Vikarabad
-
ఫిట్లెస్..!
బడి బస్సుల భద్రతపై అనుమానాలెన్నో● జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 195 ● రిజిస్ట్రేషన్ అయిన స్కూల్ బస్సులు 250 ● అనధికారికంగా తిప్పుతున్నవి వందకు పైనే.. ● ఫిట్నెస్ పరీక్షలు పూర్తయినవి 40 మాత్రమే ● మరో నాలుగు రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు వికారాబాద్: బడి బస్సు భద్రమేనా..? అంటేకాదనే సమాధానం వస్తోంది. తరచూ స్కూల్ బస్సులు మొరాయిస్తూనే ఉన్నాయి. బ్రేకులు ఫెయిల్ కావటం.. రోడ్డు పక్కకు దూసుకెళ్లడం.. ప్రమాదాలకు గురికావడం సర్వసాధారణంగా మారింది. గతే డాది కూడా స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురైన ఘటనలు మనం చూశాం. ఈ నెల 12నుంచి పాఠ శాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బడి బస్సులు కండీషన్పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 195 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 250 వరకు రిజిస్ట్రేషన్ అయిన బస్సులు ఉన్నాయి. మరో వంద బస్సులను అనుమతులు లేకుండా తిప్పుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు 40 బస్సులు మాత్రమే యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోగా మిగతా వారు దరఖాస్తు కూడా చేసుకోలేదు. నిబంధనలు తుంగలో తొక్కి బస్సులు తిప్పుతునఆన ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు నీళ్లు చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాత బస్సులు కొనుగోలు చేసి వాటికి పేయింట్ రుద్ది కొత్త బస్సుల్లా కలరింగ్ ఇస్తున్నారు. ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ చెక్ చేసే సమయంలో బస్సు టైర్లు, పేయింటింగ్, రేడియం స్టిక్కర్లు, లైట్లు, సీట్లు, అనుభవం, నైపుణ్యంగల డైవర్లు ఇలా అన్నీ పరిశీలించాలి. కానీ నామమాత్రంగా చెక్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు ఉన్నా యి. దీంతో ఏటా బస్సులు ప్రమాదాలకు గురై చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. జిల్లాలో 15 సంవత్సరాలు దాటి ఫిట్నెస్ లేని బస్సులు వందకు పైగా ఉన్నట్లు సమాచారం. వీటికి ఫిట్నెస్ టెస్టులు చేయించుకోకుండా ఆర్టీఏ అధికారులను మ్యానేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ బస్సు నడపాలంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. ఐదు సంవత్సరాల అనుభవం తప్పనిసరి. కానీ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఇవేవీ పాటించటంలేదు. జిల్లాలో మొత్తం 45 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతుండగా 50 శాతం మంది స్కూల్ బస్సుల్లోనే పాఠశాలలకు వెళ్తున్నారు. మరో నాలుగు రోజుల్లో 200 స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయడం సాధ్యమేనా అనేది ప్రశ్న తలెత్తుతోంది. పాటించాల్సిన నిబంధనలు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. కంటి చూపు, షుగర్, బీపీ, ఫిట్స్, గుండెజబ్బులు లేనివారిని మాత్రమే డ్రైవర్లుగా నియమించుకోవాలి. వారికి ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించాలి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలు దాటిన బస్సులను విద్యార్థుల రవాణాకు వినియోగించరాదు. 60 సంవత్సరాలు నిండిన వారిని డ్రైవర్లుగా కొనసాగించరాదు. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ పరికరాలు కచ్చితంగా ఉంచాలి. అందులో మందులు ఉండేలా చూసుకోవాలి. కాలం చెల్లిన మందులు, పరికరాలు ఎప్పటికప్పుడు మార్చాలి. విద్యా సంస్థల పేరు, ఫోన్ నంబర్ బస్సుకు ఎడమవైపు వెనకభాగంలో కనిపించేలా రాయించాలి. బస్సులో అటెండర్ను కచ్చితంగా ఉండాలి. చిన్నారులు బస్సు ఎక్కడం, దిగటం డ్రైవర్కు స్పష్టంగా కనిపించేలా కుంభాకార అద్దాలు ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థుల బ్యాగులు ఉంచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. ప్రతి పది బస్సులకు అదనంగా మరో బస్సును అందుబాటులో ఉంచుకోవాలి. రక్షణ చర్యల్లో భాగంగా కిటీకీల మధ్యలో రాడ్స్ను ఏర్పాటు చేసుకోవాలి. ఫుట్ బోర్డులో మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించ రాదు. మిగతా అన్ని మెట్లు కూడా జారకుండా లోహంతో నిర్మితమై ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా బస్సులు బాగున్నాయా లేదని అని పరిశీలించాలి. నోటీసులు ఇచ్చాం పాఠశాలల పునఃప్రారంభం లోపే స్కూల్ బస్సుల కు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. నిబంధనలకు లోబడి బస్సులో అన్ని పరికరాలు ఉండేలా చూసుకోవాలి. ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని వారికి నోటీసులు ఇచ్చాం. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కే బస్సులను సీజ్ చేస్తాం. – వెంకట్రెడ్డి, డీటీఓ, వికారాబాద్ -
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయ 11వ వార్షికోత్సవ వేడుకలు పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో శనివారం వైభవంగా జరిగాయి. ఉదయం 7గంటలకు స్వామివారికి అభిషేకం, అలంకరణ. మహా మంగళ హారతి, 9గంటలకు గణపతి హోమం, మహా నైవేద్యం, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద విత రణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా ర్కండేయ కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులను మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. పెద్దేముల్ ఎస్ఐగా ప్రశాంత్వర్ధన్ తాండూరు రూరల్: పెద్దేముల్ ఎస్ఐగా ప్రశాంత్ వర్ధన్ శనివా రం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన శ్రీధర్రెడ్డి సంగారెడ్డికి బదిలీపై వెళ్లారు. టాస్క్ఫోర్స్లో పని చేస్తున్న ప్రశాంత్ వర్ధన్ను పెద్దేముల్కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దోమ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని శివారెడ్డిపల్లిలో మూడు నెలల రేషన్ కోటా బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు యూడు నెలల బియ్యాన్ని ఒకే సారి పంపిణీ చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తు న్నట్లు చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య తాండూరు టౌన్: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వాగ్మాడే సుమన్ (24) కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు శవాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని తండ్రి ముకుందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కోట్పల్లి ఎస్ఐగా శైలజ బంట్వారం: కోట్పల్లి ఎస్ఐగా శైలజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన అబ్దుల్ గఫార్ డీసీఆర్బీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో డీసీఆర్బీలో పనిచేసే శైలజను ఇక్కడికి పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సహకారంతో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. -
మరో లగచర్ల చేయొద్దు
మొయినాబాద్: ఎనికేపల్లి భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మరో లగచర్లను చూస్తారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ప్రభుత్వం గోశాలకు కేటాయించిన భూములను శనివారం ఆమె సందర్శించారు. రైతులు సాగుచేసిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కొన్ని రోజులు మూసీ పరిసరాల్లో పేదలను గుంజేశారని.. ఫుట్పాత్పై ఉండే పేదలను లాగేస్తున్నారన్నారు. లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేశారని.. ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో కొత్త రోడ్డుకోసం 3వేల ఎకరాలు పేదల భూములు తీసుకుంటున్నారని విమర్శించారు. సంగారెడ్డి, గద్వాలలో పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాజాగా ఎనికేపల్లిలో గోశాల ఏర్పాటుకోసం అంటూ వంద ఎకరాలను రైతుల నుంచి లాక్కుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా పేదలు, చిన్న, సన్నకారు రైతుల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఎనికేపల్లి విషయం తెలిసి కేసీఆర్ తనను ఇక్కడి పంపారన్నారు. రైతుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని.. వారికి మద్దతుగా పోరాడతామని స్పష్టం చేశారు. 1954 నుంచి రైతులే సాగు చేస్తున్నారు ఎనికేపల్లిలో 1954లోనే హరిజనులు సాగుచేసుకుంటున్నట్లు రికార్డులో ఉందని.. 1998 వరకు రైతులు శిస్తు కట్టిన రసీదులు ఉన్నాయన్నారు. ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం భూములను ఎలా తీసుకుంటుందని నిలదీశారు. వాళ్ల భూములు వారికే పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోకాపేట భూములను అమ్ముకోవడానికే.. కోకాపేటలో గోశాలకు 200 ఎకరాల భూమి ఉందని.. అందులో 100 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని దానికి బదులు ఎనికేపల్లిలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. గోశాలకు ఇవ్వాలంటే మొయినాబాద్ మండలంలోనే ప్రభుత్వం పీఓటీ చట్టంకింద స్వాధీనం చేసుకున్న వెయ్యి ఎకరాల భూమి ఉందని గుర్తు చేశారు. ప్రతి ఫాంహౌస్, ప్రతి కాలేజీలో ప్రభుత్వ భూమి ఉందని.. వాటిని బయటకు తీయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, దేశమొల్ల ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్లు కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, సుధాకర్యాదవ్, రాఘవరెడ్డి, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కొత్త మాణిక్రెడ్డి, మోర శ్రీనివాస్, రవీందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోం అన్నదాతలకు అన్యాయం జరగనివ్వం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
పంటకు గంగరాయి
నీళ్లపల్లిలో 500 ఎకరాల్లో విస్తరించిన రాళ్లభూమి ● ప్రతికూల వాతావరణంలోనూ దిగుబడి ● పత్తి, జొన్న, శనగ పంటలకు ఎంతో మేలు ● యంత్రాలతోనే సాగు చేయాలంటున్న రైతులు బషీరాబాద్: సాధారణంగా పొలాల్లో రాళ్లు ఉంటే పంటలు సరిగ్గా పండవు.. వాటిని తొలగించేందుకు రైతులు ఎంతైనా ఖర్చు చేస్తుంటారు.. కానీ బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో ఆ రాళ్లే పసిడి పంటకు దోహదం చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాల్లో పలుగురాళ్లు (గంగారాయి) రాశులు పోసినట్లు కనిపిస్తాయి. అవి పొలంలో తడి ఆరకుండా పంట ఎదుగుదలకు దోహసం చేస్తున్నాయి. రబీ సీజన్లో జొన్న, శనగ, తెల్ల కుసుమ పంటలకు ఈ రాళ్లు జీవం పోస్తున్నాయి. విత్తు మొదలు పంట కోసే వరకు భూమిలో తేమశాతం తగ్గకుండా కాపాడుతున్నాయి. ఏడాదికి రెండు పంటలు బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి, జలాల్పూర్ తోపాటు కొండగల్ నియోజకవర్గంలోని రుద్రారం, టేకుల్కోడ్ గ్రామాల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో ఈ రాళ్ల పొలాలు ఉన్నాయి. ఈ రాళ్లను రైతులు గంగ రాయి, చలువరాయి అని పిలుస్తారు. ఈ భూముల్లో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్లో పత్తి, కంది ఎక్కువగా సాగు చేస్తారు. పత్తి మంచి దిగుబడి వస్తుందని.. కంది సాగుకు అంతగా అనుకూలించవని రైతులు చెబుతున్నారు. యంత్రాలతోనే సాగు పొలమంతా గంగరాళ్లు ఉండటంతో ఎద్దులతో వ్యవసాయం చేయడం చాలా కష్టం. కూలీలు కూడా పనిచేయలేని పరిస్థితి. రాళ్ల కారణంగా పొలాల్లో నడవలేరు. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా యంత్రాలను వినియోగిస్తున్నారు. విత్తు మొదలు పంట కోతలు, నూర్పిడి వరకు యంత్రాలనే వాడుతున్నారు. కేవలం పత్తి తీసేందుకు మాత్రం కూలీలను వినియోగిస్తున్నారు.అధిక దిగుబడికి దోహదంగంగరాయి పొలాలు పత్తి, జొన్న, శనగ పంటలకు అనుకూలం. సాధారణ పొలాల కంటే వీటిలో అధిక దిగుబడి వస్తుంది. ముఖ్యంగా రబీ సీజన్లో తేమ శాతం తగ్గదు. దీంతో పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నేల వేడెక్కదు సూర్య కిరణాలు పలుగు రాళ్లపై పడటం ద్వారా పొలం వేడెక్కదు. ఈ రాళ్లు 60శాతం మేర ఎండను అడ్డుకుంటాయి. తద్వారా భూమిలో తేమ ఆరదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా పంటలకు ఎలాంటి నష్టం జరగదు. పొలం లోపల పైన రాళ్లు ఉండటంతో పంటకు చలువ లభించి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దీంతో అధిక దిగుబడి వస్తుంది. – సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త, తాండూరు రాళ్లే పంటకు జీవం మా కుటుంబానికి 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పొలం నిండా రాళ్లు రాశులు పోసినట్లు ఉంటాయి. ఆ రాళ్లే సిరులు కురుపిస్తున్నాయి. భూమి లో తడి ఆరకుండా మేలు చేస్తాయి. పత్తి, కంది, జొన్న, శనగ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తి వస్తుంది. జొన్నలు అయితే 14 క్వింటాళ్లు వస్తాయి. – రుక్మారెడ్డి, రైతు నీళ్లపల్లి -
ఈత, తాటి చెట్లను నరకొద్దు
ఆమనగల్లు: అనుమతి లేకుండా ఈత, తాటి చెట్లను నరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్ హెచ్చరించారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఈత, తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును విక్రయించి గౌడ కులస్తులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కలిగి ఉన్నారన్నారు. ఈత, తాటి చెట్లను నరకడం చట్ట ప్రకారం నేరమని చెప్పారు. తెలంగాణ ఎకై ్సజ్ యాక్ట్ 1968 ప్రకారం సొంత భూమిలోని ఈత, తాటి చెట్లను తొలగించాలన్నా ఎకై ్సజ్ శాఖ అనుమతులు పొందాల్సి ఉంటుందని వివరించారు. అవసరమైన వారు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ పర్యవేక్షణలోని త్రిసభ్య కమిటీ పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందజేస్తుందని తెలిపారు. కలెక్టర్ అనుమతితో వీటిని తొలగించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఒక్కో చెట్టుకు ప్రభుత్వానికి రూ.1,968 రుసుం చెల్లించాలన్నారు. ఎకై ్సజ్ శాఖ అనుమతి లేకుండా చెట్లను తొలగిస్తే మొదటి తప్పుగా భావించి 3 నెలల జైలు శిక్ష, రెండో సారి తొలగిస్తే 6 నెలల జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఎకై ్సజ్ సీఐ బద్యనాథ్చౌహాన్ -
కేజీబీవీలో ఎంఎల్టీ కోర్సు
యాచారం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఏడాది నుంచి ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) ఇంటర్ కోర్సు ప్రారంభిస్తున్నట్లు విద్యాలయ ప్రత్యేకాధికారి అరుణశ్రీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కోర్సులో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 83318 33426 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఎంఎల్టీ బోధించడానికి ఆసక్తి కలిగిన అధ్యాపకులు కూడా సంప్రదించాలన్నారు. నెల రోజులకు కుటుంబం చెంతకు యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో నెల రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శనివారం కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ మే 7న ఇంటి నుంచి పని కోసమని వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన జాడలేకపోవడంతో గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నల్లగొండ, నాగర్కర్నూల్, హైదరాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల వెతికి శనివారం నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో నర్సింహ సంచరిస్తుండగా గుర్తించి తీసుకొచ్చారు. కుర్మిద్దలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదుపు తప్పి రేకులషెడ్డును ఢీకొట్టి ● రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం ● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు ఇబ్రహీంపట్నం: అదుపు తప్పిన బైక్ రేకుల షెడ్ను ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన రుతికేష్(20) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ పార్టీ అనంతరం స్నేహితుడు సంజయ్ ఉంటున్న మంగల్పల్లి హాస్టల్కు మరో స్నేహితుడు శంకర్తో కలిసి బైక్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత శేరిగూడ గాంధీ విగ్రహం వద్దకు రాగానే వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి మెడికల్ షాపు ముందున్న రేకుల షెడ్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రుతికేష్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన శంకర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేదలను అన్నివిధాలా ఆదుకుంటాం మణికొండ: పేద విద్యార్థుల చదువులు, అనారోగ్యాలు, వివాహాలకు ఆర్థిక సాయంతోపాటు అన్ని విధాలా ఆదుకుంటామని వట్టినాగులపల్లి మాజీ సర్పంచ్ జి.స్వరూప నగేష్యాదవ్ అన్నారు. శనివారం గ్రామానికి చెందిన బుడల పెంటయ్య కూతురు వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ఆమె అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మనకు ఉన్న దాంట్లో కొంత లేని వారికి ఇస్తే మానసిక సంతృప్తి మిగులుతుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లోనూ నిర్విరామంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులున్నా పేదలు తమను సంప్రదించాలని వారికి తగిన సాయం చేస్తామని ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు వంద మందికి పైగా ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు. -
రోడ్లపైనే నిరీక్షణ!
దుద్యాల్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో బస్టాండ్లు లేక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబుబ్నగర్– చించోలి జాతీయ రహదారిపై దుద్యాల్ మండల కేంద్ర ప్రధాన గేట్తో పాటు మండలంలోని హస్నాబాద్, లగచర్ల గేట్, ఈర్లపల్లి, గౌరారం, చిలుముల మైల్వార్ తదితర గ్రామాల్లో బస్ షెల్టర్లు అందుబాటులో లేవు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. దుద్యాల్ గేట్, హస్నాబాద్ తదితర గ్రామాల మీదుగా మహబుబ్నగర్– తాండూరు రూట్లలో బస్సులు ఎక్కువగా తిరుగుతుంటాయి. లగచర్ల గేట్ నుంచి హైదారాబాద్కు అధిక సంఖ్యలో జనాలు రాకపోకలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది బస్సుల కోసం వేచి చూస్తుంటారు. వీరికి కనీసం నిలబడేందుకు కూడా చోటు లేకపోవడంతో రోడ్లపై నిలబడి బస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు. ప్రస్తుత వర్షాకాలంలో చినుకులు పడితే ఎక్కడా ఉండలేని పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన చోట బస్ షెల్టర్లు నిర్మించాలని కోరుతున్నారు. కనీస సౌకర్యాలు కరువు బస్సుల కోసం వేచి చూసే సమయంలో తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక జనం ఇక్కట్లకు గురవుతున్నారు. తాము వెళ్లే బస్సులు వచ్చే వరకు సమీపంలోని హోటళ్లను, ఆశ్రహిస్తున్నారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి అవసరమైన ప్రారంతాల్లో బస్ షెల్టర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అందుబాటులోలేని బస్ షెల్టర్లు ఎండావానలో ప్రజలు, ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు షెల్టర్లు ఏర్పాటు చేయాలి ప్రతి రోజు ప్రయాణికులు తాము వెళ్లే బస్సు వచ్చే వరకు నిరీక్షస్తుంటారు. కూర్చోడానికి స్థలం లేక రోడ్డుపైన నిలబడుతున్నారు. ఆర్టీసీ అధికారులు చొరవ చూపి రద్దీగా ఉండే ప్రాంతాల్లో బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలి. – సురేశ్, ప్రయాణికుడు, దుద్యాల్ -
దాడి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలి
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం గుర్రంపల్లిలో దళితులపై దాడిచేసిన నిందితులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో శనివారం గుర్రంపల్లి గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్తోపాటు మానవ హక్కుల వేదిక జంగయ్య, పాండు మాట్లాడుతూ.. బొడ్రాయి ఉత్సవాల్లో కొందరు యువకులు డ్యాన్స్ చేస్తూ ఆడ పిల్లలపై పడబోతుంటే అడ్డుకున్న దళిత యువకుడు ప్రవీణ్పై దాడిచేయడం బాధాకరమన్నారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు ప్రవీణ్ సోదరుడు శ్రీనివాస్ పంచాయతీ కార్యాలయం వద్ద ఫోన్ మాట్లాడుతుండగా దాడి చేసి చేయి విరగ్గొట్టారన్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేసినా నిందితులపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు యాదయ్య, రామచంద్రయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నోజిగూడలో విషాదం
● రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడికి గాయాలు ● చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి ● అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా రాజకీయ ప్రముఖులు కందుకూరు: కుమార్తెను లండన్ పంపించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఓ తండ్రి ఊహించని ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెంకల యాదయ్య(54) శుక్రవారం ఉదయం బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. కాగా మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఈనెల 9న కూతురును ఉన్నత చదువుల కోసం లండన్లో పంపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సన్నిహితులు, బంధువులకు విందు ఏర్పాటు చేశాడు. కానీ ఊహించని ప్రమాదంలో గాయపడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎస్.మల్లేశ్, వివిధ పార్టీల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు హాజరై నివాళులర్పించారు. -
విహార యాత్రకు వెళ్లి..
దుద్యాల్: దైవ దర్శనాల కోసం బైక్పై బయల్దేరిన ఇద్దరు స్నేహితులు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని గౌరారం గ్రామానికి చెందిన కమ్మరి జగన్నాథచారి, సరిత దంపతుల కుమారుడు చందుచారి హైదరాబాద్లోని వేద పాఠశాలలో చదువుతున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే స్నేహితుడితో కలిసి ఇటీవల విహార యాత్రగా బైక్పై తిరుపతి, అరుణాచలం బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో చందు (19) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన శివకుమార్ రేణిగుంట ప్రభుత్వ ఆసస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా అక్కడి పోలీసులు శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రేణిగుంట వద్ద బైక్ యాక్సిడెంట్ గౌరారం గ్రామానికి చెందిన వేద పాఠశాల విద్యార్థి దుర్మరణం -
బాలారిష్టాల్లో ఫ్యూచర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ భవిష్యత్ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు మారింది. 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మెట్రోరైలు, ఏఐ సిటీ, జపాన్, తైవాన్ కంపెనీలు అంటూ రోజుకో ప్రకటనతో సర్కారు ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం స్కిల్ యూనివర్సిటీ మినహా మరే ప్రాజెక్టుకు ప్రతిపాదిత నాలుగో నగరిలో పునాది రాయి కూడా పడకపోవడం.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సిబ్బందిని కూడా సమకూర్చుకోకపోవడం చూస్తే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కడ్తాల్, కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్సీడీఏ పరిధిలోకి తెచ్చారు. ఈ గ్రామాల అభివృద్ధిని క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించాల్సిన ఎఫ్సీడీఏ ఆఫీసు మాత్రం మూడో నగరమైన (సైబరాబాద్) నానక్రాంగూడలో ఏర్పాటు చేయడం గమనార్హం. సీఎం కలల ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. అధికారంలోకి రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో ఫోర్త్ సిటీ అవసరమని ప్రకటించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఆకుతోట పల్లి వరకు 330 అడుగుల రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి భూ సేకరణ పనులు చురుగ్గా సాగగా.. పరిహారం ఇవ్వకుండానే నిర్మాణ పనులకు టెండర్లు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. దీంతో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో స్కిల్ వర్సిటీ పనులు మాత్రమే కాస్తో కూస్తో సాగుతున్నాయి. సిబ్బంది కొరత 765.28 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. వివిధ విభాగాల నుంచి డెప్యుటేషన్పై 90 పోస్టులకు గత మార్చిలో మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకు ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక మినహా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరగలేదు. సిబ్బంది కొరతతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఇతర విభాగాల నుంచి డెప్యుటేషన్పై ఎఫ్సీడీఏ ప్లానింగ్ విభాగంలో పనిచేసేందుకు అధికారులు నిరాసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎలాంటి పురోగతి లేదు. మాస్టర్ ప్లాన్ హెచ్ఎండీఏదే.. ఫోర్త్సిటీలో ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయి ంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థలు, పెట్టుబడులు తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రతిబంధకాలు రాకుండా, అభివృద్ధి పనులు ప్రణాళికబద్ధంగా చకచకా సాగేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అప్పగించినట్లు ఓ అధికారి తెలిపారు. గతంలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), ఎయిర్పోర్ట్ అథారిటీ ప్లాన్ (ఏఏపీ) మాస్టర్ ప్లాన్లను హెచ్ఎండీఏనే అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అలాగే ఎఫ్సీడీఏ పరిధిలోని గ్రామాలు గతంలో హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయని, అందుకే ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోందని ఆయన వివరించారు. ఇప్పటికీ అడుగు పడని ప్రాజెక్టులు కేవలం స్కిల్ వర్సిటీకే పరిమితం గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు కోర్టు బ్రేక్ వేధిస్తున్న సిబ్బంది కొరత ప్లానింగ్లో పని చేసేందుకు అధికారుల నిరాసక్తి ఎఫ్సీడీఏ మాస్టర్ ప్లాన్ బాధ్యత హెచ్ఎండీఏ చేతికి -
బెర్త్ దక్కేనా..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: తెలంగాణలోనే కీలకమైన జిల్లా నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి ఆర్థిక, రాజకీయ వనరులను సమకూర్చిపెట్టే కీలకమైన ఆయా జిల్లాల నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా నేతలకు ఈసారైనా అవకాశం దక్కేనా అనేది వేచిచూడాలి. సీనియార్టీనా.. సామాజిక సమీకరణాలా? గ్రేటర్కు ఆనుకుని ఉన్న జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉండగా, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉంది. షాద్నగర్ నుంచి వీర్లపల్లి తొలిసారిగా గెలుపొందారు. ఆయన బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు. కారుగుర్తుపై గెలుపొందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంత్రి పదవులు, అభివృద్ధి కోసం భారీ నిధుల పేరుతో హస్తం గూటికి చేరుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం లేదు. మొదటి నుంచీ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ..వారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై కేడర్లో నిస్తేజం నెలకొంది. డీసీసీ వేదికగా జరిగిన పలు సమావేశాల్లోనూ ఇదే అంశంపై నేతలు బహిరంగ విమర్శలకు దిగడం గమనార్హం. కొంత మంది సీనియర్ నేతలు ఏకంగా ఢిల్లీకి చేరుకుని పార్టీ అధిష్టానాన్ని కలిసి విన్నవించడం తెలిసిందే. పార్టీలో ఎక్కువ పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలోనే కాదు కార్పొరేషన్, ఇతర పదువుల్లోనూ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తే మల్రెడ్డికి చాన్స్ ఉంటుంది. బీసీ నినాదాన్ని ఎత్తుకుంటే వీర్లపల్లికి అవకాశం ఉంది. ఇక ఎస్సీ కోటాకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే ఇప్పటికే శాసనసభ స్పీకర్గా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్కుమార్కు చాన్స్ కల్పించనుంది. సమన్వయం చేసే వారు లేక .. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలోనే కాదు పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో ముందు వరుసలో నిలిచే జిల్లాకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం ఇబ్బందిగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలే కాదు చివరికి అధికారులు సైతం ప్రతి చిన్న పనికి ఇన్చార్జి మంత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఫ్యూచర్సిటీ కోసం భూ సేకరణ, కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం, ఐటీ, అనుబంధ సంస్థలకు భూముల కేటాయింపు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల సేకరణ వంటి కీలక అంశాలపై జిల్లా నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కారణమైన నేతలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవడం, వ్యక్తిగత, ఇతర సమస్యలతో వచ్చే వారికి సమయం ఇచ్చి, వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంది. జిల్లాకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో అభివృద్ధి సహా సంస్థాగతంగా కేడర్ను బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులు పడటం లేదు. ఇన్చార్జి మంత్రి ఉన్నప్పటికీ..ఆయనతో జిల్లా సెకండ్ కేడర్ నేతలకు పెద్దగా పరిచయాలు లేకపోవడం, అధ్యయనాల పేరుతో ఆయన తరచూ విదేశాల్లో పర్యటించాల్సి వస్తుండటం, కేవలం ముఖ్య నేతలు పాల్గొనే బహిరంగ సభలు, సమావేశాలకే పరిమితం అవుతుండటం జిల్లా నేతలకు ఇబ్బందిగా మారింది. జిల్లాస్థాయి సమీక్ష, సమావేశాలు కూడా నామమాత్రంగా నిర్వహించి వెళ్తుండటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా విస్తరణ కథనాలతో బెర్త్ ఎవరికి దక్కుతుందన్న చర్చలు మొదలయ్యాయి. మంత్రి వర్గంలో రంగారెడ్డి జిల్లాకు దక్కని ప్రాతినిధ్యం విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో మళ్లీ కదలిక ఎవరికి అవకాశం దక్కుతుందా అనే చర్చలు -
పిచ్చి.. పరాకాష్ట
తాండూరు టౌన్: పిచ్చి పరాకాష్టకు చేరిందంటే ఇదేనేమో.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో తన ఫెవరేట్ జట్టు కాకుండా, వేరే జట్లు గెలిస్తే అరగుండు కొట్టించుకొని, మెడలో చెప్పుల దండ వేసుకుని బస్టాండులో తిరుగుతానని తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇన్స్ట్రాగ్రామ్లో పోస్టు పెట్టాడు. ఈ నెల 3న జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపోయి.. ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో సదరు యువకుడు చాలెంజ్ చేసిన విధంగా అరగుండు కొట్టించుకొని, మెడలో చెప్పుల దండ వేసుకుని బుధవారం తాండూరు బస్టాండులో తిరిగాడు. ఈ వీడియోను తిరిగి పోస్టు చేసి చాలెంజ్ను నిలబెట్టుకున్నానంటూ చెప్పడం విశేషం. అంతేకాకుండా క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ముంబై, పంజాబ్ జట్లు తలపడతుండగా పంజాబ్ గెలిస్తే షర్టు లేకుండా చౌరస్తాలో తిరుగుతానని ఇన్స్ట్రాగాంలో పోస్టు పెట్టాడు. ఆ రోజు మ్యాచ్లో పంజాబ్ గెలవడంతో షర్టు విప్పి అర్ధనగ్నంగా తాండూరు చౌరస్తాలో తిరిగాడు. ఇలా షర్టు లేకుండా తిరగడం, అరగుండు, మెడలో చెప్పుల దండతో తిరిగిన యువకున్ని చూసి జనాలు అవాక్కయ్యారు. పిచ్చి ముదిరితే ఇలాంటి చేష్టలే చేస్తారని, ఈ రోజు చేసిన ఈ చిన్న చాలెంజ్, భవిష్యత్లో పెద్ద పెద్ద చాలెంజ్లు చేసే పరిస్థితికి వస్తుందని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువకులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలే తప్ప, ఇలాంటి చాలెంజ్లు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోరాదని హితవు పలుకుతున్నారు. ఆర్సీబీ గెలిచినందుకు అరగుండు, చెప్పుల దండతో తిరిగిన యువకుడు ఇన్స్టా గ్రామ్లో చేసిన చాలెంజ్ను నిలబెట్టుకున్నానంటూ పోస్టు -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
అనంతగిరి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణంలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నా టాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు, పీపీలు దీపారాణి, అన్వేష్సింగ్, సమీనాబేగం, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. 14న జాతీయ లోక్అదాలత్ ఈ నెల 14న జరిగే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో లోక్అదాలత్పై జిల్లా పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీపడదగ్గ కేసులను అధిక సంఖ్యలో రాజీపడేలా చూడాలని ఆదేశించారు. లోక్ అదాలత్లో రాజీకుదుర్చుకుంటే ఇద్దరు గెలిచినట్లే అవుతుందన్నారు. రాజీమార్గమే రాజమార్గమన్నారు. ఈ విషయంలో పోలీసులు ఆయా పీఎస్ల వారీగా రాజీకీ అస్కారం అవకాశం ఉన్న కేసులు ఉన్న వారిని రాజీకుదుర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి వెంకటేశ్వర్లు, ఎస్పీ నారాయణరెడ్డి, పబ్లిక్ ప్రాస్యిక్యూటర్ దీపారాణి అన్వేష్సింగ్, సమీనాబేగం, డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి, దానయ్య, సీఐలు భీంకుమార్, సంతోష్, నగేష్, శ్రీనివాస్రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డి -
ప్రారంభించారు.. ప్రవేశం మరిచారు
వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనం నేటికీ అందుబాటులోకి రాలేదు. నెల రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నూతన భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయిలో పనులు కాకపోవడం వల్లే ఆస్పత్రిని అందులోకి తరలించలేదని తెలిసింది. ప్రస్తుతం పాత భవనంలోనే చాలీ చాలనీ వసతులతో సేవలు అందిస్తున్నారు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 330 పడకల సామర్థ్యంతో.. రెండున్నరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వికారాబాద్కు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. భవన సముదాయం, ఇతర వసతుల కోసం రూ.240 కోట్లు మంజూరు చేసింది. గత విద్యా సంవత్సరం వంద మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. మెడికల్ కళాశాలతో పాటు అనుబంధం జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 330 పడకల సామర్థ్యం గల నూతన భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. పట్టణ పరిధిలోని ఎస్ఏపీ కళాశాల ఎదుట నూతన భవన నిర్మాణం చేపట్టారు. తుది దశ పనులు జరుగుతుండగానే ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వైద్య సేవలు అందిచడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఆస్పత్రిని అక్కడికి తరలించలేదు. ప్రస్తుతం బస్టాండ్ రోడ్డులో గల ఏరియా ఆస్పత్రి పాత భవనంలో జనరల్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వంద బెడ్లు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నత్తనడకన పనులు జిల్లా కేంద్రంలో రెండున్నరేళ్ల క్రితం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని షరతు విధించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను సకాలంలో పూర్తి చేయలేదు. దాదాపు మూడేళ్లు కావస్తున్నా భవనం అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వం సకాలంలో బిల్లుల చెల్లించకపోవడంతోనే పనుల్లో జాప్యం జరిగినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి చేశారు. భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకముందే హడావుడిగా ప్రారంభించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్యను వివరణ కోరగా త్వరలో నూతన భవనంలోకి జనరల్ ఆస్పత్రిని మారుస్తామని తెలిపారు. రెండు నెలల్లో పూర్తిస్థాయిలో భవనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం జనరల్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర నేటికీ అందుబాటులోకి రాని వైనం పాత భవనంలోనే సేవలు గదులు సరిపోక ఇబ్బంది పడుతున్న రోగులు -
తీరు మారేనా!
అవినీతికి అడ్డాగా మారిన తాండూరు ఎస్ఆర్ఓతాండూరు: అక్రమ రిజిస్ట్రేషన్లకు తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారింది. అవినీతికి కేరాఫ్గా మారిన ఈ ఆఫీసులో డ్యూటీ చేసేందుకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు జంకుతున్నారు. తాండూరుకు వచ్చేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. రెండున్నరేళ్ల వ్యవధిలో ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా మరో ఇద్దరు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి సస్పెన్షన్కు గురయ్యారు. 2017 నుంచి నేటి వరకు తాండూరు కార్యాలయంలో 11 మందికి పైగా సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహించారు. వీరిలో ముగ్గురు మాత్రమే రెగ్యులర్ అధికారులు. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో ముగ్గురు అధికారులు బదిలీ చేయించుకొని ఇతర జిల్లాలకు వెళ్లారు. నాటి నుంచి ఇన్చార్జులే దిక్కయ్యారు. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ సురేందర్ నాయక్ 16 నెలల పాటు విధులు నిర్వహించగా, చాంద్ బాషా ఏడాది పాటు పని చేశారు. 2024 నుంచి 25 ఫిబ్రవరి వరకు పుర్యనాయక్ రెగ్యులర్ బాధ్యతలు నిర్వహించారు. ఈయనపై డాక్యుమెంట్ రైటర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, మరోవైపు స్థానిక నేతల నుంచి ఒత్తిడి పెంచడంతో చేసేది లేక బదిలీ చేయించుకొని వెళ్లారు. అప్పటి నుంచి సీనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి ఆరు నెలలకు ఒకరు చొప్పున ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా కొనసాగుతున్నారు. 2020లో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ఆన్లైన్లో అనుసంధానం చేశారు. దీంతో కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్ వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసిపోతాయి. ఆన్లైన్ లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు ఇన్చార్జులు అక్రమాలకు పాల్పడ్డారు. 2022 డిసెంబర్లో సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన జమీరొద్దీన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్కు గురయ్యారు. గత నెలలో అనుమతులు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారంటూ ఇద్దరు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు ఫసీయొద్దీన్, పవన్పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. రియల్ వ్యాపారులదే పెత్తనం తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ల జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో రియల్ వ్యాపారులు, పాత నేరస్తుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కొంతమంది రియల్టర్లు అధికారుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. డబుల్ రిజిస్ట్రేషన్లు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించడంతో అవినీతి అక్రమాలు జోరందుకున్నాయి. గతంలో ఒకే ప్లాట్కు రెండు రిజిస్ట్రేషన్లు చేశారు. మున్సిపల్ రోడ్డుకు కూడా రిజిస్ట్రేషన్ చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొందరు రియల్టర్లు ఎమ్మెల్యేను కలిసి సమస్య పరిష్కరించాలని కోరగా వారిని వెనక్కు పంపినట్లు తెలిసింది. తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి కోరినట్లు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తెలిపారు. త్వరలోనే తాండూరు కార్యాలయానికి రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ వస్తారని పేర్కొన్నారు. కార్యాలయాన్ని శాశ్వత భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆ సమయంలోనే అక్రమాలు మూడు నెలల క్రితం తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్య బదిలీ అయ్యారు. దీంతో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సాయికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో 20 రోజుల పాటు విధులు నిర్వహించిన ఆయన 27 రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న పవన్కు బాధ్యతలు అప్పగించారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని పవన్ 10 రోజుల వ్యవధిలో 70 ప్లాట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా సెలవులో వెళ్లిపోయారు. దీంతో మరో జూనియర్ అసిస్టెంట్ ఫసియొద్దీన్కు బాధ్యతలు అప్పంగించారు. రోజుకు దాదాపు 50 చొప్పున ఐదు రోజుల వ్యవధిలో 200 రిజిస్ట్రేషన్లు చేశారు. ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో విచారణకు ఆదేశించారు. దీంతో అసలు విషయం బయట పడింది. పది రోజుల క్రితం ఫసియొద్దీన్ను సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారుల ఆడిట్లో పవన్ సైతం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆయన్ను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటికే ముగ్గురిపై సస్పెన్షన్ వేటు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ లేకపోవడంతో అక్రమాలు ప్రక్షాళణ దిశగా ప్రభుత్వం తాండూరుకు వచ్చేందుకు జంకుతున్న అధికారులు -
భూ భారతితో సమస్యల పరిష్కారం
బొంరాస్పేట: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. గురువారం మండలంలోని ఎన్కేపల్లి, తిర్మలాపూర్ గ్రామాలకు సంబంధించి ఎన్కేపల్లిలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. తిర్మలాపూర్ నుంచి ఎలాంటి వినతులు రాలేదు. ఎన్కేపల్లిలో 9 దరఖాస్తులు అందాయని తహసీల్దార్ పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐలు రవి, శైలజ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
వయోవృద్ధుల బాధ్యత సంతానానిదే
మోమిన్పేట: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం వారి సంతానందేనని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ జిల్లా కార్యదర్శి జూకరెడ్డితో కలిసి వయోధికుల చట్టంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వయోధికుల వేధింపుల చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో మోమిన్పేట మండల అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ -
ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం
అనంతగిరి: వికారాబాద్ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్యం అంతం చేద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం పెరిగి చివరకు మనం తీసుకునే ఆహారంలో కూడా చేరుతోందని తెలిపారు. ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. అనంతరం అనంతగిరి అర్బన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, అటవీ రేంజ్ ఆఫీసర్లు శ్యామ్ కుమార్, రాజేందర్, ప్రతిమ, అటవీ సెక్షన్ అధికారి అరుణ, ఉద్యాన్ కేర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, విద్యార్థినులు, సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోదామ్ను గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం సీల్ను ఓపెన్ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత రికార్డులను పరిశీలించి సంతకాలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు బంట్వారం: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం కోట్పల్లి మండలం రాంపూర్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. భూ సమస్యలపై రైతులు ఇచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీనివాస్కు సూచించారు. అనంతరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సహకారంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పిల్లలందరూ బడిలోనే ఉండేలా చూడాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రేషన్ షాపుల్లో మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీపై ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం -
అటవీ భూమి కబ్జా
బషీరాబాద్: మండలంలోని మైల్వార్ రిజర్వుడు ఫారెస్టులో 5 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. నీళ్లపల్లి ఫారెస్టు సెక్షన్లోని సర్వేనంబర్ 20లో ఇస్మాయిల్పూర్ తండాకు చెందిన బలరాం నాయక్, రెడ్యానాయక్, భీమ్లానాయక్ గుట్టుచప్పుడు కాకుండా విత్తనాలు నాటారు. విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఫారెస్టు సెక్షన్ అధికారి స్నేహశ్రీ, బీట్ అధికారి మల్లప్ప గురువారం అక్కడికి చేరుకొని కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే భూమి విషయం కోర్టులో కేసునడిచింది. కొన్ని నెలల తర్వాత అవీ అటవీ భూములేనని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వ్యవసాయ అధికారులు గుర్తు చేశారు. అటవీ భూములు కబ్జా చేసి సాగు చేయడం చట్టరీత్య నేరమన్నారు. వెంటనే ఆ భూముల్లో గోతులు తీయించారు. త్వరలో మొక్కలు నాటుతామని అధికారులు తెలిపారు. రైతుల వాగ్వివాదం.. కబ్జాకు గురైన భూమిని స్వాధీనానికి వెళితే సాగు చేసిన రైతులు వారిపై గొడవకు దిగారు. తాము ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నామని తమ భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అధికారులు కేసులు పెడుతామని హెచ్చరించడంతో రైతులు వెనుకంజ వేశారు. ● ఇస్మాయిల్పూర్లో 5 ఎకరాల్లో విత్తనాలు నాటిన రైతులు ● అడ్డుకున్న ఫారెస్టు అధికారులు ● ఆందోళనకు దిగిన అన్నదాతలు -
పట్టుబడ్డ గంజాయిని కొట్టేసి..
షాద్నగర్ రూరల్: వచ్చే జీతంతో తృప్తి పడని ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పని చేసే స్టేషన్లోనే గతంలో పట్టుబడిన గంజాయిని దొంగిలించి.. విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన పట్టణంలోని ఫరూఖ్నగర్ ఈద్గా వద్ద చోటుచేసుకుంది. పట్టణ సీఐ విజయ్కుమార్ గురువారం వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో గులామ్ సుల్తాన్ అహ్మద్ ఎకై ్సజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతను వచ్చే వేతనం సరిపోక అక్రమ మార్గం ఎంచుకున్నాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. అక్కడ దొంగిలించి.. ఇక్కడ విక్రయిస్తూ స్టేషన్లో గతంలో పట్టుబడిన గంజాయిని గులామ్ సుల్తాన్ అహ్మద్ దొంగిలించేవాడు. దానికి తనకు వరుసకు కుమారుడైన షాద్నగర్ పట్టణానికి చెందిన అంజాద్కు విక్రయించేందుకు అప్పగించేవాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.75 వేల విలువ చేసే కిలోన్నర గంజాయిని విక్రయించేందుకు అంజాద్ బుధవారం రాత్రి ఈద్గా సమీపంలోకి చేరుకున్నాడు. అదే సమయంలో ఎస్ఐ దేవరాజ్ అధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అంజాద్ కవర్ పట్టుకొని అనుమానాస్పదంగా తచ్చాడడం గమనించారు. అతడి వద్ద ఉన్న కవర్ను పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో విచారించగా నేరం అంగీకరించాడు. ఈ మేరకు ఇద్దరినీ రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను శంషాబాద్ డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ లక్ష్మీనారాయణ అభినందించారు. బంధువు ద్వారా విక్రయం ఎకై ్సజ్ కానిస్టేబుల్ నిర్వాకం పోలీసుల అదుపులో నిందితులు -
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ఇబ్రహీంపట్నం: ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ కోరారు. 100 రోజుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం నాలుగోరోజు ఇబ్రహీంపట్నంలో దుకాణాలను తనిఖీలు చేసి ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న వాటికి ఫెనాల్టీ విధించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్స్ వాడకంతో పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని అన్నారు. కాలుష్య వాతావరణం ఏర్పడి మనుషులతోపాటు పశుపక్ష్యాదులపై దీని ప్రభావం పడుతుందన్నారు. దుకాణాల్లో వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్స్ను ఉపయోగించొద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ప్రవీణ్రెడ్డి, పర్యావరణ ఇంజనీర్ ప్రణవ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములను కాపాడండి
మొయినాబాద్ రూరల్: మండలంలోని తోల్కట్ట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు. ఎక్స్ సర్వీస్మెన్ల పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. కొంతమంది బడాబాబులకు అసైన్డ్ పట్టాలు, పాసు పుస్తకాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. పేదలు సాగు చేసుకునేందుకు మాత్రం అనుమతించడం లేదని మండిపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకే సర్వే నంబర్లోని భూమిని ఇద్దరు సోదరుల్లో ఒకరికి పట్టా చేసి, మరొకరికి లావణి పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. భూ భారతిలోనైనా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో గ్రామస్తులు భిక్షపతి, జంగయ్య, మల్లయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు. రెవెన్యూ సదస్సులో తోల్కట్టవాసుల వినతి -
దిగబడిన వరిధాన్యం లారీ
తాండూరు: తాండూరు డీసీఎంఎస్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద వరిధాన్యం లోడ్ లారీ దిగబడింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. డీసీఎంఆర్ ద్వారా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తాండూరు డీసీఎంఎస్ కార్యాలయ ప్రాంగణంలోని గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. అందులో భాగంగా యాలాల మండలం నుంచి 18 టైర్లు కలిగిన పెద్ద లారీలో వరి ధాన్యంతో డీసీఎంఎస్ గేట్లోకి ప్రవేశించింది. ఇటీవల రోడ్డు వెడల్పుతో డీసీఎంఎస్ గేట్ వద్ద గుంతలా మారింది. దీంతో లారీ రెండు వైపులా ఇరుక్కుపోయి అక్కడే ఆగిపోయింది. బుధవారం రాత్రి నుంచి లారీని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. మరోసారి గురువారం ఉదయం లారీని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో లారీలో ఉన్న ధాన్యం బస్తాలను దింపి పక్కకు తప్పించారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి లోడ్తో వచ్చిన లారీలు రోజంతా నిలిచిపోయాయి. డీసీఎంఎస్ గేట్ దాటుతుండగా ఘటన గోదాంలలోకి వాహనాల రాకపోకలకు అంతరాయం -
జాతీయ రహదారిపై పత్తాలేని పెట్రోలింగ్!
పరిగి: జాతీయ రహదారి వెంట ఎక్కడా పోలీసులు కనిపించడం లేదు. క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తూ అనుక్షణం పర్యవేక్షించాల్సిన వాహనాలు సైతం పత్తాలేకుండా పోయాయని ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రమా దాలు జరిగిన సమయంలో వెంటనే స్పందించే వారు లేక క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై యాక్సిడెంట్లను నివారించడంతో పాటు ప్రమాదాలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు హైవే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలో ఎవరూ అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవేలపై నిత్యం యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైదారాబాద్ నుంచి కర్ణాటక వెళ్లేందుకు హైదారాబాద్– బీజాపూర్ మార్గం ఒక్కటే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు సైతం ఈరూట్లోనే రాకపోకలు సాగిస్తాయి. రద్దీ కారణంగా ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైవే పెట్రోలింగ్ పోలీసుల అలసత్వంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందనే ఆరోపణలున్నాయి. రెండు హైవే పోలీస్ స్టేషన్లు పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లి నుంచి కొడంగల్ మండలం రావులపల్లి వరకు జిల్లాలో జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈమార్గంలో రెండు హైవే పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ నామమాత్రంగానే సేవలు అందిస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం మన్నెగూడ, కొడంగల్లో వీటిని ఏర్పాటు చేశారు. అప్పట్లో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించినా ప్రస్తుతం ఒక స్టేషన్లో ఒక ఎస్ఐ, నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. అరకొర సిబ్బందితో విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణాలున్నాయి. మన్నెగూడలో ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్ స్టేషన్ సిబ్బంది అంగడిచిట్టంపల్లి నుంచి గడిసింగాపూర్, కొండంగల్ పీఎస్ సిబ్బంది రావుపల్లి నుంచి గడిసింగాపూర్ వరకు విధులు నిర్వహించాలి. కానీ వీరు ఏ ఒక్క రోజు కూడా కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. నిత్యం ప్రమాదాలు జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు. రాత్రి వేళ వీటిని ఢీకొట్టి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు వెంట పోలీసులు, పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడంతో కొంత మంది ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఇప్పటికై నా హైవే పెట్రోలింగ్ పెంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కనిపించని గస్తీ వాహనాలు జిల్లా పరిధిలో రెండు పీఎస్లు ఉన్నా సేవలు అంతంతే హైదారాబాద్– బీజాపూర్ హైవేపై నిత్యం ప్రమాదాలు పట్టించుకోని పోలీసు అధికారులు వెంటనే స్పందిస్తున్నారు జాతీయ రహదారిపై రెండు పెట్రోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. రెండు షిఫ్టులుగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. హైవేపై ప్రమాదాలు జరిగిన వెంటనే మా అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి సకాలంలో చర్యలు తీసుకుంటున్నారు. – శ్రీనివాస్, పరిగి డీఎస్పీ -
పద్మమ్మ అంత్యక్రియలకు హాజరైన మాజీ మంత్రి
ధారూరు: చింతకుంట గ్రామంలో గురువారం మృతి చెందిన పద్మమ్మ అంత్యక్రియలకు మాజీ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి అక్క, సబితారెడ్డికి వదిన మృతి చెందినట్లు సమాచారం అందటంతో కొడుకు కారిక్రెడ్డితో కలిసి చింతకుంటకు చేరుకున్నారు. వీరితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, హరిదాస్పల్లి పీఏసీఎస్ చైర్మెన్ వెంకట్రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణతోనే మనుగడ
కుల్కచర్ల: మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని కుల్కచర్ల ఎంపీడీఓ రామకృష్ణ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ అనితారెడ్డి, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మోర వెంకటయ్య, రఘునాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అల్లిపూర్లో.. ధారూరు: అల్లిపూర్ గ్రామంలో ధారూరు ఎంపీడీఓ నర్సింహులు, కాంగ్రెస్ నాయకుడు గంధం హన్మయ్యతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతీ ఇంటి ఆవరణలో మొక్క నాటి పెంచాలన్నారు. గ్రామ కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి.. కొడంగల్ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వారు మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ రఫియాఖానం, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ టి రాంబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ఆర్ శ్రీనివాస్, డాక్టర్ ఈ సోమ్లా తదితరులు పాల్గొన్నారు. విరివిగా మొక్కలు నాటాలి కొడంగల్: ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. బార్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ బస్వరాజు, న్యాయవాదులు బి.కృష్ణయ్య, కె.రమేష్, మొహీద్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుద్యాల్లో.. దుద్యాల్: హకీంపేట్ గ్రామంలో డాక్టర్ వందన ప్రధాన వీధుల గుండా తిరుగుతూ పర్యావరణంపై అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శి ఆనందం, మండల కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్హెచ్పీ నర్సమ్మ, అంగన్వాడీ టీచర్ రామేశ్వరి, ఏఎన్ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల ఎంపీడీఓ రామకృష్ణ -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. హెడ్కానిస్టేబుల్ హరిప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లగూడ – చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ల మధ్య ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు అధికారులు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. చేతి మణికట్టుకు నలుపు, పసుపు, ఎరుపు రంగు కలిగిన దారం ఉందని తెలిపారు. మృతుని ఒంటిపై నలుపు రంగు నైట్ ప్యాంట్, నలుపు రంగు టీ షర్ట్ ఽఉందన్నారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించి భద్రపరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ● త్రుటిలో తప్పిన ప్రమాదం ● పలువురికి స్వల్ప గాయాలు యాలాల: స్టీరింగ్ రాడ్ పనిచేయకపోవడంతో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండం పరిధిలోని గోరేపల్లి శివారులో జరిగింది. దేవనూరు నుంచి తాండూరు వైపు సుమారు 50 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళుతుంది. గోరేపల్లి శివారులోని మలుపు వద్ద స్టీరింగ్ రాడ్ పనిచేయకపోవడంతో అదుపుతప్పి రోడ్డు కిందకు దిగింది. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ గిరి తెలిపారు. ఇంట్లో గంజాయి.. వ్యక్తి అరెస్టు తాండూరు టౌన్: గంజాయి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాండూరు ఎకై ్సజ్ శాఖ ఇన్చార్జ్ సీఐ కె.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. పక్కా సమాచారం మేరకు తాండూరు ఎకై ్సజ్ పోలీసులు, జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో మహ్మద్ మియా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. అతను సేవించేందుకు కొనుగోలు చేసిన 125 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితున్ని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఇన్చార్జ్ సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆదిశేషు రెడ్డి, నిజాముద్దీన్, సిబ్బంది భీమయ్య, రవి, కిషోర్, రాధిక, ఆసిఫాబేగం, రవికిరణ్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు కుల్కచర్ల: ప్రమాదవశాత్తు ముందు ఉన్న బైక్ను ఢీ కొని క్రిందపడి తీవ్రగాయాలైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గేటు దగ్గరలో ఘండిచెరువు గాదె కాలనీకి చెందిన తిరుపతయ్య కుల్కచర్ల వైపునకు వెళ్తున్నక్రమంలో ముందు ఉన్న వాహనాన్ని తగిలి అదుపుతప్పి క్రింద పడిపోయాడు. ఈ ఘటనలో తిరుపతయ్యకు తీవ్రగాయాలు అవ్వడంతో 108లో మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం అనంతగిరి: ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం (సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం) కింద విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే మైనార్టీ విద్యార్థులకు(ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బుద్దిస్ట్, పార్మీలు)నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికా రి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7993357103, 8978964132లలో సంప్రదించాలన్నారు. నేడు గౌతాపూర్లో రెవెన్యూ సదస్సు తాండూరు రూరల్: మండలంలోని గౌతాపూ ర్, బిజ్వార్ గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ తారాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిజ్వార్ అనుబంధ గ్రామం బొంకూర్ తోపాటు గౌతాపూర్ అనుబంధ గ్రామం గోపన్పల్లిలో సదస్సులు ఉంటాయని ఆయన తెలిపారు. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కొడంగల్: భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం అవుతాయని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని టేకుల్కోడ్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహశీల్దార్ విజయ్కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఉంటే తెలియజేయండి దుద్యాల్: భూ భారతి చట్టం రైతులకు చుట్టంలాంటిదని తహసీల్దార్ కిషన్ అన్నారు. ఈర్లపల్లి గ్రామంలో రైతు సదస్సులో మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్నా, ఫిర్యాదులు చేయాలన్నారు. ఉప తహసీల్దార్ వీరేశ్ బాబు, ఆర్ఐ నవీన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఫకీరప్ప, రికార్డు అసిస్టెంట్ ఊషప్ప తదితరులు పాల్గొన్నారు. రైతులకు మేలు.. కుల్కచర్ల: భూ భారతి సదస్సులతో రైతులకు మేలు చేకూరనుందని తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి అన్నారు. పుట్టపహాడ్ రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ..భూములకు సంబంధించిన సమస్యలపై అవగాహన లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. దీంతో సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. డిప్యూటి తహశీల్దార్ చంద్రశేఖర్, గిర్దవరులు ఖాజ, రవి, తదితరులు పాల్గొన్నారు. సమస్యల పనిష్కారానికే.. బంట్వారం: భూ సమస్యల పరిష్కారినికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ తహశీల్దార్ మహేష్ అన్నారు. సుల్తాన్పూర్, నూరుల్లాపూర్ సదస్సులో 26 దరఖాస్తులను డీటీ మహేశ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాంగోపాల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కోట్పల్లి మండలంలో.. కోట్పల్లి మండలంలోని ఇందోల్, ఓగులాపూర్ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి 11 దరఖాస్తులు స్వీకరించినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. రెవెన్యూ సదస్సుకు దరఖాస్తుల వెల్లువ యాలాల: భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహశీల్దార్ వెంకటస్వామి తెలిపారు. చెన్నారంలో 3, ఎన్కెపల్లిలో 1, నాగసముందర్లో 2 వచ్చాయన్నారు. డీటీ కిరణ్కుమార్, ఆర్ఐ వేణు, జూనియర్ అసిస్టెంట్ విజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మోమిన్పేటలో.. మోమిన్పేట: కోల్కుంద, రావులపల్లి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 10 దరఖాస్తులు వచ్చాయని తహశీల్దార్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్కుమార్, అర్ఐలు గోవర్ధన్, సరిత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి తాండూరు రూరల్: రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు తహశీల్దార్ తారాసింగ్ అన్నారు. వీర్శెట్టిపల్లి, గోనూర్ గ్రామా ల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గోనూర్లో–11, వీర్శె ట్టిపల్లిలో ఎలాంటి దరఖాస్తులు రాలేదని తహశీల్దార్ తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్ లలిత, ఆర్ఐ గోపి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ దోమ: ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ గోవిందమ్మ అన్నారు. పోతిరెడ్డిపల్లి, బట్లచందారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో 19 దరఖాస్తులు స్వీకరించారు. డిప్యూటీ తహశీల్దార్ నర్సింహులు, ఆర్ఐలు సుదర్శన్, రాంచంద్రరావు, సీనియర్ అసిస్టెంట్ పర్వేజ్, జూనియర్ అసిస్టెంట్ సరిత, యాదయ్య, మోహన్, శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు చేస్తే చర్యలు
కుల్కచర్ల: మండల కేంద్రంలో గురువారం బాల్యవివాహం చేస్తున్నారనే సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి చేరుకొని రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్లకు చెందని బాలిక(15)ను దాదాపూర్ గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి గురువారం వివాహం చేయాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో వారి ఇళ్లకు వెళ్లి పెళ్లి నిలిపివేయాలని సూచించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ.. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే బాలిక ఆరోగ్యం దెబ్బతింటుంనది తెలిపారు. బాల్యవివాహాలకు సహకరించినా నేరమని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో బాలుడి మృతి దుద్యాల్: విద్యుదా ఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కుదరుమల్లలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కుర్వ నర్సిములు సునీత కుమారుడు భానుప్రసాద్(13). వారికి ఇంటికి దగ్గర్లలోనే పశువుల పాక ఉంది. అక్కడ పశువులను చూడడానికి వెళ్లిన భాను ప్రసాద్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషదచాయలు అలుముకున్నాయి. -
అటవీ భూమిలో ఇంటి నిర్మాణం
కుల్కచర్ల: అటవీ భూమిలో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్న ఆ శాఖ అధికారిపై దురుసుగా ప్రవరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెరువుముందలి తండా(కే)కు చెందిన కేతావత్ భాషా, అతని కుమారుడు నంద్యనాయక్ అటవీ భూమిలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ మంగవారం ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో కేతావత్ భాషా, నంద్యనాయక్ శ్రీధర్ను అసభ్య పదజాలంతో ధూషించారు. దీంతో శ్రీధర్ బుధవారం కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. అడ్డుకున్న అధికారిపై దూషణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు -
బడిబాటకు సన్నద్ధం
● రేపటి నుంచి 19 వరకు కార్యక్రమాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ముందుకు.. దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉపాధ్యాయులు బడిబయట బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై ప్రచారం చేయనున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై సమ్మకం పెంచేలా.. మండల వ్యాప్తంగా 45 ప్రభుత్వ పాఠశాలలు ఐదు ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 4,800 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను 20శాతం పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సర్కారు బడులపై ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించి నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయనున్నారు. నాణ్యమైన విద్య, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, భోజన వసతి వంటి వాటి గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేనున్నారు. అలాగే సాధించిన ఫలితాల గురించి వివరించనున్నారు. విజయవంతం చేస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉంటారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేస్తారు. అలాగే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, భోజన వసతి ఉంటుంది. వీటన్నింటినీ బడిబాట కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తాం. తద్వారా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తాం. – వెంకటస్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్ -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల్లు
నవాబుపేట: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎక్మామిడి, మాదిరెడ్డిపల్లి, మైతాప్ ఖాన్ గూడ, ఎల్లకొండ గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, సంక్షేమమే ధ్యేయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ విజయ్ కుమార్, నాయకులు చిట్టెపు మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, రంగారెడ్డి, ఎండి రఫీ, ప్రకాష్, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య -
దివ్యాంగుల భవనాన్ని ప్రారంభించాలి
హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ పరిగి: పరిగి పట్టణ కేంద్రంలో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని వెంటనే ప్రారంభించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా దాదాపు రూ.7 లక్షల వ్యయంతో నిర్మించారని గుర్తు చేశారు. ఆ భవనాన్ని నేటికీ ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపి వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకొవాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం పరిగి నియోజకవర్గ ఇంచార్జ్ లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు పసుల చంద్రయ్య, ఉపాధ్యక్షుడు నారాయణ, దోమ మండల అధ్యక్షుడు చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు. -
విరమణ వయస్సు పెంచడం సరికాదు
కొడంగల్ రూరల్: ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సరికాదని ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సు 61నుంచి 62సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచించడం సరికాదన్నారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతారన్నారు. 2023 జనవరి నుంచి పెండింగ్లో ఉన్న 5డీఏలలో సత్వరమే మూడు డీఏలను ప్రకటించాలని, పెండింగ్లోని వివిధ బిల్లులు, సరెండర్ లీవ్లు, టీఎస్జీఎల్ఐ, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ను వెంటనే మంజూరు చేయించాలని వివరించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ షఫీ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ -
పదకొండేళ్లు సుపరిపాలనే
అనంతగిరి: ప్రధాని నరేంద్రమోదీ పదకొండేళ్లు సుపరిపాలన అందించారని, ప్రపంచానికి ఆదర్శనాయకుడని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ అన్నారు. బుధవారం వికారాబాద్లో భారత ప్రధాని నరేంద్రమోదీ పాలన 11సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఇచ్చిన నెల రోజుల కార్యాచరణపై ఒక్క రోజు వర్క్షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నెలరోజులు పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. 11 సంవత్సరాలు బీజేపీ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో కార్యక్రమ ఇంచార్జిలను నియమించాలన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ పాలన అవినీతిరహిత పాలన అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, కార్యక్రమ ఇంచార్జి శేరి శ్రీధర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సదానందారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు శివరాజు, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్ నాయకులు ఈశ్వరప్ప, వడ్లనందు, సుచరితారెడ్డి, సాహు శ్రీలత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ నరేంద్రమోదీ ప్రపంచానికే ఆదర్శ నాయకుడు -
పశువుల తరలింపును అడ్డుకున్నందుకే..
తాండూరు టౌన్: అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకోవడంతో కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని పెద్దేముల్ మండలానికి చెందిన పలువురు యువకులు బుధవారం తాండూరు డీఎస్పీకి బాలకృష్ణా రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. పెద్దేముల్ మండలం జనగామ శివారులో మంగళవారం అర్ధరాత్రి ఓ అటవీ శాఖాధికారికి చెందిన ఫాంహౌస్ నుంచి 20 వరకు పశువులను డీసీఎంలో తరలిస్తుండగా, మంబాపూర్కు చెందిన రమేష్ సాగర్, రాము, అంజి అడ్డుకున్నారు. డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీసీఎం వాహనదారులతోపాటు మరి కొందరు యువకులపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు పశువుల తరలింపునకు సహకరించిన అటవీ శాఖ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, పట్టణ కార్యదర్శి కిరణ్ డీఎస్పీని కోరారు. ఈ విషయమై తగు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. మాపై దాడి చేశారు డీఎస్పీకి యువకుల ఫిర్యాదు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుల డిమాండ్ -
ఆటకెక్కిన మైదానాలు!
తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో కానరాని అభివృద్ధి● జిల్లాలోని అన్ని జీపీల్లో ఆట స్థలాలు ● క్రీడా పరికరాలు, వసతులు కల్పించని వైనం ● నిర్వహణ లేక పిచ్చి మొక్కలతోనిండిన మైదానాలు ● నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ధారూరులో నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణం వికారాబాద్: జిల్లాలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మూడేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. స్థలం కేటాయించి నామమాత్రంగా చదును చేయించి బోర్డుల ఏర్పాటుతో సరిపెట్టింది. క్రీడాపరికరాలు, మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. క్రీడా మైదానాల కోసం అప్పట్లో తహసీల్దార్లు నానా ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల స్థల వివాదాలు తలెత్తడంతో వాటిని అధిగమించి భూమి కేటాయించారు. ప్రస్తుతం వారి శ్రమ వృథా అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు అనేక మంది ఉన్నారు. వారికి క్రీడా పరికరాలు, ఆత్మరక్షణ కిట్లు, బూట్లు వంటివి సరఫరా చేయలేదు. క్రీడా మైదానాలు ఉన్నా వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ప్రస్తుతం చాలా ప్రాంగణాలు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల రాళ్లు, గుట్టలు ఉండటంతో క్రీడలకు అనుకూలంగా లేవు. ప్రతి గ్రామ పంచాయతీలో.. జిల్లాలో 585 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి చోటా ఒకటి చొప్పున క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఒక్కో జీపీలో 2వేల చదరపు గజాలు లేకుంటే 20 గుంటలకు తగ్గకుండా భూమిని కేటాయించారు. ఇందుకోసం ప్రభుత్వ, ఫారెస్టు భూములను సేకరించారు. ప్రభుత్వ భూమి లేనిచోట జీపీల్లో లేఅవుట్లు చేస్తే వాటి ద్వారా సామాజిక అవసరాల కింద ఇచ్చే 10 శాతం భూమిని క్రీడా ప్రాంగణాలకు కేటాయించేందురే వీలు కల్పించారు. ఇన్ని ఇబ్బందులు పడి అధికారులు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు సమకూర్చారు. అయితే మౌలిక వసతులు, పరికరాలు సమకూర్చకపోవడం,కీడా ప్రాంగణాల నిర్వహణను గాలికి వదిలేయడంతో నేడు అవి నిరుపయోగంగా మారాయి. కనీసం మూడెకరాలు ఉండాలి గత ప్రభుత్వం క్రీడలకు అవసరమైన మేర స్థలాలు కేటాయించలేదని క్రీడాకారులు అంటున్నారు. 2వేల చదరపు గజాలు లేకుంటే 20 గుంటల భూమి క్రికెట్కు సరిపోదని వారు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది యువకులు క్రికెట్ తోపాటు కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ తదితర ఆటలు ఆడుతుంటారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో ఒక్క ఆట ఆడుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మరో క్రీడ ఆడాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. కనీసం మూడు ఎకరాల స్థలం ఉంటే క్రికెట్కు అనుకూలంగా ఉంటుందని యువకులు అంటున్నారు. ప్రతి గ్రామంలో ఎక్కువ మంది క్రికెట్టే ఆడతారని తెలిపారు. ఒకే చోట మూడు ఎకరాల స్థలం అందుబాటులో లేకుంటే రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక చోట క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపాలని, అలాగే పరికరాలు, వసతులు కల్పించాలని క్రీడాకారులు కోరుతున్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీలకు అప్పగించి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు. -
‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోండి
సబ్కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ దౌల్తాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు సబ్కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ సూచించారు. బుధవారం మండలంలోని నందారం గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సును ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు స్వీకరించారని తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు భూ సమస్యలకు సంబంధించి తగిన ఆధారాలతో గ్రామసభలో దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు గాయత్రి, డీటీ చాంద్పాషా, నాయకులు రాజశేఖర్రెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసిన సేవలే గుర్తింపునిస్తాయి డీఎంహెచ్ఓ వెంకటరవణ ధారూరు: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే గుర్తింపునిస్తాయని డీఎంహెచ్ఓ వెంకటరవణ అన్నారు. బుధవారం మండలంలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సూపర్వైజర్ లక్ష్మికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. వైద్య సేవలు చేసే మనల్ని ప్రజలు దైవంతో సమానంగా భావిస్తారని, వారి నమ్మ కాని నిలబెట్టుకోవాలని సిబ్బందికి సూచించా రు.కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ జయరాం, నాగసమందర్ పీహెచ్సీ ఇన్చార్జ్ డాక్టర్ మేఘన, హెల్త్ ఎడ్యుకేటర్ ప్రీతమ్, ల్యా బ్ టెక్నిషియన్ ఉమ, ధారూరు, నాగసమందర్ పీహెచ్సీల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి యాలాల: నాణ్యమైన విత్తనాలతో మంచి దిగుబడి వచ్చి రైతులకు లాభం చేకూరుతుందని అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు పంటల సాగుపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం వరి, జొన్న, కంది విత్తనాలను పరిశోధన నిమిత్తం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
కబ్జా కాకుంట
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రియల్టర్ల భూ దాహానికి ఖాళీ ప్రభుత్వ స్థలాలే కాదు.. చెరువులు, కుంటలు సైతం మాయమవుతున్నాయి. భగ్గున మండుతున్న ఎండలకు చెరువులు, కుంటలన్నీ ఎండిపోయాయి. కాల్వలు, కట్టలు, అలుగులు సహా శిఖం భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ పక్కనే పట్టా భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు కల్వర్టులు, కాల్వలను సైతం చదును చేసి తమ వెంచర్లలో కలిపేస్తున్నారు. వరదనీరు పారకుండా అడ్డుకట్టలు వేస్తూ.. రైతుల పొలాల మీదకు మళ్లిస్తున్నారు. చెరువులు, కుంటలపై ఎప్పటికప్పుడు నిఘా పెంచాల్సిన అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కళ్లముందే కుంటల ఆనవాళ్లను చెరిపేస్తుండటంతో కొంతమంది రైతులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. హద్దులు దాటి.. జిల్లా వ్యాప్తంగా 2,132చెరువులు, కుంటలు 10, 946 ఎంఎఫ్టీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటి పరిధిలో 70,067 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వం వీటిలో ఏటా 1.20 కోట్ల చేప పిల్లలను వదులుతోంది. 400 టన్నుల కుపైగా దిగుబడి వస్తోంది. వేలాది మంది మత్య్సకారులు ఈ చెరువు లు, కుంటలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వేసవిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. బఫర్జోన్లు, ఫుల్ ట్యాంక్ లెవల్లోని నీరు పూర్తిగా ఇంకిపోయింది. ఇదే అవకాశంగా భావిస్తున్న కొంతమంది అక్ర మార్కులు రాత్రికి రాత్రే మట్టి నింపుతున్నారు. పెద్దకుంట కబ్జా కడ్తాల్: మండలంలోని వంపూగూడ గ్రామ సర్వే నంబర్ 40లోని ‘పెద్దకుంట’కు సంబంధించిన 1.12 ఎకరాల ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బుధవారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రెవెన్యూ సదస్సుకు హాజరైన అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోతుగంటి అశోక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే పెద్దకుంటను సర్వే చేసి, హద్దులు నిర్ధారించాలని కోరారు. భూ భారతి సదస్సుల్లో భాగంగా బుధవారం ఆయా గ్రామాలకు హాజరైన అధికారులకు ఈవిషయమై ప్రజలు ఫిర్యాదులు అందించారు. మొద్దులకుంటలో మట్టి యాచారం: గాండ్లగూడెం సమీపంలోని మొద్దులకుంటను ఓ వ్యాపారి మట్టితో పూడ్చేసినట్లు గుర్తించిన పలువురు రైతులు బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 313లోని పట్టా భూమి యజమానులు కొన్ని రోజులుగా మట్టితో కుంటను పూడ్చేస్తున్నారని, ఎఫ్టీఎల్, బఫర్జోన్ కనిపించడకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఆర్డీఓ వెంటనే పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ అయ్యప్ప, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వెంటనే కుంట వద్దకు చేరుకున్న అధికారులుపోసిన మట్టిని తీసేయాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చెరువుల, కుంటల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు అక్రమార్కులను కట్టడి చేయాలని అభ్యర్థన -
విద్యార్థుల సంఖ్య పెరగాలి
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ నుంచి అన్ని శాఖల జిల్లా అధికారులు, మ్చండల స్థాయి అధికారులు, పాఠశాలల హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. గ్రామాల్లోని బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బడిబయట పిల్లలు ఉండరాదన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. సర్కారు బడుల్లోని వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు వివరించాలని తెలిపారు. పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పాఠశాలలకు చేర్చామని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రెండో విడతలో ఇళ్లు మంజూరైన వారు పనులు చేపట్టేలా అధికారులు చొరవ చూపాలన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ రేణుకాదేవి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రిన్సిపళ్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం బొంరాస్పేట: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మండలంలోని రేగడిమైలారంలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 20 వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 14వ తేదీలోపు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. బొంరాస్పేట రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీపై ఆరా తీశారు. తదనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఎస్వో మోహన్బాబు, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ రేపటి నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం -
జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్
వికారాబాద్: వానాకాలం సీజన్లో పంటల సాగు, విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ఎరువుల వినియోగం తదితర సందేహాలు తీర్చుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డితో ఈనెల 6న ఉదయం 10నుంచి 11:30 గంటల వరకు ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులు ఆయనతో మాట్లాడి సందేహాలనునివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 06–06–2025 సమయం : ఉదయం 10 నుంచి 11:30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 8977755890, 9010299041 -
నిరీక్షణకు మోక్షం..
● బషీరాబాద్లో ఎట్టకేలకు ఇంటర్ తరగతులు ● 8 మంది ఫ్యాకల్టీని నియమించిన ప్రభుత్వం ● కళాశాలకు భవనం కేటాయింపు ● ఊపందుకున్న అడ్మిషన్లు బషీరాబాద్: ఇంటర్ విద్యార్థుల రెండేళ్ల నిరీక్షణకు మోక్షం లభించింది. 2023లో బషీరాబాద్కు జూనియర్ కళాశాల మంజూరైంది. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినా భవనం లేకపోవడం, లెక్చలర్లను నియమించకపోవడంతో విద్యార్థులను తాండూరు జూనియర్ కాలేజీలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం బషీరాబాద్ కశాశాలకు 8మంది ఫ్యాకల్టీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అడ్మిషన్లు ఊపందుకున్నాయి. మండల కేంద్రంలో దశాబ్దాలుగా ఇంటర్ కళాశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కళాశాలను మంజూరు చేసింది. రెండేళ్లయినా తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు నిరుత్సాహ పడ్డారు. గతేడాదిలో 34 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు. అయితే ప్రభుత్వం లెక్చలర్లను నియమించకపోవడంతో విద్యార్థులను తాండూరు జూనియర్ కాలేజీలో చేర్చారు. ప్రస్తుతం సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్సీ తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అధ్యాపకులు ఇంటింటికి తీరుగుతూ విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కళాశాలకు సొంత భవనం లేకుపోవడంతో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని భవనాన్ని కేటాయించారు. బుధవారం భవనాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, అజయ్ప్రసాద్, కళాశాల సిబ్బంది పరిశీలించారు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే తరగతులు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. -
అధిక యూరియాతో అనర్థం
● సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి ● వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిమళ, డాక్టర్ శేఖర్ పరిగి: పంటల సాగులో రైతులు అధికంగా యూరియా వాడుతున్నారని, దీని వల్ల ఎటాంటి ప్రయోజనం లేకపోగా భూ సారం దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిమళ, డాక్టర్ శేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని సైదుపల్లి రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేస్తే తప్పని సరిగా రశీదు తీసుకోవాలన్నారు. పంట కాలం పూర్తయ్యే వరకు వాటిని భద్రపరచుకోవాలని సూచించారు. ఒక వేళ పంట దెబ్బతింటే నష్ట పరిహారం పొందేందుకు రశీదులు ఉపయోగపడతాయన్నారు. వరి సాగుకు నీటిని ఎక్కువగా వాడకూరాదని, రెండు, మూడు రోజులకు ఒక్కసారి పొలానికి నీరు పెడితే సరిపోతుందని తెలిపారు. పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. పప్పు దినుసుల దిగుబడి భారీగా తగ్గిపోయిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, పరిగి వ్యవసాయ సంచాలకులు సౌభాగ్యలక్ష్మి కుమారి, మండల వ్యవసాయ అధికారి రజిత, ఏఈఓ ప్రసిల్లా, పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్, సైదుపల్లి ఇందిరమ్మ కమిటీ సభ్యులు గణేష్, గోపాల్ రెడ్డి, అన్వర్, నర్సింలు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ స్పెషలాఫీర్, అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహా రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని వార్డులకు మంజూరైన అభివృద్ధి పనులు, పురోగతి తదితరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి, 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధుల కింద కొనసాగుతున్న పనులు, నిలిచిన పనులు, నిధుల విడుదల్లో జాప్యం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. నాణ్యతతో కూడిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్యం, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ తదితర విభాగాల పనితీరుపై సమీక్షించామన్నారు. అనంతరం బసవన్న కట్ట వద్ద జంతు వ్యర్థాలను వేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. జనావాసాల నడుమ వ్యర్థాలు వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, చిలుకవాగు కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. కూల్చివేతలకు సహకరించాలి పట్టణ ప్రధాన రోడ్డు పనుల విస్తీర్ణానికి ప్రజలు, చిరు వ్యాపారులు సహకరించాలన్నారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తే నోటీసులు జారీ చేసి తొలగిస్తామన్నారు. పట్టణంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అక్రమ కట్టడాలను తొలగించక తప్పదన్నారు. వంద రోజుల ప్రణాళిక జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగనున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికకు ప్రజలు సహకరించాలన్నారు. మెప్మా, మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డుల్లో ర్యాలీ నిర్వహిస్తూ, తడి, పొడి చెత్త, పరిసరాల శుభ్రత, తాగునీటి వినియోగం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. వంద రోజుల ప్రణాళికతో సమస్యలు దూరం మున్సిపల్ స్పెషలాఫీసర్, అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ -
పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించండి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అనంతగిరి: అర్హులైన వారి నుంచి పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో రైతు ఆత్మహత్య కుటుంబాలు, వితంతు పెన్షన్లు అంశాలపై సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓ, రెవెన్యూ విభాగాల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, వితంతు పెన్షన్లకు సంబంధించి ఆర్థిక సాయం పొందేలా దరఖాస్తులు స్వీకరించి ప్రతిపాదనలు పంపాలన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూమ్ సమావేశంలో డీహెచ్ సూపరింటెండెంట్లు వెంకటేశ్వరి, నేమత్ అలీ, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ మహమూద్ అలీ, డీపీఎం నర్సింలు పాల్గొన్నారు. -
యువత క్రీడల్లోనూ రాణించాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి బొంరాస్పేట: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాందార్పూర్లో నిర్వహించిన బీపీఎస్ (బొంరాస్పేట ప్రీమియర్ లీగ్) నిర్వహించారు. తొమ్మిది జట్లలో బొంరాస్పేట్ కెప్టెన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆర్సీబీ బృందం రన్నరప్గా నిలిచింది. ఈ జట్లకు మంగళవారం కప్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్సింలుగౌడ్, రాంచంద్రారెడ్డి, జయకృష్ణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’పై అవగాహన అవసరం
తాండూరు రూరల్: భూ భారతి చట్టంపై ప్రతీ రైతుకు అవగాహన అవసరమని తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన ఎల్మకన్నె గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. భూ సమస్యలున్న రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రికార్డుల్లో తప్పులుంటే సరిచేసుకోవాలని సూచించారు. భూ మార్పిడిలో సర్వేయర్ రూపొందించిన నక్షను జత చేసినట్లయితే భవిష్యత్లోనూ భూ వివాదాలకు తావుండదని వివరించారు. చంద్రవంచలో డిప్యూటీ తహసీల్దార్ లలిత ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎల్మకన్నెలో 11 దరఖాస్తులు, చంద్రవంచలో నాలుగు దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ తారాసింగ్ తెలిపారు. మ్యుటేషన్, విరాసత్, పాసు పుస్తకంలో రైతు పేర్ల తప్పులు, భూ విస్తీర్ణంలో సవరణపై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోపి, సిబ్బంది బాబు, నర్సింలు, అంజమ్మ, ప్రవీణ్, యాదయ్య, ఇంతియాజ్, ప్రదీప్, నరేశ్, ఉలేందర్, గోపాల్, మహేందర్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి బలవన్మరణం
దోమ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దోమ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. బాలాపూర్ గ్రామానికి చెందిన బాపురం దస్తయ్య(45) కొద్ది రోజుల క్రితమే కూతురు వివాహం ఘనంగా జరిపించాడు. మామిడి తోటల వ్యాపారం చేకుంటూ, చిట్టీలు నడుపుతూ, చిన్న హోటల్ కొనసాగిస్తున్నాడు. మామిడి, చిట్టీల వ్యాపారంలో నష్టంతో పాటు హోటల్ కూడా సరిగా నడవక ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో మానసింకగా కృంగిపోయిన ఆయన మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య వెంకటమ్మ, కూతురు అంజలి, కుమారులు సాయి, హర్ష ఉన్నారు. -
సదస్సులు సద్వినియోగం చేసుకోండి
అనంతగిరి: భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. మంగళవారం ఆయన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎర్రవల్లి, ఆలంపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా, పీఓపీ, భూ విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, పాస్ పుస్తకాల అందజేత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా రెవెన్యూ యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పారు. సదస్సులో వచ్చిన ఆర్జీల రిజిస్టర్ను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్ మండల పరిధిలోని పెండ్లిమడుగులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వినయ్కుమార్, ఎంపీఓ దయానంద్, పంచాయతీ కార్యదర్శి శ్రీజ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపాలి కలెక్టర్ ప్రతీక్జైన్ -
రైతుల సంక్షేమమే ధ్యేయం
నవాబుపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లకొండ రైతు వేదికలో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రైతులకు ఉచితంగా జొన్న, వరి, కంది విత్తనాలు పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మెన్ గీతాసింగ్నాయక్, ఏఆర్ఎస్ తాండూరు శాస్త్రవేత్త యమున, ఏడీఏ శంకర్రాథోడ్, ఏఓ జ్యోతి, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ప్రకాశ్, ఏఈఓలు ఆదిల్, లక్ష్మి, పవన్, మల్లేశ్, రమాదేవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
టీబీ పరీక్షలు తప్పనిసరి
యాలాల: రెండు వారాల పాటు ఎవరికై నా దగ్గు ఉంటే తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. మంగళవారం మండలంలోని అగ్గనూరు ఆరోగ్య ఉప కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారి రుబియానాజ్తో కలిసి వైద్య శిబిరం నిర్వహించారు. రెండు వారాల పాటు దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చాతిలో నొప్పిలాంటి లక్షణాలు కలిగిన 310 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. వారికి స్క్రీనింగ్ పరీక్షల అనంతరం 115 మందికి ఎక్స్రే తీసి వ్యాధిని గుర్తించినట్లు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరునెలల పాటు ఉచితంగా మందులతో పాట పౌష్టికాహారం కోసం నెలకు రూ. వెయ్యి చొప్పున రోగి ఖాతాలో జమ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ సుశీల, సూపర్వైజర్లు శోభారాణి, పల్లె దవాఖాన వైద్యురాలు భువనేశ్వరి, ఎంఎల్హెచ్పీ వైష్ణవి, టీబీ సూపర్వైజర్ రహత్ అలీ, ఏఎన్ఎంలు వీరమణి, రోజారమణి తదితరులు పాల్గొన్నారు. టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ -
సాగు సలహాలకు రైతు నేస్తం
జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి ధారూరు: రైతులకు సాగు సలహాలు ఇచ్చేందుకు రైతునేస్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం ధారూరు రైతువేదికలో వాతావరణ ఆధారిత సూచనలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు వేర్వేరు రకాల విత్తనాలు పంపిణీ చేశారు. కందిలో ఆశ, జొన్నలో పీవైపీఎస్–2, వరిలో ఆర్ఎన్ఆర్–15048 రకాల విత్తనాలు పంపిణీ చేశారు. వీటిని సాగు చేసే రైతుల పొలాలు తరచూ పరిశీలిస్తూ నాణ్యమైన ఉత్పత్తి వచ్చేలా చేయడం తమ బాధ్యత అని ప్రధాన శాస్త్రవేత్త కె.పవన్చంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సూర్యప్రకాశ్, ఏఈఓలు సంతోశ్, సంజూరాథోడ్, మంజుల, మల్లేశ్, హరిప్రసాద్, రైతు నాయకులు పాల్గొన్నారు. -
కొడంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కొడంగల్: కొడంగల్ను రాష్ట్రంలో ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మైనార్టీ మహిళలకు 2వేల కుట్టుమిషన్లు, ఎనిమిది మంది దివ్యాంగులకు ట్రై మోటార్ సైకిళ్లు, కడా కార్యాలయంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.10వేల కోట్లతో పనులు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్ కళాశాల మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కొడంగల్ ప్రభుత్వాస్పత్రిని టీచింగ్ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన ఘతన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిదే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడా అధికారి వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్అంబయ్య గౌడ్, నాయకులు ఓబెదుల్లా కోత్వాల్, మహ్మద్ యూసూఫ్, ప్రశాంత్, నయీమ్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహసీల్దార్ విజయ్కుమార్, మైనార్టీ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా
ఇబ్రహీంపట్నం: నల్లకంచె ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తాచాటారు. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో గీతిక 905, నందు 1,956, అక్షయ 5,761, అనూష 2,504, రమ్య శ్రీ 5,416వ ర్యాంక్ సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది విద్యార్థినులను అభినందించారు. మెరిసిన గిరిజన తేజం కేశంపేట: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మండల పరిధిలోని దేవునిగుడితండాకు చెందిన గిరిజన విద్యార్ధిని వి.దీపన్విత ఆల్ ఇండియా 1,248వ ర్యాంక్ సాధించింది. తండాకు చెందిన బాలునాయక్ తన భార్యతో కలిసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. కుతూరు దీపన్విత 1వ తరగతిని తండాలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివింది. అనంతరం 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు షాద్నగర్ ఇంగ్లిష్ మీడియం పబ్లిక్ స్కూల్లో చదివింది. అనంతరం ఇంటర్మీడియట్ను హైదరాబాద్లోని అల్మాస్గూడలో ఉన్న సంకల్ప్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసింది. ఇంటర్మీడియట్లో 734 మార్కులను సాధించిన దీపన్విత జేఈఈలో (హల్టికెట్ నంబర్ 256125077) ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు తండావాసులతో అభినందించారు. ఉన్నత చదువులకు దాతలు సహకరించాలని తండ్రి కోరాడు. -
నైపుణ్యం కలిగిన యువతతోనే వికసిత భారత్
శంషాబాద్ రూరల్: దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏమిటో ప్రతి పౌరుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి.. నైపుణ్యం కల్గిన యువతరమే వికసిత భారతానికి బాటలు వేయగలదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆవరణలో సోమవారం శిక్షణార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రస్టు శిక్షణార్థులు, భూభరతి లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు, మహిళలు, యువత అభివృద్ధిపై స్వర్ణ భారత్ ట్రస్టు ప్రధాన దృష్టి పెట్టిందన్నారు. ఒక పూట అన్నం పెట్టడం కాకుండా.. స్వశక్తితో రోజూ ఆహారాన్ని సమకూర్చుకునేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నిత్య జీవితంలో యోగా, ధ్యానం, ఆరోగ్యకర ఆహారాన్ని జీవన విధానంగా చేసుకోవాలని సూచించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భూభారతి చట్టంతో సమస్యలు తొలగాలని ఆకాంక్ష -
ఉత్తమ కార్యదర్శిగా నర్సింలు
మోమిన్పేట: మండల పరిధిలోని ఏన్కతల పంచాయతీ కార్యదర్శి నర్సింలుకు ఉత్తమ కార్యదర్శి అవార్డుకు ఎంపికయ్యారు. మండలంలోని మోమిన్పేట, ఏన్కతల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. డీఎస్పీకి వినతిపత్రం అందజేత తాండూరు టౌన్: దళిత యువకుని పెళ్లి బారాత్ను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత నెల 18న బెల్కటూర్లో జరిగిన ఘటనపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. తల్లిదండ్రులు మందలించారని.. మనస్తాపంతో యువకుడి బలవన్మరణం కుల్కచర్ల: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ ఉరేసుకుని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన ఏముకంటి ఆంజనేయులు(26) తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో గత శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు, బంధువులను ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో సోమవారం ఇప్పాయిపల్లి చెరువుకట్ట సమీపంలో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి పరిశీలించగా మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. మృతుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి కుల్కచర్ల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా.. గ్రామాల్లో శాంతియుత వాతారణం కొనసాగాలన్నా అధికారుల ప్రాత కీలకమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య అన్నారు. సోమవారం తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎస్ఐ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, మార్కెట్ కమిటీ డైరక్టర్లు రాంచంద్రయ్య, ఎల్లయ్య, భరత్కుమార్ రెడ్డి, నాయకులు కృష్ణయ్య, వినోద్, శ్రీను, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, గిర్దవారులు ఖాజా, రవి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల మండిపాటు కుల్కచర్ల: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రొటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించారని బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు బందయ్య, పార్టీ చౌడాపూర్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. సోమవారం అవతరణ వేడుకల అనంతరం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వరి, కంది విత్తనాల పంపిణీని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఉండటాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో కొంత హడావుడి నెలకొంది. అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి అధికారులు తీరును తప్పుబట్టారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు, చెన్నయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా అవతరణ వేడుకలు
యాలాల: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఉదయం 9.30గంటల సమయంలో ఎంపీడీఓ పుష్పలీల జాతీయ జెండా ఆవిష్కరణకు ఇబ్బంది పడ్డారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయం వద్ద ప్రొఫెసర్జయశంకర్ సార్ చిత్రపటంతో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఉంచాల్సి ఉండగా.. పాత చిత్రపటాన్నే ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ సైతం విషయం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల తీరుపై కాంగ్రెస్ నేతల గుర్రు ధారూరు: రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను మండల పరిధిలో సోమవారం నామమాత్రంగా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించకుండానే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సమయపాలన సైతం పాటించలేదని మండల పరిషత్ సముదాయంలో మినహాయిస్తే ఎక్కడా రాష్ట్ర గీతాన్ని ఆలపించలేదని మండిపడ్డారు. అలంకరణకు నోచుకోని కార్యాలయాలు బషీరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను అధికారులు నామమాత్రంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఏ ఒక్క కార్యాలయం విద్యుత్ అలంకరణకు నోచుకోలేదు. తహసీల్ కార్యాలయం, మండల మహిళా సమాఖ్య ఎదుట తెలంగాణ తల్లి చిత్రపటం లేకపోవడంతో పక్కనే ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఉంచిన ఫొటో తీసుకువచ్చి ఆవిష్కరణ పూర్తి చేశారు. కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటంతో పాటు పాత తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఉంచారు. పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి చిత్రపటం లేకుండానే జెండావిష్కరణలు చేశారు. మారని తెలంగాణ తల్లి చిత్రపటం.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు -
దుద్యాల్ తహసీల్కు అవార్డుల పంట
దుద్యాల్: తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అధికారులు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ తహసీల్దార్గా కిషన్, ఉత్తమ ఉప తహసీల్దార్గా వీరేశ్బాబు, ఉత్తమ ఆర్ఐగా నవీన్, ఉత్తమ సర్వేయర్గా మహేశ్కుమార్ను ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వారిని కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఉత్తమ కార్యదర్శులుగా భాస్కర్, రాజిరెడ్డి కుల్కచర్ల: కుల్కచర్ల, చౌడపూర్ కార్యదర్శులు భాస్కర్, రాజిరెడ్డి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. భాస్కర్ కుల్కచర్ల ఇన్చార్జి ఎంపీఓగా భాధ్యతలు నిర్వహిస్తుండగా, రాజిరెడ్డి చౌడాపూర్ ఇన్చార్జి ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఎంపీఓకు ఉత్తమ సేవా అవార్డు యాలాల: మండల పంచాయతీ అధికారి గాలి యాదయ్య సోమవారం ఉత్తమ సేవా అధికారి అవార్డును అందుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్పీకర్ ప్రసాద్కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆయనకు ఈ అవార్డు అందజేశారు. బీసీ బాలికల హాస్టల్ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మికి సైతం అవార్డును అందుకున్నారు. నలుగురికి ఉత్తమ అవార్డులు -
వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
అనంతగిరి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి వీడీడీఎఫ్(వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవెలప్మెంట్ ఫోరం)ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు రూరల్: నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో 60 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందన్నారు. రాజీవ్ యువ వికాసం, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంగెంకలాన్ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు కూడా వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్చందు, నాయకులు వడ్డె శ్రీనివాస్, పండరి, శరుణు బసప్ప, రాజ్కుమార్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. క్రికెట్ టోర్నీ విజేత పెద్దేముల్ తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో బీఎమ్మార్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతగా పెద్దేముల్ జుట్ట, రెండో స్థానంలో గుంతబాసుపల్లి జట్లు నిలిచాయి. గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యాక్రమంలో టోర్నీ నిర్వాహకులు, క్రీడాకారులు రాము యాదవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి దోమ: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని శివారెడ్డిపల్లికి చెందిన షరీఫా బేగం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. సోమవారం నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీలను నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విత్తనాల పంపిణీ అనంతరం గ్రామంలోని రైతులకు ఎమ్మెల్యే సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, కందులు, జొన్న విత్తనాలను ఏవో ప్రభాకర్ రావు తో కలసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామా, ఏఈవోలు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి మంచాల: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. మండల పరిధిలోని ఆగాపల్లిలో నాగార్జునసాగర్– హైదరాబాద్ రోడ్డుపై మంచాల పోలీసులు ఏర్పాటు చేసిన వాహన తనిఖీ శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. -
ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు
● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ● మున్సిపల్ అభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం తాండూరు టౌన్: ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు అనే నినాదంతో తాండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని సుందరంగా, పచ్చదనంగా, పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పరిరక్షణ, మొక్కలు నాటడం, పట్టణ సుందరీకరణ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈఈ ఖాజహుస్సేన్, సిబ్బంది, మెప్మా ఆర్పీలు, వార్డు ఆఫీసర్లు తదితరులు కార్యాలయం నుంచి ఇందిరాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ధారాసింగ్, మాజీ కౌన్సిలర్లు రత్నమాల, నీరజ, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని కాపాడుకుందాం
కడ్తాల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి విద్యారంగాన్ని కాపాడుకుందామని టీఎస్యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్ పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మండల పరిధిలోని అన్మాస్పల్లిలో సోమవారం ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్, మండల అధ్యక్షుడు జంగయ్య, మాజీ సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే దేశం.. ఒకే ఎన్నిక
● ఇదే బీజేపీ నినాదం ● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పరిగి: దేశంలో నిత్యం ఎన్నికలు జరగడం ద్వారా అభివృద్ధి కుంటు పడుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పరిగి పట్టణంలో ఒకే నేషన్.. వన్ ఎలక్షన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా కోడ్ అమల్లోకి వచ్చి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. వీటన్నంటినీ దృష్టిలో ఉంచుకునే ఒకే సారి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. గడిచిన పదేళ్లలో దేశం ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీతోనే సాధ్య మైందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే అర్హులైన వారికి పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సమగ్రాభివృద్ధే లక్ష్యం
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ● ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ● పాల్గొన్న ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి వికారాబాద్: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో గ్రామ, పట్టణ, నగరాలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి మిషన్కు శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జిల్లాలో ఇప్పటి వరకు రూ.20.37 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. 5,214 మందికి ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్రంలో ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేనివారు ఉండరాదన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,214 పేదలకు ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తొలి దశ నిర్మాణం పూర్తి చేసుకు న్న వారికి రూ.92లక్షలు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 1,00,358 రైతులకు రూ.849 కోట్లు రుణ మాఫీ చేసినట్లు గుర్తుచేశారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 2,26,253 మంది రైతుల ఖాతాల్లో రూ.213 కోట్లు జమచేశామన్నారు. సన్న రకం వడ్లు 49,680 క్వింటాళ్లు కొనుగోలు చేసి బోనస్ కింద రూ. 2.48కోట్లు అందజేసినట్లు తెలిపారు. అలాగే 64,437 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.104 కోట్లు జమ చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లాలో 19,888 లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.11.93 కోట్ల కూలీల ఖాతాల్లో జమ చేసామని తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందితెలిపారు. జిల్లాలో 1,603 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినట్లు వివరించారు.విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని స్పీకర్ ప్రసాద్కుమార్ పేర్కొన్నారు.జిల్లాలోని వికా రాబా ద్, పరిగి ప్రాంతాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైనట్లు తెలిపారు.రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాలో 15,188 మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి రూ.41.65 కోట్లు అందజేశామని తెలిపారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. జూన్ 3 నుంచి కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఈ చట్టం అమలుకు ధారూరును పైలెట్ మండలంగా ఎంపిక చేశారని తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి, గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి 579 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని 1,07,525 మంది పింఛనుదారులకు ప్రతి నెలా రూ.26.22 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కలాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద జిల్లాలోని 4,738 మంది లబ్ధిదారులకు రూ.47.43 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొని జిల్లా వ్యాప్తంగా 6,941 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు వీక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అదనపు ఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో వాసుచంద్ర, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
దైవచింతనతో మానసిక ప్రశాంతత
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి మర్పల్లి: దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. మండలంలోని పట్లూర్లో మూడు రోజులుగా దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం ముగింపు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని, ఇందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, మండల అధ్యక్షుడు రామేశ్వర్రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు బలరాంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దర్శించుకున్నారు. వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ బాల్క్ –2 అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల మాజీ అధ్యక్షులు ప్రభాకర్, రవిందర్, జిల్లా కార్యదర్శి సంజీవరెడ్డి పాలొన్నారు. -
చెరువులపై నిర్లక్ష్యపు నీడ
● ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం ● తగ్గిన నీటి సామర్థ్యం ● బీడుగా మారుతున్న ఆయకట్టు ● ఆందోళనలో రైతులు కొడంగల్: నియోజకవర్గంలోని ప్రధాన చెరువులు, కుంటలు మరమ్మతులకు నోచుకోక బోసిపోయి కనిపిస్తున్నాయి. సాగునీరు లేక ఆయకట్టు భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి. పలు చెరువుల కింద వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయినా పంటలు పండగ పొలాలు నిరుపయోగంగా మారాయి. నియోజకవర్గంలో వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. వర్షాధార పంటలపై ఆధారపడి ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది రైతులు బోర్లు వేసుకొని పంటలు పండిస్తున్నారు. కురిసిన కొద్దిపాటి వర్షం నీరైనా చెరువుల్లోకి వచ్చి చేరుతుందా అంటే కష్టమే. నోటీఫైడ్ చెరువులు.. కుంటల్లో మట్టి పేరుకు పోయింది. పాటు కాల్వలకు మరమ్మతులు లేవు. వరద నీరు చెరువుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. నియోజకవర్గంలోని చెరువులకు గతంలో చేసిన పనులు నామమాత్రంగా జరిగాయి. నిజాం కాలంలో నిర్మించిన చెరువులకు మరమ్మతులు చేయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. హస్నాబాద్ చెరువుకు 950 ఎకరాల ఆయకట్టు, కొడంగల్ చెరువుకు 550 ఎకరాల ఆయకట్టు ఉంది. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోని చెరువులు, కుంటలు నిండటం లేదు. దీంతో పంటలు సాగు చేయడం లేదు. కొడంగల్ మండలంలో 5 నోటీఫైడ్ చెరువులు ఉన్నాయి. వందలాది మంది రైతులకు చెరువుల కింద ఆయకట్టు భూములు ఉన్నాయి. మిషన్ కాకతీయ పనులు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇప్పటికై నా చెరువుల మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
జెండా ఆవిష్కరించనున్న స్పీకర్ ప్రసాద్కుమార్ అనంతగిరి: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10గంటలకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ ప్రతీక్జైన్ పర్యవేక్షించారు. 10.05గంటలకు పోలీసు గౌరవ వందనం స్వీకరణ, 10.10గంటలకు స్పీకర్ సందేశం, 10.25గంటలకు అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 10.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11 గంటలకు గ్రామ పాలన అధికారుల నియామక ఉత్తర్వులు అందజేత, 11.10 గంటలకు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేత, 11.20గంటలకు జాతీయ గీతంతో కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. నేటి ప్రజావాణి రద్దు అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వాసులు విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ‘డబుల్’ ఇళ్లు ఇవ్వండి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ అనంతగిరి: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న తమకు డబుల్ బెడ్రూం లేదా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం మున్సిపల్ కార్మికులతో సమావేశమై మాట్లాడారు. మధ్యలో నిలిచిన డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, బుచ్చయ్య, రాములు, లక్ష్మి, నర్సింలు, దశరథ, అనంతమ్మ, జ్యోతి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. నకిలీ పత్తి విత్తనాల పట్టివేత● రూ.7.50 లక్షల విలువ చేసే 300 కిలోల నిషేధిత విత్తనాలు స్వాధీనం ● ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు షాద్నగర్: గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న, కొనుగోలు చేసిన వారిని పోలీసులు పట్టుకొన్న సంఘటన షాద్నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడుకు చెందిన జంపాని నాగేశ్వర్రావు కొంతకాలంగా వికారాబాద్ జిల్లా ద్యాచర్లలో రైతుల వద్ద కొంత పొలాన్ని కౌలు కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పల్నా డు జిల్లా అమరావతి మండలానికి చెందిన వీర వసంతరావు ద్వారా నకిలీ పత్తి విత్తనాలు తెప్పిస్తున్నాడు. మేలైన విత్తనాలు అని నమ్మించి చుట్టు పక్కల ఉండే రైతులకు విక్రయిస్తున్నా డు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి షాద్నగర్లో విక్రయించేందుకు ప్రయత్నించారు. పట్టణ శివారులోని బక్కర్మన్ గార్డెన్ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో నిషేధిత పత్తి విత్తనాలను కారులో తీసుకొచ్చి ముగ్గురు రైతులకు విక్రయించేందుకు ప్రయత్నించారు. పక్కా సమాచారం అందుకున్న షాద్నగర్ వ్యవసాయ అధికారులు, ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు నకిలీ విత్తనా లు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న వారిని పట్టుకొన్నారు. వారి నుంచి రూ.7.5లక్షల వి లువ చేసే 300కిలోల నకిలీ విత్తనాలను, కారు ను స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వర్రావు, వీర వసంతరావుతోపాటు వికారాబాద్ జిల్లా ఐయాన్పూర్కు చెందిన రైతు గంగారపు పాండు, దాచారం గ్రామానికి చెందిన టెక్నో సీడ్స్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చాకలి రాములు, ఐనాపూర్కు చెందిన రైతు నెమలి రవిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో షాద్నగర్ ఇన్చార్జి ఏడీఏ నిషాంత్కుమార్, ఏఈఓ తేజ్కుమార్, ఎస్ఐ శరత్కుమార్, మేడ్చల్ ఎస్ఓటీ ఎస్ఐ ధనుంజయ పాల్గొన్నారు. -
అనుమతులకు మించి తవ్వకాలు
పరిగి/దోమ: అనుమతులకు మించి అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపిన సాయి కృష్ణ స్టోన్ క్రషర్స్పై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు క్రషర్లో పనిచేస్తున్న ఆరుగురిని రిమాండ్కు తరలించారు. పరిగి సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన ప్రకారం.. దోమ మండలం దిర్సంపల్లి శివారులో సర్వే నంబర్ 173లో దోమ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, కిష్టాపూర్కు చెందిన నాగిరెడ్డి పది ఎకరాలకు లీజు తీసుకుని మైనింగ్ నిర్వహిస్తున్నాడు. అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో మే 21న సర్వే చేసిన అధికారులు 1.1 ఎకరాల్లో అదనంగా తవ్వకాలు జరిపి రూ.2కోట్ల వరకు ఆర్జించినట్లు గుర్తించారు. మే 31న తాండూర్ అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అధికారి సత్యనారాయణ, దోమ డిప్యూటీ తహసీల్దార్ పోలీసు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆందోళన చెందిన క్రషర్ నిర్వాహకుడు రాత్రికి రాత్రే తవ్వకాలు జరిపిన చోట పూడ్చేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మూడు హిటాచీలు, ఓ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు క్రషర్ యజమాని కొప్పల నాగిరెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. క్వారీలో పనిచేస్తున్న శ్రీశైలం, సుజిత్కుమార్ మెహతా, ఎండీ ఆజాద్, ప్రకాశ్కుమార్, సురేశ్సింగ్, రామకృష్ణను రిమాండ్కు తరలించామన్నారు. నాగిరెడ్డితో పాటు పలువురు పరారీలో ఉన్నారని వారి జాడకోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో దోమ ఎస్ఐ ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడిపై కేసు ఆరుగురికి రిమాండ్ వివరాలు వెల్లడించిన పరిగి సీఐ శ్రీనివాస్రెడ్డి -
బీటీ రోడ్డుకు బ్రేక్!
యాలాల: మండల పరిధిలోని అడాల్పూర్ గ్రామానికి వేస్తున్న బీటీ రోడ్డు పనులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న మెటల్ రోడ్డు మార్గం అటవీశాఖ పరిధిలోని వస్తోందంటూ ఆ శాఖ అధికారులు పనులను అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రూ.2.30 కోట్ల నిధులు మంజూరు అడాల్పూర్కు వెళ్లేందుకు తాండూరు మండలం బిజ్వార్ శివారు నుంచి రాకపోకలకు ఉన్న మార్గంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం మీదుగా ఉంది. ఈ క్రమంలో 2012లో మెటల్ రోడ్డు నిర్మించారు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో ఈ మార్గం మీదుగా వెళ్లేందుకు గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో పంచాయతీ రాజ్ శాఖ నుంచి 3.25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి గాను రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇదే మార్గంలో ఐదు చోట్ల కల్వర్టులున్నాయి. ఇటీవల కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందితో కలిసి వచ్చి పనులు నిలిపివేయించారు. దీంతో గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి సమస్య వివరించి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. దరఖాస్తు చేసుకోవాలని సూచించాం బిజ్వారం శివారు నుంచి అడాల్పూర్ వరకు వేస్తున్న రోడ్డు అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. దీంతో 1.67 కిలోమీటర్ల భూభాగం కోల్పోతున్నాం. ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని నాలుగు నెలల క్రితమే గ్రామస్తులకు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు సూచించినా వారు పట్టించుకోలేదు. ఇప్పటికే అడాల్పూర్ నుంచి షేక్పీర్ల గుట్ట మీదుగా కమాల్పూర్ వరకు ఉన్న రోడ్డు సైతం అటవీశాఖ పరిధిలోనిదే. ఈ విషయంలో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అనుమతి కోరుతూ నివేదిస్తే రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అనుమతులు వచ్చాక బీటీ రోడ్డు పనులు చేపట్టవచ్చు. – రాజేందర్, ఫారెస్టు రేంజ్ అధికారి నిలిచిన అడాల్పూర్ రోడ్డు నిర్మాణం అటవీశాఖ పరిధిలోకి వస్తుందని అడ్డుకున్న అధికారులు ప్రభుత్వ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని సూచన ఆందోళనలో గ్రామస్తులు -
ప్రారంభం కాని సరఫరా
యాలాల: మూడు నెలల రేషన్ ముందే పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆదివారం నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యాలాల మండలంలో మాత్రం మొదటి రోజున బియ్యం పంపిణీ చేయలేదు. మండల పరిధిలో మొత్తం 36 రేషన్ దుకాణాలు ఉండగా జూన్కు సంబంధించిన బియ్యం కోటా ముద్దాయిపేట, రేళ్ల గడ్డ తండాకు మాత్రమే స్టాక్ పాయించట్ నుంచి రేషన్ దుకాణానికి చేరింది. మిగిలిన రేషన్ షాపులకు బియ్యం సరఫరా జరగకపోవడంతో లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభం కాలేదు. కాగా మూడు నెలల కోటాకు సంబంధించిన నిల్వ ఉంచుకునే ప్రదేశం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కోటాకు సంబంధించి ఈపాస్ మిషన్ నుంచి లబ్ధిదారుల వివరాల సేకరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని డీలర్లు పేర్కొంటున్నారు. -
చదువుతోనే ఉన్నత శిఖరాలు
అనంతగిరి: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని జగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ అధ్యక్షుడు నూలి బస్వరాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం వికారాబాద్లో వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వీరశైవ జంగమ, లింగాయత్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో చదువుతోనే అన్ని సాధ్యమన్నారు. పోటీ ప్రపంచంలో టాప్ స్థాయిలో రాణిస్తేనే అవకాశాలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు కష్టపడి 500 పైగా మార్కులు సాధించడం గొప్ప విషయమన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించేవరకు విశ్రమించవద్దన్నారు. కష్టపడి చదివితే విజయం తప్పక వరిస్తుందన్నారు. విద్యార్థులకు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మంచి స్థాయిలో స్థిరపడి తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, వీరశైవ సమాజం అధ్యక్షుడు అప్ప విజయ్కుమార్, కార్యదర్శివిద్యాసాగర్, బిచ్చప్ప, వీరకాంతం, విశ్వంపంతులు, యువదళ్ అధ్యక్షుడు కోటిలింగం, సభ్యులు వసంత్, అమర్, భాను, సుధీర్పటేల్, రాజేష్, బసవేశ్వర్, శంకర్, సంతోష్, ధన్శెట్టి తదితరులు పాల్గొన్నారు. జగజ్యోతి బసవేశ్వరవిద్యా సంస్థ అధ్యక్షుడు బస్వరాజు -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నవాబుపేట: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య భరోసా ఇచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గంగ్యాడలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాది పేదల ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదన్నారు. విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణ దశలను బట్టి బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోవిందమ్మ, నాయకులు మల్లేశం, రామచంద్రారెడ్డి, దాసుగౌడ్, కిష్టయ్య, మాణిక్యం, జంగయ్య, విట్టల్, నర్సింలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
యాలాల: మండలంలోని జుంటుపల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు విజయ్కుమార్ అన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. ఈ విషయమై ఆదివారం కాంగ్రెస్ నాయకులు కేంద్రం వద్ద కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు రైతులకు ముందస్తుగా 60 వేల గన్నీ బ్యాగులు అందించారన్నారు. తేమ శాతం ఉన్న 38 వేల బ్యాగుల వరి ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించిన ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేష్కుమార్, ఆశప్ప, ఆంజనేయులు, శాంతుకుమార్, రాంచందర్, ఎల్లప్ప పాల్గొన్నారు. -
అవయవదానానికి ముందుకు రావాలి
కేశంపేట: సమాజంలో ప్రతిఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని ఆల్ ఇండియా ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ సోంటే శ్రీనివాస్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ గుడూరు సీతామహాలక్ష్మి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అవయవాలను దానం చేస్తున్నట్టు అంగీకారపత్రాన్ని గాంధీ మెడికల్ ప్రిన్సిపాల్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాలను వదిలిపెట్టి మానవత దృక్పథంతో అవయవదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. మరణించిన తర్వాత శరీరాన్ని పూడ్చిపెట్టడం, కాల్చి వేయడంతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అందుకే అందరూ మరణాంతరం అవయవదానానికి ముందుకు రావాలని సూచించారు. -
‘జయ గ్రూప్స్’పై చర్యలు తీసుకోవాలి
పంజగుట్ట: తమ వద్ద ప్రీ లాంచింగ్ ఆఫర్లో ప్లాట్లు తీసుకుంటే తక్కువ ధరకు ఇస్తామంటూ అందంగా బ్రోచర్లు ముద్రించి వందలాది మంది నుంచి దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన జయత్రి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ (జయ గ్రూప్స్) సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు వర్మ కుమార్, మూర్తి శ్రీనివాస్, ప్రసాద్ శివపురం, గణేష్, ఫణిలు మాట్లాడుతూ .. కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మరో 19 మంది డైరెక్టర్లతో కలిసి 2021 ఫిబ్రవరిలో కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేస్లో అన్ని హంగులతో కార్యాలయం ఏర్పాటు చేశారని మొదటి వెంచర్గా హిల్టన్ జయ డైమెండ్ పేరుతో వెంచర్ ప్రారంభించినట్లు తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తమకు పదేపదే ఫోన్లు చేసి చందానగర్ లోని గోపనపల్లిలో తక్కువ ధరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారన్నారు. కార్యాలయానికి వెళ్లగా హంగు, ఆర్భాటాలతో పాటు దాదాపు వంద మందికి పైగా ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారన్నారు. సంస్థ ప్రతినిధుల మాటలు నమ్మి రూ. 20 లక్షల నుంచి రూ.1.80 కోట్ల వరకు పెట్టుబడి పెట్టామన్నారు. రెండేళ్లలో ప్లాట్లు అప్పగిస్తామని చెప్పారని. గడువు ముగిసిన తర్వాత అడిగితే నేడు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో తమకు చూపించిన స్థలం వద్దకు వెళ్లి ఆరా తీయగా సదరు ప్రాజెక్టు వేరే సంస్థకు చెందినదిగా తెలుసుకుని నివ్వెరపోయామన్నారు. మద్య తరగతికి చెందిన తాము పైసాపైసా కూడబెట్టుకుని ప్లాట్లు కోసం వెచ్చించామన్నారు. ఇదే సంస్థ గతంలో రాజమండ్రిలోనూ ఇదేతరహాలో మోసం చేసినట్లు తెలిసిందన్నారు. నిందితుడు కాకర్ల శ్రీనివాస్, మరో ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రస్తుతం బెయిల్పై దర్జాగా తిరుగుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు, ఈడీ కార్యాలయంలో, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సంస్థ బాధితుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో నిండా ముంచారు రూ.300 కోట్లకు పైగా వసూలు న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు -
సంచిని పడేసి.. పుస్తెలతాడుని తెంచేసి
వృద్ధురాలి మెడలో మంగళసూత్రం అపహరణ ఇబ్రహీంపట్నం: కూరగాయల కోసమొచ్చిన వృద్ధురాలి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని ఓ దుండగుడు అపహరించుకొని పరారైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(65) ఇబ్రహీంపట్నంలోని మార్కెట్కు ఆదివారం ఉదయం వచ్చింది. అక్కడ కూరగాయలు తీసుకొని తలపై పెట్టుకొని వెళుతుంది. ముఖానికి మంకి క్యాప్ ధరించిన దుండగుడు నడుచుకుంటూ వచ్చి ఆమె తలపై సంచిని కిందపడేసి మెడలోని నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. దీంతో వృద్ధురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. స్థానిక ఏసీపీ కేపీవీ రాజు, సీఐ జగదీశ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మహిళ అదృశ్యం యాచారం: కూలీ పనికంటూ ఇంటి నుంచి వెళ్లిన మహిళ తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన దండుగుల శేఖర్ భార్య మమత(29) గత నెల 30న ఉదయం 7 గంటలకు కూలీకి పోతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులైనా తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉంది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లోని బంధువుల ఇళ్లల్లో వెతికినా జాడ లేదు. ఆదివారం మమత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. బైక్ను ఢీకొన్న ట్రాక్టర్ ఒకరి దుర్మరణం ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆమనగల్లు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. ముర్తుజపల్లి గేటు వద్ద హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైక్ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన రాయకుంట కృష్ణయ్య(35), ఆయన బంధువు శేఖర్ పని నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై సొంతూరికి బయలుదేరారు. మార్గమధ్యలో పట్టణ సమీపంలోని ముర్తుజపల్లి గేటు వద్ద అతివేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందగా, శేఖర్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెరువులో మునిగిన యువతి! ఇబ్రహీంపట్నం: చెరువులోకి దిగిన యువతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నగరంలోని ఫలక్నుమాకు చెందిన రేష్మా(24) బాలపూర్కు చెందిన ఆమె స్నేహితుడు ఖాసీంతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు ఆటోలో వచ్చినట్లు తెలిసింది. ఖాసీం ఈత కొడుతుండగా రేష్మా కూడా చెరువులోకి దిగినట్లు సమాచారం. ఏమైయిందో ఏమోగాని ఆకస్మాత్తుగా యువతి చెరువు నీటిలో మునిగిపోయింది. చీకటి పడటంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టలేదు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాల పేరుతో టోకరా నిందితుడి అరెస్టు రాంగోపాల్పేట్: కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ సుధీంద్ర కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లి బాపూజీనగర్కు చెందిన శ్రవణ్కుమార్ అమాయకులను ఎంచుకుని కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. 2009 నుంచి 2024 వరకు బేగంపేట, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీలేఖ అనే మహిళ నుంచి రూ.22వేలు తీసుకుని ఫుడ్ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు. పవన్ అనే వ్యక్తి నుంచి రూ.35వేలు, విశాల్ అనే వ్యక్తి నుంచి రూ.20వేలు, మరో వ్యక్తి నుంచి రూ.35వేలు, వేములవాడకు చెందిన కృష్ణ అనే వ్యక్తి నుంచి రూ.50వేలు తీసుకుని కంటోన్మెంట్ బోర్డులో ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు డిఫెన్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అత డిని ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి తిరుమలగిరి పోలీసులు అప్పగించారు. -
వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
అనంతగిరి: జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. పట్టణంలోని అమర వీరుల స్తూపాన్ని, సభాస్థలి వేదికను పూలతో అందంగా అలంకరించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, నూతన రేషన్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ, గ్రామ పంచాయతీ అధికారులకు నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందో బస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓ రేణుకాదేవికి సూచించారు. స్పీకర్ ప్రసాద్కుమార్ చేతులమీదుగా పతాకావిష్కరణ చేపట్టనున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అదనపు ఎస్పీ టి.వి.హనుమంత్ రావు, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ రాష్ట్ర అవతరణ వేడుకలపై అధికారులకు దిశానిర్ద్ధేశం -
కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం
పూడూరు: తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకుడు, సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్పై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించరాదని హితవు పలికారు. బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, మాజీ అధ్యక్షుడు అనిల్, నాయకులు శ్రీశైలం, శివరాజ్, పాండు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి -
నో స్టాక్..!
శనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025జిల్లాలో ఎరువుల కొరత ● ఫెర్టిలైజర్ దుకాణాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు ● దగ్గరపడుతున్న విత్తు సమయం ● ఆందోళనలో అన్నదాత 10లోuవికారాబాద్: జిల్లాలో ఎరువుల కొరత రైతన్నను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వర్షాలు కురుస్తున్న తరుణంలో ఫెర్టిలైజన్ దుకాణా ల్లో ఎరువుల కొరత ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సారి వర్షాలు ముందుగానే పడుతున్న నేపథ్యంలో రైతులు కూడా విత్తుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల కొనుగోలుపై దృష్టి సారించారు. ప్రస్తుత సీజన్కు అవసరమైన ఎరువుల్లో 15 శాతం కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం దుక్కి ఎరువుగా వాడాల్సిన డీఏపీ కొరత తీవ్రంగా ఉంది. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. అవసరం కొండంత.. ఉన్నది గోరంత జిల్లాలో ఎరువుల అవసరం కొండంత ఉంటే ఉన్నది మాత్రం గోరంతే. సాగుకు సరిపడా విత్తనాలు ఉండటం రైతులకు కొంత మేర ఉపశమనం కలిగిస్తోంది. ఖరీఫ్ సీజన్లో 5,61,719 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకు 1,13,851 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 14,429 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత సీజన్కు 39,898 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 8,088 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. డీఏపీ 27,516 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 2,408 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఎంఓపీ 8,585 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 173 మెట్రిక్ టన్నులే ఉంది. కాంప్లెక్స్ ఎరువులు 35,305 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 3,530 మెట్రిక్ టన్నులు ఉంది. ఎస్ఎస్పీ ఎరువులు 2,547 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 230 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5.61లక్షల ఎకరాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.61లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయా పంటలు సాగు చేయవచ్చునని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గతేడాది 2.57లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఈ సారి 2.58 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందరి అంచనా వేసింది. వరి 1,31,075 ఎకరాల్లో, కందులు 1.10లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 26,908 ఎకరాల్లో సాగు చేయవచ్చని భావిస్తున్నారు. పెసలు 14,568 ఎకరాలు , మినుములు 5,716 ఎకరాలు జొన్నలు 2,572 ఎకరాలు, సోయాబీన్ 2,043 ఎకరాలు, ఇతర పంటలు 7275 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న, జీలుగ, జనుము, సోయాబీన్, కంది విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఫెర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో అవసరం మేరకు పత్తి విత్తనాలు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాకు ఆయా పంటలకు సంబంధించి 41,297 క్వింటాళ్ల విత్తనాలు, 5,16,426 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూస్రీల్ జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,61,719 ఎకరాలు అవసరమైన ఎరువులు 1,13,851 మెట్రిక్ టన్నులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 14,429 మెట్రిక్ టన్నులు అవసరమైన విత్తనాలు 41,297 క్వింటాళ్లు ప్రభుత్వానికి నివేదించాం ప్రస్తుత సీజన్కు ఏ మేరకు విత్తనాలు,ఎరువులు అవసరమో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. సాగుకు సరిపడా విత్తనాల ను అందుబాటులో ఉంచాం. డీఏపీ కొంత మేర కొరత ఉంది. ఈ విషయా న్ని ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో వచ్చే అవకాశం ఉంది. నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి -
ప్రజలను చైతన్య పరచాలి
డీఈఓ రేణుకాదేవి అనంతగిరి: మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ఉపాధ్యాయులు తమ వంతుగా ప్రజలను చైతన్య పరచాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం వికారాబాద్లోని డైట్ కళాశాలలో కస్తూర్బా గాంధీ, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ఉపాధ్యాయులు మానవ అక్రమ రవాణా అరికట్టడంలో తమ వంతు పాత్ర వహించాలన్నారు. మానవ అక్రమ రవాణా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1098, 100, 181, 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్వ చ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్, సుప్రియ శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగు పర్చుకోవాలి పూడూరు: ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలను మెరుగు పర్చుకుని బోధన చేయాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం మండలంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ వీరయ్య, కోర్సు డైరెక్టర్ సాయిరెడ్డి, మానిటరింగ్ అధికారి రామ్ మస్తాన్, సెక్టోరియల్ అధికారి రమేష్, డీఆర్పీలు రవికుమార్, బాల్రాజ్ పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. రథోత్సవం
● వైభవంగా రేణుక ఎల్లమ్మ జాతర ● అమ్మవారి సేవలో ప్రముఖులుతాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్లో కొలువు దీరిన రేణుక ఎల్లమ్మ జాతర నెల రోజులగా వైభవంగా సాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం, సిడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ చైర్మన్ నవీన్రెడ్డి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తెచ్చారు. సిడేను పూలతో అందంగా అలంకరించారు. రథోత్సవం, సిడే ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళి, ఫైనాన్స్ కమిటీ సభ్యుడు రమేష్ మహరాజ్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ విఠల్రెడ్డి, ఏఎస్ఐలు రాజశేఖర్, పవన్కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఆలయ ఈవో శేఖర్ గౌడ్, మాజీ చైర్మన్ సందీప్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: కాంగ్రెస్ అంటే పేదలు, రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామ్రెడ్డి, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్, మాజీ సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పరమేష్, పంచాయతీ కార్యదర్శి వెంకటలక్ష్మి,రెడ్డి, నాయకులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత తాండూరు టౌన్: తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గానికి ఇరువైపులా వ్యాపారులు అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. తాండూరు మీదుగా 167 (ఎన్) నేషనల్ హైవే వెళ్తుండటంతో ప్రధాన రోడ్డును ఇందుకు అనుగుణంగా విస్తరించనున్నారు. పనులు ఆలస్యం కావడంతో సదరు వ్యాపారులు ఇష్టానుసారంగా అనుమతి లేని చోట అక్రమంగా షెడ్డు, మెట్లు ఇతర కట్టడాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ అఽధికారులు పోలీసుల సహాయంతో కట్టడాలను కూల్చేశారు. తాండూరు బస్టాండు నుంచి చించోళి రోడ్డు మార్గంలో సెయింట్ మార్క్స్ పాఠశాల వరకు అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేందుకు సమాయత్తమయ్యా రు. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారులు అధికారుల తీరును తప్పు పట్టారు. ఏమాత్రం సమయం ఇవ్వకుండా హుటాహుటిన కూల్చేయడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారమే అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఎన్ఎంఆర్పై సమీక్ష అనంతగిరి: ప్రభుత్వ విభాగాల్లో వేతన సవరణ కమిటీ పరిగణనను బట్టి దినసరి కార్మికులకు జీత భత్యాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నాన్ మాస్టర్ రోల్ ఉద్యోగ వేతన స్థిరీకరణ (ఎన్ఎంఆర్)పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న హాజరు పట్టిక(ఎన్ఎంఆర్)లో లేని కార్మికులకు వేతన సవరణ కమిటీ సిఫారసు మేరకు కనీస వేతనాలను అందించాలన్నారు. నైపుణ్యం, నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం కలిగిన దినసరి కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనాల పెంపునకు అనుగుణంగా అందించాలన్నారు. గ్రామీణ, మున్సిపల్ పరిధిల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వాల్యా నాయక్, డీహెచ్ఎస్ఓ సత్తార్, డీఎంహెచ్ఓ వెంకటరవణ, విద్యుత్ శాఖ ఎస్ఈ రవి ప్రసాద్, డీబీసీడీఓ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు కేంద్రం అండ మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అప్పోజీగూడ, రెడ్డిపల్లి గ్రామాల కిసాన్ కవన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ అస్పద చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సహకారంతో రైతులకు మందులు పిచికారీ చేసే సమయంలో వేసుకునే కిట్లు పంపిణీ చేశారు. -
అభివృద్ధిలో అగ్రగామి
● రూ.10 వేల కోట్లతో పనులు ● శరవేగంగా నిర్మాణాలు ● సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కొడంగల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు రూ.10 వేల కోట్లతో నియోజకవర్గం దశ దిశ మార్చేలా పనులు సాగుతున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు మొదటి ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ, జూనియర్ కళాశాలలు మంజూరు చేశారు. కొడంగల్ పట్టణంలో 220 పడకల ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రి పనులు చకచకా సాగుతున్నాయి. రూ.6 కోట్లతో ఆర్అండ్బీ అతిథి గృహం నిర్మిస్తున్నారు. రోడ్ల విస్తరణ పనులు ఊపందుకున్నాయి. అభివృద్ధి పనుల్లో వేగం పెంచినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి తెలిపారు. -
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్
అబ్దుల్లాపూర్మెట్: నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయించి రైతులను మోసం చేసే డీలర్లపై కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తానమి వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని అధీకృత డీలర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. డీలర్లు విధిగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారిణి పల్లవి, ఎస్ఐ భద్యానాయక్, డీలర్లు పాల్గొన్నారు. రైతులకు రసీదులు ఇవ్వాలి మహేశ్వరం: ఎరువులు, విత్తనాల దుకాణాదారులు రైతులకు అధిక ధరలకు విక్రయించరాదని మహేశ్వరం వ్యవసాయ శాఖ ఏడీఏ సుధారాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎరువులు, విత్తనాల దుకాణాదారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాల డీలర్లు స్టాక్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అనుమతిలేని మందులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవపాయాధికారి నాగమణి, డివిజన్ టెక్నికల్ అధికారి యాదగిరిగౌడ్, డీలర్లు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ సుజాత -
నర్సింగ్ హోం సీజ్
చేవెళ్ల: ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటనలో చేవెళ్లలోని విజయ్ నర్సింగ్ హోం (ప్రజావైద్యశాల)ను వైద్యాధికారుల బృందం శుక్రవారం సీజ్ చేసింది. మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కల్లెంల నర్సింలుకు విజయ్నర్సింగ్హోంలో ఆపరేషన్ చేశారు. వైద్య వికటించడంతో ఆయన గురువారం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనల చేపట్టారు. వైద్యాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారులు చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్ఓ వైద్య బృందాన్ని తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నర్సింగ్ హోంకు వచ్చిన అధికారులు ఆస్పత్రికి తాళం వేసినట్లు గుర్తించారు. ఫోన్ సంప్రదించేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో వైద్యాధికారుల బృందం ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యాధికారుల విచారణ పూర్తయ్యే వరకు తాళం తీయొద్దని హెచ్చరించారు. గతంలోనూ ఈ నర్సింగ్హోంను వైద్యాధికారులు తనిఖీ చేసిన సమయంలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని నోటీసులు జారీ చేసిన ఇప్పటీ వరకు స్పందించలేదన్నారు. ఈ తనిఖీల్లో మొయినాబాద్ వైద్యాధికారి అన్నపూర్ణ. చేవెళ్ల సబ్సెంటర్ వైద్యురాలు వేదశ్రీ తదితరులు ఉన్నారు. -
డీసీఎం ఢీకొని రైతు మృతి
నవాబుపేట: మద్యం మ త్తులో వాహనం నడిపిన డీసీఎం డ్రైవర్ ఓ రైతు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండల పరిధిలోని వట్టిమీనపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్కుమార్, స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల కిష్టయ్య(54) మధ్యాహ్నం పశువులను మేపేందుకు పొలానికి వెళ్తున్నాడు. శంకర్పల్లి నుంచి మద్యం మత్తులో డీసీఎంను నడుపుతున్న డ్రైవర్ రైతును ఢీకొట్టాడు. దీంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన రైతులు వాహనాన్ని వెంబడించగా మరింత వేగంగా వెళ్లి పులుమామిడి గేటు వద్ద కల్వర్టుని ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లి వాహనం నిలిచిపోయింది. డ్రైవర్ను పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మృతుడికి భార్య స్వరూప, కొడుకు మల్లేశ్, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తునికాకు కూలీలకు తిప్పలు
ధారూరు: పేదలకు తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరు. నలభై రోజులు అడవిలో తునికాకు సేకరించి కళ్లాల్లో విక్రయించిన కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంతో శుక్రవారం వారు నిర్వాహకుల ఇళ్లను ముట్టడించారు. దీంతో సదరు నిర్వాహకులు ఫారెస్ట్ అధికారుల వద్దకు పరుగులు తీశారు. మండల పరిధిలోని పలుగ్రామాల కూలీలు ఏప్రిల్ 21 నుంచి మే 30 వరకు 3,04,600 తునికాకు కట్టలు సేకరించి నిర్వాహకులు ఏర్పాటు చేసిన కళ్లాల్లో విక్రయించారు. ఇందుకు సంబంధించి ఒక్కో కట్టకు రూ.3.30 చెల్లించాల్సి ఉంటుంది. నాటి నుంచి కాంట్రాక్టర్ చెల్లిస్తాడని నిర్వాహకులు, ఫారెస్ట్ అధికారులు చెల్లిస్తారని కాంట్రాక్టర్ బదులిస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి రూ.10.05లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూలీల బ్యాంకు ఖాతాలు తీసుకుని వివరాలు ఆన్లైన్ చేశామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. తమకు పోషణ భారమైందని అధికారులు త్వరితగతిన తమ డబ్బులు జమ చేయాలని కూలీలు కోరుతున్నారు. కూలి డబ్బుల చెల్లింపులో జాప్యం నిర్వాహకుల ఇళ్లను ముట్టడించిన కూలీలు -
సంత.. సమస్యల చింత
పరిగి: పట్టణంలోని మార్కెట్ యార్డులో ప్రతీ శుక్ర, శనివారం సంత కొనసాగుతుంది. ఇక్కడకు వచ్చే రైతులు, ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎటు చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. మార్కెట్ యార్డుకు ధాన్యం, కూరగాయాలు ఇతర పనులపై వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. లక్షల్లో ఆదాయం ఉన్నా సౌకర్యాలు కల్పనలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పరిగి దోమ, కుల్కచర్ల, పూడూర్, బొంరాస్ట్ తదితర మండలాల నుంచి రైతులు, వ్యాపారస్తులు ప్రతదీ శుక్రవారం, శనివారాల్లో సంతలో ధాన్యం, కూరగాయల క్రయ, విక్రయాలకు వస్తుంటారు. ఇందుకు మార్కెట్ కమిటీకి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పశువుల సంతలో పశువులు కొనుగోలు చేసిన, అమ్మినా రైతులు, వ్యాపారస్తులు మార్కెట్కు డబ్బులు చెల్లించాలి. ఇలా వచ్చే సొమ్ములోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే అపవాదు లేకపోలేదు. కంపు కొడుతున్న మార్కెట్ యార్డు మార్కెట్ యార్డుతో ఎక్కడ చూసినా కంపు కొడుతోంది. మార్కెట్కు కూరగాయలు తెచ్చే రైతులు, వ్యాపారస్తులు కుల్లిన కూరగాయలు వదిలి వెళ్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. మార్కెట్ ఆదాయంపై దృష్టి సారిస్తున్న అధికారులు పారిశుద్ధ్య పనులపై అలసత్వం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమాచారం ఇచ్చినా కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆదాయం దండి మార్కెట్ యార్డుకు ఆదాయం వస్తున్నా.. అధికారులు మౌలిక వసతలు కల్పన, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టడం లేదు. ధాన్యం విక్రయంలోనూ మార్కెట్ ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కొంత మంది వ్యాపారస్తులతో కుమ్మకై ్క చిట్టీలు లేకుండానే పశువుల క్రయ, విక్రయాలు చేపట్టి మార్కెట్ ఆదాయానికి గండి కొడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో చిత్తడిగా మారిన మార్కెట్ యార్డు ఇబ్బందులు పడుతున్న రైతులు పట్టించుకోని పాలకులు అధికారులు పట్టించుకోవట్లే.. రైతులు క్రయ విక్రయాలు చేస్తేనే మార్కెట్కు ఆదాయం సమకూరుతుంది. కానీ రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పరిగి మార్కెట్ యా ర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోట్లలో ఆదాయం సమకూరుతు న్నా మార్కెట్ యార్డు అపరిశుభ్రంగానే ఉంటుంది. – మల్లేష్, రైతు, మిట్టకోడూర్ -
నాసిరకం విత్తనాలు అమ్మితే చర్యలు
పూడూరు: రైతులకు నాసిరకమైన విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని కుత్బుల్లాపూర్లో రైతులు కొనుగోలు చేసిన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించారు. గడ్డి మందును తట్టుకునే పత్తివిత్తనాల వల్ల నష్టాల గురించి రైతులకు వివరించారు. ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రశీదులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ అధికారి లక్ష్మికుమారి, మండల అధికారి తులసీరాం, చన్గోముల్ ట్రైనీ ఎస్ఐ ప్రవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్రెడ్డి -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
షాద్నగర్రూరల్: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులోగల బీబీజీ వెంచర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ దేవరాజ్ తెలిపిన ప్రకారం.. బీబీజీ వెంచర్లోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(28) మృతదేహం ఉన్నట్లు వెంచర్ నిర్వాహకులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, ఎముకలు తేలిపోవడం చూస్తుంటే 10 రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడిందా..? గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చి హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంచర్ సూపర్వైజర్ ఇంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి అదృశ్యం పహాడీషరీఫ్: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పహాడీషరీఫ్కు చెందిన షేక్ మహబూబ్(70), షానవాజ్ బేగం దంపతులు దర్గా వద్ద నివాసం ఉంటున్నారు. ఐదు నెలలుగా మహబూబ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల క్రితం చివరగా కుమారుడు ముజఫర్తో ఫోన్లో మాట్లాడిన మహబూబ్ అనంతరం అందుబాటులోకి రాలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై ముజఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి ఓయూలో తరగతులు ప్రారంభం ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్తో పాటు అనుబంధ, ప్రైవేటు కాలేజీలలో జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల వేసవి సెలవుల అనంతరం తిరిగి తరగతులను పునఃప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్సిటీ క్యాంపస్లో కాలేజీలతో పాటు హాస్టల్స్, మెస్సులను కూడ పునఃప్రారంభించనున్నారు. అప్పు తీసుకుని చెక్కేశాడు ● ఇద్దరు మహిళల పేరుతో రూ. 25 లక్షల రుణం ● యువకుడిపై కేసు నమోదు వెంగళరావునగర్: ఓ వ్యక్తి ఇద్దరు మహిళల పేరున రూ.25 లక్షలు రుణం తీసుకుని మోసం చేసిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదగిరినగర్కు చెందిన యూ ట్యూబర్గా పని చేస్తోంది. ఆమెకు పరిచయస్తురాలైన నాగరాణి అనే యువతి గత ఏడాది రాజశేఖర్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. అతను దీవెనకు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ అడిగి ప్రతినెల రూ. 20 వేలు నగదు డిపాజిట్ చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన స్నేహితురాలు నవజ్యోతికి వివరించి ఇద్దరి నెంబర్లు ఇస్తామని, ఇరువురికీ నగదు వేయాలని రాజశేఖర్ను కోరింది. అందుకు అంగీకరించిన అతను వారి నుంచి ఆధార్కార్డులు, వేలిముద్రలు, తీసుకుని వారి పేరున బ్యాంక్ ఖాతాలు తెరిచాడు. మూడు నెలల పాటు ఆయా అకౌంట్లలో నగదు డిపాజిట్ చేసిన అతను, నాలుగో నెల వేయలేదు. దాంతో వారు బ్యాంకులకు వచ్చి ఆరా తీయగా దీవెన పేరున రూ. 10 లక్షలు, నవజ్యోతి పేరుతో రూ. 15 లక్షలు రుణం తీసుకున్నట్లుగా తెలిసింది. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు రాజశేఖర్పై చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీలో చోటులేదు
ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కుంభకోణాలు చేసేవారికి అనంతగిరి: కుంభకోణాలు చేసే వారికి బీజేపీలో చోటు ఉండదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ రాజశేఖర్రెడ్డి అభినందన సభను గురువారం పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఆయ న కూతురు కవిత కాంగ్రెస్లోకి వెళ్తుందని, కొడుకు కేటీఆర్ బీజేపీలో చేరుతారని వస్తున్న వార్తలపై స్పందించారు. లిక్కర్ స్కాం, ఫార్ము లా ఈ రేస్ వంటి కేసుల్లో ఇరుక్కున్న వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారని ఎద్దేవా చే శారు. మనమంతా కష్టపడి పని చేస్తే భవిష్యత్లో జిల్లాలోని మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ప్రధా ని మోదీ నిజమైన దేశభక్తి కలిగిన నాయకుడన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. జిల్లాలో అందరిని కలుపుకొని ముందుకు సాగాలన్నా రు. సమాజసేవలో ఉన్న ఓ డాక్టర్ను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సంతోషకరమన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర, జిల్లా ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలి పారు. జిల్లాలో అందరిని కలుపుకొని పోతా మని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శంకర్స్వామి, రామ్ధారి అఖండ పీఠాధిపతి శ్రీ వేదయోగి మహరాజ్, కృష్ణ యజుర్వేద పండితుడు డాక్టర్ మన్యురింద్ర శర్మ, జిల్లా ఇన్చార్జి పగడాకుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, సదానందరెడ్డి, రమేష్కుమార్, పరమేశ్వర్రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, నాయకులు వెంకటయ్య, పాండు గౌడ్, శ్రీధర్రెడ్డి, నరోత్తంరెడ్డి, నందు పాల్గొన్నారు. ఐటీఐని సందర్శించిన ఎంపీ మర్పల్లి: మండల కేంద్రంలోని ఐటీఐ కళాశాలను గురువారం ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సందర్శిఽంచారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉన్న కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బీజేపీ మండల అధ్యక్షుడు రామేశ్వర్రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశం, నాయకులు బలరాంగౌడ్, అన్నపూర్ణ, మహేశ్వరి, శ్రీమంత్కుమార్, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ జాతర
మెగా జాబ్మేళాకు వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు ● 63 కంపెనీల ప్రతినిధుల హాజరు ● ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4,200 మంది ● అర్హత సాధించిన వారు 4వేల మంది ● కార్యక్రమం విజయవంతం కావడంతో ఎమ్మెల్యే బీఎంఆర్ హర్షం తాండూరు: ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు లేని నియోజకవర్గ యువతకు గురువారం నాటి మెగా జాబ్మేళా సరికొత్త ఆశలు రేకెత్తించింది. ఈ ప్రాంతానికి చెందిన యువకులు ఉద్యోగాలు లేక ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. తాండూరు నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఉద్యోగ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికంగా నాపరాతి పరిశ్రమలు, గనులు ఉన్నాయి. వీటిని పని చేయడమంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దీంతో యువకులు అయిష్టత చూపుతున్నారు. చాలా కాలంగా పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ ఈజీఎంఎం సౌజన్యంతో గురువారం తాండూరు పట్టణంలో మెగా ఉద్యోగమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని యాలాల, పెద్దేముల్, కోట్పల్లి, బషీరాబాద్, తాండూరు మండలాల తోపాటు, తాండూరు మున్సిపాలిటీ నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 63 కంపెనీలు 11వేల ఉద్యోగాల భర్తీ కోసం అర్జీలు స్వీకరించాయి. అభ్యర్థులతో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ ప్రాంగణం జనసంద్రంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకొచ్చారు. దాదాపు 8 నుంచి 9వేల మంది వరకు నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 4వేల మంది ఉద్యోగాలకు అర్హత సాఽధించారు. దరఖాస్తు ఫారాలు నింపేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి సాయం చేశారు. అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. అర్హత పొందిన వారికి నియామక పత్రాలు అందించారు. ఉద్యోగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే మెగా జాబ్మేళాలో ఉద్యోగాలు సాఽధించిన వారు ఆ రంగంలో రాణించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సూచించారు. గురువారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఈజీఎంఎం సౌజన్యంతో జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులకు నాలుగు వేల ఉద్యోగాలు రావడం తాండూరు చరిత్రలోనే ఇదే తొలిసారి అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య శాఖ అధికారులకు ధాన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉద్యోగాలు సాఽధించిన వారికి నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేష్ మహరాజ్, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, డీఆర్డీఓ కృష్ణన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ రవిగౌడ్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల బాల్రెడ్డి, మాధవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, ఉత్తమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది మెగా జాబ్మేళాలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. కొంత కాలంగా జాబ్ కోసం ఎవరిని సంప్రదించాలనే విషయం తెలియక ఇబ్బంది పడ్డా. ఇలాంటి సమయంలో జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు తెలిసి ఇక్కడికి వచ్చా. తనకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి రుణపడి ఉంటా. – గిరిజ, తాండూరు నెలకు రూ.20 వేల వేతనం జాబామేళాలో దరఖాస్తు చేసుకున్న గంట వ్యవధిలోనే ఉద్యోగం లభించింది. ప్రతి నెలా రూ.20 వేల వేతనం. నియామక పత్రం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది. మాలాంటి వాళ్లకు ఉద్యోగమేళా ఎంతో మేలు చేసింది. నిర్వాహకుల సేవను మరచిపోలేం. – సుప్రియ, కరన్కోట్, తాండూరు మండలం -
ఇవేం బదిలీలు..!
జిల్లాకు ఇటీవల ఐదుగురు తహసీల్దార్ల కేటాయింపు ● ఇందులో ఒకరు ఉద్యోగ విరమణ పొందిన వారు.. ● సస్పెన్షన్కు గురైన మరో అధికారి ● మిగిలిన ముగ్గురికి మండలాలు కేటాయించని వైనం ● పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు ● ఇబ్బందుల్లో ప్రజలు బషీరాబాద్: తహసీల్దార్ల బదిలీల ప్రక్రియలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. పదిహేను రోజుల క్రి తం రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది తహసీల్దార్లను ప్ర భుత్వం బదిలీ చేసిది. ఇందులో భాగంగా మన జి ల్లా నుంచి ఐదుగురిని సంగారెడ్డి, నారాయణ పేట జిల్లాలకు బదిలీ చేసింది. వీరి స్థానంలో కొత్త వారిని జిల్లాకు కేటాయించారు. ఇంత వరకు బాగా నే ఉన్నా వీరిలో ఒకరు ఉద్యోగ విరమణ పొందిన అధికారి అశోక్ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా నల్లగొండ జిల్లాలో ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన కిరణ్కుమార్ పేరు బదిలీ జాబితాలో ఉంది. మిగిలిన ముగ్గురు తహసీల్దార్లు షాహిదాబేగం, జే.బుచ్చయ్య, వెంకటస్వామిపది రోజుల క్రితం కలెక్టరేట్లో రిపోర్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు వారికి మండలాలు కేటాయించలేదు. ప్రస్తు తం బషీరాబాద్, నవాబుపేట, యాలాల మండలాల తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాలాల తహసీల్దార్ అంజయ్య గత నెల 30న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. డీటీలకు అదనపు బాధ్యతలు జిల్లాలో ఖాళీగా ఉన్న బషీరాబాద్, యాలాల, నవాబుపేట మండల తహసీల్దార్ పోస్టుల్లో టీడీలకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వారే భూముల రిజిస్ట్రేషన్, ఇతర ముఖ్య బాధ్యతుల నిర్వహిస్తున్నారు. వీరిపై అదనపు భారం పడటంతో రెవెన్యూ సమస్యలు సకాలంలో పరిష్కారం కావడంలేదు. దీంతో ఆయా మండలాల్లో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బషీరాబాద్, యాలాల ఆర్ఐలకు డిప్యూటేషన్ బషీరాబాద్, యాలాల మండలాల రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను ఉన్నతాధికారులు మంగళవారం డిప్యూటేషన్ వేశారు. ఇక్కడ పనిచేసిన నాగార్జునరెడ్డిని యాలాల ఆర్ఐగా,అక్కడి ఆర్ఐగా పనిచేసిన శివ చరణ్ను బషీరాబాద్కు డిప్యూటేషన్పై బదిలీ చేశారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నవాబుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతుల మేలే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్నదాతలకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం నవాబుపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అర్హురులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామన్నారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తే బిల్లులు చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, ఎంపీడీవో అనురాధ, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఇన్చార్జ్ తహసీల్దార్ శ్రీలత, ఎంపీఓ విజయ్కుమార్, ఏఈవోలు, మండల నాయకులు ప్రభాకర్, నరసింహారెడ్డి, రాజశేఖర్రెడ్డి, ఖదీర్, అనంతరామ్ పాల్గొన్నారు. సకాలంలో పూర్తి చేసుకుంటే బిల్లులు మంజూరు చేస్తాం ఎమ్మెల్యే కాలె యాదయ్య -
అంకితభావంతో పనిచేయాలి
విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి అనంతగిరి: వికారాబాద్లోని డైట్ కళాశాలలో జరుగుతున్న తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వద్దు అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ దోమ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. గురువారం దోమ మండలం ఐనాపూర్ కొనుగోలు కేంద్రాని సందర్శించి రైతులతో మాట్లాడారు. వర్షాలు పడుతుండటంతో ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో టీటీ నర్సింహులు, ఆర్ఐలు సుదర్శన్, రాంచంద్రరావు, ఐకేపీ సీసీ సుగుణమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యులు విజయ, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఫోర్ లేన్కు గ్రహణం వీడేనా?
ధారూరు: తాండూరు–వికారాబాద్ వయా ధారూ రు ఫోర్ లేన్ రహదారి నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం ప్రారంభం కావడంలేదు. ఈ పనులు పూర్తయితే ధారూరు మండల కేంద్రంలోని 16వ కిలో మీటర్ నుంచి 17.5 కిలో మీటర్ పీఎస్ వరకు రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటవుతుంది. 20 మీటర్ల వెడల్పుతో రోడ్డును విస్తరించడానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కానీ పనులకు మాత్రం మోక్షం లభించలేదు. దీంతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇందుకోసం 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. రోడ్డు వేసిన అధికారులు సెంట్రల్ లైటింగ్ సిస్టంకు మంగళం పాడారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా నిధులు లేని కారణంగా పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. దీంతో మంజూరైన నిధులు ఏమయ్యాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
పంట మార్పిడితో మేలు
పరిగి: ఒకే రకమైన పంటల సాగుతో భూసారం క్రమంగా తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా దిగుబడి క్షీణించి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఒకే నేలలో సాగు చేసే పంటలను తరచూ మార్చాలని సూచిస్తున్నారు. పంట మార్పిడి చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. సంవత్సరం పంట మార్పిడి చేయడంతో సాగు చేసిన పంట ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి దిగుబడిని ఇస్తుంది. నేలలో సైతం సమృద్ధిగా పోషకాలు వృద్ధి చెంది పంట దిగుబడులు పెరిగే ఆస్కారం ఉందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. చీడపీడలకు అడ్డుకట్ట ● ఒక పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల చీడపీడల ఉద్ధృతి అధికం కావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ● పురుగు జీవితచక్రం నిరాటంకంగా ముగించుకుని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది. ● పంట మార్పిడి చేసినప్పుడు పురుగు జీవితచక్రం ఛేదించబడుతుంది. ఎందుకంటే ఒక పంటపై ఆశించే పురుగులు మరొక పంటపై ఆఽశించడం సాధారణంగా జరగదు. ● వేగంగా వృద్ధి చెందే కొన్ని రకాల పురుగులను పంటమార్పిడి వల్ల అదుపులో పెట్టవచ్చు. ● ఒకే లోతు వ్యవస్థ కలిగిన పంటలను ఉదాహరణకు పత్తి, మిరప, మొదలైన వాణిజ్య పంటలను మార్పిడి చేయకుండా సాగు చేయడం వల్ల ఒకే లోతు పొరల నుంచి పోషకాలు తీసుకోవడంతో నేల నిస్సారమవుతుంది. ● వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వంటి పైర్లు నేలపై పొరల నుంచి పోషకాలను తీసుకుంటాయి. ● నేల భౌతిక లక్షణాలు స్వభావం దెబ్బతినకుండా ఉండటానికి చీడపీడల అభివృద్ధిని నిరోధించడానికి పంటమార్పిడి చేయాలి. ● అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి పశుగ్రాసం కోసం గడ్డిజాతి పైర్లు భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. ప్రయోజనాలు ఇవే! ● వరి తర్వాత మినుము, పెసర, శనగ వేయడంతో సుడి దోమ, టుంగ్రో వైరస్ నివారించవచ్చు. ● పత్తి వేసిన పొలంలో మొక్కజొన్న, జొన్న, నువ్వులు, మినుములు వేస్తే లద్దె పురుగు, పచ్చపురుగుల బెడద ఉండదు. ● జొన్న, మొక్కజొన్న తర్వాత కంది సాగు చేస్తే కాయతొలుచు పురుగు ఉద్ధృతి తగ్గుతుంది. ● వరి సాగు చేసే పొలాల్లో ముందుగా పప్పు ధాన్యాలను సాగు చేయడంతో నేల సారవంతమవుతుంది. ● వేరుశనగలో ఆకు ముడతను నివారించేందుకు పప్పుజాతికి చెందిన పైర్లతో మార్పిడి చేయాలి. ● కంది మిరప పంటల్లో ఎండుతెగులు నివారణకు జొన్న, మొక్కజొన్న పంటలతో మార్పిడి చేయాలి. ● నులి పురుగు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప వంటి పైర్ల సాగును కొన్ని పంట కాలాల వరకు ఆపాలి. ● ఆహార పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ పైర్లను పప్పుజాతి పైర్లయిన పెసర, మినుము, వేరుశనగ, పంటలతో మార్పిడి చేయాలి. ● ఆహార వాణిజ్య పంటలను పశుగ్రాస పైర్లతో ఒకసారి పప్పుజాతి పైర్లతో మరోసారి మార్పిడి చేయడం లాభదాయకం. రైతులు అధిక దిగుబడి పొందే అవకాశం నేలలో పెరగనున్న భూసారం వ్యవసాయ అధికారుల సూచన అధిక దిగుబడి రైతులు ఒకే పంటను తరచూ సాగు చేయరాదు. ఒకే రకమైన పంటలను సాగు చేయడంతో మొక్కలకు అవసరమైన పోషకాలు అందక దిగుబడులు తగ్గిపోతాయి. అంతే కాకుండా రోగకారక పురుగుల జీవితచక్రం ముగించుకుని రోగాలు ఉద్ధృతి పెరుగుతుంది. అంతుకే రైతులు వరుసగా ఒకే రకమైన పంటను సాగు చేయరాదు. – లక్ష్మీకుమారి, ఏడీఏ, పరిగి -
రంగాపూర్లో డీపీఎం విచారణ
పరిగి: మండల పరిధిలోని రంగాపూర్లో మహిళా సంఘాల నుంచి విలేజ్ బుక్ కీపర్ డబ్బులు వసూలు చేస్తున్నారని సభ్యులు ఆందోళన చేయడంతో గురువారం డీపీఎం నర్సింహులు విచారణ చేపట్టారు. గ్రామంలోని 10 మహిళా సంఘాల సభ్యులతో వివరాలను సేకరించారు. అనంతరం డీపీఎం మాట్లాడుతూ.. మహిళా సంఘాల ద్వారా విచారణ చేపట్టగా బుక్ కీపర్ ఎలాంటి డబ్బులు వసూలు చేసినట్టు తేలలేదన్నారు. ఒకరు తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని, తన సంతకం లేకుండానే బ్యాంకులో రుణం తీసుకున్నారని చెప్పడంతో ఆ మహిళా సంఘ సభ్యురాలు గ్రూపు డిఫాల్ట్లో ఉన్నట్టు తేలింది. గ్రామంలోని కొంత మందికి వ్యక్తిగత కారణాల వల్ల ఇలా జరిగిందని, తమ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గ్రూపు సభ్యులు ఎవరూ చెప్పలేరన్నారు. కార్యక్రమంలో గ్రామ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని జంతువు దాడిలో మేక మృతి
కుల్కచర్ల: గుర్తు తెలియని జంతువు దాడిలో మేక మృతి చెందిన ఘటన చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన సంటి అంజయ్య బుధవారం రోజులాగే తన పొలం దగ్గర పశువులతో పాటుగా మేకలను కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి చూడగా ఓ మేక రక్తపుమడుగులో పడి చనిపోయి ఉంది. ఎక్కువ శాతం మాంసం తినేసింది. కాగా పరిసర ప్రాంతాల్లో చిరుత ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీధర్ ఘటనాస్థలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. రైతులు అటవీప్రాంతంలో పశువులను కట్టేయరాదని, ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
వర్షం తెచ్చిన తంటా
ధారూరు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించుకుపోతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గురువారం మధ్యాహ్నం వరకు జాడలేని వాన సాయంత్రం కాగానే చినుకుతో ప్రారంభమై విజృంభించింది. మండల పరిధిలో ఆరుబయట, కల్లాల్లో ఆరబెడుతున్న వడ్లు తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నా తేమ ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయడానికి నాగసమందర్ కేంద్రంలో నిర్వాహకులు మొండికేస్తున్నారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని రైతులు ఆరోపించారు. ఇప్పటికై నా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల దిగాలు -
పచ్చని చెట్లపై గొడ్డలివేటు
ధారూరు: అధికారుల అనాలోచిత చర్యతో పచ్చని చెట్లపై గొడ్డలివేటు పండింది. గురువారం మండల పరిధిలోని హరిదాస్పల్లి–చింతకుంట గ్రామాల మధ్యన విద్యుత్ తీగలకు తాకుతున్నాయన్న కారణంతో చెట్లను కాండం వరకు నరికేశారు. గతంలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్కలను నాటారు. ఆ సమయంలో ట్రాన్స్కో, ఉపాధిహామీ సిబ్బందికి సమన్వయం లోపించడంతో మొక్కల పైనుంచి విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెట్లు పెద్దవి కావడంతో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నరికేస్తున్నారు. నాటేటప్పుడే అనువైన స్థలాన్ని ఎంచుకోవాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. -
ఎదురెదురు బైకుల ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు ధారూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లిపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్(35) హైదరాబాద్లోని లంగర్హౌస్ పీఎస్లో ట్రాఫిక్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెద్దేముల్లో తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ధారూరుకు చెందిన రోహిత్, రాము, నర్సింహ అనే యువకులు ఒకే బైక్పై రుద్రారం వైపు వెళ్తూ.. మార్గమధ్యలో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద అబ్దుల్ బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను వికారాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోహిత్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు సైతం గాయపడ్డారు. పోగొట్టుకున్న ఫోన్ల అందజేత నవాబుపేట: ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నవాబుపేట ఎస్ఐ అరుణ్కుమార్ సూచించారు. మండల పరిధిలోని ఆర్కతల గ్రామానికి చెందిన పవన్, బాల్రెడ్డిగూడకు చెందిన సునీతలు 15 రోజుల క్రితం వారి ఫోన్లు పోగొట్టుకున్నారు. సీఈఐఆర్ ద్వారా వారి ఫోన్లను రికవరీ చేసి గురువారం బాధితులకు ఎస్ఐ అందజేశారు. నేటి సాంకేతిక యుగంలో పోగొట్టుకున్న వస్తువులను తొందరగా తెలుసుకోవచ్చన్నారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్లాట పరిగి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకున్న ఘటన గురువారం పరిగి–వికారాబాద్ బస్సులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి– వికారాబాద్ మార్గంలో వికారాబాద్ డిపోకు చెందిన బస్సులు నడుస్తుంటాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువైనా బస్సులు పెంచకపోవడంతో నిత్యం కిటకిటలాడుతూ వెళ్తుంటాయి. గురువారం పరిగి నుంచి వికారాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కాడు. సీటు విషయంలో ఇరువురు గొడవ పడ్డారు. దీంతో రెండు కుటుంబాలకు చెందిన మహిళలు, పురుషులు, మరో ప్రయాణికుడు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ప్రయాణికుల రద్దీ కారణంగానే కొట్లాట జరుగుతుందని, బస్సుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. పిడుగుపాటుకు ఆవు మృతి దోమ: పిడుగుపాటుకు ఓ ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజమోని రాజు జీవనోపాఽధి కోసం ఆవులను కొనుగోలు చేశారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఓ ఆవుపై పిడుగు పడింది. గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లిన బాధిత రైతు ఓ ఆవు మృతి చెందడంతో కన్నీటి పర్యాంతమయ్యారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. షార్ట్ సర్క్యూట్తో హోటల్ దగ్ధం షాద్నగర్రూరల్: షార్ట్ సర్క్యూట్తో ఓ హోటల్ దగ్ధమైన సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలిచంద్రయ్య హోటల్ నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే హోటల్ను మూసివేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత షార్ట్ సర్క్యూట్ కావడంతో హోటల్లోని సామగ్రి, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం తెల్లవారుజామున చంద్రయ్య చూడగా దట్టమైన పొగతో నిండిపోయింది. హోటల్లోని ప్రిడ్జ్లు, కౌంటర్లు, కంప్యూటర్, ప్రింటర్, సీసీ కెమెరాల ఎక్విప్మెంట్, ప్యాన్లు, కుర్చీలు, కూల్ డ్రింక్, వాటర్ బాటిళ్లు పూర్తిగా కాలిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న ఆర్ఐ సలీం, పంచాయతీ కార్యదర్శి తేజస్విని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ షార్ట్ సర్క్యూట్తో దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని చంద్రయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. -
నేడు మర్పల్లికి ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
మర్పల్లి: మండల కేంద్రానికి గురువారం ఉదయం 11 గంటలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రానున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, మండల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. బడులకు పాఠ్య పుస్తకాలు దుద్యాల్: బడుల ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలు చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇదివరకే మండల విద్యావనరుల కేంద్రానికి నూతన పుస్తకాలు చేరాయి. దీంతో పాఠశాలలకు వాటిని పంపిణీ చేసే పనిలో సీఆర్పీలు నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే మండల పరిధిలోని చెట్టుపల్లి తండాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, హకీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు బుధవారం పంపిణీ చేశారు. రెండు పాఠశాలలకు కలిపి 2,400 పుస్తకాలు అందించినట్లు సీఆర్పీ రాందాస్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల పాఠశాలలకు వంట సామగ్రి సైతం పంపిణీ చేశారు. బిల్లు ఎక్కువ వేశారన్నందుకు ● లైట్లు ఆర్పి మహిళలపై దాడి ● జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్లో ఘటన బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్లో లైట్లు ఆర్పి తన తల్లి, చెల్లిపై దాడి చేశారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆరోపిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మీనల్మీను మంగళవారం రాత్రి తన తల్లి, చెల్లితో కలిసి జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్కు వెళ్లింది. ఈ సందర్భంగా తాము తాగని డ్రింక్స్కు కూడా బిల్లు వేసినట్లు గుర్తించిన ఆమె పబ్ సిబ్బందిని ప్రశ్నించింది. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన పబ్ నిర్వాహకులు సిబ్బందితో కలిసి పబ్లో లైట్లు ఆపేసి ఆమె తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించింది. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్ కు బిల్ వేశారని అడిగినందుకు కొట్టారని, వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించారు. దాడికి పాల్పడింది బౌన్సర్లా..? సిబ్బందా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య సికింద్రాబాద్: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువా రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ కోటేశ్వర్రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ట్రాలీ పాత్ వే రైల్వే ట్రాక్ ప్రక్కన బుధవారం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సుమారు 25 ఏళ్ల యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్యహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతుడి ఒంటిపై తెలుపు, నలుపు గల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేరళ లాటరీ పేరుతో రూ.7.55 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కేరళ లాటరీ పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.7.55 లక్షలు స్వాహా చేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది. బాధితురాలికి (54) గత నెల 7న ‘కేరళ లాటరీ‘ ప్రతినిధి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు తమ లాటరీ ఫలితాలు ప్రకటిస్తున్నామని చెప్పాడు. దీంతో ఆమె ఓ టికెట్ ఖరీదు చేశారు. అదే రోజు సాయంత్రం రూ.5 లక్షల లాటరీ గెల్చుకున్నట్లు ఆమెకు సమాచారం ఇచ్చాడు. ఆ మొత్తం తీసుకోవాలంటే ముందుగా కొన్ని పన్నులు చెల్లించాలంటూ ఓ లింకు పంపాడు. బాధితురాలు దానిని క్లిక్ చేయగా... లాటరీ గెల్చినట్లు, వివిధ పన్నులు చెల్లించాలని ఉంది. బాధితురాలు చెల్లించిన మొత్తం నామ మాత్రమే నాన్ రిఫండబుల్ అని, మిగిలింది లాటరీ నగదుతో పాటు రిఫండ్ చేస్తామని నమ్మించారు. ఇలా ఆమె నుంచి రూ.7, 55,220 డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. -
పది సప్లిమెంటరీకి పక్కాగా ఏర్పాట్లు
అనంతగిరి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 20 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 5,308 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరిగి పట్టణంలో 3 కేంద్రాలు, తాండూరులో 7, కొడంగల్లో ఒకటి, వికారాబాద్లో 5, మోనిపేట్, కుల్కచర్లలో రెండు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యార్థులకు తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం ఇవ్వరాదన్నారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్ఓ వెంకటరవణ, ఆర్టీసీ డిపో మేనేజర్ అరుణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ -
భారీ వర్షం.. అతలాకుతలం
పరిగి: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల చెరువులు, కుంటల్లో వర్షం నీరు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షాలు ముందస్తుగానే కురుస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు మొలకెత్తుతున్నాయి. మరో రెండుమూడు రోజులు వర్షాలు కురిస్తే రైతులకు చాలా నష్టం వాటిళ్లుతుందని రైతులు వాపోతున్నారు. మర్పల్లిలో మోస్తరు మర్పల్లి: మండలంలోని బూచన్పల్లి, కొత్లాపూర్, మర్పల్లి, సిరిపురం, కోట్మర్పల్లితో పాటు పలు గ్రామాలలో బుధవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పొలాల్లో నీరు చేరి పనులకు ఆటంకం కలిగిందని రైతులు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మండలం వర్షపాతం(మి.మీ) 1.వికారాబాద్ 46.3 2.దోమ 43 3.బషీరాబాద్ 40.8 4.పూడూర్ 39.8 5.మోమిన్పేట్ 25.8 6.నవాబ్పేట్ 22.5 7.యాలాల్ 20.8 8.బొంరాస్పేట 20 9.మర్పల్లి 20 10.కోట్పల్లి 19.3 11.బంట్వారం 16.5 12.పెద్దేముల్ 15.5 13.కొడంగల్ 14.5 14.చౌడాపూర్ 13.5 15.కుల్కచర్ల 12.5 16.తాండూర్ 12.3 17.ధారూర్ 11 18.దౌల్తాబాద్ 8 19.పరిగి 5.5 జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతులకు తప్పని తిప్పలు -
పశువులకు వైద్యం అందించండి
పరిగి: పశువులకు సకాలంలో వైద్యం అందించాలని సంచార అంబులెన్స్ జిల్లా అధికారి భాగేష మిశ్రా సిబ్బందికి సూచించారు. బుధవారం పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సంచార అంబులెన్స్లను మండల పరిధిలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని, వైద్యులు ఎల్లప్పుడు అలర్ట్గా ఉండాలని సూచించారు. రైతులు పశువులకు ఏమైన సమస్య ఉందని కాల్ చేస్తే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పశువైద్యులు తదితరులు పాల్గొన్నారు. సంచార అంబులెన్స్ జిల్లా అధికారి భాగేష మిశ్రా -
50,406
దరఖాస్తులు మండలాల వారీగా.. మండలం పేరు వచ్చిన దరఖాస్తులు బంట్వారం 1,182 బషీరాబాద్ 2,125 బొంరాస్పేట్ 2,180 చౌడాపూర్ 1,741 ధారూరు 2,380 దోమ 3,136 దౌల్తాబాద్ 1,971 దుద్యాల్ 1,904 కొడంగల్ 2,156 కొడంగల్(మున్సిపల్) 760 కోట్పల్లి 1,141 కుల్కచర్ల 3,311 మర్పల్లి 1,964 మోమిన్పేట్ 1,804 నవాబుపేట్ 1,494 పరిగి 2,615 పరిగి(మున్సిపల్) 604 పెద్దేముల్ 3,200 పూడూరు 2,320 తాండూరు 3,456 తాండూరు(అర్బన్) 2,350 వికారాబాద్ 1,423 వికారాబాద్(అర్బన్) 2,903 యాలాల 2,286 మొత్తం 50,406 వికారాబాద్: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు యువత నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీడీఓల పర్యవేక్షణలో పరిశీలనను పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రొసీడింగులు తయారీలో నిమగ్నమయ్యారు. జూన్ ఒకటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంతకంతో కూడిన ప్రొసిడింగులు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్ధిదారులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా తాండూరు నుంచి.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల నుంచి రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తులు స్వీకరించారు. అత్యధికంగా తాండూరు మండలంలో 3,456 మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా కొడంగల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 760 మంది మాత్రమే అర్జీలు ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వచ్చిన వాటిని మండలాలు, మున్సిపాలిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా విభజించి వెరిఫికేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల నుంచి 50,406 దరఖాస్తులు వచ్చాయి. లబ్ధి దారులు ఎంపిక చేసుకున్న యూనిట్ ధరను బట్టి రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీపై రుణాలు అందజేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే తేడా లేకుండా అన్ని సామాజిక వర్గాల వారికి ఒకే రకమైన రాయితీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.లక్ష వరకు 90శాతం రాయితీపై రుణాలు అందజేయనున్నారు. రూ.2 లక్షల వరకు 80శాతం రాయితీ వర్తించనుండగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందే వారికి 70 శాతం రాయితీ వర్తించనుంది. ఎంపికలో తర్జన భర్జన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ చేపడుతుండగా.. ఇందులో బ్యాంకర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. అయితే బ్యాంకు సిబిల్ స్కోర్ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం ఏమీలేదని.. అంతా పారదర్శకంగా చేపడుతున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పేర్కొంటున్నారు. అయితే నేతల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. దీంతో దరఖాస్తు చేసుకున్న యువకులు ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రూ.3లక్షలు, రూ.4 లక్షల యూనిట్లు మంజూరు చేయాలంటే తమ చేతులు తడపాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన అర్జీలు వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి మండలస్థాయిలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రొసీడింగుల తయారీలో అధికారులు బిజీ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పథకం అమలు ఒక్కో యూనిట్కు గరిష్టంగా రూ.4 లక్షల వరకు.. 70 నుంచి 90శాతం వరకు రాయితీ -
ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పిస్తాం
● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ● నేడు తాండూరులో మెగా ఉద్యోగమేళా తాండూరు: నియోజకవర్గంలో ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పనకు మెగా ఉద్యోగమేళాను గురువారం నిర్వహిస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో మెగా ఉద్యోగమేళా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న తాండూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా 54 కంపెనీలను సంప్రదించి మెగా ఉద్యోగమేళాతో 11 వేల ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవ చ్చని అన్నారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రభు త్వం ఈజీఎంఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం పాల్గొంటుందన్నారు. తాండూరులో నిర్వహించే మెగా ఉద్యోగ మేళాను ఆదర్శంగా చేసుకొని జిల్లాలోని కొడంగల్, వికారాబాద్లలో ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ సిద్ధమవుతున్నారన్నారు. మేళాలో ఉద్యోగాలు వచ్చిన వారికి నెల రోజుల పాటు వసతి, భోజన సౌకర్యాలు ఉచితంగా అందిస్తారన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, పార్టీ బీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్చంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, నాయకులు నర్సింహులు, లొంక నర్సింహులు, జుబేర్లాల, ప్రభాకర్గౌడ్, రామ కృష్ణ, ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 3నుంచి కంది విత్తనాల పంపిణీ
తాండూరు: తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో 365 క్వింటాళ్ల కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. జూన్ 3న సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయనున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. టీడీఆర్జీ 59 రకం కంది విత్తనాలు 350 క్వింటాళ్లు, ఆశ ఐసీపీఎల్ 87119 రకం 15 క్వింటాళ్లు ఉన్నాయన్నారు. 4 కిలోల బస్తాను రూ.600కు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశ రకం నల్లరేగడి, నీటి వసతి ఉన్న భూముల్లో విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ రకం ఎండు తెగులు, వెర్రి తెగులు, గొడ్డు తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వివరించారు. విత్తనాలు కావాల్సిన రైతులు జూన్ 3న తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. మహనీయుడు వీర సావార్కర్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి తాండూరు టౌన్: బ్రిటీష్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా దేశంలోని హిందువులను ఏకం చేసిన మహనీయుడు వీర సావార్కర్ అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం అన్నారు. బుధవారం తాండూరులో పార్టీ ఆధ్వర్యంలో సావార్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత సంపూర్ణ స్వాతంత్య్రం కోసం యూకేలో చదువుతున్న ఆయన పలు విప్లవ సంస్థలతో సంబంధాలు ఏర్పర్చుకుని బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులను ఏకం చేశారన్నారు. దీంతో బ్రిటీష్ వారు ఆయనను అరెస్టు చేసి ఇండియాకు తీసుకువచ్చి అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు పంపారన్నారు. జైలు నుంచి విడుదలైన ఆయన హిందూ జాతీయ వాదాన్ని సమర్థిస్తూ స్వాతంత్య్రం కోసం పోరాడాడన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రజినీ కాంత్, మంతటి రాజు, ప్రకాష్, ప్రహ్లాద్, షాబుద్దీన్, శివాజీ, తాండ్ర నరేష్ పాల్గొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలి మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి తాండూరు: క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని విలియంమూన్ మైదానంలో జీఎంకే బిల్డర్ అండ్ డెవలపర్స్ అధినేత ముజీబ్ఖాన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. సమాజ సేవ అలవాటు చేసుకోవాలన్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణా నేరం
అనంతగిరి: బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను నిరోధించాలని ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న బక్రీద్ పండుగ ఉన్నందున పశువులను అక్రమ రవాణా చేయకుండా నిఘా పెంచాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 8 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. చట్టవిరుద్ధంగా పశువులను రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పశువుల క్రయ విక్రయాలు జరిపే రైతులు, వ్యాపారులు సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ అధికారులచే ధ్రువీకరించిన రశీదులను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణా విషయం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ అధికారి సదానందం, వికారాబాద్, తాండూరు, పరిగి డివిజన్ల డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు ఎస్పీ నారాయణరెడ్డి -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
తాండూరు రూరల్: గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేద్దామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చంద్రవంచ, మిట్టబాసుపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చంద్రవంచ గ్రామానికి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. హనుమాన్ ఆలయ చైర్మన్ పదవి ఖాళీగా ఉందని.. భర్తీ చేయాలని కోరారు. స్థానిక ఎన్నికల తర్వాత చైర్మన్ పదవిని భర్తీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మిట్టబాసుపల్లిలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. అలాగే మసీదు నిర్మాణానికి సహకరించాలని విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్కుమార్, అంజిలప్ప, అనంతప్ప, నర్సింలు, ఎల్లప్ప, జగదీష్, మల్లప్ప, ఇస్మాయిల్, పెద్ద ఇస్మాయిల్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మోతీనగర్: భవన నిర్మాణ పని చేస్తున్న మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సఫ్దార్నగర్లో నిర్మాణంలో ఉన్న భవనంలో గుంపు అనసూయ (45) అనే మహిళ కూలీ పని చేస్తోంది. బుధవారం ఆమె మెటీరియల్ లిఫ్ట్ వద్ద పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయింది. తోటి కూలీలు ఆమెను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. యజమాని నిర్ల క్ష్యం కారణంగానే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రైతులకు నష్టం కలిగించొద్దు
అనంతగిరి: వర్షాలు పడుతున్నందన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ధాన్యం తడిసి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సి బాధ్యత మనపై ఉందని అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం సేకరణ, రవాణాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ధాన్యం ఆరబెట్టుకోవడం రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా అన్నదాతలకు నష్టం జరగకుండా సేకరించిన వడ్లను మిల్లర్లకు తరలించాలని ఆదేశించారు. ఇందుకోసం లారీలు, హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఎంసీఎస్ రాము, రవాణా శాఖ జిల్లా అధికారి వెంకట్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, ట్రాన్స్పోర్టర్లు పాల్గొన్నారు. తడిసినా కొనుగోలు చేయాలి ధారూరు: ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ధాన్యం తడిసినా సేకరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. బుధవారం ధారూరు వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరిస్తున్న హరిదాస్పల్లి పీఏసీఎస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే సేకరించిన వడ్ల బస్తాలను వెనువెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, సీఈఓ రవి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం బస్తాలను తక్షణం మిల్లులకు తరలించండి కలెక్టర్ ప్రతీక్ జైన్ -
సర్కారు వరం.. సన్న బియ్యం
కొడంగల్: నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్ బియాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. లక్షన్నర మందికి ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడానికి శ్రీకారం చుట్టారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారని, వారికి ఇబ్బంది లేకుండా ఒకేసారి చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు నియోజకవర్గంలో 90 రేషన్ దుకాణాల ద్వారా నెలకు 979 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 2,937 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు. బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ పాస్తో పంపిణీ కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో 90 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 38,395 రేషన్ కార్డులు ఉన్నాయి. 1,46,700 మంది లబ్ధిదారులు ప్రతి నెలా 979 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపాస్) యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఐరిష్, వేలిముద్రలు సరిగ్గా ఉంటేనే సరుకులు ఇస్తారు. సిగ్నల్స్ సమస్య.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే రేషన్ దుకాణాలు అధికంగా ఉన్నాయి. పట్టణాల్లో సెల్ఫోన్ టవర్స్ ఉండడం వల్ల సమస్య లేదు. గ్రామాల్లో సిగ్నల్స్ అందక ఈ పాస్ యంత్రాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలు గ్రామాల్లో సిగ్నల్స్ సరిగ్గా రావడం లేదని లబ్ధిదారులు, డీలర్లు చెబుతున్నారు. అతికష్టం మీద సిగ్నల్ వస్తే సర్వర్ డౌన్ అవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోందన్నారు. కూలీ పనులు వదిలేసి బియ్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. అన్ని దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశా రు. దీంతో సరుకులు పంపిణీ చేస్తున్నారు. లక్షన్నర మందికి ఒకేసారి మూడు నెలల రేషన్ జూన్లో పంపిణీకి శ్రీకారం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఇబ్బంది లేకుండా.. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకేసారి జూన్ నెలలో పంపిణీ చేయడానికి ప్రభు త్వం చర్యలు తీసుకుంది. డీలర్లు సకాలంలో దుకాణాలను తెరిచి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మూడు నెలల బియ్యాన్ని ఇవ్వాలి. – విజయ్కుమార్, తహసీల్దార్ -
కార్పొరేట్కు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
పరిగి: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లా డారు. పరిగి పట్టణానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయడం సంతోషించ దగ్గ విషయమన్నారు. తుంకుల్గడ్డలో భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్చైర్మన్ అయూబ్, దోమ పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడడి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు రాజపుల్లారెడ్డి పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కుల్కచర్ల: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం కుల్కచర్లలో రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వీరస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, ఎస్టీ సెల్ మండల అధ్య క్షుడు రాంచందర్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్కుమార్ రెడ్డి, నాయకులు రాంరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి దోమ: ప్రభుత్వ సబ్సిడీపై ఇచ్చే పచ్చి రొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండలం దిర్సంపల్లి రైతు సేవ కేంద్రంలో రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ నేతలతో కలసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సేవ కేంద్రంలో 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. బస్తాకు రూ.2,140 ధర ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్రావు, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్కుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ యాదయ్యగౌడ్, కాంగ్రెస్ నేతలు సత్తయ్యగౌడ్, రాములుగౌడ్, బందయ్య, శ్రీనివాస్రెడ్డి, బాల్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, అఖిల్పాష, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
దళిత రైతుపై దౌర్జన్యం సరికాదు
బొంరాస్పేట: మండల పరిధిలోని బాపన్చెరువుతండాకు వేసిన బీటీ రోడ్డు నిర్మాణంలో రేగడిమైలారానికి చెందిన దళిత రైతు కడంపల్లి బాలయ్యపై కాంట్రాక్టర్ హన్మంత్రెడ్డి దాడి చేయించడాన్ని ప్రజాసంఘాల నేతలు తప్పుబట్టారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు దస్తయ్య ఆధ్వర్యంలో క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలయ్యకు చెందిన 10 గుంటల పట్టా భూమి రోడ్డు నిర్మాణంలో కోల్పోవడంతో రూ.15 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిపారు. దీనిపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్పై అట్రాసిటి కేసు నమోదు చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సంఘాల పక్షాన ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య, అంబేడ్కర్ ప్రజాసంఘాల తాలుకా అధ్యక్షుడు రమేష్బాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం నాయకుడు కొత్తురు చంద్రయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, బాలరాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
దుద్యాల్: రైతులు జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో జీలుగ విత్తనాలను వ్యవసాయ అధికారి నాగరాజ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ విత్తనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంటయ్య, ఏఈఓలు భావన, రేణుక, మాణికేశ్వరి, జ్యోతి, పీఏసీఎస్ డైరెక్టర్ ఖాలీల్ పాషా, నాయకులు సీతారాంనాయక్, వెంకటయ్య, శ్రీశైలంగౌడ్, ఖాజా, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
ధారూరు: మండల పరిధిలోని నాగసమందర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిస్తే కొనమంటూ నిర్వాహకులు పేర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. 40 కిలోల బస్తాకు రెండున్నర కిలోల వడ్లు అదనంగా ఇస్తేనే రైస్మిల్లు యజమాని తీసుకుంటారని వెలుగు సీసీ యాదయ్య సూచించండంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ కలుగజేసుకొని విషయాన్ని సద్దుమణిగించారు. అనంతరం తడిసిన ధాన్యాన్ని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ట్రయినీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి అనంతగిరి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) తెలంగాణ వారి ఆధ్వర్యంలోని వివిధ క్రీడా అకాడమీ మరియు వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి గాను అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, సైక్లింగ్, రెజ్లింగ్, హాకీ, హ్యాండ్ బాల్, వాలీబాల్ విభాగాల్లో బాలబాలికల ప్రవేశాల కోసం ఎంపిక నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో అర్హులైన, ఆసక్తి గల బాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చదువుతున్న స్కూల్, కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రీడా ధ్రువీకరణ పత్రాలు, 10 పాస్ ఫోర్టు సైజ్ ఫొటోలు, ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఉదయం 7గంటలకు ఎంపిక ప్రదేశాలకు హాజరు కావాలన్నారు. వాలీబాల్కు సంబంధించి జూన్ 1 సిద్దిపేట జిల్లా వాలీబాల్ అకాడమీలో, జూన్ 10న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో, రాజన్న సిరిసిల్ల మినీ స్టేడియం, వాలీబాల్ అకాడమీలో, జూన్ 12, 13న మహబూబ్నగర్ మెయిన్ స్టేడియం మైదానంలో, ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. జూన్ 10, 11న సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ వెలోడ్రోమ్, ఓయూ క్యాంపస్, హైదరాబాద్, ప్రాంతీయ క్రీడా వసతి గృహం, హన్మకొండలో, జూన్ 10, 11 తేదీల్లో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్ జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ, హన్మకొండలో ఎంపిక నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 12న హాకీ అకాడమీ, వనపర్తి డా.బాలకృష్ణయ్య మినీ స్టేడియం, వనపర్తిలో హాకీ ఎంపిక అదేవిధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ఖమ్మంలో జూన్ 12న అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 10 నుంచి 12 సంవత్సరాల వారికి జిమ్నాస్టిక్ మరియు స్విమ్మింగ్ ఎంపిక, 12 నుంచి 16 సంవత్సరాల వారికి అథ్లెటిక్స్, సైక్లింగ్, హ్యాండ్ బాల్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్ విభాగాల్లో ఎంపికలు ఉంటాయని వివరించారు. -
పట్టాలెక్కని పర్యాటకం
వికారాబాద్: జిల్లాలో పర్యాటక అభివృద్ధి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది.. వికారాబాద్ సమీపంలో అనంతగిరి కొండలు, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులు, బుగ్గ రామేశ్వర ఆలయం వంటి చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అనంతగిరి కొండలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. మెఘా సంస్థ రూ.1,000 కోట్లతో అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అందరరూ భావించారు. రెండేళ్ల క్రితం డీపీఆర్ తయారి బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేశారని గతంలో అధికారులు చెప్పారు.. ఇందులో భాగంగా ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. 213 ఎకరాల్లో టూరిజం అభివృద్ధికి రూ.110 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేశారు. ప్రస్తుతం మెఘా సంస్థతో రూ.1,000 కోట్లతో ఒప్పందం కుదరడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడతగా రూ.33 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అడ్వెంచర్ టూరిజం స్పాట్గా.. సాధారణంగా పర్యాటక కేంద్రాలను రెండు రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఒకటి సాధారణ పర్యాటకం.. ఇందులో అడవుల అందాలను వీక్షించడం, ఆలయాల సందర్శన వంటివి ఉంటాయి..రెండోది అడ్వెంచర్ టూరిజం(సాహస పర్యాటకం). ఇందులో యువత ఇష్టపడే సాహస కృత్యాలను డెవలప్ చేస్తారు. ట్రిక్కింగ్, రోప్ వేలు వంటివి ఉంటాయి. అనంతగిరుల్లో ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఎకో పార్క్, కన్వెన్షన్ హాళ్లు, ట్రెక్కింగ్, రోప్ వేస్, హోటల్స్, ఆలయాల అభివృద్ధి, వ్యూ పాయింట్స్, గార్డెన్లు, డైనింగ్ హాల్స్, పక్షులు, జంతువులను వీక్షించిందేకు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా 213 ఎకరాలను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. రోజుకు 5వేల మంది పర్యాటకులు వచ్చేలా.. వెయ్యి మంది ఇక్కడ బస చేసేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 500 మంది నుంచి 1000 మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. అనేక అనుకూలతలు అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండటంతో పర్యాటకంగా తీర్దిద్దాడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాంతం హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే గంటలో నగర వాసులు ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరు, ముంబై హైవేల నుంచి కూడా గంటలోపు ఇక్కడికి రావచ్చు. రీజనల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే కేవలం 15 నిమిషాల్లో అనంతగిరులకు రావొచ్చు. దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు, రోడ్డు మార్గంలో అందమైన మలుపులు, గుట్టపై చారిత్రాత్మకమైన అనంతపద్మనాభ స్వామి ఆలయం, ట్రెక్కింగ్ స్పాట్లు, అనేక రకాల పక్షిజాతులు, జంతు జాతులు ఈ అడవిలో ఉన్నాయి. తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన కాటేజీలు, బుగ్గ రామేశ్వర ఆలయం, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులు, అందులో బోటింగ్ ఇలా అనేక రకాలు అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనుకూల అంశాలు ఉన్నాయి. అనంత పద్మనాభస్వామి ఆలయం213 ఎకరాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అనుమతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రణాళిక అనంతగిరుల బాధ్యతలు మెఘా సంస్థకు.. రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వంతో ఎంఓయూ స్వదేశీ దర్శన్ కింద.. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పేరుతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రెండో విడతలో మన జిల్లాలోని అనంతగిరిని, యాదాద్రి జిల్లాలోని భువనగిరి కొండను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భావించింది. అనంతగిరి కొండలు, సమీప అటవీ ప్రాంతం.. పరిసర ప్రాంతాల్లోని సర్పన్పల్లి, కోట్పల్లి ప్రాజెక్టులకు పర్యాటకంగా తీర్చిదిద్దాడానికి ప్రణాళికలు రూపొందించారు. రెండేళ్లు కావస్తున్నా ముందుకు పడని అడుగు -
అన్నదాతకు వరుణ గండం
దుద్యాల్: ముందస్తు నైరుతి రుతుపవనాలతో మండలంలో వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంటకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం వరి పంట కోతకు వచ్చింది. ఇప్పటికే చాలా మంది రైతులు కోతలు పూర్తి చేసి దిగుబడిని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అక్కడ తూకం వేయడంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాల కారణంగా మరికొంత మంది కోతలు ఆపేశారు. వానలు తగ్గితే తప్ప కోతలు సాధ్యం కాదని అంటున్నారు. దీంతో పొలాల్లో అలాగే వదిలేశారు. లక్షల పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు దుద్యాల్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. లారీలు సకాలంలో రాకపోవడంతో వడ్ల బస్తాలను మిల్లులకు తరలించడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచారు. పంట దిగుబడిని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం బస్తాలను త్వరగా మిల్లులకు తరలించాలని వారు కోరుతున్నారు. ఇళ్ల మధ్య వర్షపు నీరు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని హస్నాబాద్ ఎస్సీ వాడ జలమయంగా మారింది. ఇళ్ల మధ్య భారీగా నీరు చేరింది. నడిచేందుకు కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. కాలనీ సమీపంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కల్వర్టు నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతుండటంతో వర్షపు నీరు ముందుకు వెళ్లడం లేదని స్థానికులు తెలిపారు. దంచికొడుతున్న వానలు కోతకు వచ్చినా పొలాల్లోనే వరి పంట కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం బస్తాలు అన్ని విధాలా నష్టపోతున్న రైతన్న ఆదుకోవాలని విన్నపం మట్టి వేయడంతోనే.. కాలనీ సమీపంలో రోడ్డు పను లు జరుగుతున్నాయి. కాలనీ నుంచి వర్షపు నీరు దిగువకు పో కుండా కాలువకు అడ్డంగా మ ట్టి పోశారు. దీంతో ఇళ్ల మధ్య నీరు నిలిచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మరి కొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు చేపట్టాలి. లేకుంటే ఇళ్లల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. – దశరథ్, ఎస్సీ కాలనీ వాసి, హస్నాబాద్ -
కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి
అనంతగిరి: ప్రజా సమస్యలపై ఈ నెల 30న తలపెట్టిన కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.వెంకట్రాములు పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్లోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందజేయాలని కోరారు. అలాగే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహిపాల్, జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ, వెంకటయ్య, చంద్రయ్య, సతీశ్, శ్రీనివాస్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. టీబీ నివారణకు కృషి జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి రవీందర్యాదవ్ దౌల్తాబాద్: టీబీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి రవీందర్యాదవ్ అన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్ ఆధ్వర్యంలో మంగళవారం మాటూరు గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధి ఉన్న వారికి జ్వరం, దగ్గు, నీరసం బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు ఉన్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ శిబిరంలో 360మందికి పరీక్షలు చేయగా 63 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు ఇవ్వన్నుట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి అమూల్య ప్రియదర్శిని, సంతోష్, మాధవి, సూపర్వైజర్ రఫీ, రాహత్శ్రీధర్, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తుల పాల్గొన్నారు. ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలి ప్రజా, విద్యార్థి సంఘాల డిమాండ్ తాండూరు టౌన్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేసిందని దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వామపక్ష ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ చౌక్లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత పేరుతో అమాయక గిరిజనులను, సానుభూతి పరులను హత్య చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని ఆరోపించారు. ఈ ఆపరేషన్లో మృతి చెందిన మావోయిస్టులవి బూటకపు ఎన్కౌంటర్లేనని, వీరి మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అంజి, మహేష్, ఆనంద్, పకీరప్ప, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
రహదారి పనులకు నిధులు మంజూరు
కుల్కచర్ల: బండమీదితండా గ్రామ పంచాయతీలో పొలాలకు వెళ్లేందుకు రహదారికోసం మంజూరైన రూ.12లక్షలతో ఏపీఓ చంద్రశేఖర్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అందరూ ఒక్కతాటిపై ఉండి అందరికీ ఉపయోగకరంగా ఉండే పనులను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. పొలాలకు దారులు ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యవసాయ పంటలను మార్కె ట్లకు తరలించేందుకు, వ్యవసాయ పనుల నిర్వహణకు ట్రాక్టర్లను ఇతర వాహనాలను తీసుకవెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజు, వినోద్కుమార్, మోతిలాల్, ఆంజనేయులు, దశరత్, శివాజీ, నర్సింలు, శ్రీను పాల్గొన్నారు. -
3,022 క్వింటాళ్ల జొన్నల కొనుగోలు
మోమిన్పేట: మోమిన్పేట పీఏసీఎస్ ఆధ్వర్యంలోని 3,022 క్వింటాళ్ల జొన్నల కొనుగోలు చేశామని, ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో కోటి రూపాయలు జమ చేశామని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ నాగార్జున తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేసిందన్నారు. ఇప్పటి వరకు 170 మంది రైతుల నుంచి 3,022 క్వింటాళ్ల కొనుగోలు చేశామన్నారు. సేకరించిన జొన్నలను తాండురులోని డీసీఎంఎస్ గోదాంకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు దళారులకు పంట దిగుబడి విక్రయించి మోసపోరాదని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. రైతులకు సహకార సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు వివరించారు. పంట రుణాలు, ధీర్ఘకాలిక రుణాలు, బంగారు నగలపై రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 750 మంది రైతులు సంఘంగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.2 వేల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూ.15లక్షలు అవుతుందని.. బ్యాంక్ తన వాటాగా మరో రూ.15 లక్షలు వారి పేరిట డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు. ఈ డబ్బుతో సంఘం సభ్యులు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని సూచించారు. పీఏసీఎస్లో ఉన్న వాటా మూలధనంపై డెవిడెంట్లు ఇవ్వాలని చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి డీసీఓను కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి, సీఈఓ శేఖర్, జిల్లా సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో రూ.కోటి జమ చేశాం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ నాగార్జున -
సిద్ధమవుతున్న యూనిఫాం
స్కూళ్లు తెరిచే నాటికి అందజేస్తాం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన దుస్తులను కుట్టాల్సిన బాధ్యత మహిళ సంఘాలకు అప్పజెప్పాం. అయితే ఇప్పటి వరకు 80శాతం పూర్తయ్యాయి. స్కూళ్లు తెరిచే నాటికి యూనిఫాంలను సకాలంలో పూర్తిచేసి ఎంఈఓకు పంపిస్తాం. – హరినారాయణ, ఇన్ఛార్జి ఏపీఎం దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రారంభంలోనే నూతన యూనిఫాం అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. యూనిఫాం కుట్టు పనులను ఈ ఏడాది నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం సమస్య తీవ్రంగా ఉండేది. కాంట్రాక్టర్లకు కుట్టుపని బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా సరిపడా యూనిఫాంలు అందించేవారుకాదు. అంతేకాకుండా కొలతల్లో హెచ్చు తగ్గులు ఉండడంతో వాటి వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్త్రాలను కొనుగోలు చేసి యూనిఫాం కుట్టే పనులను మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తున్నారు. ఫిబ్రవరిలోనే వీఓఏలు, ప్రధానోపాధ్యాయుల చొరవతో విద్యార్థుల కొలతలు సేకరించారు. వాటిని పూర్తి చేయించే పనిలో సంబంధిత అధికారులు బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం 3,250 మంది విద్యార్థులకు.. దౌల్తాబాద్ మండలంలో ఎనిమిది ఉన్నత, ఏడు ప్రాథమికోన్నత, 24 ప్రాథమిక పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 3,250 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మండలంలో నందారం, ఈర్లపల్లి, దౌల్తాబాద్, కౌడీడ్ గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు యూనిఫాంలు కుడుతున్నారు. ఇప్పటి వరకు 80శాతం పూర్తయినట్లు తెలిపారు. ఇంకా చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలాయని వివరిస్తున్నారు. కుట్టు పనులను ఐకేపీ అధికారులు, ఎంఈఓ వెంకట్స్వామి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాలకు కుట్టుపని బాధ్యతల అప్పగింత పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు అందజేసేలా ప్రణాళిక -
మట్టితో పూడ్చేసి!
నాలాపై కన్నేసిఇబ్రహీంపట్నం రూరల్: దాతర్చెరువు కాల్వపై కన్నేసిన అక్రమార్కులు మట్టితో నింపి కబ్జా చేశారు. అర కిలోమీటర్ మేర నాలాను ఆక్రమించి రెండున్నర ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ప్రస్తుత మార్కెట్లో దీని విలువ రూ.కోట్లలో ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిబట్ల మున్సిపల్ పరిధి కొంగరకలాన్లోని దాతర్ చెరువు నిండితే.. అలుగు పారి పులందరి వాగులోకి చేరుతుంది. దాతర్ చెరువును ఆనుకుని ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ వేసింది. ప్రస్తుతం దీని పక్కనే ఉన్న భూములను కొనుగోలు చేస్తోంది. దాతర్ చెరువు నాలా రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది. భారీ ప్రవాహం ఉండే చారిత్రక ఆనవాళ్లు కలిగిన నాలాను కొంతమంది రాత్రికి రాత్రే చెరబట్టారు. వేలాది ట్రిప్పుల మట్టి నింపి దాదాపు 500 మీటర్ల పొడవునా కాల్వను కనుమరుగు చేశారు. చెరువు కట్టను సైతం చీల్చి దాదాపు రెండున్నర ఎకరాల భూమిని కబ్జా చేశారు. మార్కెట్లో దీని విలువ రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వందల ఏళ్ల నాటి కాల్వను పూడ్చేసిన అక్రమార్కులు ప్రత్యామ్నాయంగా కొత్త కాల్వ తవ్విస్తున్నారు. దీనికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేదు. ఫిర్యాదుతో విచారణ కబ్జా విషయమై కొంగరకలాన్కు చెందిన నీళ్ల హరిబాబు అనే వ్యక్తి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఏఈ హరిత క్షేత్ర సందర్శనకు వచ్చారు. గ్రామ నక్షా, కాలువ విస్తీర్ణం తదితర అంశాలను పరిశీలించారు. విచారణ అనంతరం నివేదిక రూపొందించి, ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. రాత్రికి రాత్రే దాతర్చెరువు కాల్వ ఆక్రమణ రెండున్నర ఎకరాల భూమికి ఎసరు పూర్తిస్థాయి విచారణకు ఇరిగేషన్ డీఈఈ ఆదేశం కబ్జా నిజమని తేలితే.. నాలా ఆక్రమణ విషయమై మాకు ఫిర్యాదు అందింది. అధికారులు, సిబ్బందిని ఫీల్డ్ విజిట్కు పంపించాం. పూర్తి స్థాయి విచారణ, సర్వేకు ఆదేశించాం. కాల్వను పూడ్చారని, కబ్జా వాస్తవమేనని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – చెన్నకేశవరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ -
ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం
నవాబుపేట: ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టిగిద్ద గ్రామానికి చెందిన బక్కని ఏసు కొడుకు సందీప్(23), వికారాబాద్లో ఐటీఐ చదువుతున్నాడు. ఏడాది క్రితం పట్టణానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ గత సోమవారం సాయంత్రం తమ పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. ఉపాధి కూలీ మృతి యాలాల: ఉపాధి పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ కూలీ మృతిచెందాడు. వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన అన్నారపు హన్మంతు(38) భూమి చదును పనుల్లో పాల్గొన్నాడు. ఈసమయంలో ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఒక్కసారిగా కుప్పకూలి, అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. సమాచారం అందుకున్న ఉపాధి సిబ్బంది, అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని తెలిపారు. బ్యాటరీల దొంగ దొరికాడు కేశంపేట: మండలంలో ఇటీవల చోరీ అయిన బ్యాటరీలను పోలీసులు రికవరీ చేశారు. మండల పరిధిలోని లేమామిడి, కేశంపేట, బైర్కాన్పల్లి గ్రామాల్లో ఇటీవల వాహనాల బ్యాటరీలతో పాటు జనరేటర్ బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఇదే విషయమై బాధితుల నుంచి పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందాయి. పోలీసులు బ్యాటరీ దొంగతనాలను ఛేదించేందుకు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమోరాల్లో నమోదైన పుటేజీలతోపాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించారు. హైదరాబాద్ విద్యానగర్లోని లక్ష్మీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మేగిశెట్టి నాగేశ్వర్రావు బ్యాటరీలను దొంగిలించినట్టు గుర్తించారు. అతడి నుంచి 12 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
గడువులోగా యూనిఫాం అందించాలి
కేశంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గడువులోగా యూనిఫాం అందించాలని డీఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యారావు అన్నారు. మండల కేంద్రంలోని మండల మహిళ సమాఖ్య భవనంలో మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు షర్టుల కోసం వచ్చిన క్లాత్ను కట్టింగ్ చేస్తున్న విధానాన్ని, మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో కుడుతున్న టైలరింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభంలోగా అందుబాటులో ఉంచే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా టైలరింగ్ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఈపీఎం బాలరాజ్, ఏపీఎం భగవంతు, సీసీలు పాల్గొన్నారు. -
అటవీ భూమిని ఆక్రమిస్తే చర్యలు
బొంరాస్పేట: మండలంలోని తిర్మలాపూర్లో అటవీ భూమిని ఆక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. ఈ నెల 24న సాక్షి దినపత్రికలో అటవీ భూ మి ఆక్రమణ అనే శీర్షికన ప్రచురితమై కథనంపై ఆ యన స్పందించారు. మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అటవీ భూమిని ఆక్రమించిన ఘటనపై ఈ నెల 23న ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఎన్కేపల్లికి చెందిన పూజారి నర్సింలు 1.30 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు. రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. నరికిన చెట్ల స్థలంలో కొత్తగా మొక్కులు నాటించి, వాటిని సంరక్షించే బాధ్యత నర్సింలుకు అప్పగిస్తున్నామని చెప్పారు. అక్రమార్కులు అడవిలోకి ప్రవేశించకుండా ట్రెంచింగ్ పనులు చేయించామని పేర్కొన్నారు. అడవుల సంరక్షణ మన బాధ్యత యాలాల: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ మన బాధ్యతఅని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని సంగాయిపల్లి తండాలో అడవుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ భూముల్లో చెట్లు నరకడం నేరమన్నారు. అటవీ భూమిని ఉపగ్రహ ఛాయా చిత్రాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ కిరణ్కుమార్, ఎస్ఐ గిరి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్, సెక్షన్ ఆఫీసర్లు కనకరాజు, శంకర్, బీట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ భూమి కజ్జా చేసిన వ్యక్తిపై కేసు -
జాబ్మేళాను సక్సెస్ చేయాలి
అనంతగిరి: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న తాండూరులో నిర్వహించే జాబ్మేళాను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాబ్మేళాపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం) ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 52 పరిశ్రమల్లో 11 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సంకల్పం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో జాబ్మేళా ఉంటుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణన్, జేడీఎం సతీష్, తాండూరు సీడీపీఓ శ్రీలత, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్ రూరల్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీరి అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చేగూరి రాజు, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్చారి, గణేశ్, సుదర్శన్, బుచ్చన్న, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
తాండూరు రూరల్: వీర్శెట్టిపల్లి గ్రామంలో కొందరు అక్రమార్కులు పట్టపగలు వాగులో నుంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం వీర్శెట్టిపల్లి గ్రామానికి చెందిన పరుశురాం వాగులో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో గోనూర్ గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్కు ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో పాటు నంబర్ కూడా లేదు. దీంతో ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి యజమాని పరశురాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కేసులకు భయపడేది లేదు తాండూరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు. ఈ ఘటనలో పట్టణ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో హాజరైన అనంతరం బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, పట్టణాధ్యక్షుడు సందీప్ రెడ్డి, నాయకు లు వినోద్, నర్సింహులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరిత కేసులు బనాయించడం సిగ్గు చేటన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. నివాళి బషీరాబాద్: ఏకాంబరి రామలింగేశ్వర ఆలయ ప్రధాన కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేసిన ఆచారి నర్సిములు(75) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. నీళ్లపల్లికి చెందిన ఆయన ఆలయ పరిసరాల్లో ఇల్లు నిర్మించుకుని చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు. శాసన మండలి చైర్మన్ పట్నం మహేందర్రెడ్డి నీళ్లపల్లికి చేరుకొని నర్సిములు మృతదేహానికి నివాళులర్పించారు. గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు మూసాపేట: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డి కూకట్పల్లిలోని హాస్టల్లో ఉంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. భూపాలపల్లి జిల్లాకు చెందిన దీక్షిత్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన అభినయ్, మంచిర్యాలకు చెందిన అన్షు అతడి స్నేహితులు. గంజాయికి అలవాటు పడిన వీరు గంజాయిని కొనుగోలు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వారికి పరిచయమైన అనురాగ్, వినయ్ కూడా వారితో జత కలిశారు. దీంతో వారు 10 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. కూకట్పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక టీస్టాల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నిందితుల్లో ఒకరైన అభినయ్ 2024లో బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, మిగిలిన ముగ్గురూ ఖాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అనురాగ్, వినయ్ కోసం గాలిస్తున్నామన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముందస్తు అరెస్టులు బాధాకరం
కుల్కచర్ల: ముందస్తు అరెస్టులు బాధాకరమని మాజీ సర్పంచులు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను ఇవ్వాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేయించడం సబబు కాదని కుల్కచర్ల మండల, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మణ్, తుల్జ్యా తదితరులు పేర్కొన్నారు. మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాలని లేనియెడల ఉప ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక పోలీస్ అధికారులు మంగళవారం వారిని ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత ప్రభుత్వ పాలనలో సర్పంచులుగా తాము ఎంతో కృషి చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తమను ప్రత్యేకంగా గుర్తించకపోగా తమను అరెస్టులు చేయడం ఏంటని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అరెస్టయిన వారిలో రవి, లోక్య పాల్గొన్నారు. అరెస్టులు అప్రజాస్వామికం దోమ: గత ప్రభుత్వంలో అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అప్రజాస్వామికమని సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. మంగళవారం దోమ మండలం నుంచి ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని గొప్పలు చెప్పుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,600 పైచిలుకు గ్రామ పంచాయతీలకు దాదాపు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ. పన్నెండు వందల కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రభుత్వ పెద్దలే వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ ఇటీవల విడుదల చేసిన నిధులు ఏ గ్రామ పంచాయతీకి విడుదలయ్యాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాలన్నారు. దాదాపు పది వేల పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించామని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినప్పటికి నేటికి కూడా పరిగి నియోజకవర్గానికి ఒక్క రూపాయి విడుదల కాలేదని విమర్శించారు. ఇప్పటికై నా మాజీ సర్పంచుల బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
గోవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
తాండూరు టౌన్: అక్రమంగా ఆవులను, లేగ దూడలను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 7వ తేదీన బక్రీద్ ఉన్నందునా ఆవులు, లేగ దూడలు కాకుండా ఇతర పశువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రశీదులను కొనుగోలుదారులు తప్పకుండా కలిగి ఉండాలని పేర్కొన్నారు. పశువులను విక్రయించే సమయంలో వెటర్నరీ వైద్యుడు లేదా పంచాయతీ కార్యదర్శి నుంచి విక్రయదారులు అనుమతి తీసుకోవాని సూచించారు. గోరక్షక్ సేవా సమితి లేదా ఇతరులకు ఆవులను తరలిస్తున్నట్లు తెలిస్తే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం చేరవేయాలన్నారు. యాలాల: గోవులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్ఐ గిరి హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. ప్రధాన మార్గంలో వెళ్లే గూడ్స్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాల పత్రాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు. గోవుల అక్రమ రవాణా నిరోధానికి చెక్పోస్టు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎవరైనా గోవులను రవాణా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
TS: ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ
వికారాబాద్: ఒకేసారి మూడు నెలల(జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ విషయమై కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు.. ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తున్నందున డువుతో సంబంధం లేకుండా లబి్ధదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమస్యలను అధిగమిస్తేనే.. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు సమస్యలు ఎదురుకానున్నాయి. గతంలో కోవిడ్ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలల కోటా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు మెకానిజం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలంటే మాత్రమే పలు సమస్యలను అధిగమించాల్సి ఉంది. కోటా నిల్వకు సరిపడా గోదాములను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో డీలర్ల దగ్గర కూడా మూడు నెలల కోటా ఒకే సారి నిల్వ చేయటానికి సరపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే ఇతర జిల్లాల నుంచి వచి్చన బియ్యం వచ్చినట్టు గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
శిక్షణలో సమస్తం నేర్చుకోవాలి
● కలెక్టర్ ప్రతీక్జైన్ ● లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం అనంతగిరి: క్షేత్రస్థాయిలో వాస్తవికతను పరిశీలించి నివేదిక అందజేయాల్సిన బాధ్యత సర్వేయర్లపై ఉంటుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టానికి అనుగుణంగా భూముల సర్వే నిమిత్తం శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో వికారాబాద్ జిల్లాలో 151 మందికి లైసెన్స్డ్ సర్వేయర్లను శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా భూ సర్వే ప్రక్రియ చేపట్టేందుకే శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ సమయంలో అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ పొందుతున్న వారు భూ భారతి చట్టంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. భూ వివాదాల జోలికి వెళ్లరాదని, అలాగే ప్రభుత్వ భూములను గుర్తించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ సామగ్రి కిట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కేశవ్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ● లబ్ధిదారులకు ఇళ్ల మంజూరుపత్రాల అందజేతపరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో 320 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపికై న వారికి పథకం మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు. త్వరలో రెండో విడత లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, నాయకులు భీంరెడ్డి, సత్యహరిశ్చందర్ తదితరులు పాల్గొన్నారు. -
కోటా
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి కసరత్తు ఒకేసారి మూడు నెలల వికారాబాద్: ఒకేసారి మూడు నెలల(జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు.. ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తున్నందున గడువుతో సంబంధం లేకుండా లబ్ధిదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమస్యలను అధిగమిస్తేనే.. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు సమస్యలు ఎదురుకానున్నాయి. గతంలో కోవిడ్ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలల కోటా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు మెకానిజం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలంటే మాత్రమే పలు సమస్యలను అధిగమించాల్సి ఉంది. కోటా నిల్వకు సరిపడా గోదాములను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో డీలర్ల దగ్గర కూడా మూడు నెలల కోటా ఒకే సారి నిల్వ చేయటానికి సరపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే ఇతర జిల్లాల నుంచి వచ్చిన బియ్యం వచ్చినట్టు గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 2,48,745 రేషన్ కార్డులుజిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1.30లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా యాసంగిలో 90వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసే సమయంలో జిల్లాలో పండిన వడ్ల ద్వారా సీఎంఆర్ రూపంలో సేకరించినవి సరిపోయేవి. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నందున జిల్లాలో వచ్చే దిగుబడి సరిపోవడంలేదు. కొనుగోలు కేంద్రాలకు ఐదు శాతానికి మించి సన్నరకం వడ్లు రావడం లేదు. ఇవి కేవలం మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకే సారి మొత్తం బియ్యం ఇచ్చేస్తే ఆ తర్వాత పంపిణీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 2,48,475 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 5,782 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం అంటే 17వేల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు పండించిన సన్నరకం వడ్లను ఎక్కువ శాతం బహిరంగ మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. దీంతో సన్నబియ్యం కోసం పక్క జిల్లాలపై ఆధారపడక తప్పడంలేదు. ప్రస్తుతం మూడు నెలల కోటాకు సంబంధించి మన పక్క జిల్లాలు అయిన నారాయణపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. జూన్ ఒకటి నుంచి 30వరకు సరఫరా ఐదు జిల్లాల నుంచి బియ్యం దిగుమతి ప్రతి నెలా ఇచ్చేది 5,782 మెట్రిక్ టన్నులు మూడు నెలల కోటాకు 17 వేల మెట్రిక్ టన్నులు అవసరం స్టాక్ నిల్వకు గోదాముల కొరత అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి మూడు నెలల రేష న్ బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారులకు మూడు నెలల కోటా బియ్యం అందజేస్తాం. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్ -
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
తాండూరు టౌన్: తాండూరు పట్టణం ఆదర్శ తులసీ నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. ఉదయం 6గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలను ప్రారంభించారు. ధ్వజారోహణం, గణపతి హోమం, అభిషేకం, భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం భక్త సురేష్చే ప్రవచనం, పలువురు పేరిణి శివతాండవంతో అలరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి విఘ్నేశ్వరున్ని దర్శించుకున్నారు. గోవుల అక్రమ రవాణా నేరం తాండూరు రూరల్: గోవులను అక్రమంగాతరలిస్తే కఠిన చర్యలు తప్పవని కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలంలోని తాండూరు – చించోళి మార్గం గౌతా పూర్ సమీపంలో పోలీస్ చెక్పోస్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 7న బక్రీద్ పండుగ ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గోవులు, లేగ దూడల తరలింపు నేరమన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా పెంచామని తెలిపారు. ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లేష్ పరిగి: కేంద్ర ప్రభుత్వం కావాలనే మావోయిస్టులపై కాల్పులు జరిపించి.. ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లేష్, మహేందర్ ఆరోపించారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా సోమవారం పరిగి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 500 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపారని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ అమాయక ఆదివాసులపై దాడులు చేసి హతమార్చడం సరికాదన్నారు. మావోయిస్తు జాతీయ కార్యదర్శి కేశవరావును పట్టుకుని కాల్చి చంపి ఎన్కౌంటర్ పేరుతో కథలు అల్లుతున్నారని విమర్శించారు. అడవి సంపదను ఇతర దేశాలకు తరలించే కుట్రలో భాగంగా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయన్నారు. వీటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, శ్రీశైలం, నర్సింహులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ మీట్ తాండూరు టౌన్: పట్టణంలోని పాత శాలివాహన కళాశాల మైదానంలో రేపు (28వ తేదీ బుధవారం) జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ మీట్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ఉపాధ్యక్షుడు రాము సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8, 10, 12 ఏళ్ల వయసు గల బాల బాలికలకు రన్నింగ్, లాంగ్జంప్, షార్ట్పుట్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు తహసీల్దార్చే జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంతో నేరుగా రేపు ఉదయం 9గంటలకు మైదానానికి రావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 89782 34447, 63000 75229లలో సంప్రదించాలన్నారు. -
బ్యాంక్లో పరిహారం సందడి
పారిశ్రామికవాడ భూ బాధితులతో కిటకిట● నిత్యం కోట్ల రూపాయలలావాదేవీలు ● ఫిక్స్డ్ డిపాజిట్లు మేలంటున్న బ్యాంకర్లు దుద్యాల్: దుద్యాల్ మండలం హకీంపేట్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నిత్యం రైతులతో కిటకిటలాడుతోంది. పారిశ్రామికవాడ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇటీవల పరిహారం అందజేసిన విషయం తెలిసిందే. హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, పులిచర్లకుంట తండాకు చెందిన రైతుల ఖాతాలు ఈ బ్యాంకులోనే ఉన్నాయి. ఇక్కడే పరిహారం చెక్కులు డిపాజిట్ చేశారు. ఒక్కో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందడంతో వందల మంది రైతులు వారివారి ఖాతాల్లో డబ్బు జమ చేశారు. దీంతో నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులో ఉన్న మొత్తం సరిపోక ప్రధాన బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తెస్తున్నట్లు తెలిసింది. క్రాప్ లోన్ కట్టాలి పారిశ్రామికవాడ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన పంట రుణాలు పెండింగ్లో ఉన్నాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. తీసుకున్న రుణాలు సకాలంలో కడితినే ఖాతాదారుల సిబిల్ స్కోర్ పడిపోకుండా ఉంటుందని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో లోన్లు పొందేందుకు ఆస్కారం లేకుండా పోతుందని రైతులకు సూచిస్తున్నారు.డిపాజిట్లు చేసుకోవడం ఉత్తమం హకీంపేట్, లగచర్ల, పోలేపల్లి, పులిచర్లకుంట తండాకు చెందిన రైతులకు పరిహారం డ బ్బు అందింది. వచ్చి న డబ్బు ద్వారా ఆస్తు లు కొనుగోలు చేస్తే మంచిది. లేకుంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావు. – హరీష్కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్, హకీంపేట్ -
ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి
అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమంలో జనం ఇచ్చి న అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్రతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి హాజరయ్యే జిల్లా అధికారులు సమయపాలన పాటించాలన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం 125 అర్జీలు వచ్చాయని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం
● సర్కారు బడుల్లోనే పిల్లలను చేర్పించాలి ● డీఈఓ రేణుకాదేవి ● విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని డీఈఓ రేణుకాదేవి తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉంటాయన్నారు. నాణ్యమైన బోధన అందుతుందని తెలిపారు. పౌష్టికాహారం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. అనంతరం పాఠశాల హెచ్ఎం శ్రీశైలం మాట్లాడారు. ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోకుండా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు 500ల పైచిలుకు మార్కులు సాధించారని తెలిపారు. అనంతరం పదో తరగతిలో 538 మార్కులు సాధించిన విద్యార్థిని భవానీని సన్మానించి బహుమతి అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బాబు సింగ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేశం, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలి
● మంత్రి సీతక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరిన నాగారం దళితులు ధారూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన దళితులు కోరారు. సోమవారం రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి నేటి వరకు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించలేదని తెలిపారు. 70 సంవత్సరాల నుంచి తమకు రిజర్వేషన్ సౌకర్యం లేక సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రామంలో 1,500 జనాభా ఉండగా ఎస్సీలు 400మంది ఉన్నారని, రానున్న ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి సీతక్క, ఎన్నికల కమిషన్ అధికారి సానుకూలంగా స్పందించారని నాయకులు సుకుమార్, శ్రీనివాస్, లక్ష్మణ్, గణేశ్, నాగరాజ్ తెలిపారు. -
రోడ్డు అంచు.. ప్రమాదపు ఉచ్చు!
బషీరాబాద్: మండల పరిధిలోని నీళ్లపల్లి మైల్వార్ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డును డబుల్గా విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ దారిని ఓ పక్కన తవ్వి వదిలేశాడు. దీంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇక్కడ కనీసం ప్రమాద సూచికలు, రేడియం స్టిక్కర్లు కూడా ఏర్పాటు చేయలేదు. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, అదుపుతప్పినా అంతే సంగతులు. ఇలా ఇప్పటికే పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. రహదారి విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం ఆందోళనలో వాహనదారులు -
మేకులు కొట్టి.. బ్యానర్లు కట్టి!
ధారూరు: వివిధ ప్రైవేటు కంపెనీలు, షాపుల నిర్వాహకులు రోడ్ల పక్కన ఉన్న చెట్లను ప్రచార సాధనాలుగా వాడుకుంటున్నారు. వీటికి ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. ఫైబర్, ప్లాస్టిక్, ఐరన్తో తయారు చేసిన షీట్లను కొడుతున్నారు. ఇందుకోసం మేకులు వినియోగిస్తున్నారు. దీనిద్వారా మొక్కలు, వృక్షాలు ఎండిపోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. మనిషి శరీరంలో ఇనుప వస్తువు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుందని, ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోకపోతే క్రమేణా పుండుగా మారుతుందని చెబుతున్నారు. ఇలాగే చెట్లకు కొట్టిన మేకుల కారణంగా వాటికి పుండ్లవంటి గాయాలు ఏర్పడి ఈదురు గాలులకు విరిగిపోతున్నాయని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బ్యానర్లు, పోస్టర్లు కట్టిన, అతికించిన ఆయా ప్రైవేటు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల పక్కన చెట్లను ప్రచార సాధనాలుగా వాడుతున్న కంపెనీలు పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు -
భారీ వర్షానికి తడిసిన ధాన్యం
● కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల తిప్పలు ● తూకం వేయడంలో జాప్యం యాలాల: ఆరుగాలం శ్రమించిన అన్నదాతల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చిన ధాన్యం తడిసి అపార నష్టాన్ని మిగిల్చింది. తూకం వేయడంలో జాప్యం కారణంగా పడిగాపులు కాయాల్సి వస్తుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొంటున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారుల మాటలు నీటిమీద రాతలుగా మారాయని ఆరోపించారు. మొలకెత్తిన వడ్లు మండలంలో ఎక్కువగా వరి పంటను సాగు చేస్తుంటారు. ఇటీవల డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ సమయానికి సంచులతో పాటు తూకాలు, ధాన్యం తరలింపులో జాప్యం జరగడంతో కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాశారు. సోమవారంతోపాటు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెన్నూరు, రాస్నం, సంగెంకుర్దు, తిమ్మాయిపల్లి, యాలాల, లక్ష్మీనారాయణపూర్, అగ్గనూరు, దేవనూరు తదితర కేంద్రాల్లో ధాన్యం తడిసింది. దీనికితోడు పలు కేంద్రాల్లో తేమ కోసం ఆరబెట్టిన ధాన్యం మొలకెత్తింది. ప్రభుత్వ మద్దతు ధర కోసం రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన సకాలంలో తూకం, తరలింపు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన వడ్ల విషయంలో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. షరతుల్లేకుండా కొనాలి ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన వడ్లను ప్రభుత్వ మద్దతు ధరతో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. కేంద్రాల్లో గన్నీ సంచులు, తూకాలు, రవాణా తదితర విషయాల్లో అధికార యంత్రాంగం విఫలమైంది. బెన్నూరు, లక్ష్మీనారాయణపూర్, యాలాల తదితర కేంద్రాల్లో రైతుల ధాన్యం పూర్తిగా తడిసి మొలకెత్తింది. యంత్రాంగం స్పందించి షరతులు లేకుండా ఽకొనుగోలు చేయాలి. – శివకుమార్, ఈజీఎస్, స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యుడు నష్టపోతున్న రైతులు పరిగి: ఇటీవల కురుస్తున్న వర్షానికి కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో మోస్తరు వాన కురిసింది. కల్లాల్లోని ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆలస్యం కావడంతో నష్టపోతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలు అమలు కావడం లేదని కర్షకులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులు త్వరితగతిన అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
బాల్య వివాహాలు నేరం
● ప్రోత్సహించినా, సహకరించినా చర్యలు తప్పవు ● ధారూరు ఎస్ఐ అనిత ధారూరు: సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ధారూరు ఎస్ఐ అనిత సూచించారు. కేరెళ్లిలోని సత్యసాయి సార్వజనిక కేంద్రంలో సోమ వారం కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవగాహన లేక అనేక మంది సైబర్ నేరాల బారిన పడి నష్టపోతున్నారని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, వీటిని ప్రోత్సహించినా, సహకరించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. వివాహాలు చేసుకునే యువతీ, యువకులకు 18, 21 సంవత్సరాలు నిండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి సార్వజనిక కేంద్రం సభ్యులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కుక్కకాటు నిర్లక్ష్యానికి ప్రాణం బలి తాండూరు రూరల్: రేబిస్ వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దేముల్ మండలం ఇందూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రవీణ్(32) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం కుక్క కాటుకు గురయ్యాడు. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించాడు. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు రావడంతో ఆదివారం ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు తాండూరులోని ఓ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు రెఫర్ చేశారు. పరీక్షించి వైద్యులు ప్రవీణ్కు రేబిస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు సోమవారం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
నేలమాలిగలు
ఉల్లి నిల్వకు ● ధర లేకపోవడంతో పంట స్టోరేజీకి ప్రాధాన్యం ఇస్తున్న రైతులు ● పొలాల్లోనే నేలమాలిగల తయారీ ● ప్రభుత్వమే షెడ్లు నిర్మించాలని అభ్యర్థన మోమిన్పేట: సరైన ధరలు లేకపోవడంతో ఉల్లి పంటలను నిల్వ చేసేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు స్టోరేజీల్లో నిల్వ చేసేందుకు ఎక్కువ ఖర్చవడం వంటి కారణాలతో పొలాల వద్దే నేలమాలిగలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తయారీ ఇలా.. చుట్టూ గుంజలు(బలమైన కట్టెలు) పాతి, నిలువుగా కంది కట్టె కడుతారు. మధ్యలో గ్రానైట్ రాళ్లు పెట్టి, వీటిపైనుంచి కట్టెలు పెడుతారు. ఆతర్వాత కంది పొరక, వరి గడ్డితో నింపుతారు. అనంతరం ఉల్లిగడ్డ వేసి, గడ్డి, ఆకులతో కప్పు వేస్తారు. దీనిపైనుంచి టార్పాలిన్ వంటి కవర్లతో కప్పేస్తారు. ఇలా అన్ని దిక్కుల నుంచి వెలుతురు, గాలి తగిలేలా చూసుకుంటారు. ఆగస్టు, సెప్టెంబర్లో బయటకు మేకవనంపల్లి, రాళ్లగుడుపల్లి, కాస్లాబాద్, ఏన్కతల, దేవరంపల్లి, మోమిన్పేట, ఏన్కెపల్లి, కోల్కుంద గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. జనవరిలో నాటిన ఉల్లిని ఏప్రిల్ చివరన, మే మొదటి, రెండో వారంలో బయటకు తీస్తారు. ఈ సమయంలో మంచి రేటు పలికితే ఆరబెట్టి మార్కెట్కు తరలిస్తారు. లేదంటే నేలమాలిగల్లో నిల్వ చేస్తారు. మంచి ధర పలికే సమయంలో బయటకు తీసి విక్రయిస్తారు. సుమారు మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంచుతారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అమ్మేస్తారు. అప్పుడు కూడా సరైన ధర లేకపోతే మరికొంత సమయం వేచి చూస్తారు. తక్కువ ఖర్చు... ఎకరా పొలంలో సాగు చేసిన ఉల్లిని నిల్వ చేసేందుకు నేలమాలిగలు తయారు చేసేందుకు సుమారు రూ.4 వేల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. స్వయంగా పనిచేసుకుంటే ఇది మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు పలుకుతోందని ఈ సమయంలో అమ్ముకుని నష్టపోయేకన్నా.. ఇలా చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. వర్షాలు, తుపాన్లతో ఇబ్బంది ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన తీరులో నిల్వ చేయకపోతే పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసినా, రోజుల తరబడి తుఫాన్ ఉన్నా ఇబ్బందే. దీనికి తోడు నేలమాలిగలకు అగ్ని ప్రమాదాలతో నష్టం కలుగుతుంది. బీడీ, సిగరెట్ ముక్కలు కాల్చి పడేయటం వలన ఇలాంటివి సంభవిస్తుంటాయి. షెడ్లు నిర్మిస్తే మేలు మహారాష్ట్రలో మాదిరిగా ఉల్లి సాగు చేసే రైతులకు ప్రభుత్వమే అండర్ గ్రౌండ్ షెడ్లు నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వ భూముల్లో వీటిని నిర్మించడం ద్వారా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. రైతులకు కూడా పంట నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ధర తక్కువగా ఉండటంతో.. నేను రెండెకరాల్లో ఉల్లి సాగు చేశా. సుమారు 22 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ధర లేకపోవడంతో నేలమాలిగ తయారు చేయించా. ఇందులో నిల్వ చేసి ధర పెరిగిన తర్వాత విక్రయిస్తా. – నారాయణరెడ్డి, రైతు, ఏన్కతల -
పాఠ్య పుస్తకాల పంపిణీ
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్స్వామి మాట్లాడుతూ.. మండలంలో అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిందన్నారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇప్పటికీ మండలంలో 80శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. మిగతావి కూడా త్వరలో రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సీఆర్పీ నారాయణ ఉన్నారు. -
రైతులతో మమేకం.. సాగుకు సన్నద్ధం
కొడంగల్ రూరల్: రైతులకు మేలైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా వానాకాలం సాగుకు సమాయత్తం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం(తాండూరు ఏరువాక కేంద్రం) ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులను నియోజకవర్గంలో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. సదస్సులకు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. యాజమాన్య పద్ధతులతో ఆధునిక వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకం, భూసార పరీక్షలు, పంట మార్పిడి పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలతోపాటు స్థానిక వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పంటల సాగులో మెలకువలపై సూచనలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి జూన్ నెల 13వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆరుసూత్రాలతో సాగు బాగు రైతులు తక్కువ ఖర్చుతో ఆరు సూత్రాలను ఆచరించి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడితోపాటు ఆర్థికంగా లాభాలు గడించే అవకాశం ఉంటుందని సదస్సుల ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చు తగ్గించుకోవడం, అవసరమైనంతలోనే రసాయనాలను వినియోగించడం, రశీదులను భద్రపరచడం, కష్టకాలంలో నష్ట పరిహారం పొందడం, సాగునీరు ఆదా చేయడం, భావి తరాలకు అందించడం, పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందడం, పొలం గట్లపై చెట్లను పెంచడం పర్యావరణ సమతుల్యత కాపాడడం వంటి ఆరు సూత్రాలతో అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ సదస్సులను నిర్వహిస్తున్నారు. దీంతో వ్యవసాయ పద్ధతుల్లో విశేష మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆరుగాలం శ్రమించిన కర్షకులు పేర్కొంటున్నారు.ఉత్సాహంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వానాకాలం సాగుపై అవగాహన గ్రామాల్లో కొనసాగుతున్న సదస్సులు విశేష స్పందన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలతో వ్యవసాయాధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతులకు మేలైన సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరిస్తున్నాం. సదస్సులకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. – శంకర్ రాథోడ్, ఏడీఏ, కొడంగల్