Komaram Bheem
-
దంచికొడుతున్న ‘మృగశిర’ ఎండలు
కౌటాల: వర్షాకాలం సీజన్ ప్రారంభమై 15 రోజులు గడిచింది. అయినా మృగశిర కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి మాదిరిగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే వేడి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. బుధవారం దహెగాం మండలం కుంచవెల్లిలో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్గా పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, బెజ్జూర్ 43.3, సిర్పూర్(టి) 43.2, తిర్యాణి 43.0, గోలేటి 42.7, రెబ్బెన 42.6, వాంకిడిలో 42.2 డిగ్రీలు నమోదైంది. జిల్లాలోని 15 మండలాలు అలర్ట్ జోన్లో ఉన్నాయి. ఎండలకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, వానలు లేక సాగు పనులు జోరందుకోవడం లేదు. భారీ వర్షాల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. -
పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్అర్బన్: పర్యావరణ పరిరక్షణ ప్రా ధాన్యతను విద్యార్థులకు తెలియజేయడం, వారిలో బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్– నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటేషన్– 2026 పోస్టర్ను బుధవారం జిల్లా కేంద్రంలో డీఈవో సచ్చిదానంద చారి ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి తన తల్లి పేరుతో కనీసం ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ లతీఫ్, క్వాలిటీ కోఆర్డి నేటర్ శ్రీనివాస్, ఐఈ సీఎంవో కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈవోలు ఆడే ప్రకాశ్, జయరాజ్, నానాజీ తదితరులు పాల్గొన్నారు. -
అక్షరమే జీవితానికి అండ
కెరమెరి: అక్షరమే జీవితానికి అండగా నిలుస్తుంద ని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కెరమెరి మండలం గోయగాం ప్రాథమిక పాఠశాలలో బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మా ట్, డీఈవో సచ్చిదానంద చారితో కలిసి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. గ్రామస్తులందరూ కలిసి పాఠశాలను అభివృద్ధి చేసుకోవడంపై అభినందించారు. తన వంతుగా రూ.5వేలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు చైతన్యమైతేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాగునీటి సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల చుక్కా రామయ్య పాఠశాలలో సీట్లు సాధించిన పది మంది విద్యార్థులను సన్మానించారు. క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎస్వో శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్ఎంలు మహేశ్వర్, కడేర్ల రంగయ్య, సర్పంచ్ ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. విస్తృత ప్రచారం చేయాలి ఆసిఫాబాద్: జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించే కార్యక్రమాలపై దినపత్రికలు, ప్రసార సాధనాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో సంపత్ కుమార్, జిల్లా మీడియా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.ప్రతిఒక్కరూ బీమా చేసుకోవాలిఆసిఫాబాద్: జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరూ బీమా చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బీమాదారుల కుటుంబాలకు బుధవారం చెక్కులు పంపిణీ చేశారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మంచిర్యాల బ్రాంచ్లో పీఎం జీవన్జ్యోతి బీమా యోజన చేయించుకున్న బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మి మృతి చెందగా కుటుంబ సభ్యురాలు పెంటుబాయికి రూ.2 లక్షల చెక్కు అందజేశారు, రాయల్ సుందరం పథకంలో రూ.565 ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్న అదే గ్రామానికి చెందిన కనక కమల పాముకాటుతో మృతి చెందగా, ఆమె కుమారుడు సుధాకర్కు రూ.10 లక్షల బీమా చెక్కు అందించారు. కార్యక్రమంలో తపాలాశాఖ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్, మేనేజర్ సాగర్, రాయల్ సుందరం కంపెనీ రీజినల్ మేనేజర్ ధన్రాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
గత పాలకుల నిర్లక్ష్యంతో కుంటుపడిన అభివృద్ధి
దహెగాం: గత పాలకుల నిర్లక్ష్యంతోనే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద బుధవారం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెంచికల్పేట్, దహెగాం మధ్యలో పెద్దవాగు వద్ద వంతెన, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనులు పూర్తయితే రెండు మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాపర్తి జయలక్ష్మి, సహకార సంఘం చైర్మన్ తిరుపతిగౌడ్, వైస్ చైర్మన్ ధనుంజయ్, తహసీల్దార్ మునవార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి కాగజ్నగర్టౌన్/పెంచికల్పేట్: అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం 40 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో సంతోష్రెడ్డి, సర్పంచులు రాంచందర్, రవీందర్, ఉస్మాన్, రాజేశ్వరి, కృష్ణవేణి పాల్గొన్నారు. -
అభ్యర్థులకు ప్రయాణ పరీక్ష
కాగజ్నగర్టౌన్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్– 2026కు హాజరయ్యే జిల్లా అభ్యర్థులపై అదనపు భారం పడుతోంది. జిల్లాకు దూరంగా కేంద్రాలు కేటాయించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు టెట్ జరుగనుంది. ఈ పరీక్షలు సీబీటీ విధానంలో కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వహిస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి సుమారు నాలుగు వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులకు వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ వంటి దూర ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లు కేటాయించారు. చాలామంది ఒక్కరోజు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోనే నిర్వహించాలిఏటా టెట్ రాయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ఫీజు రూ.వెయ్యి, ప్రయాణ ఖర్చులు మరో రూ.వెయ్యి.. ఇలా అన్ని ఖర్చులు భరించుకోవాలి. ఉద్యోగం లేకనే పోటీ పరీక్షలకు హాజరవుతున్నాం. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – విద్యాసాగర్, కాగజ్నగర్ ప్రయాణాలతో ఇబ్బందివరంగల్, హైదరాబాద్ పట్టణాల్లో కేంద్రాలు కేటాయిస్తే ఇక్కడి నుంచి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఉదయాన్నే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కు వెళ్లాలి. లేదంటే ఒక్క రోజు ముందుగా ఆయా పట్టణాలకు చేరుకోవాలి. అక్కడ బంధువులు ఉంటే వారి ఇళ్లలో ఉండాలి. – సంధ్య, కాగజ్నగర్ -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కౌటాల: ప్రతిరోజూ యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని యోగా ఇన్స్ట్రక్టర్ దాసరి వినోద్గౌడ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం కౌటాల పంచాయతీ కార్యాలయంలో యోగాపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. దైనందిన కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాతో జాప్ఞకశక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ డబ్బా గోపాల్, కార్యదర్శి కై లాస్, యోగా శిక్షకురాలు రోజా, నాయకులు తిరుపతి, ప్రభాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రభుత్వంలో సొంతింటి కల సాకారం
రెబ్బెన: ప్రజాప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారమవుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్తో కలిసి హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుకు నూతన వస్త్రాలు అందించారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, ఇన్చార్జి మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, ఉప సర్పంచ్ దుర్గం తిరుపతి, నాయకులు బలరాం నాయక్, ఎర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు సకాలంలో అందిస్తేనే..
ఆసిఫాబాద్: జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో 2026– 27 సంవత్సరానికి రూ.3,546.79 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్ కె.హరిత నిర్ణయించారు. జిల్లాలో వివిధ రకాల బ్యాంకులు మొత్తం 56 ఉన్నాయి. వీటిలో 39 గ్రామీణ ప్రాంతా లు, 17 సెమీ అర్బన్ ప్రాంతాల్లో బ్రాంచీల ద్వారా రుణాలు అందిస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,233.47 కోట్ల రుణ లక్ష్యం కాగా, వీటిలో రూ.1,680.67కోట్ల పంట రుణాలు, రూ.359.63 కోట్ల వ్యవసాయ టర్మ్, ఇతర రుణాలు కేటాయించినా బ్యాంకర్లు పంపిణీ లక్ష్యాన్ని చేరలేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు నిబంధనలతో రుణాల పంపిణీ ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ప్రజల్లో సరైన అవగాహన లేక పోవడం, బ్యాంకర్లు కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో లక్ష్యాన్ని చేరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 9.69 శాతం అదనం 2025– 26 ఆర్థిక సంవత్సరంలో పోల్చితే ఈసారి రుణ ప్రణాళికలో 9.69 శాతం అదనంగా నిధులు కేటాయించారు. గతేడాది రూ.3,233.47 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,546.79కోట్లు కేటాయించారు. గతేడాది 6,294 స్వయం సహాయక సంఘాలకు రూ.232.43 కోట్లు అందజేయాల్సి ఉండగా, 2,609 సంఘాలకు 157.94 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఈసారి 8,163 స్వయం సహాయక సంఘాలకు రూ.239.77 కోట్లు చెల్లించాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ14.69 కోట్లు(2.68 శాతం) అందజేశారు. బ్యాంకర్ల పనితీరుపై కలెక్టర్ కె.హరిత సమీక్ష సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశా రు. పీఎం ముద్ర లోన్ కింద 9,833 మందికి రూ.87.49 కోట్లు అందజేశారు. వీటిలో రూ. 50 వేల లోపు రుణాలు 5,353 మందికి రూ.11.73 కోట్లు, రూ.5 లక్షల లోపు రుణాలు 3,910 మందికి రూ.34.64 కోట్లు, రూ.10 లక్షల లోపు రుణాలు 461 మందికి రూ.27.67 కోట్లు, రూ.20 లక్షల లోపు రుణాలు 109 మందికి రూ.13.45 కోట్లు అందించారు. సెక్టా ర్ టార్గెట్ అచీవ్మెంట్ కింద ఎడ్యుకేషన్ రుణాలు 38.4 కోట్లు లక్ష్యం కాగా, కేవలం రూ.1.6 కోట్లు(4.1 శాతం) మాత్రమే అందజేశారు. హౌజింగ్ రు ణాలు రూ.78 కోట్లు లక్ష్యం కాగా, కేవలం 8.5 కో ట్లు(10.9 శాతం) అందజేయడం గమనార్హం. రైతులతోపాటు మహిళా సంఘాలు, అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ఆశించిన పురోగతి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవసరము న్న రుణాలు ఇస్తేనే లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. లక్ష్యం పూర్తి చేసేందుకు కృషిజిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. పాత వారికి తిరిగి కొత్త రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బంది లేకుండా రుణాలు పంపిణీ చేస్తాం. అవసరమైన పత్రాలతో తమ పరిధిలోని బ్యాంకులను సంప్రదించాలి. – రాజేశ్వర్ జోషి, లీడ్ బ్యాంక్ మేనేజర్జిల్లాలో 1.45 లక్షల మంది పట్టా పాస్పుస్తకాలు కలిగిన రైతులు ఉండగా, మరో 10 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. 2026– 27 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్లో 4.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల కంది, 7.5 వేల ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పంట రుణాలు సకా లంలో అందించాల్సిన అవసరం ఉంది. -
‘ప్రాణహిత’ పూర్తికాకపోవడం దురదృష్టకరం
కౌటాల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టు ఆ తర్వాత పలువురు సీఎంలు మారినా పూర్తికాకపోవడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం రేవంత్రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిని మంగళవారం సందర్శించి.. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడటం మానుకుని, రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సాగు నీరందక ఈ ప్రాంత రైతులు వెనుకబడ్డారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత మనోహర్, మండల ఇన్చార్జి అనిల్ పాల్గొన్నారు. ఎస్పీఎంలో స్థానికులకే అవకాశం కల్పించాలికాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకే అవకాశం కల్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాగజ్నగర్ పట్టణానికి చేరుకోగా, చెక్పోస్ట్ వద్ద సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత పుష్పగుచ్ఛం, హారతితో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పట్టణంలోని ఎస్పీఎం కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మిల్లులో స్థానికులకు 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పించి మిగితా 5 శాతం ఇతర ప్రాంతాల వారికి ఇవ్వాలన్నారు. యాజమాన్యం హైకోర్టులో పెట్టిన కేసును వెనక్కి తీసుకుని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫున కార్మిక గుర్తిపుం సంఘం ఎన్నికలు నిర్వహించేలా హైకోర్టులో న్యాయవాదిని నియమించామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కావేటి మనోహర్, శ్రీనివాస్, హెచ్ఎంఎస్ నాయకులు, ఎస్పీఎం కార్మికులు పాల్గొన్నారు. -
జూన్ 1 నుంచి 15 వరకు వర్షపాతం(మి.మీ.)
మండలం కురవాల్సింది కురిసింది లోటు/అధికం శాతం గతేడాది వర్షం జైనూర్ 77.2 52.4 – 32 34.8 సిర్పూర్(యు) 69.1 93.7 +36 33.6 లింగాపూర్ 70.6 60.4 – 14 79.3 తిర్యాణి 66.9 58.9 –12 37.8 రెబ్బెన 56.4 38.1 –32 61.0 ఆసిఫాబాద్ 73.2 42.3 –42 69.4 కెరమెరి 52.1 99.7 +91 87.4 వాంకిడి 74.0 13.5 –82 155.3 కాగజ్నగర్ 64.0 13.1 –80 82.8 సిర్పూర్(టి) 66.8 47.6 –29 55.0 కౌటాల 72.9 42.6 –42 32.4 చింతలమానెపల్లి 74.8 12.7 –83 12.1 బెజ్జూర్ 84.3 14.1 –83 18.6 పెంచికల్పేట్ 74.6 39.1 –48 7.7 దహెగాం 82.9 25.7 –69 5.9 -
సాగు సాగక!
వాన లేక.. దహెగాం: మృగశిర కార్తె ప్రవేశించి పది రోజులు కావొస్తున్నా నేటికీ జిల్లాలో భారీ వర్షాలు కురవలేదు. రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవడానికి చేలు దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నా కనీసం మట్టిపెల్లలు కరగకపోవడంతో సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది జూన్ 15 నాటికి 51.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి ఇప్పటివరకు 70.7 మి.మీ.ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 43.5 మి.మీ. మాత్రమే కురిసింది. అంటే 38 శాతం లోటు ఉంది. సిర్పూర్(యు), కెరమెరి మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా, మిగతా 13 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 4.50 లక్షల ఎకరాల్లో సాగుజిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్లో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 50 వేల ఎకరాల్లో వరి సాగు ఉండనుంది. మిగతా 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయి. గతేడాది ఖరీఫ్ ఆరంభంలో మోస్తరు వర్షాలు కురవడంతో జూన్ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ట్రాక్టర్తో కల్టివేటర్ కొడుతుండగా, వర్షాలు లేని ప్రాంతాల్లో దుక్కులు దున్నుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పనులు చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రతిరోజూ మబ్బులతో గాలిదుమారం వీస్తోందే గానీ వర్షం మాత్రం పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి కోసంగతేడాది మే చివరి వారం, జూన్ మొదటి వారంలో వర్షాలు కురిశాయి. కానీ ఈసారి మే నెలలో ఆశించి న స్థాయిలో వర్షాలు పడలేదు. చిరుజల్లులకే విత్తనాలు విత్తితే నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా తొలకరి వర్షాలకే విత్తనాలు విత్తగా, వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు మాడిపోయి అన్నదాతలు నష్టాలను చవిచూశారు. ఒకటికి రెండుసార్లు విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. భూమి 2 నుంచి 3 ఫీట్ల లోతు వరకు తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఈ ఫొటోలో ట్రాక్టర్ పక్కన నిలబడ్డ రైతు పేరు రత్నం మధుకర్. ఈ సీజన్లో 20 ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి భూమిని ట్రాక్టర్తో దుక్కి దున్ని సిద్ధం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి బొర్లకుంట శివారులో మోస్తరు వర్షం కురిసింది. దీంతో కల్టివేటర్ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు భారీ వర్షాలేవీ కురవలేదని, వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నాడు. ఇలా.. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ రైతులు చేలు సిద్ధం చేసి భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.చేతిలో మట్టిపెల్ల పట్టుకుని చూపిస్తున్న ఈ రైతు పేరు జాటోత్ గోపాల్. దహెగాం మండలం కల్వాడ గ్రామం. ఈ సీజన్లో సొంతంగా ఉన్న ఐదెకరాలే కాకుండా, మరో పదెకరాలను రూ.1.50 లక్షలకు కౌలుకు తీసుకున్నాడు. పత్తి సాగుకు కౌలుకు తీసుకున్న భూమిని దుక్కి దున్నించినా సరైన వర్షం లేక ఇంకా మట్టిపెల్ల లు కూడా కరగలేదు. గతేడాది జూన్ 10 నాటికే వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టానని చెబుతున్నాడు. -
గనులపై కోల్వార్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బొగ్గు గనులపై రాజకీయం వేడెక్కింది. కొద్ది రోజులుగా బొగ్గు గనులు కేంద్రంగా కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు పర్యటిస్తున్న క్రమంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం పెరుగుతోంది. రెండురోజులుగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘బాయి బాట’ పేరిట జిల్లాలోని బొగ్గు గనులను సందర్శిస్తున్నారు. కాసిపేట, శ్రీరాంపూర్తో పాటు స్థానిక కార్మికులను కలుస్తూ పలు సమస్యలు తెలుసుకుంటున్నారు. కార్మికుల వసతుల నుంచి సంస్థ విధానాలపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. కవిత హెచ్ఎంఎస్కు గౌరవాధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ‘బాయి బాట’తో కార్మిక లోకానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కవిత టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా పనిచేయగా, తాజాగా కొత్త రాజకీయ పార్టీతో ఇక్కడి నుంచే రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం, మంత్రుల టూర్ఇటీవలే జిల్లాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్కతో పాటు మంత్రులు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొ న్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో, సింగరే ణి ప్రాంత ఎమ్మెల్యేలు పర్యటించారు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మికుల వారసులకు సంస్థలో కారుణ్య నియామకాలు ఇచ్చారు. ఒకేరోజు జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి 335మందికి నియామక పత్రాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎంతోపాటు మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నివాసంలోనే బస చేశారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టుపై ఓపెన్ హౌస్ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై బొగ్గు వెలికితీత నుంచి ఉత్పత్తి, రవాణా వరకు మీడియా సమక్షంలోనే అధికారులతో వివరించారు. రాజకీయ జోక్యం.. కార్మికుల బేజారుస్వతంత్ర ప్రతిపత్తి గల సింగరేణి కంపెనీలో మితి మీరిన రాజకీయ జోక్యం ఇప్పటికే సంస్థ పని తీరు పై ప్రతికూల ప్రభావం చూపుతోందనే విమర్శలు న్నాయి. కంపెనీలో కార్మికుడికి క్వార్టర్ కేటాయింపు నుంచి డిప్యుటేషన్, బదిలీ లాంటి చిన్న పనుల నుంచి మెడికల్బోర్డు ఏర్పాటు, నూతన నియామకాలు, టెండర్లు, సంస్థ లావాదేవీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు ప్రభావితం చేయడంతో కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక గత, ప్రస్తుత ప్రభుత్వాలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు విద్యుత్ సంస్థ నుంచే కాకుండా సర్కా రు నుంచి వచ్చే మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతోనూ సంస్థ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బంది గా మారింది. ఓ వైపు బొగ్గుకు తగ్గుతున్న డిమాండ్, భూగర్భ గనుల్లో నష్టాలు, ఓపెన్కాస్టుల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్ల తీరుతో సంస్థకు ఇటీవల ఆశించిన తీరులో లాభాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యట నలో డిప్యూటీ సీఎం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండబోదని ప్రకటించారు. స్వయం ప్రతిపత్తి సంస్థ హోదాను కాపాడుతామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికే కంపెనీలో కార్మికులకు మేలు చేస్తున్నామనే పేరుతో అన్ని రాజకీయ పార్టీలు సంస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ మేరకు సంస్థ తన స్వతంత్రను నిలబెట్టుకుంటుందనేది కార్మిక వర్గాల్లో పెద్దప్రశ్నగా మిగిలింది.ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంస్థలో 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే దీనిపై సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇక జైపూర్ థర్మల్ప్లాంట్లో 800 మెగావాట్ల యూనిట్ పనుల్లో అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ రెండింటిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్రెడ్డికి లేఖ రాయగా, ఆయన స్పందించారు. దీంతో జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు అధికార పార్టీకి చెందిన కోల్ బెల్ట్ పరిధి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ఆరోపణల్ని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఇటీవల టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాలకు వచ్చి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య, కార్మిక నాయకుడు రాజిరెడ్డి, ఇతర నాయకులతో కలిసి ప్రెస్మీట్ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని, కార్మికులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. -
అర్హులందరికీ బ్యాంకు రుణాలు
ఆసిఫాబాద్: జిల్లాలో అర్హులందరికీ బ్యాంకు రుణాలు అందిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం 2025– 26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక రుణాల ప్రగతిపై బ్యాంకు, ఇతర శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహంచారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాజేశ్వర్ జోషి హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,294 స్వయం సహాయక సంఘాలకు రూ.411 కోట్లు రుణ లక్ష్యం కాగా, 2,609 సంఘాలకు మాత్రమే రుణాలు అందించడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన సంఘాలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. మహిళలు, వ్యాపారం చేసుకునే వారికి పీఎంఈజీపీ, పీఎం ఉపాధి కల్పన పథకం కింద చేతి వృత్తుల వారికి, అర్హులైన యువతకు రుణాలు అందించాలన్నారు. పరిశ్రమలు, డెయిరీలు, గొర్రెల పెంపకం, చేనేత, మత్స్య పరిశ్రమల స్థాపనతోపాటు వ్యవసాయ రంగం, విద్యారుణాలు, గృహ నిర్మాణ రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ నూతన రుణ ప్రణాళిక 2026–27 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు ధనికులు, వ్యాపారవేత్తలకే కాకుండా గ్రామీణ ప్రజలు, సామాన్యులకు రుణాలందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ సందర్భంగా 2026– 27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,545.80 కోట్ల రుణ ప్రణాళికను ఆమోదించారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.2,642 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఎల్డీఎం హరిప్రసాద్, ఏడీసీసీ బ్యాంకు డీజీఎం ఏ.భాస్కర్రెడ్డి, వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లు, సెక్టార్ అధికారులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’పై బూత్స్థాయి అధికారులకు శిక్షణ
కాగజ్నగర్టౌన్: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ – 2026లో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు మండలంలోని వంజీరి రైతువేదికలో మంగళవారం బూత్స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత పేర్ల చేర్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు, సవరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మల్లెపూల మధుకర్, రామ్మోహన్, బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. -
కుమురం భీం
7ఉపాధిలో మహిళల జోష్ జిల్లాలో ఉపాధిహామీ పథకంలో మహిళా కూలీలు సత్తా చాటుతున్నారు. పనులకు వచ్చే వారిలో పురుషులతో పోల్చితే మహిళలే అధికంగా ఉంటున్నారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఉక్కపోత పెరుగుతుంది. సాయంత్రం అక్కడక్కడ జల్లులు కురుస్తాయి. ‘కడెం’కు రక్షణగా ట్రాష్రాక్ కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా ప్ర భుత్వం ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టింది. వరదలకు కొట్టుకువచ్చే కట్టెలు, చెత్తను అడ్డుకునే వీలు కలగనుంది. 8లోu బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026 -
దేవుడ్పల్లి.. ‘పోడు’ లొల్లి..!
కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన రైతు బామ్నె రాము 40 ఏళుగా సాగు చేస్తున్నాడు. ఆయనకు అటవీ ప్రాంతంలో వివాదాస్పద మూడెకరాల భూమి ఉంది. రెండు రోజుల క్రితం అటవీ అధికారులు సాగు పనులను అడ్డుకున్నారు. జీవనాధారమైన భూమిని లాక్కుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కెరమెరి రేంజ్ పరిధిలో 70 మంది గిరిజనేతర రైతులందరిదీ ఇదే పరిస్థితి.. కెరమెరి: వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో సాగు భూముల లొల్లి మొదలైంది. అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అటవీ భూముల్లో ప్లాంటేషన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతుండగా, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. కెరమెరి అటవీ రేంజ్ పరిధిలోని గోయగాం సెక్షన్ దేవుడ్పల్లి బీట్లో 450 హెక్టర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇందులో 70 శాతం సాగులోనే ఉంది. ఇందులో 100 హెక్టార్ల(సుమారు 250 ఎకరాలు)ను ఆధీనంలోకి తీసుకుని ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ భూమిపై ఆధారపడి కెరమెరి మండలం సుర్దాపూర్, ధనోరా, సావర్ఖేడా గ్రామాలకు చెందిన సమారు 70 మంది గిరిజనేతర రైతుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. టైగర్ కారిడార్ ప్రాంతంకెరమెరి మండలం దేవుడ్పల్లిలోని 67 కంపార్ట్మెంట్ అంతా టైగర్ కారిడార్ పరిధిలోకి వస్తుంది. గతేడాది పెద్దపులి సంచరించగా, చిరుత, ఇతర వన్యప్రాణుల కదలికలు కూడా ఉన్నాయి. తడోబా ప్రాంతానికి కనెక్టివిటీ ఉండటంతో పెద్దపులుల రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2016 లో కూడా రైతులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విత్తనాలు వేసే సమయంలో సాగు పనులను అడ్డుకున్నారు. రైతులు అప్పటి అటవీ శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. మళ్లీ ఇప్పుడు అధికారుల చర్యలతో వివాదం తెరపైకి వచ్చింది. భూములన్నీ రిజర్వ్ ఫారెస్టువే.. దేవుడ్పల్లి బీట్ పరిధిలో గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములన్నీ రిజర్వ్ ఫారెస్టుకు చెందినవి.. రైతులకు ఎలాంటి పట్టాలు లేవు. గిరిజనులై ఉండి, అటవీ హక్కు పట్టాలు ఉంటే సాగు చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం. – మజారొద్దీన్, ఎఫ్ఆర్వో, కెరమెరి ప్రత్యామ్నాయం చూపాలి 25 ఏళ్లుగా ధనోరా సమీపంలో నాలుగెకరాల భూమి సాగు చేస్తున్నా. ఏటా వడ్డీలకు అప్పులు తెచ్చి పంట లు పండిస్తూ బతుకుతు న్నా. అధికారులు ఈ భూమిని లాక్కుంటే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి అందించి ఆదుకోవాలి. – షేక్ ఫరూక్, రైతు, ధనోరా ఇరువర్గాల మధ్య వాగ్వాదంస్థానిక ఎఫ్ఆర్వో మజారొద్దీన్ సిబ్బందితో కలిసి సోమవారం ధనోరా, సుర్దాపూర్ గ్రామాల మధ్య సాగు చేస్తున్న భూములోకి వెళ్లారు. రైతులు మూకుమ్మడి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంత నచ్చజెప్పినా రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం వెళ్లినా రైతులు అడ్డుకున్నారు. సాగు భూముల్లోకి వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా దారి మధ్యలో రాళ్లు వేశారు. ఓ దశలో సహనం కోల్పోయి రాళ్లదాడికి ప్రయత్నించగా, వాంకిడి సీఐ వేణుగోపాల్, కెరమెరి ఎస్సై సుధాకర్ ఘటనాస్థలికి చేరుకుని రైతులను సముదాయించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. -
మూత‘బడికి కొత్త కళ’
ఆసిఫాబాద్ పట్టణ పరిధిలోని హీరాపూర్ మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులు లేరని ఏడేళ్ల క్రితం మూసివేశారు. అప్పటి నుంచి చిన్నారులు వాగు మార్గం గుండా మూడు కిలోమీటర్ల దూరంలోని బెస్తవాడ మండల పరిషత్ పాఠశాలకు వెళ్తున్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు వార్డు కౌన్సిలర్ సాలంబీన్ అహ్మద్ మూతపడిన పాఠశాలకు పెయిటింగ్ వేయించి డోర్లు, కిటికీలకు మరమ్మతులు చేయించారు. సోమవారం పాఠశాలను మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్తో కలిసి డీఈవో సచ్చిదానంద చారి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, ఎంఈవో సుభాశ్ తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో విధులు నిర్వహించాలి
కాగజ్నగర్టౌన్: పోలీసులు అంకితభావంతో వి ధులు నిర్వహించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను సోమవారం తనిఖీ చేశారు. లాకప్ రూమ్, రిసెప్షన్, బెల్ ఆఫ్ ఆరమ్స్ రూమ్, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు, రిజిస్టర్ పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల నివారణపై దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. డీఎస్పీ వహీదుద్దీన్, ఎస్సై సందీప్, సిబ్బంది పాల్గొన్నారు. చట్ట పరిధిలో ఫిర్యాదులు పరిష్కరించాలిఆసిఫాబాద్అర్బన్: చట్ట పరిధిలో ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్నారు. త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి మొత్తం 13 ఫిర్యాదులు స్వీకరించారు. పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. -
ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్, ప్లేస్మెంట్ సెల్ ఆ ధ్వర్యంలో సోమవారం పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రిన్సి పాల్ శ్రీదేవి మాట్లాడుతూ ఇంటర్ ఉత్తీర్ణులై న విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కలిగిస్తామన్నారు. పోలీస్, ఫారెస్ట్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు రానున్నందున విద్యార్థులకు నెల రోజులపాటు నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. కెరీర్ గైడెన్స్ సెల్ ఇన్చా ర్జి డాక్టర్ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన జనరల్ స్టడీస్తోపాటు జనరల్ ఇంగ్లిష్, ఆర్థమెటిక్స్ రిజనీంగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దాదాపు 200 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్దన్, క్యూసీ కోఆర్డినేటర్ శారద, అధ్యాపకులు రాజేశ్వర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ దత్తాత్రేయ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించాలి
రెబ్బెన: మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించి, న్యాయం చేయాలని చిరువ్యాపారులు కోరారు. మండల కేంద్రంలోని చిరు వ్యాపారులు, దుకాణాదారులు సోమవారం స్వచ్ఛందంగా ఒకపూట బంద్ పాటించారు. అలాగే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్తో కలిసి కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, మండల కేంద్రంలో తహసీల్దార్ సూర్య ప్రకాశ్కు వినతి పత్రాలు అందించారు. వారు మట్లాడుతూ దా దాపు 60 ఏళ్లుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ రెవెన్యూ భూమిలో చిన్న షాపులు, హోటళ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. స్థలం రైల్వే భూమి అంటూ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలి పారు. రైల్వే, రెవెన్యూ జాయింట్ సర్వేలో 38 ఎకరాలు రైల్వే భూమి పోగా, మరో 7.26 ఎకరాలు ప్రభుత్వ మిగులు భూమి ఉన్నట్లు తేలిందన్నారు. మిగులు భూమిని క్రమబద్ధీకరించి ఆదుకోవాలని కోరారు. -
పూలిచ్చి..ఆహ్వానించి..
ఆసిఫాబాద్రూరల్: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బడులను వెల్కం బోర్డులు, బెలూన్లు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. చాలాచోట్ల పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. అమావాస్య, బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారులు రాకపోవడం, తదితర కారణాలతో తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు అంతంతే నమోదైంది. జిల్లాలో మొత్తం 772 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 32,427 మంది విద్యార్థులకు కేవలం 6,167 మంది హాజరు కాగా, 26,260 మంది గైర్హాజరయ్యారు. కాగజ్నగర్, సిర్పూర్(టి), దహెగాం, కెరమెరి, తిర్యాణి మండలాల్లో 20 శాతం నుంచి 30శాతం హాజరు నమోదైంది. మిగిలిన మండలాల్లో 20శాతం మంది కూడా పాఠశాలలకు రాకపోవడం గమనార్హం. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలోని పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు బడికి రాగా, ఐదుగురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. రోజులు గడిచే కొద్దీ హాజరు పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
వేగంగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరి స్తామని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కౌటాల మండలం మొగడ్దగడ్ గ్రామానికి చెందిన దరఖాస్తు చేసుకున్నాడు. రైతుబీమా మంజూ రు చేయాలని రెబ్బెన మండలం నవేగాంకు చెందిన శకుంతల వి న్నవించింది. దివ్యాంగుడినైన తనకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ఇప్పించాలని కాగజ్నగర్ పట్టణం పోచమ్మ బస్తీకి చెందిన రాజేశ్వర్ కో రాడు. ప్రభుత్వం ఇచ్చిన లావుణి పట్టా భూమి సాగుకు అటవీ శాఖ అడ్డుపడుతుందని, న్యాయం చేయాలని దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన దుర్గాగౌడ్ కోరాడు. దహెగాం మండలం ఐనం గ్రామంలో వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని సర్పంచ్ ప్రశాంత్ దరఖాస్తు అందించారు. రెబ్బెన మండలం కై రిగాం పంచాయతీ పరిధిలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాలకు వట్టివాగు నీరందించాలని విన్నవించారు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి సీటు ఇప్పించాలని కౌటాల మండలం బాలెపల్లికి చెందిన సాయిప్రసాద్ అర్జీ అందించాడు. బ్యాంకు రుణం మంజూరు చేయాలని దహెగాం మండలం కొత్మీర్కు చెందిన రెడ్డి రాజయ్య వేడుకున్నాడు. పెరాలసిస్తో పనిచేయలేకపోతున్నా తొమ్మిది సంవత్సరాల క్రితం పెరాలసిస్ రావడంతో ఏ పని చేసుకోలేకపోతున్నాను. మాది పేద కుటుంబం కావడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛన్ మంజూరు చేస్తే ఇతరులపై ఆధారపడకుండా ఆసరాగా ఉంటుంది. – పప్పు మండల్, రవీంద్రనగర్ -
‘నీట్’ విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో పకడ్బందీగా నీట్ నిర్వహించాలని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 353 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష కొనసాగనుండగా, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. రెండు పాస్ ఫొటోలు, అడ్మిట్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వేణు, డీఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
కాగజ్నగర్టౌన్: రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. మండలంలోని వంజీరి రైతు వేదికలో సోమవారం రైతులకు జీవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విత్తనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. పంట మార్పిడి పాటించాలని సూచించారు. ఈ ఏడాది కౌటాల, కాగజ్నగర్ కొనుగోలు కేంద్రాల్లో లక్ష బస్తాల మక్కలు సేకరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పద్మాకర్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ భరత్, పీఏసీఎస్ చైర్మన్ ఉమామహేశ్వర్రావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలిసంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం 239 మందికి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, కౌన్సిలర్లు, సర్పంచులు గజ్జి లింగయ్య, కుందారపు సుమన్, రాజేందర్, ప్రకాశ్, కోట వేణు, నాయకులు పాల్గొన్నారు. -
భీం స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం
ఆసిఫాబాద్: ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసి కుమురంభీం స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పో రాడాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. భీం పోరాట పటిమతోనే జిల్లా కేంద్రంలో తొలి పార్టీ కార్యాల యం ప్రారంభించామని తెలిపారు. కొత్త పార్టీ ఆవి ర్భావం తర్వాత తొలిసారి సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణంలో పార్టీ జెండా ఆవిష్కరించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు మందు ఫారెస్ట్ చెక్పోస్టు నుంచి డప్పుచప్పుళ్లతో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా యాప్ తొలగించి, రైతులకు ఎకరాకు మూడు బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తరుగు పేరుతో రైతుల నుంచి రూ.1200 కోట్లు కొట్టేసిందని ఆరోపించా రు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ విత్తన వ్యా పారులపై పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. ఏటా ఖరీఫ్ ప్రారంభంలో పోడు రైతుల వద్దకు పోలీసులు వస్తున్నారని, వారి పొట్ట కొట్టొద్దన్నారు. గిరిజన కార్పొరేషన్లో రిక్రూట్మెంట్ లేక నిర్వీర్యమవుతుందని, వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. 1/70 యాక్టు అమలు చేస్తూ 1970కి ముందు ఏజెన్సీలో వారసత్వంగా సంక్రమించిన భూమికి క్రయవిక్రయాలు జరుపుకొనేలా వెసులుబాటు కల్పించాలన్నారు. తెలంగాణపై ఆంధ్ర పాలకులు దాడి చేస్తే అడ్డుకునే ఏకై క పార్టీ తమ టీఆర్ఎస్ అని అన్నారు. పార్టీ కార్యాల యం ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, జిల్లా అధ్యక్షుడు వినోద్, కాగజ్నగర్ ఇన్చార్జి సబిత, నాయకులు మహోర్క ర్ అశోక్, రాంప్రసాద్, రియాజ్ పాల్గొన్నారు.పార్టీ కార్యాలయంలో కవిత, టీఆర్ఎస్ నాయకులు -
యోగాతో మానసిక ప్రశాంతత
ఆసిఫాబాద్అర్బన్: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్కుమార్ అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి యోగా రన్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలన్నారు. తద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక గొప్ప సాధనమన్నారు. కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ అధికారి విజయమ్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్, నాయకులు మారుతి, ఆయుష్ సిబ్బంది సుజాత, శిల్పా తదితరులు పాల్గొన్నారు. -
డీడీఎన్ సంఘం డివిజన్ స్థాయి కమిటీ
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ డీడీఎన్ సంఘం డివిజన్ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఆ దివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయం ఆవరణలో సంఘం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు గంగు సత్యనారాయణశర్మ, జిల్లా అధ్యక్షుడు ఒజ్జల శిరీష్శర్మల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా జంబోజు తిరుపతిచారి, కార్యదర్శిగా జాదవ్ ధన్రాజ్, కోశాధికారిగా అభయ్కుమార్ ఆచార్యలను ఎన్నుకున్నారు. నాయకులు సుబ్బా మహేశ్, ఇందారపు శంకర్, డిల్లీ విజయ్కుమార్, మురళీధర్, సతీశ్, కులకర్ణి, సత్యనారాయణ, శేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీఎంలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి
కాగజ్నగర్టౌన్: ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.త్రివేణి డిమాండ్ చేశారు. ఆదివారం మిల్లు గేటు ముందు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించి మద్దతు తెలిపారు. ఆమె మాట్లాడుతూ 26 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులను యాజమాన్యం, నాయకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు సీఐటీయూ అండగా నిలుస్తుందని తెలిపారు. యాజమాన్యం కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, స్వరూప, యూ నియన్ జిల్లా నాయకులు లక్ష్మి, పంచశీల, సరస్వతి, రజిని, కార్మికులు పాల్గొన్నారు. -
● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● మొదటిరోజు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేత ● బడిబాట ద్వారా 928 ప్రవేశాలు
ఆసిఫాబాద్రూరల్: వేసవి సెలవుల్లో ఆడిపాడిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. నెలన్నర రోజులుగా మూతపడిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. పాఠశాలల్లోని తరగతి గదులు శుభ్రం చేయించి సిద్ధం చేశారు. మొదటి రోజు పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వనున్నారు. జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయడంతో గతం కంటే ఈసారి అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని సంబంధిత అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు జిల్లాలో 928 మంది బడీడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి..జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,258 పాఠశాలలు ఉండగా డీఈవో పరిధిలో 738 పాఠశాలలు ఉన్నాయి. మిగితా 520 పాఠశాలలు గిరిజన ఆశ్రమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు ఉన్నాయి. వీటిలో సుమా రు 86 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నా రు. డీఈవో పరిధిలో 738 పాఠశాలల్లో సుమారు 39,249 మంది విద్యార్థులు చదువుతుండగా 2,072 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జి ల్లాకు 1,48,880 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 86శాతం 90,320 పుస్తకాలు వచ్చాయి. అయితే 2, 3,7వ తరగతులకు చెందిన ఇంగ్లిష్, 6, 7వ తరగతులకు చెందిన హిందీ పుస్తకాలు రాలేదు. యూనిఫాంకు సంబంధించి ఈ ఏడాది రంగులో మార్పు చేయడంతో ఇంకా యూనిఫాం కుట్టే పనులు కొనసాగుతున్నాయి. దీంతో మరో నెల రోజుల పాటు పాత యూనిఫాంలే విద్యార్థులు ధరించాల్సి ఉంటుంది. జిల్లాకు దక్కని ‘అల్పాహారం’..రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పేద విద్యార్థులకు ఉదయం వేళ బ్రేక్ఫాస్ట్ పథకా న్ని నేటి నుంచి అమలు చేయనుంది. తొలి విడతలో 8 జిల్లాల్లోని 1,269 పాఠశాలలు, 13 కళాశాలల్లో మాత్రమే అమలు చేయనున్నారు. అందులో కు మురం భీం జిల్లాకు అవకాశం రాలేదు. వికారాబా ద్, నారాయణ పేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో నేటి నుంచి అల్పాహారం అందించనున్నారు. మిగితా జిల్లాల్లో రెండో విడతలో అందిస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.నాణ్యమైన విద్య అందిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందిస్తాం. ఉపాధ్యాయుల కు ఎఫ్ఆర్ఎస్ హాజరుతో డుమ్మాలకు అవకాశం లేదు. ప్రాథమిక స్థాయి నుంచి విద్య సామర్థ్యాలు పెంచేలా కార్యాచరణ తయారు చేస్తున్నాం. – సచ్చిదానంద, డీఈవో కెరమెరి: బుడిబుడినడకలు వేస్తూ నేటి నుంచి చి న్నారులు అంగన్వాడీలకు వెళ్లనున్నారు. మే 1 నుంచి 30 వరకు వేసవి సెలవులు ప్రకటించిన ప్ర భుత్వం.. మండుతున్న ఎండల దృష్ట్యా మరో 14 రోజులు పెంచింది. దీంతో సోమవారం అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభం కానున్నాయి. సె లవుల్లో పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు, కిశోరబాలికలకు ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేశారు. సమస్యల్లో అంగన్వాడీ కేంద్రాలు..జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాలు సమస్యల్లో మగ్గుతున్నాయి. చాలా కేంద్రాలు అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో అరకొర వసతులు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం లేదు. ఏటా ఇబ్బందులు పడుతున్నా అధికారులు కేంద్రాలపై చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఉప్మా లేదా కిచిడి మిక్స్ టిఫిన్గా అందించనున్నారు. చిన్నారులకు ప్రీస్కూల్ కిట్ అందించనున్నారు. రెండు జతల యూనిఫాంలు ఆయా కేంద్రాలకు చేరడంతో నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. సిబ్బంది కొరత..జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉంది. చాలా చోట్ల ఆయాలు, అంగన్వాడీలు లేక సమీప కార్యకర్తలకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో రెండు కేంద్రాలను నిర్వహించడం వారికి ఇబ్బందిగా మారింది. ఇన్చార్జీలు ఉన్న చోట కేవలం సరుకులు పంపిణీకే పరిమితమవుతున్నారు. చిన్నారులకు అందాల్సిన ప్రీస్కూల్ కార్యక్రమాలు కొనసాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లోని కేంద్రాలు అంగన్వాడీలు, ఆయాలు లేక మూతబడి ఉంటున్నాయి.అంగన్‘బడు’లు సైతం ప్రారంభం -
పారదర్శకంగా ఓటర్ మ్యాపింగ్
ఆసిఫాబాద్: బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడంతో పాటు ఒకరికి ఒక్కచోట మాత్రమే ఓటుహక్కు ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఎన్నికలకు ఓట రు జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు జిల్లాలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నా రు. అనర్హులను తొలగించి అర్హులతో కూడిన కొత్త ఓటరు జాబితా రూపొందించేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)కు కేంద్రం సిద్ధమైంది. 2002లో జరిగిన సమగ్ర సర్వే ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతోంది. ఈ ప్రకియ జల్లాలో జనవరి 31న ప్రారంభం కాగా, బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,57,018 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,76,625 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయ్యింది. 100 శాతం పూర్తయ్యేలా చర్యలు..జిల్లాలో ఇప్పటి వరకు 82.41 శాతం మ్యాపింగ్ ప్ర క్రియ పూర్తయ్యింది. ఈ ప్రక్రియ వేగవంతం చే యాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ హరిత జిల్లాలోని అధికారులతో ఇప్పటికే ప లుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ నెలాఖరులోగా 100శాతం ప్రక్రియ పూర్తయ్యేలా చ ర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఆధార్, భద్రతా పరిశీలన, చిరునామాలు, బయోమెట్రిక్ సరి చూసుకోవడం, ఓటర్ల స్థలానుసారం మ్యాప్ తయారీ వంటి కీలక దశలు చేపట్టనున్నారు. జియో ట్యాగింగ్, డిజిటల్ ఫారాలు, ఫొటో వ్యాలిడేషన్ ద్వారా డేటా సేకరిస్తున్నారు. నాణ్యమైన ఓటర్ల డేటా బేస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 1న తుది జాబితా..సర్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఈ నెల 15 నుంచి 24 వరకు ఓటర్ల జాబితా తయారీ, సిబ్బందికి శిక్షణ, జాబితా ముద్రణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయింలు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 28లోపు పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా అధికారికంగా ప్రకటించనున్నారు. గందరగోళం లేకుండా..ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయితే ఎన్నికల ని ర్వహణలో పారదర్శకత పెరుగుతుంది. సమగ్ర మ్యాపింగ్ కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్లా నింగ్, సిబ్బంది నియామకం, వాహనాల ఏర్పాట్లు వంటివి మరింత సక్రమంగా చేసే అవకాశం ఉంటుంది. 2002లో పేరు, తల్లిదండ్రుల పేర్లు ఉంటే ప్రత్యేక రుజువులు చూపాల్సిన అవసరం లేదు. బీ ఎల్వోలకు అవసరమున్న డాక్యుమెంట్లు చూపాల్సి ఉంటుంది. ఓటర్లకు చిరునామా గుర్తింపులో అవరోధాలు తొలగిపోతాయి. బీఎల్వోలు గడపగడపకు వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు జియో ట్యాగ్ ఫొటోలు, ఆధార్తో నమోదు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడంతో పాటు ఓటింగ్ రోజున ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే అవకాశాలున్నాయి.గుర్తింపు కార్డు సమర్పించాలి మ్యాపింగ్, ఓటరు నిర్ధారణ వంటి సమస్యలుంటే 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్లైసెన్స్, పాన్కార్డు, పింఛన్ కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డుల్లో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. – లోకేశ్వర్ రావు, ఆర్డీవో -
‘బాయిబాట పోరాటం మరింత ఉధృతం’
రెబ్బెన: సింగరేణి పరిరక్షణ కోసం బాయిబాట పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు అన్నారు. ఆదివారం గోలేటి టౌన్షిప్లోని హెచ్ఎంఎస్ యూనియన్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ కోసం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు క ల్వకుంట్ల కవిత, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ హైమద్లు పోరాటాలను ఉధృతం చేస్తున్నారన్నారు. కొత్త గనుల ఏర్పాటు లేక సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు. కొత్త గనులను ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలన్నారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట గని వద్ద నేటి బాయిబాట కార్యక్రమానికి హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరవుతారని తెలిపారు. ఏరియాలోని హెచ్ఎంఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై బాయిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బ్రాంచి కార్యదర్శి శివారెడ్డి, సెంట్రల్ నాయకులు ఎండీ ఓజియార్, ఏరియా ఆర్గనైజర్ ఎస్కే ఇనూస్, కిష్టస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచిర్యాల అభివృద్ధి రాష్ట్రానికే మోడల్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రానికే ఒక మోడల్ అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మేయర్ దర్ని మధుకర్తో కలిసి మాట్లాడారు. మంచిర్యాల పట్టణ ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తూనే స్థానిక ఎమ్మెల్యే సంకల్పం, నిబద్ధత వల్లే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల మోడల్ను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులను, కమిషనర్లను ఇక్కడికి పంపించి, ఈ అభివృద్ధిని ఒక మోడల్గా చూసి స్ఫూర్తి పొందేలా చేయాలని మంత్రి శ్రీధర్బాబుతో చర్చించానన్నారు. ఇక్కడి 50 పడకల ఆస్పత్రి, ఆర్కిటెక్చర్, విశాలమైన వరండాలు, గాలి వెలుతురు వచ్చేలా కట్టిన విధానం నచ్చి, పరిశీలనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ వారిని ఇక్కడికి పంపించామన్నారు. తాను ఆదిలాబాద్ నుంచి పాతయాత్ర చేపట్టిన సమయంలో ప్రేమ్సాగర్రావు, కొక్కిరాల సురేఖ, శ్రీధర్బాబు తన వెనకుండి ముందుకు నడిపించారన్నారు. -
గాలివాన బీభత్సం
సిర్పూర్(టి): మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలకేంద్రంతో పలు గ్రామాల్లో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రధాన రహదారుల్లో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ఇళ్లు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో సిర్పూర్(టి) –కాగజ్నగర్, సిర్పూర్(టి) –కౌటాల ప్రధాన రహదారుల గుండా ప్రయాణాలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంకట్రావ్పేట గ్రామ సమీపంలో చెట్లు విరిగి రోడ్డుపై పడిపోవడంతో వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గత రెండురోజులుగా మండలంలోని ప్రజలు విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు రహదారులపై విరిగి పడ్డ చెట్లను తొలగించారు.సిర్పూర్(టి) –కాగజ్నగర్ రోడ్డుపై పడిన చెట్టుగాలివానకు పడిపోయిన విద్యుత్ స్తంభం -
గ్యాస్ వాడకుండా వంటల పోటీలు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సర్సిల్క్ కాలనీలో బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో ఆదివారం గ్యాస్, వంటనూనె వినియోగంచకుండా వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు హాజరై మాట్లాడారు. విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయడానికి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు గ్యాస్, వంట నూనెను ఉపయోగించకుండా వంటలు చేయడం సంతోషకరమన్నారు. నరేంద్ర మోడీ మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. పీఎం జన్ధన్, స్వనిధి పథకాలతో మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వంటల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చ నాయకులు మంజుల, కౌన్సిలర్ గజ్జెల లావణ్య, స్రవంతి, సామాజిక సేవకులు స్వాతి, అన్నపూర్ణ, సరోజ, సత్తమ్మ మహిళలు పాల్గొన్నారు. -
విద్యార్థులకు కెరీర్ గైడెన్స్
కాగజ్నగర్టౌన్: డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యో గం ఎలా సాధించాలి..? పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి..? ఉన్నత విద్యకు ఏ మార్గాలు ఎంచుకోవాలి..? అనే సందింగ్ధంలో ఉండే విద్యార్థుల కు కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల దారి చూపుతోంది. కళాశాలలో కేవలం పాఠ్యాంశాలకే పరిమి తం కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, ఫారెస్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్స్ వంటి వివిధ పోటీ పరీక్షల కు అవసరమైన అంశాలపై కెరీర్ గైడెన్స్ సెల్ ద్వా రా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 15 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. 2019 నుంచి పోటీ పరీక్షలపై శిక్షణ..కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2019 నుంచి డిగ్రీ చదువుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిపుణులతో ఉద్యోగాలు సాధించేందుకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుండడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. శిక్షణలో భాగంగా పోటీ పరీక్షలకు ప్ర త్యేక తరగతులు, వారానికోసారి మాక్ టెస్ట్, వ్యక్తి త్వ వికాస శిక్షణ, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై మార్గదర్శనం, కెరీర్ కౌన్సెలింగ్, ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు డిగ్రీలో ఉండగానే పోలీస్, అగ్నివీర్, ఆర్మీ, ఫారెస్ట్బీట్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు పొందుతున్నారు. అగ్నివీర్కు ఎంపిక మాది రెబ్బెన మండలంలో ని ఖైరిగూడ గ్రామం. కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న. ఈ నెల 2న అగ్నివీర్కు ఎంపికై నట్లు కాల్లెటర్ వచ్చింది. ఈ నెల 10న సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యాను. డిగ్రీ ఫైనల్ఇయర్లోనే ఉద్యోగం రావడం ఎంతో సంతోషంగా ఉంది. – కమినవేని సతీశ్, అగ్నివీర్ వ్యవసాయ కుటుంబం నుంచి.. మాది వేంపల్లి గ్రామం. మా తల్లిదండ్రులు మాండోరె నారాయణ –భాగ్యలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దేశ సేవ చేసేందుకు అగ్నివీర్గా నాకు అవకాశం వచ్చింది. నేను కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే శిక్షణ తీసుకున్న. – మాండోరె శంకర్, అగ్నివీర్ కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
టూరిజం బాగుండాలని..
తిర్యాణి: వానాకాలంలో జిల్లాలోని మారుమూల మండలమైన తిర్యాణిలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. చుట్టూ పెద్దపెద్ద గుట్టల నుంచి కిందికి పాల నురగలా జాలువారే జలపాతాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. మండలంలోని చింతలమాదర, గుండాల, ఉల్లిపిట్ట జలపాతాలుండగా జూన్ చివరి వారం నుంచి సెప్టెంబర్ రెండోవారం వరకు పర్యాటకుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎకో టూరిజం ద్వారా ‘హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (గ్రాండ్ ఫార్మా) అనే స్వచ్ఛంద సంస్థ ముందుకువచ్చి సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తోంది. గుండాల జలపాతం వద్ద దాదాపు వంద అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందికి దూకుతుండగా దీనిని బాహుబలి జలపాతంగా కూడా పిలుస్తుంటారు. పర్యాటకులకు బర్డ్వాక్ సౌకర్యం దూర ప్రాంతాల నుంచి జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులు రెండోరోజు ఉదయం సమీప అటవీ ప్రాంతంలో గైడ్స్తో కలిసి బర్డ్వాక్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రాదాయాలు, వారు దేవుళ్లను పూజించే విధానం, వారు తినే ఆహార పదార్ధాలు, అడవుల్లో దొరికే ఔషధ మొక్కలపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకు దాదాపు మూడు కిలోమీటర్ల పాటు అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. త్వరలోనే సఫారీ వాహనం ద్వారా అడవిలో పర్యటించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అన్నీ బాగున్నా.. సరైన రోడ్డే లేదు టూరిజం దిశగా అభివృద్ధి బాగానే ఉన్నా పర్యాట కులు వచ్చేందుకు గుండాల గ్రామానికి సరైన రోడ్డు లేదు. ఈ గ్రామానికి రావాలంటే తిర్యాణి మండల కేంద్రానికి చేరుకుని 10కిలో మీటర్ల దూరంలోని రొంపెల్లి వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి దాదాపు ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నుంచి కూడా వయా ఉట్ల గ్రామం మీదుగా జలపాతానికి చేరుకోవచ్చు. కానీ, ఈ రోడ్డు కూడా అధ్వానంగా ఉండడంతో ద్విచక్ర వాహనాలపై అతికష్టంగా వెళ్లాల్సి ఉంటుంది. కాగా, దండేపల్లి నుంచి గుండాల వరకు దాదాపు 12కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రూ.25కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ఇంకా ప్రారంభించలేదు. తిర్యాణి మండలంలోని రొంపెల్లి నుంచి గుండాలకు, దండేపల్లి నుంచి గుండాలకు రోడ్డు సౌకర్యం కల్పించి పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
26 మంది మహిళలకు శిక్షణ
గుండాలకు వచ్చి వసతిగృహాల్లో బస చేసే పర్యాటకులకు కావాల్సిన ఆహార పదార్థాల తయారీతోపాటు వివిధ అంశాలపై హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (నీతం) అనే సంస్థతో సెర్ప్ సహకారంతో 15రోజుల పాటు గుండాల, మంగి గ్రామాల్లోని 18–60 ఏళ్ల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంతకుముందు గుండాల గ్రామంలోని మరో 10మంది యువకులకు టూరిస్టులను ఎలా గైడ్ చేయాలనే అంశపై కూడా ట్రైనింగ్ ఇచ్చారు. పర్యాటకుల వసతి కోసం ఆదివాసీ ఇళ్లను తలిపించేలా ఏడు గృహాలతో పాటు కిచెన్, హాల్ నిర్మాణం చేపట్టారు. కాగా, పర్యాటకుల నుంచి వసూలు చేసిన రుసుం నుంచి శిక్షణ పొందిన సిబ్బందికి వేతనాలు అందించడంతో పాటు మిగతా డబ్బులను ఇప్పటికే ఏర్పాటు చేసిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బ్యాంక్ ఖాతాలో జమ చేసి గ్రామావసరాల కోసం వినియోగించనున్నారు. తద్వారా 30 కుటుంబాలకు ప్రత్యక్షంగా, దుకాణాల ఏర్పాటు, అడవి ఫలాల అమ్మకం ద్వారా మరో 30కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి లభించనుంది. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. వర్షం కురిసే అవకాశముంది. ‘ప్రధాని చొరవతోనే ప్రజాసంక్షేమం’కాగజ్నగర్టౌన్: ప్రధాని నరేంద్రమోదీ చొ రవతోనే రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు పేర్కొన్నారు. దేశంలో 12 ఏళ్ల పాలనలో మోదీ పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారని తెలిపారు. శనివారం ప ట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని అత్యధి క సంవత్సరాలు పాలించిన ఘనత సాధించి రికార్డు సృష్టించారని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్యోజన, కిసాన్ సమ్మాన్ నిఽధి, ఉ జ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాలతో అర్హులైన ప్రతీ ఒక్కరికి కేంద్ర ప్ర భుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. పుష్కర కాలంలో గ్రామీణ స డక్ యోజన కింద జాతీయ రహదారుల ని ర్మాణం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. పైసలు లేని ప్రజాపాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దండగగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను వి మర్శించడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్మీకి విద్యార్థుల ఎంపిక కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డి గ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతు న్న విద్యార్థులు మాండోరె శంకర్, గౌత్రే క ల్యాణ్, కమినవేని సతీశ్ ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్గా ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి, కెరీర్ గైడెన్స్ సెల్ ఇన్చార్జి డాక్టర్ లక్ష్మీనరసింహులు శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. గతేడాది ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాల ఎంపిక పక్రియలో పాల్గొని రాత పరీక్ష, శారీరక పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఇటీవల నియామక ఉత్తర్వులు అందుకున్నట్లు పేర్కొన్నారు. వీరిని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
‘ఇందిరమ్మ’పై ఆశలు
కెరమెరి: మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని అర్హులు రెండో విడతపై గంపెడాశలు పెట్టుకున్నారు. రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో సంబురపడుతున్నారు. త్వరలో అధికారులు గ్రామాల్లో సర్వే ప్రారంభించనున్నారు. గతంలోనే దరఖాస్తుదారుల పూర్తి వివరాలు సేకరించిన అధికారులు తాజాగా మళ్లీ ఆరా తీయనున్నారు. నియోజకవర్గానికి 2వేల చొప్పున.. జిల్లాలో రెండు నియోజకవర్గాలుండగా ప్రభుత్వం సిర్పూర్(టి) నియోజకవర్గానికి 1,500, ఆసిఫాబా ద్కు 1,500 ఇళ్లు మంజూరు చేసింది. అదనంగా పా త ఇందిరమ్మ ఇళ్ల మరమ్మతుకు అనుమతించింది. ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున వెయ్యి మంజూరు చేసింది. మరమ్మతుల పరిస్థితులను పరిశీలించి ఒక్కో ఇంటికి రూ.2లక్షలు మంజూరు చేయనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ముందు న్న ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నవారే ఇందుకు అర్హులు. ఆ ఇంటికి రేకులు, లేదా పెంకులు వేసి ఉండాలి. వాటిని తీసేసి స్లాబు వేస్తారు. కానీ, గోడలు గట్టిగా ఉండాలి. లబ్ధిదారు ని అనుమతితో మరమ్మతులు చేస్తారు. మొదటి విడతలో జిల్లాకు 8,850 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా, 758 నిర్మాణాలు పూర్తయ్యాయి. 2,600 వరకు స్లాబ్ దశలో ఉండగా, మిగతావి వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వారంరోజుల్లో మండలాలవారీగా.. నియోజకవర్గాల వారీగా ఇళ్లు మంజూరు కాగా, మండలాలు, గ్రామపంచాయతీల వారీగా ఇంకా కేటాయించలేదు. మరో వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత ఇరిగేషన్, వ్యవసాయ, వెటర్నరీ, విద్య తదితర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. సర్వేకు ఎంపికై న అధికారులకు ప్రత్యేక లాగిన్ ఇస్తారు. వారు జాబితాలోని దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తారు. నమోదు చేసిన వివరాలు ఎంపీడీవో లాగిన్కు వెళ్తే అక్కడి నుంచి హౌసింగ్ సంస్థకు అనంతరం పీడీ, కలెక్టర్కు పంపిస్తారు. గతంలో వచ్చిన దరఖాస్తులను ఎల్–1, ఎల్–2, ఎల్–3గా విభజించారు. పూరిగుడిసె ఉన్నవారికే ప్రాధాన్యం జిల్లాలో 65 పీవీటీజీ (ఆదిమ గిరిజనులు)లకు చెందిన గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో సుమారు 5,123 మంది కుటుంబాలున్నాయి. ఇప్పటికే మొదటివిడతలో 2,167 కుటుంబాలకు పీఎం జన్మన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. మరో 1,931 మంది ఆదిమ గిరిజనుల జాబితాను అధికారులు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. కాగా, ఇటీవల కెరమెరి మండంలోని కొత్తగూడ గ్రామాని కి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి మరో 21వేల ఇళ్లను గిరిజనులకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రెండో విడతలో మంజూరైన ఇంది రమ్మ ఇళ్లను పూరి గుడిసె ఉన్నవారికే మొదటి ప్రా ధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు పూరి గుడిసెల వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో సర్వే ప్రారంభిస్తాం జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు రెండో విడతలో 4వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో వెయ్యి పాత గృహాలకు మరమ్మతులు చేయనున్నాం. పీవీటీజీలందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం. త్వరలో గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే ప్రారంభిస్తాం. పూరి గుడిసెలున్నవారికి ప్రాధాన్యం ఇస్తాం. అధికారులు సర్వే చేశాక ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఇళ్లు మంజూరు చేస్తాం. – వేణుగోపాల్, హౌసింగ్ డీఈ కెరమెరి మండలం చిన్నుగూడ గ్రామానికి చెందిన ఈ కొలాం మహిళ పేరు మడావి లక్ష్మి. భర్త రెండేళ్ల క్రితమే ఈమెను వదిలి వెళ్లాడు. కూలీ పనులకు వెళ్లి ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. శుక్రవారం వీచిన గాలివానకు ఈమె నివాసముండే షెడ్డు రేకులు లేచిపోగా నిరాశ్రయురాలైంది. వాస్తవంగా ఈమెకు పీఎం జన్మన్ లేదా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాల్సి ఉంది. కానీ, ఈ గ్రామానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. -
సైకిల్ యాత్రికుడికి ఎమ్మెల్యే అభినందన
రెబ్బెన: మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13జిల్లాల మీదుగా 17రోజులపాటు నిర్వహించిన వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్రకు గుర్తింపుగా గోలేటికి చెందిన ఓరగంటి రంజిత్కుమార్ ఇండియన్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా రంజిత్ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసంలో శనివారం అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకురావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువతలో చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతను సానుకూల దిశగా నడిపించడమే కాకుండా సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన రంజిత్ సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. భవిష్యత్లోనూ ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు మరిన్ని చేపట్టి యువతలో చైతన్యం తేవాలని సూచించారు. కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
కరుణించని వరుణుడు!
● రుతుపవనాల రాకలో ఆలస్యం! ● వర్షాల కోసం కర్షకుల నిరీక్షణ ● పత్తి రైతుల్లో మొదలైన ఆందోళనవాంకిడి: ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆకాశం నల్లబడుతున్నా చినుకులు మాత్రం నేలను తాకడం లేదు. జిల్లాలో ఏటా మృగశిర కార్తె నుంచే వర్షాలు ప్రారంభమయ్యేవి. కానీ, ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చగా సరిపడా వర్షాలు కురవడం లేదు. అక్కడక్కడా స్వల్పంగా చినుకులు పడుతూ.. కమ్ముకున్న కారు మబ్బులు కనుమరుగై క్షణాల్లో ఆకాశం తెల్లబడుతోంది. జిల్లాలో ప్రధాన ఆర్థిక వనరు వ్యవసాయమే కాగా, అత్యధికంగా రైతులు పత్తి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మే చివరి వారం నుంచే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేశారు. మరో వైపు స్వల్పంగా వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రైతులు తొందరపడి ఇప్పటికే విత్తనాలు వేస్తున్నారు. కాగా, విత్తనాలు విత్తేందుకు సరిపడా వర్షాలు కురవలేదని అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమవుతోందని, దీంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే ఉండే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. 4.52 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో 4.52 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా అత్యధికంగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప త్తి తర్వాత వరి, కంది, కూరగాయలు, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తుండగా రైతులు పంట మార్పిడి విధానం పాటించడం మేలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో ఎల్నినో ప్రభావం అధికంగా ఉండి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని సూచిస్తున్నారు. రైతులు నీటి ఆవశ్యకత తక్కువగా ఉండే పంటలకు మొగ్గు చూపాలని ప్రభుత్వాలూ సూచిస్తున్నాయి. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంతో అధికారులు, శాస్త్రవేత్తలు సాగులో మెళకువలు, శాసీ్త్రయ విధానం, ఎరువు ల వాడకం, తక్కువ వర్షపాతంలో సాగయ్యే పంటలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఇప్పటివరకు తేలికపాటి వర్షాలే.. రైతులు విత్తనాలు వేసేందుకు తొందరపడొద్దు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. విత్తనం వేయాలంటే కనీసం 50–100 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కావా లని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రతీరోజు కారుమబ్బులు కమ్ముకుంటుండటంతో వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో విత్తనాలు నాటేస్తున్నారు. అధికశాతం రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తుంటే.. తేలికపాటి చిరుజల్లులు కురిసిన మండలాల ప్రజలు విత్తనాలు నాటేస్తున్నారు. అధికారులు మాత్రం సరిపడా వర్షాల కోసం ఎదురుచూడాలని సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావం రుతుపవనాలపై పడుతున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎక్కువగా సాగునీటి అవసరమున్న వరి, చెరుకు లాంటి పంటలకు బదులుగా ఇతర పంటలు వేసుకుంటే మంచిదని చెబుతున్నారు. తొందరపడి విత్తనాలు వేయొద్దు సరిపడా వర్షాలు కురవలేదు. రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దు. సగటున 50–100 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయ్యాక విత్తనాలు వేయాలి. తొందరపడి వేస్తే మొలకెత్తిన మొక్కలు ఎండిపోతాయి. తద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జిల్లాలో ఖరీఫ్నకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. నకిలీ విత్తనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. – జాడి మిలింద్కుమార్, ఏడీఏ జిల్లాలో వానాకాలం సాగు అంచనాసాగు విస్తీర్ణం: 4.52 లక్షల ఎకరాలు పత్తి సాగు: 3.70 లక్షల ఎకరాలు కావాల్సిన విత్తనాలు: 7,41,826 ప్యాకెట్లు యూరియా... : 60,583 మెట్రిక్ టన్నులు డీఏపీ.. : 22,608 మెట్రిక్ టన్నులు నానో యూరియా: 3.70 లక్షల లీటర్లు -
ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం
తిర్యాణి: ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ నితిక పంత్ పేర్కొన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులకు రోటరీ క్లబ్ సహకారంతో 87 సోలార్ లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గాను సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యుత్ సౌక్యరాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్ లైట్లు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదాకు కూడా సోలార్ శక్తి దోహదపడుతుందని పేర్కొన్నారు. పోలీస్శాఖ చట్టాల అమలు, శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ప్రజల సంక్షేమం, సామాజిక అభివృద్దికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ అనితారెడ్డి, వెంకటేశ్వరి, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై సుబ్బారావు, సురేశ్ తదితరులున్నారు. -
16న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు
కాగజ్నగర్టౌన్: ఈ నెల 16న పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మ హాసభలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్ తెలిపారు. మండలంలోని చింతగూడ గ్రామంలో ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో పనులు తగ్గి వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభలకు ఉపాధిహామీ కూలీలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
జైనూర్ ఆస్పత్రిని ఉన్నతీకరించాలని మంత్రికి వినతి
కెరమెరి(జైనూర్): జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 40 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రిని కలిశారు. శాలువాతో సన్మానించి వినతిపత్రం అందించారు. జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి, కెరమెరి, నార్నూర్ మండలాల ఆదివాసీలకు జైనూర్ ఆస్పత్రి ప్రధాన వైద్య కేంద్రంగా సేవలందిస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో పడకలు, వైద్యులు, నర్సులు, వైద్య పరికరాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు వైద్య పరీక్షలకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సుగుణ పేర్కొన్నారు. ఆమె వెంట మార్లావాయి సర్పంచ్ ప్రతిభ ఉన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు కృషి కాగజ్నగర్టౌన్: మహిళలకు స్వ యం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వర ఆప్టికల్ హాల్లో కొత్తపల్లి వెంకటలక్ష్మీచంద్ర య్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగా లని, తమ కాళ్లమీద తాము నిలబడేలా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు పే ర్కొన్నారు. రెండు నెలల శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్ సుజాత, ఆర్పీ మాధవి, ఇన్స్ట్రక్టర్ సవిత, వినోద, నాగమణి, శ్రీనివాస్ వసంత్, మహిళలు పాల్గొన్నారు. తుడుందెబ్బ బహిరంగ సభ విజయవంతం చేయాలి ఆసిఫాబాద్అర్బన్: జూలై 31న కుమ్రంభీం పోరుగడ్డలో లక్ష మందితో నిర్వహించనున్న తు డుందెబ్బ బహిరంగ సభను విజయవంతం చేయాలని తు డుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కో ట్నాక విజయ్, రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గోండువాన రాయిసెంటర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే లంబాడాల వలసలపై జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఐటీడీఏల ద్వారానే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా అడవికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల సమస్యలపై చర్యలు జరిపి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జూలై 1నుంచి డిసెంబర్ 30వరకు పోరాట కార్యాచరణ రూపొందించి ఉద్యమాలను ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. రాంజ్గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మడావి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా సర్మేడి అధ్యక్షుడు మోతీరాం, తుడుందెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి జంగు పాల్గొన్నారు. -
కుమురం భీం
7ఇన్స్ట్రక్టర్ పోస్టులకు డిమాండ్ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ పోస్టుల కోసం నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. లోకల్ అభ్యర్థులతోపాటు నాన్ లోకల్ వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. సర్కారు బడికి కొత్త అ‘డ్రెస్’ ప్రభుత్వ పాఠశాలల్లోని 1నుంచి 12తరగతుల విద్యార్థుల యూనిఫాం మారింది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త యూనిఫాంఅమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. వర్షం కురిసే అవకాశముంది.శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026 -
మేకల పంపిణీలో చేతివాటం?
తిర్యాణి: ఆదివాసీల్లోని నిరుపేదలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీవో ఆధ్వర్యంలో ‘తెలంగాణ సమ్మెళిత జీవనోపాధి’ కార్యక్రమానికి సెర్ప్ ద్వారా శ్రీకారం చుట్టింది. ఇందుకు జిల్లాలోని తిర్యాణి, లింగాపూర్ మండలాలను ఎంపిక చేసింది. తిర్యాణి మండలానికి దాదాపు రూ.4కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో లబ్ధిదారుకు దాదాపు రూ.35వేల విలువైన లైవ్వుడ్, ఇతర సామగ్రి అందజేయాల్సి ఉంది. మొదటి విడతలో భాగంగా శుక్రవారం మండలంలోని దానాపూర్లో ఒక్కో లబ్ధిదారుకు రూ.24,800 విలువైన నాలుగు మేకపిల్లలు పంపిణీ చేశారు. అయితే, సదరు ఎన్జీవో సిబ్బంది, విక్రయదారులు కుమ్మకై ్క లబ్ధిదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దానాపూర్లో పంపిణీ చేసిన మేకలు మహారాష్ట్రకు చెందినవి కావడం, అవి చిన్నగా ఉండటంతో వాటి ధర బహిరంగ మార్కెట్లో రూ.3వేల నుంచి రూ.4వేల మధ్య ఉంటుందని లబ్ధిదారులు చెబుతున్నారు. కానీ, రూ.6,200 చొప్పున కొనుగోలు చేసినట్లు చెబుతుండడంతో లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొంది. మహారాష్ట్ర మేకలు జిల్లా వాతావారణాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని, స్థానికంగా లభించే మేకలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా, మేకల కొనుగోలులో వెట్నరరీ వైద్యులను భాగస్వాములను చేయకపోవడంతో సదరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. -
ముగిసిన బాక్సింగ్ శిక్షణ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సర్సిల్క్ కా లనీలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ శుక్రవారం ముగిసింది. మే1 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన కోచింగ్ శిబిరానికి బాలబాలికలు హాజరై బాక్సింగ్లో ప్రాథమిక నైపుణ్యాలు నేర్చుకున్నట్లు బాక్సింగ్ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిబి రంలో నేర్చుకున్న నైపుణ్యాలు మరింత మెరుగుపర్చుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పో టీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. శిబిరాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన వా రిని అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్ జయేందర్, శివకుమార్, మధురై శేఖర్, అశ్వక్హైమద్, కోనేరు శ్రీకాంత్, రాకేశ్, సాయికుమార్, శివ, వంశీ, క్రీడాకారులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
ఆసిఫాబాద్రూరల్: విద్యుత్ వినియోగదారుల స మస్యలు పరిష్కరిస్తామని వినియోగదారుల చైర్ ప ర్సన్ జయవంతరావు పేర్కొన్నారు. మండలంలోని బూర్గుడ సబ్స్టేషన్లో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన మండలా ల నుంచి వివిధ సమస్యలపై వినియోగదారులు దరఖాస్తులు అందజేశారు. సమస్యలు త్వరగా పరి ష్కరిస్తామని సంబంధిత అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, ఎస్ఈ ఉత్తమ్ జాడే, ఏవో దేవిదాస్, డీఈ వీరేశ్, నాగరాజ్ ఉన్నారు. -
ఖరీఫ్ సాగుడెలా?
దహెగాం: ఖరీఫ్ సాగుకు పెట్టుబడి డబ్బులు లేక జిల్లాలోని చాలామంది రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా ఇప్పటికీ డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్ల సమయంలోనూ తూకం, ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరిగింది. తీరా పంట అమ్ముకుని డబ్బులు పడ్డాయో.. లేదోనని నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. 14,981 ఎకరాల్లో జొన్న సాగు జిల్లాలో ఏజెన్సీ మండలాలైన జైనూర్, కెరమెరి, సిర్పూర్(యు), లింగాపూర్, నార్నూర్ తదితర మండలాల్లో యాసంగిలో 14,981 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. పంట చేతికి రాగానే జైనూర్, కెరమెరి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 801 మంది రైతుల నుంచి 26,989 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. రూ.9.98 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా నేటికీ ఒక్క పైసా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. 9,100 ఎకరాల్లో మొక్కజొన్న..జిల్లాలో 9,100 ఎకరాల్లో రైతులు మొక్క జొన్న సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. పంట చేతికందడంతో జైనూర్, కాగజ్నగర్, కౌటా ల మండలాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,508 మంది రైతుల నుంచి 65,466 క్వింటాళ్ల మొక్కజొన్న కోనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ.15.71కోట్లకు రైతుల ఖాతాల్లో రూ.2.83 కోట్లు మాత్రమే జమైనట్లు అధికారులు తెలిపారు. మిగతా రూ.12.88 కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది. 23వేల ఎకరాల్లో వరి..జిల్లాలో పత్తి తరువాతి స్థానంలో వరి సాగవుతోంది. యాసంగిలో 23వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 69వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, మే లో సొసైటీ, ఐకేపీ ద్వారా జిల్లాలో 40 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 14,875 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో సన్నరకం 1,951 మెట్రిక్ ట న్నులు, దొడ్డు రకం 12,924 మెట్రి క్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. 1,557 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.19.72 కోట్లు కాగా, 397 మంది రైతుల ఖాతాల్లో రూ.4.77 కోట్లు జమయ్యాయి. ఇంకా 1,160 మంది రైతులకు రూ.14.95 కోట్లు జమ కావాల్సి ఉంది. కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో జాప్యం జరిగి రైతులు అకాల వర్షాలకు పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము ధాన్యం విక్రయించి రెండు, మూడు వారాలైనా డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని రైతులు వాపోతున్నారు. మృగశిర కార్తె ప్రవేశించి ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు. -
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు చేపట్టిన రిలే నిరహార దీక్ష 24వ రోజుకు చేరింది. శుక్రవారం వీరికి ప్రజాసంఘాల నాయకులు మద్దతు తె లిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మి ల్లు కార్మికులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్ర జాస్వామ్య హక్కు ఉందని తెలిపారు. ఎన్నికలు ని ర్వహించకపోవడమంటే కార్మికుల హక్కులను కా లరాయడమేనని పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి, గు ర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ప్రజాసంఘాల మద్దతు ఉంటుందని తెలిపా రు. సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు త్రివేణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాజేందర్, ముంజం శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్అర్బన్: పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీ యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు కీలక సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా తదితర సదుపాయాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించి, నాలుగు నెలల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలన్నారు. కారో బార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా, కార్మికులందరికీ రూ.10 లక్షల బీమా సౌకర్యం కలించాలని, ప్ర మాద మరణాలకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందజేశారు. నాయకులు కృష్ణమాచారి, మోరేశ్వర్, పెరిక శ్రీకాంత్, శంకర్, నగేశ్, పుష్పలత, రమేశ్, భాగ్య, రాజమ్మ, లక్ష్మి, భార్గవ్, వసంత్, అజిత్ఖాన్, మారుతి తదితరులున్నారు. -
28న జాతీయ పల్స్ పోలియో
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం, జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేపడుతున్నట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం జాతీయ పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినం ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పల్స్ పోలియో దినం సందర్భంగా ఈ నెల 28న ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో వాక్సిన్(పోలియో చుక్కలు) వేయించాలన్నారు. 46,516 మంది ఐదేళ్లలోపు చిన్నారుల కోసం జిల్లావ్యాప్తంగా 670 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 28న చుక్కలు వేయించుకోలేని వారికి 29, 30వ తేదీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి వేస్తారన్నారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏళ్లలోపు 1,67,702 మంది పిల్లలు, యువతకు అల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా నివారణ మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్వో దాసరి వేణు, డీఎంహెచ్వో సీతారాం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలిఆసిఫాబాద్అర్బన్: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎల్ 1 జాబితాలో ఉన్న వారి ఇళ్లను, సామాజిక, ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి గురువారం ఎంపీడీవోలు, సెర్ప్ ఏపీఎం, ఈజీఎస్ ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీల నిర్మాణంపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్డీవో దత్తారావు, పీడీ ప్రకాష్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్వ్యూలకే పరిమితం!
తిర్యాణి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది మే నెలలో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఏడాది కాలం గడిచినా నేటికీ దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు అందించలేదు. దరఖాస్తుదారులకు కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించడం వరకే అధికారులు పరిమితమయ్యారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకుని రూ.4 లక్షల వరకు వివిధ రకాల యూనిట్ల కొనుగోలు కోసం బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలను అందించాల్సి ఉంది. అలాగే రూ.50 వేల యూనిట్కు వంద శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం 70 శాతం సబ్సిడీని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రేషన్కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ పద్ధతిలోనూ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు యువ వికాసం పథకం రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 29,756 దరఖాస్తులురాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన 29,756 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేశారు. అధికారులు సంబంధిత బ్యాంకు సిబ్బందితో కలిసి దరఖాస్తుదారులకు గతేడాదిలోనే ఇంటర్వ్యూలను సైతం నిర్వహించారు. దీంతో లబ్ధిదారులలో ఆశలు మొదలయ్యాయి. ఇందుకు అనుగుణంగానే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన 2025 జూన్ 2 నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా చేసింది. కానీ సంవత్సర కాలం దాటిపోయినా పథకం ప్రారంభానికి నోచుకోకపోవడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ ఏడాది 2026– 27 ఆర్థిక బడ్జెట్లో సైతం రాజీవ్ యువ వికాసం పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,800 కోట్ల నిధులు కేటాయించింది. అయినా లబ్ధిదారులకు రుణాల పంపిణీ చేయడం లేదు. పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులైన వారందరికీ రుణాలు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఆటో కోసం దరఖాస్తు ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంలో నేను ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నాను. గతేడాది జూన్ 2 నుంచే రుణాలను అందిస్తామని చెప్పారు. కానీ నేటికీ వాటికి సంబంధించిన వివరాలు ఎవరిని అడిగినా చెప్పడం లేదు. ప్రభుత్వం లోన్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్ పూర్తి చేసిన నాకు ఉద్యోగం దొరకకపోవడంతో ప్రైవేటు డ్రైవర్గా కాలం వెల్లదీస్తున్నాను. – మహదేవుని పవన్, గోలేటి, మం.రెబ్బెన మోసం చేయడం సరికాదు యువ వికాసం పేరిట రుణాలను ఇప్పిస్తామని చెప్పి దరఖాస్తులను తీసుకున్నారు. ఇప్పుడు రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తూ కాలం గడపడం సరికాదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను దారి మళ్లించడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాలయాపన చేయకుండా వెంటనే అర్హులైన నిరుద్యోగులందరికీ బేషరతుగా రుణాలు అందజేయాలి. – ఇగురపు సంజీవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
వాంకిడి: ప్రజలు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ అశోక్ అన్నారు. మండలంలోని బనార్కొసార, చిన్న వాంకిడి గ్రామాల్లో గురువారం డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై పలు విషయాలపై అవగాహన కల్పించారు. గంజాయి విక్రయం, వినియోగంపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గంజాయి వాడకం, చెట్ల పెంపకం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత చదువు, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సీఐ వేణుగోపాల్, ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
మండలాలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని డిపో నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు పంపి ణీ చేస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి సుభాష్ తెలిపారు. గురువారం స్థానిక మోడల్ స్కూల్లోని డిపోను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో చే రేలా ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఇప్పటివరకు జిల్లాకు పార్ట్– 1కు సంబంధించిన 90,880 పుస్తకాలు వచ్చాయ ని తెలిపారు. డిపో మేనేజర్ ప్రకాశ్, సీఆర్పీ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి పనులు అక్కడే..!
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 15న పునఃప్రారంభం కానున్నాయి. అయితే కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పాత సమస్యలే స్వాగతం పలకనున్నాయి. జిల్లాలోని చాలా బడుల్లో ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీలు, వంట గదుల నిర్మాణాలు పూర్తికాలేదు. పాత మరుగుదొడ్లు, తరగతి గదులు, వంటశాలలకు మరమ్మతులూ చేపట్టలేదు. సోమవారం బడులకు వచ్చే విద్యార్థులకు ఇక్కట్లు ఎదురుకానున్నాయి. ప్రహరీలు సైతం లేకపోవడంతో పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గురువారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పూర్తికాని మరుగుదొడ్లుజిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలు(స్థానిక సంస్థలు) ఉండగా, 2,072 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 39 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజన ప్రాథమిక పాఠశాలలు 334, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉండగా, 13,126 మంది ఉన్నారు. ఆయా పాఠశాలల భవనాలు చాలాచోట్ల శిథిలావస్థకు చేరాయి. అదనపు తరగతి గదుల అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన మరుగుదొడ్ల పనులు కూడా పూర్తి చేయలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 459 పాఠశాలల్లో అదనంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మా ణానికి నిధులు మంజూరు కాగా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 218 పూర్తి కాగా మరో 241 నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇందులో సీఎస్ఆర్ నిధులతో పాఠశాలల్లో బాలికలకు 25, బాలురకు 157 టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కోదానికి రూ.58 వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఈ పనుల్లో కొన్ని పూర్తి కాగా మరికొన్ని ప్రారంభమే కాలేదు. ఉపాధిహామీ పథకం కింద రెండు దశల్లో 277 పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మాణం కోసం రూ.2 లక్షల చొప్పున కేటాయించారు. స్థలం లేని 13 పాఠశాలలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. కనీస వసతులు కరువుమరమ్మతులు లేక.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణ పనులు 60 శాతం పూర్తికాగా, మిగితా పనులు కొనసాగుతున్నాయి. పిల్లలు ఎక్కవగా ఉన్న పాఠశాలల్లో అదనంగా నిర్మిస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. – సచ్చిదానంద చారి, డీఈవో -
రోడ్డు కోసం గ్రామస్తుల రాస్తారోకో
వాంకిడి: నాలుగు వరుసల జాతీయ రహదారి– 363 నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలతో తమ గ్రామ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని.. తిరిగి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కంపెనీ వారు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మండలంలోని సోనాపూర్ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. గణేష్పూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి కంపెనీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. 2021లో హైవే నిర్మాణానికి గ్రామం మీదుగా భారీ వాహనాలతో మట్టిని తరలించడంతో బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని వాపోయారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే గణేష్పూర్ వద్ద బస్టాండ్ నిర్మించాలని, సర్వీస్ రోడ్డు, సైడ్ డ్రెయిన్ పనలు పూర్తి చేయాలని కోరారు. -
అనధికార దత్తత చట్టరీత్యా నేరం
ఆసిఫాబాద్అర్బన్: పిల్లలు లేని దంపతులు కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ(సీఏఆర్ఏ) మార్గదర్శకాల ప్రకారం దత్తత తీసుకోవాలని, మధ్యవర్తుల ద్వారా, అనధికార దత్తత చట్టరీత్యా నేరమని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్నగర్ మండలం చింతగూడకు చెందిన దుర్గం లింగయ్య, రేణుక దంపతులకు చట్టబద్ధమైన రిలేటీవ్ అడప్షన్ ప్రక్రియ పూర్తయినందున జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం మహిళాశిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అడాప్షన్ ఆర్డర్ ప్రతిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ చిన్నారికి సురక్షితమైన కుటుంబ వాతావరణంలో పెరిగే హక్కు ఉందని, దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలకు ప్రేమ, భద్రత, విద్య, మంచి భవిష్యత్తు కల్పించే అవకాశం ఉందని తెలిపారు. దత్తత ప్రక్రియలో పారదర్శకత, చట్టబద్ధత, పిల్లల సంక్షేమమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. దత్తత తీసుకోవాలనుకునే దంపతులు మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని జిల్లా బాలల సంరక్షణ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. సంబంధిత అధికారులు నిబంధనలు, అవసరమైన పత్రాలు, చట్టబద్ధ ప్రక్రియలపై సమాచారం అందించి సహకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్, ప్రొటెక్షన్ అధికారి శ్రావణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలి కాగజ్నగర్టౌన్: పట్టణంలోని కాపువాడలో మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కలెక్టర్ కె.హరిత, విద్యాశాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్లుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. -
సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేక..
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 70 వేలకు పైగా జనాభా ఉంది. ఈ స్థాయిలో జనాభా ఉన్నా అవసరమైన స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పారిశుద్ధ్య విభాగంలో 136 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ముగ్గురు జవాన్లు, తొమ్మిది మంది మహిళా కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తుండగా ఔటర్ సోర్సింగ్ సిబ్బంది 116 మంది ఉన్నారు. చెత్త సేకరణకు ప్రతిరోజూ నాలుగు ట్రాక్టర్లలో 30 మంది, 12 ఆటో ట్రాలీల్లో 12 మంది చెత్త సేకరణకు వెళ్తున్నారు. మిగిలిన వారిలో 50 మంది మహిళలు వీధులను శుభ్రం చేస్తున్నారు. మరో 24 మందిలో పది మంది కార్యాలయంలోనే వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ 10వేల జనాభాకు కనీసం 29 మంది శానిటేషన్ కార్మికులు ఉండాలి. ఆ లెక్కన పట్టణానికి దాదాపు190 మందికి పైగా అవసరం. కానీ ప్రస్తుతం సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. కొన్ని కాలనీల్లో చెత్త సేకరణ ఆలస్యమవుతుండగా, మరిన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీలు శుభ్రం కాక నెలల తరబడి పూడిక పేరుకుపోయింది. పేరుకుపోయిన పూడిక పట్టణంలోని పలు సంజీవయ్య కాలనీ, ఇర్ఫాన్నగర్, కాపువాడ, ఓల్డ్ కాలనీ, ద్వారకానగర్, బాలాజీనగర్, కౌసర్నగర్ లోతట్టు ప్రాంతాల్లో డ్రైయినేజీల్లో పూడిక పేరుకుపోయింది. చాలాచోట్ల మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వర్థ్యాల కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. భారీ వర్షాలు కురిస్తే కాలనీల్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తేలని ‘గుర్తింపు’ ఎన్నికల వివాదం
కాగజ్నగర్టౌన్: ఎస్పీఎం గుర్తింపు ఎన్నికల వివాదం ఎటూ తేలడం లేదు. స్పష్టమైన పరిష్కారం లేకుండానే ఇరువర్గాల మధ్య సమావేశం ముగిసింది. మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 22 రోజులుగా కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, ఎస్పీఎం ప్రతినిధులతో హైదరాబాద్లోని రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్, రాజేంద్రప్రసాద్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్య హక్కులు గౌరవిస్తూ వెంటనే వెరిఫికేషన్ ఎన్నికలు నిర్వహించాని కోరారు. ఎస్పీఎం ప్రతినిధులు మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహణ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉందని, తీర్పుకు అనుగుణంగా చర్యలు చేపడుతామని వివరించారు. సమావేశంలో జేఏసీ నాయకులు సిర్పూర్ పేపర్ మిల్లు మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు మల్లికార్జున్, మాజీ కార్మికశాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఎస్పీఎం ప్రతినిధులు శేషగోపాల్, ఎంఎస్ గిరి, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలుగా ర్యాంపులు
ఆసిఫాబాద్ పట్టణంలో 20 వార్డు ఉన్నాయి. 6,512 కుటుంబాలు, 20 వేల వరకు జనాభా ఉంది. 120 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. గతేడాది పైకాజీనగర్, బజార్వాడీ, రవిచంద్ర కాలనీ, తదితర కాలనీల ప్రజలు వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇళ్ల ఎదుట అక్రమంగా ర్యాంపులు నిర్మించారు. తద్వారా డ్రెయినేజీల్లో పూడిక తీయడం కష్టంగా మారింది. చిన్నపాటి వర్షం పడినా రోడ్లపైకి వర్షపు నీరు చేరుతోంది. మరోవైపు ఎప్పటికప్పుడు పూడిక తీయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైకాజీనగర్, బ్రాహ్మణవాడ, బజార్వాడీ రహమత్నగర్, రవిచంద్ర కాలనీ, హడ్కో కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంది. పట్టణం నడిబొడ్డున ఉన్న ఓపెన్ ప్లాట్లు దోమలకు ఆవాసాలుగా మారాయి. పిచ్చిమొక్కలు పెరిగి విష సర్పాలు ఇళ్ల మధ్యే తిరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో రెండు ట్రాక్టర్లు, ఐదు ట్రాలీ ఆటోలతో చెత్త సేకరిస్తున్నామని, త్వరలో మరో రెండు ట్రాక్టర్లు అద్దెకు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. -
ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్రూరల్: ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో యువత అధికంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని కోరారు. అనంతరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలకు స్క్రీన్పై ప్రదర్శించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, సీఐలు బాలాజీ వరప్రసాద్, సతీశ్ పాల్గొన్నారు. -
భీం చరిత్ర స్ఫూర్తిదాయకం
కెరమెరి: పోరాటయోధుడు కుమురం భీం చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని శిక్షణ ఐఏఎస్లు హరిప్రసాద్, సాయి సురేశ్, సాయి శివాణి, శ్రీకాంత్రెడ్డి, సచిన్ బజవర గొట్టు, పారస్కుమార్ అన్నారు. మండలంలోని జోడేఘాట్ను బుధవారం సందర్శించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం భీం మ్యూజియాన్ని సందర్శించారు. గుప్పాడీ చేస్తున్న నృత్యాలు, ఆదివాసీలు ఆయుధాలు, ఆభరణలు, ఫొటో గ్యాలరీ, దేవతల ప్రతిమలను పరిశీలించారు. భీం పోరాటంతో ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులు అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో భాస్కర్, క్యూరేటర్ దుందేరావు, హెచ్ఎం మోతీరాం తదితరులు పాల్గొన్నారు. -
ఉత్పత్తి సాధనకు యంత్రాలు కీలకం
రెబ్బెన: గనుల నిర్వహణ, అధిక బొగ్గు ఉత్పత్తి సాధనకు ఆధునిక సాంకేతికత కలిగిన యంత్రాలు ఎంతో కీలకమని జీఎం శ్రీ రమేశ్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో బుధవారం నూతన క్రేన్కు పూజలు చేసి ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ అధిక ఉత్పత్తి సాధించాలని సూచించారు. ఉత్పాదకత పెంపు, నిర్వహణ పనుల్లో వేగం, భద్రత ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా సంస్థ ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్రేన్ 12 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని, భారీ యంత్రాల మరమ్మతు, విడిభాగాల తరలింపు, నిర్వహణ పనులు సులభతరంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, డీజీఎం పర్సనల్ కిరణ్బాబు, సేఫ్టీ అధికారి మధుసూదన్, మేనేజర్ శంకర్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్నగర్టౌన్: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు వినియోగించుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మదిరే అశోక్ అన్నారు. పట్టణంలోని ఎస్పీఎం క్లబ్లో పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల నిర్వాహకులకు బుధవారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్టప్ ఇండియా పథకంలో కార్యాచరణ, నిధుల కల్పన, స్థానిక ఉపాధి, ఆర్థిక అభివృద్ధి అంశాలను వివరించారు. జిల్లాలో గుర్తించిన వివిధ ఉత్పత్తులకు మార్కెట్ లభ్యత, నిధుల సదుపాయం, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ఆర్థిక అభివృద్ధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సోలార్ వ్యవస్థ, పవర్ ఫ్యాక్టర్ సమస్యలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అంశాలపై దృష్టి సారించాని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అందిస్తున్న పథకాలు, రాయితీలను వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో డీపీ ఐఐటీ ప్రతినిధి గౌతమ్, ఓడీసీపీ ప్రతినిధి హర్మన్ ప్రీత్ సింగ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి ప్రణయ్, రిచ్ ప్రతినిధి కిశోర్ కుమార్, గ్రీన్టెక్ సోలార్ సంస్థ ప్రతినిధి జగన్మోహన్, ఏబీబీ ప్రతినిధి యోగేశ్వర్, చంద్రకాంత్ పాల్గొన్నారు. -
‘గెలిచిన సంఘాల వైఫల్యంతోనే కష్టాలు’
రెబ్బెన: సింగరేణిలో గెలిచిన సంఘాల వైఫల్యంతోనే కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ హైమద్ విమర్శించారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో బుధవారం నిర్వహించిన హెచ్ఎంఎస్ గేట్ మీటింగ్కు హాజరై మాట్లాడారు. 14 నెలలుగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది కార్మికులు అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్మి కుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతినెలా కనీ సం రెండుసార్లు సమావేశాలు నిర్వహించాలని డి మాండ్ చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పాత విధానంలోనే నియామక పత్రాలు అందించాలన్నారు. ఏఐటీయూసీ నాయకత్వం యాజమాన్యానికి ఒంటరిగా సమ్మె నోటీసు ఇవ్వడం కార్మికులను మోసం చేయడమేనని స్పష్టం చేశారు. కార్మిక సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని సంఘాలను కలుపుకొని పోవాలని హితవు పలికారు. ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు, బ్రాంచి కార్యదర్శి శివారెడ్డి, ఫిట్ కార్యదర్శి దుర్గం వెంకటేశ్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి కుమార్గౌడ్, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్కే ఇనూస్ పాల్గొన్నారు. -
సహాయక వేదికగా భరోసా కేంద్రం
ఆసిఫాబాద్అర్బన్: వేధింపులు, హింస, లైంగిక దాడులు, గృహ హింస వంటి కేసుల్లో బాధితులకు భరోసా కేంద్రం ఒక సహాయక వేదికగా పనిచేయాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ను మంగళవారం తనిఖీ చేశారు. నమోదైన కేసులు, కౌన్సెలింగ్ సేవలు, బాధితులకు సహాయ చర్యలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి ఎస్సై దివ్యతోపాటు సిబ్బందికి సూచనలు చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతీ కేసులో సున్నితంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులు, భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి అవసరైమన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. -
‘దామిని’తో తప్పును ముప్పు
ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్ సమాచారాన్ని లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘దామిని’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్ చేసుకుంటే చదువురాని వారు సైతం సులువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉమ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మెరుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకా లం ఆరంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నా రు. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది. వానాకాలంలో తీవ్రత ఎక్కువప్రధానంగా వానాకాలం సీజన్ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మేఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్రయాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నారు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నాయి. మరికొన్ని సమయాల్లో సెల్టవర్లు, విద్యుత్ ఉపకరణాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. గాల్లో కలుస్తున్న ప్రాణాలుజాగ్రత్తలే రక్ష -
చకచకా ‘శక్తి భవనం’
ఆసిఫాబాద్అర్బన్: మహిళల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులను అన్ని విధాలుగా ప్రో త్సహిస్తోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాల మంజూరు, మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సమాఖ్యను వ్యాపారాల్లో ప్రోత్సహించ డం వంటి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో మహిళా సంఘా కోసం రూ.6 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మి స్తోంది. సమన్వయ కర్తలు, సభ్యులకు శిక్షణ, జిల్లాస్థాయి సమావేశాల నిర్వహణకు ఈ భవనం వేదికగా నిలువనుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. ఇటీవల కలెక్టర్ కె.హరిత అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు. నైపుణ్య శిక్షణ, సమావేశాల నిర్వహణజిల్లా కేంద్రంలో గ్రామ, మండల స్థాయి మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రాథమిక సభ్యులతో జిల్లాస్థాయి సమావేశాలకు ఇందిరా మహిళా శక్తి భవనాన్ని వినియోగించనున్నారు. విస్తృత సమావేశాలకు విశాలమైన హాల్తోపాటు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు సైతం ప్రత్యేక హాళ్లు నిర్మిస్తున్నారు. జిల్లా సమాఖ్య కార్యకలాపాలను సైతం ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. వీటితోపాటు సభ్యులు తయారు చేసే ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీవోఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నైసుణ్య శిక్షణ కార్యక్రమాలను సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇందిర మహిళా శక్తి భవనం కేంద్రంగా మారనుంది. 8,236 మహిళా సంఘాలుజిల్లా వ్యాప్తంగా 8,236 మహిళా స్వయం సహాయ క సంఘాలు ఉండగా, ఇందులో 94,569 మంది స భ్యులుగా కొనసాగుతున్నాయి. మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్రనిధి, ఇందిరా మహిళా శక్తి రుణాలతో స్వయం ఉపాధి పొందుతున్నారు. మ రింత ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ఇందిరా మహిళా శక్తి భవనాలను వేదికలుగా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. నిపుణులతో పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలు తమ అనుభవాలను తోటివారితో పంచుకునేందుకు వీలుగా నిత్యం సమావేశాలు నిర్వహించనున్నారు. మహిళలకు ప్రయోజనం జిల్లా కేంద్రంలో ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణంతో మహిళా సంఘాల సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. సమావేశాల నిర్వహణ, వృత్తి నైపుణ్య శిక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. – శ్రీలక్ష్మి, మహిళా సంఘం నిర్వాహకురాలు, ఆసిఫాబాద్ మూడు నెలల్లో పూర్తి మహిళా సంఘాల సభ్యుల సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తాం. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. – దత్తారావు, డీఆర్డీవో -
కుమురం భీం
7చినుకు పడితే కరెంట్ కట్! తిర్యాణి మండలంలో చిన్న గాలివానకు వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం సర్వసాధారణంగా మారింది. నిత్యం అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురుస్తుంది. వీడని ‘అన్న’బంధం! బాసర వద్ద పుణ్యస్నానమాచరించేందుకు గోదావరి నదిలోకి దిగిన ముగ్గురు అన్నదమ్ములు నీట మునిగి మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యుల రోదన్నలు మిన్నంటాయి.బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026 -
విధుల్లో అలసత్వం వహిస్తే సహించం
ఆసిఫాబాద్: వైద్యాధికారులు, సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించమని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదన పు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి మంగళవారం జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించా లన్నారు. వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమయపాలన పాటించాలని సూ చించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ప్రతిఒక్కరూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సిబ్బంది హాజరు, పనితీరును యాప్లో ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మందులు, టీకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్ర, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలుఆసిఫాబాద్: వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకా శాలు లభిస్తాయని కలెక్టర్ కె.హరిత అన్నారు. జై నూర్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో మంగళవారం జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు హైదరాబాద్లో ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పి స్తారని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియో గం చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియ న్, ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్, వెల్డింగ్, ఫాబ్రికేష న్, బైక్ రిపేరింగ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటీవ్(బాలికలు), ఎలక్ట్రికల్ హోం అప్లయన్సెస్ రిపేరింగ్, ఏసీ రిపేరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
వెల్కమ్ పోలీస్ బాస్
సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: రాష్ట్ర పోలీస్ బాస్ మంగళవారం రాత్రి ఆదిలాబాద్కు విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా ఉన్నారు. వీరు బుధవారం ఆదిలా బాద్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బెల్లంపల్లిలో ఏడాదిపాటు అదనపు ఎస్పీగా.. డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడిషన ల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా మే 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. నేటి పర్యటన ఇలా.. డీజీపీ ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చేరుకుంటారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. వీటితో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. -
పేదోడికి కూరగాయాలు
దహెగాం: రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు పేదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంగళవారం నిర్వహించిన వారసంతల్లో నిత్యావసరమైన టమాటా, పచ్చిమిర్చి ధరలు చుక్కలన్నంటాయి. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు పోషకాహారం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నాయి. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, రవాణా ఖర్చుల పెరుగుదల, నిల్వ సదుపాయాల కొరత తదితర అనేక కారణాలతో రేట్లకు రెక్కలు వస్తున్నాయి. స్థానిక రైతులు పండించడపోవడంతో వారసంతలకు సరఫరా తగ్గుతుంది. ఆగస్టు వరకు కూరగాయల ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. -
దిందాలో ‘పోడు’ ఉద్రిక్తత
చింతలమానెపల్లి: మండలంలోని దిందా అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని దిందా అటవీ ప్రాంతంలో ఎఫ్ఆర్వో సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాక్టర్లతో చదును పనులు చేపట్టగా, దిందా గ్రామానికి చెందిన పలువురు పోడు రైతులు అడ్డుకున్నారు. ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూములను అటవీ శాఖ స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. మహిళలు, రైతులు ట్రాక్టర్లకు అడ్డుగా బైఠాయించారు. దీంతో అటవీ సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. చింతలమానెపల్లి ఎస్సై కమలాకర్, కౌటాల సీఐ సంతోష్ కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. సముదాయించినా వినకపోవడంతో అటవీశాఖ వాహనాల్లో కాగజ్నగర్ డివిజన్ కార్యాలయానికి తరలించారు. అవగాహన కల్పించిన అనంతరం రాత్రి వరకు వారిని వదిలిపెట్టారు. కాగా, డీఎస్పీ వహీదుద్దీన్ దిందాలోని ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ‘పోడు’ సాగుపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి – ఎఫ్డీవో అప్పయ్య కాగజ్నగర్టౌన్: అడవుల సంరక్షణ చర్యల్లో భాగంగా పోడు సాగుపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఎఫ్డీవో అప్పయ్య తెలిపారు. ఖర్జెల్లి అటవీ డివిజన్ పరిధిలోని దిందా గ్రామ పంచాయతీలో పోడు వ్యవసాయం చేస్తున్న 25 మంది పోడు రైతులను మంగళవారం కాగజ్నగర్ డివిజన్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వారికి పోడు వ్యవసాయం, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎఫ్డీవో అప్పయ్య మాట్లాడుతూ దిందా ఫారెస్ట్లో 1600 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని, ఒక్కో కుటుంబం 30 నుంచి 50 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు ఫారెస్ట్ను ఆనుకుని ఉన్న 800 ఎకరాల ఫారెస్ట్ భూముల్లో ట్రెంచ్లు ఏర్పాటు చేసి ప్లాంటేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూనే, కొత్తగా అడవులను ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో సుభాష్, బండెపల్లి పోడు రైతులు దన్నూరి లక్ష్మయ్య, హన్మంతు, బక్కయ్య, అంకులు, డోకె అంకులు, సురేష్, తిరుపతి, కమలాబాయి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
‘పోడు’ సమస్యలు పరిష్కరించండి
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలో ని పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని అరణ్యభవన్లో మంగళవారం ఇన్చార్జి పీసీసీఎఫ్ వినయ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలమానెపల్లి మండలం దిందా, కర్జెల్లి, బెజ్జూర్ మండలం పాపన్పేట్, పెంచికల్పేట్ మండలం దరోగపల్లి తదితర గ్రామాల్లో అటవీ అధికారులు పోడు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని తెలి పారు. వెంటనే పోడు భూముల స్వాధీన ప్ర క్రియ నిలిపివేయాలని కోరారు. సానుకూలంగా స్పందించి డీఎఫ్వోకు ఆదేశాలు ఇస్తామ ని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎల్ల్ములే మల్లయ్య, డబ్బుల మురళి, తుకారాం, చౌదరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షు డు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ గతేడా ది నవంబర్ 12 నుంచి కెరమెరి పీహెచ్సీ పరిధిలోని మోడి, దేవాపూర్ సబ్ సెంటర్లు, అడ పీహెచ్సీ పరిధిలోని చిర్రకుంట, గుండి సబ్ సెంటర్లలో ఎంఎల్హెచ్పీలుగా పనిచేస్తున్న వారికి వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రవీనా, ప్రత్యూష, స్నేహ, అనూష తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమం
కాగజ్నగర్టౌన్: నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వార్డుల్లో సోమవారం వార్డు సభలు నిర్వహించారు. 15, 16 వార్డుల్లో నిర్వహించిన సభలకు ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వేదికగా మారిందన్నా రు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. వార్డుల వారీగా తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలపై వచ్చిన వినతులను పరిశీలించి పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మెప్మా అధికారులు మోతిరాం, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశుభ్రతతో ఆరోగ్యం
ఆసిఫాబాద్: వర్షాకాలంలో పరసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక వార్డు సభలకు వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రెయినేజీల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెందే ప్రమాదముందని పేర్కొన్నారు. సమస్యలుంటే ప్రజలు కౌన్సిలర్ల దృష్టికి తేవాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు బాలకృష్ణ, దూడల లక్ష్మి, మున్సిపల్ మేనేజర్ సర్వర్, ట్రాన్స్కో ఏఈ లక్ష్మీరాజం, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారు బడులను చక్కదిద్దుతా
ఆసిఫాబాద్రూరల్: ‘విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కానీ తక్కువ అక్షరాస్యతతో జిల్లా చదువులో వెనుకబడింది. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. సర్కారు బడులను తీర్చిదిద్ది చిన్నారులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా పని చేస్తాం..’అని నూతన జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు నిత్యం పర్యవేక్షిస్తూ.. విద్యాశాఖను బలోపేతం చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల హాజరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. సాక్షి: వెనుకబడిన జిల్లాలో విద్యారంగాన్ని బలోపే తం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఈవో: జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. 2,072 మంది ఉపాధ్యాయులు ఉండగా, 39,249 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ గైర్హాజరు కాకుండా చూస్తా. విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తాం. ప్రాథమిక విద్యను బ లోపేతం చేస్తాం. 24 గంటలపాటు అందుబాటులో ఉంటాను. క్షేత్రస్థాయిలో పాఠశాలలను రోజు వారీగా తనిఖీ చేస్తూ విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. సాక్షి: 2026– 27 విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు? డీఈవో: ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్ర మం ప్రారంభమైంది. 15వ తేదీ నుంచి పాఠశాలలు పు నఃప్రారంభం కానున్నాయి. బడీడు పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. తమ పరిధిలోని పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఇంటింటికీ తిరుగుతూ సౌకర్యాలు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాంతోపాటు ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉదయం పూట స్నాక్స్ గురించి వివరిస్తున్నారు. బడిబాటలో ఇప్పటివరకు 754 మందికి నూతన అడ్మిషన్లు ఇచ్చాం. గతేడాది కంటే ఈ సంవత్సరం 10 శాతం ప్రవేశాల సంఖ్య పెంచుతాం. సర్కారు బడిలో మెరుగైన విద్య అందుతుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలి గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. తల్లి దండ్రులు సైతం అడ్మిషన్లు పూర్తయిన తర్వాత వా రంలో ఒకరోజు పాఠశాలకు వెళ్లి తమ పిల్లల అభ్యసన సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. తద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుంది. సాక్షి: విద్యార్థులకు అందించేందుకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం సిద్ధంగా ఉన్నాయా? డీఈవో: జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ తరలించాం. జిల్లాకు 1,48,880 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, 90,320 పుస్తకాలు వచ్చాయి. యూనిఫాం స్టిచ్చింగ్ కొనసాగుతుండగా, 50 శాతం పూర్తయ్యింది. జూ న్ 15న పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తాం. అలాగే జిల్లాలో రెండు విడతల్లో 212 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాం. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలి. సాక్షి: ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజు వసూలు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్ముతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? డీఈవో: జిల్లాలో మొత్తం 115 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ప్రభు త్వ నిబంధనలను పాటించాలి. అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం పేరుతో వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదు. -
మైనర్లు వాహనాలు నడపొద్దు
పెంచికల్పేట్: మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. మండలంలోని చేడ్వా యి గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎ దిగే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పొద్దని సూచించారు. వాట్సాప్ గ్రూ పుల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద పోస్టులు పెట్టడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని కోరారు. గ్రామాల్లో గంజాయి, నకిలీ విత్తనాల విక్రయాలు, వినియోగం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నానాజీ, వార్డు సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
మిల్లు పునః ప్రారంభం నుంచీ స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. దేవాపూర్, ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీల్లో కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎస్పీఎంలో ఎందుకు నిర్వహించడంలేదు..? గుర్తింపు యూనియన్ వస్తే యాజమాన్యం చేస్తున్న అక్రమాలు, దుర్మార్గాలు బయటపడుతాయనే భయంతోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారు. కార్మికుల నిరాహార దీక్షలు, మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. – డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాని కి వినతులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి కలెక్టర్ కె.హరిత వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కౌశిక్, కల్యాణ్, తుంగెడ గ్రామానికి చెందిన సంధ్య వేర్వేరుగా అర్జీలు అందించారు. వ్యవసాయ భూమిని కౌలుకు ఇస్తే కబ్జా చేశారని, తిరిగి తనకు ఇప్పించాలని సిర్పూర్(టి) మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం హుక్టూ విన్నవించాడు. తన భర్త మరణించిన నేపథ్యంలో ఎల్ఐసీ బీమా డబ్బులు ఇప్పించా లని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్కు చెందిన కవిత మండల్ వేడుకుంది. ఆసరా పింఛన్ డబ్బులు బ్యాంకు ద్వారా ఇప్పించాలని ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన నవీన్ దరఖాస్తు చేసుకున్నాడు. తన భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెంది న పెరుగు కమలాబాయి అర్జీ చేసుకుంది. రెండు నెలలుగా నిలిచిపోయిన ఆసరా పింఛన్ను వెంటనే పునరుద్ధరించాలని చింతలమానెపల్లి మండలం కర్జెల్లి గ్రామానికి చెందిన శంకరయ్య కోరాడు. ఉపాధి కల్పించాలని బెజ్జూర్ మండలం రెబ్బెనకు చెందిన మల్లేశ్ దరఖాస్తు చేసుకున్నాడు.గుడిసెల్లో ఉంటున్నాం.. ఇళ్లు ఇవ్వండి కెరమెరి మండలం కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామాల్లో 26 ఆదివాసీ కుటుంబాలకు చెందిన వాళ్లం గుడిసెల్లో బతుకు వెల్లదీస్తున్నాం. కాలమేదైనా ఇబ్బందులు తప్పడం లేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదు. పీఎం జన్మన్, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా సొంతిళ్లు మంజూరు చేయాలి. – కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామస్తులు, మం.కెరమెరి మృతదేహాలు పాతిపెట్టడం ఆపాలి జిల్లా కేంద్రంలోని సిద్ధివి నాయక కాలనీ(10 వార్డు)ని ఆనుకుని ఉన్న స్థలంలో అనధికారికంగా మృతదేహాలను పాతిపెట్ట డం ఆపాలి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. కాలనీ గుండా మృతదేహాలను తీసుకెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సిద్ధివినాయక కాలనీవాసులు, ఆసిఫాబాద్ -
కార్మికశాఖ మంత్రితో ఎమ్మెల్యే హరీశ్బాబు భేటీ
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన మార్గం చూపాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. ఎస్పీఎం కార్మికుల ఆందోళనల గురించి వివరించారు. 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా గుర్తింపు సంఘం ఎన్నికల గురించి పట్టించుకోకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ను పిలిపించి పరిస్థితిపై సమీక్షించారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 10న కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, ఎస్పీఎం యాజమాన్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. -
అన్నదాతకు చల్లని కబురు
ఆసిఫాబాద్: అన్నదాతలకు చల్లని కబురు అందిస్తూ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల సోమవారం ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రం వాతావరణం మబ్బులతో ఒక్కసారి చల్లబడింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరడంతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కి దున్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎరువులు, విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. వారం రోజులుగా ఎరువులు, విత్తనాల దుకాణాలు రైతులతో సందడిగా కనిపిస్తున్నాయి. వర్షం రాగానే విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2026– 27 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల కంది, 7,500 ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో సాధారణ వర్షపాతం 18.4 మిల్లీమీటరు నమోదు కావాల్సి ఉండగా, 15.7 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం 15 మండలాల్లో 4 మండలాల్లో సాధారణం కంటే కాస్త అధికంగా వర్షం కురవగా, రెండు మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాల్లో వర్షాలు కురవలేదు.కాగజ్నగర్ మండలంలో వర్షంకాగజ్నగర్రూరల్: మండలంలో సోమవా రం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో మోస్తారు వర్షం ఉరుములతో కురిసింది. గాలుల ధాటికి భట్టుపల్లి గ్రామ పంచాయతీలోని మద్దెల జ్యోతి ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. వర్షానికి ఇంటి గోడ పూర్తిగా కూలింది. ఇంట్లో జ్యోతితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉండగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. తలదాచుకునేందుకు నీడలేకుండా పోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే నా మానగర్ వద్ద తాటిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. -
తొలగని సందిగ్ధం!
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహణపై సందిగ్ధంతొలగడం లేదు. కార్మిక సంఘాలు 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. యాజ మాన్యం నుంచి స్పందన లేకపోవడంతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభ నిర్వహణకు జేఏసీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్పీఎంలో 2014 నుంచి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగడం లేదు. 2018లో నిర్వహించాల్సి ఉన్నా యాజమాన్యం వివిధ కారణాలను సాకుగా చూపుతూ వాయిదా వేస్తోంది. ప్రస్తుతం మిల్లులో 373 మంది పర్మినెంట్ కార్మికులు, 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 800 మంది జాబ్ కార్మికులు, ఏసీఎస్ కంట్రోల్ సిస్టంలో 415 మంది పని చేస్తున్నారు. మొత్తం 1,900 మందికి పైగా కార్మికులు ఉన్నారు. కార్మిక సమస్యలపై పట్టింపేది..?2014లో మూతపడిన మిల్లును 2018లో జేకే పేపర్ మిల్లు యాజమాన్యం టేకోవర్ చేసుకుని 1,050 మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించింది. అయితే కార్మికుల హక్కుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్దసంఖ్యలో కార్మికులు ఉన్నా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికుల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యారు. వేతన సవరణ, బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి అంశాలపై మిల్లు ప్రతినిధులను నేరుగా అడిగే అవకాశం లేకుండా పోయింది. రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తుందని కార్మికులు వాపోతున్నారు. కోర్టు పరిధిలో వివాదంప్రస్తుతం గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ వివాదం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం తొలగితే తప్ప ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం మిల్లులోని అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యమై జేఏసీగా ఏర్పడి ఎస్పీఎం గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పరిశ్రమ విస్తరణ, ఉత్పత్తి పెంపుపై దృష్టి సారిస్తున్న యాజమాన్యం కార్మికుల ప్రజాస్వామ్య హక్కుల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లుఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం నిర్వహించకుండా జాప్యం చేస్తుంది. ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేసింది. ఆ కేసును వాపసు తీసుకుని ఎన్నికలు నిర్వహించాలి. రానున్న రోజుల్లో ఎస్పీఎం గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. – వెంకటేశం, కార్మిక సంఘం నాయకుడు -
6 ఫీట్లు పొడవు.. 40 కిలోల బరువు.. కాటేస్తే ఖతమే!
ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్నగర్బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్ స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు. మంచిర్యాల జిల్లా: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.ఏ బస్తీలో చూసినా..మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్నగర్, నెంబర్–2 ఇంక్లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్టెక్స్ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, కొత్తబస్టాండ్ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్ బస్తీ, షంషీర్నగర్, రవీందర్నగర్, అంబేద్కర్నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్ బస్తీ, అశోక్నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.వారం రోజుల్లో..పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్టెక్స్, 65 డీప్ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్ బంగ్లాబస్తీ, నెంబర్–2 ఇంక్లైన్, సుభాష్నగర్ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అ«ధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్ క్యాచర్లు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు. -
అడ్మిషన్ల వేట
కెరమెరి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల వేట ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామాల్లో తిరుగుతూ పదో తరగతి పాసైన విద్యార్థులను గుర్తిస్తున్నారు. ఈ నెల 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం కాగా, ప్రతీ కళాశాలలో కనీసం 150 నుంచి 200 మంది మొదటి సంవత్సరం విద్యార్థులను చేర్చుకునేలా కసరత్తు చేస్తున్నారు. గ్రూపులుగా తిరుగుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటి ప్రచారంజిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫస్టియర్లో 2,400 మంది, సెకండియర్లో 2,200 మంది విద్యార్థులను చేర్చుకోవా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 614 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను ప్రత్యేకంగా కలుస్తున్నారు. సౌకర్యాలపై ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రూ.వేలల్లో ఫీజుల చెల్లించే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లోనే మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. ఏటా జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు ఉత్తమ ఫలితాలు సాధించడం సానుకూలంశంగా మారింది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్పాస్ సౌకర్యంతోపాటు ఉచిత అడ్మిషన్, పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. ఫలితాలను మెరుగుపర్చేందుకు కళాశాల ప్రారంభం నుంచే స్టడీ అవర్స్ నిర్వహిస్తూ వీక్లీ, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మా త్రమే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఎంపీసీ, బైపీసీ సెకండియర్లో 30 మార్కుల ప్రాక్టికల్స్ ఉండగా, ఇక నుంచి మొదట సంవత్సరంలో 15, ద్వితీయ సంవత్సరంలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వివరాలు -
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
కాగజ్నగర్టౌన్: వాహనదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటా మని డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. పట్టణంలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్ర మం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజల భద్రత కో సం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం అందించాలన్నారు. అ నంతరం సరైన పత్రాలు లేని 40 వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ప్రేమ్కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
చీకట్లో డబుల్ ఇళ్లు
కాగజ్నగర్టౌన్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చారిగాం సమీపంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు గత నెల 8న ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే నెలరోజులు కావొస్తున్నా లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. సరైన వసతులు లేకపోవడంతో ఇళ్లలో ఉండేందుకు సుముఖత చూపడం లేదు. సరైన రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో వర్షాలకు ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంది. కాలనీల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా ఇప్పటికీ ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. రాత్రిపూట చీకటి అలుముకుంటుంది. అంతేకాకుండా ఊరు చివరన డబుల్ బెడ్రూం ఇళ్లు ఉండగా కనీసం రక్షణగా ప్రహరీ కూడా నిర్మించలేదు. రాత్రిపూట భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి అద్దెలు కట్టలేక ఎదురుచూసిన వారి సొంతింటి కల నెరవేరినా ఇంట్లో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. సందిగ్ధత తొలగేనా..?కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చారిగాం రోడ్ సమీపంలో 12 బ్లాక్ల్లో 288 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 24 ఇళ్లు ఉన్నాయి. వీటిలో 248 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించి ప్రొసీడింగ్లు కూడా అందించారు. మరో 40 ఇళ్లు కేటాయించాల్సి ఉంది. ఇళ్లలో కరెంట్ లేకపోవడంతో చీకట్లో ఎలా ఉండాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి పైపులైను వేసినా నీళ్లు సరఫరా కావడం లేదు. వేసవిలో తాగునీటితోపాటు ఇతర అవసరాలకు నీరు అందుబాటులో లేదు. అయితే ప్రభుత్వమే ఉచితంగా మీటర్లు అందిస్తుందని లబ్ధిదారులు ఎదురుచూస్తుండగా, అధికారులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. దీనిపై స్పష్టత వస్తేనే లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసే అవకాశం కనిపిస్తుంది. సౌకర్యాలు కల్పించాలి డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించి ప్రొసీడింగ్ ఇచ్చి నెల రోజులవుతుంది. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో వెళ్లలేదు. కరెంట్ మీటర్, మంచినీళ్లు లేవు. సరైన దారి కూడా లేదు. అందరూ ఇళ్ల చూసి వస్తున్నా ఎవరూ నివాసం ఉండటం లేదు. అధికారులు మీటర్ల బిగింపుపై స్పష్టత ఇవ్వాలి. – బండయ్య, లబ్ధిదారుడు, కాగజ్నగర్ ఎలా ఉండాలి కొన్నేళ్లపాటు కాగజ్నగర్లో కిరాయికి ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. తీరా అక్కడి వెళ్లి చూస్తే సరైన వసతులు లేవు. కరెంటు, నీళ్లు లేకుంటే కుటుంబంతో ఎలా ఉండాలి. – యశోద, లబ్ధిదారు, కాగజ్నగర్ పనులు పూర్తయ్యాయి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారులకు అప్పగించాం. 248 మంది లబ్ధిదారులకు కేటాయించారు. వాటర్ ట్యాంక్లు, నల్లాలు కూడా ఏర్పాటు చేశాం. విద్యుత్ స్తంభాలనూ ఏర్పాటు చేశాం. లబ్ధిదారులు మీటర్లకు దరఖాస్తు చేసుకుని బిగించుకోవాలి. – ప్రకాశ్రావు, హౌసింగ్ పీడీ -
వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: గిరిజన హాస్టళ్లలో పని చేస్తున్న దినసరి, ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్ప, జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమాచారి డిమాండ్ చేశారు. మండలంలోని హట్టి బేస్ క్యాంపులోని కుమురంభీం విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కమి టీ సమావేశంలో మాట్లాడారు. గతంలో జరి గిన 44 రోజుల సమ్మెలో గిరిజన శాఖ మంత్రి పాల్గొని పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. వర్కర్లకు టైంస్కేల్, ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు సురేఖ, సంపత్, బిజులాబాయి, లక్ష్మీబాయి, జారుబాయి, లలిత తదితరులు పాల్గొన్నారు. -
కొత్త వేతన ఒప్పందం ఎప్పుడో!
శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. దేశవ్యాప్తంగా కోలిండియా దాని సబ్సిడరీ కంపెనీల్లో పనిచేసే కార్మికుల వేతనాలకు సంబంధించిన కీలకమైన 11వ వేతన ఒప్పందం కాలపరిమితి జూన్ 30, 2026తో ముగుస్తుంది. జూలై 1, 2026 నుంచి 12వ వేజ్బోర్డు అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. 1వ వేజ్బోర్డు నుంచి 4వ వేజ్బోర్డు వరకు నాలుగేళ్ల ఒప్పంద కాలపరిమితితో ఒప్పందం జరగ్గా, ఆ తర్వాత నుంచి ఐదేళ్లకోసారి ఒప్పందం జరుగుతోంది. జూన్ 30 తర్వాత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేజ్బోర్డు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. నూతన వేజ్బోర్డు కోసం దేశ వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. జేబీసీసీఐ ఏర్పాటుకు ఒత్తిడి..ప్రతీ వేతన ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం కోలిండియా యజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలతో జాయింట్ బైపార్టియేట్ కన్సల్టేటివ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) పేరుతో కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇస్తారు. దీని ప్రకారం జాతీయ సంఘాలు తమ సభ్యుల పేర్లను అందజేస్తారు. కోలిండియా చైర్మన్ ఈ జేబీసీసీఐకి చైర్మన్గా వ్వవహరిస్తారు. జాతీయ సంఘాల సభ్యుల పేర్లను ఖరారు చేసిన తర్వాత పూర్తి కమిటీ స్వరూపం ఏర్పడి వేతన ఒప్పందం కోసం చర్చలు మొదలవుతాయి. ఈ ప్రక్రియకు ప్రతీసారి జాప్యం జరుగుతుండగా ఈసారి మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు, అలవెన్సుల పెంపు కోసం కార్మిక సంఘాలు తమ డిమాండ్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే 11వ వేతన ఒప్పందం 23 నెలల ఆలస్యంతో మే 20, 2023న జరిగింది. ఇందులో సగటు కార్మికుని బేసిక్ వేతనం రూ.6,973.30 పెంపుదల జరిగింది. ఈసారి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు తోడు, యుద్ధాల ప్రభావం కూడా వేతన ఒప్పందాలపై ఉంటుందని ఆయా కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా వరుస విజయాలతో రాజకీయ సుస్థిరతను సాధించుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కోసం తమ ఒత్తిడికి ఏమాత్రం దిగి వస్తుందోనన్న సందేహం కార్మిక సంఘాల నేతల్లో నెలకొంది.కేంద్రంపై ఒత్తిడి..నూతన వేతన ఒప్పందం కోసం జాతీయ సంఘాలు కేంద్రం, కోలిండియా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. గడిచిన రెండు వేజ్బోర్డుల సమయానికి బొగ్గు పరిశ్రమలు విస్తరించిన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అంతకు ముందు కంటే భిన్నంగా త్వరితగతిన వేజ్బోర్డు ఏర్పాటు, వేతన ఒప్పందానికి సహకరించాయి. ఈ వేతన ఒప్పందాన్ని నేషనల్ కోల్వేజ్ అగ్రిమెంట్(ఎన్సీడబ్ల్యూఏ) అని పిలుస్తారు. ఈసారి అలాంటి వాతావరణం లేకపోవడం, కోలిండియాలో షేర్ల విక్రయాలు, ప్రైవేటు బొగ్గు బ్లాకులు పెరిగి ప్రభుత్వ రంగ పరిశ్రమలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఈ సమయంలో వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు, ఒప్పందం ఎప్పుడు జరుగుతుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. -
● గృహ అవసరాల సిలిండర్పై రూ.29 పెంపు ● మూడు నెలల్లో రెండుసార్లు పెరుగుదల ● ఆదివారం నుంచే అమల్లోకి కొత్త రేట్లు ● జిల్లా ప్రజలపై రూ.27లక్షల అదనపు భారం
ఆసిఫాబాద్: గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి పెరి గింది. ప్రతీ సిలిండర్పై రూ.29 పెంచినట్లు ప్రకటించారు. కొత్త ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం, హార్మోజ్ జలసంధి వద్ద ఆంక్షలు కొనసాగుతుండటంతో ఇంధనం సరఫరాలో అంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పెట్రో, వంట నూనెల ధరలు మండుతున్నాయి. వంటనూనెలు లీటర్కు రూ.10 వరకు పెరిగాయి. మూడు నెలలతో పోలిస్తే ప్రముఖ బ్రాండ్ల వంట నూనెలు హోల్సేల్ మార్కెట్లో లీటర్కు రూ.161 నుంచి రూ.171 వరకు చేరాయి. ఈ పెంపు జిల్లాలోని పేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు గిరిజనులకు మోయలేని భారంగా మారింది. జిల్లా ప్రజలపై అదనపు భారంజిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, సుమారు 1.40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 28 వేలు డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేల కు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్ కనెక్షన్లు, 600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. మూడు నెలల క్రితం గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.60 పెరగడంతో రూ.982 కు చేరింది. తాజాగా మరోసారి రూ.29 పెంచడంతో రూ.1011కు చేరింది. దీంతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.27 లక్షల అదనపు భారం పడుతుంది. నిలకడ లేకుండా..గతంలో గ్యాస్ ధరలు నిలకడగా ఉండేవి. కానీ రెండేళ్లుగా ఒడిదొడులకు లోనవుతున్నాయి. 2022 మా ర్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండడర్ ధర రూ. 875 ఉండగా 2023 జనవరిలో రూ.976కు చేరింది. ఏప్రిల్లో సిలిండర్పై రూ.50 పెంచారు. జూన్లో మళ్లీ సిలిండర్పై రూ.50 పెంచడంతో రూ.1019 నుంచి రూ.1072కి చేరింది. గత ఆగస్టులో వంట గ్యాస్ రూ.1172 ధర ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై రూ.200 తగ్గిస్తూ ఊరట కలిగించింది. మరోసారి 2024 మార్చిలో సిలిండర్పై రూ. 100 తగ్గించింది. మళ్లీ గతేడాది సిలిండర్పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్ ధర రూ.922కు చేరింది. గత మార్చి 7న సిలిండర్పై రూ.60 పెరిగి రూ.982కు చేరింది. తాజాగా సిలిండర్పై రూ.29 పెంచడంతో రూ.1011 చేరింది. అంతేకాక డెలివరీ బాయ్స్ రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తుండటంతో వినియోగదారులు ఒక్కో సిలిండర్కు రూ.1061 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. టిఫిన్, టీ రేట్లకు రెక్కలుగృహ అవసరాల సిలిండర్తోపాటు వాణిజ్య సిలిండర్ల ధరల్లో కూడా నిలకడ ఉండటం లేదు. గత మార్చి 7న కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.115 పెరగడంతో రూ.2,144కు చేరింది. కమర్షి యల్ సిలిండర్ ధర పెరగడంతో జిల్లా కేంద్రంలోని హోటళ్ల యజమానులు సైతం అమాంతం రేట్లు పెంచారు. ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లపై అదనంగా రూ.10 పెంచారు. ప్లేట్ ధర రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.50కి చేరింది. అలాగే టీ సైతం రూ.10 నుంచి రూ.13కి పెంచి అమ్ముతున్నారు. -
సదస్సుకు తరలిన టీబీజీకేఎస్ నాయకులు
రెబ్బెన: గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఆధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు బెల్లంపల్లి ఏరియా నుంచి ఆ యూనియన్ నాయకులు పెద్దఎత్తున తరలివెళ్లారు. బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణే ధ్యేయంగా టీబీజీకేఎస్ పోరాటం చేస్తోందని అన్నారు. తమ హయాంలో కేసీఆర్ సహకారంతో సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించామన్నారు. వాటిని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం కాలరాస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏరియా నాయకులు కార్నాథం వెంకటేశ్, తిరుపతి, బొంగు వెంకటేశ్, చందర్ తదితరులు పాల్గొన్నారు. -
చెలిమలలో బర్డ్వాక్
తిర్యాణి: ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మండలంలోని చెలిమల వాగు ప్రాజెక్టు ఆవరణలో బర్డ్వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజ్ అధికారి రమాదేవి మాట్లాడుతూ చెలిమల వాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో దాదా పు 180కి పైగా అరుదైన పక్షి జాతులు ఉన్నట్లు తెలి పారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, క్షేత్రస్థాయిలో వన్యప్రాణుల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. డెక్కన్ బర్డర్స్ సభ్యులు, జెడ్పీ పాఠశాల విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలపై తక్షణమే స్పందించాలి
వాంకిడి: వర్షాకాలంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని డీపీవో భిక్షపతి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని సవాతి, దొడ్డిగూడ గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షణ, వనమహోత్సవం, మ్యాజిక్ ఇంకు డు గుంతల నిర్మాణం, దోమల నివారణ, స్వచ్ఛత, పారిశుద్ధ్యం, తదితర అంశాలు వివరించారు. అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా నాటే మొక్కల సంరక్షణను అందరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. సమగ్ర ఓటరు సవరణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరద ప్రభావిత గ్రామాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కవిత, ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న, ఎంపీవో ఖాజా అజీజుద్దీన్, ఏవో గోపికాంత్, ఏపీవో శ్రావణ్ కుమార్, సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ పథకాలు
కాగజ్నగర్టౌన్: అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు. శనివారం పట్టణంలోని 8, 9, 10, 11, 12 వార్డుల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు, పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా తమ కాలనీలో డ్రెయినేజీలు ఆక్రమణకు గురికావడంతో వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని, సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు వినతిపత్ర ం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్ కమిషనర్ తిరుపతి, సీఐ ప్రేంకుమార్, కౌన్సిలర్ గజ్జెల లావణ్య, గజ్జెల లక్ష్మన్, ము న్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి
రెబ్బెన: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్ అన్నారు. శనివారం మండలంలోని తుంగెడలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ నిబంధనలు, మహిళాలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, ఈవ్టీజింగ్ వంటి నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం షీ టీంలు, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో డయల్ 100, డయల్ 112 నంబర్లను సంప్రదించి తక్షణ సహాయం పొందవచ్చన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1030 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలగాణి బుచ్చక్క, ఎంపీడీవో శంకరమ్మ, ఎస్సై వెంటకరమణ, డిప్యూటీ తహసీల్దార్ లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎస్పీఎం కార్మికులకు నిరాశే మిగిల్చారు
కాగజ్నగర్టౌన్: జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి సభలో ఎస్పీఎం కార్మికుల సమస్యలపై మాట్లాడుతారని అనుకుంటే వారికి నిరాశే మిగిల్చారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 17 రోజులుగా కార్మికులు రిలే నిరహారదీక్షలు చేస్తున్నా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పట్టించుకోకపోవ డం దారుణమన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం కార్మికుల సమస్యలపై మాట్లాడకుండా వెళ్లి పోయారని విమర్శించారు. తమగోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన కార్మికులను పోలీస్స్టేషన్కు తరలించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి వెంటనే స్పందించి మిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. -
నో పైరవీ.. నో రెక్వెస్ట్
సాక్షి, ఆదిలాబాద్: ఆదాయం అధికంగా ఉండే శా ఖల్లో ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ చోటు చే సుకుంటుందంటే అందులో పైరవీలు, రెక్వెస్టులు సాధారణం. జిల్లాకు వచ్చేందుకు ఆ అధికారి జోరుగా పైరవీ చేస్తున్నారట.. రాష్ట్ర మంత్రిని కలిశారట.. మరో ఆఫీసర్ రెక్వెస్ట్ పెట్టుకున్నాడట.. అందుకోసం రూ.లక్షలు కూడా సమర్పించుకునేందుకు వె నకాడటం లేదట.. అనే చర్చ సాగుతోంది. అయితే ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా బాస్ డిప్యూటీ కమిషనర్(డీసీ), నాలుగు జిల్లాలకు డీపీఈవోలుగా కొత్త అధికారులు త్వరలో రావడం ఖాయమని తేలింది. అయితే ఎవరు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో పోస్ట్ కావాలని పైరవీ చేసుకోలేదని, రెక్వెస్ట్ మాటే లేదనే చర్చ సాగుతోంది. పనిష్మెంటు పైనే కొత్త అధికారులను పైనుంచి పంపుతారని చెప్పుకోవడం గమనార్హం. రెండు నెలల క్రితం ఎక్సైజ్శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియ చోటుచేసుకుంది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలకు ప్రమోషన్ లభించింది. డిప్యూటీ కమిషనర్ వరకు పదోన్నతులు అందాయి. తాజాగా వారికి పోస్టింగ్ కేటాయింపు ప్రక్రియ చోటు చేసుకుంటుంది. పక్కనున్న పలు ఉమ్మడి జిల్లాలకు ఆఫీసర్లుగా వచ్చేందుకు పలువురు పైరవీలు,రెక్వెస్ట్లు చేసుకుంటుండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు. ఆ జిల్లాలో ‘పచ్చగడ్డి బాగుంటుందని, ఆ జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎండుగడ్డి మాత్రమేనని’ అందుకే ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ సుముఖంగా ఉండరని, ఆ శాఖలోని ఓ ఉద్యోగి పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగని ఉమ్మడి జిల్లాలో ఆదాయం ఉండదనే ది కాదని, ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఆ స్థాయిలో ఉండకపోవడంతోనే ఈ పరిస్థితి అని బాహాటంగానే చెప్పుకోవడం గమనించదగ్గ విషయం. కొరవడిన పర్యవేక్షణ.. ఉమ్మడి జిల్లా బాస్ డీసీ ఇన్చార్జిగా కొనసాగుతుండడంతో ఆయన అడపాదడపా వస్తుండడంతో ప ర్యవేక్షణ కొరవడింది. ఈ కార్యాలయంలోనే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ కూడా ఇన్చార్జితోనే నడిపిస్తున్నారు. రెండు కీలకమైన పోస్టుల్లో ఇన్చార్జీలు ఉండడంతో పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు లేకపోలేదు. ఇక ఏసీ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ ఫోర్సుల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇ టీవల జిల్లాలో గంజాయి సాగు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గుడుంబా కేసులు కూడా పో లీసులు దాడి చేసి పట్టుకునే పరిస్థితి ఉంది. పర్యవేక్షించే శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో నియంత్రణ కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా రఘురాం ఇన్చార్జి ఆఫీసర్గా కొద్ది నెలలుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ డీసీ కార్యాలయంలో అధికారిగా కొనసాగుతున్న ఆయన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ఇన్చార్జి డీసీగా కొనసాగుతున్నారు. పలువురు డీసీలుగా పదోన్నతులు పొందడంతో తాజా ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలకు బాస్ లను నియమించనున్నారని, రఘురాంను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి వేరే అధికారికి పోస్టింగ్ ఇవ్వడం ఖాయమని శాఖలో చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు డీపీఈవో (ఎకై ్సజ్ సూపరింటెండెంట్) లుగా హిమశ్రీ, నందా గోపాల్, జ్యోతి కిరణ్, రజాక్ కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా ఆ జిల్లాల్లో పనిచేస్తుండడంతో వారి బదిలీలు ఖాయం. వారి స్థానంలో కొత్త ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రానున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏ ఆఫీసర్ కూడా పైరవీ, రెక్వెస్టులు లేవని, అక్కడి నుంచి పంపే వారే ఇక్కడికి వస్తారని చెప్పుకుంటున్నారు. -
విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్అర్బన్: విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. శనివారం డీఈవో సచ్చిదానందచారితో కలిసి తిర్యాణి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మాణిక్యాపూర్లోని కేజీబీవీని సందర్శించారు. తరగతి గదులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో ఆకాంక్షిత బ్లాక్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
ఆసిఫాబాద్: వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ పరి సరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయడం వల్ల మురుగు నీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వార్డు సమస్యలు కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం, జెబాషేక్, ట్రాన్స్కో ఏఈ లక్ష్మీనారాయణ, నాయకులు సాయి శ్రావణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. -
నీట్ పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్రూరల్: ఈ నెల 21న నీట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హై దరాబాద్ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కిషోర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్యదేవరాజన్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం పటిష్ట బందోబస్తు మధ్య, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9న హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ స్సుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా నుంచి మండలానికి ఒక బస్సు చొప్పున 15 బస్సులలో స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఎస్పీ నితికా పంత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేశవరావు కమిటీని స్వాగతిస్తున్నాం
కాగజ్నగర్టౌన్: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేశవరావు కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉద్యమకారుల వేదిక కన్వీనర్ ఈర్ల విశ్వేశ్వర్రావు అన్నారు. శనివారం పట్టణంలోని పటేల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారునలు గుర్తించి జాబితా తయారు చేస్తామన్నారు. ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు కూడా నేడు ఉద్యమకారులుగా చెప్పుకుంటూ సర్టిఫికెట్ల పేరుతో రూ.500 చొప్పున వసూలు చేస్తున్న విషయం తమదృష్టికి వచ్చిందన్నారు. నిజమైన ఉద్యమకారులు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే హరీశ్బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యలో త్వరలోనే చైర్మన్ కేశవరావును కలుస్తామన్నారు. సమావేశంలో నాయకులు సుభాష్, పాల్వాయి సుధాకర్రావు, సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, రమేశ్గౌడ్, జయదేవ్, అబ్రహం, తుమ్మ రమేశ్, దుర్గం విస్తారు, జాడి కేశవ్, గోగర్ల కన్నయ్య, తాజ్బాబా, కొప్పుల శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
పర్సనల్ హెచ్వోడీగా కిరణ్బాబు బాధ్యతలు
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా పర్సనల్ హెచ్వో డీగా డీజీఎం కిరణ్బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హెచ్వోడీగా పనిచేసిన ఎస్వీ రాజేశ్వర్రావు ఎస్టీపీపీకి బదిలీ కాగా.. అక్కడ పనిచేస్తున్న కిరణ్బాబు బెల్లంపల్లి ఏరియాకు వచ్చారు. డిపార్టుమెంట్ ఉద్యోగులు నూతన డీజీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎస్టీపీపీకి బదిలీపై వెళ్తున్న పర్సనల్ డిపార్టుమెంట్ డీవైపీఎం రాజేశ్వర్రావును శుక్రవారం గోలేటి టౌన్షి ప్లో జీఎం శ్రీరమేశ్, అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, డీజీఎంలు ఉజ్వల్కుమార్, కిరణ్బాబు, మదీనా బాషా, అన్ని విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఎస్పీఎం గేటు ఎదుట బహిరంగ సభ
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టులో వేసిన పిటిషన్ రద్దు చేసుకోవాల నే డిమాండ్తో త్వరలో ఎస్పీఎం గేటు ఎదుట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని జేఏసీ సంఘాల నాయకులు తెలిపారు. పట్టణంలో ని దీక్ష శిబిరం వద్ద శుక్రవారం జేఏసీ నాయకులు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ వర్కర్స్ యూనియన్ల నుంచి ఇద్దరి చొప్పున కమిటీ ఏర్పాటు చేశామని, జేఏసీ కన్వీనర్గా గోగర్ల రాములు, కోకన్వీనర్గా వెంకటేశంను ఏకగ్రీవంగా ఎ న్నుకున్నామని తెలిపారు. సభ అనంతరం చలో ఆదిలాబాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ ముట్టడి చేపడుతామన్నారు. శ్రీనివాస్, సురేందర్, రమణయ్య, నానాజీ, వెంకటేశం, ముంజం శ్రీనివాస్, రాజేశ్, ఓదెలు వేణుగోపాల్, కన్నయ్య, పోచం పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పెంచికల్పేట్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పెంచికల్పేట్ ఫారెస్ట్ డివిజన్లో ఎస్పీ నితిక పంత్, డీఎఫ్వో బాలామణి, అదనపు ఎస్పీ చిత్తరంజన్లతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువులను వాడితే ప్రకృతిని కాపాడుకోవచ్చన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రత పెరగడం, నీటి లభ్యత తగ్గడం మానవాళి మనుగడకు ప్రమాదమని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడాలని, ప్రతీ వర్షపు నీటి బొట్టును భూమిలో ఇంకేలా చూడాలన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్య, రేంజ్ అధికారి అనిల్కుమార్, సర్పంచ్ రాంచందర్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. యాప్లోనే ఇసుక అనుమతులుకాగజ్నగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా ను అరికట్టేందుకు మన ఇసుక వాహనం యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, యాప్లోనే స్లాట్ బుక్ చేసుకుని ఇసుక అనుమతులు పొందాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ సమీపంలోని వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం అడ్డుకుని అనుమతి పత్రాలు పరిశీలించారు. సరైన అనుమతులు లేకుండా వాగులు, ఒర్రెల నుంచి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘బడిబాట’ విజయవంతం చేయాలిఆసిఫాబాద్రూరల్: బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానంద, చారి, డీటీడీవో రమాదేవితో కలిసి ఎంఈవోలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాం, నోట్బుక్స్ అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్వో శ్రీనివాస్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, డీఎల్పీవో ఉమర్ హ్సుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
షీర్వాల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు
కెరమెరి: షీర్ వాల్ టెక్నాలజీతో 15 రోజుల్లో నే కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల సీఎం పర్యట నలో నిర్మాణ పనులు సైతం పరిశీలించారని పేర్కొన్నారు. బుధవారం కాంక్రీట్ పోయగా, గురువారం డీషెటరింగ్ చేసినట్లు వివరించా రు. సివిల్ పనులన్నీ పూర్తయ్యాయని, మిగిలి న పనులు త్వరలో చేపడతామని తెలిపారు. శుక్రవారం హౌసింగ్ అధికారులు ఇంటిని పరిశీలించారు. త్వరలో గృహ ప్రవేశానికి సిద్ధం చేసుకోవచ్చని హౌసింగ్ డీఈ వేణుగో పాల్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీశ్కుమార్, సర్పంచ్ శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా బాక్సింగ్ పోటీలు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని బాలబారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు అట్టహాసంగా నిర్వహించా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ వి భాగాల్లో ప్రతిభ చూపిన 25 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. అనంతరం విజేతలకు బ హుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ దస్తగిర్, ముత్తు బాక్సింగ్ క్లబ్ చైర్మన్ శివకుమార్, కార్యదర్శి మదురై శేఖర్, వైస్ ప్రెసిడెంట్ జయేందర్, ఎస్సై మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
రుణం.. అధనం
తిర్యాణి: స్వయం ఉపాధి కల్పనకు మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు మరింత అందనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ లక్ష్యాన్ని పెంచుతూ ఖరారు చేశారు. అతివలు స్వయం ఉపాధిలో రాణించేలా సోలార్ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వ్యాపారులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి రుణాలు ఉపయుక్తంగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధిలో రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేస్తోంది. ఆర్థిక చేయూత అందిస్తూ ఏటా తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తుంది. సభ్యులు తీసుకున్న మొత్తాలను నెలవారీ వాయిదాల రుణంలో తిరిగి చెల్లిస్తుంటారు. ఈ ఏడాది రూ.239.77 కోట్ల చెల్లింపులుజిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏటా పరిమితికి మించి బ్యాంకులు రుణాలు చెల్లిస్తున్నాయి. గత ఆర్థిక సంవతర్సంలో రూ.232 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే లక్ష్యానికి మించి రూ.234 కోట్లను సంఘాలకు చెల్లించారు. ఈ నేపథ్యంలో 2026– 27 ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితి మరింత పెంచారు. జిల్లాలో 8,163 సంఘాలకు రూ.239.77 కోట్ల రుణాలు చెల్లించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. దీంతో ఈ ఏడాది మరిన్ని సంఘాలకు రుణాలు అందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కాగజ్నగర్ మండలంలో రూ.27.46 కోట్లు, ఆసిఫాబాద్లో రూ.20.92 కోట్లు, వాంకిడి మండలంలో రూ.19.25 కోట్లు అందించనుండగా, అత్యల్పంగా పెంచికల్పేట్ మండలంలో రూ.8.09 కోట్లు, సిర్పూర్(యు)లో రూ.8.41 కోట్లు, లింగాపూర్లో రూ.9.37 కోట్లు చెల్లించనున్నారు. బస్సులు, సోలార్ ప్లాంట్తో అభివృద్ధి బాటప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం రుణాలకే పరిమితి కాకుండా స్వయం ఉపాధి పొందేలా ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, విద్యార్థుల యూనిఫాం కుట్టు పనులు, వడ్ల కొనుగోళ్లు తదితర పనులు అప్పగిస్తూ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే రెబ్బెన మండలం నంబాల గ్రామంలో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలిగిన సోలార్ ప్లాంట్ను రూ.6కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు దాదాపు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ను రూ.3.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇందులో వచ్చిన లాభాల్లో రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల సమైక్యలతోపాటు జిల్లా సమైక్యకు చెల్లిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను ఇటీవల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. అలాగే ఇప్పటికే జిల్లాలో 15 మండల సమైక్యల కోసం 15 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్సు ద్వారా ప్రతినెలా రూ.69,485 ఆదాయం సమకూరుతోంది.మండలాల వారీగా బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యంమండలం సంఘాలు లక్ష్యం (రూ.కోట్లలో) ఆసిఫాబాద్ 682 20.92 బెజ్జూర్ 467 15.21 దహెగాం 535 16.19 జైనూర్ 575 18.22 కాగజ్నగర్ 900 27.46 రెబ్బెన 690 18.93 సిర్పూర్(యు) 312 8.41 సిర్పూర్(టి) 507 13.84 వాంకిడి 743 19.25 తిర్యాణి 511 15.59 పెంచికల్పేట్ 267 8.09 లింగాపూర్ 279 9.37 కౌటాల 622 18.12 కెరమెరి 556 15.31 చింతలమానెపల్లి 517 14.79 మొత్తం 8,163 239.77 లక్ష్యం నిర్దేశించాం జిల్లాలో 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 8,163 మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.239.77 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించాం. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు అందించి రాష్ట్ర స్థాయిలో మన్ననలు అందుకున్నాం. అదే స్ఫూర్తితో ఈ ఏడాది సైతం టార్గెట్ చేరుతాం. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. – నరేందర్, డీపీఎం -
కుమురం భీం
7‘మినరల్’ పేరుతో దోపిడీ జిల్లా కేంద్రంలో మినరల్ వాటర్ పేరుతో కొందరు దోపిడీకి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాలపై అధికారుల నిఘా కరువైంది. 9లోuఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సాయంత్రం పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాలలో మాయలేడీలు..! మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలు రుణాలు ఇప్పిస్తామంటూ వసూళ్లకు పాల్ప డుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఐడీ కార్డులు కూడా జారీ చేశారు. 8లోuశనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026 -
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
ఆసిఫాబాద్రూరల్: అంకితభావంతో పనిచేస్తే ఉపాధ్యాయులు గుర్తింపు పొందుతారని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం 2025– 26 విద్యాసంవత్సరంలో ఉత్తమ సేవలు అందించిన 200 మంది ఉపాధ్యాయులు, ప్రతిభ చూపిన 800 మంది విద్యార్థులకు సంబంధించిన ప్రశంసాపత్రాలను సంబంధిత ఎంఈవోలకు అందజేశారు. డీఈవో మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభ్యన్నతికి నిరంతర కృషి, విధి నిర్వహణలో అంకితభావం, 90 శాతానికి పైగా హాజరు, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో క్రమశిక్షణకు కృషి చేసిన ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ ప్రశంసాపత్రాలు పంపించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేసి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్టినేటర్ శ్రీనివాస్, కమ్యూనిటీ కోఆర్టినేటర్ కె.శ్రీనివాస్, ఎంఈవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్‘లెస్’ బస్సులు!
ఆసిఫాబాద్అర్బన్: నూతన విద్యాసంవత్సరం ప్రా రంభానికి సమయం ఆసన్నమవుతున్నా జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల ఫి ట్నెస్ను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా బ స్సులు సామర్థ్య పరీక్షలకు నోచుకోలేదు. విద్యార్థులను తరలించేందుకు 91 బస్సులు వినియోగిస్తుండగా, ఇందులో ఇప్పటివరకు కేవలం 52 బస్సుల కు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించారు. మరో వైపు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా మే 15 నుంచి జూన్ 12 వరకు రవాణా శాఖ అధికారులు వా హన సామర్థ్య పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో పరిస్థితి ఇలా..జిల్లావ్యాప్తంగా 116 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వాటిలో 31,116 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని తరలించేందుకు యాజమాన్యాలు 91 బస్సులను నడిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పాఠశాలలు, కళాశాలలు మూసి ఉండటంతో యా జమాన్యాలు బస్సులను సాధారణంగా వాడకుండా ఉంచుతాయి. చాలామంది అద్దె కోసం సభలు, స మావేశాలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తుంటాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల ల ప్రారంభం నాటికి ఫిట్నెస్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. ఆ తర్వాతే బస్సులను రోడ్లపైకి అనుమతిస్తారు. ఇప్పటివరకు జిల్లాలోని 91 బస్సుల్లో కేవలం 52 బస్సులు మాత్రమే ఫిట్నెస్ చేయించుకోగా, మిగిలిన 39 బస్సులకు త్వరగా పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. జూన్ 12వ తేదీ తర్వాత ఫిట్నెస్ పత్రాలు, సరైన అనుమతులు లేని బస్సులు రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులపైనా బాధ్యతచిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపించే తల్లి దండ్రులు పాఠశాలలో సదుపాయాలు, తరగతి గ దులు, బోధనా విధానంతోపాటు ప్రైవేట్ బస్సులపైనా దృష్టి సారించాలి. బస్సులు కండిషన్లో ఉ న్నాయా.. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారా..? అనే విషయాలపై ఆరా తీయాలి. అర్హత కలిగిన డ్రైవర్ ఉన్నారో లేదో గమనించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఆటోలు, ఇతర వాహనాల్లో పంపించేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.నిబంధనలు ఇవే.. -
పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
కాగజ్నగర్టౌన్: పట్టణ పరిశుభ్రతపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. పట్టణంలోని రాజీవ్గాంధీ చౌర స్తా, తిరందాజ్ టాకీస్ వరకు గల రోడ్డును గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురుగు కాలువలు శుభ్రపర్చాలని, తడిపొడి చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గురుకృప టిఫిన్ నిర్వాహకులు వినియోగించిన ప్లేట్లను రోడ్డుపై పడివేయగా, యజమానికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతిని ఆదేశించారు. దుకాణాల యజమానులు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను చెత్తకుండీల్లో వేయాలని సూచించారు. వీరి వెంట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, సిబ్బంది ఉన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలుఅనుమతులు లేకుండా ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. కాగజ్నగర్ మండలంలోని గన్నారం, మండువ, ఆరెగూడ, అనుకోడ గ్రామాల్లోని చెరువులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను నజ్రుల్నగర్ విలేజ్ నం.12 సమీపంలో అడ్డుకున్నారు. అనుమతులు, సరైన పత్రాలు లేకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ మధుకర్, సిబ్బంది ఉన్నారు. పకడ్బందీగా ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణఆసిఫాబాద్: జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 నుంచి 24 వరకు బూత్స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించి ధ్రువపత్రాలు జత చేసిన ఫారాన్ని తిరిగి తీసుకుని బీఎల్వో యాప్లో వివరాలు నమోదు చేయాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని 320, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని 358 పోలింగ్ కేంద్రాల్లో హేతుబద్ధీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు జమీల్, డీటీలు శ్యాంలాల్, రామ్లాల్, సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో నిందితులకు శిక్షపడేలా క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ కాస్తూ డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందించాలని ఆదేశించారు. అనంతరం అన్ని పోలీసు స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్) చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు పథకాలు అందించడమే లక్ష్యం
ఆసిఫాబాద్అర్బన్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యక్రమంలో భాగంగా గురువారం ఆసిఫాబా ద్ మండలం బాబాపూర్ పంచాయతీలో గ్రామ స భ నిర్వహించారు. అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయ న మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన ఉండాలని, ఇంటి వద్దే పొడి, తడి చెత్తను వేరు చేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో కాలువల శుభ్రత పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల వ్యా ప్తిని అరికట్టేందుకు పరిశుభ్రత పాటించాలన్నారు. రైతులు పంటల మార్పిడి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని, నీటి లభ్యత, మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులను అనుసరించాలని కోరారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రాముఖ్యత, ఓటరు జాబితా నవీకరణలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మౌనిక, సర్పంచ్ రాజన్న, ఉపాధిహామీ ఏపీవో బుచ్చన్న, పంచాయతీ కార్యదర్శి దేవరాజ్ పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన జీఎం
ఆసిఫాబాద్: సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీరమే శ్ గురువారం కలెక్టర్ కె.హరితను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. బొగ్గు ఉత్పత్తి, కొత్త గనుల విస్తరణ పై సుదీర్ఘంగా చర్చించారు. బెల్లంపల్లి ఏరి యాలో అభివృద్ధిలో గోలేటి ఓపెన్ కాస్ట్ గని ఎంతో కీలకమైందని, త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం కేవలం ఒక్క ఖైరిగూర ఓసీ నుంచి మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. భవిష్యత్లో ప్రారంభం కానున్న గనులు, ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న వివిధ మైనింగ్ ప్రాజెక్టుల వివరాలను అందించారు. కొత్తగనుల ప్రారంభానికి ప్రభుత్వపరంగా అనుమతులు వేగంగా లభించేలా జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందించాలని కోరారు. -
కుమురం భీం
7దస్నాపూర్లో అగ్నిప్రమాదం దస్నాపూర్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రెండిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. 8లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం అక్కడక్కడ ఉరుములతో వర్షం కురుస్తుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు ఊరట! రాష్ట్రప్రభుత్వం ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది. ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 8లోu శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026 -
పంట మారుద్దాం..
ఎల్నినోను ఎదుర్కొందాం.. కౌటాల: రుతుపవనాల రాకకు ముందే అడపాదడ పా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు సాగు కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చేలు సిద్ధం చేసుకు ని భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయి తే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ ర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగుపై కాకుండా.. పంట మార్పిడి విధా నం పాటించాలని వ్యవసాయ అధికారులు సూచి స్తున్నారు. తక్కువ నీటితో పంటలు పండిస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చంటున్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి పంట మార్పిడి చేసుకుంటే భూసారం పెరుగుతుందని, తెగుళ్ల బెడదను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. తగ్గుతున్న పత్తి దిగుబడులుజిల్లాలో 4.50లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు పండిస్తుండగా, అందులో అత్యధికంగా 3,70,919 ఎకరాల్లో తెల్ల బంగారంగా పిలిచే పత్తి, ఆ తర్వాత 42,228 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. 2010 త ర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ప్రారంభంలో ఎర్ర నేల్లో 10 క్వింటా ళ్లు, నల్లరేగడి నేలల్లో 15 క్వింటాళ్ల దిగుబడి రాగా కాలక్రమేణ పరిస్థితులు మారాయి. చీడపీడల ఉధృతి పెరగడం, వరదలు ముంచెత్తడం, ఇతర కారణా లతో ప్రస్తుతం ఎకరానికి 2 నుంచి 5 క్వింటాళ్లు మించడం లేదు. ఏళ్లుగా సేంద్రియ ఎరువులు విని యోగించకపోవడం, రసాయనిక ఎరువులపైనే ఆ ధారపడుతుండటంతో నేలలో కార్బన్, సూక్ష్మపోషకాలు లోపిస్తున్నాయి. మరోవైపు నకిలీ పత్తి విత్తనా లు జిల్లా రైతులను నిండా ముంచుతున్నాయి. నష్టాలు ఉన్నా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించకపోవడంతో కోలుకోలేకపోతున్నారు. తగ్గిన సోయా, కంది సాగుజిల్లా రైతులు పత్తి, వరి పంటల సాగుపైనే అధికంగా ఆధారపడుతున్నారు. వర్షాధార పంటల్లో పత్తి సాగుదే ప్రథమ స్థానం. పదేళ్ల క్రితం లక్ష ఎకరాల్లో సాగు చేసిన సోయా పంట ప్రస్తుతం జిల్లాలో కేవలం వందల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. కంది సైతం 40 వేల ఎకరాల నుంచి సగానికి పడిపోయి 20వేల ఎకరాల్లో మాత్రమే సాగవుతుంది. మరోసారి ఎల్నినో ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారిస్తే మేలు. స్వల్పకాలిక పంటల సాగుతో నష్టాలు కూడా తక్కువగా ఉంటాయి. పత్తి సాగుతో నష్టాలు ఏళ్ల తరబడిగా పత్తి సాగు చేస్తున్నా. ఒక ఏడాది దిగుబడి వస్తే మరోసారి రాదు. ఆరేళ్లుగా పెట్టుబడులు కూడా రావడం లేదు. నష్టాలే తప్ప మిగులు ఉండటం లేదు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం కూడా అందడం లేదు. రైతులు నష్టపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా.. – దామోదర్, యాపలగూడ, మం.కౌటాల అవగాహన కల్పిస్తున్నాం రైతులు ఏటా ఒకే రకమైన పంటలు సాగు చేస్తే క్రమేనా దిగుబడి తగ్గుతుంది. పంట మార్పిడితో నేలసా రం పెరగడంతోపాటు తెగు ళ్లు తగ్గుతాయి. సేంద్రియ ఎరువుల వాడకంతో పెట్టుబడులు అదుపులో ఉంచుకోవచ్చు. పంట మార్పిడి, పంట సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పి స్తున్నాం. – వెంకటి, జిల్లా వ్యవసాయ అధికారి తొందరపడి విత్తుకోవద్దు ఎల్నినో ప్రభావంతో ఈసా రి వర్షపాతం తక్కువగా న మోదయ్యే అవకాశం ఉంటుంది. అన్నదాతలు దీర్ఘకా లిక పంటలు కాకుండా స్వ ల్పకాలికల సాగుకు సిద్ధం కావాలి. వర్షం పడిన వెంటనే రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకో వద్ద. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలపై దృష్టి సారించాలి. – డా.శ్రీనివాస్, ప్రొఫెసర్, కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన శాఖ యూనివర్సీటీ జిల్లాలో సాగు వివరాలు ఇలా చేస్తే మేలువ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొల్లాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరుప, టమాటా, క్యాబేజీ, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేయకూడదు. ఆకు ముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సొయచిక్కుడు వేయకూడదు. యాసంగిలో వేరుశనగ వేసుకున్న రైతులు ఖరీఫ్లో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభి స్తోంది. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. కంది, శనగ పైర్లను వరసగా వేస్తే కాయతొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సొయ చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలువ, మెట్ట వరితో పంట మార్పిడి చేసుకోవాలి. వరి వరుసగా సాగు చేయకుండా పప్పు ధాన్యాలు, నూనెగింజలు పండించాలి. పంటను మారిస్తే చీడపీడల ఉధృతి తగ్గుతుంది. -
న్యూస్రీల్
రేపు మినీ జాబ్మేళా ఆసిఫాబాద్అర్బన్: కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 6న(శనివారం) ఉదయం 10 గంటలకు మినీ జాబ్మేళా నిర్వహిస్తున్న ట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 91605 08476, 79897 73351 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పాలిటెక్నిక్లో ప్రవేశాలు షురూ రెబ్బెన: మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ మొదలైందని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరమేశ్ తెలిపారు. సింగరేణి ఉద్యోగుల వారసుల కోసం ప్రత్యేకంగా 150 సీట్లు కేటాయించారన్నారు. సివిల్ ఇంజినీరింగ్లో 30, కంప్యూటర్ సైన్స్ 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ 30, మెకానికల్ ఇంజినీరింగ్ 30, మైనింగ్లో 30 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 8లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల వెబ్సైట్ లేదా 87901 12515, 99081 51618, 90102 22161 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ
కాగజ్నగర్టౌన్: జిల్లాలో శుక్రవారం నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్12 వరకు కొనసాగే పరీక్షలకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 530 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు హాల్టికెట్తో గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏర్పాట్లు పూర్తిపదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ జెడ్పీహెచ్ఎస్(బాలికలు), కాగజ్నగర్(సర్సిల్క్) జెడ్పీహెచ్ఎస్(బాలికలు), సిర్పూర్(టి) జెడ్పీహెచ్ఎస్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 530 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 18 మంది ఇన్విజిలేటర్లు, ఒక అబ్జర్వర్, ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తదితరులు విధులు నిర్వహించనున్నారు. ప్రతీ కేంద్రం వద్ద నిఘా టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో అన్నిఏర్పాట్లు చేశాం. మూడు కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీసు నిఘా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకున్నాం. – సచ్చిదానంద చారి, జిల్లా విద్యాశాఖ అధికారి -
ప్రీప్రైమరీ.. మరింత బలోపేతం
కాగజ్నగర్టౌన్: ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్లు నిండగానే ఆ స్కూళ్లలో నే చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు లేకపోవడంతో ప్రవేశాలు తగ్గుతున్నాయని విద్యాశాఖ గుర్తించింది. ఈ క్రమంలో సర్కా రు బడుల్లోనూ విడతల వారీగా ప్రీప్రైమరీ తరగతులు అమలు చేస్తోంది. 2020 జాతీయ విద్యావిధానా న్ని అనుసరించి జిల్లాలో ఇప్పటికే 41 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య కొనసాగుతోంది. 2026– 27 విద్యాసంవత్సరంలో మరో 77 పాఠశాలల్లో అమలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఇన్స్ట్రక్టర్ల నియామకానికి జిల్లా విద్యాధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 60 ఉన్నత పాఠశాలలు, 101 ప్రాథమికో న్నత, 561 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 2026– 27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాల్లో ప్రీప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో కొత్తగా 77 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించేందు కు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జి ల్లాలో ఇప్పటికే 41 ప్రీప్రైమరీ పాఠశాలు కొనసాగుతుండగా కొత్తవాటితో కలుపుకొని ఆ సంఖ్య 118కి చేరింది. జూన్ 12 నుంచి జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా పాఠశాలల్లో ఇన్ఫ్రాస్టక్చర్, ఫర్నీచర్, ఇండోర్, ఔట్డోర్ ఆట వస్తువులు, పెయింటిగ్స్ వంటి ఏర్పాట్ల కోసం ప్రతీ స్కూల్కు రూ.1.70 లక్షల చొప్పున కేటాయించనున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలు, అక్షరమాలలు, జంతువులు, పక్షులు బొమ్మలు వేయించనున్నారు.దరఖాస్తుల ఆహ్వానంఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో 2026– 27 విద్యా సంత్సరానికి మంజూరైన 77 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఒక్కొక్క పాఠశాలకు ఒక్కరి చొప్పున ఇన్స్ట్రక్టర్, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9వ తేదీలోపు విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు చే సుకోవాలని సూచించారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు ఏడో తరగ తి పాసై ఉండాలని తెలిపారు. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయా పోస్టులకు రూ.6 వేల చొప్పున పది నెలలు గౌరవ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన ప్రీప్రైమరీ స్కూళ్లు ఇలా.. మండలం ప్రీప్రైమరీ పాఠశాలలు ఆసిఫాబాద్ 9 కెరమెరి 4 జైనూర్ 7 రెబ్బెన 3 కాగజ్నగర్ 22 దహెగాం 15 చింతలమానెపల్లి 5 బెజ్జూర్ 3 కౌటాల 5 పెంచికల్పేట్ 3 సిర్పూరు(టి) 1 154 మందికి ఉద్యోగావకాశంజిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలల్లో పనిచేసేందుకు 154 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. తాత్కాలిక పద్ధతిలో ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయాను నియమించనున్నారు. వీరికి గౌరవ వేతనంగా నెలకు రూ.8 వేలు, రూ.6 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి త్రీ మెన్ కమిటీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. పాఠశాలల్లో వచ్చేనెల ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
హెల్మెట్తో ద్విచక్ర వాహనదారులకు రక్షణ
● ఎస్పీ నితిక పంత్ ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లతో రక్షణ ఉంటుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. కంచుకోట, గాంధీచౌక్, ప్రభుత్వ ఆస్పత్రి, పైకాజీనగర్ మీదుగా మెయిన్ రోడ్ వరకు రోడ్డు భద్రతా పరిస్థితులు పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్ ధరించాలని సూచించారు. మ ద్యం తాగి వాహనాలు నడిపితే ప్రాణపాయం ఏర్పడుతుందని, కుటుంబ సభ్యులకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా హెల్మె ట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను అభినందిస్తూ ‘బెస్ట్ సిటిజన్స్ ఇన్ ఆసిఫాబాద్’గా కొని యాడారు. మెరుగైన సేవలందించేందుకు సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ కార్యాలయాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వర కు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపా రు. ప్రజలు నేరుగా ఫిర్యాదులు, సమస్యలను అధి కారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఇన్స్పెక్టర్లు రమేశ్, వేణుగోపాల్, ఎస్సైలు మధుకర్, రవికుమార్, విక్రమ్, మహేందర్, ఉల్లాస్, శ్యా మ్రావు, మోహన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలిఆసిఫాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల కార్యాలయాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ చెరువులు, కాలువల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
కీలక అంశాలపై చర్చించాలి
● కలెక్టర్ కె.హరిత ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో కీలక అంశాలపై చర్చించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పైప్లైన్ లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని, క్లోరినేషన్ ప్రక్రియ నిరంతరం జరిగేలా చూడాలని ఆదేశించారు. డ్రెయినేజీలు, వీధులు నిత్యం శుభ్రం చేయాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేయింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో బూత్లెవల్ అధికారులు ఓటరు నమోదు, సవరణల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్ ఆదా, సమస్యల పరిష్కారాలపై ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రోత్సాహంతోపాటు నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వినతి
రెబ్బెన: కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్ అన్ఫిట్ అయిన సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్ డిమాండ్ చేశారు. గోలేటి సీహెచ్పీలో బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి డీవైజీఎం కోటయ్యకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నమ్మించి మోసం చేసిందన్నారు. ఏడాదిగా మెడికల్ బోర్డు నిలిపివేసి మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగ నియామకపత్రాలు అందించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. స్పందించని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు శ్రీనివాస్, ఏరియా నాయకులు విద్యాసాగర్, మురళీ, అజాబ్, శ్రీని వాస్, చిరంజీవి, జ్యోతి పాల్గొన్నారు. -
కార్పొరేట్లో ఇంటర్
ఆసిఫాబాద్అర్బన్: ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఇంటర్మీడియట్ కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదివించేందుకు కార్పొరేట్ విద్యాపథ కం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్యూషన్ ఫీజు, పాకెట్ మనీ అందిస్తూ విద్యార్థుల చదువుకు పూర్తి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 2026– 27 విద్యా సంవత్సరానికి ఉత్తమ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ విద్యార్థులు అర్హులుజిల్లాలో పదో తరగతి విద్యార్థులు మొత్తం 6,932 మంది వార్షిక పరీక్షలు రాయగా, ఇందులో 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యను అభ్యసించేందుకు జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్, కేజీబీవీలు, నవోద య, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారు అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదా యం రూ.2 లక్షలు, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. దరఖాస్తుకు మీసేవ కేంద్రాల నుంచి పొందిన కుల, ఆదాయ ధ్రువపత్రాలు, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువపత్రాలు జతపరచాలి. పదో తరగతిలో 400కు పైగా మార్కులు సాధించిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు. ఈ నెల 5 వరకు గడువుజిల్లాలో స్థానికంగా మెరుగైన విద్యా అవకాశాలు లేవు. ఎక్కువ మంది సమీపంలోని మంచిర్యాలతోపాటు కరీంనగర్, హైదరాబాద్ వంటి నగరా లకు వెళ్తుంటారు. పేద విద్యార్థులు కొంతమంది ఆర్థిక స్థోమత లేక మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. కార్పొరేట్ విద్యా పథకం కింద ఎంపికై న ఒక్కో విద్యార్థికి ట్యూషన్ ఫీజు కింద ప్రభుత్వం రూ.35 వేలు, పాకెట్ మనీగా రూ.3 వేలు చెల్లించనుంది. మీసేవ కేంద్రాల ద్వారా https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 5వ తేదీ వరకు గడువు ఉంది. జిల్లాలోని అర్హులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యాపథకం ద్వారా అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం జూన్ 5లోగా అర్హులైన విద్యార్థులు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్ కళాశాలనైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అర్హులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. – అశోక్ మదిరె, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి -
20న జాతీయ లోక్ అదాలత్
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఈ నెల 20న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ వీరయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్రతో కలిసి బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడే క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంకు, ఎలక్ట్రిసిటి, భూతగాదాలు, వివా హ, కుటుంబ తగాదాలు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ఫండ్, చెక్బౌన్స్ కేసులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
‘గిరి’ బడిలో చేరుదాం రండి..!
కెరమెరి: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది. తొలిరోజు హాస్టళ్లలో పాడైన వస్తువులు తొలగించి ఆవరణ, తాగునీటి ప్రాంతం, ఓహెచ్ఆర్ ట్యాంకులు శుభ్రపరిచారు. గ్రామ సభలు నిర్వహించి బడిబాట ఆవశ్యకతను వివరించారు. జిల్లాలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు 332 ఉండగా ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉన్నాయి. ఇందులో 13,126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు. గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే కార్యక్రమాలు ఉండగా, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆశ్రమాల షెడ్యూల్.. ఈ నెల 4న వంటశాలలు, డార్మెటరీలు, 5న తరగతి గదులు, కార్యాలయ గదులు, 6న సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయాలు శుభ్రం చేస్తారు. 8 నుంచి 10 వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల స్వీకరణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తారు. 11, 12 తేదీల్లో సిబ్బందితో సమావేశం, రికార్డుల నవీకరణ, విధుల కేటాయింపు, 17న సమగ్ర విద్య, బాలిక విద్యా దినోత్సవం, 18న డిజిటల్ తరగతి గదులపై అవగాహణ, 19న క్రీడాదినోత్సవం నిర్వహిస్తారు. ప్రతిరోజూ సమీక్షించాలిగతేడాది ఉన్న విద్యార్థులను వందశాతం నిలుపుదల చేయడంతోపాటు కొత్త వారిని బడిలో చేర్పించాలి. షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు కార్యక్రమాలు నిర్వహించాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఎస్సీఆర్పీలు ప్రతిరోజూ కార్యక్రమాలను సమీక్షించాలి. – పి.రమాదేవి, గిరిజనశాఖ సంక్షేమ అధికారి -
బాధ్యతలు స్వీకరించిన జీఎం
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా నూతన జనరల్ మేనేజర్గా బదిలీపై వచ్చిన శ్రీరమేశ్ బుధవారం గోలేటిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జీఎంగా పనిచేసిన విజయ భా స్కర్రెడ్డి పదవీ విరమణ పొందగా.. ఆయన స్థానంలో మణుగూరు ఏరియా నుంచి బది లీపై వచ్చిన శ్రీరమేశ్కు అధికారులు స్వాగ తం పలికారు. జీఎం మాట్లాడుతూ గతంలో ఏరియాలో పనిచేసిన అనుభవం ఉందన్నా రు. ఉత్పత్తిలో ఏరియాను మొదటిస్థానంలో నిలిపేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
నిరాశపర్చిన ముఖ్యమంత్రి పర్యటన
రెబ్బెన: జిల్లాకు వస్తే న్యాయం జరుగుతుంది.. అభివృద్దికి నిధులు మంజూరవుతాయని ఎదురుచూసిన జిల్లా ప్రజలను ముఖ్యమంత్రి పర్యటన నిరాశపర్చిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. గోలేటిలోని ఆఫీసర్స్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి సభకు అధ్యక్షతన వహించాల్సి ఉన్నా.. కనీసం మాట్లాడే అవకాశం కల్పించకుండా పక్కన పెట్టి అవమానపర్చడం సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రెండు నియాజకవర్గాలకు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదన్నారు. ఆసిఫాబాద్– ఆదిలాబాద్ రోడ్డు అధ్వానంగా మారిందని, అలాగే కాగజ్నగర్– సిర్పూర్, సిర్పూర్ –బెజ్జూర్, కాగజ్నగర్ –పెంచికల్పేట్ రోడ్లు దారుణంగా ఉన్నా నిధులు కేటాయించలేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని చెబుతున్నారని, ముందుగా డీపీఆర్ను సిద్ధం చేయాలని హితవు పలికారు. వరిధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. -
హామీలు అమలు చేయాలి
రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగి న మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి న ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హా మీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు అజ్మీర బా బురావు అన్నారు. ఉద్యమకారులు అజ్మీర బాబురావు, బోగే ఉపేందర్, కోట రాజయ్య, దుర్గం రవీందర్, సోగాల వామన్లను బుధవారం గోలేటిలో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిందన్నారు. హామీ మేరకు పెన్షన్, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గం తిరుపతి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు అరుణ్, సాంబగౌడ్, పంచాయతీ కార్యదర్శి రవీందర్, కారోబార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయం
ఆసిఫాబాద్రూరల్: హరితదళం(ఎన్జీసీ) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, నీటి వనరుల సంరక్షణ, వర్థ్యాల నిర్వహణ, మొక్కల పెంపకంపై సమ్మర్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. సమ్మర్ క్యాంపుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన బాబాసాగర్ హెచ్ఎం సత్యనారాయణ, పెంచికల్పేట్ హెచ్ఎం నిర్మల, వాంకిడి హెచ్ఎం నటరాజుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రకృతిపై బాధ్యతభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జాతీయ హరిత జిల్లాకోఆర్టినేటర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 11 నుంచి మాస్టర్ మైండ్స్ గూగుల్ మీట్ ఆన్లైన్ తరగతులు ప్రారంభమవుతాయని కలెక్టర్ కె.హరిత తెలిపారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఆన్లైన్ తరగతుల ప్రచార పోస్టర్ను జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం జిల్లా సైన్స్ అధికారి మధుకర్తో కలిసి ఆవిష్కరించారు. -
అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేం
ఆసిఫాబాద్అర్బన్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగా లను ఎప్పటికీ మరువలేమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. ప్రజల శాంతిభద్రతల రక్షణకు జిల్లా పోలీసుశాఖ కట్టుబడి ఉంటుందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపి ప్రభుత్వ గుర్తింపు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) చిత్తరంజన్, డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్ పాల్గొన్నారు. -
గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి
ఆసిఫాబాద్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామ సభల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించాలని, పర్యావరణం, అటవీ శాఖలపై చర్చించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మహిళల రక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత గురించి ప్రజలకు వివరించాలన్నారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం, మురుగు కాల్వల శుభ్రత, ప్లాస్టిక్ వ్యర్థాల తరలింపు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర ప్రకృతి విపత్తుల ప్రతిస్పందన బృందాలు, రెస్క్యూ బృందాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో నాలుగు రోజులపాటు సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేపై వివక్ష
ఆసిఫాబాద్: కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి బాట సీఎం సభలో ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అయిన తనపై వివక్ష చూపించారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభు త్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా మార్చారని, ఎన్నికల హామీలు ప్రశ్నిస్తానని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేను విస్మరించి.. పక్క జిల్లా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గుండి, లక్మాపూర్ వంతెనలు, కుమురం భీం, వట్టివాగు ప్రాజెక్టుల కాల్వల మరమ్మతులు, మెడికల్ కళాశాలలో బోధనా సిబ్బంది, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత, రోడ్ల దుస్థితి గురించి సీఎంకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నా అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రజాధనంతో బహిరంగ సభ నిర్వహించి ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని, వీటికి మళ్లీ సీఎం శంకుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నిచారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మ ద్, రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య, కౌన్సిలర్లు బాలకృష్ణ, నాగుబాయి, పట్టణ అధ్యక్షుడు అహ్మద్, నాయకులు అన్సార్, సాయిశ్రావణ్, నిసార్, అశోక్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్రం
కాగజ్నగర్టౌన్: ఉద్యమంలో అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చి గుర్తిసామని ప్రకటించిందన్నారు. ఇందుకు అనుగుణంగా ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు, ఉద్యమకారులు పాల్గొన్నారు. -
అవకాశం ఇవ్వలేదనడం హాస్యాస్పదం
కాగజ్నగర్టౌన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీఎం సభలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెరమెరి మండలం కోఠారిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు తెలిపా రు. ఉనికిని కోల్పోతున్నామని, పబ్బం గడుపుకొనేందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను సీఎంకు విన్నవించామని, త్వరలోనే ఆమోదం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు శారద, జ్యోతి, విజయ్కుమార్, నాయకులు దస్తగిర్, శ్యాంరావు, మెహరాజ్ హుస్సేన్, శ్రీను, సంతోష్ పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి పాత్ర కీలకం
రెబ్బెన: రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి పాత్ర ఎంతో కీలకమని బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ అన్నారు. గోలేటి టౌన్షిప్లో మంగళవారం సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపం, ప్రొ.జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేశా రు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గోలేటిలోని ప్రధాన రహదారి, కార్మిక కాలనీల్లో తెలంగాణ రన్ నిర్వహించారు. ఇన్చార్జి జీఎం మాట్లాడుతూ రాష్ట్ర, దేశ అవసరాలకు అనుగుణంగా సింగరేణి బొగ్గు అందిస్తోందని తెలిపా రు. ఉద్యోగులంతా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి భీమన్న స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలతో సేవా సమితి సభ్యులు, అధికా రులు వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం కేక్కట్ చేశారు. ప్రతిభ చూపిన ఉద్యోగులను శాలువా లతో సన్మానించారు. సేవా సమితి ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధిలో రాణిస్తున్న సభ్యులు, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అధికా రుల సంఘం ప్రతినిధి వీరన్న, ఇన్చార్జి సేవా అధ్యక్షురాలు నళిని నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపుతాం
కెరమెరి: ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. స్వగ్రామంలో దసరా పండుగ చేసుకున్నంత సంబురం కొత్తగూడలో కనిపిస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వేంనరేందర్రెడ్డి, కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, స్థానిక సర్పంచ్ మడావి శాంతాబాయితో కలిసి లబ్ధిదారులు సిడా కన్నిబాయి, ఆత్రం పోచుబాయి, టేకం పగ్గబాయి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. గ్రామ పటేల్ సిడాం భీంరావ్ కుటుంబానికి సీఎం నూతన దుస్తులు అందించారు. ఆత్రం పోసుబాయి ఇంట్లో ఇప్పపువ్వు లడ్డూ ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు అనేక దశల్లో కొనసాగుతున్నాయని, ఇప్పటికీ వాటికి బిల్లులు అందడం లేదన్నారు. త్వరగా బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ నితిక పంత్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ సంరక్షణకు నిరంతర కృషి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో అటవీ సంరక్షణ కు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమ ని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అ న్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రో జుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ సంరక్షణ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డీఎఫ్వో మాట్లాడుతూ అడవుల ప్రాధాన్యతను ప్రజలు స్వచ్ఛందంగా తెలుసుకుంటేనే సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో గోవింద్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేశ్, సరోజారాణి, ఝాన్సీరాణి, ఎఫ్ఎస్వోలు, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
గుడిసెలు లేని జిల్లాగా మారుస్తాం
రెబ్బెన/ఆసిఫాబాద్: పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ గిరిజన గూడెం, తండాలో గిరిజనులందరికీ నూరుశాతం ఇళ్లు మంజూరు చేసి, అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే మా ఆలోచన అని ముఖ్యమంతి రేవంత్రెడ్డి అన్నా రు. ఏ అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని ప్రారంభించినా ఈ గడ్డ నుంచే ప్రారంభిస్తున్నామని, సంవత్సరంలోగా గుడిసెలు లేని జిల్లాగా ఉమ్మడి ఆదిలాబా ద్ను మారుస్తామని అన్నారు. రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, వేంనరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్ రావు, కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్తో కలిసి హాజరయ్యారు. జిల్లాలో రూ.112 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ మావోయిస్టు నగేశ్ దంపతులతోపాటు పలువురు లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత కార్యక్రమాన్ని ఈ వేదిక మీద నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. తుమ్మిడిహెట్టితో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు. ఎలాంటి ఎత్తిపోతలు, విద్యుత్ ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే సాగునీరందిస్తామని అన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే రైతాంగం ఉప్పైనె కదులుతుందని హెచ్చరించారు. ఆద్యంతం.. ఉత్సాహభరితంముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్ నుంచి నేరుగా కెరమెరి మండలం కొత్తగూడకు చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్దకు చేరుకున్నారు. వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సభాస్థలి జనసంద్రంగా మారింది. రాత్రి 7.45 గంటల నుంచి గంటన్నరకు పైగా కొనసాగింది. మంత్రులు మాట్లాడిన అనంతరం సీఎం ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు వరిధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోళ్లు విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గంలో మంచిర్యాలకు వెళ్లారు. అయితే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ప్రత్యేక వరాలేవీ ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసింది. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఎస్పీలు నితిక పంత్, అఖిల్ మహాజన్ భద్రతను పర్యవేక్షించారు. రెండో విడత ఇళ్ల మంజూరు పత్రాలు ఇస్తున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు హాజరైన జనంప్రేంసాగర్రావుకు పెద్దపీటసభలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు ప్రత్యేక స్థానం దక్కింది. సభాస్థలికి చేరుకోగానే సీఎం ప్రేంసాగర్రావును వెంటబెట్టుకుని సభావేదికపైకి వచ్చారు. స్టేజీపై పక్కనే కూర్చొబెట్టుకున్నారు. ప్రేంసాగర్రావు జిల్లాలోని సమస్యలతోపాటు పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని, మంచిర్యాలలో ప్రభుత్వ యూనివర్సిటీ మంజూరు చేయాలని విన్నవించారు. సభను బహిష్కరించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మిబహిరంగ సభ మధ్య నుంచి ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ అధికారికంగా నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. ఐదుగురు మంత్రుల ప్రసంగం అనంతరం తనకు అవకాశం ఇస్తారని ఎదురుచూసినా అవకాశం దక్కలేదన్నారు. అర్హులందరికీ ఇళ్లు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతాం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వానికి గిరిజన ప్రాంతాలు, తండా ప్రజల కష్టాలు కనిపించలేదు. పేదోడి కష్టాన్ని ప్ర త్యక్షంగా చూసిన సీఎం రేవంత్రెడ్డి ప్రజలు ఆత్మగౌరవంతో ఉండాలని 4.5లక్షల ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేశారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా మంజూరు చేశాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు, 2.5 ఏళ్ల ప్రజాపాలన ప్రభుత్వానికి తేడా ఇదే. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మరో 2.5లక్షల ఇళ్లను అందిస్తాం. – పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి -
‘పుష్కరం’లో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది. ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువైంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి, జిల్లా పౌరుల తలసరి ఆదాయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్థికంగా మరింత మెరుగు కనిపిస్తోంది. నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
జీడీడీపీ(2024–25) స్థిర ప్రస్తుత ధరల్లో
జీడీడీపీలో మార్పులు ఒక జిల్లాలో ఒక ఏడాది కాలంలో జరిగిన అంతిమ వస్తుసేవల ఉత్పతిని జీడీడీపీ(స్థూల జిల్లా జాతీయోత్పత్తి)గా పరిగణిస్తారు. గత పన్నెండేళ్లలో జీడీడీపీ క్రమంగా పెరుగుతోంది. స్థిరప్రస్తుత13,470 26,37511,857 24,07811,565 23,0518,247 16,465ఆసిఫాబాద్నిర్మల్మంచిర్యాల -
బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం: సీఎం రేవంత్
ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లైంది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తాం. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో చర్చలకు యత్నిస్తున్నాం. మహారాష్ట్ర సీఎంతో మీటింగ్కు కిషన్రెడ్డి చొరవ చూపాలి. తుమ్మిడిహెట్టి నిర్మిస్తే లిఫ్ట్లు అవసరం లేదు.75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటున్నాం. మేం కొన్న ధాన్యాన్ని, మొక్కజొన్నను కేంద్రం తీసుకోవాలి.బీజేపీ నేతలు బస్సు యాత్రలు కాదు.. కేంద్రాన్ని ధాన్యం కొనమని చెప్పండి. లేదంటే అదేంటో తేలుస్తాం. ధాన్యాన్ని కిషన్రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం. లేకపోతే ఈ నెల 15 తర్వాత బీజేపీ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాం’ అని హెచ్చరించారు. -
బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తి రిమాండ్
ఉట్నూర్రూరల్: బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరిలించినట్లు ఉట్నూర్ సీఐ ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన భూక్యా దేవానాయక్ జీసీసీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. దేవానాయక్కు బ్యాంకులో రుణం ఇప్పిస్తానని నిందితుడు కడుకుంట్ల పరుశురాం నమ్మించి ఖాళీ చెక్కులు తీసుకుని దుర్వినియోగం చేస్తూ రూ.1.87 లక్షలు కాజేశాడు. బాధితుడు దేవానాయక్ ఫిర్యాదుతో నిందితుడిని అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు. ఎస్సై విజయ్ తదితరులు ఉన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసగిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటు్ల్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నీలిశెట్టి సాయిరాం విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూళ్లు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఉట్నూర్ బోయవాడకు చెందిన పెందుర్ కృష్ణవేణు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
బెల్లంపల్లి ఏరియా ఉత్తమ ఉద్యోగుల ఎంపిక
ప్రజ్వల శ్రీరెబ్బెన: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా బెల్లంపల్లి ఏరియాలో ఉత్పత్తి సాధన, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉత్తమ ఉద్యోగులను ఏరియా యాజమాన్యం ప్రకటించింది. కార్పొరేట్ స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా క్లోజ్డ్ మైన్స్ ఇన్చార్జి మేనేజర్ పి.మహేష్కుమార్ ఎంపికయ్యారు. ఏరియా స్థాయిలో ఖైరిగూర ఓసీపీలో ఈపీ ఫిట్టర్ ఆకుల రవి, ప్రత్యేక ఉత్తమ ఉద్యోగులుగా ఖైరిగూర ఓసీపీ అడిషనల్ మేనేజర్ గౌతం రాజేష్రెడ్డి, సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్ ఎంపికయ్యారు. సింగరేణి ఉన్నత పాఠశాలలో చదువుతూ చదువులో ప్రతిభ కనబర్చిన తుపాకుల ప్రజ్వల శ్రీ, సింగటి సాయి శ్రీ వర్షిణిలు ఉత్తమ విద్యార్థులుగా ఎంపికయ్యారు. కోలిండియా స్థాయిలో బంగారు పతకాలు సాధించిన ఏరియా ఉద్యోగులు గోలేటి సీహెచ్పీలో సీనియర్ అసిస్టెంట్ జి.మురళీకృష్ణను సన్మానానికి ఎంపిక చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. కార్పొరేట్ స్థాయిలో ఎంపికై న ఉత్తమ అధికారిని జూన్ 2న కొత్తగూడెంలో జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎండీ సన్మానిస్తారు. ఏరియా స్థాయిలో ఎంపికై న ఉద్యోగులు, విద్యార్థులను గోలేటిలోని భీమన్న స్టేడియంలో నిర్వహించే వేడుకల్లో జీఎం సన్మానించనున్నారు. -
సంగీత వాయిద్యంలో గిన్నీస్ రికార్డు
చెన్నూర్రూరల్: వారిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో కష్టపడి చదివించి వివాహం చేశారు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే సంగీత వాయిద్యకారుల కార్యక్రమంలో పాల్గొని ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డులో సాధించింది. చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాగిరి వనజ. ఈమె తల్లిదండ్రులు పాగిరి లక్ష్మి– లింగయ్యలది నిరుపేద వ్యవసాయ కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలకు వివాహం జరిపించారు. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమార్తె వనజకు 2024లో వివాహం జరిగింది. ఈమె భర్త మహేశ్కుమార్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏడీపీఎంగా పని చేస్తున్నాడు. ఆమె హైదరాబాద్లోని ఇన్మార్ ఇంటలిజెన్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పని చేస్తోంది. భర్త ప్రోత్సాహంతోనే.. ఉద్యోగం చేస్తూనే వనజ భర్త మహేశ్కుమార్ ప్రోత్సాహంతో 2026 జనవరిలో ఆన్లైన్లో కీబోర్డుపై సంగీత వాయిద్యం నేర్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్ జొరాస్ట్రియన్ క్లబ్లో గిన్నీస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పాస్టర్ ఆగస్టిన్ దండంగి స్థాపించిన మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో పాల్గొంది. జనగణమణ, పలు పాటలకు సంగీతం వాయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ నుంచి గుర్తింపు లభించింది. సంస్థ ప్రతినిధులు మే 29న ఆమెకు గిన్నీస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్తోపాటు గోల్డ్ మెడల్ అందజేశారు. -
కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి
కెరమెరి: రైతులు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని ఆదివా సీ భవన్లో ఆదివారం ఉట్నూర్ జీసీసీ డీఎం సందీప్కుమార్తో కలిసి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులకు అ మ్మకుండా, కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం పంట విక్రయించి రైతులను శా లువాతో సత్కరించారు. కార్యక్రమంలో జీసీ సీ మేనేజర్ తారాచంద్, సర్పంచులు ఆనంద్రావు, నాగ్నాథ్, రాధాబాయి, నాయకులు పెందోర్ మోతీరాం, దుర్పతబాయి, అబ్దుల్ కలాం, యూనూస్, బాలాజీ, అంబాజీ పాల్గొన్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జొన్నలు తూకం వేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
స్విమ్మింగ్పూల్లో సందడి
నిర్మల్టౌన్: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతుండగా, బయటకు వెళ్లేవారు ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. వేసవితాపం నుంచి కాస్త చల్లదనాన్ని అందించే స్విమ్మింగ్ పూల్స్ విద్యార్థులు, యువతకు హాట్ ఫేవరెట్గా మారాయి. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో ఈతకొడుతున్నారు. కోచ్లు వారికి ఈతలో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల స్విమ్మింగ్ క్రీడకు గుర్తింపుతో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకోవచ్చని ఉద్దేశంతో పలువురు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. చిన్న వయసులోనే ఈత నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని కోచ్లు చెబుతున్నారు.ఫిట్గా ఉండేందుకు.. వేసవి వేడి తట్టుకోవడానికి స్విమ్మింగ్ ఉపయోగపడుతుంది. గత నెల రోజులుగా ప్ర తీరోజు స్నేహితులతో కలిసి ఈత కొడుతున్నా. తక్కువ ధ రకు స్విమ్మింగ్ చేసే అవకాశం ఉంది. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఫిట్గా ఉండేందుకు స్విమ్మింగ్ చేస్తున్నా. – సూర్యతేజ ఆనందంగా ఉంది వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ చేస్తున్నా. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందడంతోపాటు శరీరానికి వ్యాయామం లభిస్తుంది. స్నేహితులతో కలిసి వచ్చి చేయడం ఆనందంగా ఉంది. – త్రినయన్ -
పోరుగడ్డకు సీఎం
రెబ్బెన: పోరుగడ్డ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారు. గతనెలలో తుమ్మిడిహెట్టి పర్యటన దాదాపు ఖరారైనా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవంతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరును ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. పర్యటన ఇలా..సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన నివాసం నుంచి డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ వద్ద ఉన్న హెలిప్యాడ్ ప్రాంతానికి బయలుదేరుతారు. 4.40 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా 5.45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీకి చేరుకుంటారు. 5.50 నుంచి 6.30 వరకు కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. 6.55 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 7 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 8.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్నగర్కు చేరుకుంటారు. విశ్రాంతి తీసుకుని 9.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ నివాసానికి వెళ్తారు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. భారీగా జనసమీకరణ..సీఎం రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాకు రానుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా జనసమీకరణకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రజలను తరలించనున్నారు. దాదాపు లక్ష మంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. సీఎం సభ కన్వీనర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు భారీగా జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. 1,825 మందితో బందోబస్తుసీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించనున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ఆర్ఐలు, 157 మంది ఏఎస్సైలు, ఆర్ఎస్సైలు, డబ్ల్యూఎస్సైలు, 200 మంది ఏఎస్సైలు, 829 మంది కానిస్టేబు ళ్లు, 43 మంది మహిళా పోలీస్ సిబ్బంది, 328 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తారు. వీరితోపాటు తొమ్మిది ప్రత్యేక పార్టీలు, రెండు రోప్ పార్టీలు, 28 యాక్సెస్ కంట్రోల్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలను మోహరించనున్నారు. మొత్తం 1,825 మంది విధులు నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనఆసిఫాబాద్: సీఎం పర్యటనలో భాగంగా జిల్లాలో రూ.112.14 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టు, మున్సిపల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రవీంద్రనగర్ క్యాంపు నం.2 గ్రామంలో రూ.56.55 కోట్లతో 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, రెబ్బెన మండలం నంబాలలో రూ.6 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే చింతలమానెపల్లిలో రూ.4.22 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్, రూ.2.98 కోట్లతో కౌటాల మండలం గుడ్లబోరి, రూ.3.08 కోట్లతో కాగజ్నగర్లో, రూ.2.89 కోట్లతో సిర్పూర్– టి మండలం చింతకుంటలో, రూ.2.72 కోట్లతో కాగజ్నగర్ మండలం అంకుసాపూర్లో ఏర్పాటు చేసే 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.15 కోట్లతో ఆసిఫాబాద్, రూ.18.7 కోట్లతో కాగజ్నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లు పరిశీలనఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కెరమెరి మండలం కొత్తగూడతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి పరిశీలించారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతం, ఇళ్ల శంకుస్థాపన ప్రాంతాలను పరిశీలించి కలెక్టర్ హరిత, ఎస్పీలు నితిక పంత్, అఖిల్ మహాజన్కు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు సైతం ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
శ్రమించి.. కొలువులు సాధించి
సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత అసామాన్య ప్రతిభతో సత్తాచాటారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మైదానంలో చెమటోడ్చారు. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టి తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించారు. దేశసేవ చేయడమే ధ్యేయంగా భారత సైనికదళంలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. వారి కష్టానికి విజయం దాసోహమంది. వారి పట్టుదలకు అగ్నివీర్ కొలువులు దక్కాయి. శనివారం రాత్రి విడుదలైన అగ్నివీర్ ఎంపిక ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన ఉమ్మడి జిల్లా యువకులపై కథనం. – ఆదిలాబాద్


