మద్యం తాగకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన సుభాష్ ఆదివారం కనిపించకుండాపోయాడు. అతని భార్య హారిక ఫిర్యాదు మేరకు ధారూరు పీఎస్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం కాగ్నానది ఒడ్డున పడిఉన్న సుభాష్ మృతదేహంతో పాటు అతని బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుభాష్ ధారూరు నుంచి బైక్పై దోర్నాల్ వైపు వెళుతూ కాగ్నా వంతెన వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయి ఉంటాడని ఎస్ఐ చెప్పారు. ఈ మరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అధిక మెజార్టీతో గెలిపించండి
తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి తన కోడల్ని ఆశీర్వదించాలని పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె పట్టణంలోని 24వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తన కోడలు కొట్రిక నాగలక్ష్మి పోటీలో ఉందన్నారు. గతంలో నన్ను ఆదరించి, గెలిపించి, మున్సిపల్ చైర్పర్సన్ని చేసినట్లుగానే తన కోడలిని గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం మెరుగుపడిందన్నారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి నాగలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. -
బరిలో యంగ్ లేడీ లాయర్
తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల బరిలో ఓ యంగ్ లేడీ లాయర్ పోటీ చేస్తున్నారు. 24 ఏళ్ల కల్వ సిరిచందన న్యాయశాస్త్రంలో(ఎల్ఎల్ఎం) పట్టా సాధించి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీలో దిగారు. పట్టణానికి చెందిన దివంగత న్యాయవాది కల్వ విశ్వనాథ్ కూతురైన ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 36వ వార్డు నుంచి బరిలో నిలిచారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసం నిజాయతీ, విలువలతో ముందుకెళ్లినపుడు ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. యువత, విద్యావంతులు, సామర్థ్యం కలిగిన వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమన్నారు. చట్టాన్ని, పౌరుల హక్కులను, నేటి రేపటి సవాళ్లను అర్థం చేసుకునే వ్యక్తులు కావాలన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనని గెలిపించాలని అభ్యర్థించారు. -
హస్తంలో ముసలం
మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు రాజుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకులను విస్మరిస్తూ.. కొత్త వారికి టికెట్లు ఇవ్వడంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ప్రాతిపదికగా బీఫాంల పంపిణీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో కిందిస్థాయి కార్యకర్తలు బలవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపించినా కొన్ని వార్డుల్లో టికెట్లు ఎవరికి ఇస్తున్నారో ఇప్పటికే తేల్చకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్చార్జి మంత్రి, మాజీ ఎంపీ ముఖ్యనేతలతో చర్చలు జరిపినా బీఫాంల అంశం ఇంకా కొలిక్క రాలేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోపు ఎన్నికల అధికారులకు బీఫాంలు అందజేయాల్సి ఉండటంతో ఎవరికి దక్కుతాయోననే ఆందోళన కొనసాగుతుంది. బీఫాంలు అమ్ముకుంటున్నారని ఆరోపణ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల బీఫాంలను అమ్ముకుంటున్నారని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. అజీజ్నగర్కు చెందింన అల్లం శ్రీనివాస్రెడ్డి 5వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తుందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బీఫాంలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు సురంగల్కు చెందిన గడ్డం లక్ష్మివెంకట్రెడ్డి 13వ వార్డులో నామినేషన్ వేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నారనే సంకేతాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో మరికొంత మందికి టికెట్లు దక్కకపోవడంతో రెబల్స్గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ● కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు ● తమ వర్గానికే టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జి పట్టు -
మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డిపై కేసు నమోదు
కుల్కచర్ల: ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, బీఆర్ఎస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయంలో నిరసన వ్యక్తంచేస్తూ చౌడాపూర్లో ఆదివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టరాదని కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ తాండూరు టౌన్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిపూర్ ప్రాంతానికి చెందిన సిద్రామేశ్వర్ అనే వ్యక్తి ఇంట్లో మధ్యాహ్నం తాళం పగలగొట్టి అర్ధ తులం బంగారం, 20 తులాల వెండి, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. పెట్రోల్ బంక్ ఉద్యోగిపై కత్తితో దాడి కవాడిగూడ: పెట్రోల్ బంక్ ఉద్యోగిపై కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దోమలగూడ ఇన్స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన మేరకు.. లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న భారత్ పెట్రోలియం బంక్ వద్దకు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బోలక్పూర్కు చెందిన బాసిత్(23), గౌస్(24), మౌలాలికి చెందిన తాహెర్ (25) కలిసి ఓ ద్విచక్ర వాహనంపై పెట్రోల్ కోసం వచ్చారు. విధి నిర్వహణలో ఉన్న వికిషన్ (23)..బంక్ మూసే సమయం అయిందని.. పెట్రోల్ పోయడం వీలుకాదని చెప్పారు. దీంతో అగ్రహానికి గురైన వారు వాగ్వాదానికి దిగారు. బాసిత్ అనే వ్యక్తి కత్తితో రవికిషన్ను పొడిచి పరారయ్యారు. స్థానికులు రవికిషన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దోమలగూడ పోలీసులు ముగ్గురు నిందుతులను అరెస్టు చేశారు. చిన్నారిపై వీధి కుక్కల దాడి మణికొండ: ఇంటిముందు సరదాగా ఆడుకుంటున్న ఓ రెండేళ్ల చిన్నారిని వీధికుక్కలు వెంటపడి కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు.. నార్సింగి సర్కిల్ పరిధిలోని జన్వాడ గ్రామంలోని ఎస్సీ బస్తీలో సోమవారం ఇంటి ముందు బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న నాలుగు వీధి కుక్కలు బాలుడి వెంటపడ్డాయి. బాలుడు భయపడి పరుగులు తీయగా వెంటపడి కరిచేశాయి. చిన్నారి హాహాకారాలు విన్న స్థానికులు వెంటనే వచ్చి కుక్కలను తరిమేశారు. అప్పటికే బాలుడి పెదవి, చెవి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా కొలుకుంటున్నాడని..ప్రాణాపాయం తప్పిందని గ్రామ స్తులు తెలిపారు. ఇదిలా ఉండగా వీదికుక్కల సమస్యపై అనేక సార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని, ఇకనైనా వాటిని అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అందరూ ఉన్నా అనాథలా.. ● భార్యతో మనస్పర్థలు ● విదేశాల్లో స్థిరపడ్డ ముగ్గురు పిల్లలు ● రైల్వేస్టేషన్లో విశ్రాంత ఉద్యోగి మృతి సికింద్రాబాద్: ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు.. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు.. అయితే భార్యతో ఆయనకు మనస్పర్థలు..దీంతో ఆమెకు దూరంగా ఉంటూ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్లే కేంద్రంగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సఫిల్గూడ రైల్వేస్టేషన్లో మృతిచెందాడు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు.. నల్గొండ జిల్లా అమ్మనబ్రోలుకు చెందిన మహ్మద్ ఇబ్రహీం (66) నల్గొండ జిల్లా కోర్టులో పనిచేసి పదవీ విరమణ చేశారు. భార్యతో విభేదాల కారణంతో పదేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇబ్రహీం దంపతులకు ఇరువురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ముగ్గురూ ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కెనెడాలో స్థిరపడ్డారు. పిల్లలు, భార్యకు దూరంగా ఉంటున్న ఆయన సికింద్రాబాద్ ప్రాంతంలోని ఉంటున్న చెల్లెలు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. వీలైన చోట సేదతీరుతూ..అప్పుడప్పుడూ రైల్వే స్టేషన్లలో నిద్రపోయేవాడు.ఈ క్రమంలో సఫిల్గూడ రైల్వేస్టేషన్లో సోమవారం నిద్రకు ఉపక్రమించిన ఇబ్రహీం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని గుర్రంపల్లిలో జాతర ముగిసింది. శుక్రవారం గంధం అలంకరణ, శనివారం దూపదీపాలంకరణ, ఆదివారం కందూరులు, సోమవారం భజనా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిశాయి. షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ శ్రీనివాసు ఆధ్వర్యంలో పోలీసులు ఉత్సవాల వద్ద బందోబస్తు నిర్వహించారు. -
జాతీయస్థాయి అథ్లెటిక్స్లో సంతోషి ప్రతిభ
తాండూరు టౌన్: ఏడవ జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్లో తాండూరు పట్టణవాసి మంకాల్ సంతోషి కుమారి సత్తా చాటారు. గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్లో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 50 నుంచి 54 ఏళ్ల వయసు మహిళల విభాగంలో ఆమె ట్రిపుల్ జంప్లో 6.74 మీటర్లు దూకి వెండి పతకం, 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం, లాంగ్జంప్లో 3.19 మీటర్లు దూకి కాంస్య పతకం సాధించారు. ఏకంగా మూడు మెడల్స్ సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, అంతకు మించిన సంపద లేదన్నారు. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో అందరూ సరైన ఫిట్నెస్తో ఉండాలని సూచించారు. క్రీడల పట్ల తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టంతో 50 ఏళ్లు పైబడినా పోటీల్లో పాల్గొంటున్నానన్నారు. భవిష్యత్లో సైతం పోటీల్లో పాల్గొని మరిన్ని మెడల్స్ సాధిస్తానని ఆమె అన్నారు. -
బీఆర్ఎస్ హయాంలో మెరుగైన వృద్ధి
తాండూరు టౌన్: తన హయాంలోనే పట్టణంలోని 23వ వార్డులో మెరుగైన అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి పరిమళ అన్నారు. సోమవారం ఆమె వార్డు పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి గతంలో తాను కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు. ఎలాంటి సమస్య వచ్చినా వార్డు ప్రజల వైపు నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. వార్డులోని పెద్దల నుంచి ఆశీర్వాదం, హామీ తీసుకుంటూ ప్రచారంలో ఆమె దూసుకు పోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు ప్రజలందరూ తన కుటుంబ సభ్యులని, వారి సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో ఉంటానన్నారు. ఇంకా వార్డులో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించే అవకాశాన్ని ఓటర్లు తనకు ఇవ్వాలన్నారు. -
ఆలయ అభివృద్ధికి కలిసి సాగుతాం
కుల్కచర్ల: పాంబండ ఆలయ అభివృద్ధికి అందరితో కలిసి ముందుకుసాగుతామని ఆలయ ఈఓ బాలనర్సయ్య తెలిపారు. సోమవారం మండలంలోని బండవెల్కిచర్లలో వెలసిన పాంబండ రామలింగేశ్వర ఆలయంలో టెంకాయల విక్రయానికి వేలం నిర్వహించారు. ఏడాదికి గాను (జాతర కాలం మినహా) టెంకాయలు విక్రయించే హక్కును బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కోనేరు వెంకట్రాములు రూ.12,01,000కు వేలం దక్కించుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల సమయంలో టెంకాయల విక్రయ వేలం హక్కులను మహబూబ్నగర్ జిల్లా కాకర్లపాడు గ్రామానికి చెందిన వెంకటయ్య రూ.7,05,000కు దక్కించుకున్నారు. ఏడాదిపాటు తలనీలాలు సేకరించే హక్కులను మహబూబ్నగర్కు చెందిన రామన్ గౌడ్ రూ.3,03,000కు పొందారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడుగు శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఆలయ అర్చకులు దశరథం, పాండు, వేలం పర్యవేక్షకులు ప్రణీత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బీఫాంల అందజేత
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు సోమవారం బీఫాంలు అందజేశారు. ఈ మేరకు వికారాబాద్లోని పార్టీ కార్యాలయంలో శాసనమండలి ప్రతిపక్ష నేత, మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్చార్జి మధుసూదనాచారి చేతుల మీదుగా ఆయా అభ్యర్థులు పత్రాలు అందుకున్నారు. 20మందికి పైగా అందజేశారు. మిగతా వారికి మంగళవారం ఇవ్వనున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ తదతరులు పాల్గొన్నారు. -
ముక్కుపుటాలు అదిరేలా..!
పరిగి: మున్సిపాలిటీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీలన్నీ కంపుకొడుతున్నాయి. పేరుకే పరిగి పెద్ద మున్సిపాలిటీ అని అభివృద్ధిలో మాత్రం దారుణంగా ఉందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. విద్యానగర్ కాలనీ, తుంకుల్గడ్డ, బాలాజీనగర్, మైత్రినగర్, మందుల కాలనీ, ఇలా చాలా కాలనీలో మురుగు కాలువలు లేవు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరు మొత్తం ఇళ్ల మధ్యలోనే నిలుస్తుంది.అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైనే పారుతోన్న మురుగునీరు కంపు కొడుతున్న కాలనీలు దుర్గంధంతో స్థానికుల ఇబ్బందులు పట్టించుకోని అధికార యంత్రాంగం పురపాలిక సంఘాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అదుపు తప్పుతోంది. మురుగునీటి పారుదల, దానికి అనుసంధానంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పట్టణవాసుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. పన్నులు కట్టేటప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు సమస్యల పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మురుగు సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అవస్థలు పడుతున్నాం మా కాలనీలో మురుగు కాలువలు లేక నానా అవస్థలు పడుతున్నాం. కాలువలు నిర్మించాలని అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇంటి ఎదుటే వ్యర్థాలు నిలుస్తున్నా తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈగలు, దోమలు ఇళ్లల్లో స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించి మురుగు కాలువలు వెంటనే నిర్మించాలి. – ఎండీ.షాహెద్, విద్యానగర్కాలనీ -
అక్రమంగా టేకు కలప రవాణా!
● అనుమానంతో అడ్డగించిన స్థానికులు ● లారీతో ఉడాయించిన డ్రైవర్ ధారూరు: అక్రమంగా కలప తరలిస్తున్నారన్న అనుమానంతో స్థానికులు లారీని అడ్డగించగా.. గమనించిన డ్రైవర్.. అతివేగంగా వాహనంతో ఉడాయించాడు. ఈ సంఘటన ధారూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ధారూరు నుంచి హైదరాబాద్ వైపు కలప లోడుతో వెళ్తున్న ఓ లారీ.. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఆగింది. లారీలో టేకు కలప ఉండి, నంబరు సరిగా లేక పోవడాన్ని గమనించిన స్థానికులు కొందరు.. డ్రైవర్ను వివరాలు అడిగారు. పత్రాలు చూపించమని కోరారు. దీంతో యజమాని యాదయ్య పర్మిట్ చూపించగా.. అందులో ధారూరు ఫారెస్టు రేంజ్కు బదులు.. తాండూరు ఫారెస్టు ఆఫీసు అని ఉంది. ఇది నకిలీ పత్రాలని, అసలు పత్రాలు చూపించాలని లారీలో కలపను చూసేందుకు యత్నించారు. దీనిని గమనించిన డ్రైవర్.. లారీతో అతి వేగంగా వికారాబాద్వైపు దూసుకుపోయాడు. సమాచారం ఇచ్చాం కలప లారీ గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు మోయిజ్ఖురేషి తెలిపారు. ఇన్చార్జి రేంజర్కు ఫోన్లో సమాచారం ఇవ్వగా.. లారీని ఆపేది ఉండేదని చెప్పినట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో టేకును తరలించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ శ్యాంకుమార్ను వివరణ కోరగా.. స్థానికులు పట్టుకున్న లారీని అప్పగిస్తే, కేసు నమోదు చేసేవారమని పేర్కొన్నారు. -
‘రేడియల్’ సర్వే పనులు ప్రారంభం
భూ సేకరణపైగ్రామస్తులతో చర్చలు దోమ: మండలంలోని పాలేపల్లిలో రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు సోమవారం రేడియల్ రింగ్ రోడ్డు సర్వే పనులను ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్, నాచారం తోపాటు ఎన్హెచ్ –167 నుంచి బుద్వేల్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) వరకు రేడియల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా పాలేపల్లి గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఉన్న కొద్దిపాటి పొలాన్ని రేడియల్ రోడ్డుకు తీసుకుంటే మా పరిస్థితి ఏంటని నిలదీశారు. స్పందించిన అధికారులు రోడ్డు నిర్మాణానికి ఎంత భూమి అవసరం ఉంటుందో అంతే సేకరిస్తామని తెలిపారు. రైతుల సమ్మతితో సర్వే చేసి తీసుకుంటామని తెలిపారు. మరో సారి చర్చలు జరిపేందుకు వస్తామని, ఆలోగా ఆలోచించి నిర్ణయం చెప్పాలని రైతులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోవిందమ్మ, సర్పంచ్ సుజాత, వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, హెచ్ఎండీఏ అధికారులు, డీఈఈ, ఏఈఈ, జీఈ నవీణ్, శ్రీవాత్సవ, ముక్రంఅలీ, సందీప్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
కొడంగల్ రూరల్: అభివృద్ధి, పర్యావరణం అనేవి నాణేనికి బొమ్మ–బొరుసు వంటివని, వీటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే పురుషోత్తంరెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష, జంతుశాస్త్ర విభాగాలు, ఏకో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు అందించారు. అడవులు, భౌగోళిక వనరుల అసమతుల్య వినియోగంతో జీవ వైవిద్య వినాశనం, వాతావరణ మార్పులు, ఓజోన్ పొర క్షీణత, ఎడారీకరణ, రేడియో ధార్మిక ప్రభావాలు వంటి ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. ఇందుకుగాను సమతుల్యతతో కూడిన అభివృద్ధి ఒక్కటే దీనికి పరిష్కారమని తెలిపారు. చిత్తడి నేలలు పర్యావరణ పరంగా ఎంతో విలువైనవని అన్నారు. ఎన్నో జీవరాశులకు ఆశ్రయమిస్తాయని, వాటిని పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి ఐక్యరాజ్య సమితి సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఫియా ఖానం, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ టీ రాంబాబు, జంతుశాస్త్ర అధ్యాపకులు రమేష్, హరిప్రియ విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
అనంతగిరి: బాధ్యతగా పని చేసి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలను విజయంతంగా పూర్తి చేద్దామని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రిసైడింగ్ అధికారులు బాధ్యగా పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామగ్రిని సరి చూసుకోవాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్ నోడల్ అధికారి మాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు విక్రంసింహారెడ్డి, నాగరాజు, నటరాజు పాల్గొన్నారు. -
ఆహార భద్రత మన బాధ్యత
అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అనంతగిరి: ప్రజలందరికీ నాణ్యమైన ఆహారం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అన్నారు. సోమ వారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆహార భద్రత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. లైసెన్స్ పొందిన తర్వాతే హోటళ్లు ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, ఆహార భద్రత అధికారి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ç³…^é-Ķæ$-¡-Æ>gŒæ ˘ ఈఈగా శ్రీనివాస్రెడ్డి తాండూరు రూరల్: తాండూరు డివిజన్ పంచాయతీరాజ్ నూ తన ఈఈగా శ్రీనివాస్రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన సత్యనారాయణరెడ్డి పదోన్నతిపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈగా వెళ్లా రు. ఆయన స్థానంలో సిద్దిపేట నుంచి శ్రీనివాస్రెడ్డి తాండూరుకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లోని ఆయా గ్రామాల్లో పెండింగ్ ఉన్న పనులను సత్వరం పూర్తయ్యేలా చూస్తామన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ స్నేహ మెహ్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెలలో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసి ఎర్రమట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై 22 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. టాలెంట్ టెస్ట్లో సత్తాచాటిన విద్యార్థులు అనంతగిరి: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని దోమ మండల ఎంఈఓ వెంకట్ అన్నారు. సోమవారం వికారాబాద్లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్లో నిర్వహించారు. ఇంగ్లిష్ మీడియం విభాగంలో దీపిక(జెడ్పీహెచ్ఎస్ ధారూర్)మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పరిహీన్(జెడ్పీహెచ్ఎస్ కిష్టాపూర్), తృతీయ స్థానంలో చైతన్య (జెడ్పీహెచ్ఎస్ దాదాపూర్) ఉండగా, తెలుగు మీడియంలో బిందు(జెడ్పీహెచ్ఎస్ నవల్గా), ఐశ్వర్య (జెడ్పీహెచ్ఎస్ సాల్వీడ్, ప్రవీణ్కుమార్ (జెడ్పీహెచ్ఎస్ బడెంపల్లి)ఉన్నారు. వీరందరికీ ఫోరం తరఫున బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎం వీరకాంతం, డైట్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఆచారి, ఫోరం జిల్లా అధ్యక్షుడు బస్వరాజు, ప్రధాన కార్యదర్శి, సభ్యులు చంద్రమోహన్, యాదయ్య, సురేందర్రెడ్డి, అరుణ్కుమార్, హన్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల మధ్య దుర్గంధం
కొడంగల్ రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల మధ్య మురుగుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతకొడంగల్, బూల్కాపూర్, ఐనన్పల్లి తదితర గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇటీవల గుండ్లకుంట గ్రామంలో డ్రైనేజ్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. బూల్కాపూర్లో కొంత కాలం క్రితం డ్రైనేజ్ పనులు ప్రారంభించి నిలిపేశారు. అధికారులు స్పందించి త్వరితగతిన డ్రైనేజీ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పనులు ప్రారంభించాలి గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా మారింది. వర్షా కాలంలో బురదమయంగా మారుతుంది. రహదారిలో మురుగు పారడంతో నడక సాగించేందుకు అవస్థలు పడుతున్నాం. అధికారులు, నాయకులు స్పందించి డ్రైనేజీ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. – రాజశేఖర్, పాతకొడంగల్ -
శివారు అధ్వానం
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శివారు వార్డులు మినహా మిగతా వాటిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతోంది. అక్కడక్కడ మాత్రం సరిపడా మురుగు కాలువలు లేవు. దీంతో వర్షాకాలంలో నీరంతా రోడ్లపై చేరుతోంది. అండర్ డ్రైనేజీ కూడా పలుచోట్ల స్తంభిస్తోంది. మున్సిపల్ పరిధిలోని శివారు గ్రామాలైన ధన్నారం, మద్గుల్ చిట్టంపల్లి, గుడుపుల్లి, బురుగుపల్లి, గిరిగేట్పల్లిలతో మురుగు కాల్వలు అధ్వానంగా మారాయి. నిత్యం దుర్వాసన వ్యాపించి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల స్వైరవిహారం మున్సిపల్ పరిధిలోని మిగతా వార్డుల మాదిరిగా మా గ్రామంలో సైతం అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతం దోమల స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్ల వెంబడి దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైన చోట కొత్త మురుగు కాల్వలు నిర్మించాలి. నూతన పాలకవర్గం ఈ సమస్యను పరిష్కరించాలి. – శ్రీనివాస్, వికారాబాద్ -
సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
పరిగి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 7న పరిగి పట్టణానికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. సోమవారం నారాయణపూర్ సమీపంలో సీఎం సభాస్థలిని ఎస్పీ స్నేహమెహ్రతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహిరంగ సభ ఏర్పాట్లను ప్రణాళిక ప్రకారం చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ముందొస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సభకు ఎంత మంది హాజరవుతారు.. ఎక్కడెక్కడి నుంచి వస్తారు.. ఎక్కడి వారికి అక్కడే పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు అస్కారం ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, ఆర్అండ్బీ అధికారి శ్రీధర్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరీ, డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోండి అనంతగిరి: మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మంగళవారంలోపు పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు సంబంధిత పత్రాలు సమర్పించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు ఫారం నింపి.. ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ కాపి, ఈపీఐసీ కార్డు కాపీ, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డును మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనలకు లోబడే చైర్మన్ల ఎంపిక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చైర్మన్ల ఎంపిక నిబంధనలకు లోబడే చేపడతామని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్ చైర్మన్ల ఎంపికపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిబంధనల ప్రకారమే చైర్మన్ ఎంపిక ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిక
అనంతగిరి: వికారాబాద్ పట్టణం అనంతగిరిపల్లికి చెందిన అశోక్ శనివారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేక శేఖర్రెడ్డి, గోపాల్ తదితరులు ఉన్నారు. ఏకగ్రీవం కాకుండా బీజేపీ చెక్ శంకర్పల్లి: మున్సిపాలిటీలో నామినేషన్ల సమయానికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. 12వ వార్డు స్థానానికి బీఆర్ఎస్ నుంచి దండు సంతోష్, కాంగ్రెస్ నుంచి యంసాని ప్రకాశ్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ తండ్రి రాజేశ్వర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని నామినేషన్ వేశారు. అప్పటికే హస్తం పార్టీ నుంచి బరిలో ఉన్న ప్రకాశ్గుప్తా సైతం రాజేశ్వర్తో కలిసి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు వార్డు స్థానాన్ని ఏకగ్రీవం కాకుండా సిరిగన్నగారి శ్రీకాంత్రెడ్డిని బరిలో నిలిపి, ఆయన్ని నగరంలోని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు అక్కడే ఉంచనున్నట్లు సమాచారం. మహిళ అదృశ్యం మొయినాబాద్ రూరల్: ఇంటి నుంచి పని కోసం వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుండే ప్రవళిక స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రికి పని కోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


