Vikarabad
-
బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు
కొడంగల్: నియోజకవర్గంలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయిందని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన పట్టణంలోని రేవంత్రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేవారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారని చెప్పారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి సహకారంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానం మెప్పునకు అవాకులు చవాకులు పేతులున్నారన్నారు. లేని సమస్యలను ఉన్నట్లు సృష్టించి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం విద్య, వైద్యం, రహదారులకు తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారా మెడికల్ కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, జూనియర్ కళాశాలలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంజూరు చేశారని గుర్తు చేశారు. కొడంగల్ ప్రభుత్వాసుపత్రిని 220 పడకలకు విస్తరించి టీచింగ్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారన్నారు. సోషల్, ట్రైబల్, మైనార్టీ, బీసీ వెల్ఫేర్ గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాలు మంజూరు చేశారన్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి జీవం పోశారని తెలిపారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఆరు లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసినట్లు చెప్పారు. 12 లక్షల గన్నీ బ్యాగులను రైతులకు ఇచ్చినట్లు వివరించారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, కౌన్సిలర్ హమీద్, కో ఆప్షన్ సభ్యులు రమేశ్బాబు, మునీర్, కాంగ్రెస్ నాయకులు సోమశేఖర్, దాము, ఆసీఫ్ఖాన్, చిన్న నందిగామ సర్పంచ్ దత్తాత్రేయరావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ మొప్పుకోసం నరేందర్రెడ్డి లేని సమస్యలు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ గుప్తా -
మేకల దొంగలకు దేహశుద్ధి
పరిగి: మేకల దొంగలకు దేహశుద్ధి చేసిన ఘటన పరిగి పట్టణ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహన్ కృష్ణ తెలిపిన ప్రకారం.. ధారూరు మండల రాజాపూర్ గ్రామానికి చెందిన అశోక్, బొంరాస్పేట మండలం సాలేండపూర్ తండాకు చెందిన తుల్జానాయక్ పట్టణంలోని గంజ్ రోడ్, మార్కెట్ మేసే మేకలను అపహరించేందుకు వచ్చారు. అనుమానాస్పందంగా కాలనీలో తిరుగుతుండగా స్థానిక యువకులు వారిని గమనించారు. ఈ క్రమంలో బైక్పై రెండు మేకలను ఎక్కించుకుని పరారయ్యేందుకు యత్నిస్తుండగా అడ్డుకున్నారు. దీంతో స్థానికులు వారిద్దరికి దేహ శుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పింఛన్ రాక.. ఆశతీరక
సర్కారు ‘చేయూత’కోసం కొత్తవారి చింత దౌల్తాబాద్: మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం అర్హులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం మృతి చెందిన వారి స్థానంలో తదనంతరం అర్హులైన వారికి వింతంతు పింఛన్లు అందుతున్నాయి. మిగతావి కొనసాగుతున్నాయి. అర్హులైన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలతో.. మండల పరిధి నుంచి వందల మంది చేయూత కోసం అర్జీ పెట్టుకున్నారు. తమ వంతుకోసం ఆశగా.. పంచాయతీ, ఎంపీడీఓ, మీసేవ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ.. ఆరాతీస్తున్నారు. వివరాల సేకరణ.. మండలంలో ప్రస్తుతం పింఛన్ దారుల వివరాలను ముఖ గుర్తింపు యాప్లో నమోదు చేస్తున్నారు.మృతి చెందిన, వలస వెళ్లిన వారితో పాటు.. కొత్తగా అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. అనంతరం గ్రామసభ నిర్వహించి, లేని వారి పేర్లను సభ ఆమోదంతో తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు కొత్త వారి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను పరిశీలించడంతో పాటు.. ఇంకా అర్హులైన వారుంటే దరఖాస్తులు తీసుకోవాలని ఎంపీడీఓలు ఇటీవల పంచాయతీ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకునే పనిలో కార్యదర్శులు బిజీగా ఉన్నారు. మండలంలో ఇప్పటి వరకు 2,358 వద్ధాప్య, 2,414 వితంతు, 668 వికలాంగులు, 59 చేనేత, 42 గీత కార్మికులు, 289 ఒంటరి మహిళలు పింఛన్లు పొందుతున్నారు. ఇవీ అర్హతలు వృద్ధాప్య పింఛన్కు 57 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆధార్, ఓటరు ఐడీ, రేషన్కార్డు, ఆదాయ ధ్రువపత్రం, బ్యాంకు పాసుపుస్తకం కలిగి ఉండాలి. వితంతువుకు 18 ఏళ్లు నిండి భర్త మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాలి. దివ్యాంగులకు వయోపరిమితి లేదు. కానీ 40శాతం పైగా వైకల్యం ఉండాలి. సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, ఆదాయ ధ్రువపత్రం ఉండాలి. చేనేత, గీత కార్మికులు 50 ఏళ్లు నిండి ఉండాలి. సంబంధిత సొసైటీ గుర్తింపుకార్డు, ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరి. ఆందోళనలో అర్హులు మూడేళ్లుగా పడిగాపులు -
ముగిసిన బీఆర్ఎస్ ప్రీమియర్ లీగ్
బొంరాస్పేట: మండల పరిధిలోని రేగడిమైలారంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. వడ్ల నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో విశాల్ బంజారా, వెంకట్ స్పాంటన్ టీంలు ఫైనల్లో తలపడ్డాయి. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన బంజారా టీమ్కు రూ.10 వేల నగదు బహుమతి, రన్నరప్గా నిలిచిన వెంకట్ స్పాంటన్ టీమ్కు రూ. 5వేలు నగదు బహుమతిలో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు జగదీశ్వరయ్య, సీనియర్ నాయకుడు గోవింద్రెడ్డి, నాయకులు మంగలి వెంకటయ్య, దశరథ్, పాపయ్య, మహేశ్, శేఖర్, టీమ్ లీడర్లు కై లాస్, అశోక్, అర్జున్, మహేశ్ పాల్గొన్నారు. -
సంతోషంతో ఒత్తిడి దూరం
చేవెళ్ల: సంతోషం, ఆనందకరమైన అలవాట్లు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఒత్తిడిని సమర్థవంతంగా దూరం చేస్తాయని మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి యోగ, వ్యాయామాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతోషమే సగం బలం అనే మాట నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి యోగ, వ్యాయమాలు ఎంతో అవసరమన్నారు. దీంతో పాటు క్లీన్ చేవెళ్ల–గ్రీన్ చేవెళ్ల అనే నినాదంతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ రాముగౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్, శైలజ, మనిషా, నాయకులు యాదిరెడ్డి, గోపాల్రెడ్డి, మున్సిపాల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సమతారెడ్డి -
కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రాచారి మీర్పేట: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలన్నింటిని తక్షణమే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి డిమాండ్ చేశారు. ఆదివారం లెనిన్నగర్లోని పార్టీ కార్యాలయంలో బాలాపూర్ మండలంలోని ‘సమస్యలు–పరిష్కారం’ పై నాయకులతో రవీంద్రాచారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో గత 15 ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైపులు ప్రస్తుతం పెరిగిన జనాభాతో సామర్థ్యం సరిపోక తరచూ ఉప్పొంగుతున్నాయన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, దివ్యాంగులకు పెంచుతామన్న చేయూత పెన్షన్లు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తామని రెండున్నరేళ్లు పూర్తయినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు సుమారు 80వేల గుడిసెలు వేయించిన ఘనత సీపీఐ పార్టీదని గుర్తుచేశారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, పిచ్చిరాజు, గిరిజన సమాఖ్య నాయకులు రెడ్యానాయక్, ఛత్రునాయక్, శ్రీనునాయక్, రమేష్, హుస్సేన్, విజయ్కుమార్, లక్ష్మి, యాదమ్మ పాల్గొన్నారు. -
సాంకేతికతపై పట్టు.. ప్రగతికి మెట్లు
తాండూరు టౌన్: విద్యార్థులు చదువుతో పాటు.. ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని, అప్పుడే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సుభాన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కంప్యూటర్ మిషన్ ఆధ్వర్యంలో ఎఎస్ కంప్యూటర్స్ సాఫ్ట్ స్కిల్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ నూతన ఒరవడితో మార్పులు చెందుతోందన్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు ఏఐ ఆధారిత కోర్సులపై దృష్టి సారించాలని సూచించారు. మిషన్ఆధ్వర్యంలో 150 మంది శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్ కంప్యూటర్స్ డైరెక్టర్ అన్నపూర్ణ, శిక్షకులు పద్మనాభ రెడ్డి, వివేకానంద, సంఘం కమిటీ సభ్యులు వీరభద్రప్ప, మహేశ్వర్ రెడ్డి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తుకు పునాది కుల్కచర్ల: పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెంపొందిచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్ఐ రమేష్ అన్నారు. మండల కేంద్రంలోని కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఆదివారం సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. కాలాన్ని వృథా చేయకుండా.. భవిషత్తుపై దృష్టి సారించాలని సూచించారు. చదువుతో పాటు.. కంప్యూటర్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే.. ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిత్వ వికాసం, జీవనోపాధి కల్పించే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. క్షణిక సంతోషాలకు సమయం ఇవ్వరాదని చెప్పారు. టీయూడబ్ల్యూజే జాతీయ కార్యదర్శి శివకుమార్ గౌడ్, కేపీఎం కళాశాల ప్రిన్సిపాల్ విష్ణు, నిర్వహకులు సాయి భరత్, స్థానికులు వినోద్తదితరులు పాల్గొన్నారు.చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం: వక్తలు -
వివాహేతర బంధమే ప్రాణం తీసిందా?
పూడూరు: అనుమానాస్పద స్థితిలో శనివారం ఓ వ్యక్తి ఒంటిపై గాయాలతో మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు లేవనెత్తాయి. సదరు వ్యక్తి మృతికి వివాహేతర సంబంధమే కారణమనితెలుస్తోంది. ఆదివారం బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు వ్యక్తి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆమె తన కుటుంబీకులతో కలిసి హత్య చేసిందని ఆరోపిస్తూ.. చన్గోముల్ పోలీస్స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌడాపూర్ మండలం గోగ్యానాయక్తండాకు చెందిన నేనావత్ మంగ్యానాయక్(43)కు, అదే మండలం అడవివెంకటాపూర్ గ్రామానికి చెందిన కాట్రావత్ విజయమ్మతో కొంత కాలంగా వివాహేతర బంధం కొనసాగుతోంది. సదరు మహిళ భర్త గంగ్యానాయక్, కుమారుడు రవితో కలిసి నగరంలోని కిస్మత్పూర్లో ఉంటూ కూలీ పనులు చేస్తోంది. శనివారం ఉదయం మృతుడు మంగ్యానాయక్, విజయమ్మలు మండల పరిధి మన్నెగూడలో కలుసుకున్నారు. అక్కడి నుంచి గొంగుపల్లి సీతమ్మ గుడి వద్దకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో కానీ.. మంగ్యానాయక్ ఒంటిపై గాయాలతో అచేతనగా పడున్నాడు. విషయాన్ని విజయమ్మ.. కుమారుడికి ఫోన్లో సమాచారం ఇచ్చింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలంచి ఆ మహిళను, ఆమె కొడుకును అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పరిగి మార్చురికి తరలించారు. కొట్టి చంపారు.. మంగ్యానాయక్ను కొట్టి చంపారని, తమకు న్యాయం చేయాలని మృతుడి భార్య అంజిలమ్మ, కుమారులు శ్రీనివాస్, కై లాష్, కూతురు భూమిక, కుటుంబీకులు, బంధువులు చన్గోముల్ ఠాణా ఎదుట బైఠాయించారు. నిందితులను బయటకు పంపాలని పోలీస్స్టేషన్లోకి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఐ భరత్రెడ్డి మృతుడి కుటుంబీకులను సముదాయించారు. తగిన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని అప్పగించారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు విజయమ్మతో పాటు ఆమె భర్త గంగ్యా, కుమారుడు రవిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మలుపు తిరిగినఅనుమానాస్పద మృతి కేసు అనుమానితులనుఅదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువుల ఆందోళన -
అవసరం లేకున్నా అతిగా కొని..
మొయినాబాద్: మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న అధికారులు.. అవినీతిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని వస్తువులు అవసరం లేకున్నా అతిగా కొనుగోలు చేసి అందులో వాటాలు దండుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఇటీవల అధికారులు సున్నం బస్తాలు కొనుగోలు చేశారు. ఒక్కో గ్రామంలో సుమారు 300ల బస్తాలను వార్డు కార్యాలయాల్లో వేశారు. బ్లీచింగ్ పౌడర్లో కలిపి రోడ్లపక్కన చల్లడానికి వాటని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఏడాది మొత్తానికై నా సుమారు వంద బస్తాలు కూడా వినియోగించే అవకాశం లేదని.. వారు తమ కమీషన్ల కోసం ఎక్కువ కొనుగోలు చేసి వార్డు కార్యాలయాల్లో వృథాగా పడేశారని మున్సిపల్ సిబ్బందే వాపోతున్నారు. సున్నం బస్తాలు సరఫరా చేసే కాంట్రాక్టర్తో మున్సిపాలిటీలోని ఇద్దరు ముగ్గురు అధికారులు కుమ్మకై ్క ఒకేసారి తెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై కొందరు కౌన్సిలర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు లేవని చెప్పే అధికారులు.. అనవసర ఖర్చులు చేసి కమీషన్లు దండుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సున్నం బస్తాల కొనుగోలులో అధికారుల చేతివాటం -
మద్యం అమ్మితే రూ.5 లక్షలు జరిమానా
అనంతగిరి: ‘మద్యం మత్తులో గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి. యువత పెడదారి పడుతోంది. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గ్రామంలో వెంటనే మద్యం విక్రయాలు నిషేధించాలి’ అని వికారాబాద్ మున్సిపల్ పరిధి ధన్నారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మద్యం మత్తులో జీవితాలు ఆగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం అమ్మితే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని, కొనుగోలు చేసిన వారికి రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎకై ్సజ్, పోలీసు శాఖలు సహకరించాలని కోరారు. -
ఈగల్ బృందం తనిఖీలు
చేవెళ్ల: డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్శాఖ ప్రత్యేకంగా ఈగల్ బృందంతో తనిఖీలు చేపడుతుందని చేవెళ్ల ఎస్ఐ తేజశ్రీ తెలిపారు. ఆదివారం డాగ్ స్క్వాడ్ బస్స్టేషన్, చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాలు లాంటివి నిర్మూలనలో భాగంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్తుపదార్థాల వినియోగం, సరఫరా చేయడం చట్ట రీత్యా నేరమని చెప్పారు. బాలిక అదృశ్యం పహాడీషరీఫ్: బాలిక అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్కు చెందిన హమీద్ ఖాన్ చిన్న కుమార్తె మెహక్(17) ఈ నెల 5న మధ్యాహ్నం స్థానికంగానే ఉన్న మెడికల్ షాప్లో మందులు తీసుకెళ్లేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62366 నంబర్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. పిడుగుపాటుకు ఎద్దులు మృత్యువాత చేవెళ్ల: మండలంలోని గుండాల గ్రామంలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడడంతో రెండు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన యాలాల మల్లారెడ్డి అనే రైతు తన వ్యవసాయం పొలం వద్ద చెట్టు కింద ఎద్దులను కట్టేశాడు. పిడుగుపాటుకు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.1.50 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. యాలాల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ.. ఎస్పీ స్నేహామెహ్ర ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి రాజీవ్ కాలనీకి చెందిన మహబూబా బీ, బషీరాబాద్ మండలం కాశీంపూర్కు చెందిన అంగన్వాడీ ఆయా ఆబేదా బేగంను తీసుకున్న అప్పు ఇస్తామంటూ రమ్మని చెప్పి, మొయినాబాద్ ఫాం హౌజ్లో దారుణంగా హత్య చేయగా.. విషయం మే 16న వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమాబేగంను కరణ్కోట పీఎస్కు విచారణ పేరిట తీసుకెళ్లగా, పోలీసుల కళ్లకప్పి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు కరీమాను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ కేసులో అదుపులో ఉన్న ప్రధాన నిందితురాలి పట్ల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళా కానిస్టేబుల్ సునీత, యాలాల పీఎస్కు చెందిన బస్వరాజ్ను పోలీసు ఉన్నతాఽధికారి సస్పెండ్ చేశారు. మొయినాబాద్: వైన్ షాపు ఎదుట పార్క్ చేసిన బైక్ చోరీకి గురైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ష్టేషన్ పరిధిలోని హిమాయత్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని కిస్మత్పూర్కు చెందిన తోకటి ప్రదీప్ హిమాయత్నగర్లోని వైన్స్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 4న మధ్యాహ్నం రోజు మాదిరిగా తన స్పెండర్ బైక్ను వైన్స్ ముందు పార్క్ చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వెళ్లే సమయంలో చూడగా బైక్ కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించంలేదు. దీంతో శనివారం రాత్రి మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
చిన్నారి కుటుంబానికి అండగా ఉంటా
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నాడు జలకళ.. నేడు వెలవెల వర్షాకాలంలో వరద పరవళ్లు తొక్కుతూ పంట పొలాలను ముంచెత్తిన ఈసీ వాగు ప్రస్తుతం ఎడారిగా దర్శనమిస్తోంది. మండలంలోని అమ్డాపూర్ సమీపంలో గల ఈసీవాగు పరివాహక ప్రాంతం వెలవెలబోయి కనిపిస్తూ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. – మొయినాబాద్రూరల్ షాద్నగర్: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో నాలుగు నెలల క్రితం మల్లన్న జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, మౌనిక ఆదివారం షాద్నగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండేళ్ల చిన్నారి జాతరలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. చిన్నారి మృతిని కొన్ని పార్టీల నాయకులు రాజకీయం చేశారన్నారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేయకముందే కొందరు నాయకులు రాద్దాంతం చేశారే తప్పా ఎవరూ ఆదుకోలేదన్నారు. తాను అండగా ఉంటానని, తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీనిచ్చారు. -
సొసైటీ చైర్మన్కు ఎమ్మెల్యే పరామర్శ
యాలాల: సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డిని ఆదివారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పరామర్శించారు. ఇటీవల సురేందర్రెడ్డి కాలికి శస్త్రచికిత్స చేసుకున్న సంగతి విధితమే. ఈ మేరకు ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ నర్సింహులు, మాజీ చైర్మన్ బాల్రెడ్డి, సంగెంకుర్దు మాజీ సర్పంచ్ హన్మంతు తదితరులు ఉన్నారు. కాగా.. సొసైటీ చైర్మన్ను ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు ఉన్నారు. పేదలకు వరం ‘ఇందిరమ్మ’ కొడంగల్: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరమని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. మండల పరిధి ప్యాలమద్ది, ఐనన్పల్లి గ్రామాల్లో పలువురు లబ్ధిదారుల ఇళ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు చైర్మన్ను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, దాము, శ్రీనివాస్రెడ్డి, ఆసీఫ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పట్టుదలతో ఏదైనా సాధ్యం దోమ: దేశానికి సేవ చేసేందుకు అగ్నివీర్కు గ్రామం నుంచి ఏడుగురు ఎంపిక కావడం హర్షణీయమని సర్పంచ్ రజిత భాస్కర్గౌడ్ అన్నారు. మండల పరిధి ఐనాపూర్ నుంచిఆర్మీకి ఎంపికై న వారిని ఆదివారం శాలువాలు కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని యువకులు నిరూపించారని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటల్లో రాణించాలని, అప్పుడే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని సూచించారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి తాండూరు టౌన్: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన శనివారం మండల పరిధిలో చోటుచేసుకుంది. గోనూరు గ్రామానికి చెందిన మాల మాణిక్యప్పకుచెందిన ఎద్దు.. కోలి రామప్ప పొలంలో మేత మేస్తుండగా గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కరెంటు స్తంభాలకు ఉన్న విద్యుత్ తీగలు తెగి ఎద్దుపై పడటంతో షాక్తో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఎద్దు మృతితో నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. తాగునీటి సమస్యకు పరిష్కారం బొంరాస్పేట: మండల పరిధి మేడిచెట్టుతండా సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో 5వ వార్డు బోడబండతండాలో ఆదివారం తాగునీటి సమ స్య తీర్చేందుకు బోరు వేయించారు. పార్టీలకు అతీతంగా గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్నామని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచు సోనారాజునాయక్, నాయకులు రమేశ్నాయక్, భాస్కర్, లక్ష్మణ్, రతన్, హన్మ్యా, సక్రియా, సేవ్యా, రుకాలిబాయి తదితరులున్నారు. -
వంతెనలపై ‘రక్షణ’ కరువు
● ప్రమాదపుటంచున ప్రయాణం ● కూలిన అన్నాసాగర్ బ్రిడ్జి రేలింగ్.. ● శిథిలావస్థలో కోట్పల్లి వంతెన సైడ్వాల్స్ బంట్వారం: రహదారులను అభివృద్ధి చేసి, రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగు పరుస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. వాస్తవరూపం దాల్చడం లేదు. కొత్తమార్గాలు, విస్తరణ సంగతి ఎలా ఉన్నా.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వలన అధ్వాన రోడ్లు, శిథిలావస్థకు చేరువన వంతెనలు, ఇరు వైపులా ఉన్న రేలింగులు సైతం మరమ్మతుకు నోచుకోవడం లేదు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తప్పనిసరిగా ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు. 40 ఏళ్ల క్రితం.. కోట్పల్లి మండల కేంద్రంలోని తాండూరు– సదాశివపేట మార్గంలోని వాగుపై సుమారు 40 ఏళ్ల క్రి తం వంతెన నిర్మించారు. అదే సమయంలో అన్నాసాగర్ వాగుపై కట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. కాలక్రమేణా రెండు బ్రిడ్జిలకు ఇరు వైపులా ఉన్న సైడ్ రేలింగ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. పెచ్చులు ఊడుతున్నాయి. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. అదుపు తప్పితే.. తాండూరు– సదాశివపేట రహదారి వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. సిమెంటు, నాపరాయి లోడ్తో వాహనాలు ఈ మార్గం గుండా సదాశివపేట జాతీయ రహదారి 9 వైపు వెళ్తుంటాయి. కోట్పల్లి ప్రాజెక్టుకు టూరిస్టులు తమ వ్యక్తిగత వాహనాలతో దూసుకుపోతుంటారు. ఈ క్రమంలో ఈ రెండు వంతెనల వద్ద ఏమాత్రం ఆదమర్చినా ప్రమాదం బారిన పడే అవకాశాలు లేకపోలేదు. అన్నాసాగర్ వంతెనపై రక్షణగా ఉన్న రేలింగ్ ఎక్కడికక్కడ ఊడిపోగా.. కోట్పల్లి బ్రిడ్జి పై కూలడానికి సిద్ధంగా ఉంది. ఈ దారిలో ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా.. వాగులో పడాల్సిందేనని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ప్రమాదాలు జరగముందే రేలింగుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
టిప్పర్ ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడి మృతి
శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ టిప్పర్ గుర్తు తెలియని వృద్ధుడిని ఢీ కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంకర్పల్లి సీఐ ముదస్సర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం చేవెళ్ల నుంచి ఎరువు లోడ్తో శంకర్పల్లి వైపు నుంచి ఎన్కెతలకు వెళ్తున్న ఓ టిప్పర్ అతివేగంగా వెళ్తుంది. శంకర్పల్లి మున్సిపాలిటీలోని ఫత్తేపూర్ వద్ద టిప్పర్ యూటర్న్ తీసుకునే క్రమంలో అక్కడే రోడ్డు దాటుతున్న ఓ గుర్తు తెలియని వృద్ధుడు(80)ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడికి రక్తగాయాలు కావడంతో స్థానికులు 108సాయంతో హుటాహుటిన సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఘనంగా పైలెట్ జన్మదిన వేడుకలు
తాండూరు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు మణికొండలోని పైలెట్ నివాసానికి తరలివెళ్లారు. రోహిత్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ సందల్ రాజుగౌడ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింహులు, కౌన్సిలర్లు నవీనసంతోష్గౌడ్, ఇర్షాద్, మాజీకౌన్సిలర్లు వరాల శ్రీనివాస్రెడ్డి, ఇర్ఫాన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, గద్దె శ్రీనివాసచారి,సంతోష్గౌడ్లు ఉన్నారు. కాగా.. తాండూరు ప్రభుత్వ జిల్లా, మాతాశిశు ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన నిర్వహించారు. పట్టణంలోని పైలెట్ నివాసంలో నాయకులు వేడుకలు జరుపుకొన్నారు. యాలాలలో.. యాలాల: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు చందాపురం రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నగరంలోని నివాసంలో రోహిత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాకప్పిసన్మానించారు. భారీ కేక్కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ మాజీ వైస్ చైర్మన్ వడ్డే రాములు, మాజీ సర్పంచ్లు రవికుమార్గౌడ్, అరవింద్, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్, గణేశ్, విక్రాంత్, శరణుభూపాల్, లాలు ముదిరాజ్ తదితరులు ఉన్నారు. నవాబుపేటలో.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. బీఆర్ఎస్ మండల ముఖ్య సలహాదారు, మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇందులో పార్టీ నాయకులు శాంతికుమార్, పురుషోత్తం, నరేందర్ రెడ్డి, మహేశ్ రెడ్డి, సుధాకర్, శ్రీకాంత్ గౌడ్, శేఖర్, బద్రి, మల్లేశ్, వినోద్, మాణిక్ రెడ్డి, తలారి శేఖర్, అనంతయ్య, అనిల్, నవీన్, బక్కని శేఖర్, కిషోర్, రాజు, బక్కని కుమార్ పాల్గొన్నారు. -
ఫిట్నెస్ మస్ట్
బడి బస్సు.. కొద్దిరోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలల గేట్లుషాద్నగర్లో ఫిట్నెస్ టెస్ట్కు వచ్చిన బస్సును పరిశీలిస్తున్న అధికారులుషాద్నగర్: మరికొద్ది రోజుల్లో పాఠశాలల గేట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి ప్రైవేటు యాజమాన్యాలు బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకొని ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. ఎంవీఐ కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడువులోపు ప్రైవేటు పాఠశాలల బస్సులకు విధిగా ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. జిల్లాలో సుమారు రెండువేల వరకు ఈ బస్సులు ఉన్నాయి. పాఠశాలలు తిరిగి ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫిట్నెస్ ఉంటేనే బస్సులు రోడ్లపై తిరగాలని లేదంటే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేటులో ప్రత్యేకంగా బస్సులు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. విద్యార్థులను నేరుగా ఇంటి నుంచి తీసుకెళ్లి, తిరిగి సాయంత్రం విడిచి పెట్టేందుకు వీలుగా బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ, గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు చాలా ప్రైవేటు పాఠశాలలు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేకంగా రవాణా చార్జీల పేరిట వసూలు చేస్తున్నారు. పాఠశాల బస్సు 15 ఏళ్ల కాలపరిమితి దాటకూడదు. విద్యాసంస్థల బస్సులు విధిగా పసుపు రంగులోనే ఉండాలి. బస్సు నడిపే డ్రైవర్ విధిగా హెవీ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. డ్రైవర్ వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి. బస్సు నడిపేందుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. బస్సుపై కుడి, ఎడమ వైపు పాఠశాల పేరు, చిరునామా స్పష్టంగా రాయాలి. వాహనం ఆగితే బ్లింక్ అయ్యేలా పై భాగంలో నాలుగు వైపులా అంబర్ లైట్లు ఉండాలి డ్రైవర్ లైసెన్స్ను పాఠశాల యాజమాన్యం విధిగా ఆర్టీఏ కార్యాలయంలో అందించాలి. బస్సులో ప్రథమ చికిత్స పెట్టె, మంటలను ఆర్పే వ్యవస్థ ఉండాలి. కిటికీలకు అడ్డంగా మూడు కడ్డీలు ఉండాలి. నేల నుంచి 325 మి.మీ ఎత్తులో మెట్లు, ఎక్కేందుకు హ్యాండ్ రెయిలింగ్ ఉండాలి. అత్యవసర ద్వారంతోపాటు బస్సు డ్రైవర్, అటెండర్ ఫోన్ నంబర్లు విఽధిగా ఉండాలి. నెలకోసారి బస్సు డ్రైవర్కు బీపీ, షుగర్, కంటి పరీక్షలు విఽధిగా చేయించాలి. ప్రతి బస్సులో సీరియల్ నంబర్తో కూడిన ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలి. స్కూల్ యాప్ ద్వారా విద్యా సంస్థ పేరు, డ్రైవర్, అటెండర్ పేరు వివరాలు పొందుపర్చాలి. బస్సులు రోడ్డెక్కాలంటే అనుమతి తప్పనిసరి యాజమాన్యాలు విధిగా పరీక్షలు చేయించాలి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న అధికారులు -
ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం
షాబాద్: షాబాద్లో బొడ్రాయి ప్రతిష్ఠాపన 4వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామస్తులు బొడ్రాయి వద్దకు బారులు తీరి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండాల అశోక్, మాజీ సర్పంచులు తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, రవీందర్, వెంకట్యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు జడల లక్ష్మీరాజేందర్గౌడ్, ఉపసర్పంచ్ దండు రాహుల్గుప్తా, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ను దూషించేందుకే సభలు
బొంరాస్పేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడానికే సీఎం రేవంత్రెడ్డి కోట్ల నిధులు ఖర్చుచేసి ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి బీఆర్ఎస్ పుణ్యమే అన్నారు. జడ్చర్ల సభలో సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ.27వేల కోట్ల నిధులతో 90 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ఐదు రిజర్యాయర్లు, వాటికి మోటార్లు ఏర్పాటు చేశారని వివరించారు. క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం నారాయణపేట ఎత్తిపోతల పథకం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద కేసీఆర్ చేపట్టిన పనులను పూర్తి చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల ఆయకట్టును ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా రేవంత్రెడ్డి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఎస్ఐపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నా కేసు నమోదు చేయడంలేదని స్థానిక ఎస్ఐ, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ట్రాక్టర్లు, జేసీబీలను పట్టుకున్నా డీలింగ్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇసుక బండ్లను సీజ్ చేయాలన్నారు. కేసు నమోదు చేయకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐ బాలవెంకటరమణపై త్వరలోనే డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. విత్తనాల స్కామ్లని ఆరోపణ కొడంగల్ నియోజకవర్గంలో సబ్సిడీ విత్తనాల స్కామ్లు జోరుగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.7 కోట్ల విలువైన వేరుశనగ విత్తనాలు, 617 మంది రైతులకు చెందిన 4.5కోట్ల కందుల స్కామ్ చోటుచేసుకుందని ఆరోపించారు. ఎర్రమట్టి, ఇసుక రవాణా, విత్తనాల స్కామ్లు జోరుగా సాగుతున్నాయని వీటిని అరికట్టకపోతే పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు శేరి నారాయణరెడ్డి, సుదర్శన్రెడ్డి, శ్రావణ్గౌడ్, నెహ్రూనాయక్, సర్పంచ్లు మల్లారెడ్డి, హీరూనాయక్, బాలు నాయక్, మహేందర్, వెంకటయ్య, లచ్చప్ప, విష్ణువర్ధన్రెడ్డి, చాంద్పాషా, సురేశ్రాజ్, తదితరులున్నారు. పాలమూరు–రంగారెడ్డి బీఆర్ఎస్ పుణ్యమే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి -
ప్రణాళికతో ముందుకెళ్లాలి
అనంతగిరి: గ్రామాలాభివృద్దికి ప్రణాళికతో ముందుకెళ్లాలని వికారాబాద్ ఎంపీడీఓ వినయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా వికారాబాద్ మండలంలోని అత్వెల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రణాళికలో ఇచ్చిన అన్ని అంశాలను చేపట్టాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, డీఎస్పీ అంజయ్య, సీఐ రఘుకుమార్, పంచాయతీ కార్యదర్శి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ ఎంపీడీఓ వినయ్కుమార్ -
ఓర్వలేక.. ఒట్టిమాటలు
● ఇస్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం ● కాంగ్రెస్ నాయకులు దుద్యాల్: అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరెందర్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇస్టానుసారంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలు, లక్ష ఎకరాలకు సాగు నీరు, తాగునీరు, ఎడ్యుకేషన్ హబ్, పరిశ్రమల ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సకల జనుల ప్రయోజనాలు కోరుకుంటున్న రేవంత్పై.. పట్నం నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రస్తుత నిధులతో పోలిస్తే 10 శాతం కూడ ఇవ్వలేదని ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కనీసం డిపాజిట్ దక్కించుకునే యత్నం చేయాలని నరెందర్ రెడ్డికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మంగలి రాములు, రేవంత్ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు బ్యాగరి నర్సింహ, కాంగ్రెస్ నాయకుడు నరెందర్ గౌడ్లు పాల్గొన్నారు. -
‘ప్రీ ప్రైమరీ’ని అంగన్వాడీలకు అప్పగించాలి
యాలాల: ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ టీచర్లకు అప్పగించి, ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు. శనివారం అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే కుట్రలను భగ్నం చేస్తామన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ఈపీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీ ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం దొడ్డిదారిన ఎన్ఈపీ చట్టాన్ని అమలు చేయడం సరికాదన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలపర్చాల్సిన ప్రభుత్వాలు, నిర్వీర్యం దిశగా వెళ్తుండడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కవిత, భాగ్యలక్ష్మి, అనంతమ్మ, లక్ష్మీదేవి, భారతమ్మ, శాంతిబాయి తదితరులు ఉన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప -
ఇద్దరిపై అట్రాసిటి కేసు నమోదు
పూడూరు: వ్యక్తిపై దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదైన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన పట్లోళ్ల శ్రీకాంత్రెడ్డి వాటర్ ట్యాంకర్తో గ్రామం నుంచి వెళ్తుండగా.. ఆదే గ్రామానికి చెందిన తిర్మలాపూర్ రమేష్ ట్యాంకర్ను ఆపి ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి, గొడవకు దారితీసింది. ఈ క్రమంలో శ్రీకాంత్రెడ్డి, అతని కుమారుడు మౌనిక్రెడ్డిలు తిడుతూ రమేష్పై దాడి చేశారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి గాయపడ్డాడు. గత నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా శనివారం మెడికల్ రిపోర్టులతో పాటు.. తదితర సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని శ్రీకాంత్రెడ్డి, మౌనిక్రెడ్డిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యాలాల: కిరాణ కొట్టుకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని కోకట్లో చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంతోష్, అంజలి భార్యాభర్తలు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అంజలి కిరాణ కొట్టు వరకు వెళ్లి వస్తానని చెప్పి, బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, స్నేహితులు, బంధువుల వద్ద గాలించినా ఫలితం లేకుండా పోయింది. సంతోష్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కుల్కచర్ల: పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. మండల పరిధి ముజాహిద్పూర్ జడ్పీ పాఠశాలలో 1998– 99లో పదో తరగతి చదువుకున్న బాల్యమిత్రులు.. శనివారం ఒకే వేదికగాసందడి చేశారు. ఆటపాటలతో కేరింతలు కొట్టారు. నాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. రాంరెడ్డిపల్లి సర్పంచ్గా ఎన్నికై న పూర్వ విద్యార్థి నర్సింహులు యాదవ్ను సహచర విద్యార్థులు సన్మానించారు. ఎంఈఓ అబీబ్ అహ్మద్, పీఆర్టీయూ శంషాబా, మండల అధ్యక్షుడు భాస్కర్, ఆర్టీసీ ఉద్యోగి చంద్రయ్య, అంబు, వెంకట్, పులింగ వెంకటేశ్ పాల్గొన్నారు. -
వర్షం కురిసి.. అలా ముగిసి
కాల్చితే నష్టం.. యాసంగి సీజన్ పంటల కోతలు పూర్తయ్యాయి. వానాకాలం సీజన్కు రైతులు సమాయత్తం అయ్యారు.కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్కు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన సాక్షి, రంగారెడ్డి జిల్లా/తుర్కయంజాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం.. ఆందోళనలు.. అరెస్టుల మధ్య ముగిసింది. కోహెడ కేంద్రంగా 239 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,284.32 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మార్కెట్ భవనాలతో పాటు నాలుగు ఎకరాల్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఐదు గంటలకే ఆయన హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, కాలె యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులతో మాట్లాడి, వారి అనుభవాలను విన్నారు. తడిసిన రైతులు.. ఖాళీ కుర్చీలు పండ్లమార్కెట్ శంకుస్థాపనకు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నల్లగొండ, నాగర్కర్నూలు, భువనగిరి జిల్లాల నుంచి సుమారు యాభై వేల మందిని తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు బస్సులను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రైతులు తడిపి ముద్దయ్యారు. శంకుస్థాపన ఆలస్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకే సభాస్థలికి చేరుకున్న రైతులు రాత్రి పొద్దుపోయే వరకు నిరీక్షించాల్సి వచ్చింది. మరికొంతమంది శంకుస్థాపనకు ముందే వెనుదిరిగారు. సభాస్థలి ముందు భాగంలో మూడు బ్లాకులు ఏర్పాటు చేయగా ఒకటి, రెండు బ్లాకుల్లో మాత్రమే జనం కనిపించారు. మూడో బ్లాక్లోని కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సరైన పార్కింగ్ లేకపోవడం, వర్షం కారణంగా వాహనాలు బురదలో ఇరుక్కుపోవడంతో వీటిని తీసేందుకు నానా తంటాలు పడ్డారు. కాగా, మల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శించగా ఎమ్మెల్యే వారిని వారించారు. నిశ్శబ్దంగా కూర్చోవాలని సూచించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఆలస్యంగా కార్యక్రమం సభాస్థలికి రెండు గంటలు లేటుగా వచ్చిన ముఖ్యమంత్రి శంకుస్థాపనకు ముందే వెనుతిరిగిన మెజార్టీ రైతులు మరోవైపు కొనసాగిన ఆందోళనలు.. అరెస్టులురైతుల అంగీకారం లేకుండా, కనీస నష్టపరిహారం కూడా చెల్లించకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని స్థానికులు, బాధితులు కొంతకాలంగా నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కారు తీరుపై అంతా గుర్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో అలజడి సృష్టించే అవకాశం ఉందని అనుమానించిన పోలీసులు భూ బాధిత రైతులతో పాటు పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. వీరిలో ఇద్దరు అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఉండటం గమనార్హం. అరెస్టు చేసి, అటు ఇటు తిప్పి.. అరెస్టులను తప్పుబడుతూ కొంతమంది నిరసనకారులు కోహెడలో సీఎం రేవంత్రెడ్డి సహా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి, సీఎంతో పాటు, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి, గంటల తరబడి రోడ్లపై తిప్పుతూ.. చివరకు నాగోల్ పీఎస్కు తరలించారు. పోలీసులు, సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. రైతుల అంగీకారం లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. -
సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడిగా రఫియొద్దీన్
మర్పల్లి: సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడిగా రఫియొద్దీన్ (కొషేట్పల్లి)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన ఆయా గ్రామాల సర్పంచ్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షునిగా పోటీలో ఉన్నప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆదేశాల మేరకు కొంషేట్పల్లి సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రఫియొద్దీన్ మాట్లాడుతూ.. సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన స్పీకర్ ప్రసాద్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేశ్, పార్టీ జిల్లా నాయకులకు, సర్పంచ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు చర్యలు తీసుకోవాలి
అనంతగిరి: విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వికారాబాద్లో రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంది, పత్తి తదితర విత్తనాలు అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. డీఏపీ , యూరియా ఎమ్మార్పీ ధరకంటే అధికంగా అమ్ముతున్నారని ఈ విషయంలో అధికారులు సంబంధిత దుకాణాలపై దాడులు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పలు దుకాణాల్లో బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, నర్సింలు, అనంతయ్య, బాలరాజు, తేజ, ఆదిత్య, వెంకట్, యాదయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మైపాల్ -
ఉక్కపోత నుంచి ఉపశమనం
● ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం ● తాండూరులో 5.03 సెం.మీ వర్షపాతం ● మాడ్గులలో 4.43 సెం.మీ నమోదు ● ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం సాక్షి, రంగారెడ్డిజిల్లా: మృగశిరకు ముందే ఉమ్మడిజిల్లాను తొలకరి పలకరించింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షానికి వాతావరణం చల్లబడింది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5.03 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.43 సెంటీమీటర్లు నమోదైంది. శేరిలింగంపల్లిలో 4.08 సెం.మీ, కందుకూరులో 3.80 సెం.మీ, యాచారం మండలం నల్లవెల్లిలో 3.75 సెం.మీ, కడ్తాల్ మండలం ముద్వీన్లో 3.68 సెం.మీ, కొంగర కలాన్లో 3.38 సెం.మీ, మామిడిపల్లిలో 3.13 సెం.మీ, మణికొండలో 2.72 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ చౌడాపూర్లో 3.68 సెం.మీ, మదన్పల్లెలో 2.80 సెం.మీ, యాలాలలో 2.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ లైన్లపై పడ్డాయి. వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్ప డింది. విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమైన సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు వర్షం ధాన్యం రైతులను నిండా ముంచింది. రాశులపై టార్పాలిన్లు లేకపోవడంతో తడిసి ముద్దయ్యాయి. మా నాన్న టమాటా, వరి పెట్టేవారు. నేను ఎలాంటి రసాయనాలు వాడకుండా అదే పంటను సాగు చేస్తున్నా. మంచి దిగుబడి సాధిస్తున్నా. ఎన్టీఆర్ మార్కెట్కు తరలిస్తున్నా. మొదట్లో ఐదుగురు రైతులతో చిత్తాపూర్లో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. శాస్త్రవేత్తలతో పాటు 150 మంది రైతులు ఉన్నారు. ఏ తెగులుకు ఏ మందు కొట్టాలో తెలుసుకునే అవకాశం ఉంది. – జి.సుధాకర్, మంచాల మండలం రసాయన ఎరువుల వాడకంతో భూమిలోని మిత్ర పురుగులు చనిపోయి సరైన దిగుబడి రాక నష్టాల పాలయ్యాం. అప్పులు తీర్చేందుకు ఉన్న 20 ఎకరాల్లో 10 ఎకరాలు అమ్ముకున్నాం. తర్వాత ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాం. అమ్మిన పొలాన్ని మళ్లీ కొనుగోలు చేశాం. మరికొంత భూమిని లీజుకు తీసుకుని ప్రస్తుతం 70 ఎకరాల్లో 30 రకాల పంటలు సాగు చేస్తున్నాం. – లావణ్య, తెల్కపల్లి, నాగర్కర్నూల్ జిల్లా -
తాండూరులో దంచికొట్టిన వాన
తాండూరు టౌన్: మండుటెండలు, ఉక్కపోక్కతో ఉక్కిరిబిక్కరవుతున్న ప్రజలకు శనివారం కురిసిన వర్షం ఊరటనిచ్చింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి సుమారు రెండు గంటలపాటు వర్షం దంచికొట్టింది. గాలిదుమారంతో కూడిన వాన రావడంతో తాండూరు–హైదరాబాద్ మార్గంలో ఓ చెట్టు విరిగి రహదారికి అడ్డంగా పడిపోయింది. సాయిపూర్, పాండురంగ ఆలయం, స్నేహ నగర్, మిత్ర నగర్, గ్రీన్ సిటీ, గుమాస్తా నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు వెళ్లేందుకు మురుగు కాలువ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు రోడ్లపైకి చేరింది. ప్రభుత్వ నంబర్ వన్ పాఠశాల వద్ద మోకాలు లోతు వరదనీటితో జనాలు ఇబ్బంది పడ్డారు. డీసీఎంఎస్ ఆవరణలో నిల్వ చేసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. పట్టణంలోని పలు వార్డుల్లో మురుగు కాలువ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరంతా వర్షపు నీటితో కలిసి రోడ్లపై ప్రవహిస్తోందని, దీంతో రోడ్లపై నడిచేందుకు సైతం ఇబ్బంది కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.రోడ్లపైకి చేరిన వర్షపు నీరు -
హోటల్ పైకప్పు కూలి..
మర్పల్లి: శిథిలావస్థకు చేరిన హోటల్ స్లాబ్ కుప్పకూలడంతో నలుగురు క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన శనివారం మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవూఫ్, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో 35 ఏళ్ల క్రితం మండల కేంద్రంలో ఓ వ్యాపార సముదాయం నిర్మించారు. ఈ భవనంలో ఇమ్రాన్ అనే యువకుడు ఆరు నెలలుగా కేహెచ్ఎన్ హోటల్(టిఫిన్ సెంటర్) నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 11.15గంటల సమయంలో భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటికే అక్కడ టిఫిన్ చేస్తున్న నలుగురు శిథిలాల కిందే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సర్పంచ్ రమేశ్ హిటాచీ, జేసీబీ రప్పించి శిథిలాలు తొలగించి గ్రామానికి చెందిన నాజర్, రమేష్, చందన, కొత్లాపూర్కు చెందిన శివకుమార్ను బైటకు తీసుకువచ్చారు. వారికి మర్పల్లి కమ్యూనిటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైనవైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నాజర్ కుడికాలు, శివకుమార్ రెండుకాళ్లు విరిగాయి. రమేశ్ తలకు బలమైన గాయాలయ్యాయి. చందనకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ అంజయ్య మోమిన్పేట్ సీఐతో ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల వివరాలు సేకరించారు. తహసీల్దార్ పురుషోత్తం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. మెరుగైన వైద్యం అందిస్తాం: స్పీకర్ సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు అధైర్య పడొద్దని తాను అండగా ఉంటానని చెప్పారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్రెడ్డి తదితరులు ఉన్నారు. మర్పల్లిలో నలుగురికి గాయాలు జేసీబీ, ఇటాచీ సాయంతో క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చిన పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించిన డీఎస్పీ అంజయ్య క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్ ప్రసాద్కుమార్ -
నేడు పోలేపల్లిలో హిందూ సమ్మేళనం
దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లిలో ఆదివారం హిందూ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకుడు పుర్ర వెంకటయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కృష్ణ స్వామి, మ్యాడమ్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. కొడంగల్ రూరల్: మండల పరిధిలోని రుద్రారం శివారులో 40 రోజుల క్రితం బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన హరికృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు, ఉన్నతాధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతూ బాధితులకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబసభ్యులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని మార్కెట్యార్డులో విలేకరులతో మాట్లాడుతూ హరికృష్ణ మృతదేహంపై గాయాలున్నాయని దాడి చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జగదీశ్, గోపి రజక, చంద్రయ్య, సాయిలు, ఆంజనేయులు, వెంకటయ్య, సీహెచ్.లక్ష్మి, అశోక్, న్యాయవాది వెంకటయ్య, కూర వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ రూరల్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ కూలీ మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నాగారంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నర్సమ్మ(52) రోజూ మాదిరిగానే శనివారం ఉపాధి పనులకు వెళ్లింది. గంటపాటు పనిచేసిన అనంతరం నీరసంగా ఉందంటూ సమీపంలోని చెట్టు నీడకు వెళ్లి సొమ్మసిల్లి పడిపోయింది. అప్రమత్తమైన తోటి కూలీలు వెంటనే ఆమెను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని సూచించడంతో 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త మల్లప్ప, కుమారుడు ప్రవీణ్కుమార్ ఉన్నారు. అనంతగిరి: సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకు మేలు చేకూరుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన వికారాబాద్ మండలంలో పలువురు బాధితులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, వైస్ చైర్మన్ మల్లేశం, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూడూరు: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి గొంగుపల్లి సీతమ్మ గుడి సమీపంలో ఓ వ్యక్తి గాయాలతో మృతి చెందాడు. మృతుడిది చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్తండా వాసి మంగ్యానాయక్(38)గా గుర్తించారు. మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి బార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
కాల్చితే నష్టం.. దున్నితే లాభం
కొడంగల్: యాసంగి సీజన్ పంటల కోతలు పూర్తయ్యాయి. వానాకాలం సీజన్కు రైతులు సమాయత్తం అయ్యారు. అందులో భాగంగా యాసంగి పంట వ్యర్థాలను పొలంలో దుక్కిదున్నకుండా కాల్చి బూడిద చేస్తున్నారు. ఫలితంగా భూసారం దెబ్బతిని, పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతున్నాయి. పంటకు నష్టం చేకూరుతుంది. దీనిని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. వ్యర్థాలను కాల్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించింది. జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. పోస్టర్లను ఆవిష్కరించింది. అవగాహన కార్యక్రమాలు ఇటీవల కాలంలో చాలామంది రైతులు పొలంలోని పంట వ్యర్థాలను కాలుస్తున్నారు. అయితే కొందరు ప్రమాదశాత్తు ఆ అగ్నికీలల్లో చిక్కుకొని మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వ్యర్థాలుకాల్చడం వలన భూసారం తగ్గే ప్రమాదం ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వ్యర్థాలను పొలంలో కలియ దున్నడంతో కలిగే లాభాలు,కాల్చడంతో వచ్చే నష్టాల గురించి ఆ శాఖ అధికారులు వివరిస్తున్నారు. వ్యర్థాలను కాలిస్తే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమాన విధిస్తామని స్పష్టం చేస్తున్నారు. అవశేషాలను కాల్చితే.. పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిన అవశేషాలను కాలిస్తే పంటలకు మేలు చేసే మిత్ర సూక్ష్మజీవులు చనిపోతాయని అధికారులు చెబుతున్నారు. భూమిలో సహజ పోషకాలు, సూక్ష్మజీవులు నశించి.. నేల నాణ్యత తగ్గిపోతుందని తెలిపారు. పోషకాలు ఆవిరైపోతాయి. ఫలితంగా ఎరువుల వినియోగం పెరిగి పెట్టుబడి భారమవుతుంది. విష వాయువులు పెరిగి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రజలకు శ్వాసకోశ, కంటి, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశంఉందని వివరిస్తున్నారు. కలియ దున్నితే.. వ్యర్థాలను పొలంలో దున్నడం వలన భూసారం మెరుగుపడుతుంది. నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పొలంలో నీటి వినియోగం, రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. పంటలకు మేలు చేసే మిత్ర సూక్ష్మజీవులు పెరిగి, పంట దిగుబడి పెరుగుతుంది. పచ్చిరొట్ట ఎరువును కల్టివేటర్తో భూమిలోనే కలియదున్నడంతో వ్యర్థాలు పూర్తిగా కలిసి, భూమికి బలం చేకూరుతుంది. -
మినీట్యాంక్బండ్గా కొత్తచెరువు కుంట
పరిగి: పట్టణంలోని కొత్త చెరువు కుంటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన పట్టణ కేంద్రంలోని కొత్తచెరువు కుంట మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త చెరువు కుంటను పరిగి పట్టణంలో మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతానని అన్నారు. గతంలో కొత్త చెరువు కుంట అన్యాక్రాంతమయిందని.. ప్రస్తుతం చెరువు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించామన్నారు ఎలాంటి సమస్యలున్నా తన తృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్లో పీఎంశ్రీ విద్యార్థుల సత్తా
దోమ: మండల పరిధిలోని దాదాపూర్ పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షీప్(ఎన్ఎంఎంఎస్) టెస్ట్లో సత్తా చాటారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి 8వ తరగతి విద్యార్థులకు నవంబర్లో జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 62 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవ్వగా దాదాపూర్ పీఎంశ్రీ పాఠశాల నుంచి 11 మంది విద్యార్థులు సత్తాచాటారు. వీరికి ప్రభుత్వం 9వ తరగతి– 12వ తరగతి వరకు ఏటా రూ.12 వేల చొప్పున నగదు అందజేస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. -
ర్యాండమైజేషన్తో లబ్ధిదారుల ఎంపిక
● అర్హులైన వారికే కేటాయింపు ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తాండూరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ వెంకటాచారి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాథోడ్ దశరథ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఇళ్ల కేటాయింపుపై కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో 8,333 దరఖాస్తులు వచ్చాయని, 1,001 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 581 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎంపికై న లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉన్నవారికే కేటాయింపు ఉంటుందని వివరించారు. అర్హత లేకుండా ఇళ్ల కేటాయింపు జరిగిందని తెలిస్తే ఫిర్యాదులను స్వీకరించి మరో దఫా విచారణ చేపడతామన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి పరిగి: గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ప్రజాప్రతినిధులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని జాఫర్పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసుకోవాలని, గుంతలను పూడ్చుకోవాలని సూచించారు. గ్రామ సమస్యల పరిష్కారం, ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాలపై ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని చెప్పారు. అనంతరం రాఘవపూర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోళ్లను వేగిరం చేయాలన్నారు. మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహనకృష్ణ, డీపీఓ జయసుధ, తహసీల్ధార్ వెంకటేశ్వరి, ఎంపీడీఓ హరిప్రియ రెడ్డి, సర్పంచ్ మహేశ్కుమార్ పాల్గొన్నారు. -
నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి
బషీరాబాద్: నాటు సారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. ఆబ్కారీ జిల్లా అధికారి విజయభాస్కర్ ఆదేశాలతో శుక్రవారం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి బృందం.. కొత్లాపూర్, వాల్యనాయక్ తండా, బాబునాయక్తండాలో దాడి చేసింది. ఈ సంఘటనలో హన్మానాయక్, తులసిబాయి, రెడ్యానాయక్ దగ్గర 9 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం పానకం పారబోశారు. 9మందిని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేశారు.మూడు కేసులు నమోదు చేశామని తాండూరు ఎకై ్సజ్ సీఐ రాణి తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయం, రవాణా చటరీత్యా నేరమని హెచ్చరించారు. ఎక్కడైనా సారా తయారు చేసినట్లు తెలిస్తే.. 8712658754 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 9 మంది బైండోవర్, 3 కేసులు నమోదు 300 లీటర్ల బెల్లం పాకం పారబోత -
హ్యాపీ బర్త్డే ఆనంద్
మాజీ మంత్రి సబితారెడ్డి అనంతగిరి: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి సబితారెడ్డి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ పర్యటనలో ఉన్న ఆమె ఆనంద్ నివాసానికి వెళ్లి శాలువా కప్పి బర్త్డే విషెష్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. షాద్నగర్: నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామ శివారులో ఉన్న విద్యుత్ ఉప కేంద్రంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ పరికరాలను చోరీ చేశారు. ఉప కేంద్రంలో ఉన్న ఐదు కాపర్ రాడ్లు దొంగిలించినట్లు, వీటి విలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుంది. ఉప కేంద్రం సబ్ ఇంజనీర్ సందీప్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. మొయినాబాద్ రూరల్: ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాకారానికి చెందిన ఈర్లపల్లి లక్ష్మణ్రావు(55) కూలీ పనులు చేస్తుంటాడు. గురువారం పనికి వెళ్లిన లక్ష్మణ్రావు పొలంలోని ట్రాక్టర్ను నడిపేందుకు ప్రయత్నించగా, అదుపుతప్పి కిందపడిపోయాడు. పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని భాస్కర ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య సీతామహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జున్ తెలిపారు. మొయినాబాద్రూరల్: డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మండలంలోని తోల్కట్ట గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే సాంఘిక సంక్షేమ కళాశాల(వికారాబాద్)లో కుందేటి కల్పన(20) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. గురువారం ఆమె తన అక్కను ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పి బయలు దేరింది. శుక్రవారం అయినా సోదరి ఇంటికి రాకపోవడంతో సాధ్యమైన అన్ని చోట్ల వెతికారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాదాపూర్: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. మాదాపూర్లోని హైటెక్స్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న త్రెడ్ పోచంపల్లి ప్రదర్శనను శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల .. మాట్లాడుతూ తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన పోచంపల్లి ఇకత్ కళావైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేత కుటుంబాలకు మద్దతు అందించాలని కోరారు.ఈ సందర్భంగా పోచంపల్లి ప్రాంతీయ వంటకాలతో ఆహార స్టాళ్ళు ఏర్పాటు చేశారు. ఆధునిక ఏఐ ఎక్సిపీరియన్స్ బూత్ ప్రదర్శన ఆకర్షణగా ఉంది. సందర్శకులు వర్చువల్గా పోచంపల్లి ఇకత్ దుస్తులను ధరించి ఆ అనుభూతిని పొందే అవకాశం కల్పించారు. -
ఫెర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకోండి
పరిగి: రైతులను నిలువునా దోచుకుంటున్న ఫెర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఏఓ రజితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దుకాణదారులు పురుగు మందు, ఎరువులు, విత్తనాలు అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. షాపుల్లో స్టాక్ బోర్డులు, రసీలు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రైతు సంఘం నాయకులు నర్సింహులు, బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్ -
మంత్రి పొంగులేటిని కలిసిన నాయకులు
యాలాల: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హాజీపూర్ మాజీ సర్పంచ్ ఒంగోనిబాయి శ్రీనివాస్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవితో కలిసి మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ నెల 21న జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర ఎంతో ఉన్నతమైనదన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 250 గజాల ఇళ్ల స్థలంతో పాటు పింఛను, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రత్యేక వెసలుబాటు కల్పించాలని కోరారు. -
చోరీ చేసి.. నంబర్ మార్చి
● ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్ ● ఎనిమిది బైక్లు స్వాధీనం కడ్తాల్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరి కేటుగాళ్లను కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి మండల కేంద్రం సమీపంలోని తలకొండపల్లి కూడలిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, స్కూటీపై అనుమానాస్పదంగా వెళుతున్న ఇద్దరు యువకులను ఆపారు. సరైన ఆధారాలు చూయించలేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా స్కూటీని దొంగతనం చేసినట్లు అంగీకరించారు. ఇందులో భాగంగా వివిధ ఠాణాల పరిధిలో చోరీకి గురైన ఎనిమిది ద్విచక్రవాహనాల కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఆమనగల్లు మండలం చంద్రయాన్పల్లి తండాకు చెందిన చరణ్, తలకొండపల్లి మండలం బోడియాతండాకు చెందిన అనిల్, ఖమ్మం జిల్లాకు చెందిన కిల్లంపల్లి రాజశేఖర్ అలియాస్ శేఖర్ అని తేలింది. సులభంగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశంతో వీరు ముఠాగా ఏర్పడి బైకుల చోరీలకు పాల్పడుతున్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉంచిన వాహనాలను చోరీ చేసి, వాటి నంబర్ ప్లేట్లు మార్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారి అయిన రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించి, వాహనాల రికవరీలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్ టీం ఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ మహేశ్, రాంకోఠి, రఘునాయక్లను సీఐ సైదిరెడ్డి అభినందించారు. -
నిలబడతాం.. కలబడతాం
పరిగి: పార్టీ శ్రేణులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, రైతుల పక్షాన నిలబడి, పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. యూరియా కొరత నేపథ్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేతో పాటు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు కాగా.. శుక్రవారం వారు పరిగి కోర్డుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడారు. బీఆర్ఎస్ అంటేనే రైతుల పక్షపాతి అని, తమ హయాంలో అన్నదాతల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను తెస్తే.. కాంగ్రెస్ అమలు చేయడం లేదని ఆరోపించారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్.. ఏనాడు రైతులను ఇబ్బంది పెట్టలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కర్షకులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంట సాగు చేయడం కంటే.. దిగుబడిని విక్రయించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్.. గ్రామానికో వరి కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే.. ఇప్పుడు కనీసం 50శాతం కూడా సేకరించకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. రైతులకు ఏ చిన్న కష్టం వచ్చినా.. బీఆర్ఎస్ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్రెడ్డి, అరవింద్రావు, ముకుంద అశోక్, సురేందర్, రవికుమార్, మాణిక్యం పాల్గొన్నారు. కేసులకు భయపడేది లేదు రైతు పక్షపాతి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి -
నకిలీ విత్తనం.. నియంత్రణకు నిఘా
తాండూరు: నకిలీ విత్తన వ్యాపారానికి జిల్లా అడ్డాగా మారింది. సరిహద్దున ఉన్న కర్ణాటకకేంద్రంగా అక్రమార్కులు యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు. నిరంతరం పోలీసులు నిఘా పెట్టినా.. దందా జోరు పెంచి, సవాల్గా మారుతున్నారు. పక్షం రోజుల వ్యవధిలో పోలీసు శాఖ నకిలీ విత్తనాలను తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి, సరుకును స్వాధీనం చేసుకుంది. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి, వాటి బారి నుంచి రైతులను రక్షించేందుకు ఎస్పీ స్నేహామెహ్ర పటిష్టమైన చర్యలు చేపట్టారు. చెక్పోస్టులతో దందాకు చెక్ నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. పరిగి, తాండూరు, వికారాబాద్లలో పోలీసు సబ్ డివిజన్లున్నాయి. ప్రతి సబ్ డివిజన్కు ఒక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక ఎస్ఐ, కానిస్టేబుల్లు సభ్యులుగా ఉన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. నిరంతరం తనిఖీలు చేపట్టారు. తాండూరు సబ్ డివిజన్ పరిధి కొత్లాపూర్ బార్డర్ చెక్పోస్ట్, పరిగి సబ్ డివిజన్ పరిధి రావల్పల్లి చెక్పోస్ట్, వికారాబాద్ సబ్ డివిజన్ పరిధి తోర్మామిడిలో చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. బడా రైతులతో ఒప్పందం సీజన్ మొదలు కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల నుంచి కొందరు కేటుగాళ్లు నకిలీ విత్తనాలు, ఎరువులను దిగుమతి చేసుకొని రైతులకు అంటగడుతుంటారు. ఇక్కడి బడా రైతులతో ఒప్పందం చేసుకొని, మాయమాటలతో చిన్నసన్నకారు రైతులకు విక్రయిస్తుంటారు. ఫలితంగా వారికి తగిన ప్రతిఫలం అందజేస్తారు. ఎరువుల దుకాణాలపై దృష్టి వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయాలు జరగకుండా పోలీసు శాఖ టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసింది. ఇందులో మండల, జిల్లా స్థాయి టీంలలో పోలీసు అధికారులు, వ్యవసాయ అధికారులు కొనసాగుతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సరిహద్దుతో పాటు.. జిల్లాలోని విత్తన, ఎరువుల విక్రయ దుకాణాలపై నజర్ పెట్టింది. సంయుక్తంగా తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటు మండల నుంచి జిల్లా వరకు ప్రత్యేక బృందాలు కర్ణాటక సరిహద్దులో 3 చోట్ల చెక్పోస్టులు ఎరువులు, విత్తన దుకాణాలపై తనిఖీలకు సిద్ధం -
డీఈఓను కలిసిన టీజీఎచ్ఎంఏ సభ్యులు
దోమ: జిల్లా నూతన డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ ఘనీని టీజీఎచ్ఎంఏ (తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు) సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మెరుగైన విద్య అందించడమే ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని డీఈఓ సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని పకద్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టీజీఎచ్ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు నజీమొద్దీన్, జిల్లా అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి రూప్సింగ్, ఉపాధ్యక్షుడు బుద్దవేవ్, కార్యదర్శి మహేంద్ర బహుదూర్, సభ్యులు వెంకటయ్య, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిని నీరుగారుస్తున్న కేంద్రం
● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ● మాడ్గులలో ఉపాధి కూలీల కమిటీ ధర్నా మాడ్గుల: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వరంగా మారిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు. మాడ్గుల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉపాధి కూలీల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు అనేక మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. హామీ పథకానికి బడ్జెట్ను పూర్తిగా తగ్గించిందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మతపరమైన విధంగా వీబీజీ–రామ్జీ పేరుతో అమలు చేస్తుందని చెప్పారు. పనులకు వచ్చిన కూలీలను రెండుసార్లు ఫొటో తీయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.800 అందించాలని, సంవత్సరంలో 200 రోజుల పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ విజయలక్ష్మికి అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం మండల శాఖ అధ్యక్షుడు పాషా, నాయకులు సైదమ్మ, శ్రీను, అంజయ్య, నర్సింహ, మైసయ్య, సైదయ్య, కృష్ణయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాన్నా.. అదిగో దొంగలు!
కుల్కచర్ల: తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నారు. కుల్కచర్ల మండలంలో గురువారం చోటుచేసుకున్న ఓ దోపిడీ ఘటన సినిమా దృశ్యాలను తలపించింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పుట్టపహాడ్ గ్రామానికి చెందిన బేతి మొగులయ్య ఉదయాన్నే తన భార్యతో కలిసి ఉపాధిహామీ పనులకు వెళ్లారు. సుమారు 11:30 గంటలకు వీరి ఇంటి తాళం పగులగొట్టిన ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించారు. ఎదురుగా ఉన్న ఆలయ పరిసరాల్లో ఆడుకుంటున్న మొగులయ్య కొడుకు రాహుల్(చింటు) ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించి అమ్మానాన్నా వచ్చారని లోపలికి వెళ్లాడు. అప్పటికే స్టీల్ గల్లా పెట్టెను ధ్వంసం చేసిన దుండగులు అందులోని రూ.60 వేలు, 16 తులాల వెండిని తీసుకున్నారు. లోపలికి వెళ్లిన పన్నెండేళ్ల చింటును కత్తితో బెదిరించడంతో భయపడిన బాలుడు బయటకు పరుగుతీశాడు. హైస్కూల్ వద్ద ఆడుకుంటున్న యువకుల ఫోన్తో తండ్రికి ఫోన్ చేయగా హుటాహుటిన ఇంటికి వచ్చారు. అప్పటికే దుండగులిద్దరూ బైక్పై పారిపోయారు. చోరీ జరిగిందని గుర్తించిన మొగులయ్య, స్థానికులు విషయాన్ని సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు గ్రామ నాయకులకు తెలియజేశారు. అంతా కలిసి సమీపంలోని పలు సీసీ పుటేజీలను సేకరించి, పెన్డ్రైవ్ తీసుకుని కుల్కచర్లలోని పీఎస్కు చేరుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు ఈ పుటేజీలను పరిశీలిస్తుండగా.. స్టేషన్ మెట్లపై కూర్చున్న చింటు.. రోడ్డు మీద బైక్పై వెళ్తున్న ఇద్దరిని గమనించి ‘నాన్నా.. అదిగో దొంగలు.. మనింటికి వచ్చింది వాళ్లే’ అంటూ అరిచాడు. ఈ మాటలు విన్న పోలీస్ వెహికిల్ డ్రైవర్ అంజిరెడ్డి పోలీసులను అప్రమత్తం చేసి బైక్ను వెంటాడారు. ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత, బైక్ను దాటేసి కారును రోడ్డుకు అడ్డంగా నిలిపాడు. అతివేగంగా వచ్చిన దొంగలకు బైక్ కంట్రోల్ కాకపోవడంతో కారును ఢీకొట్టి కిందపడిపోయారు. వీరిలో ఒకరిని అంజిరెడ్డి పట్టుకోగా, మరో దొంగ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. పది నిమిషాలలోపు బైక్లపై అక్కడికి చేరుకున్న పోలీసులు మరో దొంగ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో బైక్ను, దొంగను తీసుకుని పీఎస్కు తరలించారు. పట్టుబడిన వ్యక్తి జడ్చర్లకు చెందినవాడిగా గుర్తించారు. వీరు ప్రయాణించిన బైక్ను కర్నూలులో చోరీ చేసినట్లు తెలిసింది. పారిపోయిన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిలబడతాం.. కలబడతాం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు.
‘వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినాపూర్కు చెందిన ఈ రైతు పేరు నాగప్ప. ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చి 15 రోజులు దాటింది. ఇప్పటికీ తూకం వేయలేదు. ఉదయం ఆరబోయడం, సాయంత్రం కుప్పనూర్చడంతోనే సరిపోతోంది. మార్కెట్లో సరైన టార్పాలిన్లు కూడా లేవు. అకస్మాత్తుగా కురిసే వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.’ ● బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు పరమేశ్వర్ రెడ్డి ● స్థలం కేటాయించాలని కలెక్టర్కు వినతి తాండూరు టౌన్/అనంతగిరి: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్స్ టవర్స్ మంజూరైనట్లు బీజేపీ రాష్ట మాజీ కార్యవర్గ సభ్యుడు, దిశా కమిటీ సభ్యుడు మిట్ట పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారిని కలిసి స్థలం కేటాయించాలని కోరుతూ వినతి ప్రతం అందజేశారు. టెలికం అడ్వైజరీ మెంబర్స్ ఘనాపూర్ వెంకటయ్య, పెంటయ్య గుప్తా, పోకల సతీష్, గాజుల శాంత్కుమార్ అభ్యర్థన మేరకు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చొరవతో ఆరు టవర్స్ మంజూరైనట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఒకటి, వికారాబాద్ నియోజకవర్గం మోమిన్పేట్ మండలంలోని దుర్గం చెరువు, సయ్యదలీపూర్లో రెండు, తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని క్యాద్గిరాలో, పెద్దేముల్ మండలంలోని మారేపల్లిలో రెండు, పరిగి నియోజకవర్గం కు ల్కచర్ల మండలంలోని మక్త వెంకటాపూర్లో ఒక టవర్ మంజూరైనట్లు తెలిపారు. త్వరలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అనంతగిరి: చెట్లతోనే మానవ మనుగడని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నా రు. చెట్లను పెంచితే భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రదీప్ నాయక్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, అడిష నల్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్, ఎస్పీ స్నేహ మెహ్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లవకుమార్, ఉపాధ్యక్షురాలు వసుంధర, కార్యదర్శి వెంకట్రెడ్డి, ఎఫ్ఆర్ఓ శ్యాంకు మార్, ప్రతిమ, విజయ్కుమార్, నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు, ఫారెస్టు సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దుద్యాల్: మండలానికి మంజూరైన ఐదు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిలుముల్ మైల్వార్, బాలికల పాఠశాల హకీంపేట్, దుద్యాల్, కుదురుమల్ల, పోలేపల్లికి పాఠశాలలు మంజూరైనట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా పోస్టు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ మీడియట్ పాస్తో పాటు డీఎడ్ (టీటీసీ) చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. బషీరాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, బాలికలకు ఒకేషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్ అడ్మిషన్లలో పేద విద్యార్థులకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకరప్ప ప్రిన్సిపాల్ను కోరారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన ఈ రైతు పేరు మత్తరకంటి ముత్తయ్య. మార్కెట్కు ధాన్యం తెచ్చి నెలరోజులైంది. ఎనిమిది క్వింటాళ్లకుపైగా ఉంటుంది. బస్తాలు ఇచ్చారు కానీ ఎత్తలేదు. నిత్యం ఆరబోయడం, కుప్పనూర్చడంతోనే సరిపోతోంది. యాసంగి ధాన్యం వానాకాలం ప్రారంభం వరకు కూడా కొనకపోతే ఎట్లా అని, పంట పెట్టుబడికి మళ్లీ ఎక్కడ తేవాలని వాపోయాడు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: మరో రెండు రోజుల్లో రోహిణి కార్తె ముగిసి మృగశిరకార్తే ప్రారంభం కాబోతోంది. పంటలకు ఈ కార్తెను శుభసూచకంగా రైతులు భావిస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక మంది దుక్కులు దున్ని విత్తు నాటేందుకు సిద్ధమవుతుంటే.. మరికొంత మంది యాసంగిలో పండించిన పంట ఇప్పటికీ అమ్ముడుపోక అరిగోసపడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర, సన్నాలకు బోనస్ల సంగతేమో గానీ కొనుగోలు కేంద్రాల్లో నెలన్నర క్రితం కుప్పలుగా పోసిన ధాన్యాన్ని బస్తాలకెత్తితే చాలు అన్నట్లుగా ఉంది పరిస్థితి. అకాల వర్షాలకు ఽఇప్పటికే సగం ధాన్యం తడిసి మొలకెత్తింది. వరదలో కొట్టుకుపోయింది. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని చూసి రైతుల కళ్లలో నీటి సుడులు తప్ప మరేమీ కన్పించడం లేదు. కొన్నది కొంతే.. ఉన్నది మరెంతో.. వికారాబాద్ జిల్లాలో పది వేల మెట్రిక్ టన్నులకుపైగా, రంగారెడ్డి జిల్లాలో ఏడు వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంది. సోమవారంలోగా సేకరణ పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రెండు వారాలకు మించి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సేకరించిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో పడటం లేదని రైతులు వాపోతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కానుండడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వలేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ట్రాక్టర్ కిరాయి, డీజిల్ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సి వస్తోంది. పంటసాగుకు 120 రోజులు పడితే ధాన్యం అమ్మకానికే రెండు నెలలు పడుతుండటం ఇబ్బందిగా మారింది. సాయంత్రం కురిసే వర్షాలకు ధాన్యం తడిసిపోతుండటంతో ఉదయం ఆరబోయడం, సాయంత్రం కుప్ప నూర్చడమే పనిగా మారింది. మిల్లులో ఖాళీ లేక.. లారీలు రాక వికారాబాద్లో ఎనిమిది, రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది రైసు మిల్లులను ఎంపిక చేశారు. ఆయా మిల్లులన్నీ ధాన్యం బస్తాలతో నిండిపోయాయి. కొనుగోలు కేంద్రాల నుంచి లారీలు, ట్రాక్టర్లలో తీసుకొచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేసే పరిస్థితి లేదు. ఒక్కో లారీ వారం పాటు రైస్మిల్లుల ముందే నిరీక్షించాల్సి వస్తోంది. తూకంలోనూ అనేక మోసాలకు పాల్పడుతున్నారరు. కొనుగోలు కేంద్రంలోనే బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. తీరా తూకం వేసిన తర్వాత మిల్లర్లు మరో రెండు కేజీల చొప్పున తగ్గించి బిల్లులు జారీ చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు నిరాకరిస్తున్నారు. విధిలేని పరిస్థితతుల్లో తక్కువ ధరకే వదిలించుకోవాల్సిన దుస్థితి. సీఎం సాబ్.. జరదేఖో ధాన్యం కొనుగోలులో జాప్యంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఆందోళనకు దిగాయి. కొనుగోలు కేంద్రాల వేదికగా రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. అయినా ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు ఉన్నాయి. సీఎం సొంత ఇలాకాలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఉద్యాన పంటలతో అధిక లాభాలు● రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. రైతులకు సాగుపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యాన పంటల సాగు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు తదితర అంశాలపై నాబార్డ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, డ్రిప్, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, రైతులతో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా మిషన్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగులో జిల్లా 5వ స్థానంలో ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో తోటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఉల్లిగడ్డ గిడ్డంగులు, వర్మి కంపోస్ట్ యూనిట్లు, పట్టు పరిశ్రమకు సబ్సిడీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా హైదరాబాద్కు సమీపంలో ఉన్నందున పండ్లు, కూరగాయలు, పూల తోటలు సాగు చేయడం మంచిదన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంశం వికారాబాద్ రంగారెడ్డి వరిసాగు విస్తీర్ణం 1.30 లక్షల ఎకరాలు 87,344 ఎకరాలు ఎకరాకు సగటు దిగుబడి 26 క్వింటాళ్లు 26 క్వింటాళ్లు దిగుబడి అంచనా 3.40 లక్షల మెట్రిక్ టన్నులు 80 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలు 129 37 ధాన్యం సేకరణ లక్ష్యం 1.10 లక్షల మెట్రిక్ టన్నులు 40 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు 34 వేల మెట్రిక్ టన్నులు 21,600 వేల మెట్రిక్ టన్నులు ఎంపిక చేసిన రైస్మిల్లులు 8 ఉండగా, అన్ని నిండిపోయాయి 8లో రెండు నిరాకరణ రైస్ మిల్లులకు తరలించింది 24 వేల మెట్రిక్ టన్నులు 17 వేల మెట్రిక్ టన్నులు రైతుల ఖాతాల్లో నగదు జమ రూ.49 కోట్లు రూ.30 కోట్లు మార్కెట్లో ఉన్న ధాన్యం 10 వేల మెట్రిక్ టన్నులు 7 వేల మెట్రిక్ టన్నులు మనింటికి వచ్చింది వాళ్లే.. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించిన బాలుడు బైక్పై పారిపోతుండగా వెంటాడిన పోలీసులు ఒకరు చిక్కగా మరొకరు పరారీ ‘నాకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేశా. 170 బస్తాల దిగుబడి వచ్చింది. బస్తాకు 3 కేజీల చొప్పున తరుగు తీశారు. చేసేది లేక ధాన్యాన్ని మిల్లులోనే విక్రయించాల్సి వచ్చింది’ అని వికారాబాద్జిల్లా దోమ మండలం రాకొండకు చెందిన గోపాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘వరి కోసి నెలరోజులైంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసేందుకు స్థలం లేకపోవడంతో పొలంవద్దే కుప్పపోసి ఆరబోశాను. ఇప్పటికీ తూకం వేయలేదు’ అని మంచాల మండలం బోడకొండకు చెందిన పాండు గోడు వెళ్లబోసుకున్నాడు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కొడంగల్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పారదర్శకంగా, నాణ్యతగా పనులు చేయించాలన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రూ.110 కోట్ల వ్య యంతో చేపట్టిన ఆలయ పునర్నవీకరణ పనులను పరిశీలించారు. ముందుగా బాలాలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ధర్మకర్తలు స్వాగతం పలికారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు వాస్తు నిపుణులతో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. తిరుమల తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాఢ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూత న భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్నాయక్, నయీమ్, నర్సింలుగౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి -
పనుల్లో జాప్యం వద్దు అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి అన్నారు.
తాండూరు టౌన్: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో మహబూబ్నగర్ పట్టణంలో మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి, వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చి చట్టాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఉపాధి కూలీల హక్కుల రక్షణకు, సమస్యలపై పోరాటానికి, భవిష్యత్ కార్యక్రమాలపై మహా సభలో చర్చించనున్నట్లు చెప్పారు. ఈ సభలకు త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ రాఘవన్, రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు పాల్గొంటారన్నారు. ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున సభలకు తరలి రావాలని ఆయన కోరారు. మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరక్టర్ శ్రీనివాస్చారి తాండూరు రూరల్: విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ రాష్ట్ర అడిషనల్ డైరక్టర్ శ్రీనివాస్చారి ప్రిన్సిపాల్ గాయత్రిని వివరణ కోరారు. శుక్రవారం పెద్దేముల్ మండలం గొట్లపల్లి స్కూల్ను ఆయన సందర్శించారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఎం శ్రీ నిధులు.. ఖర్చుపై ఆరా తీశారు. స్కూల్ ప్రారంభ దశలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఎందుకు లేని అడిగారు. ఇంటర్లో ఇప్పటి వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారులు రమణ, స్టిఫెన్ పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణకడ్తాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన ఎండీ అసీఫ్అలీ హైదరాబాద్ సోమాజీగూడలోని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎస్ఎఫ్సీ కమిషన్ సెక్రటరీ కాత్యాయణిదేవి సమక్షంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ అధికారులతోపాటు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. -
అన్నదాత ఆగం!
బషీరాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి వెళ్లిన రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఓ వైపు తూకాల్లో, మరో వైపు తాలు, తేమ పేరిట బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తుండగా మరో వైపు హమాలీ ఛార్జీల పేరుతో పెనుభారం మోపుతున్నారు. బషీరాబాద్ మండలంలో ఐకేపీ, సొసైటీ కింద కాశీంపూర్, దామర్చెడ్, నవల్గా, నావంద్గీ, మైల్వార్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 51,154 బస్తాల ధాన్యం సేకరించారు. ఈ బస్తాకు తరుగు పేరిట అదనంగా మూడు కిలోలు తూకం వేయడంతో మరో 1,534 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు నష్టపోయారు. బస్తాకు 40 కిలోల లెక్కన 2,046 టన్నుల వరి ధాన్యం ఐదు కేంద్రాల నుంచి ఇప్పటికే మిల్లులకు తరలించారు. ఈ ధాన్యం తూకం వేయడానికి హమాలీ ఖర్చుల కింద క్వింటాలుకు రూ.35 చొప్పున రూ.7.17లక్షలు వసూలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఇలా.. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన తర్వాత అన్ని పనులను హమాలీలే చూసుకుంటారు. లోడింగ్ మొదలు కొని తూకాలు వేమడం, బస్తాలు కుట్టి లారీల్లో తరలించడం వీరి బాధ్యత. ఇందుకు ప్రభుత్వం రూ.క్వింటాలుకు రూ.20 చెల్లిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.5 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతుల లోడింగ్, అన్లోడింగ్, తూకాలు వేయడం వంటి పనులకు క్వింటాలుకు రూ.32 నుంచి 35 వరకు వసూలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. క్వింటాలుకు రూ.35 చొప్పున వడ్డన రైతుల నుంచి ఇప్పటికే రూ.7.17 లక్షలు వసూలు చార్జీలకు రశీదులు ఇవ్వని నిర్వాహకులు పట్టించుకోని అధికార యంత్రాంగం -
మున్సిపల్ అభివృద్ధికి కృషి
పరిగి: మున్సిపల్ అభివృద్ధికి కృషిచేస్తానని చైర్ పర్సన్ రజిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం పట్టణ కేంద్రంలోని 1,11వ వార్డుల్లో పట్టణ సభ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సహకారంతో పట్టణాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రగతి ప్రణాళికలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి నివేదిక తయారు చేశామని చెప్పారు. ఇప్పటికే పట్టణంలో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తేవాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లేశ్, డీఎస్పీ శ్రీనివాస్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఆఖరి రోజు.. రిజిస్ట్రేషన్ల జోరు
బషీరాబాద్: పెరిగిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. దీంతో అదనపు రిజిస్ట్రేషన్ వ్యయం తప్పదనే భావనతో గురువారం బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం భూ క్రయవిక్రయదారులతో కళకళలాడింది. జోరుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొనుగో లు, అమ్మకాల లావాదేవీలను పాత ధరకే పూర్తి చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 45 నిమిషాలు.. పెరిగిన ధరలు అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని రైతులు, భూ యజమానులు, కొనుగోలు దారులు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. గురువారం ఒక్కరోజే సుమారు 25 స్లాట్లు బుక్ కాగా, 12 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సాధారణంగా 15 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియ.. రద్ది కారణంగా 45 నిమిషాల వరకు సాగింది. పలువురు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. 75 శాతం నుంచి.. మండలంలోని కాశీంపూర్, ఇందర్చేడ్, నవంద్గీ గ్రామాల్లో ప్రస్తుతం ఎకరాకు రూ.3.37 లక్షలుగా ఉన్న భూముల మార్కెట్ విలువపై సుమారు 75 శాతం పెంచినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని గ్రామాల్లో రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు డిప్యూటీ తహసీల్దార్ రుక్సాన వెల్లడించారు. పెరగనున్న ఆదాయం భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేసే 7.5 శాతం స్టాంప్ డ్యూటీతో పాటు ఇతర రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. భూముల విలువ పెరిగిన కొద్దీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. పెరిగిన మార్కెట్ విలువ అమలులోకి రావడంతో భూముల కొనుగోలు, అమ్మకాలపై అదనపు భారం పడనుంది. రానున్న రోజుల్లో కొత్త ధరల ప్రభావం రిజిస్ట్రేషన్లపై స్పష్టంగా కనిపించే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చివరి రోజు తహసీల్దార్ కార్యాలయంలో సందడి 7.5 శాతం స్టాంప్ డ్యూటీతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం -
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
బేడ బుడగ జంగం సంఘానికి స్థలం విరాళం షాద్నగర్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత ప్లాటును ఓ సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉదారతను చాటారు. గురువారం పట్టణంలోని ఎస్సీ బేడ బుడగ జంగం సంఘానికి ఎమ్మెల్యే చేగూరు రోడ్డులోని విశ్వసాయి వెంచర్లో తనకున్న 120 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజు పత్రాలను సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూ.లక్షలు విలువ చేసే సొంత ప్లాటును సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉదారతను చాటిన ఎమ్మెల్యేకు సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్, సభ్యులు ముత్యాలు, ఊషయ్య, యాదయ్య, పెంటయ్య, నర్సింలు, జంగయ్య, బాలకృష్ణ, అంజయ్య, పెంటయ్య, యాదయ్య, రామస్వామి, స్వామి, మేగలయ్య, దశరథ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● 61 కేసుల్లో నిందితుడు ● వికారాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ● తుపాకీ, బంగారం స్వాధీనం అనంతగిరి: కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ, 61 కేసుల్లో నిందితుడైన వికాస్సింగ్ను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ స్నేహమెహ్ర ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మణికంఠనగర్ కాలనీలో మే 1న రాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లో దూరిన ఓ దొంగ తులంనర బంగారు ఆభరణాలు, రూ. 2.10 లక్షల దోచుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్రాయ్, వికారాబాద్ సీఐ రఘుకుమార్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీ కెమెరాలు, ఘటనాస్థలంలో సేకరించిన ఆధారాలను పరిశీలించి నిందితుడు వికాస్సింగ్ అలియాస్ తేజాసింగ్గా గుర్తించారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటున్న వికాస్సింగ్ పైకి కూలీ పనులు చేస్తున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లలో రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు వికారాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని విచారించగా తన నేరాల చిట్టాను విప్పాడు. బాల్యంలోనే చోరీల బాట పదహారేళ్ల వయసులో నేర జీవితాన్ని ప్రారంభించిన ఇతనిపై సంగారెడ్డి, బొల్లారం పరిసరాల పరిధిలో 34 దొంగతనం కేసులున్నాయి. జైలు శిక్ష అనుభవించిన వికాస్సింగ్ 2024 జూన్ 26న విడుదలయ్యాడు. ప్రవర్తణలో మార్పు రాకపోవడంతో వికారాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో 27 సార్లు చోరీలకు పాల్పడి 157 తులాల బంగారం, 256 తులాల వెండి, రూ. 8,22,500 నగదును దోచుకెళ్లాడు. ఈ సొమ్ములతో జల్సాలు చేయడమే కాకుండా హెల్పింగ్ హ్యాండ్ అనే ఎన్జీఓ పేరుతో తన స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులను చైన్నె, గోవా, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూర్, రాజస్థాన్, డెహ్రాడూన్ల విహారయాత్రలకు పంపిస్తూ తనపై ఎవరికీ అనుమానం రాకుండా సామాజిక రక్షణ వలయాన్ని ఏర్పరచుకున్నాడు. వారి ప్రోద్బలంతోనే.. చోరీ చేసిన ఆభరణాలను తన స్వగ్రామ పరిసరాల్లోని కుర్వర్ మరియు గంజేరికి చెందిన శ్యామ్ మోహన్, సూరజ్ మోహన్, అశోక్ సోని, వికాస్ అగ్రహారి అనే బంగారం వ్యాపారులకు అమ్మేవాడు. ఇతనితో మంచి సంపాదన ఉందని భావించిన సదరు వ్యాపారులు బాల్యంలోనే వికాస్సింగ్కు డబ్బులిచ్చి దొంగతనాలకు ప్రోత్సహించారు. స్థానికంగా చోరీలు చేస్తే పోలీసులతో ఇబ్బంది తలెత్తుతోందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్లమని ఉసిగొల్పారు. తలా రూ.10 వేలు ఇచ్చి ఓ తుపాకీ (2ఎంఎం పిస్టల్) కొనుగోలు చేయమని సూచించారు. ఇప్పటి వరకు ఇతనిపై 61 కేసులు నమోదయ్యాయి. నిందితుడి నుంచి తులంనర బంగారం, తుపాకీ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఇతన్ని పట్టుకున్న పోలీసు బృందాన్ని అభినందించారు. -
సంక్షోభంలో సీసీఐ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉత్పత్తి, మార్కెటింగ్ విషయంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్రైవేటు కంపెనీలతో పోటీపడలేక పోతోంది. నమ్మకానికి, మన్నికకు పేరొందిన ఈ కంపెనీ లాభాలు లేక వరుస నష్టాలను మూటగట్టుకుంటోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోలేక పోతోంది. తీవ్ర కాలుష్యంతో స్థానికుల అనారోగ్యానికి కారణమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలకు వెనుకాడుతోంది. సగానికి పడిపోయిన ఉత్పత్తి సామర్థ్యం తాండూరు మండలం కరన్కోట్ కేంద్రంగా 2,389.98 ఎకరాల విసీ్త్రర్ణంలో 1987–88లో పది లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సగం ఉత్పత్తి కూడా చేయలేకపోవడమే కాకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించలేకపోతోంది. ఫలితంగా ఏటా నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. అయితే దీనికి సమీపంలో వెలిసిన ఆదాని(బెల్కటూర్), సాగర్(కర్ణాకట, తెలంగాణ సరిహద్దు), ఆల్ట్రాటెక్(మల్కాపూర్), చెట్టినాడు(సంగెం) సిమెంట్ పరిశ్రమలు మాత్రం అనూహ్య లాభాలను చవిచూస్తున్నాయి. ముడిపదార్థం పుష్కలం సాధారణంగా సిమెంట్ తయారీలో లైమ్ స్టోన్, లేటరైట్, ఐరెన్ఓర్, జిప్సం, షెల్, ఫ్లై ఆష్, క్లింకర్, బర్ట్న్క్లై, ఇతర ముడి పదార్థాలను వినియోగిస్తుంటారు. రెండు రకాల (43,53 గ్రేడ్లు) సిమెంట్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 53 స్పెషల్ గ్రేడ్ సిమెంట్ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇందులో క్లింకర్ ప్రభుత్వ రైల్వే, బ్రిడ్జ్ల నిర్మాణాల్లో ఎక్కువ వినియోగిస్తుంటారు. సున్నపు రాయి(క్యాల్షియం), బంకమట్టి/షెల్(సిలికా, అల్యూమినియం, ఇనుము), ఇసుకను మిక్స్ చేస్తారు. 1,450 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి, చిన్న చిన్న ముద్ద(క్లింకర్)లుగా తయారు చేస్తారు. యూనిట్ పరిధిలో ముడిపదార్థాలు పుష్కలంగా ఉన్నప్పటికీ..ప్లాంట్ విస్తరణ జరగ లేదు. ప్రాసెసింగ్ తీరు మారలే అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని వినియోగించి, ఉత్పత్తి సామర్థ్యాన్నిపెంచు కోవడం, ధరల్లో వస్తున్న హెచ్చు, తగ్గులపై వెంటనే నిర్ణయాలు తీసుకోకపోవడం, ఽమార్కెటింగ్ను విస్తరింపజేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు నియామకాలను కూడా నిలిపివేసింది. 400 మంది ఉద్యోగులు పని చేసిన చోట..ప్రస్తుతం 160 మందితో నెట్టుకొస్తోంది. అంతేకాదు కంపెనీ కనీస సామజిక బాధ్యతను కూడా నిర్వర్తించడం లేదు. వర్కర్లు నివసించే ప్రదేశంలో కనీస సదుపాయాలను కూడా విస్మరిస్తోంది. స్థానికుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేసింది. ఇక్కడ 10 వేల మంది జనాభా ఉంటుంది. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాల కూలీలు పని చేస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నా సదుపాయాలకు నోచుకోలేక పోతున్నాం. లారీల దుమ్ము, వ్యర్థాలతో ఈ ప్రాంతం పూర్తిగా కాలుష్యమైంది. ఇప్పటికే అనేక మంది శ్వాస సంబంధ సమస్యల బారినపడ్డారు. – రాజ్కుమార్ సర్పంచ్, కరన్కోట్ సీసీఐ నష్టాలకు యాజమాన్య వైఖరే కారణం. ముడిపదార్థాలు పుష్కలంగా ఉన్నా.. ఉత్పత్తి సామర్థ్యం పెంచడం లేదు. మార్కెటింగ్లో ప్రైవేటుతో పోటీపడలేకపోతోంది. కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఉద్యోగులను వదిలించుకునేందుకు యత్నిస్తోంది. నష్టాల పేరుతో ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోంది. – శరణప్ప తల్వార, సీసీఐ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ యూనిట్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాంతం తాండూరు మండలం కరన్కోట్ రెవెన్యూ ఉత్పత్తి ప్రారంభం 1987 జూలై 1 స్థాపిత సామర్థ్యం 10లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించిన భూమి 2,389.98 ఎకరాలు ఫ్యాక్టరీ ఏర్పాటు 211.92 ఎకరాలు మైనింగ్ కోసం 1,925.57 ఎకరాలు టౌన్షిప్ 64.29 ఎకరాలు రైల్వే లైన్ 173.28 ఎకరాలు ఇతర అవసరాలకు 14.92 ఎకరాలు ఉద్యోగులు 109 (ఎగ్జిక్యూటివ్స్–37, సూపర్ వైజర్స్–31, వర్కర్స్–41) ప్రైవేటుతో పోటీపడలేక పోతున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏటా తగ్గుతున్న సిమెంట్ ఉత్పత్తి.. అమ్మకాలు 400 నుంచి 160 మందికి తగ్గిన సిబ్బంది క్వార్టర్స్లో కనీస సదుపాయాలు కరువు కాలుష్య కోరల్లో కరణ్కోట్ గ్రామ పంచాయతీ అంశం 2022–23 2023–24 2024–25 ప్లాంట్ స్థాపిత సామర్థ్యం 10 ల.మె.ట 0 ల.మె.ట 10 ల.మె.ట ఉత్పత్తి(లక్షల టన్నుల్లో) 5.82 5.90 4.27 ఉత్పత్తి విలువ(రూ.లక్షల్లో) 26,925 27,642 17,470 లాభం(రూ.లక్షల్లో) రూ.140 కోట్లు రూ.94 కోట్లు రూ.11.28 కోట్లు అంశం 2023–24 2024–25 వినియోగ సామర్థ్యం 9.00 శాతం 42.73 శాతం క్లింకర్ ప్రొడక్షన్ 5,81,360 మె.ట. 50,000 మె.ట. సిమెంట్ ఉత్పత్తి 90,000 మె.ట. 27,270 మె.ట. డిస్పాచ్ 5,89,720 మె.ట. 31,958 మె.ట. -
శిక్షణ, ఉపాధిని వినియోగించుకోండి
కుల్కచర్ల: నిరుద్యోగ గిరిజన యువతకు ప్రభుత్వం ఇచ్చే శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో యువతకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణ, ఉద్యోగాల గురించి అవగాహన కల్పించారు. ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, గిరిజన వసతిగృహ ప్రత్యేకాధికారులు, యువకులు పాల్గొన్నారు. ‘సర్’పై ప్రత్యేక దృష్టి తాండూరు: ఓటరు జాబితా ముమ్మర సవరణ(సర్) కార్యక్రమం ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ సర్ కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లడారు. ఓటరు జాబితా సవరణలో అర్హులైన ఓటర్లు, పార్టీ మద్దతు దారుల ఓట్లకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పట్టణంలోని తులసీ గార్డెన్లో ఈ నెల 7న ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అధ్యక్షతన 269 మంది బీఎల్ఏలతో సమావేశం జరగనుందని పేర్కొన్నారు. సవరణలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. పార్టీ నేతల దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, పార్టీ నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్లు ఉన్నారు. ఉద్యమ జర్నలిస్టులను గుర్తించండి జర్నలిస్ట్ ఫోరం జిల్లా సహాయ కార్యదర్శి వెంకన్న అబ్దుల్లాపూర్మెట్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభు త్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్) రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి పల్లె వెంకన్న కోరారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2009–2014 జూన్ 2 వరకు ఎల్బీనగర్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సమష్టి పోరాటలు చేశామన్నారు. ఓ పక్కన జేఏసీ కింద ఉద్యోగులు, న్యాయవాదులు, ఆర్టీసీ, ప్రజాసంఘలతో కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ పోరు సాగించామన్నారు. రాష్ట్రం వచ్చే వరకు జరిగిన పోరాటాల్లో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారన్నారు. ప్రస్తుతం సర్కారు అర్హులైన ఉద్యమ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డు లు జారీ చేయాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ఉద్యమ జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. లారీని ఢీ కొన్న బైక్ ఒకరి మృతి, మరొకరికి గాయాలు షాద్నగర్రూరల్: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన కార్తీక్(19), స్నేహితుడు శ్రీనాథ్ను షాద్నగర్లో వదిలిపెట్టేందుకు బైక్పై వెళుతున్నారు. లింగారెడ్డిగూడ శివారులో రోడ్డుపై నిలిచిన లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కార్తీక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీనాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుశీల తెలిపారు -
క్యారెట్ సాగుపై రైతులకు అవగాహన
షాబాద్: క్యారెట్ సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత శ్రీకృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని లక్ష్మరావుగూడలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్, ఉద్యాన శాఖ క్రిడా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్యారెట్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యారెట్ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన భూసిద్ధం, అనువైన రకాల ఎంపిక, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి పారుదల నిర్వహణ, కలుపు నియంత్రణ శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. వర్షాధార పరిస్థితుల్లో నల్లరేగడి నేలల్లో క్యారెట్ సాగు చేసే రైతులు నీటి నిల్వ లేకుండా డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. హార్టికల్చర్ అధికారి కీర్తి కృష్ణ మాట్లాడుతూ.. ఉద్యానశాఖ ద్వారా రైతులకు అందుతున్న సేవలు, పథకాలు, సాంకేతిక సూచనలు చేశారు. సరైన మొక్కల మధ్య దూరం, సమగ్ర చీడపీడల నివారణ చర్యలను రైతులకు వివరించారు. సేవా స్ఫూర్తి పౌండేషన్ ప్రాజెక్డ్ మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్య పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, లోతైన దుక్కి, సమతుల్య పోషక నిర్వహణ, శాసీ్త్రయ సాగు పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులు శాసీ్త్రయ పద్ధతులను అవలంబించి క్యారెట్ సాగును లాభదాయకంగా మార్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీరంగపూరం కుమార్, రైతులు శ్రీనివాస్, మాణిక్యం, రామకృష్నారెడ్డి, పెంటారెడ్డి, శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
యాలాల: ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బస్తాపూర్కు చెందిన రహమత్(28)తో పాటు పాత తాండూరు వాసి మొయిజొద్దీన్లు బుధవారం సాయంత్రం కోకట్ కాగ్నా నదిలో ఈతకు వెళ్లి, మునిగిన సంగతి విధితమే. అందులో మొయిజొద్దీన్ మృతదేహం అదే రోజు లభ్యం కాగా.. రహమత్ ఆచూకీ లేకుండా పోయింది. ఎస్ఐ విఠల్రెడ్డి, తాండూరు అగ్ని మాపక సిబ్బంది బుధవారం చీకటి పడేంతవరకు నదిలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా.. గురువారం తెల్లవారుజాము నుంచి మరలా గాలింపు చేపట్టగా.. రహమత్ మృతదేహం లభ్యమైంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
క్రీడలతో స్నేహభావం
స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: క్రీడలతో శారీరక దృఢత్వం తోపాటు స్నేహభావం పెరుగుతుందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్లోని బ్లాక్ గ్రౌండ్లో వీడీఎఫ్ఏ ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలు నిర్వహించారు. విజేత జట్లకు బహమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటమలు సహజమన్నారు. ఓటమి గెలుపుకు నాంది అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నోటీసులు జారీ చేసిన మున్సిపల్ అధికారులు తాండూరు టౌన్: పట్టణ పరిధిలోని గౌతాపూర్ మార్గంలో గల శ్రీ దుర్గా బార్ అండ్ రెస్టారెంట్పై గురువారం మున్సిపల్ అధికారులు దాడి చేశారు. కిచెన్లో కుళ్లిన మాంసం, మిగిలిపోయిన, పాడైపోయిన తిను పదార్థాలను ఫ్రిడ్జిల్లో నిల్వ చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు తేలింది. వాటిరి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రాములు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, శానిటరీ జవాన్లు తదితరులు పాల్గొన్నారు. పూడూరు: మండలంలోని ఎన్కేపల్లి మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎంఈఓ సాయిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ కుక్ మహిళ(1), నైట్ వాచ్మెన్ (1) పోస్టులను కంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 7వ తరగతి పాసై ఉండాలని, ఆసక్తి గల వారు ఈ నెల 8 వ తేదీ ఉదయం 10 గంటలకు మోడల్ స్కూల్ ప్రిన్సిపాన్ను సంప్రదించాలని కోరారు. మండలానికి చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తాండూరు టౌన్: గిరిజన స్కాలర్షిప్ పథకాల లబ్ధిదారులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బషీరాబాద్ గిరిపుత్రుడు పీహెచ్డీ పట్టభద్రుడు, టీజీటీ గురుకుల ఉపాధ్యాయుడు డాక్టర్ విఠల్ రాథోడ్ పాల్గొన్నారు. గురువారం జన జాతీయ గరిమా ఉత్సవ్ వేడుకల్లో భాగంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విఠల్ రాథోడ్ మాట్లాడుతూ.. బిర్సా లైవ్స్ ఇన్ న్యూభారత్ వీక్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గిరిజన నాయకుడు బిర్సాముండా వారసత్వాన్ని స్మరించుకోవడంతో పాటు, గిరిజన వర్గాల యువతకు రాష్ట్రపతి తమ ప్రసంగం ద్వారా స్ఫూర్తినిచ్చారన్నారు. విద్య, నాయకత్వం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే, గిరిజన వర్గాల సాంస్కృతిక వారసత్వం, అందించిన సేవలను గుర్తుంచుకొంటుందని కొనియాడారు. మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు ఈసారి ముందుగానే వచ్చాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే స్కూళ్లకు చేరుతున్నాయి. మండలంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకోసం ఇప్పటికే మండల వనరుల కేంద్రానికి చేరాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకోసం మొత్తం 21,497 పాఠ్యపుస్తకాలు, 31,165 నోట్ పుస్తకాలు వచ్చి నట్టు ఎంఈఓ మల్లయ్య తెలిపారు. -
నర్సింగ్ స్కూల్ హాస్టల్లో అగ్ని ప్రమాదం
మొయినాబాద్: షార్ట్ సర్క్యూట్తో నర్సింగ్ స్కూల్ హాస్టల్లో మంటలు అంటుకుని ఫర్నిచర్ కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మున్సిపల్ కేంద్రంలోని కరున నర్సింగ్ స్కూల్ హాస్టల్ భవనంలో గురువారం ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో హాస్టల్ భవనంలో ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. మంటలు ఎగిసి పడుతుండడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పైపులతో నీళ్లు పట్టి మంటలు ఆర్పారు. అప్పటికే ప్యానల్ బోర్డు గదిలో ఉన్న ఫర్నిచర్తోపాటు ఇతర సామాగ్రి కాలిపోయాయి. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
వాగులైనా వదలం!
మొయినాబాద్: ప్రభుత్వ భూములు, కాల్వలు, చెరువులు ఎక్కడుంటే అక్రమార్కుల చూపు అక్కడ వాలిపోతోంది. కొంతమంది పాలకులు, అధికారులతో కుమ్మకై ్క దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సురంగల్ శివారు నుంచి ఎర్రకుంట వాగు ఉంది. కనకమామిడి, సురంగల్, అమ్డాపూర్, నజీబ్నగర్ రెవెన్యూల్లోని వర్షం నీరంతా ఎర్రకుంట వాగు ద్వారా ప్రవహించి ఈసీ వాగులో కలుస్తుంది. సురంగల్ రెవెన్యూలోని సర్వేనంబర్ 332, 282లో ఉన్న పలువురు ప్రైవేటు వ్యక్తుల భూమి ఎర్రకుంట వాగు సమీపం వరకు ఉంటుంది. వీటిని కొనుగోలు చేసిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాగును సైతం ఆక్రమిస్తున్నారు. వాగు మధ్య నుంచి పునాది తీసి గోడ నిర్మిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి, మరో నాయకుడి అండదండలతోనే వీరు వాగును కబ్జా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తోలుకట్టలో.. మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలో గుండ్లవాగు కాల్వ ఉంది. దీనికి ఆనుకుని సర్వేనంబర్ 191లో ప్రైవేటు భూమి ఉంది. నగరానికి చెందిన ఓ వ్యాపారి దీన్ని కొనుగోలు చేసి వాగు కాల్వను పూర్తిగా ఆక్రమించాడు. ఎవరి అనుమతి లేకుండానే కాలువలో నుంచి పైపులు వేసి పైనుంచి మట్టితో పూడ్చివేసి ప్రహరీ నిర్మించాడు. ఈతతంగం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలం మొదలైతే కాల్వలోకి వెళ్లాల్సిన వరదనీరు పంట పొలాల్లోకి చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు స్పందించి కాల్వలను కబ్జా చెర నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. తోలుకట్టలో గుండ్లవాగును పూడ్చి ప్రహరీ నిర్మాణం పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటాం సురంగల్ ఎర్రకుంట వాగులో ప్రహరీ గోడ నిర్మిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తోలుకట్ట గుండ్లవాగు కాల్వను పూడ్చినట్లు తెలిసింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పంపించి పరిశీలించాం. కాల్వలో వేసిన పైపులను తొలగించి పూడ్చినవారిపై చర్యలు తీసుకుంటాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
ఎస్బీఐ ఖాతాదారుల ధర్నా
బొంరాస్పేట: బ్యాంక్ మేనేజర్ తీరును నిరసిస్తూ గురువారం ఖాతాదారులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎస్బీఐలో సాలిండాపూర్, మదన్పల్లి, కొత్తూరు తదితర గ్రామాలకు చెందిన పలువురికి అకౌంట్లు ఉన్నాయి. వారి ఖాతాలు హోల్డ్లో పడటంతో డబ్బులు డ్రా చేసుకోలేక పోతున్నారు. దీనిపై బ్యాంక్ మేనేజర్ సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నా ఇవ్వడం లేదని ఆరోపించారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై బ్యాంక్ అధికారులను అడిగితే సైబర్ ఫ్రాడ్ సస్పెక్టెడ్/మనీ మ్యూట్లో ఉన్నందున మీ ఖాతాల్లోని డబ్బు తీసుకోవడం సాధ్యం కాదని చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. ఖాతాదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఉద్యమం చేపడతామని సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. అనంతరం బ్యాంక్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ మేనేజర్ తీరుపై ఆగ్రహం బంధువుల పెళ్లికి సంబంధించిన రూ.48 వేలు బ్యాంకులో ఉంచాం. డ్రా చేసేందుకు మూడు నెలలుగా తిరుగుతున్నా. ఏవేవో కారణాలు చెబుతున్నారే తప్ప డబ్బు ఇవ్వడం లేదు. చేసేదేమీ లేక వడ్డీ కడుతున్నా. – సూర్తిబాయి, మాలకుంటతండా -
ధాన్యాన్ని వెంటనే తరలించండి
● రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి ● కలెక్టర్ దీపక్ తివారి కొడంగల్: కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. గురువారం కొడంగల్లోని వ్యవసాయ మార్కెట్ గోదాం, వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించారు. అక్కడి నిల్వలను పరిశీలించారు. లక్ష్యం మేరకు ధాన్యాన్ని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లుల వద్ద హమాలీల సంఖ్యను పెంచుకోవాలన్నారు. అదనపు లారీలను సమకూర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, పౌరసంబంధాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది కలగొద్దు దుద్యాల్: ధాన్యం కొనుగోలు, తరలింపులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. గురువారం మండలంలోని హస్నాబాద్లో కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీసీఓ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ నవీన్ కుమార్, హస్నాబాద్ పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్, సిబ్బంది అక్బర్, రవి తదితరులు పాల్గొన్నారు. అధైర్య పడొద్దు దుద్యాల్: కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం మొత్తాన్ని సేకరిస్తామని, రైతులు అధైర్య పడరాదని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ అజ్మత్ అలి, కేంద్రం నిర్వాహకులు ఖలీల్ పాషా, శ్రీకాంత్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
కుర్మిద్దలో గ్రామసభ బహిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు గురువారం యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో జరిగాయి. యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో సర్పంచ్ శ్రీవిద్య ఆధ్వర్యంలో జరిగిన సభలో ఫార్మా రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయం చేసుకుంటుంటే అధికారులు విద్యుత్ ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ట్రాన్స్కో, రెవెన్యూ అధికారులు స్పందించాలని పట్టుబట్టారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వం నిర్వహించే సభలు తమకు అవసరం లేదని, సమస్య తీర్చే వరకు సభ వాయిదా వేయాలని సర్పంచ్ సైతం భీష్మించారు. గ్రీన్ఫార్మా సీఐ సత్యనారాయణ జోక్యం చేసుకున్నా రైతులు వినలేదు. దీంతో చేసేదేమి లేక వాయిదా వేశారు. గున్గల్ గ్రామంలో ప్రత్యేకాధికారి మాధవరావు, సర్పంచ్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఇబ్రహీంపట్నంలో ప్రశాంతం ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి, నాగన్పల్లి, ఉప్పరిగూడ, పోచారం, కప్పపహాడ్, ఎల్మినేడు, తులేకలాన్ గ్రామాల్లో సభలు ప్రశాంతంగా జరిగాయి. అధికారులు, సర్పంచ్లు పాల్గొని గ్రామ అభివృద్ధిపై మాట్లాడారు. పొలాలకు విద్యుత్ కట్ చేశారని నిలదీత -
ఏఎంసీ సూపర్వైజర్గా నవనీత
బషీరాబాద్: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) సూపర్వైజర్గా నవనీత గురువారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమెను.. అధికారులు బషీరాబాద్కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ.. అక్రమ మార్కెటింగ్ను అరికట్టేందుకు కాశీంపూర్ సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ కార్యదర్శి సిద్దమ్మ, సిబ్బంది శివ పాల్గొన్నారు. మద్యం దుకాణంలో చోరీ కొడంగల్ రూరల్: వైన్షాపులో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగ ఎల్లమ్మ వైన్ షాపును నిర్వాహకులు బుధవారం రాత్రి ఎప్పటిలాగే మూసివేశారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు దుకాణం వెనుకభాగం నుంచి చొరబడి అందిన కాడికి అపహరించారు. గురువారం ఉదయం దుకాణం తెరిచిన నిర్వాహకులు.. సామగ్రి చిందరవందరగా పడుండటాన్ని గమనించి చోరీ జరిగిందని, రూ.50 వేల నగదుతో పాటు, రూ.10 వేల విలువ చేసే మద్యం సీసాలను అపహరించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు సమాచారం ఇవ్వగా.. క్లూస్ టీం వచ్చి పరిసరాలను పరిశీలించింది. వివరాలు సేకరించింది. వైన్స్ నిర్వాహకుడు రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ యాదయ్య తెలిపారు. -
చేయని నేరానికి ఒకరు.. చేసిన నేరం వెంటాడి మరొకరు
ధారూరు: వికారాబాద్ జిల్లా స్టేషన్ధారూరు గ్రామంలో ప్రేమ పేరుతో సాగిన వ్యవ హారం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. చేయని నేరానికి ఒకరిని, గతంలో చేసిన నేరం వెంటాడి మరొకరిని బలి తీ సుకుంది. డీఎస్పీ అంజయ్య, స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రమణీబాయి, రాములు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు రాజు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా, కూతురు తులసీబాయి వికారాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేసేది. అలాగే నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పద్దుల మౌనిక రాజుతోపాటే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేది. ఈ క్రమంలో రాజు, మౌనిక కలిసి తులసికి కేటాయించిన పోలీస్ క్వార్టర్లో ఆమెతోపాటు ఉండేవారు. అయితే ప్రేమ పేరుతో మౌనికకు దగ్గరైన రాజు ఆమెను లోబర్చుకొని ఆపై మొహం చాటేశాడు. కొద్ది నెలల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై రాజును నిలదీసిన మౌనిక.. ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. అనంతరం ఆమెకు సైతం పెళ్లి నిశ్చయమవగా జీర్ణించుకోలేని రాజు.. మౌనికతో తాను కలిసి దిగిన ఫొటోలను ఆమె కాబోయే భర్తకు పంపించి గొడవలు సృష్టించాడు. దీంతో ఏప్రిల్ 27న మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్ వచ్చి రాజు, తులసిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తులసిని పీఎస్కు పిలిపించగా మౌనిక కుటుంబ సభ్యులు ఆమెను దూషించి ఉద్యోగం ఊడగొట్టిస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన తులసి ఇటీవల ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో మౌనికపై కేసు నమోదైంది. అయితే ఆమె సైతం తాజాగా వివాహం చేసుకుంది. కానీ తనపై నమోదైన కేసు విషయంలో మౌనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు పదేపదే బెదిరించడంతో తట్టుకోలేని రాజు గురువారం తన పొలానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు మౌనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులే కారణమని సూసైడ్ నోట్ రాశాడు. చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని రోదిస్తూ చెప్పి పెట్టేశాడు. రాజు ఆత్మహత్య నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో తాండూరు–హైదరాబాద్ రోడ్డుపై మూడు గంటలపాటు ధర్నా చేపట్టారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సూసైడ్ నోట్లోని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ అంజయ్య తెలిపారు. -
బస్తాపై రూ.250 అదనం
● ఆందోళన కలిగిస్తున్న డీఏపీ ఎరువు ● సరిపడా నిల్వలు లేక రైతుల ఆందోళన మోమిన్పేట: వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు డీఏపీ ఎరువు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజుల్లో పొలం పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు డీఏపీ ఎరువు సమస్య ఆందోళన కలిగిస్తుంది. డీఏపీని దుక్కిలో వేసుకొని దున్నుకోవాల్సి ఉన్నందున ఫర్టిలైజర్ షాపుల్లో లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరగడం, కేవలం డీఏపీ ఎరువు మాత్రమే పెరగక పోవడంతో కర్షకులు ఈ ఎరువుపై ఆసక్తి చూపుతున్నారు. సదాశివపేట, వికారాబాద్ తదితర పెద్ద పట్టణాలలో మాత్రమే డీఏపీ దొరుకుతుందని, మండల స్థాయిలో అందుబాటులో లేదని రైతులు పేర్కొంటున్నారు. అది కూడా ఎక్కువ ధరకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దబాయిస్తున్న వ్యాపారులు బస్తాకు రూ.250 ఎక్కువ తీసుకుంటున్నారని, బిల్లు మాత్రం రూ.1,350 రాసి ఇస్తున్నారని ఇదేమని అడిగితే పై నుంచి ఇవ్వడం లేదని, మేము కూడా ఎక్కువ ధరకే తెస్తున్నామని వ్యాపారస్తులు దబాయిస్తున్నట్లు కర్షకులు చెబుతున్నారు. దిక్కులేక తప్పని పరిస్థితిలో రవాణా ఖర్చులను అదనంగా భరిస్తూ తీసుకు వస్తున్నారు. మోమిన్పేటలో అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని త్వరలో డీఏపీ ఎరువులను తెప్పిస్తామని ఏఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. -
పాఠ్య పుస్తకాల సరఫరా
బొంరాస్పేట: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ బుధవారం నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను సరాఫరా చేశారు. మండలంలో 33 ప్రాథమిక, 11 ప్రాథమికోన్నత, 4 ఉన్నత పాఠశాలలున్నాయి. మొత్తం 46 ప్రభుత్వ పాఠశాలలకుగానూ 11,362 నోటు పుస్తకాలు అందాయని, అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను అందజేస్తున్నట్లు ఎంఈఓ హరిలాల్ తెలిపారు. ఇందులో సీఆర్పీ సోమ్లా, ఎమ్మార్సీ సిబ్బంది గౌసోద్దీన్ తదితరులున్నారు. విజయానికి పొంగిపోవద్దు ధారూరు: విజయానికి పొంగి పోవద్దని, అపజయానికి బాధ పడొద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముంగిపులో ఆయన విజేతలకు బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. స్నేహభావంతో క్రీడలు ఆడాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీళగౌడ్, కో–ఆప్షన్ మాజీ సభ్యుడు హణఫీజ్, ఉప సర్పంచ్ జహంగీర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్, నాయకులు నాగేష్గౌడ్, రహమతుల్లాఖాన్, భీంసేన్చారీ తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్ దౌల్తాబాద్: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఖబడ్దార్ అని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల కేంద్రంలో చౌరస్తాలో అంబేడ్కర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో అన్నదమ్ముల్లా కలిసే ఉందామని, తెలంగాణ ఆత్మగౌరవంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు బంటురాజు, హన్మంతు, మహిపాల్, అమర్నాథ్, రెడ్యానాయక్, నరేందర్, కృష్ణ,భీములు, పాండు, మోహన్ నాయక్ ఉన్నారు. -
ప్రీ ప్రైమరీ పాఠ్య రూపకర్తగా మోహిద్
బషీరాబాద్: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి రూపొందించిన ప్రీ ప్రైమరీ హ్యాండ్బుక్ అభివృద్ధి ప్రక్రియలో బషీరాబాద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి స్థానం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కూడిన పాఠ్య రూపకల్పన బృందంలో బషీరాబాద్ (ఇందిరానగర్) ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మహమ్మద్ మోహిద్కు సభ్యుడిగా ఇంగ్లిష్ భాషా పాఠ్యాంశ రూపకల్పనలో తన వంతు సహకారం అందించారు. విద్యాభివృద్ధిలో చురుకై న పాత్ర పోషిస్తున్న మొహీద్ సేవలను పలువురు ఉపాధ్యాయులు ప్రశంసించారు. ప్రీ ప్రైమరీ హ్యాండ్బుక్ రూపకల్పనలో భాగస్వామ్యం కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. -
పార్టీ బలోపేతమే ముఖ్యం
దుద్యాల్: గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతం ముఖ్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో గ్రామ సమన్వయ కమిటీ ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సంగాయిపల్లిలో కమిటీ సభ్యులుగా జైపాల్ రెడ్డి, రాజు, సంగాయిపల్లి తండాలో హన్మంతునాయక్, సంతోష్ కుమార్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ జగదీశ్ నాయక్, నాయకులు కృష్ణ, సీతారం నాయక్, వెంకటయ్య, రాములు, వార్డు సభ్యుల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు గ్రామసభలు
తాండూరు రూరల్: మండల పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అల్లాపూర్, బెల్కటూర్, చంద్రవంచ, చింతమణిపట్నం, కరన్కోట్, ఓగిపూర్, వీరారెడ్డిపల్లి, రాంపూర్మీదితండా, సిరిగిరిపేట్ గ్రామాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి అంశాలపై గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఒక్కో గ్రామానికి మండల ప్రత్యేకాధికారితో పాటు గ్రామ కన్వీనర్ ఉంటారని చెప్పారు. ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు యాలాల: మండల కేంద్రంలోని నౌషా బాలేసాబ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అయిన మంగళవారం రాత్రి గంధం ఊరేగింపు ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల నుంచి గంధంతో పాటు చాదర్ను మైనార్టీ నాయకులు, దర్గా కమిటీ సభ్యులు తీసుకువెళ్లారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బుధవారం రాత్రి దీపారాధన, గురువారం జ్యారత్తో ఉర్సు ఉత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు అక్బర్బాబా, దర్గా కమిటీ అధ్యక్షుడు గంతల మైనోద్దీన్, కమిటీ సభ్యులు గఫార్, ఆరిఫ్, రజాక్, ఖాజాబేగ్, అక్రం, హసన్ ఖాన్ తదితరులు ఉన్నారు. ముగిసిన బీపీఎల్ టోర్నీ బషీరాబాద్: కిషన్ ప్రసాద్ మెమోరియల్ బీపీఎల్(బషీరాబాద్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్లో ఎస్కేబీ జట్టు విజేతగా నిలిచింది. బషీరాబాద్ మండలంలోని 14 క్రికెట్ జట్లు గత మూడు వారాలుగా తలపడ్డాయి. బుధవారం టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎస్వీకే జట్టు విజయ కేతనం ఎగరవేసింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.45 వేల నగదు బహుమతిని, రన్నరప్ జట్టు రాయల్స్కు ట్రోఫీ, రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బీఎల్ఓ సీఈఓ బుయ్యని శ్రీనివాస్రెడ్డి ట్రోఫీలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అజయ్ప్రసాద్, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు జానకి, నాయకులు అనూప్ ప్రసాద్, ఆర్ఎంపీ డాక్టర్ నర్సింలు, సతీష్, శ్రీకాంత్, రియాజ్, నరేష్, రఘు, సూర్య, జగదీశ్, రాము, సత్తర్, ఇషాక్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో గేదె, దూడ మృతి కొడంగల్: పట్టణ శివారులో బుధవారం విద్యుత్ షాక్తో గేదె, దూడ చనిపోయాయి. పసుల అర్జునప్పకు చెందిన రెండు పశువులపై మెడికల్ శ్రీనివాస్ పొలం దగ్గర కరెంటు స్తంభం విరిగి పడిందని గొర్రెల పెంపకం దారుల సంఘం కొడంగల్ కార్యదర్శి మనిగిరి రమేష్ తెలిపారు. బాధితుని కుటుంబం బర్రెల పాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. పశువు చనిపోవడం వల్ల ఆయన కుటుంబం పోషన కష్ట్టంంగా మారుతుందన్నారు. అధికారులు స్పందించి బాధితునికి న్యాయం చేయాలని కోరారు. -
అభివృద్ధి పనుల పరిశీలన
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంట గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్లు బుధవారం పరిశీలించారు. గ్రామంలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. గుండ్లకుంటలో చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆంజనేయస్వామి గుడి, శివుని గుడికి వెళ్లే దారి విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. రోడ్డు పెద్దగా చేస్తే రాకపోకలు సాగించడానికి సులభంగా ఉంటుందన్నారు. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
జీతాలు ఖాతాలో జమ చేయండి
తాండూరు రూరల్: మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాల, హాస్టల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని వార ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ వెంకటా చారికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాన్ టీచింగ్ సిబ్బంది మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో 2017 నుంచి నాన్ టీచింగ్(సెక్యూరిటీ, స్వీపింగ్, శానిటేషన్)లో పని చేస్తున్నామన్నారు. గతంలో ప్రిన్సిపాల్ ఖాతా నుంచి సిబ్బందికి వేతనాలు జమ చేసేవారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ద్వారా జీతాలు చెల్లించాలని భావిస్తోందని చెప్పారు. కావున వెంటనే టెండర్ విధానాన్ని రద్దు చేసి రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగానే ఖాతాలో జీతాలు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో వెంకన్ననాయక్, బాలకిషన్, బస్వరాజ్గౌడ్, విజయలక్ష్మి, హేమ, ఉషాలక్ష్మి, ఉమాదేవి, నాగలక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
సత్వర న్యాయం అందించాలి
● ప్రశాంత వాతావరణంలో పండుగలు జరిగేలా చూడాలి ● ఎస్పీ స్నేహ మెహ్ర తాండూరు టౌన్: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణ పోలీసు స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, మైనర్లపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, సాంకేతికత ద్వారా నేరగాళ్లను అదుపు చేయాలన్నారు. రాత్రి వేళల్లో ముమ్మర గస్తీ నిర్వహించాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, రానున్న బోనాలు, మొహర్రం వేడుకల సందర్భంగా గట్టి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఠాణాలో రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఎస్పీ పట్టణ పోలీసు స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ పరమేశ్వర్, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. -
వీఓఏల సమ్మె విరమణ
అనంతగిరి: వీఓఏల సమ్మెను విరమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. బుధవారం డీఆర్డీఏ అడిషనల్ పీడీ నర్సింలును మర్యాదపూర్వకంగా కలిశారు. సమ్మె విరమిస్తున్నట్లు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గోవర్ధన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తాత్కాలిక విరమణ ధారూరు: ప్రభుత్వ హామీతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్ల వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. పనిభారం తగ్గింపు, ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం పెంపు తదితర డిమాండ్లతో సమ్మె చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం సాకూలంగా ఉండటంతో సమ్మెను తాత్కాలింకగా విరమిస్తున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కొంత కాలం వేచిచూస్తామని అన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోకుంటే తిరిగి సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మహిళా సంఘం మండల అధ్యక్షురాలు బాలేశ్వరికి వినతిపత్రం అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటాం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కుల్కచర్ల: బీఆర్ఎస్ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన చెన్నమోని పెంటయ్య తల్లి చెన్నమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన బుధవారం బాధితుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాందాస్ నాయక్, చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు దాసు, పాల నర్సింలు పాల్గొన్నారు. డీఈఓను కలిసిన తపస్ నాయకులు అనంతగిరి: డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ ఘనీని బుధవారం తపస్ జిల్లా ప్రతినిధులు మర్యాపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి అంజిరెడ్డి, రమేష్, జిల్లా బాధ్యులు ప్రసాద్కుమార్, బస్వరాజు, కృష్ణారెడ్డి, సంతోష్, మైపాల్రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ కమిషనర్గా రాకేష్రెడ్డి తాండూరు: తాండూరు మున్సిపల్ కమిషనర్గా పాల్వాయి రాకేష్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మధుసూదన్రెడ్డి రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాకేష్రెడ్డి ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాకేష్రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాల్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరును ఆరదర్శ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
ధాన్యం తరలింపునకు ఏర్పాట్లు
తాండూరు ఆర్డీఓ అనిత యాలాల: కొనుగోలు కేంద్రాల నుంచి త్వరగా ధాన్యం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తాండూరు ఆర్డీఓ అనిత తెలిపారు. బుధవారం యాలాల మండలం దౌలాపూర్ శివారులోని పత్తి మిల్లులను తహసీల్దార్ గాయత్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్తో కలిసి పరిశీలించారు. ధాన్యం నిల్వ ఉంచేందుకు స్థలం లేకపోవడంతో రైసు మిల్లుల వద్ద అన్లోడింగ్ సమస్య ఏర్పడిందని, దీంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని మహిపాల్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఆర్డీఓ పత్తి మిల్లులను పరిశీలించారు. ధాన్యం నిల్వ ఉంచేందుకు పత్తి మిల్లులు అనుకూలంగా ఉన్నాయని, గతంలో ఇలాగే ధాన్యం బస్తాలను నిల్వ ఉంచారని నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ విఠల్రెడ్డి, అగ్గనూరు ఉప సర్పంచ్ వెంకటయ్య, జీపీఓ సుజాత, ఏఎంసీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, నాయకులు సుధాకర్రెడ్డి తదితరులు పల్గొన్నారు. -
మెరిసిన మోత్కుపల్లి
వికారాబాద్: మన గ్రామ పంచాయతీలు జాతీయ ప్రమాణాలవైపు పయనిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రెండేళ్ల క్రితం జిల్లాలోని నాలుగు జీపీలు అంతర్జాతీయ ప్రమాణాల కలిగిన గ్రామాలుగా సర్టిఫికెట్లు అందుకున్నాయి. సుపరిపాలనలో ఓ గ్రామం జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లోనూ కోట్పల్లి మండలం మోత్కుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలనలో జాతీయ పురస్కారానికి ఎంపికై ంది. దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ –2025 పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. నానాజిదేశ్ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం పేరుతో అందజేసింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్సింగ్ చేతుల మీదుగా కలెక్టర్ దీపక్తివారి, డీపీఓ జయసుధ, మోత్కుపల్లి సర్పంచ్ అమృతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి అవార్డు అందుకున్నారు. 703 కుటుంబాలు మోత్కుపల్లి గ్రామంలో 703 కుటుంబాలు, 2,090మంది ఓటర్లు, 2,576 మంది జనాభా ఉన్నారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రామం అసెస్మెంటు తీసుకోగా 2025 సంవత్సరానికి గాను జాతీయ అవార్డుకు ఎంపికై ంది. అవార్డులకు ఎంపిక అనేక పంచాయతీలు సుపరిపాలన దిశగా పయనిస్తున్నాయి. రికార్డులను పూర్తి స్థాయిలో ఆన్లైన్లో నిర్వహించడం, నిధుల ఖర్చులో పారదర్శకత, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడటం, తరచూ సమావేశాల నిర్వహించి ప్రజలను పాలనలో భాగస్వాముల్ని చేయడం లాంటివి జాతీయ స్థాయి అవార్డులకు దోహదం చేస్తున్నాయి. దోహదం చేసిన అంశాలు ఉత్తమ జీపీగా ఎంపిక చేయడానికి అనేక అంశాలను దోహదం చేశాయి. ప్రజలకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవడం, సక్రమంగా రికార్డులు నిర్వహణ, పారదర్శకత పాలన, ప్రజల భాగస్వామ్యం.. లాంటి వాటిని పరిగణలోకి తీసుకున్నారు. తడి పొడి చెత్తను వేరుచేసే పద్ధతి, మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, మురుగు గుంతలు లేకుండా చూసుకోవడం, రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, హరితహారం.. ఇంకుడు గుంతలు, విద్య, వైద్యం, బడి బయటి పిల్లలు, పౌష్టికాహార లోపం, ఇమ్యునైజేషన్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. వీటితో పాటు గ్రామంలో అక్షరాస్యత పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఖర్చు చేసిన నిధులు, పన్నుల వసూలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఉపాధి హామీ పథకంలో వందరోజులు పని చేసిన కుటుంబాలు, లబ్ధి పొందిన కుటుంబాలను ప్రత్యక్షంగా పరిశీలించి జాతీయ అవార్డుల కోసం అప్లోడ్ చేశారు. ఇందులో దౌల్తాబాద్ మండలంలోని దేవర ఫస్లాబాద్, కోట్పల్లి మండల పరిధిలోని మోత్కుపల్లి వివరాలు పంపించారు. ముందుగా ఈ రెండు జీపీలు రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కాగా తర్వాత మోత్కుపల్లి జాతీయ స్థాయి సుపరిపాలనలో మూడో స్థానంలో నిలిచింది. ఈ గ్రామానికి రూ.50 లక్షల ప్రైజ్మని కూడా వచ్చింది. జిల్లాకు గతంలోనూ పలు అవార్డులు 2023లోనూ అవార్డుల పంట పండింది. జిల్లాలో 594 జీపీలు ఉండగా నాలుగు గ్రామ పంచాయతీలు ఐఎస్ఓ గుర్తింపు పొందాయి. ఒక జీపీ జాతీయ అవార్డును దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 పంచాయతీలు ఐఎస్ఓ(ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్) అవార్డులు అందుకోగా ఆ ఏడాదిలో మన జిల్లా నుంచే నాలుగు ఎంపికవటం గమనార్హం. వీటిలో చీమల్దరి, పులిమద్ది, ఎల్లకొండ, కరన్ఖోట్ గ్రామాలు ఉన్నాయి. భారీగా సమకూరనున్న నిధులు మారనున్న గ్రామ రూపురేఖలు మరో రెండు జీపీలకు రాష్ట్రస్థాయి అవార్డులు -
ధాన్యం లక్ష్యాలను అధిగమించాలి
అనంతగిరి: ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్లు, లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మిల్లరు 2 లక్షల 20 వేల బస్తాల ధాన్యాన్ని సేకరించాలని అన్నారు. జూన్ 6 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు మిల్లులకు ధాన్యం తరలించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల జనరల్ మేనేజర్ అభిషేక్, డీజీఎం ఇర్ఫాన్, సూపరింటెండెంట్ ఇద్రీష్, పౌర సరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, జిల్లా సహకార అధికారి నాగార్జున, డీసీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ వెంకట్ రాంరెడ్డి, అదనపు డీఆర్డీఓ నర్సింలు, డీపీఎం కొమురయ్య, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి -
మలేరియాపై యుద్ధం
● నేటి నుంచి మాసోత్సవాలు ● దోమల నిర్మూలన, పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్ శుభ్రతతోనే దోమలకు చెక్ నేటి నుంచి జిల్లాలో మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేస్తాం. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి. – డాక్టర్.రవీంద్రయాదవ్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ తాండూరు: మలేరియా నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమలు వ్యాపించే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 4నుంచి జూలై 4వ తేదీ వరకు మలేరియా మాసోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. దోమలను అంతం చేయండి.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించండి అనే నినాదంతో వైద్యాధికారులు ముందుకు సాగనున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి, మాతాశిశు కేంద్రాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వైద్యులు, వైద్యాధికారులు సమన్వయంతో పని చేస్తుండటంతో కొన్నేళ్లుగా జిల్లాలో మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు వంటి కేసులు తగ్గిపోయాయి. కానీ ఏటా డెంగీ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ● పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్లు వంటి వాటిలో నీరు ఉంటే తొలగించాలి. వాటని ఇళ్ల పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. ● ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తోట్ల వంటి వాటని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ● ఇంటిపై నీరు నిలవకుండా చూసుకోవాలి. ● ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహించాలి. ఉన్న నీటిని పారబోసి మళ్లీ నింపుకోవాలి. ● సెప్టిక్ ట్యాంకులకు నైలాన్ జాలిని కట్టుకోవాలి. ● ఇంటి కిటికీలు, గుమ్మాలకు జాలిని అమర్చాలి. ● నిద్రించే సమయంలో విధిగా దోమ తేరలు వినియోగించాలి. పంచాయతీలు.. మున్సిపాలిటీల్లో.. ● వీధులను పరిశుభ్రంగా ఉంచాలి. ● మురుగు కాలువలు, డ్రైనేజీలను క్లీన్ చేయాలి. చెత్తాచెదారం తొలగించాలి ● వర్షాలకు ముందే కాలువల్లో పూడికను తొలగించాలి. మురుగు పారేలా ఏర్పాట్లు చేయాలి ● గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలి. ● వ్యాధులు ప్రబలిన వెంటనే ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి సూచనలు పాటించాలి.2019 నుంచి నమోదైన డెంగీ కేసులు -
నాణ్యతకు తిలోదకాలు
బషీరాబాద్: బషీరాబాద్– కరణకోట్ ప్రధాన రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాణ్యతను పట్టించుకోవడం లేదని వాహనదారులు, జీవన్గీ, క్యాద్గీరా, గంగ్వార్ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు తవ్వి ఎర్ర మట్టి పోసి, తొక్కించాల్సి ఉండగా, చెరువుల్లోని నల్లమట్టిని వేస్తున్నారు. దీనికి తోడు పాత బీటీని తవ్వి అదే మట్టిని కొత్తగా వేస్తున్న రోడ్డుకు వినియోగిస్తున్నారు. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ ఓట్ల తొలగింపునకు కుట్ర
● సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి ● పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్ పేరుతో కాంగ్రెస్ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలో నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఏజెంట్లకు సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సర్ పేరుతో ఓట్లను తొలగించడంతోనే బీజేపీ అఽధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇదే తరహాలో మన రాష్ట్రంలో అడ్డదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్ ప్రక్రియను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును హరించే చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో ఎలాంటి మోసాలు జరిగినా వెంటనే పీసీసీ దృష్టికి తేవాలని నాయకులకు సూచించారు. అలాగే 18 సంత్సరాలు నిండిని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనర్లు రాఘవేందర్రెడ్డి, రాజేష్, మోహన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువు.. ధరల దరువు
కొడంగల్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. వర్షాలు కురిస్తే విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఎరువుల ధరలపై నియంత్రణ లేకపోవడంతో రోజు రోజుకు పెరుగుతున్నాయి. విత్తనాలు వేసే సమయంలో భూమిలో శక్తి కోసం వేసే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు మండుతున్నాయి. దీంతో సాగు ఖర్చులు పెరిగాయి. రైతు భరోసా పూర్తి స్థాయిలో అందక.. పెట్టుబడి ఎలా అని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. పంట రుణాలకు పెట్టుబడి సాయం ప్రభుత్వం సాగు పెట్టుబడికి రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు చొప్పున విడుదల చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నగదును బ్యాంకర్లు పంట రుణాల్లో జమ చేస్తున్నారు. దీంతో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే రైతులు ఖరీఫ్ సీజన్కు వ్యవసాయ పనులు ప్రారంభించారు. మార్కెట్లో ఎరువుల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. సన్న చిన్నకారు రైతులు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్లో సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు సాగు చేపట్టనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంపై విమర్శలు వస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఒక్కో బస్తా ఒక్కో విధంగా ఉంది. వాటి నాణ్యతా ప్రామాణాలను బట్టి ధరను నిర్ణయించారు. కాంప్లెక్స్ ఎరువులు ఒక్కో బస్తాపై సుమారు రూ.300 పైగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎరువుల ధర డీఏపీ రూ.1,350 కాంప్లెక్స్ రూ.2,300 10.26.26 రూ.2,250 యూరియా రూ. 266 ఎస్ఏపీ రూ.775 వానాకాలం సాగు సమయంలో రేట్లు ౖపైపెకి పెట్రోల్, డీజిల్ పెరిగాయంటూ ఇష్టానుసారంగా పెంపు ఆందోళనలో రైతులువిత్తనాల ధరలురకం ధర(బస్తాలు) కిలో కంది రూ.310 జొన్నలు(3కేజీ) రూ.450 వరి రూ.450 పత్తి రూ.810–రూ.900 పెసర రూ.720 గతేడాది కంటే ఈ సంవత్సరం ఎరువుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎరువుల ధరలు పెరిగాయి. రైతులకు ఈ ధరలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు సాగు ఖర్చుల కోసం రైతు భరోసా ఇస్తోంది. ఆ డబ్బుతో ఎరువులు కొనుగోలు ఇబ్బంది తగ్గుతుంది. – శివకుమార్ గుప్తా, కొడంగల్ -
భగ్గుమన్న పాత కక్షలు
నవాబుపేట: పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో 15 మందిపై కేసులు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మూలమాడకు చెందిన ఆలంపల్లి కిష్టయ్య కొంతకాలంగా పంచాయతీ వాటర్ మెన్గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన బిల్లపాటి బాల్రాజ్, అతని అనుచరులు తమ ఇళ్లకు సరిపడా నీళ్లు రావడం లేదని సోమవారం రాత్రి 10 గంటలకు కిష్టయ్యను నిఽలదీశారు. ఈక్రమంలో మాటామాటా పెరిగి బాల్రాజ్ అనుచరులు కిష్టయ్యపై దాడి చేశారు. ఇది గమనించిన కిష్టయ్య కొడుకు లక్ష్మణ్, గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుభాన్రెడ్డి (ఇతని కోడలు ప్రస్తుత సర్పంచ్)కి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆయన మరికొంత మందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే ఆవేశంలో ఉన్న బాల్రాజ్ అనుచరులు సుభాన్రెడ్డిపై సైతం దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నవాబుపేట ఎస్ఐ గిరి తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించి, ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. తన తండ్రిపై దాడి చేశారని తెలుసుకున్న సుభాన్రెడ్డి కొడుకు నరేందర్రెడ్డి పలువురు అనుచరులతో మంగళవారం తెల్లవారుజామున నగరం నుంచి ఊరికి చేరుకున్నాడు. సుభాన్రెడ్డిపై దాడికి పాల్పడిన పలువురి ఇళ్లపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఈఘటనలో కొంతమందికి గాయాలవగా, మరికొంత మంది అప్పటికే ప్రాణభయంతో పారిపోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నరేందర్రెడ్డితో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, సీఐ వెంకట్, ఎస్ఐ గిరి గ్రామానికి చేరుకుని, వివరాలు సేకరించారు. ఈ ఘటనలో బాల్రాజ్తో పాటు మరో ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేయగా, నరేందర్రెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి మొత్తం 15 మందిని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మూలమాడలో ఇరువర్గాల ఘర్షణ ఆరుగురిపై హత్యాయత్నం, తొమ్మిది మందిపై అట్రాసిటీ కేసులు 15మందికి రిమాండ్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం, పోలీస్ పికెట్ ఏర్పాటు -
సంక్షేమంలో సరికొత్తగా..
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026వికారాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందాలన్నదే సర్కార్ లక్ష్యమని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. కలెక్టర్ దీపక్తివారి, ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయా పాఠశాలలు, గురుకుల, మోడల్ స్కూల్, సంఘం లక్ష్మీబాయి పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులతో కలిసి తిలరించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పోలీస్ పరేడ్, జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమరులకు నివాళి అర్పించి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అనిచివేతకు, దోపిడీకి గురైందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే తప్ప తమ రాతమారదని గ్రహించి తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించడంతో 2014 జూన్ 2వ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. నిరంతరం పథకాల అమలు అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని.. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని సభాపతి అన్నారు. సాగు భూములకు రైతు భరోసా పేరిట ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ప్రజాపాలనతో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలుపుదాం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. -
వికారాబాద్ ఆర్టీఓగా సుభాష్చంద్రారెడ్డి
అనంతగిరి: వికారాబాద్ ఆర్టీఓగా సుభాష్చంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఆర్టీఓగా పనిచేసిన ఆయన బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన వెంకట్రెడ్డి అసిఫాబాద్కు బదిలీ అయ్యారు. అనంతగిరి: వికారాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కె.రంగరాజు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో చైర్మన్తో పాటు ముగ్గురు సభ్యులున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రంగరాజు ఎంఏ, బీఎడ్, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. కాగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో 16 ఏళ్లుగా పరిచయం ఉంది. తన నియామకానికి కృషి చేసిన సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. దుద్యాల్: మండల పరిధిలో ఐదుగురు పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారని ఎంపీడీఓ జైపాల్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలతో తెలిపారు. ఎక్కచెరువు తండా, ఆలేడ్, చెట్టుపల్లి తండా, అల్లిఖాన్పల్లి, హంసంపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. హంసంపల్లి పంచాయతీ కార్యదర్శి పుష్పలత స్థానంలో వెంకటేశ్, అల్లిఖాన్పల్లి పంచాయతీ కార్యదర్శి అరుణజ్యోతి స్థానంలో జె.సోని, ఆలేడ్ పంచాయతీ కార్యదర్శి రమేశ్ స్థానంలో నసీరుద్దీన్, చెట్టుపల్లి తండా పంచాయతీ కార్యదర్శి శ్రీవాణి స్థానంలో స్రవంతిని నియమించారు. ఎక్కచెరువు తండా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ స్థానంలో ఇంకా ఎవ్వరిని కేటాయించలేదని చెప్పారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్, అటెండర్ ఖలీమ్ సైతం బదిలీ అయ్యారు. వీరి స్థానాల్లోనూ ఎవరినీ కేటాయించలేదు. తాండూరు: ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ కన్వీనర్గా యాలాల మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావును నియమించినట్లు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు అసెంబ్లీ పరిఽధిలోని 269 పోలింగ్ బూత్లలో సర్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించేందుకు సీనియర్ నాయకుడు, న్యాయవాది కరణం పురుషోత్తంరావును కన్వీనర్గా నియమించామని చెప్పారు. ఈ సందర్భంగా పురుషోత్తంరావు ఎమ్మెల్యేను కలిశారు. ఆమనగల్లు: పట్టణంలోని కోర్టులో ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ అరుణ్కుమార్ అన్నారు. కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్పై మంగళవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిష్కారానికి అనువైన కేసులను, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పిటీ కేసులు, ఇరుపక్షాలు సమన్వయం చేసుకుని పరిష్కరించే కేసులను గుర్తించి రాజీ పడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు వెంకటేశ్వర్లు, జానకిరాంరెడ్డి, సైదిరెడ్డి, వేణుగోపాల్, ఏపీపీ కార్తీక్ తదితరులు ఉన్నారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
పరిగి: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణం కేంద్రంలోని ఆయన నివాసంలో మున్సిపల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. కార్యకర్తలు సమష్టిగా పథకాలను, అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతీ కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉండడంతో రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పరిగి నియోజకవర్గాన్ని సుమారు రూ.50 వేల కోట్ల నిథులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పరిగి–షాద్నగర్, వికారాబాద్–పరిగికి నాలుగు లేన్ల రహదారి, పరిగిలో ప్రభుత్వ ఆస్పత్రి ఆధునీకరణతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులను రూ.27 కోట్లతో చేపడుతున్నామని వెల్లడించారు. అప్పా–మన్నెగూడ రహదారి, నేవీ రాడర్ ప్రాజెక్టు, రైల్వే లైనన్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వంటి కీలకమైన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
రుణాల చెల్లింపులో
మహిళా సంఘాలు భేష్తాండూరు: బ్యాంకు రుణాలు తీసుకుని బడా వ్యాపారులు దేశం వదిలి వెళ్లిపోతే.. తెలంగాణ మహిళ సమాఖ్య సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించడంలో పరిణతి సాఽధించారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మహిళా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అథితిగా హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డితో కలిసి సందర్శించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ ద్వారా రూ.212 సంఘాలకు రూ.28.19 కోట్లు, 1,001 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.1.61 కోట్లు, సీ్త్ర నిధి పథకం ద్వారా 332 సంఘాలకు రూ.6.67 కోట్లు, తాండూరు మున్సిపల్ పరిధిలోని 500 మంది వీధి వ్యాపారులకు రూ.8 కోట్ల రుణాలకు సంభందించిన చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మహిళలకు వ్యాపారాలలో చోటు కల్పించేందుకు ఇప్పటికే పంట ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. త్వరలో నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు ఆర్టీసీలో భాగస్వాములను చేయనున్నామని చెప్పారు. నియోజవకర్గంలోని నాలుగు ప్రైవేటు బస్సులు ఆర్టీసీలో నడిపించేందుకు బస్సులు కేటాయించామన్నారు. పాఠశాల నిర్వహణ భాద్యతలలో భాగంగా స్కూల్ యూనిఫామ్స్, తయారీ, మహిళా శక్తి క్యాంటీన్లు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. గ్రామాలలో మహిళా సంఘాల కోసం వంద మహిళా సమాఖ్య భవనాలను రూ.10 కోట్లను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్రెడ్డి, టీఎంసీ రాజేంద్రప్రసాద్, డీఈ ఈ మణిపాల్, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులున్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి -
ప్రణాళికలు సిద్ధం చేయండి
అనంతగిరి: గ్రామాలు, పట్టణాల్లో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యావరణ వారోత్సవాల్లో చేపట్టే అవగాహన అవగాహన కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వా ర్డు సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యవసాయం, విపత్తుల నిర్వహ ణ, గ్రామంలో జరిగే కార్యక్రమాలపై అందరికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్లు ఉమా శంకర్ ప్రసాద్, వెంకటాచారి, డీఆర్డీఏ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి రాజారత్నం, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్తివారి -
‘పాలమూరు’ను పట్టించుకోండి
షాద్నగర్రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవాలని జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహంవద్ద బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడి పోయిందని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, కృష్ణా జలాల్లో జిల్లాకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటుచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, షాద్నగర్ ప్రాంతంలో ప్రతిపాదిత పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, రవీంద్రనాథ్, నర్సింలు, రామారావు, నర్సన్న, కృష్ణయ్య, నర్సింలుగౌడ్, తిరుమలయ్య, కృష్ణ, సత్యం, వెంకటేశ్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. నాటు సారా గుట్టురట్టు ● రూ.40 వేల ముడి సరుకు స్వాధీనం ● ఇద్దరిపై కేసు బషీరాబాద్: మండలపరిధిలోని కొత్లాపూర్లోనాటు సారా తయారీకేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. ఎస్పీ స్నేహమెహ్రఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.కె.అన్వర్ పాషా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీ మొత్తంలో నాటు సారా తయారీ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.కె. అన్వర్ పాషా తెలిపిన ప్రకారం. గ్రామానికి చెందిన రాథోడ్ రత్న్యా నాయక్ (56) ఇంటిపై దాడులు నిర్వహించగా రూ.12 వేల విలువైన 80 లీటర్ల ఐడీ లిక్కర్ ముడి పదార్థం, రూ.5,250 విలువైన 15 కిలోల నవసాగరం లభ్యమయ్యాయి. మొత్తం రూ.17,250 విలువైన సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు.అదే గ్రామానికి చెందిన బాల్యా నాయక్ (38) నివాసంలో తనిఖీలుచేపట్టగా రూ.22,500 విలువైన 150 లీటర్ల ముడి పదార్థం, రూ.350 విలువైన ఒక కిలో నవసాగరం స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.22,850గా పోలీసులు పేర్కొన్నారు.రెండు దాడుల్లో కలిపి రూ.40,100 విలువైన నాటు సారా తయారీ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చర్యల నిమిత్తం బషీరాబాద్ ఠాణాకు తరలించారు. -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
షాద్నగర్: నేరాల నివారణకు పోలీసు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్జోషి సూచించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అన్నారు. గ్రామాల్లో గస్తీని, పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని చెప్పారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని, అంకిత భావంతో పని చేయాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని, క్రమ శిక్షణతో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, ఎస్ఐ పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు నిఘా అవసరం కొత్తూరు: నేరాల నియంత్రణకు నిరంతర నిఘా కొనసాగించాలని ఫ్యూచర్సిటీ కమిషనర్ తరుణ్జోషి సూచించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా స్టేషన్ ఆవరణ, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితి, దర్యాప్తులో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. అనంతరం సీఐ నర్సయ్యతో పాటు స్థానిక పోలీసులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో షాద్నగర్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్జోషి -
ఉత్తమ సేవలకు ప్రశంస
తాండూరు రూరల్: తాండూరు మండలంలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవికి ప్రశంసా పత్రం అందజేశారు. వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కొన్ని వీడియోలను పర్యావరణ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. దీంతో పర్యావరణ శాఖ అధికారులు పాఠశాలకు ప్రశంసలు అందజేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ చేతులమీదగా ప్రిన్సిపాల్ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎకో క్లబ్ నిర్వాహకులు నిశాంత్ తదితరులున్నారు. ఉత్తమ ఉద్యోగులకు.. కుల్కచర్ల: తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఉత్తమ విధులు నిర్వహించిన ఉద్యోగులకు జిల్లా అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. కుల్కచర్ల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓగా విధులు నిర్వహిస్తున్న బక్కారెడ్డికి ఉత్తమఉద్యోగిగా పురస్కారం అందించారు. గిరిజన సంక్షేమ శాఖలో టీచింగ్ విభాగంలో కుల్కచర్ల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న రాజేందర్ నాయక్ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయా్యారు. స్పీకర్ ప్రసాద్కుమార్, కలెక్టర్ దీపక్ తివారి చేతుల మీదుగా వారు పురస్కారం అందుకున్నారు. ఉత్తమ జూనియర్ అసిస్టెంట్గా శ్రీశైలంఉత్తమ ఉద్యోగిగా రాజేందర్ నాయక్అనంతగిరి: ఉపాధ్యాయుడు నటరాజుఎస్టీ వెల్ఫేర్ కార్యాలయసబార్డినేట్ బాలకృష్ణ -
ఉద్యమకారులను గుర్తించాలి
అనంతగిరి: తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఉద్యోగంగా పనిచేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పశ్చిమ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ కె.శ్రీనివాస్ కోరారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్లోని అమరుల స్తూపానికి నివాళి అర్పించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ విచ్చేశారు. ఈమేరకు ఉద్యమకారులకు ప్రభుత్వ ఫలాలు అందజేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధ్యక్షతన కమిటీ వేసి ప్రక్రియను మొదలుపెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ప్లాటు, పెన్షన్, గుర్తింపు కార్డు, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, ఆర్టీసీ, రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటి ఫలాలు, రాజకీయంగా పదవుల్లో ప్రాధాన్యత ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, జేఏసీ నాయకులు సి.రమేశ్ కుమార్, ఎర్రవల్లి జాఫర్, నర్సింలు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎమ్.సురేశ్, శివప్రసాద్, రవిశంకర్, కృష్ణారెడ్డి, దేవాదాస్, శివకుమార్ రెడ్డి, కృష్ణయ్య, సుభాశ్, కిషోర్, తిరుపతి రెడ్డి, బాలరాజు, మారుతి, అబ్దుల్ సమద్ దత్తు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పశ్చిమ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ శ్రీనివాస్ -
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తాండూరుకు నిధులు
తాండూరు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్రాజ్ గౌడ్ అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నై తెలంగాణ అన్నవారు ముఖ్యమంత్రి అయిండు.. నక్కో తెలంగాణ అన్నాయన ప్రధాని అయ్యాడని విమర్శించారు. రాష్ట్ర సాధనకు 14 ఏళ్లపాటు కేసీఆర్ పోరాటం చేశారన్నారు. తెలంగాణ తెచ్చింది ఎవరో గూగుల్, ఏఐలను అడిగితే కేసీఆర్ పేరు చెబుతాయన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలతో మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడలేదన్నారు. వానాకాలం సీజన్ వస్తున్న ఇప్పటి వరకు ఎరువులను అందుబాటులోకి తీసుకురాక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. పైలెట్ రోహిత్రెడ్డి ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. నాడు మంజూరైన నిధులకు సంబంధించి ఇప్పటి వరకు పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు ప్రాంతానికి తీసుకొచ్చింది ఏమి లేదన్నారు. మరో రెండేళ్లు ఎమ్మెల్యేగా పదవి అనుభవించాలని.. తర్వాత ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వచ్చేది లేదు.. గెలిచేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పట్లోళ్ల దీపానర్సింహులు, ఇర్షద్, జావీద్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు శ్రీనివాసచారి, నర్సింలు, నరేందర్గౌడ్, వెంకట్రెడ్డి, సంతోశ్గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు. మనోహర్రెడ్డి తాండూరులో ఉండేది రెండేళ్లే.. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్రాజ్ గౌడ్ -
విత్తన పంపిణీలో గోల్మాల్!
దుద్యాల్: రైతులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన వేరుశనగ విత్తనాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొగమోని సురేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని లగచర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో రైతులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. వీసీసీ(వాల్యూ చైన్ క్లస్టర్) ద్వారా వందశాతం ఉచితంగా, ఎమ్ఎల్డీ(బ్లాక్ లెవెల్ డెమాన్స్ట్రేషన్) ద్వారా 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేయాలి. అయితే ఈ విత్తనాలకు కొంత మంది రైతులకు ఇచ్చి మిగతా విత్తనం అంత అమ్ముకున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దుద్యాల్, గౌరారం, ఈర్లపల్లి, పోలేపల్లి, కుదురుమల్ల, లగచర్ల, హస్నాబాద్, హంసంపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు నమోదు చేశారన్నారు. నమోదైన వివరాల గురించి సంబధిత క్లస్టర్ల ఏఈఓలను సంప్రదిస్తే తమకేమీ సంబంధం లేదని ఉన్నతాధికారులకే తెలుసంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తురని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సబ్సిడీ విత్తనాలు రైతులకు అందించానలే ఉద్దేశంతో కేటాయిస్తే అధికారులు అక్రమాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేశ్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు విష్ణువర్ధన్ రెడ్డి, ఆకుల సత్తయ్య, బాలవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్, వెంకటయ్య, మణికంఠ తదతరులు పాల్గొన్నారు. లిస్టులో పేర్లు చూసి రైతులకు ఉచితంగా ఇచ్చిన వేరుశనగ విత్తనాలతో పాటు కంది విత్తనాలు ఇచ్చినట్లు లిస్టులో పేరు చూసి అవాక్కయ్యమని రైతులు వాపోయారు. విత్తనాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రాయడం సరికాదని మండిపడ్డారు. లగచర్ల గ్రామంలో దాదాపుగా 20 మందికి పైగా రైతులపై విత్తనాలు ఇచ్చినట్లు నమోదు చేశారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ విత్తనాలు రైతువేదికలో నిల్వ ఉంచి రైతులకు అందించాలని, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో, షాపు గోదాంలో విత్తనాలు ఉంచి ఇలాంటి చర్యలు పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. లిస్టులో పేర్లు ఉన్న రైతులతో త్వరలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏఈఓపై చర్యలకు డిమాండ్ దుద్యాల్ క్లస్టర్ పరిధిలోని దుద్యాల్, గౌరారం, హంసంపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు వరి ధాన్యం విక్రయించడానికి ఏఈఓ భావన టోకెన్లు ఇవ్వడానికి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నాయకుడు సురేశ్ ఆరోపించారు. సంబంధిత ఏఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయకుండానే రైతుల పేర్ల నమోదు అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు డిమాండ్ -
పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శిగా క్రాంతికుమార్
పూడూరు: పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా క్రాంతి కుమార్ను నియమిస్తూ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం నిమామకపత్రాన్ని అందజేశారు. మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ గ్రామానికి చెందిన బి.క్రాంతి కుమార్ పార్టీ కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో చేసిన సేవలను గుర్తించి తనకు పదవిని ఇచ్చారని అన్నారు. గ్రామాల్లో బడుగుబలహీన వర్గాలతో పాటు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. పని చేసే వారికి కాంగ్రెస్లో ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందని అన్నారు. తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ ఫ్యూచర్సిటీలో ఇంటి స్థలాలు కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు మంగళవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబుకు విన్నవించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు, కోషాధికారి వడ్ల శ్రీనివాసచారి ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం అందేజేశారు. రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో భాగంగా విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ, ప్రభుత్వ అధికారుల హెల్త్ స్కీం జాబితాలో జర్నలిస్టులను చేర్చాలని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ కొడంగల్: ఎన్నికల ముందు కాంగ్రెస్ దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయలాని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్, ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు అరగుండు కొట్టుకుని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దివ్యాంగులపై సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం తహసీల్దార్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. తాండూరు రూరల్: ప్రభుత్వం.. పేదలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతున్నాయని బీఆర్ఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. పెద్దేముల్లో నాలుగు అంతస్థుల భవనం ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, ఈ విషయం ఇక్కడి ప్రజలకు తెలుసునని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఐక్యంగా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ డీవై నర్సిములు, ఉప సర్పంచ్ డీవై ప్రసాద్, నాయకులు రమేష్, జనార్దన్రెడ్డి, వీరప్ప, వెంకటేశ్ చారి, పాండు, అంజిలయ్య, శ్రీను ఉన్నారు. -
ఫలితం కోసం ఆత్రుత వద్దు
అమ్మ చెప్పిన నీతి కథ బొంరాస్పేట: ఓ మారుమూల గ్రామంలో నివసించే పార్వతమ్మకు కూతురు తులసి, కొడుకు రాము ఉండేవారు. తులసి చాలా తెలివైన అమ్మాయి. కానీ ఏ పని చేసినా త్వరగా ఫలితం రావాలని ఆత్రుతపడేది. ఒకరోజు పార్వతమ్మ ఇంటి పెరట్లో మామిడి విత్తనం(పీచు) నాటుతుండగా పిల్లలిద్దరూ గమనించారు. ‘అమ్మా, ఇది ఎప్పుడు మొక్కవుతుంది..? ఎప్పుడు పెద్దగా మారి పండ్లనిస్తుందని..? అని అడిగింది తులసి. అప్పుడు తల్లి నవ్వుతూ, పాప తల నిమురుతూ.. ‘రోజూ నీళ్లు పోసి, ప్రేమగా చూసుకుంటే సమయం వచ్చినప్పుడు నీడనూ, పండ్లనూ, శుభకార్యాలకు అవసరమైన కొమ్మలను ఇస్తుంది’ అని చెప్పింది. మూడు రోజుల తర్వాత పెరట్లోకి వెళ్లిన తులసి అమ్మా ఇంకా మొక్క ఎందుకు రాలేదు అని అడిగింది. అప్పుడు తల్లి బిడ్డను దగ్గరకు తీసుకుని ఇలా చెప్పింది.. ‘బంగారం.. ప్రకృతిలో మంచి విషయాలన్నీ నెమ్మదిగా పెరుగుతాయి. విత్తనం ఒక్కరోజులోనే మొక్క కాదు.. మొక్క ఒక్కరోజులోనే చెట్టుకాలేదు. అలాగే మన మంచితనం, చదువు, గౌరవం కూడా క్రమంగా పెరుగుతాయి. ఓపికతో నిజాయితీగా కష్టపడిన వారికే మంచి ఫలితం దక్కుతుంది’ అని చెప్పింది. ఈ మాటలను గట్టిగా గుర్తుంచుకున్న తులసి నిత్యం మామిడి పాదులో నీళ్లు పోసింది. అలా కొద్ది రోజులకు మొక్క వచ్చింది. ఇలా కొంత కాలం గడవగానే మొక్క చెట్టుగా ఎదిగింది. మూడేళ్ల అనంతరం కాయలు, పండ్లను కాసింది. ఓ రోజు తల్లితో కలిసి చెట్టు నీడలో కూర్చున్న పిల్లలు ఇలా అన్నారు.. ‘అమ్మా.. చెట్టు మాత్రమే కాదు, నీ మాటలు కూడా మమ్మల్ని ఇంకొకరికి నీడనిచ్చేలా పెంచాయి’. అని తల్లిని హత్తుకున్నారు. చెట్లకు కాసిన పండ్లను రాల్చి తినుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. నీతి: ఓపిక, క్రమశిక్షణ ఉంటే చిన్న విత్తనంలాంటి మనిషి కూడా మహా వృక్షంగా మారుతాడు -
గిరిజన చిన్నారి.. కూచిపూడిలో ఆరితేరి
బొంరాస్పేట: మండల పరిధిలోని సూర్యానాయక్తండాకు చెందిన ననావత్ ఉమ, శ్రీనివాస్ దంపతుల కూతురు సిద్ధాంతి రెండేళ్లుగా కూచిపూడి నృత్యంతో ప్రశంసలు అందుకుంటోంది. హైదర్గౌడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి పూర్తి చేసిన బాలిక రెండు నెలల క్రితం రవీంద్రభారతిలో నృత్య ప్రదర్శన చేసింది. ఇటీవల చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో చేసిన నృత్యానికి గాను టాలెంట్ అచీవ్ అవార్డు అందుకుంది. త్వరలో యూపీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ప్రదర్శనలో సిద్ధాంతి పాల్గొననున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. -
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి
తాండూరు: తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కలెక్టర్ దీపక్ తివారిని కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్లతో పాటు పలువురు అధికారులతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కలెక్టర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోళ్లలో సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా ఆస్పత్రితోపాటు ఎంసీహెచ్లో వైద్యుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
అనంతగిరి: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 110 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీసీఈఓ సుధీర్, డీఆర్డీఏ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్గా డాక్టర్ రాంచంద్రయ్య అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్గా డాక్టర్ రాంచంద్రయ్య సోమవా రం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి బదిలీ అవ్వడంతో సీనియర్ సర్జన్ రాంచంద్రయ్యకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అడిషనల్ సీడీపీఓ శ్రీలక్ష్మి బదిలీ నిజామాబాద్ అర్బన్ సీడీపీఓగా పోస్టింగ్ తాండూరు రూరల్: ఐసీడీఏస్ తాండూరు ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అడిషనల్ సీడీపీఓ శ్రీలక్ష్మీ బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం ఆమెకు నిజామాబాద్ అర్బన్ సీడీపీఓగా పోస్టింగ్ కల్పించారు. జిల్లా పరిధిలో ఆమె ఏడున్నరేళ్లుగా తాండూరు అడిషనల్ సీడీపీఓగా, వికారాబాద్ బాలరక్షణ భవన్లో విధులు నిర్వర్తించారు. తాండూరు సూపర్వైజర్ నిర్మల కొడంగల్కు బదిలీపై వెళ్లారు. ఆఫీస్ సబార్డినేట్ సురేశ్ వికారాబాద్జిల్లాకు బదిలీఅయ్యారు. విలీన తేదీని ప్రకటించాలి ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ ఉద్యోగుల నిరసన తాండూరు టౌన్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని వెంటనే ప్రకటించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఎర్ర బ్యాడ్జీలు ధరించి డిపో గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన సర్కార్ ఇప్పటికే అపాయింటెడ్ డేట్ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనవుతున్నారన్నారు. ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు నిర్వహించి, గెలిచిన యూనియన్ను కమిటీలో చేర్చిన తర్వాతే విలీన ప్రక్రియపై చర్చిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చెప్పడం సరికాదన్నారు. యూనియన్ ఎన్నికలతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. హెచ్పీఎస్కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక అనంతగిరి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్)లో 2026–27కు సంబంధించి 1వ తర గతి ప్రవేశాలకు జిల్లాలో ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ మేరకు సో మవారం కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు చరణ్, తేజ స్విని అడ్మిషన్ పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పర్యావరణ హితం అందరి బాధ్యత
అనంతగిరి: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ వారోత్సవాల కార్యక్రమాలను ప్రారంభించారు. వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం నుంచి కోట్పల్లి రిజర్వాయర్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ శ్యాంకుమార్, డీఆర్డీఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ సుధీర్, సీఐ రఘుకుమార్, ఫారెస్టు అధికారులు శ్రీదేవి సరస్వతి, ప్రతిమా, నాగేశ్వరరావు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తుల నివారణకు చర్యలు అవసరం పొగాకు ఉత్పత్తులు వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం వికారాబాద్లోని తన కార్యాలయంలో డీఎల్సీసీ() సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత గుట్కాలాంటి వ్యసనాలకు అలవాటుపడి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. క్షయ, ఉబ్బసం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. జిల్లా అధికారులు వీటి నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఎంహెచ్ఓ పవిత్ర, ఎన్సీడీ అధికారిణి పద్మ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి
తాండూరు టౌన్: ప్రత్యేక రాష్ట్ర కోసం పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డు, గౌరవ వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి ఉద్యమకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పిందని.. ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న సమయంలో గాయపడి ఆస్పత్రికి వెళ్లినా, కేసులు నమోదైనా, జైలుకు వెళ్లినా తదితర ఆధారాలను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. గత ప్రభు త్వం అమరులైన ఉద్యమకారులకు కొంత మేరకు సహాయం చేసినప్పటికీ, గాయపడిన వారికి ఒక్క పైసా అందజేయలేదన్నారు. ఈనెల 21వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్కులో జరుగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈడిగి సంజయ్ గౌడ్, ఉద్యమకారులు జిలాని, ప్రకాశ్గౌడ్, సుదర్శన్, శ్రీనివాస్, ఫిరోజ్ ఖాన్, కృష్ణ ముదిరాజ్, రామకృష్ణ, భద్రేశ్వర్, కేశవులు, ముజీబ్ ఖాన్, వీరమణి, హేమంత్, కాశీంపాషా, నాగేందర్ తదిరతులు పాల్గొన్నారు. వాల్పోస్టర్ ఆవిష్కరణ పరిగి: ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సంఘం సభ్యులతో కలిసి ఈ నెల 21 న నిర్వహించనున్న ఆత్మీయ స మ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన ఇచ్చి న హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. నామినేటెడ్ పదవులల్లోనూ అవకాశాలను కల్పించాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ముకుంద నాగేశ్, వెంకట్రాములు, ఎర్రన్పల్లి శ్రీనివాస్, రమేష్బాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్ల కల.. పుష్కరమైంది నేడు
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి వికారాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రం సిద్ధించాక తొమ్మిది సార్లు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడవ పర్యాయం నిర్వహించనున్నారు. పన్నెండేళ్ల కాలంలో జిల్లా ఏర్పాటుతో పాటు జిల్లాలో మనం సాధించిన ప్రగతి, కన్న కలలు ఏ మేరకు నెరవేరాయి.. ఇంకా ఏ మేరకు నెరవేరాల్సి ఉంది. అనే విషయాలపై రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లా ఏర్పాటు కల సాకారం మూడు దశాబ్దాలకు ముందు నుంచే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో పాటే ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం జిల్లా ప్రజల నుండి వ్యక్తమవుతూ వచ్చింది. రాష్ట్ర సాధన ఉద్యమానికి సమాంతరంగా వికారాబాద్ జిల్లా సాధన ఉద్యమం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసు లు చేపడుతూ వచ్చారు. ఉమ్మడి జిల్లా కార్యాలయలన్నీ హైదరాబాద్లో ఉండటం. జిల్లా వాసులకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవటం. తూర్పు జిల్లా తో అనేక అంశాల్లో భావ సారుప్యత లేకపోవటం తదితర కారణాల నేపథ్యంలో ప్రత్యేక జిల్లా ఏర్పా టు ఉద్యమం బలపడుతూ వచ్చింది. చివరకు ప్రత్యేక రాష్ట్రం సిద్దించాక 2017లో తెలంగాణ ప్ర భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకొన్న సమయంలో వికారాబాద్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఆ కాంక్ష సాకారమైంది. అయితే జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తికాగా ఇంకా చాలా వరకు ని ర్మాణ దశలో ఉన్నాయి.జిల్లాను పట్టి పీడిస్తున్న సా గునీటి ప్రాజెక్టుల కల మాత్రం ఇంకా నెరవేరలేదు. రూ.3,700 కోట్ల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయాల(కలక్టరేట్) సముదాయం నూతన భవన నిర్మాణం, జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు అనుబంధంగా 250 పడకలతో జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యచరణతో ఆయుష్ ఆస్పత్రి మంజూరు చేశారు. జిల్లా కేంద్రంలో రైల్వే ఫ్లై ఓవర్ మంజూరై నిర్మాణ దశలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనంతగిరి ఎకో టూరిజం పార్కు మంజూరైంది. తాండూరుకు నర్సింగ్ కళాశాల మంజూరు చేశారు. జిల్లాలో మైనార్టీ,బీసీ,ఎస్సీ,ఎస్టీ బాలురు,బాలికలు కలుపుకొని మొత్తం 20 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగా వాటికి భవనాలు నిర్మించాల్సి ఉంది.పరిగిలో వంద పడకల ప్రభుత్వఆస్పత్రి మంజూరైంది.మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీటి సరఫరా జరుగుతోంది. ఇటీవల కొడంగల్లో సుమారు రూ.3,700 కోట్ల నిధులతో సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, వైద్య కళాశాల, వ్యవసాయ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఇంటర్ కళాశాలలు, తదితర అభివృద్ధి పనులు నూతన ప్రభుత్వం మంజూరు చేసింది.జిల్లాలో 97 రైతు వేదికలు నిర్మించారు.ప్రతీ పంచాయతీలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్మాణ దశలో అభివృద్ధి కార్యక్రమాలు -
అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు
అనంతగిరి: ప్రజా పాలనలో అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ మండల పరిధిలోని మదన్పల్లి, మైలార్దేవరాంపల్లి, గొట్టిముక్కుల, పులుసుమామిడి, కొటాలగుడెం గ్రామాల్లో రూ.3.02 కోట్లతో కూడిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు వేయించామన్నారు. రూ.650 కోట్లతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు వేయిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో సతమతమవుతూనే మరోపక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఆర్టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, ఎంపీడీఓ వినయ్కుమార్, ఎంపీఓ దయానంద్, ఆయా గ్రామాల సర్పంచ్లు బిల్లపాటి విజయ లక్ష్మి, అనంతయ్య, శ్వేతా వేమారెడ్డి, సంగీత, ఇందిరమ్మ, సీనియర్ నాయకులు మైపాల్రెడ్డి, ప్రహ్లాద్రెడ్డి, మల్లేశం, శివయ్య, వేణుగోపాల్, కరుణాకర్రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మరో 2వేల ఇందిరమ్మ ఇళ్లు
● పేదల సొంతింటి కలసాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: పేదలకు సొంతింటి కల సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని గడిసింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం నియోజకవర్గానికి మరో 2వేల ఇళ్లు మంజూరు చేయనుందన్నారు. పదేళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్తో ప్రజలకు చేకూరింది ఏమీ లేదన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన వారికి అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమానికే పెద్దపీట పూడూరు: పేదల సంక్షేమానికే కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. అనంతరం గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులను అభినందించారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ.. సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ముదిరాజ్, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రఘునాథ్రెడ్డి, డీసీసీ కార్యదర్శులు అజీంపటేల్, శ్రీనివాస్, శకీల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అయ్యప్ప ఆలయాభివృద్ధికి కృషి కుల్కచర్ల: అయ్యప్పస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని మైసగిరికొండపై ఉన్న అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ అబివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేస్తా మన్నారు. టాయిలెట్స్, షెడ్స్, సీసీ రోడ్డు, కిచెన్ షెడ్డు తదితర పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మండల పరిధిలో బాధిత కుటంబాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రాంరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్ కుమా ర్, ఆయా గ్రామాల సర్పంచులు, అయ్యప్పసేవా సమితి సంఘ నాయకులు పాల్గొన్నారు. -
పీఎస్లలో 5–ఎస్ తప్పనిసరి
ఎస్పీ స్నేహమెహ్ర ధారూరు: పోలీస్స్టేషన్లలో 5–ఎస్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. సోమవారం ఆమె ధారూరు ఠాణాను సందర్శించారు. పీఎస్ కార్యాలయ నిర్వహణ, స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత, రికార్డుల భద్రత, సిబ్బంది నిర్వాహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పత్రీ ఫిర్యాదు కేసు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజలకు పోలీసు సేవల్లో అంతరాయం ఏర్పడకుండా చూసేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, డయల్ 100, ట్యాబ్ల పనితీరు, సీసీటీఎన్ఎస్ నమోదు విధానం, డేటా అప్డేషన్ ప్రక్రియలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఎస్ఐలు రాఘవేందర్, గోపాల్ను ఆదేశించారు. ఆమె వెంట డీఎస్పీ అంజయ్య ఉన్నారు. -
ఏర్పాటు ఎప్పుడో..?
దౌల్తాబాద్: చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్లుగా రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) సేవలు విస్తృతం చేసేందుకు గ్రామాలకనుగుణంగా సంఘాలను ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఆయా సంఘాల పరిధి ఎక్కువగా ఉండడం గ్రామాలకు దూరంగా సంఘాలుండడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రైతులకు మండల కేంద్రంలో సహకార సంఘం ఉంది. ఈ సంఘం పరిధిలో ఉన్న గ్రామాలు దూరంగా ఉండడంతో భారంగా మారిందని రైతు లు ఆందోళన చెందుతున్నారు. రైతులకు పంటరుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులందిస్తూ అండగా నిలిచే సహకార సంఘాల విస్తరణ గురించి ప్రభు త్వం పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. 33 గ్రామాలకు ఒకటే సొసైటీ మండల పరిధిలో 33 గ్రామాలుండగా ఈ సంఘం పరిధిలో 3,500కు పైగా మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతులు ప్రతీ పంట సీజన్లో రుణాలు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు కొత్తగా రుణాలు తీసుకుంటారు. వీటికోసం దూరంలో ఉన్న సొసైటీకి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. పంటరుణాలు, వ్యాపార రుణాల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధి సమయంలో సొసైటీకి రాకపోకలు సాగించేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. విభజిస్తే ప్రయోజనం వ్యవసాయంలో రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడే సహకార సంఘాల సేవలు అందుబాటులోకి రావాలంటే వాటిని విభజించాల్సిన అవసరముందని రైతులంటున్నారు. 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ను ఏర్పాటు చేసి ఏఈఓలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీలను విభజించాలంటున్నారు. సొసైటీలో ఎక్కువ మంది రైతులు సభ్యత్వం కలిగి ఉండగా ఏ అవసరం వచ్చినా వరుస కట్టాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. పంటల సీజన్ ఆరంభంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు బారులు తీరిన సందర్భాలున్నాయి. పాలన సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు పునర్విభజన చేసినట్లుగానే రైతులకు మేలు చేకూర్చే సొసైటీల విభజనపై దృష్టి సారించాలని మండల రైతులు కోరుతున్నారు. నివేదిక పంపించాం రైతులకు అందుబాటులో ఉండి సేవలందించడమే సహకార సంఘం లక్ష్యం. ఈ సొసైటీ పరిధిలో 33 గ్రామాలు ఉన్నాయి. గోకఫసల్వాద్ సొసైటీ ఏర్పాటు చేయాలని కోరడంతో ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. – వెంకటేష్, ఇన్చార్జి సీఈఓ, దౌల్తాబాద్ -
సమస్యల పరిష్కారానికి వినతి
దౌల్తాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సోమవారం ఎంపీడీఓ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. సంఘం మండల అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమచేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అధిక ఫీజులు నియంత్రించాలి అనంతగిరి: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలని ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ శివసాయి డిమాండ్ చేశారు. సోమవారం మండల విద్యాధికారి బాబుసింగ్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం, పుస్తకాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. సాయిచరణ్, రమేష్, శివకుమార్ పాల్గొన్నారు. నూతనంగా తాగునీటి బోరు దుద్యాల్: మండల పరిధి గౌరారం, దుద్యాల్ గ్రామాల్లో తాగునీటి సౌకర్యార్థం నూతనంగా బోర్లు వేశారు. నీటి ఎద్దడి నేపథ్యంలోపంచాయతీ నిధుల నుంచి బోరు వేసినట్లు నాయకులు తెలిపారు. దుద్యాల్ ఉప సర్పంచ్ మేరుగు సంజీవ్ కుమార్, కాంగ్రెస్ ఆయా గ్రామాల అధ్యక్షులు శ్రీశైల గౌడ్, కరుణాకర్, పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, నాయకులు అంతు నాయక్, మల్లికార్జున్, వెంకటయ్య, వెంకటేశ్ గౌడ్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్య తీరదు.. దుర్గంధం తప్పదు దుద్యాల్: మహబూబ్నగర్– తాండూరు రహదారి విస్తరణలో భాగంగా మండల పరిధి హస్నాబాద్ రోడ్డుకు ఇరువైపులా భూగర్భ మురుగు కాల్వలు నిర్మించారు. కానీ.. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీల నుంచి వెలువడే మురుగును ఆ కాల్వలకు అనుసంధానం చేయలేదు. దీంతో ఆ వ్యర్థ జలాలు రోడ్డుపై పారుతూ.. వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. దుర్వాసన కూడా వస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామం నుంచి వచ్చే మురుగును ఆ కాల్వలకు కలిపి.. సాఫీగా ముందుకు సాగేలా చూడాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు. -
‘ఉపాధి’.. కూలీలకు జీవనోపాధి
● జోరుగా కొనసాగుతున్న పనులు ● జాతరను తలపిస్తున్న పనిప్రదేశాలుదుద్యాల్: గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. నాలుగు గంటల పని సమయం కావడంతో అర్హులందరూ మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో.. ఉపాధి పనులు కూలీలకు ఆదాయ వనరుగా మారింది. జాబు కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వం పని కల్పించడం, సకాలంలో వేతన బకాయిలు చెల్లిస్తుండటంతో కూలీల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో పనుల ప్రదేశంలో జాతరను తలపిస్తోంది. చెరువుల్లో వండ్రును తీయడం, చేపల పెంపకానికి గుంతలు తొవ్వడం తదితర పనులు జోరుగా సాగుతున్నాయి. అదే విధంగా చెరువుల నుంచి పంట పొలాలకు మట్టితరలింపు, నీటి కాల్వల పూడిక తీత, ముళ్ల పొదళ్లను తొలగించడం తదితర పనులు చేస్తున్నారు. -
రెండో విడతలో 2వేల ఇళ్లు
తాండూరు: నియోజకవర్గానికి రెండో విడతలో 2వేల ఇళ్లు మంజూరవుతాయని ఎమ్మెల్యే మనోహన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పెద్దేముల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 800 ఇళ్లను పూర్తి చేశామన్నారు. మిగిలిన ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. రెండవ విడతలో మంజూరయ్యే ఇళ్లలో 1,500 ఇందిరమ్మ ఇళ్లు, రూఫ్ రిప్లేస్మెంట్ కోసం ఒక్కో ఇంటికి రూ.2లక్షల నిధులతో 500 ఇళ్లు మంజూరవుతున్నాయన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు అంటే నాలుగు గోడలు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు భద్రత, గౌరవం, స్థిరమైన భవిష్యత్ అందించే సంక్షేమ కార్యక్రమమన్నారు. గత సర్కార్ హామీలకే పరిమితమైందని ఏ ఒక్క లబ్దిదారుడికి ఇళ్లను పంపిణి చేసిన దాఖలాలు లేవన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్లో తాను ఓటు అడగనని చెప్పానని ఇప్పటికి తాను కట్టుబడి ఉంటానన్నారు. ఈకార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్జాదవ్, ఏఎంసీ చైర్మన్లు పట్లోళ్ల నర్సింహులు, అంజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి నాయకులు తదితరులున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
సన్నాలు సరే.. దొడ్డురకం వద్దు!
● మిల్లు యజమానుల మెలిక ● ధాన్యం సేకరణలో ఇష్టారాజ్యం ● ఇబ్బంది పడుతున్న రైతులుదోమ: ధాన్యం విక్రయించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెమ్మదించిన సేకరణ, లారీల కొరతతో కుప్పలుగా వడ్ల రాశులు, సంచులు పేరుకుపోయాయి. సమస్య నుంచి గట్టెక్కేందుకు సంబంధిత అధికారులు.. నేరుగా రైస్మిల్లులు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. ధాన్యంను మిల్లులో విక్రయించుకోవాలని రైతులకు సూచించారు. దీంతో కొంత ఊరటపొందిన అన్నదాతలు.. తమ ధాన్యాన్ని ట్రాక్టర్లలో మిల్లులకు తరలించగా.. సన్నాలే కొంటాం.. దొడ్డురకం కొనమని మిల్లర్లు మెలిక పెట్టారు. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతులు.. మరలాకేంద్రాలకు తరలించడమో.. దళారులను ఆశ్రయించడమో చేస్తున్నారు. ఆదేశాలున్నా.. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో మండల పరిధి బొంపల్లి సమీపంలోని ఎస్వీఎస్ రైస్ మిల్లు యాజమాన్యాన్ని ధాన్యం సేకరించాలని అధికారులు చెప్పారు. సన్నాలతో పాటు దొడ్డురకం సేకరించాలని ఆదేశించారు. కానీ మిల్లు యజమాని మాత్రం దొడ్డు వడ్లను నిరాకరించారు. ఎందుకని ప్రశ్నించిన రైతులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ.. తిప్పిపంపిస్తున్నట్లు సమాచారం. అనుకూలమైన వారివే సేకరణ తమకు అనుకూలమైన రైతుల వడ్లను మాత్రమే కొనుగోలు చేసి, మిగతా వారివి కొనడం లేదని పలువురు ఆరోపించారు. కాదూకూడదు తీసుకోవాలని అన్నవారిని తాలు, తరుగు పేరుతో ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. మీ వడ్లు తీసుకుంటే నూకలు అవుతున్నాయని, కొనే ప్రసక్తి లేదంటూ తిప్పి పంపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, మిల్లు యాజమాన్యం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.లేని పక్షంలో పరిగి– మహబూబ్నగర్ ప్రధాన రోడ్డుపై ట్రాక్టర్లను బెట్టి ధర్నా చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. -
ముగిసిన బాలవికాస్ శిక్షణ
ధారూరు: మండల పరిధి కేరెళ్లిలో సత్యసాయి సార్వజనిక కేంద్రంలో ఏప్రిల్ 24 నుంచి నిర్వహించిన వేసవి బాలవికాస్ వేసవి శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. 130 మంది బాలబాలికలు శిక్షణ పొందారు. కార్యక్రమంలో చిన్నారులకు తెలుగు రాయడం, ఇంగ్లిష్లో మాట్లాడటం, క్రీడల్లో శిక్షణ, గణితం, కంప్యూటర్ బేసిక్స్, సాంస్కృతిక, కాలిగ్రఫిలో తర్ఫీదునిచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్సింగ్ ఠాగూర్, రాష్ట్ర లిఖిత నామావళి సమన్వయకర్త జగన్నాథరావు, కేరెళ్లిశాఖ అధ్యక్షుడు రఘునందన్, ప్రధాన కార్యదర్శి ప్రేంకుమార్, కన్వీనర్లు వీరేశం, రామకృష్ణారెడ్డి, నాగరాజులు, పదాధికారులు, సేవాదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అరెస్ట్లు అప్రజాస్వామికం
దోమ: మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. బిల్లుల చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం నగరంలోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర ఏళ్లు గడుస్తున్నా.. బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. నాడు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి చేశారని, ఇప్పుడు వాటికి వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ప్రతి ప్రతినిధికి రూ.లక్షల పైనే రావాలని, ప్రభుత్వం చొరవ చూపి వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని, పాలన సాగించడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటన్నారు. -
‘ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికే మా మద్దతు’
యాలాల: నామినేటెడ్ పోస్టుల కేటాయింపుల్లో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సూచించిన వ్యక్తికే తమ మద్దతు, సహకారం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. యాలాల సొసైటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ బీ–బ్లాక్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు చెన్నారం అనిల్కుమార్గుప్తా పేరును ఎమ్మెల్యే సిఫార్సు చేశారని.. ఎమ్మెల్యే సూచించిన నాయకుడికే తాము మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్, మాజీ అధ్యక్షుడు గురురాజ్ జోషి, బీమప్ప తదితరులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చెన్నారం మల్లయ్య, ముకుందాపూర్ సాయిలు, నర్సింలు తదితరులు ఉన్నారు. -
పేదలకు వరం ‘ఇందిరమ్మ’
కొడంగల్ రూరల్: పేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు అని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ కుమార్ అన్నారు. సోమవారం మండల పరిధి పెద్దనందిగామలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్డీఓ అనిత, సర్పంచ్ చన్బస్కుమార్, హౌజింగ్ శాఖ అధికారులతో కలిసి ఐదుగురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అందిరికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆనంద్రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. పంట నమోదు తప్పనిసరి తాండూరు రూరల్: రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని ఎంపీడీఓ విశ్వప్రసాద్ అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో జీపీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫార్మర్ రిజిసీ్ట్ర చేయడంలో పంచాయతీ కార్యదర్శులు భాగస్వామ్యం ఉందన్నారు. ఆయా గ్రామాలకు ఏఈఓలు వస్తున్న క్రమంలో చాటింపు వేసి, పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పంట నమోదుపై అవగాహన కల్పించాలని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని, లేని పక్షంలో రాయితీలు అందవని చెప్పారు. సర్ మ్యాపింగ్లో బీఎల్ఓలకు సహకరించాలని చెప్పారు. ప్రజావాణికి ఒక్క దరఖాస్తు బంట్వారం: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు వచ్చింది. ఏమైనా సమస్యలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవాలని ఎంపీడీఓ రాములు ప్రజలకు సూచించారు. అందుబాటులో జనుము విత్తనాలు తాండూరు రూరల్: రైతులకు అందుబాటులో జనుము విత్తనాలు ఉన్నాయని పెద్దేముల్మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ ప్రీతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 కిలోల బస్తా రూ.3,110 ధర ఉందన్నారు. బస్తా జనుము 2.5 ఎకరాలకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు.. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు, ఫోన్ నంబర్తో ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. ఏడీఏగా అరుణ తాండూరు రూరల్: వ్యవసాయ శాఖ తాండూరు డివిజన్ ఏడీఏగా కె.అరుణ నియమితులయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగానిజామాబాద్ జిల్లా బాన్సువాడలో పనిచేస్తున్న ఆమె.. ఇక్కడి వచ్చారు. గతంలో ఇక్కడపనిచేసిన ఏడీఏ రుద్రమూర్తి.. 11 నెలల క్రితం పదోన్నతి పొంది.. వెళ్లిపోయారు. ఆయన స్థానంలో నాటినుంచి మండల వ్యవసాయ శాఖ అధికారి కొమురయ్య ఇన్చార్జి ఏడీఏగా కొనసాగారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆరుణ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. -
అగ్నివీర్లకు సన్మానం
దుద్యాల్: దేశ సేవే చేసేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని సినీ నటుడు, బాహుబలి ఫేం కాలేకయ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ నుంచి అగ్నివీర్లుగా ఎంపికై న సాయితేజ, అశోక్, రాకేశ్, నవీన్, హన్మంత్ను సోమవారం ఆయన గ్రామస్తులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామంలో వంద మందికి పైగా దేశ సేవలో ఉన్నారని యువత వీరి స్ఫూర్తితో మరింత మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దౌల్తాబాద్ మల్లేశ్, గ్రామస్తులు ఆంజనేయులు, నర్సింలు, గోవర్ధన్, నరేశ్, రాజు, శ్రీశైలం, రమేశ్, సుధాకర్, వినోద్, మైపాల్ రెడ్డి, శంషీర్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్తోనే సొంతింటి కలసాకారం
తాండూరు రూరల్: కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాకారమవుతోందని చెన్గేస్పూర్ సర్పంచ్ ప్రవీణ్కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం గ్రామంలో ఎంపీడీఓ విశ్వ ప్రసాద్తో కలిసి లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి చొరవతో గ్రామానికి 144 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 23 ఇళ్లు పూర్తికాగ.. 58 ఇళ్లు ప్రోగ్రెస్లో ఉన్నాయని పేర్కొన్నారు. రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు కానున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ గణేశ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు శ్రీశైలం గౌడ్, పంచాయతీ కార్యదర్శి వీరప్ప, వార్డు సభ్యులు గుండప్ప, నాయకులు నరేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించం
పరిగి: నియోజకవర్గంలో దళిత, గిరిజనులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని. దీన్ని సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య అన్నారు. పలువురు బాధితులతో కలిసి సోమవారం పరిగిలో ప్రజాసంఘాలు, విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత, గిరిజనుల భూములపై కన్నేసిన కొంత మంది అధికార పార్టీ నాయకులు అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి సర్వేనంబర్ 100లో భూమిని కొనుగోలు చేసిన అంగోత్ గణేశ్, విజయరాజు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు ఈ పొలంలోకి ప్రవేశించి, కులం పేరుతో దూషిస్తూ షెడ్డుతో పాటు వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేశారన్నారు. ఈ విషయమై బాధితులు చన్గోముల్ పీఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు బాధితులపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈవిషయమై ఎస్సీ, ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినా, దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. రాజకీయ నేతలకు వత్తాసు పలుకుతూ సదరు భూములను అమ్మేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నియోజకవర్గ నాయకుడు ఒకరు ఈ విషయంలో తలదూర్చి బాధితులపై పోలీసులతో ఒత్తిడి చేయిస్తున్నాడని మండిపడ్డారు. పూడూరు గ్రామానికి చెందిన రమేశ్ను కుల వివక్షకు గురిచేసినా, ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. అలాగే పరిగిలోని సర్వే నంబర్ 214లో నర్సింహులు అనే వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలా అనేక ఘటనల్లోనూ బాధితులనే నేరస్తులుగా చూస్తున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. సరైన స్పందన రాకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాాధికారి చంద్రయ్య, నాయకులు సత్తయ్య, రమేశ్, గణేశ్, విజయరాజు, సాయిబన్న, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. చిట్టెంపల్లి భూ వివాదంలో అధికార పార్టీ నేత జోక్యం తగదు అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తున్న పోలీసులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య -
అ‘పూర్వ’ సమ్మేళనం
దౌల్తాబాద్: మండల పరిధి కౌడీడ్ గ్రామ శివారులో కొనసాగుతున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. సమాచారం మేరకు దాడి చేసి, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4100ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నామని ఎస్ఐ వేణు కుమార్ తెలిపారు. ధారూరు: పట్టణంలోని ఠాణా సరికొత్తగా ముస్తాబైంది. పోలిస్స్టేషన్ అనగానే అమ్మో అనేవారి సైతం చూపు తిప్పుకోనియకుండా తీర్చిదిద్దారు. తొలుత లైట్ ఆరెంజ్ కలర్ఉండగా.. దాని స్థానంలో లైట్ బ్లూ, బార్డర్కు ముదురు నీలిరంగు వేయించారు. దీంతో వివిధ కేసుల నిమిత్తం వచ్చే వారు.. హౌస్ బాగుందని కితాబిస్తున్నారు. చుట్టూ చెట్లతో కూడిన ప్రదేశాన్ని ఆస్వాదిస్తున్నారు. తాండూరు రూరల్: పురుగు మందు తాగి చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం ఖానాపూర్ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రవీందర్(26), హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 25న ఖానాపూర్కు వచ్చాడు. అదే రోజు పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిగి: మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మోహన్కృష్ణ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ అనంతమ్మ(55) చిన్నకుమారుడికి అనారోగ్య సమస్యలు తలెత్తండంతో చికిత్స నిమిత్తం అప్పులు చేసింది. రోగం నయం కాక రెండేళ్ల క్రితం కుమారుడు మృతి చెందాడు. అంతకు ముందే భర్త మరణించాడు. అప్పటి నుంచి మానసిక వేదనతో పాటు అప్పుల భారంతో మనోవేదనకు గురైంది. ఇటీవల గ్రామంలో ఇంటి జాగను అమ్మి కొంత అప్పు తీర్చింది. మిగిలిన అప్పు తీర్చే మార్గం లేక శనివారం రాత్రి పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకుంది. గమనించిన పక్క పొలంవారు కుటింబీకులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కడ్తాల్: దైవ దర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన షాద్నగర్–కడ్తాల్ ప్రధాన రహదారిపై మక్తమాధారం సమీపంలో చోటు చేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట గ్రామానికి చెందిన బోడనంపల్లి శివ(23), తన స్నేహితులైన పాపిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సురమోని పవన్కుమార్, అనిల్, పవన్ కలిసి ఆదివారం సాయంత్రం మైసిగండి మైసమ్మను దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో మక్తమాధారం గ్రామ శివారులోకి చేరుకోగానే కారు నడుపుతున్న అనిల్ అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. పవన్కుమార్, పవన్లకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శివ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
లంగర్హౌస్/షాద్నగర్రూరల్: స్నేహితుడితో సరాదాగా బయటకు వెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రాంబాబు తెలిపిన మేరకు.. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎల్లికట్ట గ్రామానికి చెందిన బెంది శ్రీనివాస్ రెడ్డి ఏకై క కుమారుడు సృజన్ రెడ్డి(21) ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుకుంటూ బీఎన్ రెడ్డి నగర్లోని వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం ద్విచక్ర వాహనంపై మిత్రుడితో కలిసి హైటెక్ సిటీకి బయల్దేరాడు. టోలీచౌకి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. కింద పడ్డ సృజన్ పై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న వంశీ రెడ్డికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలికట్టలో విషాదఛాయలు రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాస్రెడ్డి పాడి ఆవులను పోషిస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. మరో రెండు నెలల్లో కోచింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగం సాధిస్తాడని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ విధి మృత్యురూపంలో కొడుకును కబళించింది. సృజన్రెడ్డి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ముగిసిన జాతర
తాండూరు రూరల్: నెల రోజులుగా కొత్లాపూర్ శివారులో కొనసాగిన రేణుకా ఎల్లమ్మ జాతర ఆదివారంతో ముగిసింది. మే 1వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలకు ప్రతీ మంగళ, శుక్రవారాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లా వాసులతో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మే 15న రథోత్సవం, సిడే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. చివరి రోజు ఆదివారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. జాతరకు సహకరించిన ప్రతీ ఒక్కరికి పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రతీ పౌర్ణమి, అమా వాస్యకు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల ప్రవీణ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ శేఖర్ గౌడ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు సుజాత, నర్సింలు, పుఠ్యానాయక్, రాజుగౌడ్, రాజు, లక్ష్మి, నిర్వాహకు లు సాయిలు, వెంకట్రెడ్డి, రాజు, శంషొద్దీన్, రేణు క, రవి, పూజారి శ్రీనివాస్ పంతులు పాల్గొన్నారు. -
పచ్చని కుటుంబంలో భూ చిచ్చు
● రెండు ఎకరాలపట్టామార్పిడితో ఘర్షణ ● పరస్పర దాడులు, పోలీసులకు ఫిర్యాదు ● గొట్టిగఖుర్ధులో ఘటన బషీరాబాద్: పచ్చని కుటుంబంలో భూ వివాదం చోటుచేసుకుంది. తల్లి పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాలను కూతురు పేరుపై మార్చడం.. తల్లి, కొడుకు, కూతురు మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి గొట్టిగఖుర్దు గ్రామానికి చెందిన నక్క మానెమ్మ, వెంకటప్ప దంపతులకు నలుగురు సంతానం. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో వెంకటప్ప మృతి చెందాడు. పెద్ద కుమారుడు రాములు జీవన్గీ గ్రామానికి ఇల్లరికం వెళ్లగా, పెద్ద కుమార్తె వివాహం అయింది. చిన్న కుమారుడు చెన్నప్ప భార్య శివలీల, ముగ్గురు పిల్లలతో నగరంలో నివసిస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 23న మానెమ్మ రెండు ఎకరాల భూమిని చిన్న కుమార్తె మంజుల పేరిట సెల్డీడ్ చేయించింది. విషయం తెలిసిన చెన్నప్ప ఈ నెల 29న గ్రామానికి వచ్చి తల్లిని ప్రశ్నించాడు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా.. తల్లితో పాటు అక్క మంజుల తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని చెన్నప్ప.., చెన్నప్ప, అతని దాయాది నవీన్ కలిసి తనను, తన కుమార్తైపె దాడి చేశారని మానెమ్మ ఆదివారం బషీరాబాద్ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫిర్యాదు దారులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆచితూచి విచారణ చేపడుతున్నారు. -
విద్యుదాఘాతంతో పశువుల మృతి
మొయినాబాద్రూరల్: విద్యుదాఘాతంతో మూడు దూడలు, ట్రాక్టర్, పశువుల మేత దగ్ధమైన సంఘటన మండలంలోని చందానగర్లో ఆదివారం చోటు చేసుకుంది. చందానగర్ గ్రామానికి చెందిన రాజేష్ పశువుల పాకలో మధ్యాహ్నం ట్రాక్టర్, పశువులకు వేసే సొప్ప కరెంటు షాక్తో దగ్ధమైంది. ఎండలు జోరుగా ఉండడంతో మూడు దూడలు సజీవంగా దహనం అయ్యాయి. అదే విధంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు సైతం తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపు రూ.20–22 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులతో పాటు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. -
ఆదివారం ఆ కార్యాలయానికి సెలవు!
పరిగి: నిరంతరం విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు తమ కార్యాలయానికి తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. పట్టణ కేంద్రం తుంకుల్గడ్డలోని ఎకై ్సజ్ కార్యాలయానికి ఆదివారం మధ్యాహ్నం తాళం వేసి ఉండటంతో.. వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారులకు ఫోన్ చేయగా.. పొంతన లేని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి, ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమైఎకై ్సజ్ సీఐ నీరజాదేవిని వివరణ కోరగా.. విధుల్లో సిబ్బంది ఉన్నారని, ఏదైనా పని ఉంటే బయటకు వెళ్లిఉండవచ్చని పేర్కొన్నారు. -
సారీ.. నో కేబుల్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అండర్ గ్రౌండ్ (యూజీ) విద్యుత్ కేబుళ్ల సరఫరాపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) చేతులెత్తేసింది. కొత్త విద్యుత్ కనెక్షన్లలో భాగంగా ఆరు నెలల క్రితమే యూజీ కేబుళ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మెటీరియల్ కోసం పలువురు వినియోగదారులు డీడీ రూపంలో డిస్కంకు డబ్బులు చెల్లించారు. కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కేబుళ్లు సరఫరా చేయలేమని, మీరే కొనుగోలు చేసుకోవాలని, భవిష్యత్తులో రాబోయే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆయా దరఖాస్తుదారులకు లేఖలు కూడా పంపింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తలెత్తిందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ప్రతి నెలా 30 వేలకుపైగా దరఖాస్తులు గ్రేటర్ జిల్లాల్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం 65 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. టీజీఐపాస్, టీఎస్ ఐపాస్ ద్వారా ప్రతినెలా కొత్త కనెక్షన్ల కోసం 30 వేలకుపైగా దరఖాస్తులు వస్తున్నాయి. వీటిలో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. కాగా.. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో ఇప్పటికే ఇళ్ల మధ్య ప్రమాదకరంగా మారిన ఓవర్హెడ్ (ఓహెచ్) లైన్లు స్థానంలో కొత్తగా యూజీ కేబుళ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని విల్లాలు, వెంచర్లలోనూ యూజీ కేబుళ్లు వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో బిల్డర్లు, యజమానులు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుదారు సగటున రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డీడీ రూపంలో చెల్లించారు. వీటిలో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు 350 పైగా ఉండగా, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణదారులు, వెంచర్ నిర్వాహకులు 500 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఆరు నెలల క్రితం డబ్బులు చెల్లించినప్పటికీ యూజీ కేబుల్ సహా డీటీఆర్లను సరఫరా చేయలేదు. పెరిగిన ధరలతో బెంబేలు ఆరు నెలల క్రితం దరఖాస్తు సమయంలో మీటర్ కేబుల్ ధర రూ.1,143 ఉండగా, ప్రస్తుత బహిరంగ మార్కెట్లో రూ.1,843కు చేరింది. పెరిగిన ధరల నేపథ్యంలో కేబుళ్లను సరఫరా చేయలేమని డిస్కం చేతులెత్తేసింది. స్వయంగా కొనుగోలు చేసుకోవాల్సిందిగా ఆయా దరఖాస్తుదారులకు సూచించింది. ఇప్పటికే 100 శాతం డబ్బులు కట్టినవారికి మళ్లీ అదనంగా 10 శాతం సూపర్వైజింగ్ చార్జీలు సహా మరో 10 శాతం బ్యాంకు గ్యారంటీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం ఎంత వరకు సమంజసమని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలల క్రితం డీడీ కట్టినా ఫలితం శూన్యం దరఖాస్తుదారులే కొనుక్కోవాలని ఆదేశం ఆ మొత్తాన్ని బిల్లులో సర్దుబాటు చేస్తామని ప్రకటన -
వేతనంలో కోత సమంజసం కాదు
● హెల్త్ కార్డుల పేరిట మోసం చేసిన ప్రభుత్వం ● తపస్ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ తాండూరు టౌన్: హెల్త్ కార్డుల జారీ పేరిట ప్రభుత్వం ముందస్తుగా ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం సమంజసం కాదని తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగమేశ్వర్, గాజుల బస్వరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో ఆక్షేపించారు. హెల్త్కార్డుల జారీ విధివిధానాలు, ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ఏకంగా ప్రీమియం డబ్బులను ముందుగానే తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఆ డబ్బును వెంటనే తమ ఉద్యోగుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. స్కీం ఇష్టం లేని వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచి మాత్రమే ప్రీమియం వసూలు చేయాలని సూచించారు. యువతీ, యువకులకు హెల్త్ కార్డు వర్తించేలా 25 నుంచి 35 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలన్నారు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన ప్రీమియం వర్తింపచేయాలన్నారు. సందేహాలు తీర్చకుండానే.. యాలాల: ఉపాధ్యాయుల సందేహాలు తీర్చకుండా, డీడీఓల అనుమతి లేకుండా హెల్త్కార్డుల ప్రీమియం పేరిట వేతనంలో కోత విధించడం తగదని తపస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒంగోనిబాయి శ్రీనివాస్, శ్రీశైలం అన్నారు. కార్డుల విధి విధానాలు, ఆస్పత్రుల వివరాలు, ఎలాంటి రోగాలకు వైద్యం, ఎంత మేర ఉచిత వైద్యం తదితర అంశాలు తెలపకుండా, డబ్బులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయం మంచిదికాదని హితవు పలికారు. -
అవినీతిపరులు మీరంటే మీరే
దౌల్తాబాద్: అవినీతిపరులు మీరంటే మీరేనని అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకుంటున్నారని గులాబీ శ్రేణులు ఆరోపించగా.. నిరూపిస్తే దేనికై నా సిద్ధమంటూ కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగారు. మీ హయాంలోనే కమీషన్లు తీసుకున్నారని ప్రత్యారోపణలు చేశారు. తాడోపేడో తేల్చుకుందామంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తేల్చుకుందాం రండి.. మండల పరిధి పలు గ్రామాల్లో బీటీరోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం అంతారం సమీపంలో వేసిన రోడ్డు భారీ వర్షానికి కల్వర్టు వద్ద కొట్టుకుపోయింది. దీనికి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్ వీడియోలు తీశారు. సీఎం రేవంత్రెడ్డి, సోదరుడు తిరుపతిరెడ్డి కమీషన్లు పుచ్చుకోవడంతోనే పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీనిని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సీఎం కుటుంబం కమీషన్ తీసుకోలేదని, మీలాంటి నాయకులు మా పార్టీలో లేరని విమర్శించారు. ప్రతిగా బీఆర్ఎస్ నాయకుడు కోట్లమహిపాల్.. మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ తమకుసంస్కారం నేర్పించారన్నారు. మీలాగా వ్యక్తిగత విమర్శలు చేయమని చెబుతూనే.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో మండలంలో రాజకీయం వేడెక్కింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తమ నాయకులు ఎక్కడ కమీషన్ తీసుకున్నారో..? మీ నాయకులు కమీషన్లు ఎక్కడ తీసుకున్నారో శివాజీ చౌరస్తాలో తేల్చుకుందాం రండని సవాల్ విసిరారు. కాగా.. ఇరు పార్టీల మధ్య జరుగుతున్నపంచాయితీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అసలు విషయం గురించి ఆరాతీశారు. ఇష్టానుసారంగా మాట్లాడుకోవద్దని, సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం. బీఆర్ఎస్– కాంగ్రెస్ నాయకుల మాటల యుద్ధం తారా స్థాయికి పంచాయితీ -
శోభాయమానంగా రుద్రహోమం
కుల్కచర్ల: పాంబండ రామలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేకపూజలు కొనసాగుతున్నాయి. ప్రతీ పౌర్ణమికి నిర్వహించే రుద్రహోమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేకపూజలు చేసి, హోమం నిర్వహించారు. అన్నప్రసాద వితరణ చేశారు. ప్రతీ పౌర్ణమికి కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, సర్పంచ్ మడుగు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్దన్ రెడ్డి తెలిపారు. పూజారి దశరథం, పాండు ఉన్నారు. కుల్కచర్ల: ఆర్ఎస్ఎస్ ప్రారంబిక వర్గ కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహించనున్నామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఖండ కార్యవాహ కంకంటి ఆంజనేయులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడారు. జాతీయ భావాలు గల యువతకు మూడురోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. రేపు మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు. కుల్కచర్ల, చౌడాపూర్, దోమ మండలాలకు చెంది, 55 సంవత్సరాల లోపు వారందరూ అర్హులేనని, మరిన్ని వివరాలకు 99127 66638, 9502028991 నంబర్లను సంప్రదించాలని సూచించారు. దుద్యాల్: మండల పరిధి పోలేపల్లి ఎల్లమ్మ ఆయలం ఎండోమెంట్ అధికారిగా శాంతి కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఈఓ రాజేందర్రెడ్డి.. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో రిమాండ్లో ఉన్నారు. దీక్షను జయప్రదం చేయండి: టీజేఎంయూ పరిగి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం నగరంలోని ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న దీక్షను జయప్రదం చేయాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. విలీనానికి కొందరు కుట్రదారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీంతో యూనియన్ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే విలీనం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. నేటి నిరసన కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కొత్తూరు: పార్టీలు, రాజకీయాలకతీతంగా సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటును అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని డంప్యార్డు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ కోరారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన పలువురు నాయకులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి డంప్యార్డు ఏర్పాటుకు జీహెచ్ఎంసీకి కేటాయించిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంప్యార్డు ఏర్పాటును నిరసిస్తూ సిద్ధాపూర్ నుంచి సోమవారం ఉదయం 8 గంటలకు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. పాదయాత్రకు పార్టీలకతీతంగా పరిసర గ్రామాల ప్రజలు, యువకులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్యార్డు ఏర్పాటు చేయొద్దన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, జీవోల ఉపసంహరణ వచ్చే వరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల అభివృద్ధి, ప్రాణాలకు డంప్యార్డు ప్రాణసంకటంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జేఏసీకి టీఆర్ఎస్ మద్దతు డంప్యార్డు ఏర్పాటును అడ్డుకోవడానికి జేఏసీతో కలిసి పోరాటం చేయడానికి షాద్నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి సీమల రమేశ్ కురుమ మద్దతు ఇచ్చినట్లు జేఏసీ అధ్యక్షుడు అంబటి ప్రభాకర్ తెలిపారు. డంప్యార్డు ఏర్పాటైతే స్థానికులతో పాటు సమీపంలో ఉన్న పదుల సంఖ్యలో గ్రామాలు అన్ని విధాలుగా నష్టపోతాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి తాము చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, యువజన సంఘాలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. -
‘రాళ్లను ఈనుతున్న నేల’ పుస్తకావిష్కరణ
తాండూరు టౌన్: తాండూరు ప్రాంత సంస్కృతి, వైభవం, చారిత్రక ఆనవాళ్లపై పట్టణానికి చెందిన కవి గాజుల పవన్ కుమార్ రాసిన ‘రాళ్లను ఈనుతున్న నేల’ పుస్తకాన్ని ఆదివారం కట్టమైసమ్మ దేవాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వరలక్ష్మి మాట్లాడుతూ.. మాతృభూమి వైభవాన్ని అవలోకనం చేసుకుని గ్రంథం రాయడం అభినందనీయమన్నారు. కవులు సీహెచ్ నారాయణ రెడ్డి, మడపతి సిద్ధి లింగయ్య, ద్యావరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు పుడమి గర్భంలోని గనుల చరిత్ర, పరవళ్లు తొక్కే కాగ్నానది ప్రవాహ తీరు, కమ్మదనాన్నిచ్చే కందిపప్పు, పలు గ్రామాల్లోని చారిత్రక కట్టడాలు, ఆలయాల ప్రత్యేకతను కవి చెప్పిన విధానం చాలా బాగుందన్నారు. ఈ ప్రాంత ప్రత్యేకత, గొప్పదనాన్ని పుస్తక రూపంలో చాటి చెప్పారని కొనియాడారు. గ్రంథానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డి, రచయిత దోరవేటి ముందుమాట రాశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఊరిని ప్రేమించే తత్వం పుస్తకంలో కనపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు కోస్గి తిప్పయ్య, వియ్కుమార్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
అల్లనేరేడు.. లాభాలు బోలెడు
● వేసవిలో విరివిగా లభించే పండ్లు ● పలు రకాల వ్యాధులు దూరం ● మార్కెట్లో మంచి డిమాండ్ షాబాద్: తియ్యదనం, పులుపు, వగరు మేలు కలయికే అల్లనేరేడు పండ్లు. నల్లగా నిగనిగలాడే పండ్లను చూస్తే ఎవరికై నా నోరూరాల్సిందే. సహజసిద్ధంగా లభించే వాటిలో అల్లనేరేడు పండ్లు ఒకటి. ప్రకృతిలో లభించే పండ్లు ఎన్ని ఉన్నా సరే సినీ, జానపద గేయ రచయితలు మాత్రం అల్లనేరేడు పండ్లపై పాటల రూపంలో బాణీలు కట్టడం విశేషం. ఆరోగ్య ప్రయోజనాలు ● ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉండేందుకు నేరేడు పండ్లు ఎంతో ఉపయోగపడుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్నవాళ్లకు ఇవి చాలా మంచివి. ● మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు ఈ పండ్లు తింటే ఉపశమనం లభిస్తుంది. ● గర్భిణులు తింటే తల్లి, బిడ్డకు చాలా మంచిది. దీని వల్ల మెదడు చురుగ్గా ఉండటంతో పాటు హార్ట్ బీట్ చక్కగా ఉండేందుకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ● నేరేడులో విటమిన్ సీ, ఏ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది. ● క్యాల్షియం, పొటాషియం. ఐరన్, విటమిన్ సీ అధిక మోతాదులో ఉండడంతో రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ● ఈ నేరేడు చెట్టు ఆకులను దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకొని పుక్కిలిస్తే దంత, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. ● నేరేడు పండ్లకు రక్తాన్ని శుద్ధి చేసే గుణంతో పాటు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే గాయాలు త్వరగా మానుతాయి. -
స్లిప్ రాక.. వివరాలు తెలియక
దౌల్తాబాద్: ఉపాధిహామీ పథకంలో అమలు అవుతున్న నూతన నిబంధనలు కూలీలకు ఇబ్బందిగా మారాయి. ఎంత పనిచేశామో, ఖాతాలో కూలీ డబ్బులు ఎంత జమయ్యాయో తెలిపే పే స్లిప్పుల పంపిణీ నిలిచిపోయింది. దీంతో వేతనం ఎంతవచ్చిందో తెలుసుకోవడం కష్టంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. చదువు రాదని, స్లిప్పులు ఉంటే మా పిల్లలకు చూపించి తెలుసుకునేవారని తెలిపారు. ఇటు స్లిప్పులు రాక.. అటు యాప్లపై అవగాహన లేక వివరాలు తెలుసుకోలేక పోతున్నామని, ఇలా అయితే దళారుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిరోజులు పనిచేశారు.. నాలుగేళ్ల క్రితం వరకు కూలీలకు పే స్లిప్లు ఇచ్చేవారు. పలు కారణాలు చూపుతూ ప్రస్తుతం పంపిణీ నిలిపివేశారు. స్లిప్లో కూలి పేరు, పని ప్రదేశం, ఎన్ని రోజులు పని చేశారు, రోజువారి వేతనం ఎంత తదితర వివరాలు వచ్చేవి. వంద రోజుల పని దినాలు పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయనేది ఉండేది. ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారు, ఎంత వేతనం వస్తుందో స్పష్టంగా పేర్కొనేది. ఇప్పుడు స్లిప్లు లేకపోవడంతో అలాంటి వివరాలు ఏవీ వారికి తెలవడం లేదు. తెలిస్తే ఒక వారం తక్కువ డబ్బులు పడినా.. తదుపరి వారం గరిష్టం వేతనం కోసం పనిచేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. నష్టపోయే అవకాశం ఉపాధి పనులకు సంబంధించిన నిధులను పోస్టాఫీసు లేదా బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తుంటారు. మండలంలో చాలా వరకు పోస్టాఫీసు ఖాతాల్లోనే జమవుతున్నాయి. కూలీలకు ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ వారాల పేమెంట్లు జమ చేస్తుంటారు. అయితే నిరక్షరాస్యులైనా కూలీలు అధికంగా ఉండడంతో ఖాతాల్లో ఎంత నగదు జమ అయిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. గతంలో బీపీఎంలు నగదు విత్డ్రా సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే చాలామంది మినీబ్యాంకులకు వెళ్తున్నారు. అక్కడ ఆధార్కార్డును తీసుకెళ్తే కొంతమంది ఎక్కువ నగదు జమ అయినా.. తక్కువ వచ్చిందని నగదు ఇస్తున్నారు. కాగా.. కూలీల వేతనాల వివరాలను జన్మన్ రేగా యాప్లో పొందుపరుస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో కూలీలకు అవగాహన లేకపోవడంతో అంతగా ఉపయోగం లేదు. ప్రస్తుతం ఉపాధి కూలీలకు పేస్లిప్లు ఇవ్వడం లేదు. వారి వేతన వివరాలను ఎప్పటికప్పుడు జన్మన్రేగా యాప్లో పొందుపరుస్తున్నాం. యాప్పై క్షేత్రస్థాయిలో మా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. మండలంలో కూలీల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నాం. –అంజిలయ్య, ఏపీఓ, దౌల్తాబాద్ యాప్పై అవగాహన లేకఇబ్బంది పడుతున్న కూలీలు పని, ఫలితం వివరాలు ఆన్లైన్లోనే నిరక్షరాస్యులకు తప్పనితిప్పలు 2005 నుంచి అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి వంద రోజుల పని దినాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది జూలై 1నుంచి దీని స్థానంలో వీబీ జీ రామ్జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్) చట్టాన్ని అమలు చేయనున్నారు. పని దినాల సంఖ్య 125 రోజులకు పెంచనున్నారు. -
సేకరణ.. నత్త నడకన
● కేంద్రాల్లో కర్షకుల నిరీక్షణ ● వడ్లను ఆరబెడుతూ అక్కడే బస దుద్యాల్: ‘అన్నదాతలు ఆందోళన చెందవద్దు. కొనుగోళ్లలో వేగం పెంచాం. తడిసిన ధాన్యంతో పాటు.. చివరి గింజవరకు కొనుగోలు చేస్తాం’ అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవరూపం దా ల్చడం లేదు. ఇంకా సేకరణ నత్తనడకనే సాగుతోంది. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, తడిసిన గింజలను ఆరబోస్తూ రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు కర్షకులు ఈ బాధలన్నీ భరించలేక చివరకు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. దళారుల ఇష్టారాజ్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం క్వింటాకు రూ. 2,389లు ఉందని ఆశించిన రైతులకు.. సేకరణలో జరుగుతున్న జాప్యంతో చేసేది లేక ప్రైవేట్ మిల్లర్లు, వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న దళారులు సిండికేటుగా మారి.. అమాంతం ధర తగ్గించేసి ఎండిన వడ్లను క్వింటా రూ. 1,950లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ మద్దతు ధరతో పోలిస్తే.. రూ.439 తక్కువ. తడిసిన వడ్లను క్వింటాలుకు రూ.1600 నుంచి రూ.1,750ల వరకు సేకరిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో ఆశించిన ధర కష్టమేనని భావించిన కర్షకులు ఇష్టంలేకపోయినా వచ్చిన ధరకు అమ్మేందుకు మక్కువ చూపుతున్నారు. మరి కొందరు ధరలో చాలా వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ కొనుగోలుకేంద్రాల్లోనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉండగా.. వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతోందని, తగిన పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నామని, యాసంగి వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఘనంగా మైసమ్మ బోనాలు
చేవెళ్ల: మండలంలోని కమ్మెటలో గత రెండు రోజులుగా గ్రామ దేవతల పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామస్తులు ఆదివారం బోనాలు ఉత్సవాలు నిర్వహించారు. పూజల్లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని అమ్మవార్లను దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి ఉత్సవాలతో ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. గ్రామస్తులందరూ కలిసిమెలసి వేడుకలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఉత్సవాలకు విచ్చేసిన అతిథులను నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మకృష్ణగౌడ్, మాజీ సర్పంచ్ హన్మంత్రెడ్డి, గ్రామ యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, మండలంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
సేవలు భారం.. ఖాతాదారులకు శాపం
వికారాబాద్: బ్యాంకులకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. చిన్న పని ఉండి వెళ్లినా సగం రోజు అక్కడే గడపాల్సిందే.. జిల్లాలో మొత్తం 87 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 27(ఎస్బీఐ), 12(యూనియన్), 6(కెనరా) 5(బ్యాంక్ ఆఫ్ బరోడా) 25(తెలంగాణ గ్రామీణ బ్యాంకులు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి చొప్పున ఉన్నాయి. 2, పంజాబ్ నేషనల్ బ్యాంకులతోపాటు 7 డీసీసీబీలు, 17 ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. జిల్లాలో బీసీసీ (బిజినెస్ కరస్పాండెంట్ సెంటర్లు) ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 147 ఉండగా.. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి 868 ఉన్నాయి. సేవల విషయంలో ప్రైవేటు బ్యాంకుల పరిస్థితి మెరుగ్గా ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కువ మంది ఖాతాలు ఉన్న ఎస్బీఐలో సేవల మాత్రం అంతంతే అని చెప్పవచ్చు. గంటల తరబడి క్యూలోనే.. బ్యాంకుల్లో నగదు లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయి. పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేయాల్సి ఉన్నా.. బదలాయించాల్సిన సమయంలో మాత్రమే బ్యాంకులకు వెళ్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన లేని కొందరు మాత్రమే బ్యాంక్ మెట్లు ఎక్కుతున్నారు. ఎక్కువ మంది ఆన్లైన సేవలను వినియోగించుకుంటున్నారు. చిన్న మొత్తం అవసరమైన వారు సైతం బీసీఎస్(బిజినెస్ కరస్పాండెంట్ సెంటర్లు)లకు వెళ్లి ఆధార్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. కొత్త ఖాతాలు తెరిచేందుకు, కేవైసీ, ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవటం కోసం, లోన్లు, రెన్యువల్ కోసం మాత్రమే బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ సేవలు ఐదు నుంచి పది నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చు. కానీ రెండు మూడు గంటల సమయం పడుతుండటంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక లోన్ల కోసం ఎన్ని రోజులు తిరగాలో కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. క్యూలో గంటల తరబడి వేచి చూసి కౌంటర్ వద్దకు వెళ్లాక అక్కడ కాదు పక్క కౌంటర్కు వెళ్లాలని సూచించటం ఖాతాదారులకు చికాకు తెప్పిస్తోంది. లైన్లో ఉన్న వారిని పట్టించుకోకుండా పరిచయం ఉన్న వ్యక్తులు వస్తే వెంటనే పని చేసి పంపుతుండం ఖాతాదారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ విషయమై తరచూ సిబ్బందితో వాదనకు కూడా దిగుతున్నారు. చదువురాని కష్టమర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం ఫాం కూడా నింపి ఇవ్వడం లేదు. మధ్యవర్తులదే హవా చిన్న చిన్న పనుల కోసం బ్యాంకులకు వెళ్లే సాధారణ జనం ఇబ్బందులు పడుతుండగా పరిచయస్తులు, మధ్యవర్తులు వస్తే మాత్రం సకల మర్యాదలు చేసి వారి పనులు చేసి పంపుతున్నారు. మొండి బకాయిలలో వన్ టైం సెటిల్ మెంట్లు, ఆయా రకాల రుణాలు, పంట రుణాలు, రుణాల రెన్యువల్ లాంటి సేవలు పొందాలంటే మధ్యవర్తులతో వెళ్తేనే పనులు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి బ్యాంకులో ఐదారుగురు మధ్యవర్తులు కనిపిస్తుండగా రైతులకు రుణాలిచ్చే విషయంలో మాత్రం గ్రామానికి ఇద్దరు ముగ్గురు బ్రోకర్లు తయారయ్యారు. వీరు కమీషన్లు తీసుకుని రుణాలిప్పిస్తున్నారు. బ్యాంక్ అధికారులకు సైతం వాటా ఇవ్వాలని బయట చెప్పుకుంటున్నారు. ఇలా విసిగి పోయి చాలా వరకు ఇటీవలి కాలంలో ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకుల్లో నిత్యం భారీ క్యూలు ఐదు నిమిషాల పనికి గంటల తరబడి పడిగాపులు జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 87, ప్రైవేటువి 17 -
అమాత్యయోగం ఎవరికో?
వికారాబాద్: మంత్రివర్గ విస్తరణ జూన్ మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్యనేతలు హస్తిన బాట పట్టారు. ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. రెండు రోజులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అక్కడే మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరూ మంత్రి పదవి ఆశిస్తూ వచ్చారు. మొదట ప్రసాద్కుమార్ పేరు ఎక్కువగా వినిపించినా అనూహ్య రీతిలో స్పీకర్ పదవిని కట్టబెట్టారు. అప్పట్లో ఆయన అయిష్టంగానే బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఇక సీనియర్ ఎమ్మెల్యేలు టీఆర్ఆర్, మల్రెడ్డి రంగారెడ్డికి పూర్తి నిరాశే మిగిలింది. మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో టీఆర్ఆర్ ఢిల్లీకి వెళ్లి రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నేతలను కలిశారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇదే బాటలో నడిచారు. వీరు అనేక సార్లు హస్తినలో పర్యటించారు. తాజాగా స్పీకర్ సైతం అక్కడే ఉండటంతో ఆయనను సభాపతి నుంచి తప్పించి, పోర్టుపోలియో ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే హస్తినకు పిలుపు వచ్చినట్లు ఆ పార్టీ ముఖ్యులు చర్చించుకుంటున్నారు. స్పీకర్ పదవి కారణంగా తాను పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన లేకపోతున్నానని ప్రసాద్కుమార్ తన సన్నిహితులు వద్ద అంటున్నట్లు సమాచారం. మంత్రి పదవికే మొగ్గు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రసాద్కుమార్కు మంత్రి పదవి దక్కింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. పార్టీ సీనియర్ నేత కావడంతో ప్రసాద్కుమార్కు కూడా కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. మొదటి విడత విస్తరణలో మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరిగినా అవకాశం దక్కలేదు. ప్రస్తుత విస్తరణలోనైనా తనకు చాన్స్ వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. రేసులో టీఆర్ఆర్ రెండు దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓటమిపాలయ్యారు. జిల్లాలో పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ వీడినా తాను మాత్రం కాంగ్రెస్లోనే ఉండిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. వికారాబాద్ కొత్త జిల్లాగా ఏర్పాటైన తర్వాత డీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. మంత్రి పదవి కోసం తన వంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలిసింది.ప్రసాద్కుమార్ హస్తిన బాటలో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు రెండు రోజులుగా ఢిల్లీలోనే స్పీకర్ ప్రసాద్కుమార్ ఇప్పటికే వెళ్లివచ్చిన రామ్మోహన్రెడ్డి, రంగారెడ్డి -
జోక్యం వద్దన్నా.. ఎలా కూల్చివేస్తారు?
కూకట్పల్లి భూముల్లో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలోని 13.17 ఎకరాల భూమి విషయంలో హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలున్నా.. ఎలా కూల్చివేతలు చేపడతారని ప్రశ్నించింది. ఈ నెల 25న హైడ్రా చర్యలకు ముందు ఎలా ఉందో అదే స్థితికి తీసుకుని రావాలని అధికారులను ఆదేశించింది. రెవెన్యూ, హైడ్రా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగించాలని తేల్చిచెప్పింది. గతంలోలాగ 24 గంటల్లో ప్రహరీ కంచెను, రేకుల షెడ్లను, ప్రవేశ ద్వారాన్ని పునర్నిర్మించాలని, విద్యుత్ సర్వీస్ లైన్లు, లైటింగ్ మౌలిక సదుపాయాలు, అనుబంధ విద్యుత్ పరికరాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పిటిషనర్కు భూమిని అప్పగించాలంది. ఒకవేళ అధికారులు అలా చేయని పక్షంలో పిటిషనర్.. సదరు పనులన్నీ పూర్తి చేసి అయిన ఖర్చును కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఆ మొత్తాన్ని ధిక్కారానికి పాల్పడిన వారి వ్యక్తిగత నిధుల నుంచి వసూలు చేస్తామంది. సదరు భూమికి సంబంధించి కోర్టు కేసు ముగిసే వరకు హైడ్రా, రెవెన్యూ సహా ఇతర అధికారులెవరూ పిటిషనర్కు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని చెప్పింది. తదుపరి విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ● కూకట్పల్లిలోని 13.17 ఎకరాలకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారంటూ ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2022, 2024, 2025 సంవత్సరాల్లో భూమిలో అధికారులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. మే 25, 26 తేదీల్లో ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా భూమిలోకి ప్రవేశించి కాంపౌండ్ ఫెన్సింగ్, భద్రతా గదులు, ప్రవేశ ద్వారాన్ని కూల్చివేసి, విద్యుత్ సరఫరా నిలిపివేసి, భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రభుత్వమే జీఓ ఇచ్చి..డబ్బు కట్టించుకుని..పంచనామా చేసి ప్రభుత్వమే స్వాధీనం చేసిన భూమిలోకి మళ్లీ హైడ్రా ప్రవేశించడం దారుణమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రాథమికంగా హైడ్రా కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోందన్నారు. న్యాయస్థానం అనుమతి పొందకుండా కూల్చివేతలు, ఫెన్సింగ్ ఏర్పాటు, బోర్డులు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ముందు కూల్చివేయడం, తరువాత ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టడం, ఆ తర్వాత చర్యలను సమర్థించుకోవడం హైడ్రా అనుసరిస్తున్న పద్ధతిగా కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మే 25కు ముందు భూమి స్థితి ఎలా ఉందో అలా 24 గంటల్లో పునరుద్ధరించాలని హైడ్రా, సంబంధిత అధికారులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. కూల్చివేయడం, సమర్థ్ధించుకోవడం పరిపాటిగా మారింది 24 గంటల్లో భూమి గత స్థితిని పునరుద్ధరించాలి విచారణ వచ్చే నెల 4కు వాయిదా -
చూపు సమస్య ఉంటే పరీక్ష చేయించుకోండి
అనంతగిరి: కంటి చూపు సమస్య ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలని కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో హైదరాబాద్శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి శిబిరం నిర్వహణ, రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం నేత్రం పరీక్ష చేయించుకున్నారు. మధుమేహంతదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నేత్ర పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి పవిత్ర, ఏఓ పర్హినా బేగం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యుద్ధమేఘం!
నాపరాయిపై సాక్షి, రంగారెడ్డి జిల్లా: నాపరాయి ఎగుమతులపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ కూటమి– ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం తాండూరులోని నాపరాయి పరిశ్రమను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసింది. మూడు నెలలుగా ఎగుమతులు లేక ఎక్కడి నిల్వలు అక్కడే ఉండిపోయాయి. ఫలితంగా క్వారీల్లో తవ్వకాలు నిలిచిపోయి.. కూలీలకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది. కాలానుగుణంగా (వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా) మార్పు చెందే స్వభావంతోనే నాపరాయి దేశవిదేశీ నిర్మాణ సంస్థలను ఆకర్షిస్తోంది. హర్మూజ్ జలసంధి మూతపడటంతో తాండూరు నుంచి నాపరాతి ఎగుమతులు నిలిచిపోయాయి. ఓ వైపు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక మార్బుల్స్, టైల్స్తో పోటీపడలేక.. డీలాపడిన నాపరాయి పరిశ్రమపై తాజా పరిస్థితి పుండుమీద కారం చల్లినట్లు తయారైంది. ఇప్పటికే తవ్వి తీసిన రాయి ఎగుమతి కాక.. కొత్తగా తవ్వకాలు లేక.. క్వారీలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. నిలిచిన మైనింగ్ జిల్లాలోని 5,994 ఎకరాల్లో వివిధ రకాల నాపరాయి నిక్షేపాలున్నాయి. వందకుపైగా ఉన్న క్వారీల లీజుదారులు వెలికి తీసిన నాపరాయి నిక్షేపాలను స్థానికంగా ఉన్న లెదర్, బ్రష్ పాలిషింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ప్రాసెసింగ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాలకు ఎగుమతి చేస్తారు. థర్డ్ పార్టీ ద్వారా ముంబై, చైన్నె పోర్ట్ల మీదుగా దుబాయ్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా సహా జపాన్, రష్యా, యూరప్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఐదేళ్ల క్రితం రోజుకు 160 నుంచి 200 లారీల నాపరాయి నిక్షేపాలు వెలికి తీయగా, ప్రస్తుతం 40– 50 లారీలకు మించడం లేదు. 500పైగా పాలిషింగ్ కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు నాపరాతి పరిశ్రమకు ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహం లేదు. మార్కెట్లో డిమాండ్ కూడా లేదు. స్థానికంగా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయి, ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగడం లేదు. మెజార్టీ నిర్మాణదారులు నాపరాయిని పార్కింగ్ కోసమే వాడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం దీన్ని మైనర్ మినరల్స్ కేటగిరీలో చేర్చగా, మన ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ మేజర్ మినరల్గానే పరిగణిస్తోంది. పక్కన ఉన్న గుల్బర్గాలో ఎకరం క్వారీ లీజు రూ.3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వసూలు చేస్తుండగా, అదే ఇక్కడ మాత్రం రూ.12 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో మెజార్టీ పరిశ్రమలు సరిహద్దులోని మిర్యాన్కు తరలిపోతున్నాయి. తడిసి మోపెడు సరిహద్దులోని కర్ణాటకలో నాపరాతి పరిశ్రమలకు యూనిట్ కరెంట్ చార్జీ రూ.7.50 ఉండగా, తాండూరులో రూ.11 వసూలు చేస్తున్నారు. రాయల్టీ చెల్లింపులు, నిక్షేపాల వెలికితీత, ప్రాసెసింగ్, రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. దీనికి తోడు ఎగుమతులు నిలిచిపోవడంతో రోజూవారీ కూలీలకు సైతం డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. టైల్స్ వచ్చిన తర్వాత నాపరాయికి డిమాండ్ తగ్గింది. ప్రభుత్వ భవనాలకు తాండూరు నాపరాతినే వాడాలని గనులు, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులు, కార్మికులు కోరుతున్నారు. ఓ గనిలో నాపరాయి తవ్వకాలు -
ఉపాధ్యాయులకు ‘సర్వీస్’ పాట్లు
పరిగి: విద్యాశాఖలో సర్వీస్ రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడం ఉపాధ్యాయులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విద్యాశాఖలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. వివరాల నమోదుకు మే 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే ఉపాధ్యాయుల ఎస్ఆర్లో కీలకమైన ఎంట్రీలు అసలు లేకపోవడం, కొన్ని చోట్ల నామమాత్రంగా నమోదు చేయడం, ఇంకొన్ని చోట్ల తప్పుల తడకగా ఉండటం సమస్యగా మారింది. నమోదు కాని వివరాలు జిల్లాలో 20 మండలాలు.. 1,063 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 4,500 మంది వరకు ఎస్జీటీ, ఎస్ఏ, జీహెచ్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ అనేది వారి జీవన రేఖ లాంటింది. అదే సక్రమంగా లేకపోతే వారి పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఏటా సర్వీస్ రిజిస్టర్ నమోదు చేయాల్సిన అధికారులు వాటిపై ఇంకు కూడా పెట్టకపోడం ఉపాధ్యాయులకు సమస్య తెచ్చి పెట్టింది. 2008 నుంచి ఎంట్రీలు సక్రమంగా లేక తంటాలు పడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు టీచర్లు అనేక చోట్లకు బదిలీ అయ్యారు. గతంలో పనిచేసిన చోటరికార్డులు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఎస్ఆర్ ఎంట్రీలు చేయాల్సిన డీడీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. తలనొప్పిగా మారిన ప్రక్రియ ఉపాధ్యాయులకు ఒకవైపు జనగణన విధులు, మరో పక్క బడిబాట కార్యక్రమం ఉన్నందున డిజిటలైజేషన్ ప్రక్రియ తలనొప్పిగా మారింది. ఇలాంటి తరుణంలో ఎస్ఆర్ నమోదు ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఏటా తీసుకునే ఆన్యువల్ గ్రేడ్, ఇంక్రిమెంట్, ఈఎల్ఎస్.. ఇలా ప్రతి విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలో కనిపించడం లేదు. దీంతో అప్పుట్లో విధులు నిర్వహించిన డీడీఓలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఎంట్రీలు చేయించుకుంటున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడమే కారణం నేటితో ముగియనున్న డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తికాని ఎంట్రీలు గడువు పెంచాలని వినతులుడిజిటలైజేషన్ గడువు పెంచాలి. సర్వీస్ రిజిస్టర్ల నమోదు ఇంత వరకు పూర్తి కాలేదు. డీడీఓలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రిజిస్టర్లన్నీ అంపూర్తిగానే ఉన్నాయి. వాటి నమోదుకు కొంత సమయం కావాలి. – శ్రీశైలం, ఉపాధ్యాయుడు, కుల్కచర్ల2012లో టీచర్ పోస్టు సాఽ దించా. అప్పటి నుంచి ఇ ప్ప టి వరకు రెండు మండలాల్లో పని చేశా. అప్పట్లో క్ల స్టర్ హెచ్ఎంగా ఉన్న అధి కారి బదిలీపై వెళ్లారు. దీంతో సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీలు నమోదు కాలేదు. సరి చేయాలంటే బదిలీపై వెళ్లిన అధికారి వద్దకు వెళ్లాల్సి ఉంది. – శ్రీనివాస్, ఎస్జీటీ, చెల్లాపూర్ -
నేరాల నియంత్రణకు తనిఖీలు
అనంతగిరి: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ అంజయ్య అన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వికారాబాద్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిర్మానుష్య ప్రదేశంలో గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని, అతని నుంచి 2గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కాలనీలోని ఇంటి ఎదుట గుమిగూడి మద్యం తాగుతున్న పలువురు యువకులను హెచ్చరించి, అక్రమంగా నిల్వ ఉంచిన 55 బీర్ బాటిళ్లు, 43 క్వార్టర్ సీసాలను సీజ్ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జీల్లో తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 15 సంవత్సరాల బాలుడిని గమనించి, విచారించగా పేద్దేముల్ మండలం రుక్మాపూర్లోని అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించారు. బాలుడు ఇంటినుంచి పారిపోయి వచ్చాడని తెలిపిన తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నార్సింగి పీఎస్ పరిధిలో బైక్ చోరీకి పాల్పడిన ఓ పాత నేరస్తుడిని రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో వికారాబాద్ సీఐ రఘుకుమార్, క్యూఆర్టీ బృందం, వికారాబాద్ క్రైమ్ టీమ్, బ్లూకోట్స్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య -
పొగ.. జీవితానికి సెగ
తాండూరు: పొగాకు ఆరోగ్యానికి చేటు. సిగరెట్ తాగడం వలన గుండె, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్, డయాబెటిస్ తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. అస్తమాకు దారితీస్తుంది. అయినప్పటికీ.. ఈ మానుకోలేని అలవాటుతో మనిషి తన జీవితకాలాన్ని ఐసుముక్కలా కరగదీసుకుంటు న్నాడు. దీంతో మరణాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. పొగతాగడం, పొగాకు నమలడం అనారోగ్యమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. ధూమపానం ప్రియులు పెరుగుతూనే ఉన్నారు. ఇక నిషేధించబడిన గుట్కాతో పాటు.. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. గాంజా విక్రయించినా, సేవించినా నేరస్థులేనని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విక్రయదారులను వల పన్ని పట్టుకొని, రిమాండ్కు తరలిస్తున్న సంఘటనలు అనేకం. అయినా ఆశించిన ఫలితం శూన్యం. ఏటా 70 లక్షల మంది బలి పొగ తాగడం వలన కలిగే అనర్థాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(ప్రపంచ ఆరోగ్య సంస్థ) 1987 మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పేర్కొంది. నాటి నుంచి ఏటా పొగాకు నమలడం, ధూమపానం చేయడం ఆరోగ్యానికి చేటు అని ప్రచారం చేస్తూనే ఉంది. విస్తృతంగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అయినప్పటికీ ప్రతి సంవత్సరం 60 నుంచి 70 లక్షల మంది పొగాకు బలవుతున్నారు. ప్రపంచ వ్యప్తంగా 13 కోట్ల మంది సిగరెట్ తాగుతుండగా.. అందులో 10 లక్షల మంది వరకు క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దాడులు చేసినా జడవని వైనం పొగాకుతో తయారు చేసిన గుట్కా, ఖైనీలను ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ.. జిల్లాలో పొగాకు వినియోగం అధికంగా ఉంది. కిరాణం, పాన్షాప్, షాపింగ్ మాళ్లలో అనేక రకాల సిగరెట్లతో పాటు నిషేధించబడిన గుట్కా లభిస్తున్నాయి. చేరువనే ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి గుట్కా క్రయవిక్రయాలదందా జోరుగా సాగుతోంది. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. అధికారులు దాడులు చేస్తూ.. సరుకు స్వాధీనం చేసుకోవడంతో పాటు.. కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ జడవని వ్యాపారులు దందాను మరింత విస్తృతం చేస్తున్నారు. చాపకింద నీరులా విస్తరిస్తూ సవాల్గా మారారు. నిషేధిత గుట్కాల స్థానంలో పాన్ మసాలను విక్రయిస్తున్నారు. వాటితో పాటు చిన్న ప్యాకెట్లలో జర్దా కలిపిన మిశ్రమాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకొంటున్నారు. పొగాకు క్యాన్సర్కు కారకం అయినా పెరుగుతున్న ధూమపానం చాపకింద నీరులా నిషేధిత గుట్కా దందా విక్రయాలకు కేరాఫ్ అంతర్రాష్ట్ర సరిహద్దు నేడు పొగాకు వ్యతిరేక దినోత్సవం పొగతాగడం, గుట్కా తినడం ఆరోగ్యానికి హానికరం. కాన్సర్కు కారకం. ప్రాణాంతకం అని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినప్పటికీ అలవాటు ఉన్న వారు మానుకోకపోగా.. కొత్తవారు ఈ దురలవాట్లకు చేరవవుతున్నారు. సిగరెట్, బీడితో పాటు నిషేధించబడిన గుట్కా తినేవారు, గంజాయి, డ్రగ్స్ తీసుకునే ఏటేటా పెరుగుతూనే ఉన్నారు. జీవితాలను కొవ్వొత్తిలా కరగదీసుకుంటున్నారు. -
ఆవిర్భావ వేడుకలు
ఘనంగా నిర్వహిద్దాంఅనంతగిరి: రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని, ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 2న జరిగే ఆవిర్భావ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ మైదానాన్ని వేడుకలకు సిద్ధం చేయాలని సూచించారు. అతిథులకు ఆహ్వాన పత్రాలు పంపాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఆయా శాఖల ప్రగతిని తెలియజేసేలా స్టాల్స్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్, ఆర్డీఓ వాసుచంద్ర, కలెక్టరేట్ ఏవో ఫర్హీన బేగం తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు నేరం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాలల మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సమాజంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏఐ సాంకేతికతపై పట్టు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీఏ నర్సింలు, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్ కుమార్, వయోజన విద్య జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్బాబు, డీపీఎం నర్సింలు, కొమరయ్య, శేఖర్, నర్సింలు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, కార్యదర్శి శ్వేత, కోశాధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బార్వాద్లో సోలార్ ప్లాంట్ బంట్వారం: సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎంతగానో ఉపయోగకరమని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం కోట్పల్లి మండలం బార్వాద్లో పర్యటించారు. గ్రామంలో రూ.3 కోట్లతో చేపట్టిన సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు సోలార్ ప్లాంట్లు నిర్మిస్తుండగా అందులో ఒకటి బార్వాద్లో ఉందన్నారు. ఇందిరా మహిళా శక్తి సభ్యులు ఈ పనులను చూసుకుంటారని తెలిపారు. అంతకుముందు ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం డ్వాక్రా భవనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీఓ సత్తెయ్య, ఎంపీడీఓ హేమంత్, తహసీల్దార్ శ్రీనివాస్, తెలంగాణ రెడ్కో జిల్లా మేనేజర్ శ్రీనివాస్రావు, సర్పంచ్ ప్రతిభ, జీపీ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్ తివారి -
అధికారంలోకి వస్తే 111 జీవో ఎత్తివేస్తాం
మొయినాబాద్: ‘111 జీవో ఎత్తివేసే అంశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈప్రాంత ప్రజలను మోసం చేశాయని, మేము అధికారంలోకి వస్తే వెంటనే ఆజీవోను తొలగిస్తాం’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ఆమె చిలుకూరు బాలాజీని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొయినాబాద్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆడబిడ్డల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. మీకేం కావాలో ఆడబిడ్డగా, ఓ సోదరిగా తనకు తెలుసని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంకుల ద్యావరా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఆయా లక్ష్యాలను సాధించేందుకే తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చామన్నారు. చుట్టుపక్కల భూములు ఎకరాకు రూ.వంద కోట్లకు పైగా పలుకుతుంటే 111 జీవో పరిధిలోని ప్రజలు మాత్రం తమ భూములను ఎక్కువ ధరకు అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. పిల్లల పెళ్లిళ్లకోసం పావు ఎకరం భూమి అమ్మాలన్నా ఈ జీవో అడ్డంకి వల్ల రేటు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంపు మేసీ్త్ర(ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి) తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారమే బాగా తెలుసు అని చెప్పాడు.. కానీ ఆ వ్యాపారాన్ని ఊడగొట్టిండని విమర్శించారు. చేవెళ్ల, మొయినాబాద్లో ఎక్కువగా రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారని.. అందరికీ మేలు చేసేలా ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. అందుకే గుంపుమేసీ్త్రపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తన పార్టీకి స్వామివారి ఆశీస్సులకోసం వచ్చామని.. చిలుకూరు బాలాజీ దయతో తెలంగాణ ప్రజలకు మంచి చేయడం కోసం పోరాటం చేస్తూనే ఉంటామని కవిత అన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులకు మంచి చేసే బుద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వమని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం సురంగల్లో సంతోష్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బస్ షెల్టర్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుమ్మరి శివకుమార్, అన్వర్ఖాన్, నూర్బాయ్, నాగేష్, భిక్షపతి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈవిషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొయినాబాద్లో పార్టీ జెండా ఆవిష్కరణ -
దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు టౌన్: మండలంలోని జినుగుర్తి గేట్ వద్ద గల మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో సహాయ వంట మనిషి పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ ఇందుప్రియ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడో తరగతి విద్యార్హతతో, 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు జూన్ 2వ తేదీ సాయంత్రం 5గంటల లోపు స్థానిక మండల వనరుల కేంద్రంలో దరఖాస్తు అందజేయాలన్నారు. 9మంది ఏఈఓలు, ఓ జూనియర్ అసిస్టెంట్, అటెండర్ బదిలీ తాండూరు రూరల్: వ్యవసాయ శాఖ తాండూరు డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఆయా మండలాల్లో పని చేస్తున్న 9మంది ఏఈఓలతో పాటు ఓ జూనియర్ అసిస్టెంట్, అటెండర్ శనివారం బదిలీపై ఇతర మండలాలకు వెళ్లారు. బెల్కటూర్ క్లస్టర్లో విధులు నిర్వహిస్తున్న ఏఈఓ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి క్లస్టర్కు, అంతారం ఏఈఓ శివకుమార్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లి క్లస్టర్కు, పెద్దేముల్ మండలం కందనెల్లి ఏఈఓ స్వాతి రంగారెడ్డి జిల్లా కందుకూరు ఏఈఓగా, తట్టెపల్లి ఏఈఓ శివరాజ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలానికి, గోపాల్పూర్ ఏఈఓ రజిత రంగారెడ్డి జిల్లా కేశంపేటకు బదిలీపై వెళ్లారు. బషీరాబాద్ మండలం కాశీంపూర్ ఏఈఓ విజయలక్ష్మి వికారాబాద్ మండలం బ్రాహ్మణపల్లికి, యాలాల మండలం రాస్నం ఏఈఓ శిరిష మన జిల్లా చౌడాపూర్కు, కొకట్ ఏఈఓ మదన్మోహన్ నవాబుపేట్ మండలానికి, జుంటుపల్లి ఏఈఓ మహేశ్ తలకొండపల్లిలోని చుక్కాపూర్ క్లస్టర్లకు బదిలీ అయ్యారు. తాండూరు కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ వంశీధర్రెడ్డి వికారాబాద్లోనిని జిల్లా కార్యాలయానికి, అటెండర్ ఇస్మాయిల్ పరిగికి బదిలీపై వెళ్లారు. ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే మంచి పేరు వస్తుందని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. డీఆర్ఆర్బీ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరేందర్రెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. శనివారం వికారాబాద్లో ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 42 ఏళ్ల పాటు పనిచేయడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు జానయ్య, శ్రీనివాస్, జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ అశోక్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: రంగారెడ్డి డీఎఫ్ఓగా విధులు నిర్వహిస్తున్న రోహిత్ గోపిడికి వికారాబాద్ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర్ ఇటీవలే బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ గోపిడికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అనంతగిరి: భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకమని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణ పొందిన సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా గ్రామాల్లో భూముల కొలతలు తీయాలన్నారు. జిల్లాలో 150 మంది శిక్షణ పొందిన సర్వేయర్లను నియమించడం జరిగిందన్నారు. మొదటి విడతలో 69 మందిని, రెండో విడతలో 81 మంది ఆయా ప్రాంతాలకు కేటాయించడం జరిగిందన్నారు. వికారాబాద్ మండలానికి 13 మంది, ధారూర్కు 8మంది, కోట్పల్లి, బంట్వారానికి నలుగురు చొప్పన, మర్పల్లి, మోమిన్పేట, నవాబుపేట, పూడూరుకు ఎనిమిది మంది చొప్పున, పరిగికి 14 మందిని, దోమకు 6, కుల్కచర్లకు 7, చౌడాపూర్కు 5, తాండూరు, పెద్దేముల్కు 9 మంది చొప్పన, బషీరాబాద్, యాలాల, దౌల్తాబాద్, బొంరాస్పేటకు ఆరుగురు చొప్పన, కొడంగల్కు 10మందిని, దుద్యాల్కు 5 మంది సర్వేయర్లను కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం అమలుకు డిమాండ్
అనంతగిరి: మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం వికారాబాద్లో మున్సిపల్ కార్మికులతో కలిసి సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది గంటల పనివిధానం కొనసాగించాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతిఒక్కరికీ రూ.20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్నాయక్, బుచ్చయ్య, జ్యోతి, జాఫర్, రవి, మంగమ్మ, లక్ష్మమ్మ, శివకుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని నినాదాలు -
ఖర్గేను కలిసిన స్పీకర్
అనంతగిరి: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శనివారం స్పీకర్ ప్రసాద్కుమార్ కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై చర్చించినట్లు తెలిసింది. అనంతగిరి: బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గట్టు రాంచంర్రావు అన్నారు. ఈమేరకు శనివారం వికారాబాద్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్, గోపాల్, పాండు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ వివాహిత శనివారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రావణి.. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటుంది. కొంత కాలంగా భర్తతో గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఆమె.. స్థానిక పెద్ద చెరువులో దూకేందుకు యత్నించింది. అంతలోనే పోలీసులకు సమాచారంఅందడంతో చెరువు సమీపంలో పరిశీలించారు. వెంటనే ఆమెను రక్షించి పోలీస్స్టేషన్కు తరలించారు. కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి మహిళా ప్రా ణాలు కాపాడిన సిబ్బందిని సీఐ మహేందర్రెడ్డి అభినందించారు. పోలీసులు మానవత్వం చాటు కోవడంతో పట్నం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతగిరి: బావిలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన శనివారం వికారాబాద్ ము న్సిపల్ పరిధిలోని ధన్నా రం పరిసరాల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ధన్నారానికి చెందిన వడ్డె యాదయ్య(35) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో శ్వాస ఆడక నీళ్లలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ రఘుకుమార్ తెలిపారు. -
గంటన్నర ఆలస్యంగా సీయూఈటీ పరీక్ష
ఇబ్రహీంపట్నం రూరల్: దేశ వ్యాప్తంగా నిర్వహించే సీయూఈటీ(కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష నిబంధనలకు విరుద్ధంగా గంటన్నరకు పైగా ఆలస్యంగా ప్రారంభమైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శేరిగూడలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అయాన్ డిజిటల్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన సీయూఈటీ పరీక్ష ఆలస్యంగా 10:45కి మొదలు పెట్టారు. ఎందుకు ఆలస్యమైందని అభ్యర్థులు ప్రశ్నించగా నిర్వాహకులు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో బయట ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అయాన్ డిజిటల్ గేటు ఎదుట ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సాంకేతిక కారణాలతో పరీక్ష ఆలస్యమైందని చివరికి నిర్వాహకులు సెలవిచ్చారు. దీంతో మధ్యాహ్నం ప్రారంభమయ్యే పరీక్ష సైతం ఆలస్యం అయినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయాన్ డిజిటల్ ఎదుట విద్యార్థుల ఆందోళన -
కిరాణ షాపుల్లో పోలీసుల సోదాలు
మొయినాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్, జీవన్గూడలో శనివారం రాత్రి డాగ్స్క్వాడ్ బృందంతో కలిసి మొయినాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని కిరాణ, పాన్ షాపుల్లో సోదాలు చేశారు. నేర నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో విసృతంగా తనిఖీలు చేసి మాదక ద్రవ్యాలు, గంజాయి, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, చట్ట విరుద్ధ వస్తువుల విక్రయం, నిల్వ, రవాణాపై ప్రజలు, దుకాణదారులకు అవగాహన కల్పించామన్నారు. తనిఖీల్లో ఎస్సై కిషన్ సింగ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
హుండీ అక్రమాల కేసులో ఇద్దరికి జైలు
దుద్యాల్: మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపులో అక్రమాలకు పాల్పడిన ఈఓ రాజేందర్రెడ్డితోపాటు సహకరించిన అతని స్నేహితుడు విజయ్ని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచి పరిగి జైలుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ శ్రీశైలం వెల్లడించారు. హుండీ ఆదాయం లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టారు. రూ.41,500 కాజేసినట్లు ఈఓ ఒప్పుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ వ్యవహారంలో రాజేందర్రెడ్డికి సహకరించిన అతని స్నేహితుడు విజయ్ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. ఆలయ ఈఓ రాజేందర్తోపాటు సహకరించిన విజయ్ అరెస్ట్ పరిగి జైలుకు తరలింపు -
ప్రమాదాలకు రోడ్డేస్తుండ్రు!
20 మలుపులతో బీజాపూర్ హైవే నిర్మాణ పనులు సాక్షి, రంగారెడ్డి జిల్లా/చేవెళ్ల/మొయినాబాద్: అనేక అవరోధాలను అధిగమించి ఆరు నెలల క్రితం ప్రారంభించిన హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారి (163) విస్తరణ పనులు వంకరటింకరగా సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది మృతికి కారణమైన ఈ రోడ్డును రెండు నుంచి నాలుగు లేన్లకు విస్తరిస్తున్నప్పటికీ ప్రమాదాలకు కారణమైన మెజార్టీ మూల మలుపులను అలాగే ఉంచేస్తున్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర 66 మలుపులు ఉండగా, వీటిలో 19 డేంజర్ స్పాట్లు ఉన్నట్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. మెజార్టీ ప్రాంతాల్లోని ఇరుకైన మలుపులను సరి చేసినప్పటికీ.. 20 చోట్ల మలుపులు తిరిగింది. వీటిని సరి చేయకుండా ముందుకు వెళ్లడం భవిష్యత్తులో ప్రమాదాలను కొని తెచ్చుకో వడమే అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దల భూముల జోలికి వెళ్లకుండా, సామాన్య రైతుల నుంచే సేకరించడం, ప్రజలకు అవసరమైన చోట అండర్పాసులు నిర్మించకపోవడంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఈ మార్గంలో గత ఆరేళ్లలో 300 మంది మృతి చెందగా, అనేక మంది కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్చవాలుగా మారారు. 2025 నవంబర్ 3 తెల్లవారు జా మున టిప్పర్– ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది మృతి చెందగా, 27 మంది త్రీవంగా గాయపడటాన్ని తలుచుకుని స్థానికులు ఇప్పటికీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆరు నెలల్లో అందుబాటులోకి.. రోజురోజుకూ యాక్సిడెంట్లు పెరగడంతో రోడ్డు విస్తరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకు అడ్డంకిగా ఉన్న భారీ మర్రి వృక్షాల్లో కొన్నింటిని మరో చోటకు తరలించి.. హరిత ట్రిబ్యునల్లో ఉన్న కేసును ఉపసంహరించుకునేలా చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ డిసెంబర్లో పనులు ప్రారంభించింది. ఎలాంటి అడ్డంకులు లేని ప్రాంతాల్లో భూమిని చదును చేసి, మట్టితో పాటు కంకర పరిచింది. అవసరమైన చోట బైపాస్లు, కల్వర్టులు, అండర్పాస్ పనులు చేపట్టింది. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇలాగే సాగితే ఆరు మాసాల్లో రోడ్డు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ‘సాక్షి’ నెట్వర్క్ బృందం శుక్రవారం ఈ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి, పలు లోపాలను గమనించింది. అడ్డదిడ్డంగా భూసేకరణ.. ● ఓఆర్ఆర్ సమీపంలోని అప్పా జంక్షన్ నుంచి ఈ రోడ్డు మొదలవుతుంది. ఇక్కడి నుంచి అజీజ్నగర్ వరకు 3 కిలోమీటర్ల మేర ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదు. ● అజీజ్నగర్ నుంచి జేబీఐటీ వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర భూసేకరణ చేసినా పనులు ప్రారంభించలేదు. ● రోడ్డుకు అడ్డుగా ఉన్న స్వామినారాయణ గురుకుల పాఠశాల భూములకు బదులు ఎడమవైపున ఉన్న సాధారణ రైతుల భూములను సేకరించారు. దీంతో ఇక్కడ రోడ్డు వంకరలు పోతోంది. ● జేబీఐటీ నుంచి తాజ్సర్కిల్ వరకు సుమారు 4.5 కిలోమీటర్ల మేర మొయినాబాద్ బైపాస్ రోడ్డు పనులు చేపట్టారు. టెన్నిస్ అకాడమీ వద్ద భూమిని ఇప్పటికీ చదును చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ముర్తుజాగూడ నెస్ట్విల్లాస్ సమీపంలోనూ రోడ్డు నిర్మాణ పనుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ● తాజ్సర్కిల్ నుంచి చిన్నషాపూర్గేటు వరకు ప్రస్తుత రోడ్డుకు కుడివైపున భూసేకరణ చేసి, ఆ తర్వాత రోడ్డుకు ఎడమవైపునకు మార్చడంపై కూడా విమర్శలున్నాయి. నేరుగా కన్పించాల్సిన రోడ్డు నాలుగు వంకరలు తిరిగింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న పెండ్యాల ఫాంహౌస్, ఆర్ఆర్ గుట్కా, గ్రీన్ఫీల్డ్ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ భూములను కాపాడుతూ సాధారణ రైతుల భూములను తీసుకున్నారనే విమర్శులున్నాయి. కనకమామిడి నుంచి నేరుగా ఆర్ఆర్ గుట్కా మీదుగా రోడ్డు వేస్తే అప్పారెడ్డిగూడ– కనకమామిడి జంక్షన్ ఇందులో కలిసేది. ● ముడిమ్యాలకంచె, కందాడ మలుపులను సరి చేయకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● మల్కాపూర్గేట్– కేసారం మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. దామరగిద్ద, మీర్జాగూడ మలుపులు ఎప్పటిలాగే డేంజర్గా ఉన్నాయి. ● కేసారం– చేవెళ్ల బైపాస్(6.5 కిలోమీటర్లు) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలూరు–ఖానాపురం గేట్ మధ్య ఉన్న లింకును తెంచేయడంతో రోడ్డుకు, అటు ఇటుగా ఉన్న పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఆర్ఆర్ గుట్కా కంపెనీ వద్ద మలుపుచేవెళ్ల సమీపంలోని అటవీ భూమిలో వంకరలు తిరిగిన రోడ్డు‘ముందుచూపు లేకుండా విస్తరణ పనులు చేపడుతున్నారు. అవసరమున్న చోట వదిలేసి, అనవసరమైన చోట అండర్పాసులు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. ఆలూరు, ఖానాపురం రోడ్ల లింకులను తెంపేశారు. ఇక్కడ అండర్పాస్ లేకపోవడంతో పది గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోనుంది. ప్రధాన రహదారి ఎత్తుగా ఉండటం, సర్వీసు రోడ్లు లేకపోవడంతో పక్కనున్న రైతులు పొలాల్లోకి వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. దీనిపై నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు’ అని నాంచేరి సర్పంచ్ పులిమామిడి అశోక్, ఖానాపూర్ వాసి తిరుపతిరెడ్డి, రైతులు అంజయ్య, పెంటయ్యగౌడ్, రాజలింగం తెలిపారు. కాంట్రాక్ట్ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, దుమ్ముధూళి ఎగిసి ఇళ్లపై పడుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి: అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు విస్తరణ: రెండు నుంచి నాలుగు లేన్లుగా.. మొత్తం దూరం: 46.405 కిలోమీటర్లు అవసరమైన భూమి: 266.55 హెక్టార్లు ప్రభుత్వ భూమి: 69.25 హెక్టార్లు ప్రైవేటు భూమి: 154.50 హెక్టార్లు వెచ్చించిన నిధులు: 157 కోట్లు కేటాయించిన బడ్జెట్: రూ.928.41 కోట్లు నిర్మాణ సంస్థ: మెఘా అగ్రిమెంట్ డేట్: 9మే 2022 అపాయింట్ డేట్: 27 నవంబర్ 2024 నిర్మాణ గడువు: 24 నెలలు నిర్వహణ బాధ్యత: 15 సంవత్సరాలు సర్వీసు రోడ్లు: 23.88 కిలోమీటర్లు కల్వర్టులు: 112 వెహికిల్ అండర్పాస్లు: 08 లైట్ వెహికిల్ అండర్ పాస్లు: 07 ఆర్ఈ వాల్స్: 1,51,540 స్క్వేర్ మీటర్లు ప్రధాన బ్రిడ్జిలు: 02 మేజర్ జంక్షన్లు: 04 మైనర్ జంక్షన్లు: 31 ట్రక్ లే బై: 01 టోల్ప్లాజా: 01(8 ఎంట్రెన్స్, 8 ఎగ్జిట్) -
మా భూముల జోలికి రావొద్దు
దోమ: ‘భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఇండస్ట్రియల్ పేరిట బలవంతంగా లాక్కోవాలని చూడటం సరికాదు.. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములిచ్చే ప్రసక్తే లేదు’.. అని కొండాయపల్లి రైతులు తేల్చి చెప్పారు. శుక్రవారం గ్రామంలో తహసీల్దార్ గోవిందమ్మ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ వాసుచంద్ర రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భూ సేకరణ విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. గ్రామ పరిధిలోని 371.24 ఎకరాల పట్టా భూములు, 85.03 ఎకరాల లావని పట్టా భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 221 మంది రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తాతల కాలం నాటి భూములను కాపాడుకుంటూ వచ్చామని.. అవే జీవనాధారమని అధికారులకు విన్నవించారు. అలాంటి భూములను లాక్కుంటే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడ తనిఖీలు ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి గ్రామానికి వచ్చి పోయే వారిని తనిఖీ చేశారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, మరో ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 13 మంది ఎస్ఐలు, భారీగా పోలీసులు పాల్గొన్నారు. భూమికి భూమి ఇవ్వాలి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి పరిశ్రమలు వస్తే ఇంటికో ఉద్యోగం, ప్లాట్ ఇవ్వాలి రైతులే కంపెనీ పెట్టాలనుకుంటే భూమి కేటాయించి, ఆర్థిక సాయమందించాలి బలవంతంగా లాక్కోవాలని చూస్తే చావే శరణ్యం కొండాయపల్లి రైతుల ఆవేదన -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి దోమ: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి హెచ్చరించారు. శుక్రవారం దోమ, దిర్సంపల్లిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం కుప్పలను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. గన్నీ బ్యాగులు అందడం లేదని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ అనంతగిరి: రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, కేంద్రం చట్టబద్ధ రాజ్యాంగ బద్ధ సంస్థలను అడ్డుపెట్టుకొని సీపీఎం నాయకత్వాన్ని బలహీన పరచలేరని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ అన్నారు. కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం వికారాబాద్లో నిరసన వ్యక్తం చేశారు. 15 ఏళ్లపాటు ఆదర్శ పాలన అందించిన వ్యక్తిపై ఈడీ దాడులు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సతీష్, గోపాల్రెడ్డి, లక్ష్మయ్య, రమేష్ కుమార్, బాలరాజు, గోపాల్, చందు, రత్నం, కిషన్ నాయక్, రాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. తాండూరు రూరల్: పెద్దేముల్ మండలానికి ఐదు ప్రీ ప్రైమరీ స్కూల్స్ మంజూరైనట్లు ఎంఈఓ నర్సింగ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి ఎంపీయూపీఎస్ గాజీపూర్, కందనెల్లి, ఇందూర్, మంబాపూర్, తట్టెపల్లిలో పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా కార్పొరేట్ విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్మమని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి బొంరాస్పేట: గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మూడుమామిళ్లతండాలో జీపీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కడా నిధులు రూ.30 లక్షలతో భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని సర్పంచ్ సువాలిబాయికి సూచించారు. కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, నాయకులు వెంకట్రెడ్డి, చంద్రప్ప, గుండప్ప, చందర్, ప్రసాద్గౌడ్, జయరాం, నెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారందరినీ గుర్తించి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం వికారాబాద్లోని వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలోని పలువురు మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారని వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఉద్యమ నాయకులు విజయకుమార్, సురేష్, రవిశంకర్, గంగ్యా నాయక్, భాను, రామచందర్, శివకుమార్ రెడ్డి, శాంత్ కుమార్, దేవదాస్ పాల్గొన్నారు.


