breaking news
Komaram Bheem
-
ఘనంగా శిశుమందిర్ వార్షికోత్సవం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశు మందిర్ 47 వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ కార్యక్రమానికి హాజరై మాట్లాడా రు. విద్యార్థులకు కాలనుగుణంగా సాంకేతికతను అందిస్తూ జాతీయ స్థాయిలో ఒలింపియాడ్ పరీక్షల్లో శిశుమందిర్ ర్యాంకులు సాధిస్తుందని చెప్పారు. వక్త కృష్ణభాస్కర్ మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలో పంచ పరివర్తన రావడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు కుటుంబ విలువలు, పెద్దలపై గౌరవం, దేశభక్తి, దైవభక్తిని పెంపొందించే కథలు వివరించాలనని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సేవ్ ట్రీ సేవ్ లైఫ్, కోలాటం, డంబుల్స్, యోగాచాప్, పిరమిడ్, కరాటే, మొబైల్ స్కిట్ ఆహూతులను అలరించాయి. మూడోతరగతి వి ద్యార్థిని శ్రీహిత వేసిన శంభాజీ మహరాజ్ ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. రాష్ట్ర స్థాయిలో క్రీడలు, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మెడల్స్తో సత్కరించారు. ప్రధానాచార్యుడు గుండేటి కోటేశ్వర్రావ్, పాఠశాల అధ్యక్షుడు చిలువేరు వెంకన్న, భోనగిరి సతీశ్బాబు, ఎంఈవో రాథోడ్ సుభాష్, దేవభూషణం, ఖాండ్రె విశాల్, వేణుగో పాల్, నాగుల శ్రీనివాస్, వాసుదేవన శైలేశ్, రమాదే వి, వైష్ణవి, వాణి, సుప్రజ, సుమలత పాల్గొన్నారు. -
రోడ్డు పనులు పూర్తి చేయించాలని వినతి
రెబ్బెన: అసంపూర్తిగా నిలిచిన రాంపూర్ బీటీ రోడ్డు పనులు పూర్తయ్యేలా చూడాలని రాంపూర్ సర్పంచ్ చల్లూరి మాయ, ఉప సర్పంచ్ చాపిడి పురుషోత్తం ఆదివారం గ్రామానికి వ చ్చిన కలెక్టర్ హరితను కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాంపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం రూ.1.5 కోట్లతో చేపట్టిన 1.8కిలో మీటర్ల బీ టీ రోడ్డు పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే వ దిలేశాడని తెలిపారు. రోడ్డుపై కంకర వేసి వ దిలేయడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వా హనాలు అదుపుతప్పి బోల్తాపడుతుండటంతో పలువురు గాయాలపాలవుతున్నారని తె లిపారు. బిల్లులు రావడం లేదనే సాకుతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేయడంతో బీటీ రోడ్డు కలగానే మిగిలిపోయిందని పేర్కొన్నా రు. వెంటనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ హరిత వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
ఆర్సీఎం క్లబ్లో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్లోని బీజోన్ ఏరియాలోగల ఆర్సీఎం క్లబ్లో ఆదివారం ఫస్ట్ ఇంటర్ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే పోటీలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రఘునా థ్రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఆటలతో క్రీడాకారుల్లో మనోధైర్యం, శారీరక దారుఢ్యం పెరుగుతుందని తెలిపారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించారు. నిర్వాహకులు జూల శ్రీనివాస్, ఆషాఢం శ్రీనివాస్, కరాటే మాస్టర్ రమేశ్రాజా, వివిధ ఏరియాల కరాటే మాస్టర్లు, కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య, అజీజ్ తదితరులున్నారు. -
బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
కాగజ్నగర్టౌన్: ఉచిత హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను పట్టణంలోని సామాజిక ప్రభుత్వాస్పత్రిలో మున్సిపల్ చైర్పర్సన్ సాహీన్ సుల్తానా ఆదివారం జిల్లా వైద్యాధికారి సీతారాంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. జిల్లాలోని 14–15 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా ముందస్తుగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. జిల్లాలోని కాగజ్నగర్, బెజ్జూరు, సిర్పూర్(టీ), తిర్యాణి, జైనూర్, వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. పీహెచ్సీల పరిధిలోని బాలికలు ఆయా ఆస్పత్రులకు ఆధార్కార్డుతో వెళ్లి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో మూడు నెలల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం బాలికలకు వ్యాక్సినేషన్ చేశారు. సీహెచ్సీ సూపరింటెండెంట్ అవినాష్, సీహెచ్వో సంపత్, డిప్యూ టీ ఎస్వో రమేశ్చంద్ర, డీపీవో వెంకటేశ్, వైద్యురాలు అరుణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై వ్యాక్సిన్ వేసుకున్న బాలికల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
గ్యాస్ ధరల పెంపుపై నిరసన
కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.115 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం ఫలితంగానే ఇరాన్ మన చమురు ట్యాంకర్లను సముద్రంలో నిలిపివేసిందని తెలిపారు. ఈ కారణంగానే కేంద్రం గ్యాస్ ధరలు పెంచిందని మండిపడ్డారు. ఇరాన్ ఎప్పటి నుంచో మన మిత్ర దేశమని, మోదీ ప్రభుత్వం అమెరికా మెప్పు కోసం మిత్ర దేశాలతో శతృత్వం పెంచుకుంటోందని ఆరోపించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే యుద్ధాలు, విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యుడు టీకానంద్, నాయకులు కృష్ణమాచారి, సుధాకర్, రవి, రాజేందర్, ముంజం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
● అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ హరిత
మహిళలు నిర్ణయాత్మకశక్తిగా ఎదగాలిఆసిఫాబాద్అర్బన్: ప్రతీ మహిళ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాసవీ ఆలయంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఉదయ్బాబు అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు రాజకీయాల్లో మరింతగా రాణించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. నేటికీ మహిళల ఆలోచన తీరు పూర్తిగా మారలేదని, ఆర్థికంగా బలోపేతమైతేనే మహిళల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అనంతరం క్లబ్ సభ్యులు కలెక్టర్, ఎమ్మెల్యే, ఏఎంసీ చైర్మన్తోపాటు ఎస్టీవో కరుణశ్రీ, మహిళా సంఘం సభ్యురాలు మార స్వరూపను శాలువాలతో సత్కరించారు. క్లబ్ ప్రధాన కార్యదర్శి బాల శ్రీనివాస్, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్, అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో రాణించాలి రెబ్బెన: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ హరిత సూచించారు. గోలేటి టౌన్షిప్లోని ఆఫీసర్స్ క్లబ్లో బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హా జరై బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఎంచుకున్న రంగాల్లో పట్టుదలతో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆ కాంక్షించారు. వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణపత్రాలు అందజేశారు. వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారుల నృత్యాలు అ లరించాయి. సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ టిబ్రెవాల్ సతీమణి ఆర్తి, బెల్లంపల్లి ఏరియా సేవాసమితి అధ్యక్షురాలు ఎం. పద్మ విజయభాస్కర్రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు నరేందర్, సీనియర్ సేవా సభ్యులు శంకరమ్మ, కోమల తదితరులు పాల్గొన్నారు. -
పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
సిర్పూర్(టి): పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైల్డ్లైఫ్ పీసీసీఎఫ్ వినయ్కుమార్ సూచించారు. ఆదివారం సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్(టి) రేంజ్పరిధిలోని ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో పులుల సంచారం అధికంగా ఉందని, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి రాకపోకలు సాగించే కారిడార్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటిక్యాల పహాడ్ అ టవీప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ఏర్పా టు చేసిన నీటి కుంటలు, సోలార్ నీటి కుంటలు, చెక్డ్యాంల ద్వారా వన్యప్రాణుల దాహా ర్తి తీరుతుందని తెలిపారు. అనంతరం పులికారిడార్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, నీటికుంటలు, నీటి వసతుల వద్ద వన్యప్రాణులు వచ్చి వెళ్లే చిత్రాలు, వీడియోలు పరిశీలించారు. టైగర్ ట్రాకింగ్ విధానం గురించి సెక్షన్ అధికారి మోహన్రావ్ను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై అధికారులు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో వన్యప్రాణులు, పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలను ప్రశంసించి సెక్షన్ అధికారి మోహన్రావ్, బీట్ అధికారి నరేశ్, సిబ్బందిని అభినందించారు. కవ్వాల్ ఎఫ్డీపీటీ శాంతారాం, డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్, నిర్మల్ డీఎఫ్వో సుశాంత్ సింగ్ బొబాడే, ప్రొబెషనరీ ఐఎఫ్ఎస్ భార్గవ్కుమార్, కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్య, ఎఫ్ఆర్వోలు అనిల్కుమార్, రమాదేవి, ఎఫ్ఎస్వోలు, బీట్అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
● క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● ఎండవేడికి అల్లాడుతున్న జిల్లా జనం ● ప్రత్యామ్నాయ చర్యలతో ఉపశమనం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
మధ్యాహ్నం నిర్మానుష్యంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిఆసిఫాబాద్అర్బన్: వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాత్రివేళ చలి ఉంటుండగా ఉదయం 10గంటలు దాటితే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పశుపక్షాదులు కూడా ఎండలకు అల్లాడుతున్నాయి. కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గతంలోనూ మార్చిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలున్నాయి. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఈనెల 7న పెంచికల్పేట మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 నమోదు కాగా, అత్యధికంగా 38.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం బెజ్జూర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 18.4 డి గ్రీలు నమోదు కాగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 38.6 డి గ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే ఎండ తీ వ్రత ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నా రు. ఎండలు పెరుగుతుండడంతో వీధి వ్యాపారులు పక్కా షెడ్లు లేక గొడుగుల కిందే వ్యాపారాలు చేసుకుంటున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సినవారు ఎండ నుంచి రక్షణకు తలకు టోపీ లేదా టవల్ ధరిస్తున్నారు. జ్యూస్ సెంటర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది. మధ్యాహ్నం వేళ జ్యూస్ సెంటర్లు, కూల్డ్రింక్ షాపులు కిటకిటలాడుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండేందుకు రోజుకు తగినంత నీరు తాగాలి. ఇంటి నుంచి బ యటకు వెళ్లేటపుడు తేలికపాటి దుస్తులు, తలకు టోపీ, ముఖానికి మాస్క్, కళ్లకు సన్గ్లాసెస్ ధరించాలి. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకువెళ్లకపోవడమే మంచిది. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలి. కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటే మరీ మంచిది. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకో వాలి. పోషకాలు కలిగిన కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్స్ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వ్యాయామం, యోగా, సూర్య నమస్కారాలు చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంటి ని చల్లగా ఉంచుకోవాలి. పగటి వేళ కిటికీలు, తలు పులు మూసి ఉంచి సాయంత్రం వేళ తెరవాలి. శరీ రంలో ఏవైనా మార్పులు సంభవిస్తే వైద్యుడిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.జ్యూస్ సెంటర్ వద్ద సేదతీరుతున్న యువకులు -
తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలి
కాగజ్నగర్టౌన్: తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ చెత్త వాహనంలో వేయాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్ 2, 12 వార్డుల్లో పరిశుభ్రతపై ఆదివారం అవగాహన కల్పించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. అనంతరం వార్డు కౌన్సిలర్ దుర్గమ్మ ఆధ్వర్యంలో కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందిని శాలు వాలతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సి లర్ బాబురావు, రెవెన్యూ అధికారి రాజేందర్, సిబ్బంది రఫీక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, పర్యావరణ ఇంజినీర్ ప్రణిల్, వార్డు అధికారి ఉష, కాలనీవాసులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
కాగజ్నగర్టౌన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎ మ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివారం పట్ట ణంలోని గాంధీ పార్క్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ తిరుప తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్ర జా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాపాలన కా ర్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు చెత్త ను ఇంటింటా తిరిగే మున్సిపల్ చెత్తవాహనాల్లో వే యాలని సూచించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో పట్టణంలో సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ప్రత్యేకాధికారి సాయి, మున్సిపల్ డీఈ, మున్సిపల్ చైర్పర్సన్ సాహిన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత, కౌన్సిలర్లు జ్యోతి, వసీమున్నీసా, విజయ్కుమార్, విశ్వేశ్వర్రావు, నా యకులు దస్తగీర్, షబ్బీర్, శివ, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. -
అరణ్యంలో అతివలు
అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుకుసాగుతున్నా యూనిఫాం విభాగంలో పని చేయడం కత్తిమీద సామే. అయినప్పటికీ కష్టమైనా ఇష్టంతో అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. అటవీ సంరక్షణలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మోట్లగూడ సెక్షన్ అధికారి స్వప్న, గిన్నెదరి రేంజ్ అధికారి సరోజ ఉత్తమ అవార్డులు పొందారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..అడవుల రక్షణకు కట్టుబడి విధులు నిర్వహిస్తున్నాం ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా అడవుల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నాను. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ వారి సలహాలు, సూచనలతో ముందుకు సాగుతున్నాను. నా కూతురును ఐఎఫ్ఎ్స్ చదివేందుకు సిద్ధం చేస్తున్నాను. – స్వప్న, సెక్షన్ అధికారి, మోట్లగూడ కష్టమైనా ఇష్టంతోనే.. అడవిలో విధులు నిర్వహించడం మహిళలకు చాలా కష్టమైన పని. చిన్నప్పటి నుంచి యూనిఫాం సర్వీస్పై నాకు మక్కువ ఎక్కువ. ప్రస్తుతం అటవీశాఖలో రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తూ అటవీ పరిరక్షణకు కృషి చేస్తున్నాను. సమాజంలో పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. – సరోజ, ఫారెస్ట్ రేంజ్ అధికారి, గిన్నెదరి కత్తి మీద సామే అయినా.. ఇతర ఉద్యోగాలతో పోల్చితే అటవీశాఖ లో విధులు నిర్వర్తించడం కత్తిమీద సామే. అయినా, ఉన్నతాధికారుల సహకారంతో విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచే యూనిఫాం ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. నా కల నెరవేరింది. దీంతో సంతోషంగా విధులు నిర్వర్తిస్తున్నాను. – అనూష, అటవీ సెక్షన్ అధికారి, జైనూర్ -
జిల్లా పాలనలోనూ..
మహిళలు నిబద్ధతతో పనిచేస్తారు ప్రజాసమస్యలను నా సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తున్నాను. గ్రీవెన్స్ విభాగానికి వచ్చే సమస్యలను ఫాలోఅప్ చేస్తూ బాధితుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాను. ప్రకృతితో నిండి ఉన్న జిల్లాలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. విధి నిర్వహణలో ట్రావెల్ చేయడం కష్టమనిపించదు. మగవారి కంటే మహిళలు ఎంతో నిబద్ధతతో పనిచేస్తారు. – కె.హరిత, కలెక్టర్ జిల్లాపై ఎస్పీది ప్రత్యేక ముద్ర బాధ్యతలు స్వీకరించిన నుంచి ఎస్పీ నితిక పంత్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతూ బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
నస్పూర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం ఆయన ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భా గంగా కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి 30, 16వ డివిజన్లలో పర్యటించారు. 30వ డివిజన్లో వీధి దీపాలు వెలుగడం లేదని స్థానికులు తెలుపగా ఎమ్మెల్యే వెంటనే ఏఈ రాంచందర్కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. విలేజ్ శ్రీరాంపూర్ బస్టాప్ వద్ద బస్సులు నిల పడం లేదని మహిళలు దృష్టికి తీసుకు రాగా.. డిపో మేనేజర్ శ్రీనివాస్కు ఫోన్ చేసి బస్సులు నిలపాలని ఆదేశించారు. కార్పొరేటర్లు శ్రీనివాస్, త్రివేణి ఉన్నారు. -
తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు. పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డు రియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు. మత్తుపదార్థాల నివారణే లక్ష్యం వేమనపల్లి: డ్రగ్స్ రహిత తెలంగాణతోపాటు గంజాయి, నాటుసారా ఇతర మత్తు పదార్థాలపై నివారణే లక్ష్యంగా పని చేద్దామని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని మంగనపల్లి క్రాస్ రోడ్డు వద్ద పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్షలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరలు, పదవ తరగతి విద్యార్థులకు కంపాక్స్ బాక్సులు, ప్యాడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ క్రిష్ణ, ఎస్సై జగదీష్రెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు. ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలిపాతమంచిర్యాల/లక్సెట్టిపేట: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఆస్పత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖి చేసి పురోగతిని పరిశీలించారు. అనంతరం సాయికుంటలో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లక్సెట్టిపేట ఆసుపత్రి సందర్శించి రోగులతో మాట్లాడారు. రోగులకు అత్యవసర వేళలో తక్షణమే వైద్యం అందించాలని సూచించారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అ మలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబా ద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా హాజరుకాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవ రీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించి వాటి వివరాలను శాఖ లు, పనిచేయిస్తున్న ఏజెన్సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మై నింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించా లని సూచించారు. సంక్షేమ పథకాలకు గాను లబ్ధి దారుల ఎంపిక, అమలు కోసం సాంకేతికత విని యోగించుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరు చేశారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాద వ్, వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా నోడల్ అధికారి అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి వీడియో కాన్ఫరెన్స్కు ఆసిఫాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
సేంద్రియం వైపు ‘సాగు’దాం..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు కెరమెరి మండలం దనోరా గ్రామానికి చెందిన కేంద్రె బాలాజీ. 2015 నుంచి పదెకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కంది, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, అనుములతోపాటు కూరగాయలైన టమాట, చిక్కుడు, అలసంద, వంకాయ పండిస్తున్నారు. అలాగే బత్తాయి, ఆపిల్, మామిడి, బొప్పాయి సాగు చేస్తున్నారు. ఏడాదికి రూ.4 లక్షలు పెట్టుబడి పెడుతుండగా, రూ.7 లక్షల ఆదాయం వస్తోంది. సంవత్సరానికి రూ.3 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. జిల్లాలోనే సేంద్రియ పంటలు పండించిన తొలి రైతుగా ఆయన గుర్తింపు పొందారు. కెరమెరి: అధిక దిగుబడుల కోసం రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిమితికి మించి వాడుతున్నారు. దీంతో బియ్యం, పప్పులు, నూనెగింజలు వంటి ఆహార ధాన్యాల్లో రసాయన అవశేషాలు ఉండి మనుషుల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రజలకు, పర్యావరణానికి మేలు చేస్తుందని భావించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అన్నదాతలను సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’(ఎన్ఎంఎన్ఎఫ్) పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో క్లస్టర్లో 125 మంది ఎంపికకేంద్ర అమలు చేస్తున్న ప్రభుత్వం జాతీయ వ్యవసా య పథకం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ – 2024లో భాగంగా జిల్లాలోని 15 మండలాలకు చెందిన సీఆర్పీలకు గత నెలలో నిపుణులతో శిక్షణ అందించారు. జిల్లాలో మొత్తం 70 వ్యవసాయ క్లస్ట ర్లు ఉండగా 24 క్లస్టర్లను ఇందుకోసం గుర్తించారు. ఒక్కో క్లస్టర్కు 125 మంది రైతులను ఎంపిక చేశా రు. సీఆర్పీలు ప్రస్తుతం రైతులకు సేంద్రియ వ్యవసాయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. మట్టి నమూనాలు సేకరణభూసార పరీక్షల కోసం 3,000 మంది రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించారు. ఫలితాల ఆధారంగా భూమిని సహజ సాగుకు యోగ్యంగా మార్చాల్సి ఉంటుంది. వచ్చే యాసంగి నాటికి ప్రతీ రైతు కనీసం ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ముందుగా మహిళా సంఘాల్లోని సభ్యులను ‘కృషి సఖీ’లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా ఇతర రైతులకు అవగాహన కల్పించనున్నారు. కెరమెరిలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన బొప్పాయిజిల్లా వివరాలుమొత్తం క్లస్టర్లు 70 పథకం అమలవుతున్నవి 24 సీఆర్పీలు 48 బీఆర్సీలు 16 ఒక్కో క్లస్టర్లో రైతులు 125 మొత్తం రైతులు 3000 జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంభూమిలో సహజంగా ఉండే జీవవైవిధ్యాన్ని, పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు, కీటకాలను కాపాడుకునేలా సహజ సేద్యం ఉంటుంది. పశువులు, ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాగులో జీవ నియంత్రణ పద్ధతులు, వృక్ష సంబంధిత కషాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీజామృతంతో విత్తన శుద్ధి, జీవామృతంతో పురుగులను అదుపు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటించాలి. దేశీ ఆవు పేడ, మూత్రం, ఇతర సహజ పదార్థాలతో ఎరువులు తయారు చేసి వినియోగించడమే ఈ పథకం లక్ష్యం. సాగు విధానం, యాజమాన్య పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. అందులో మట్టిలోని పోషక విలువలు కీలక భూమిక పోషిస్తాయి. రైతులు ప్రస్తుతం నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలను మాత్రమే వాడుతూ, మిగతా సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా నేలకు అవసరమైన పోషకాలను సహజ పద్ధతిలో పెంపొందించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. -
తాగేందుకు ‘భగీరథ’ నీళ్లు మేలు
రెబ్బెన: చేతిపంపుల నీటి కంటే తాగేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు ఎంతో మేలని మిషన్ భగీరథ ఎస్ఈ రవీందర్ అన్నా రు. మండలంలోని రాంపూర్ పంచాయతీని శుక్రవారం సందర్శించారు. మిషన్ భగీరథ నీటితో పాటు బోర్వెల్స్ ద్వారా వచ్చే నీటిని పరీక్షించారు. స్థానికులు సరఫరా చేస్తున్న నీటిని వినియోగిస్తున్నారా.. సాధారణ చేతిపంపుల నీటిని వినియోగిస్తున్నారా అని ఆరా తీశారు. భగరీథ నీటిని ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నామని చెప్పగా.. చేతిపంపుల నీటితో పోల్చితే భగరథ నీటిలో టీడీఎస్ తక్కువగా ఉందని తెలిపారు. టీడీఎస్ ఎక్కువ ఉన్న నీటిని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. మినరల్ వాటర్ ఎప్పటి పరిస్థితుల్లో వినియోగించవద్దని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీలో రికార్డులు, వాటర్ ట్యాంక్ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఈ శైలేందర్, ఏఈఈ వికాస్, గ్రిడ్ ఏఈఈ రాజేశ్, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, ఉప సర్పంచ్ పురుషోత్తం పాల్గొన్నారు. -
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం
ఆసిఫాబాద్: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం అత్యంత అవసరమని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నీటికాసుల(గ్లాకోమా) వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నీటికాసుల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలన్నారు. తద్వారా శాశ్వత దృష్టిలోపాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ అనంతుల్లా, విజయ పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు. పట్టణంలోని వార్డు నం.18లో శుక్రవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వైస్చైర్పర్సన్ కొత్తపల్లి సునీత, కమిషనర్ తిరుపతితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధి కారులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. 99 రోజులపాటు నిర్వహించే పనులను అధి కారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
పరిశుభ్రత అందరి బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: పరిశుభ్రత అందరి బాధ్యత అని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి చెత్తను సేకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్క రూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పారిశుద్ధ్యం లోపించడంతోపాటు పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభా వం పడుతుందని తెలిపారు. ఎక్కడైనా చెత్త కనిపి స్తే విధిగా డస్ట్బిన్లో వేయాలని సూచించారు. ప్రజలు చెత్తను రోడ్లపై కాకుండా మున్సిపల్, పంచాయతీల చెత్త సేకరణ వాహనాల్లో వేయాలన్నా రు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీడబ్ల్యూవో భాస్కర్, డీటీడీవో రమాదేవి, హర్టికల్చర్ అధికారి నదీమ్, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, వెటర్నరీ అధికారి సురేశ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహంకాళి జాతరకు ఆహ్వానంఆసిఫాబాద్అర్బన్: రెబ్బెన మండలం ఇందిరానగర్లోని శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2న నిర్వహించే జాతరకు హాజరుకావాలని ఆలయ అర్చకుడు దేవర వినోద్, నిర్వాహకులు కలెక్టర్ హరితను ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్తో కలిసి జాతర పోస్టర్లు ఆహ్వానించారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కల్యాణ మహోత్సవం, 3న జాతర కొనసాగుతుందని తెలిపారు. -
ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ!
ఆసిఫాబాద్అర్బన్: వేసవి ఎండల నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర పౌరసరఫరాల శాఖ లేఖలు రాసింది. ఈ క్రమంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఏప్రిల్లోనే మూడు నెలల బియ్యం అందనుంది. గోదాముల నుంచి బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 15 మండలాల పరిధిలో 315 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 1,63,765 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,389 అంత్యోదయ కార్డులకు 43,821 యూనిట్లకు 468.615 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అలాగే 1,50,356 ఆహార భద్రత కార్డులకు 4,95,204 యూనిట్లకు 2690.928 మెటిక్ టన్నులు, 20 అన్నపూర్ణ కార్డులకు 0.200 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. ప్రతినెలా సుమారు 3519.743 మెట్రిక్ టన్నుల బియ్యం చొప్పున మూడు నెలలకు కలిపి సుమారు 10559.229 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనున్నారు.జిల్లా ప్రజలకు మేలుగతేడాది వర్షాకాలంలో వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి పంపిణీ చేశారు. అలాగే వేసవిలో ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మారుమూల గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులకు మేలు జరగనుంది. తిర్యాణి మండలంలోని పల్లెలతోపాటు పలు గ్రామాల్లో స్థానికంగా రేషన్ దుకాణాలు లేవు. ఐదారు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ఒకేసారి బియ్యం అందిస్తే వీరికి దూరభారం తగ్గనుంది. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం చేస్తే రవాణా చార్జీల ఖర్చు తగ్గి, హమాలీలు, డీలర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే బియ్యం నిల్వ చేయడం సమస్యగా మారనుంది. బియ్యం తీసుకునేందుకు ఒక కార్డుదారుడు మూడుసార్లు వేలిముద్ర వేయాలి. గతంలో జిల్లాలో సిగ్నల్, సర్వర్ సమస్యతో ఒక్కో కార్డుదారుడికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. కేంద్రాల వద్ద పడిగాపులు తప్పలేదు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పౌరసరఫరాల శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.ఉత్తర్వులు అందలేదుఏప్రిల్లో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం. ప్రతీ రేషన్కార్డు దారుడు ఈ నెల చివరి వరకు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలి.– వసంతలక్ష్మి,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
జాతీయస్థాయి ఇస్నీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
బాసర:జాతీయస్థాయిలో నిర్వహించిన ఇస్నీ మోటార్ స్పోర్ట్ సీజన్–13లో పోటీల్లో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన టీమ్ గరుడ అసాధారణ ప్రదర్శనతో ఆల్ ఇండియా 5వ ర్యాంక్ సంపాదించింది. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న జట్ల మధ్య కఠిన పోటీలో ఈ ఘటన సాధించడం విశేషం. టీమ్ గరుడ వివిధ విభగాల్లో విజయాలు సాధించింది. యాక్సిలరేషన్లో 5.46 సెకన్లలో రికార్డు సమయంతో 1వ ర్యాంక్ సాధించింది. డిజైన్ క్విజ్లో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ డిజైన్ రివ్యూలో 3వ ర్యాంక్ సాధించింది. డిస్–అసెంబ్లీ/అసెంబ్లీ విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. ఆటోక్రాస్, ఎండ్యూరెన్స్లో కూడా నిలకడైన ప్రతిభ కనబర్చింది. థ్రోటిల్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, డ్రైవింగ్ నైపుణ్యాలు, జట్టి సహకారంతో అధిగమించారు. విద్యార్థులకు అభినందన.. జాతీయస్థాయిలో ఆర్జీయూకేటీ ప్రతిభను చాటిన టీమ్ గరుడ సభ్యులను వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ ప్రశంసించారు. ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ కె.మహేశ్, డాక్టర్ ఎన్.విజయ్ కుమార్, విభాగాధిపతి ఎ.చరణ్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అన్పత్ రాహుల్ మార్గదర్శకత్వాన్ని అభినందించారు. స్పాన్సర్లు యునైటెడ్ వే హైదరాబాద్, ఫ్యూచర్ టీచ్ ఫౌండేషన్, వీఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఈఈ సిస్టమ్స్, పీఎస్ అసోసియేషన్కు జట్టు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని టీమ్ గరుడ ధీమా వ్యక్తం చేసింది. -
బైక్ను ఢీకొన్న కారు
● ఇద్దరికి తీవ్రగాయాలు బోథ్: మండలంలోని ఘన్పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనుగుట్ట గ్రామ సమీపంలో సొనాల గ్రామం నుంచి క్రాస్ రోడ్డు వైపు వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న యువకులు అనిల్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితులిద్దరూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. విధుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. -
పనిలో భద్రత ప్రమాణాలు పాటించాలి
చెన్నూర్: ప్రతీ ఉద్యోగి తన పనిలో, నిత్య జీవితంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని ఎస్టీపీపీ జీఎం ఎం.నర్సింహారావు తెలిపారు. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో గురువారం 55వ భద్రతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జీఎం నర్సింహారావు సేఫ్టీ ప్లాగ్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగి భద్రతగా ఉంటే అతడిపై ఆధారపడిన కుటుంబం భద్రంగా ఉంటుందని తెలిపారు. జాతీయ భద్రత దినోత్సవాలు ఎస్టీపీపీలో 13ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం(పీసీఎస్), వోఅండ్ఎం చీఫ్ మదన్మోహన్, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్, ఏజీఎంలు శ్రీనివాస్, ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రెట రీ పర్శయ్య, సీఎంవోఏఐ ప్రెసిడెంట్ పంతులా, డీ జీఎం అజాజుల్లాఖాన్, శ్రీధర్, శివప్రసాద్, వేణుగో పాల్, జనగామ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
ఉట్నూర్రూరల్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99రోజుల కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐటీడీఏ పీవో ఛాంబర్లో డీటీడీవో, ఏటీడీవోలు, హెచ్డబ్ల్యూవోలు, ఐటీడీఏ కార్యాలయ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. శుక్రవారం నుంచి జూన్ 12వరకు 99రోజుల కార్యాచరణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా 10 అంశాలపై కార్యక్రమం కొనసాగుతుందని, మార్చి 6నుంచి 15వరకు ఆశ్రమ పాఠశాలలోని డార్మెంటరీ, కిచెన్, ఆశ్రమ పాఠశాలలో పరిసరాలు, స్టాక్ రూంలు పరిశుభ్రం చేయాలని, పనికిరాని పాత వస్తువులను పోగు చేసి వేలం వేస్తూ వచ్చే డబ్బులతో పాఠశాలలో మరమ్మతు పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్టాక్ రూంలలో ఎలుకలు, బొద్దింకలు, కీటకాలు లేకుండా చూడాలని, పాడైన పప్పులు, సరుకులు, బియ్యం, జీసీసీకి పంపించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రధానోపాధ్యాయులదే బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాలల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా చూడాలని, ప్రతీ ఆశ్రమ పాఠశాలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. పాఠశాలలను కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారి ఎప్పుడైనా తనిఖీలు చేయవచ్చని, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులను గుర్తించి కాలేజీ ప్రిన్సిపల్, హెచ్డబ్ల్యూవోలు, పీఎంహెచ్ఎస్, విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క విద్యార్థినీ బడి బయట ఉండకుండా బడిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ అధికారులున్నారు. -
డబుల్ రిజిస్ట్రేషన్ మోసం కేసులో నిందితురాలి అరెస్ట్
ఆదిలాబాద్రూరల్: మావల గ్రామ పరిధిలో ఒకే ప్లాట్ను పలుసార్లు విక్రయించి పలువురిని మోసం చేసిన కేసులో కీలక నిందితురాలు చింతలపల్లి ఆశాలతను గురువారం అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో మావల గ్రామంలోని సర్వే నంబర్ 175లోని 23వ ప్లాట్ను నిందితురాలు రూ.1.10 లక్షలకు రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా విక్రయించింది. అదే ప్లాట్ను 1996లో డాక్టర్ మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల ద్వారా వెల్లడైంది. అయితే, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి షేక్ ఇక్బాల్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు తన భర్తతో కలిసి సుమారు 30ఏళ్ల కిందట సర్వే నంబర్ 175లో లేవుట్ రూపొందించి 1996లో ప్లాట్లు అమ్మిన తర్వాత, అవే ప్లాట్లను మళ్లీమళ్లీ ఇతరులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది. బాధితులు ప్రశ్నించిన సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు 1996లో జరిగిన అసలు అమ్మకాల రిజిస్ట్రేషన్ పత్రాలు, అనంతరం జరిగిన మోసపూరిత రిజిస్ట్రేషన్ల ఽధ్రువీకరణ పత్రాలు తదితర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్డులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ప్రజలు కనీసం 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు, ఎంకంబ్రెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) పరిశీలించి జాగ్రత్తగా కొనుగోలు చేయాలని సూచించారు. సుంపుటం శివారులో తాబేలు శిలాజాలువేమనపల్లి: మండలంలో ఏ మట్టి దిబ్బల్లో ఏం ఖనిజం ఉంటుందో తెలియదు. ఇక్కడ ఒక్కోరాయి ఒక్కో చరిత్ర చెబుతుంది. వృక్ష, చేప, నత్తగుల్ల, రాకాసి బల్లి, ఎన్నోరకాల శిలాజ అవశేషాలు ఇక్కడ కోకొల్లలు. తాజాగా సుంపుటం సమీప వంతెన వద్ద తాబేలు ఆకృతి శిలాజాలు వెలికిచూశాయి. విధులకు వెళ్లిన అటవీ శాఖ బేస్క్యాంప్ సిబ్బంది ఈ శిలాజాలను గమనించి తమ కెమెరాల్లో బందించారు. అక్కడకి సమీప ప్రాణహితా నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా పలురకాల శిలాజాలు ఉన్నాయి. ఏడాది క్రితం రోడ్డు పనుల కాంట్రాక్టర్ వంతెన అప్రోచ్రోడ్డుకు బండ రివిట్మెంట్ కోసం ఈ అరుదైన శిలాజాలను ధ్వంసం చేశారు. పురాతన చరిత్ర ఆనవాళ్లు కనుమరుగు కాకుండా పురావస్తు, భూగోళ శాస్త్ర అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
చైన్స్నాచింగ్ కేసులో నిందితురాలి అరెస్ట్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లో ఇటీవల జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం మందమర్రి సీఐ పర్స రమేష్, పట్టణ ఎస్సై శ్రీధర్ వివరాలు వెల్లడించారు. గోదావరిఖని చెందిన గాజంగి శ్రావణి, మంచిర్యాలకు చెందిన లాస్యకు గతంలో పరిచయం ఉంది. లాస్య శ్రావణిని మభ్యపెట్టి ఈ నెల 2న రామకృష్ణాపూర్కు తీసుకొచ్చింది. శ్రావణి టాయిలెట్కు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు లాగేసుకుని అక్కడే పడి ఉన్న మొబైల్ఫోన్ను దొంగిలించి పారిపోయింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న రామకృష్ణాపూర్ పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక సాయంతో ఆధారాలు సేకరించారు. దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు వచ్చిన లాస్యను గురువారం మంచిర్యాలలో పట్టుకుని పుస్తెలతాడు, మొబైల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. లాస్య భర్త, కుమారుడిని వదిలి జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తోందని సీఐ వివరించారు. నిందితురాలిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఆర్జీయూకేటీ విద్యార్థులకు సిమెన్స్ స్కాలర్షిప్
బాసర:నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ఇంజినీరింగ్ విద్యార్థులు సిమెన్స్ ఇండియా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రోగ్రాంలో చోటు సంపాదించారు. యువ ప్రతిభలను ప్రోత్సహించి, ఆధునిక టెక్నాలజీ నాయకులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఎంపికై న విద్యార్థులకు ఆర్థిక సహాయంతోపాటు వృత్తి అభివృద్ధి అవకాశాలు అందుతాయి. స్కాలర్షిప్ ప్రయోజనాలు ఈ పథకం విద్యార్థులకు సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తుంది. పూర్తి ఆర్థిక సహకారం విద్యా ఖర్చులకు. పరిశ్రమ నిపుణుల ప్రత్యక్ష మెంటర్షిప్. అధునాతన సాంకేతిక శిక్షణ, ప్రాక్టికల్ అనుభవం. ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్లు, ఆధునిక ఇంజినీరింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఈ అవకాశాలు విద్యార్థుల కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ స్కాలర్షిప్కు ఎంపికై న బి.శ్వేత, సమీనా, చిన్నారెడ్డి, శ్యామ్, హిమబిందును అభినందించారు. ఈ అవకాశం వారి కెరీర్ శిఖరాలు, దేశ సాంకేతిక పురోగతికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. స్కాలర్షిప్ సెక్షన్ ఇన్చార్జ్ డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ టి.రాకేశ్రెడ్డి, డాక్టర్ బావ్సింగ్తోసహా సిబ్బంది అభినందించారు. -
ఉపాధిహామీ కూలీ మృతి
కౌటాల: మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన నికోడే దివాంజీ(55) అనే ఉపాధిహామీ కూలీ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దివాంజీ వారం రోజులుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. గురువారం ఉదయం పని ప్రదేశంలో బీపీ పెరిగి సొమ్మసిల్లి కిందపడ్డాడు. తోటి కూలీలు గమనించి కౌటాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు పరీక్షించి దివాంజీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య ఎంకుబాయి, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
గుంజాల శివారులో పులి సంచారం
తాంసి: భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామశివారులోగల పంటచేలలో పులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గుంజాల గ్రామ శివారులో పంటచేలకు వెళ్లే దారి లో రైతులకు పులి పాదముద్రలు కనిపించడంతో దాని సంచారం ఉందని భయపడుతున్నారు. గ్రా మానికి చెందిన రైతులు ధనోర గ్రామం వైపునున్న పంటచేలకు ఉదయం పూట వెళ్తూ మట్టిరోడ్డుపై పులి పాదముద్రలు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, గత నెల 3న గొల్లఘాట్ శివారులోని పంటచేలల్లో మేతకు వెళ్లిన లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు దాని కదలికలు తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు సెక్షన్ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి పులి కదలికలను నిరంతరం పరిశీలించారు. దాని కదలికలు కనిపించకపోవడంతో తిరిగి పులి మహారాష్ట్ర వైపు వెళ్లి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కానీ, మళ్లీ గుంజాల శివారులో పులి పాదముద్రలు కనిపించడంతో అదే పులి సంచరిస్తూ ఇటు వైపు వచ్చిందా.. లేదా వెరే పులి మహారాష్ట్ర వైపు నుంచి మళ్లీ వచ్చిందా.. అనేది తెలియాల్సి ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి పులి నుంచి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అదనపు కట్నం కోసం వేధించిన భర్తపై కేసు
లక్సెట్టిపేట: అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు మద్యంమత్తులో దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. లక్సెట్టిపేటలోని మోదెల నెహ్రుకు చెందిన మంచాల కవితను ఆమె భర్త మంచాల సుధాకర్ అదననపు కట్నం కోసం వేధిస్తున్నాడని తెలిపారు. 2009లో కవితకు సుధాకర్తో వివాహం జరుగగా, కూతురు(10) ఉందని, పెళ్లయిన ఏడాది నుంచే సుధాకర్ మద్యానికి బానిసై ఆమెను అనేక సార్లు కొట్టాడని తెలిపారు. ఈ విషయమై పలువురు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారని తెలిపారు. సుధాకర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గురువారం బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
ఇంద్రవెల్లి: అనారోగ్యంతో బాధపడుతూ మండలంలోని దస్నాపూర్గూడకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాయన్న, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దస్నాపూర్ పంచాయతీ పరిధి దస్నాపూర్గూడకు చెందిన కరాలే సిద్ధేశ్వర్ (23) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు, గ్రామస్తులు 108 అంబులెన్స్లో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించగా చిక్సిత పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి వృద్ధుడి ఆత్మహత్యభైంసాటౌన్: కడుపునొప్పి భరించలేక ఓ వృద్ధుడు గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. భైంసా పట్టణంలోని ధోబీగల్లీకి చెందిన తాండ్రోల్ల పోశెట్టి(66) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గురువారం గడ్డెన్న ప్రాజెక్టు నీటిలో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. సరిహద్దులో చోరీల కలకలంకెరమెరి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం లేండిగూడ గ్రామంలో చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. లేండిగూడ గ్రామానికి చెందిన సూర్యవంశీ రామేశ్వర్, భారతి దంపతులు పత్తితీత పనుల కోసం 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కాగజ్నగర్ మండలానికి వెళ్లారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో లైట్లు వేసి ఉండడాన్ని రామేశ్వర్ సోదరుడు నారాయణ గమనించాడు. బీరువా తెరిచి ఉండటంతో రామేశ్వర్ దంపతులకు సమాచారం అందించాడు. గురువారం బాధితులు ఇంటికి వచ్చి కెరమెరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీరువాలోని 5 గ్రాముల బంగారు గొలుసు, రూ.16వేల నగదు ఎత్తుకెళ్లారని వారు తెలిపారు. నెల రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాగ్మారే శివాజీ ఇంట్లోనూ దొంగలు పడి ఐదు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితులు మహారాష్ట్రలోని జివితి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ నగలు దొంగలు దొరకలేదు. -
విద్యార్థి అదృశ్యం కథ సుఖాంతం
చెన్నూర్: చెన్నూర్లోని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి పెద్దపోలు నాగవర్థన్ అదృశ్యం కథ సుఖాంతమైంది. విద్యార్థి అదృశ్యంపై తల్లిదండ్రులు స్వరూప, సమ్మగౌడ్, కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. బాలుడు క్షేమంగా రావడంతో స్థానిక పోలీసుస్టేషన్లో తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. నాలుగు రోజులు క్రితం నాగవర్థన్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో చెన్నూర్లోని మహాంకాళివాడలో నివాసం ఉంటున్న తండ్రి సమ్మగౌడ్ వచ్చి తీసుకెళ్లాడు. ఆరోగ్యం కుదుట పడడంతో బుధవారం ఉదయం 10:36 గంటలకు పాఠశాలలో అప్పగించాడు. సాయంత్రం 7గంటలకు పాఠశాల యాజమాన్యం తండ్రికి ఫోన్ చేసి విద్యార్థి పాఠశాలలో లేడని చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం పాఠశాల, పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలించి నాగవర్థన్ టాటా ఎస్లో మంచిర్యాలకు వెళ్లినట్లు గుర్తించారు. మధ్యాహ్నం సమ్మగౌడ్కు అతడి బంధువు ఫోన్ చేసి నాగవర్థన్ కరీంనగర్లో తన వద్ద ఉన్నాడని చెప్పాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెళ్లి తీసుకొచ్చారు. బాలుడిని విచారించగా చదువు ఇష్టం లేక వెళ్లిపోయినట్లు చెప్పాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సమావేశంలో ఎస్సైలు శ్యాంపటేల్, సుబ్బారావు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థులపై వేధింపులు
భైంసా: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో విద్యార్థులను పోలీసులు, యాజమాన్యం వేధిస్తున్నాయని, బెదిరింపులకు దిగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై హైదరాబాద్లో తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు గురువారం ఫిర్యాదు చేసినట్లు ఆప్ నేతలు తెలిపారు. విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ప్రశ్నిస్తే కేసులు పెడతామని, వారి భవిష్యత్తును నాశనం చేస్తామని బెదిరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన యాజమాన్యం, పోలీసులు వారిని భయపెట్టడం సరైన విధానం కాదని ఆప్ నేతలు విమర్శించారు. కొన్నేళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న వరుస విద్యార్థుల మరణాలు, ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు అయిన విద్యార్థుల ప్రాణరక్షణ, విద్యా హక్కుల పరిరక్షణ కోసం ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
అలరించిన ‘యూత్ పార్లమెంట్’ పోటీలు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో గురువారం నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలు ఆకట్టుకున్నాయి. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది గట్టు కుమార్ కార్తీక్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని యువతను సామూహికం చేసేందుకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఇలాంటి ఉపన్యాస పోటీలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. యువత ఆలోచన దృక్పథం మారాలని, సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ పోటీలో గెలుపొందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అక్కడ ప్రతిభ చూపిన ముగ్గురు పార్లమెంట్ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ కళాశాల నుంచి హాజరైన విద్యార్థులు ‘అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై ఉపన్యాసించారు. అసోసియెట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.లక్ష్మీనరసింహం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ, రిటైర్డ్ ఎంఈవో శంకరయ్య, కాగజ్నగర్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు తాళ్లపల్లి సురేందర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలు వేరు శ్రీనివాస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దత్తాత్రేయ, అకడమిక్ కోఆర్డినేటర్ జనార్దన్, అధ్యాపకులు రాజేశ్వర్, శారద, దేవేందర్, వెంకటేశం, క్రిష్ణవేణి, మేరి, శాంభవి, సోనియా పాల్గొన్నారు. -
పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ కె.హరిత జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జూ మ్ మీటింగ్ ద్వారా అదనపు కలెక్టర్ డేవిడ్, జి ల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టా ల్సిన అభివృద్ధి పనులపై కార్యాచరణ రూపొందించాలన్నారు. 10 అంశాలపై 99 రోజుల పా టు కార్యక్రమం కొనసాగుతుందని, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలన్నారు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ప్రగతి ప్రణాళికకు సంసిద్ధం
ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6 నుంచి 99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఐదు దశల్లో అమలు చేయనున్నారు. శుక్రవారం నుంచి జూన్ 12 వరకు 10 అంశాలతో వ్యవసాయం, విద్య, యువత క్రీడలు, మహిళలు, పర్యావరణం సంబంధిత అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని పరిశీలించి లోపాలను సరిచేయనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గురువారం కలెక్టర్ కె.హరిత హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణపై జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరించనుంది. గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహిస్తారు. 16న మండల స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరో గ్యం, అరైవ్– అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత– క్రీడలు, మహిళలు, పర్యావరణంపై దృష్టి సారిస్తారు. ఈ నెల 6న శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నాలుగు జిల్లాల కలెక్టర్లతో ఆదిలాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో చేపట్టే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 99 రోజుల్లో శాఖల వారీగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. పర్యవేక్షణకు మొబైల్ యాప్ రూపకల్పనప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించారు. ప్రజలు తమ దరఖాస్తుల స్థితిని పరిశీలించి అప్డేట్ పొందే అవకాశం కల్పించారు. 10 అంశాల ప్రగతి, గ్రామ సభలు, మండల సమావేశాల వివరాలను మొబైల్ యాప్లోనే నమోదు చేయనున్నారు. ఫిర్యాదులు, సూచనలు నేరుగా సమర్పించి, వాస్తవ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వం, ప్రజల మధ్య అంతరం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. కాగా శుక్రవారం ఈ మొబైల్ యాప్ విడుదల చేయనున్నారు. గ్రామ సభలు, మండల, జిల్లా స్థాయి సమావేశాల ద్వారా ప్రజలు తమ సూచనలు అందించడంతో పాటు ఫిర్యాదులు చేయవచ్చు. -
అవినీతిని అరికట్టాలని వినతి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల సాంఘిక సంక్షేమ అభివృద్ధి కార్యాలయంలో వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లోని నాలుగో తరగతి ఉద్యోగుల అక్రమ నియామకాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొన్ని వసతిగృహాల్లోనూ అక్రమంగా నియామకాలు చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నగేశ్, మహేశ్వర్, మహేశ్, సభ్యులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
రెబ్బెన: 108, 102కు కాల్స్ వస్తే తక్షణమే స్పందించాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అన్నా రు. మండల కేంద్రంలోని 108, 102 అత్యవసర అంబులెన్స్లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. అంబులెన్స్లో మెడికల్ స్టాక్, వైద్యపరికరాల పనితీరును పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్యం కోసం 108కు ఫోన్ చేస్తే సంఘటన స్థలానికి చేరుకుని సకాలంలో బాధితులను ఆస్పత్రులకు చేర్చాలన్నారు. విధుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం అవతలి వ్యక్తుల ప్రాణాలకు ముప్పు తెస్తుందని అన్నారు. వేసవి ఎండల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ఐస్ప్యాక్ బాక్స్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 108 మెడికల్ టెక్నీషియన్ రామన్న, పైలట్ సంతోష్ పాల్గొన్నారు. 108, 102 వాహనాలు తనిఖీవాంకిడి: మండలంలోని 108, 102 అత్యవసర అంబులెన్స్లను గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ తనిఖీ చేశారు. మందులు, పరికరాలు పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రవీణ్, అమృత్రావు, భీంరావు, రమేశ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో పన్నులు చెల్లించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలి టీ పరిధిలోని ప్రజలు పెండింగ్లో ఉన్న ఇంటి, ఇతర పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ గజానంద్ కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులో ఇంటింటికి వెళ్తూ యజమానుల వద్ద నుంచి బకాయి పన్నులు వసూలు చేశారు. ఆయన మాట్లాడుతూ 20 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని, దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నామన్నారు. ఇతర సమస్యలను కూడా పాలకవర్గం సహకారంతో త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చిలోనే భానుడి ప్రతాపం
కౌటాల: మార్చిలో భానుడు భగ్గుమంటున్నాడు. మూడు రోజులుగా వేసవి మంటలు తీవ్రమయ్యాయి. మార్చి ప్రారంభంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా, ఒకట్రెండు డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం మూడు రోజులుగా 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ తగ్గి ఉదయం 10 గంటల నుంచే జనం చెమటతో తడిసిపోతున్నారు. మరో వారంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు. ఏటా మంటలే.. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఏటా అధికంగా ఉంటోంది. సాధారణంగా మార్చి నుంచి మే మధ్య కాలాన్ని వేసవి సీజన్గా పరిగణిస్తాం. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారం నుంచే ప్రారంభమయ్యాయి. అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్లో ఏటా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గతేడాదితో పోల్చితే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్లో) ప్రాంతం ఉష్ణోగ్రతలు ఎల్కపల్లి 37.3 ఆసిఫాబాద్ 37.0 లోనవెల్లి 37.0 కౌటాల 36.9 బెజ్జూర్ 36.9 ధనోరా 36.8 రవీంద్రనగర్ 36.8కౌటాల మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు రెండు రోజుల క్రితం పని నిమిత్తం బైక్పై ఆసిఫాబాద్కు వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం ఎండలో ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో కొంత అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నాడు. ఎండలో బైక్పై ప్రయాణించడంతో వడదెబ్బ తగిలిందని, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని సదరు వైద్యుడు సూచనలు చేశారు... కాగా, మార్చిలోనే వడదెబ్బ తగిలే పరిస్థితులు ఉండగా, రానున్న రెండు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. -
కంట్రోలర్గా లక్ష్మణ్
కాగజ్నగర్: కాగజ్నగర్ బస్టాండ్ కంట్రోలర్గా ఆర్టీసీ ఉద్యోగి లక్ష్మణ్ను మంగళవారం నియమించారు. నాలుగు నెలలుగా కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులుపై ఫిబ్రవరి 28న ‘బస్టాండ్పై పట్టింపేది..?’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు డిపో మేనేజర్ రాజశేఖర్తో కలిసి ఈ నెల 2న బస్టాండ్ను సందర్శించారు. పారిశుద్ధ్యం, ఫ్యాన్లు పనిచేయకపోవడం, ఇతర సౌకర్యాలు పరిశీలించి ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగిని కంట్రోలర్గా నియమించారు. అలాగే మరమ్మతులు చేపట్టడంతో మంగళవారం నుంచి ఫ్యాన్లు తిరుగుతున్నాయి. -
సన్నగిల్లుతున్న ‘భరోసా’
రెబ్బెన: పంటల సాగుకు పెట్టుబడులు, యాజమాన్య ఖర్చులు పెరగడంతో రైతులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. అన్నదాతలకు ఆర్థిక చేయూతను అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించగా ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. ఏడాదికి ఎకరానికి రూ.12వేల చొప్పున రెండు సీజన్లకు అందిస్తామని ప్రకటించి గత వానాకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు కొనసాగుతోంది. జిల్లాలో ముందస్తుగా వేసిన పంటల దిగుబడి మరో రెండు నెలల్లో చేతికి అందనుంది. డిసెంబర్లో యాసంగి సీజన్ ప్రారంభంలో అందాల్సిన రైతుభరోసా సాయం ఇప్పటివరకు అందలేదు. గత యాసంగిలోనూ ఇదే తరహాలో ప్రభుత్వం ఊరించి.. చివరికి పెట్టుబడిసాయం అందించకుండానే దాటవేసింది. పెరిగిన పెట్టుబడి..జిల్లాలోని 15 మండలాల పరిధిలో యాసంగి సీజన్లో సుమారు 50,300 ఎకరాల్లో వరితోపాటు పప్పుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, తదితర పంటలు పండిస్తున్నారు. వానాకాలంలో సీజన్ ముగింపు సమయంలో కురిసిన అధిక వర్షాలతో ఈసారి చలితీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో సీజన్ మొదట్లో పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వరినారు ఎదుగుదల లేకపోవడంతో రైతులు నారు పెంచేందుకు అపసోపాలు పడ్డారు. తీరా చలితీవ్రత తగ్గుముఖం పట్టాక వాతావరణంలో విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పగలు ఎండలు, రాత్రి చలిగాలులు రైతులకు తలనొప్పిగా మారాయి. యాసంగి వరికి గతానికి భిన్నంగా తెగుళ్లు, పురుగు ఉధృతి ఉంది. ముందస్తుగా నాట్లు వేసిన చోట చలితో పైరులో ఎదుగుదల లేదు. రైతులు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు చల్లాల్సి వస్తోంది. దీనికితోడు సీజన్ ప్రారంభం నుంచి మొగిపురుగు, వేరుకుళ్లు తెగుళు, అగ్గితెగుళ్లు ఆశించడం క్రిమిసంహారక మందులను విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. దీంతో గతంలో కంటే ఈసారి పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. రైతులు అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు లభించేది. వానాకాలంలో 1,43,063 మందివానాకాలం సీజన్లో జిల్లాలోని 1,43,063 మంది రైతులకు ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయం కింద రూ.2,66,86,59,662 నగదు అందించింది. యాసంగి సీజన్లో ప్రభుత్వం సాగులో ఉన్న భూములకు మాత్రమే అందించాలని భావించింది. దీనికోసం శాటిలైట్ ద్వారా భూముల లెక్క తేల్చాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వానాకాలంలో సాయం అందుకున్న రైతులందరికీ యాసంగిలో అందిస్తామని తెలిపింది. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కేబినేట్ మీటింగ్లో రైతుభరోసా చెల్లింపుపై చర్చిస్తారని భావించారు. కానీ సమావేశం ఎలాంటి చర్చ లేకుండానే ముగిసింది. దీంతో యాసంగి పెట్టుబడిసాయం చెల్లింపుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తోంది. ఊరిస్తున్న ప్రభుత్వంరాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద వానాకాలం పంటల పెట్టుబడి సాయం ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమచేయగా.. యాసంగి సాయం అందించడంలో మాత్రం రైతులను ఊరిస్తోంది. పంచాయతీ ఎన్నికల సమయంలోనే రైతుభరోసా అందిస్తారని భావించగా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఎన్నికలు ముగియగానే రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. అయితే మున్సిపల్ ఎన్నికలు సైతం ముగిసినా ఉలుకుపలుకు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యాసంగి పంటల సీజన్ సగం పూర్తి కాగా.. మరో రెండు నెలల్లో పంట దిగుబడి సైతం చేతికందుతుంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో అందించా ల్సిన సాయాన్ని సీజన్ పూర్తయ్యే దశకు చేరుకున్నా విడుదల చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యాసంగి సీజన్లోనూ ఇదే తరహాలో ప్రభుత్వం రైతులను ఊరించి చివరికి పెట్టుబడి సాయాన్ని అందించకుండానే చేతులు దులుపుకొంది. -
డిమాండ్కు తగినట్లు సరఫరా
జిల్లాలో డిమాండ్కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పెరుగుతున్న విద్యుత్ లోడ్కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఓవర్ లోడ్ నియంత్రించేందుకు జిల్లాలో 14 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు ఏడు బిగించాం. అలాగే ఏబీ స్విచ్లు ఏర్పాటు చేస్తున్నాం. లోడ్ అధికంగా ఉన్న సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే దహెగాం, గుండాయపేట్, నజ్రూల్నగర్లో ఏర్పాటు చేశాం. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల్లో 33 కేవీ లైన్లు ఉన్నచోట కవర్ కండక్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. 70 కిలోమీటర్ల కేబుల్ అమర్చాం. – ఉత్తం జాడె, విద్యుత్ శాఖ ఎస్ఈ -
దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు చర్యలు
ఆసిఫాబాద్: దివ్యాంగులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో బుధవారం అధికారులు, దివ్యాంగుల హక్కుల కమిటీ సభ్యులతో హక్కులు, సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చేయూత పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద దివ్యాంగులకు తాగునీరు, నీడ, ప్రత్యేక టాయిలెట్ వసతితో పాటు సదరం శిబిరాల వద్ద వీల్చైర్లు, హెల్పర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం పథకాల్లో అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, అనుచితంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ మండలంలోని అధికారులతో దివ్యాంగుల సమస్యలపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఆర్డీవో దత్తారావు, దివ్యాంగుల హక్కుల సమితి ప్రతినిధులు ఇస్లాంబిన్ హసన్, గాలెం వెంకటేశ్, ఇప్ప రవి, శంకర్ పాల్గొన్నారు. ఇంటి వద్దకే రాములోరి కల్యాణ తలంబ్రాలుకాగజ్నగర్టౌన్: భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవ పవిత్ర తలంబ్రాలు, ప్రసాదాన్ని రాష్ట్రంలోని భక్తుల ఇళ్ల వద్దకే చేరవేసేందుకు తెలంగాణ పోస్టల్శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని కాగజ్నగర్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సిరికొండ సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతరాలయ అర్చన ప్యాకేజీ రూ.450 చెల్లిస్తే కల్యాణ తలంబ్రాలతోపాటు ఒక ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు అందిస్తారని పేర్కొన్నారు. ముత్యాల తలంబ్రాల ప్యాకేజీ రూ.151 చెల్లిస్తే కల్యాణ తలంబ్రాలు, పవిత్ర ముత్యం అందిస్తారన్నారు. భక్తులు సమీప పోస్టాఫీసుల్లో రుసుం చెల్లించి బుక్ చేసుకోవచ్చన్నారు. బుకింగ్ సమయంలో భక్తులు పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ప్రసాదం కోసం ఈ నెల 25తేదీలోగా బుకింగ్ చేసుకోవాలని కోరారు. వృద్ధాప్యం, అనారోగ్యం, దూరభారం, రద్దీ, ఇతర కారణంగా భద్రాచలం వెళ్లలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
డంపింగ్ యార్డులో చెత్తను కాల్చొద్దు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని కాలనీల్లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాక కాల్చొద్దని మున్సిపల్ కమిషనర్ తిరుపతి అన్నారు. కోసిని సమీపంలోని మున్సి పల్ డంపింగ్ యార్డును బుధవారం శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డులో చెత్తను ఎక్కడపడితే అక్కడ కాకుండా ఒక పక్కనుంచి వేయాలని, చెత్తకు నిప్పు అంట కుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
నేడు డిగ్రీ కాలేజీలో ‘యూత్ పార్లమెంట్’
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘50 సంవత్సరాల భారతదేశ అత్యవసర పరిస్థితి– భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల వారు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ప్రతీఒక్కరికి 3 నిమిషాల సమయం ఇస్తామన్నారు. భారత్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని లింక్ ద్వారా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విజేతలకు స్టేట్ లెవల్ పోటీలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తూడురు దత్తాత్రేయ, కోఆర్డినేటర్ దుర్గం జనార్దన్, అసిస్టెంట్ ప్రొ.శారద, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయికి 20 మంది ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ చూపిన 20 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, కోచ్ అరవింద్ తెలిపారు. ఎంపికై న వారికి మరో వారంపాటు కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, కోచ్ విద్యాసాగర్, హెచ్ఎం జంగు, పీడీలు రాకేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
లైన్మెన్ల పాత్ర వెలకట్టలేనిది
ఆసిఫాబాద్అర్బన్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో లైన్మెన్ల పాత్ర వెలకట్టలేనిదని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడె అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్లో బుధవారం లైన్మెన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన మండలాలకు చెందిన విద్యుత్ లైన్మెన్లు, సిబ్బందిని శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందించారు. విధులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఈ లక్ష్మి రాజ్యం, ఊర్మిల, సిబ్బంది పాల్గొన్నారు. -
● వేసవి ప్రారంభంలోనే ఎండలు ● ఉక్కపోతతో ఫ్యాన్లు, కూలర్ల వాడకం ● జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం
ఆసిఫాబాద్: జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్కు చేరువయ్యాయి. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఈ నెల 3న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,900 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోనూ 1,737 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు జిల్లా విద్యుత్శాఖ అధికారులు వెల్లడించారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, కౌటాలలో 132/33 కేవీ సబ్ స్టేషన్లు ఉండగా, 33/11 కేవీ సబ్స్టేషన్లు 34 వరకు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,77,479 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ కనెక్షన్లతో పాటు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 17.35 లక్షల యూనిట్లు వినియోగం కాగా, ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరుతుంది. మొదలైన ఫ్యాన్లు, కూలర్ల వాడకం రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమవుతుండంతో ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడడం ప్రారంభించారు. అలాగే అవసరాలకు అనుగుణంగా ప్రతీ ఇంట్లో విద్యుత్ గృహోపకరణాల వినియోగం పెరిగింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం మద్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ డిమాండ్ ఏకంగా 30 శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువ కావడంతో గ్రిడ్పై ఒత్తిడి పెరుగుతోంది. సాగుకు బోర్ల వినియోగం జిల్లాలో యాసంగి సాగు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు అవసరమైన సాగునీరందక రైతులు రాత్రిపూట బోర్లు అధికంగా వినియోగిస్తున్నారు. వేసవిలో సాధారణం కంటే అధికంగా విద్యుత్ పరికరాలు వినియోగించడంతో మీటర్లు స్పీడ్గా తిరిగి బిల్లులు పెరగనున్నాయి. గత నెల 25న 1.456 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, ఈ నెల 2న 1.735 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ లెక్కన వారం రోజుల్లోనే రోజుకు 0.279 మిలియన్ యూనిట్ల(17 నుంచి 18 మెగావాట్లు) విద్యుత్ వినియోగం పెరిగింది. జాగ్రత్తలు పాటిస్తేనే మేలు.. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ అవసరాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. వినియోగం నియంత్రించేందుకు ప్రతీ ఇంట్లోనూ ఎల్ఈడీ బల్బులు వాడాలని అధికారులు సూచించారు. ఇన్వర్టర్ గృహాలకు తక్కువ వాట్స్ విద్యుత్ సాధనాలు ఉపయోగించాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, ఏసీలు, వాటర్ హీటర్లు, టీవీలు ఆఫ్ చేయడం, రాత్రి సమయంలో వినియోగం తగ్గించాలి. రైతులు వ్యవసాయ పంపుసెట్లను ఉదయం లేదా మధ్యాహ్నం సరైన సమయాల్లో నడపాలి. డిప్ బ్కో సోలార్ పంపుసెట్లు, సౌరశక్తి ఆధారిత పరికరాలు ఉపయోగించడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గించవచ్చు. -
‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో కలెక్టర్
ఆసిఫాబాద్: హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులతో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక సమావేశానికి కలెక్టర్ కె.హరిత హాజరయ్యారు. శాఖల వారీగా 10 వివిధ థీమ్లతో 99 రోజులపాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. ఏప్రిల్ 2న గ్రామస్థాయిలో గ్రామ సభల నిర్వహణ, 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత
ఆసిఫాబాద్అర్బన్: వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని డీఎఫ్వో నీరజ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మాణిక్గూడ అ ర్బన్ పార్కులో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్యాలయ ఆవరణలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎఫ్వో కుటుంబ సభ్యులు, సి బ్బంది ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శు భాకాంక్షలు చెప్పుకున్నారు. రేంజ్ అధికారి గోవింద్చంద్ సర్దార్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేశ్ కులకర్ణి, ఝూన్సీ రాణి, సెక్షన్ అధికారులు సాయిచరణ్, మహేందర్, సతీశ్, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. పగలు వేడి, ఉక్కపోత మరింత పెరుగుతుంది. వేడి గాలులు వీస్తాయి. రాత్రి చలి పూర్తిగా తగ్గుతుంది. పరీక్షలకు ‘పది’ రోజులే..! పదో తరగతి వార్షిక పరీక్షలకు పది రోజుల సమయమే ఉంది. ప్రణాళికాబద్ధంగా చదివితే ఫలితం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 8లోu బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026 -
స్వచ్ఛ పాఠశాలలకు నిధులు
ఆసిఫాబాద్రూరల్: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాలల్లో పరిశుభ్రత, నీటి వసతి, హరిత వాతావరణం, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడానికి జాతీయస్థాయిలో స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్స్(ఎస్హెచ్వీఆర్) ఇస్తోంది. ఎస్హెచ్వీఆర్ కింద ఏటా జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికై న పాఠశాలకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు సైతం ప్రకటిస్తోంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఏడు పాఠశాలలు ఎంపికయ్యాయి. టాప్లో రెబ్బెన కేజీబీవీ..జిల్లాలో ఎస్హెచ్వీఆర్ కింద చేపట్టిన సర్వేలో 1173 పాఠశాలలు పాల్గొన్నాయి. క్షేత్రస్థాయిలో వీటిని పరిశీలించి రేటింగ్ ఇచ్చే బాధ్యతను 37 మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతంలో 1– 8 తరగతుల వరకు ఉన్న మూడు, 9– 12 తరగతులు ఉన్న మూడు, పట్టణ ప్రాంతంలో 9– 12 తరగతలు ఉన్న ఒక పాఠశాలను మూల్యాంకనం చేశారు. ఆనంతరం 4, 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు. పాఠశాలల్లో తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్ల శుభ్రత, చేతులు శుభ్రం చేసుకునే చోట సబ్బుల వినియోగం, నిర్వహణ తీరు, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు, సామర్థ్యాల పెంపు తదితర అంశాలను పరిశీలించారు. దీని ఆధారంగా జిల్లాలో ఉత్తమమైన ఏడు పాఠశాలలు ఎంపిక చేశారు. రేటింగ్లో 5 స్టార్స్తో రెబ్బెన కేజీబీవీ అగ్రభాగాన నిలిచింది. కౌటాల కేజీవీవీ, చిన్నరాస్పల్లి ఉన్నత పాఠశాల, సావర్ఖేడ్, రాంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, నాగవెల్లి ప్రాథమిక పాఠశాల, కాగజ్నగర్ పట్టణంలోని అరుణోదయ ప్రైవేట్ స్కూల్ 4 స్టార్స్ రేటింగ్ పొందాయి. -
‘వేతనాలు పెంచకుంటే సమ్మె తప్పదు’
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచకుంటే ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఏఐటీయూసీ రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ అన్నారు. మంగళవారం స్థానిక కోల్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ప్రతినిధికి సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నా.. కార్మిక చట్టాలు అమలు కాకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. బొగ్గు రవాణా చేసే లారీ డ్రైవర్లకు కనీస వేతనంగా రూ.32వేలు, క్లీనర్లకు రూ.18వేలు ప్రతినెలా 5లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్మికుడికి రూ.25లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, రూ.50లక్షల ప్రమాద బీమా కల్పించాలన్నారు. ఈపీఎఫ్ లేదా సీఎంపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏటా ఒక నెల జీతం బోనస్గా ఇవ్వాలని, ఎనిమిది గంటల పనివిధానాన్ని అమలు చేయాలన్నారు. సింగరేణి పర్మినెంట్ కార్మికులతో సమానంగా లారీ డ్రైవర్లు, క్లీనర్లకు లాభాల వాటా ఇవ్వాలన్నారు. డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీనివాస్, ప్రశాంత్, కృష్ణ, రాజు, చాందర్లాల్, మనోహర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగోత్సవం
వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో..జిల్లా కేంద్రంలో మహిళలతో ఎమ్మెల్యే కోవ లక్ష్మిపోలీసు సిబ్బందితో ఎస్పీ నితిక పంత్ వేడుకలుస్టెప్పులు వేస్తున్న ఎస్పీ నితిక పంత్ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబురాలు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే చిన్నారులు, యువకులు కేరింతలు కొడుతూ పరస్పరం రంగులు చల్లుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మిని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ నితిక పంత్ స్టెప్పులు వేస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్లు బాలాజీ వరప్రసాద్, సతీశ్, వామనమూర్తి, సత్యనారాయణ, కుమారస్వామి, సంతోష్కుమార్, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం నుంచి బ్యాండ్ మేళాతో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ బ్రాహ్మణవాడ, రావులవాడ, పొట్టి శ్రీరాములు చౌక్, అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, క్లబ్ ప్రతినిధులు మర్యాల ఉదయబాబు, బాల శ్రీనివాస్, కలకుంట్ల శ్రీధర్, సభ్యులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసుల స్టెప్పులుకేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో..బ్రాహ్మణవాడలో హోలీ వేడుకలు -
ఘనంగా సత్యాగ్రహ దివస్
వాంకిడి: మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో సోమవారం సత్యాగ్రహ దివస్ ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షతో మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో గల రామ మందిరంలోకి దళితులకు ప్రవేశం కల్పించారని తెలిపారు. బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్, నాయకులు రోషన్ ఉప్రె, దుర్గాజీ, విజయ్ ఉప్రె, ప్రతాప్ రాంటెంకి, ప్రకాశ్, ప్రసాద్, నూతన్, స్వాగత్ పాల్గొన్నారు. -
బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు అన్నారు. పట్టణంలోని బస్టాండ్ను సోమవారం ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్తో కలిసి తనిఖీ చేశారు. బస్టాండ్లోని మూత్రశాలలు, తాగునీటి వస తి, సైకిల్ స్టాండ్ పరిసరాలను పరిశీలించా రు. బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తుందని, ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ లేకనే బస్టాండ్ అపరిశుభ్రంగా తయారవుతుందని మండిపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందిస్తే నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
కుమురం భీం
9వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. పగలు వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. వేడుక.. కావొద్దు విషాదం ఆనందోత్సాహాలతో జరుపుకొనే హోలీ నిర్లక్ష్యం కారణంగా విషాదం మిగల్చొద్దు. వాగులు, నదుల్లోకి స్నానానికి వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. 10లోu మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026 -
అదుపులేని వేగం..!
కర్రతో ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న లారీ అధిక లోడ్ కారణంగా ఫిబ్రవరి 25న ఆసిఫాబాద్ మండలం బూర్గుడ వద్ద ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. అదేరోజు సిమెంట్ ఇటుకల లోడ్తో వస్తున్న ట్రాక్టర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు ఎదుట మలుపు తిరుగుతున్న క్రమంలో పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రెబ్బెన మండల కేంద్రంలోని పీహెచ్సీ సమీపంలో ఫిబ్రవరి 27న బిస్కెట్ల లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కాగజ్నగర్ వైపు వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడడంతో సరుకు రోడ్డుపై పడింది. డ్రైవర్ ఖాజా పాషాకు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అలాగే గత నెలలో చింతలమానెపల్లి మండలం కర్జెల్లి సమీపంలో కంకర టిప్పర్ బోల్తా పడింది. కౌటాల: జిల్లాలోని రహదారులపై వందలాది వా హనాలు, కంకర టిప్పర్లు, సరుకు లారీ రయ్.. రయ్.. అంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో అదుపులేని వేగం, పరిమితికి మించి ఓవర్ లోడ్ కారణంగా హెవీ వాహనాలు బోల్తా పడుతున్నాయి. దీనిపై గనుల శాఖ, రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 32 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 18 మంది మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు. మరోవైపు పోలీస్ శాఖ అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలకు జరిమానాలు విధిస్తోంది. గత నెల 23న రెబ్బెన మండల కేంద్రంలో అధిక లోడ్తో వెళ్తున్న 13 లారీలకు రూ.13 వేల జరిమానా విధించారు. అలాగే గత నెల 25న అధిక లోడ్తో వెళ్తున్న 19 లారీలకు రూ.16,700 జరిమానా విధించారు. కఠిన చర్యలు కరువువాహనాల రాకపోకలు, ఓవర్ లోడ్పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. రవాణా శాఖ, మైనింగ్, ఇతర శాఖల అధికారులు నిత్యం తనిఖీలు చేపడుతూ జరిమానా విధించాలి. అవసరమైతే డ్రైవర్లతోపాటు యజమానులపైనా కేసులు నమోదు చేయాలి. కానీ జిల్లాలో ప్రమాదాలు జరిగిన తర్వాత నామమాత్ర పు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓవర్ లోడ్తో దొరికే లారీలను తొలుత సీజ్ చేసి యజమానులకు భారీ ఫైన్లు విధించడం, డ్రైవర్ లైసెన్సు రద్దు చేయడం, మళ్లీ అదే పునరావృతమైతే వాహన పర్మిట్లను రద్దు చేసే అధికారం ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. ట్రక్కుల్లో స రుకులు నింపేటప్పుడే లోడ్ పరిమితులను పాటించేలా, ఒక వేళ ఓవర్ లోడ్తో వాహనాలు రోడ్డు మీదకు వస్తే నిర్వాహకులకు భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఓవర్ లోడ్తో ప్రమాదాలుజిల్లాలో వాహనాలు అతివేగం, అధిక లోడుతో ఇష్టారాజ్యంగా దూసుకుపోతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా క్వారీల యజమానులు పొరుగు రాష్ట్రాలకు కంకర తరలించే క్రమంలో గ్రామీణ రోడ్లను వినియోగిస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్లు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా వాహనాల్లో అధిక లోడుతో విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని తరలిస్తున్నారు. మరోవైపు నిత్యం వాగులు, నదుల నుంచి అక్రమంగా ఓవర్ లోడుతో ఇసుక రవాణా సాగుతోంది. ఈ వాహనాలు, టిప్పర్లు, ట్రాక్టర్లు కనీస నిబంధనలు పాటించడం లేదు. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా అవి 25 నుంచి 26 టన్నులు, 12 టైర్ల లారీ 26 టన్నులకు బదులు సుమారు 32 టన్నులకు పైగానే లోడ్తో తిప్పుతున్నారు. ట్రాక్టర్లలో సైతం నిర్దిష్ట ప్రమాణాల కంటే ఎక్కువ టన్నులు లోడింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించాల్సి ఉండగా 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. అధిక లోడ్ కారణంగా డ్రైవర్లకు వాహనాలపై కంట్రోల్ కాక అదుపు తప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. ప్రత్యేక బృందంతో తనిఖీలు జిల్లాలో అధిక లోడ్, అతివేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అధిక లోడ్ తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చే శాం. తరచూ తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నాం. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. – రాంచందర్, ఆర్టీవో -
పట్టణ సమస్యలు పరిష్కరించాలని వినతి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణ పరిధి లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి అనిత, బీఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందించారు. పట్టణంలో తాగునీటి సరఫరాలో లోపాలు, గుంతల రోడ్లు, మురుగు కాలువల శుభ్రత, స్ట్రీట్లైట్ల ఏర్పాటు తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీ సుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కౌ న్సిలర్లు సీపీ విద్యావతి, వలీ, వనమాల శ్రీధర్, వసీం, బాబురావు పాల్గొన్నారు. -
ఏరియాలో 126శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా ఫిబ్రవరిలో 126 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరిలో ఏరియాకు 3లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 3.77 లక్షల టన్నులతో 126 శాతం ఉత్పత్తిని సాధించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలరోజుల వ్యవధిని సద్వినియోగం చేసుకుని, గడువులోగా వందశాతం వార్షిక ఉత్పత్తి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఏరియాలో ఉత్పత్తి వేగం పుంజుకుందన్నారు. అధిక వర్షాలతో కోల్పోయిన ఉత్పత్తిని సాధించేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఉత్పాదకతలో బెల్లంపల్లి ఏరియా 99 శాతంతో కొనసాగుతోందని, వందశాతం సాధించేందుకు ఉద్యోగులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఐఈడీ డీజీఎం ఉజ్వల్కుమార్ బెహారా, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం ఇప్పల నవగాంలోని పట్టా భూమికి పాసుపుస్తకం జారీ చేయాలని జెండాగూడకు చెందిన కామ్రె సోంబాయి దరఖాస్తు చేసుకుంది. మరణించిన తండ్రి పేరుతో గల పట్టా భూమిని తన పేరుతో విరాసత్ చేయాలని బెజ్జూర్ మండలం సలుగుపల్లికి చెందిన జనగాం ఫకీరు విన్నవించాడు. వాంకిడి మండలంలోని తన రిజిస్టర్డ్ మూడు ప్లాట్లకు రూ.43,785 ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించినప్పటికీ ఇప్పటివరకు ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని జిల్లా కేంద్రంలోని మార్కండేయ కాలనీకి చెందిన అనుమాండ్ల గణేశ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. కౌటాల మండలం వీర్ధండి గ్రామానికి చెందిన సిడాం తుకారాం తన పట్టా భూములను తనకు తెలియకుండా ఇతరులకు పట్టా చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరాడు. కాగజ్నగర్కు చెందిన అల్స రాజేశ్, జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన కాట్కర్ కల్పన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీపీఆర్వోతో వచ్చే రిజండర్లపై 48 గంటల్లోగా నివేదికలు అందించాలని సూచించారు. కలెక్టరేట్లో శ్రీపాదరావు జయంతిఆసిఫాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా దుద్దిళ్ల శ్రీపాదరావు ఎనలేని సేవలందించారని కలెక్టర్ కె.హరిత అన్నారు. శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మంథని శాసనసభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా శ్రీపాదరావు చేసి న సేవలను కొనియాడారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా, గాంధేయవాదిగా పేరు పొందారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, కలెక్టరేట్ ఏవో కిరణ్, అధికారులు పాల్గొన్నారు. -
మున్సిపల్ పాలకవర్గం
బాధ్యతలు స్వీకరించిన ఆసిఫాబాద్: ఇటీవల ఎన్నికై న ఆసిఫాబాద్ పాలకవర్గ సభ్యులు జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తోపాటు కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలంబిన్ అహ్మద్, కుర్సెంగ బాలకృష్ణ, దూడల లక్ష్మి, గుబుడె నాగుబాయి, జేబాషేక్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్షణలో రిజిస్టర్లో సంతకాలు చేశారు. తొలుత చాంబర్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, రాజంపేట పంచాయతీని బీఆర్ఎస్ కై వసం చేసుకుందని తెలిపారు. ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీకి తాను సైతం సర్పంచుగా సేవలందించానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లా కేంద్రంలో రూ.35 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఆస్పత్రి, మెడికల్ కాలేజీ, పిల్లల పార్కు ఇతర అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు శాలువాలు, పూలదండలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్సోకోల సరస్వతి, బీఆర్ఎస్ నాయకులు అహ్మద్, నిసార్ తదితరులు పాల్గొన్నారు. ఫొటోల రగడఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్లో నాయకుల ఫొటోలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫొటోలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోషల్ మీడియాలో అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు మంచిర్యాల కార్పొరేషన్లో అక్కడి ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎమ్మెల్యేల ఫొటోలపై అభ్యంతరం తెలపడం సరికాదని వారు పేర్కొన్నారు. -
భక్తిశ్రద్ధలతో కామదహనం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని పలు ఆల యాలు, కూడళ్ల వద్ద సోమవారం రాత్రి ప్రజలు భక్తిశ్రద్ధలతో కామదహనం నిర్వహించారు. కేశవనాథస్వామి ఆలయంలో స్వామి వారికి అర్చకులు ఒజ్జల నరేష్శర్మ ఆధ్వర్యంలో డోలోత్సవం చేపట్టా రు. పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యే క భజనా కార్యక్రమాలు, పూజలు చేశారు. బ్రాహ్మణవాడ గణపతి దేవాలయం వద్ద అర్చకుడు శిరీష్ శర్మ పూజలు చేసి రాత్రి 7.20 గంటలకు కామదహనాన్ని ప్రారంభించారు. కాగా, జాజిరి ఆటలతో కా లనీలు సందడిగా మారాయి. చిన్నారులకు బత్తీసపేర్లను మేడలో హారంగా వేసి అలంకరించారు. -
పల్లెల్లో పులారా సందడి
ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో సోమవారం పులారా సందడి నెలకొంది. ప్రజలు ఉదయమే ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు. ప్రతీ ఇంటి నుంచి కుడుకలు తెచ్చి గ్రామ పటేల్కు అందించారు. అలాగే వెదురు బొంగులకు మాతార, మాతరల్గా నామకరణం చేసి కుడుకలు, గారెలు, వంకాయలు, ఉల్లిగడ్డలు, చక్కెర బిల్లలు కట్టారు. అనంతరం గ్రామ పొలిమేరకు డోలు, సన్నాయిలతో తరలివెళ్లి కాముడి దహనం చేపట్టారు. పటేళ్ల ప్రత్యేక పూజల అనంతరం.. యువకులు మంటల నుంచి దూకేందుకు పోటీ పడ్డారు. రొట్టెలు, పప్పులు తీసుకువచ్చి కాముడి దహనం వద్ద మళ్లీ పూజలు చేశారు. సహపంక్తి భోజనాల అనంతరం రాత్రంతా అక్కడే బస చేసి ఆడిపాడారు. మంగళవారం గిరిజన గ్రామాల్లో దురాడి పండుగ(హోలీ) సంబురాలు జరుపుకోనున్నారు. – కెరమెరి సాకడలో కుడకలు స్వీకరిస్తున్న గ్రామ పటేల్సాకడలో చక్కెర బిల్లలు కడుతూ..వేడుకల్లో యువకులు.. -
ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
కాగజ్నగర్టౌన్: ప్రజలు ఆధ్యాత్మికను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బా బు అన్నారు. కాగజ్నగర్ పట్టణం న్యూకాలనీలోని గాయత్రీ మందిర్లో ఆదివారం గాయత్రీ పరివార్ ఆధ్వర్యంలో చేపట్టిన 24 కుండీల మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయత్రీ పరివార్ గొప్ప ఆధ్మాతిక సమూహంగా ఏర్పడి ప్రజల్లో వైదిక, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్రావు, ఎస్పీఎం జీఎం అనిల్కుమార్, హనుమంతరావు, రామకృష్ణ, లోకేశ్కుమార్, భక్తులు పాల్గొన్నారు. -
పంటల సర్వేలో వలంటీర్లు
కాగజ్నగర్టౌన్: గ్రామాల్లో పంటల సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించింది. జిల్లాలోని ఆసక్తి ఉన్నవారు స్థానికంగా పంటల సర్వేకు ఏఈవోలను సంప్రదించి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వారికి ఏఈవోలు యాప్ ద్వారా అవగాహన కల్పిస్తారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు డీసీఎస్(డిజిల్ క్రాప్ సర్వే) యాప్లో పేరు, విద్యార్హతలు, బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వేలో భాగంగా పంటల ఫొటోలు అప్లోడ్ చేస్తే ఒక్కో ఫొటోకు రూ.7 చొప్పున 45 రోజుల సర్వే అనంతరం నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు. 4.45లక్షల ఎకరాల సాగు భూమిజిల్లాలో లక్షా 36 వేల మంది రైతులు ఉండగా.. వారు 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వానాకాలం సీజన్లో 3,35,363 ఎకరాల్లో పత్తి సాగు ఉండగా, వరి 56,861 ఎకరాలు, కంది 30,430 ఎకరాలు, పెసర, మినుములు, జొన్న, కూరగాయలు తదితర పంటలు 22,395 ఎకరాల్లో సాగు చేశారు. ఇక యాసంగి సీజన్లో 50,300 ఎకరాల్లో వరితోపాటు పప్పుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, తదితర పంటలు పండిస్తారు. యువతకు సదావకాశం పంటలు సర్వే చేసేందుకు గ్రామీణ యువకులకు కేంద్ర ప్రభుత్వం సదావకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సంబంధిత ఏఈవోలను సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. జిల్లాలో సర్వే చేసేందుకు యువకులు ముందుకు రావడం లేదు. వచ్చినా వారు కూడా సర్వే చేయడంలేదు. ఈ అవకాశాన్ని ఆసక్తి గలవారు వినియోగించుకోవాలి. – వెంకట్, జిల్లా వ్యవసాయాధికారిఅర్హతలివే..రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, ఎరువులు, ఇతర పథకాల అమలు కోసం ప్రభుత్వాలు ఏటా పంటల సర్వే నిర్వహిస్తాయి. ఈ వివరాల ఆధారంగానే ఏ పంట ఎన్ని క్వింటాళ్లు సేకరించాలి.. ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. ఎలాంటి ఏర్పాట్లు కల్పించాలి అనే అంశాలను నిర్ణయిస్తారు. ప్రస్తుతం వలంటీర్లతో పంటల సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు అందరూ అర్హులే. గ్రామంలో స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వ్యవసాయం అవగాహన ఉండి, మొబైల్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి. యాప్ ద్వారా సమాచారం అప్లోడ్ చేయగలగాలి. అప్లోడ్ చేసే పంట ఫొటోల సంఖ్య ఆధారంగా నగదు చెల్లిస్తారు. 45 రోజుల వరకు పనిచేయాల్సి ఉంటుంది. అనంతరం వారికి ఎమౌంట్ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. వలంటీర్లుగా చేసేవారు గ్రామంలోని పొలాలకు వెళ్లి ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేస్తున్నాడో వివరాలు యాప్లో నమోదు చేయాలి. పంటల వివరాలు, రైతు వివరాలు, సర్వే నంబర్, సాగు విస్తీర్ణం తదితర వివరాలు పక్కాగా సేకరించాల్సి ఉంటుంది. -
కుమురం భీం
7చాలా వరకు ఎండగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రిపూట చలిప్రభావం తగ్గుతుంది. జనసంద్రమైన ‘వెంకన్న’ జాతర కెరమెరిలో ఆదివారం వేంకటేశ్వర స్వామి జాతర జనసంద్రమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 9లోu సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026 -
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉపేందర్
ఆసిఫాబాద్అర్బన్: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ నియమితులయ్యా రు. వరంగల్ జిల్లాలో శనివారం జరిగిన నాలుగో రాష్ట్ర మహాసభల్లో ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం.నరసింహ తెలి పారు. ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. -
బీమాతో భరోసా
ఆసిఫాబాద్అర్బన్: కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తూ, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది. వారి జీవితాలకు మరింత ఆర్థిక భద్రతను కల్పిస్తూ, ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల బీమా పరిహారం అందించడంతో పాటు ఆమె పేరిట ఉన్న రుణాన్ని కూడా పూర్తిగా మాఫీ చేయనుంది. భరోసానిచ్చే ఈ తాజా నిర్ణయంతో మహిళా సంఘాల సభ్యుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహిళలకు చేయూత...జిల్లాలో వివిధ సమాఖ్యల్లోని 8,180 సంఘాల్లో 93,796 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా సీ్త్రనిధి రుణాలతోపాటు బ్యాంకు లింకేజీ రుణాలు పొందుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ, పట్టణ, పర్యాటక ప్రాంతాల్లో ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి బీమా పథకాలు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రుణబీమా పథకాల్లో 101 రిజిస్ట్రేషన్లు పూర్తికాగా, ప్రమాద బీమా కింద 8 రిజిస్ట్రేషన్లు జరిగాయి. లోన్ బీమాలో 42 మంది సభ్యులకు రూ.43 లక్షల ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ చేశారు. ప్రమాద బీమాలో ముగ్గురు సభ్యులకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు చెల్లించారు. మహిళా సంఘాల్లోని సభ్యులు బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవా లని అధికారులు సూచిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో మహిళలు బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. రుణబీమాలో 42 మంది సభ్యులకు రూ.43 లక్షలు చెల్లించాం. అలాగే ప్రమాద బీమాలోనూ ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున చెల్లించాం. ఆపదలో బీమా అండగా ఉంటుంది. – ఆర్.శ్రీనివాస్, సీ్త్రనిధి ఆర్ఎం అవగాహన కల్పిస్తున్నాం ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. రుణం పొందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే, రూ.10 లక్షల బీమాతో పాటు రుణమాఫీ అవుతుంది. దీనిపై మహిళా సంఘాల సభ్యులకు సెర్ప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవో అర్హులు వీరే..గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 18– 59 సంవత్సరాల వయస్సు కలిగి, స్వయం సహాయక సంఘంలో స భ్యురాలిగా ఉన్న వారికి బీమా వర్తించనుంది. మహిళా సంఘం సభ్యురాలు స హజ మరణం చెందితే, వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. అదే సీ్త్రనిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణి స్తే, ప్రభుత్వం ద్వారా అందించే రూ.10 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమవుతుంది. దీంతో పాటు వారు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేస్తారు. 50 శాతానికి మించి అంగవైకల్యం ఏర్పడితే, సదరం ధ్రువపత్రాన్ని పరిశీలించి రూ.5 లక్షలు అందించనున్నారు. -
రుణ లక్ష్యం చేరేనా..!
తిర్యాణి: మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహయక సంఘాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సంఘాల్లోని సభ్యులకు వారి అవసరాల మేరకు తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేస్తోంది. మహిళలు రుణాలను స్వయం ఆర్థికాభివృద్ధికి కోసం వినియోగించుకుని ప్రతినెలా సులభమైన వాయిదాల రూపంలో బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 29 రోజుల గడువు మాత్రమే ఉండగా అధికారులు లక్ష్య సాధనపై దృష్టి సారించారు. ఇప్పటివరకు 70.89శాతం రుణాలు పంపిణీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గడువులోగా లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రూ.164.76 కోట్ల చెల్లింపులుస్వయం సహయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.232.43 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు రూ.164.76 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు అందించారు. 70.89 శాతం లక్ష్యం చేరుకున్నారు. జిల్లాలో అత్యధికంగా సిర్పూర్(టి) మండలంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.14.77 కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా.. 414 మహిళా సంఘాలకు రూ.14.67 కోట్ల రుణాలు అందించారు. రెబ్బెన మండలంలో 633 సంఘాలకు రూ.22.60 కోట్ల రుణాలకు రూ.19.72 కోట్లు మంజూరు చేశారు. అలాగే అత్యల్పంగా లింగాపూర్ మండలంలోని రూ.5.58 కోట్ల రుణ లక్ష్యానికి 142 సంఘాలకు కేవలం రూ.2.49 కోట్లు మాత్రమే అందించారు. ఆ మండలం జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. గతేడాది రాష్ట్రస్థాయిలో రెండోస్థానంఎస్హెచ్జీ సంఘాలకు రుణాలు అందించడంలో జిల్లా ఆదర్శంగా నిలుస్తోంది. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేసి రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలవడం విశేషం. మరో 30 రోజు ల గడువు ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగి సేలోగా టార్గెట్ చేరుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతోపాటు రుణాల రికవరీపైనా ఐకేపీ సిబ్బంది దృష్టి సారించారు. నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.మండలం సంఘాలు లక్ష్యం పంపిణీ ఆసిఫాబాద్ 538 20.69 15.59 బెజ్జూర్ 352 13.74 6.52 దహెగాం 436 16.33 12.90 జైనూర్ 364 13.03 9.78 కాగజ్నగర్ 752 27.71 19.99 రెబ్బెన 633 22.60 19.72 సిర్పూర్(యు) 195 7.07 4.78 సిర్పూర్(టి) 414 14.77 14.67 వాంకిడి 614 22.63 18.88 తిర్యాణి 393 14.13 7.36 పెంచికల్పేట్ 193 7.02 3.50 లింగాపూర్ 142 5.58 2.49 కౌటాల 486 17.77 11.29 కెరమెరి 425 15.77 10.38 చింతలమానెపల్లి 357 13.53 6.83 లక్ష్యం చేరుకుంటాం 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు రూ.232.43 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటివరకు రూ.164.76 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు పంపిణీ చేశాం. గడువు ముగిసేలోగా వందశాతం లక్ష్యం చేరుకుంటాం. ఈ మేరకు సిబ్బందితో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నాం. వందశాతం రుణాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవో -
సరస్వతికి జాతీయస్థాయి పురస్కారం
ఉట్నూర్రూరల్: ఆదివాసీలకు దక్కాల్సిన అటవీ హక్కులు, మహిళా సాధికారితపై నిరంతరం కృషి చేస్తున్న ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన మర్సుకోల సరస్వతికి జాతీయస్థాయి పురస్కారం లభించింది. ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ‘యాక్షన్ ఎయిడ్ సంస్థ’ నిర్వహించిన ‘ఫారెస్ట్ లైవ్లీ హుడ్ ఐడెంటిటీ’పై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి సరస్వతి పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ సందీప్ చాచ్రా, ఎస్తేర్ సెల్వం చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
చిన్నారులకు ‘ఏకరూప’ కానుక
కెరమెరి: అంగన్వాడీ కేంద్రాలకు యూనిఫాం పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. చిన్నారులకు వారి కొలతలకు అనుగుణంగా కుట్టిన దుస్తులు అందిస్తున్నారు. మరో 15 రోజుల్లో జిల్లావ్యాప్తంగా పంపిణీ పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఏటా ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఏకరూప దుస్తులు(యూనిఫాం) పంపిణీ చేస్తోంది. తరగతి గదిలో పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా విద్యార్థులందరినీ సమాన దృష్టితో చూడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని మరింతగా విస్తరిస్తూ అంగన్వాడీ కేంద్రాలకు వర్తింపజేశారు. చిన్నారులకు సైతం ఏకరూప దుస్తులను అందించాలని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. చిన్నారుల్లో సమానత్వ భావనను పెంపొందించడంతోపాటు అంగన్వాడీ కేంద్రాలపై ఆకర్షణ పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఈ మేరకు బాలబాలికలకు సరిపడా యూనిఫాం వ స్త్రం ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. వీటిని కుట్టించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. వస్త్రాన్ని మహిళా సంఘాలకు చెందిన టైలర్లకు అప్పగించగా కుట్టు పనులు ముమ్మరంగా సా గుతున్నాయి. దుస్తులను తీసుకెళ్లి కుట్టించడంలో తొలుత కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెలాఖరుకల్లా జి ల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులందరికీ అందించాలన్న లక్ష్యంతో ప్రక్రియను వేగవంతం చే శారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ స్థాయిలోనే చిన్నారులకు యూనిఫాం అందిస్తుండటంపై తల్లిదండ్రుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. 5,240 మందికి యూనిఫాంజిల్లాలో ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్నగర్, సిర్పూర్, వాంకిడిలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 3 నుంచి ఆరేళ్లలోపు బాలురు 12,310 మంది, బాలికలు 12,455 మంది మొత్తం 24,765 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ ఏకరూప దుస్తులు కుట్టిస్తున్నారు. ఈ ఐదు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 40 సెక్టార్లు, 1,006 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆసిఫాబాద్ ప్రాజెక్టు పరిధిలోని 11 సెక్టార్లలో 5,240 మంది చిన్నారులకు ఏకరూప దుస్తులు అందించారు. వాంకిడి ప్రాజెక్టులోని అన్ని కేంద్రాలకు చెందిన యూనిఫాంలను ఆసిఫాబాద్లోనే కుట్టించారు. ప్రస్తుతం ఇవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కాగా, బాలికలకు ఎరుపు, బూడిద రంగు గౌన్లు, బాలురకు ఎరుపు, బూడిద రంగు చొక్కాలు, నీలం రంగు నిక్కర్లు అందిస్తున్నారు. ఒక్కో చిన్నారికి రెండేసి జతల చొప్పున పంపిణీ చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో 434 అంగన్వాడీలుజిల్లాలోని మొత్తం 1,006 అంగన్వాడీ కేంద్రాల్లో 434 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లోనే కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో 6,784 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. వీరు పాఠశాల విద్యార్థులతో కలిసిమెలిసి ఉంటున్న నేపథ్యంలో వీరికి గతంలోనే ఒక జత యూనిఫాం అందించారు. త్వరలో రెండో జత అందించనున్నారు. అయితే కొన్నిచోట్ల యూనిఫాంలు కుట్టడంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 15 రోజుల్లో పంపిణీ పూర్తి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు 15 రోజుల్లో యూనిఫాం పంపిణీ పూర్తి చేస్తాం. ఇప్పటికే ఆసిఫాబాద్ ప్రాజెక్టు పరిధిలోని అన్ని కేంద్రాల్లో దుస్తుల పంపిణీ పూర్తి కాగా, మరో రెండు రోజుల్లో వాంకిడి ప్రాజెక్టు వారికి అందిస్తాం. యూనిఫాంలు కుట్టి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. హోలీ పండుగ నేపథ్యంలో పంపిణీ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది – ఆడేపు భాస్కర్, సంక్షేమశాఖ పీడీ -
కాగజ్నగర్లో అయ్యప్ప ధర్మప్రచార సభ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని వాసవి మినీ ఫంక్షన్ హాలులో ఆదివారం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార జిల్లా సభ నిర్వహించా రు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లం రాజు హాజరై మాట్లాడారు. ధర్మ ప్రచా ర సభ ఆధ్వర్యంలో శబరిమల సమీపంలోని నారాయణతోడ్ సమీపంలో గల అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే పలు సేవా కా ర్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని కో రారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర కోశాధికారి రమేశ్, భిక్షపతి, ఈదుల జ్యోతిష్, విజయ్ కుమార్, సాయికృష్ణ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
కాగజ్నగర్టౌన్: ప్రశాంత వాతావణంలో పవిత్ర రంజాన్ పండగను జరుపుకోవాలని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం చిరువ్యాపారులు, ముస్లిం పెద్దలతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మా సాన్ని పురస్కరించుకుని వ్యాపారులు నిర్ణీత సమయం వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని సూచించారు. పట్టణంలో అనుమానిత వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలన్నారు. సమావేశంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు ఎత్తివేయాలి
రెబ్బెన: క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఇన్చార్జిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వెళ్లిన ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. గోలేటి టౌన్షిప్లోని టీబీ జీకేఎస్ యూనియన్ కార్యాలయంలో శనివా రం మాట్లాడారు. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత ఉన్నా కాంగ్రెస్ పార్టీ, మంత్రి వివేక్ అధికార బలంతో చైర్మన్ ఎన్నికను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. పోలీసులు ఇప్పటికైనా బీఆర్ఎస్ నా యకులపై కేసులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధారావత్ మంగీలాల్, సెంట్రల్ కమిటీ నాయకులు సత్యనారాయణ, ఫిట్ కార్యదర్శి మెరుగు రమేశ్, ఆఫీస్ ఇన్చార్జి మహేందర్, నా యకులు వీరస్వామి, సీహెచ్పీ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో మృత్యుపాశాలు
పెంచికల్పేట్: అటవీ సమీప ప్రాంతాల్లోని విద్యుత్ తీగలను ఆసరాగా చేసుకుంటున్న వేటగాళ్లు రాత్రిపూట అక్రమంగా కరెంట్ కంచె ఏర్పాటు చేసి అటవీ జంతువులను హతమారుస్తున్నారు. వేటగాళ్ల ఉచ్చులకు పెద్దపులులు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, నీలుగాయిలు, కొండగొర్రె, సాంబార్లు బలవుతున్నాయి. గతేడాది పెంచికల్పేట్ రేంజ్లోని కోయచిచ్చాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి కే8 అనే పెద్దపులి మృతి చెందగా.. తాజాగా అదే ప్రాంతంలో గత నెల 22న వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి నీలుగాయి మృతి చెందింది. రేంజ్ పరిధిలో విద్యుత్ తీగలు అమర్చి పెద్దపులి, ఎలుగుబంట్లు, దుప్పులు, నీలుగాయిలను వేటాడుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ లైన్ తొలగింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వేటకు అడ్డుకట్ట పడటం లేదు. పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించి వేటగాళ్లపై కేసులు నమోదు చేస్తున్నా వారి తీరు మారడం లేదు. ఒకే ప్రాంతంలో వేట..పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని ఎల్లూర్, మేరెగూడ, కోయచిచ్చాల, లోడుపల్లి, కొండపల్లి ప్రాంతాల్లో వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడుతున్నారు. కోయచిచ్చాల ప్రాంతం నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైను వన్యప్రాణులకు శాపంగా మారింది. ఇదే ప్రాంతంలో అటవీ జంతువుల సంచారం పెద్దఎత్తున ఉంటుంది. దీంతో ఇదే లైనుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేసి ఏటా పదుల సంఖ్యలో వన్యప్రాణులను హతమారుస్తున్నారు. గతేడాది కే8 పెద్దపులి సైతం ఇదే ప్రాంతంలో విద్యుత్ తీగలకు బలికాగా కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు 32 మందిని అరెస్టు చేశారు. కేసుల నమోదుతో సరి..వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా వేట నిరంతరం సాగుతూనే ఉంది. అటవీ ప్రాంతంలో నీటి వసతి కల్పించడంతోపాటు నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వేటగాళ్లకు అనువుగా మారుతోంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.సంరక్షణకు చర్యలు పెంచికల్పేట్ రేంజ్ పరిధిలో వన్యప్రాణులను సంరక్షించడానికి చర్యలు చేపట్టాం. కోయచిచ్చాల సమీపంలోని విద్యుత్ లైన్తో వన్యప్రాణులను వేటాడుతున్నారు. వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేశాం. వన్యప్రాణులను వేటాడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అటవీ జంతువుల సంరక్షణకు ప్రజలు సహకరించాలి. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ప్రతిపాదనలు పంపించాం మెరెగూడ నుంచి పాత కోయచిచ్చాల గ్రామం మీదుగా రెవెన్యూ భూమిలో అగర్గూడ గ్రామానికి 11కేవీ విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ లైన్ తొలగించాలని అటవీశాఖ అధికారులు సంప్రదించారు. లైనుకు కేబుల్ వైర్ వేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే కేబుల్ లైన్ వేసే పనులు ప్రారంభిస్తాం. – అంజల్కుమార్, ఏఈ, పెంచికల్పేట్ -
హెల్త్ మిషన్ @100 రోజులు
ఆసిఫాబాద్: మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఆరోగ్య వ్యస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా వైద్యారో గ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మిషన్ –100 పేరుతో వంద రోజుల ప్రత్యేక వైద్యశిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో వైద్యసేవలు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంతో స్థానికులకు మేలు చేకూరనుంది. ముఖ్యంగా మహిళలకు లబ్ధి జరగనుంది. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు కొనసాగుతుంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో స్వయం సహాయక సంఘాల సభ్యులకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు చేపట్టి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించనున్నారు. జిల్లాలో 9,796 సంఘాల్లో 1,02,352 మంది మహిళా సభ్యులు ఉన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్తో తదితర రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. నాలుగు దశల్లో సేవలుజిల్లాలో మొదటి దశ మార్చి 2 నుంచి 31 వరకు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా రు. గర్భిణులు, బాలురు, వృద్ధులు, రక్తహీనత పరీ క్షలు, ఇమ్యునైజేషన్, క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టనున్నారు. క్యాన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు చేసి, ఆరోగ్య మహిళా కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. రెండోదశలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 15 వరకు అసంక్రమణ వ్యాధులపై దృష్టి సారిస్తారు. ఇక మూడో దశలో ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు అంటువ్యాధుల నియంత్రణ, టీబీ డ్రైవ్, జైళ్లలో హెచ్ఐవీ స్క్రీనింగ్కు ప్రాధాన్యత ఇస్తారు. ఎండదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక హీట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ గదులు సిద్ధం చేయనున్నారు. మే 16 నుంచి జూన్ 9 వరకు నాలుగో దశ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పట్టణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలపరచి, నిపుణులు సేవలందించడం, వైద్య శిబిరాలు నిర్వహించాలి. కార్యక్రమాల నిర్వహణ ఇలా..మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్య డ్రైవ్ నిర్వహిస్తారు. మా ర్చి 16న జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ వైద్యులకు అవార్డులు ప్రదానం చేస్తారు. జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినో త్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు చేపడతారు. నాలుగు దశల్లో కార్యక్రమాలు ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే హెల్త్ మిషన్– 100 కార్యక్రమాలు జిల్లాలో నాలుగు దశల్లో నిర్వహిస్తామని డీఎంహెచ్వో డాక్టర్ సీతారాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో శనివారం వైద్యాధికారులు, హెచ్ఎస్, హెచ్ఈఎస్లు, పీహెచ్ఎన్ఎస్లు, సీహెచ్వోలు, రాష్ట్ర బాల స్వస్థ కార్యక్రమం వైద్యాధికారుల కు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఎన్సీడీ ప్రో గ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉప్పరి వెంకటేశ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, రా ష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చే యడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. -
నవోదయలో జాతీయ విజ్ఞాన దినోత్సవం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం జాతీ య విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ విద్యార్థుల విజ్ఞాన, సైన్స్ ప్రదర్శనలను తిలకించారు. బొగ్గుగని కార్మికుల భద్రత కోసం రూపొందించిన సేఫ్టీ క్యాప్, హైడ్రాలిక్ బ్రిడ్జ్ నమూనా వంటి వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ వి ద్యార్థుల్లో దాగి ఉన్న శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమావత్, ఇలయ్య, శిరీష, తిరుపతమ్మ, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
అర్హులకు ‘ఉపాధి’ పనులు కల్పించాలి
ఆసిఫాబాద్: ఉపాధిహామీ పథకం కింద అర్హులకు పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జాబ్కార్డు ఉన్నవారికి పని కల్పించే దిశగా ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. వేసవి లో పనిప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పనులు కల్పించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికీ కొన్ని జిల్లాలో ఉపాధిహామీ పనులు ప్రారంభించలేదని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ డేవిడ్, అధికారులు -
నామమాత్రంగా తొలి సమావేశం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీ నూతన కౌన్సిల్ సభ్యుల తొలి సర్వసభ్య సమావేశం శనివారం నామమాత్రంగా సాగింది. చైర్పర్సన్ షాహిన సుల్తానా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఉదయం 11 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. అయితే చైర్పర్సన్ పక్కన వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి అనితకు సీటు కేటాయించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సమావేశ హాలులోని నేలపై నిరసన తెలుపుతుండగానే మున్సిపల్ అధికారి రఫిక్ కౌన్సిల్ ఎజెండాలోని ఆరు అంశాలను చదివి 10 నిమిషాల్లోనే ముగించుకుని ఆమోదం పొందినట్లు సమావేశాన్ని ముగించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. అనంతరం వారు బయటకు వచ్చి కార్యాలయం ఎదుట కూర్చొని రెండు గంటల పాటు నిరసన తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు తీసుకుని కౌన్సిల్ ఎజెండా ఆమోదం పొందిందని చెప్పడం సరికాదన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. కమిషనర్ తిరుపతి వారిని సముదాయించి చైర్పర్సన్ పక్కన వైస్ చైర్పర్సన్కు కుర్చీ ఏర్పాటు చేయాలనే ఎలాంటి రూల్స్ లేవని స్పష్టం చేశారు. ‘గతంలో కుర్చీ వేశారు..’కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో చైర్పర్సన్ పక్కన వైస్ చైర్పర్సన్కు కుర్చీ వేశారని, హాలులో ఇద్దరికీ కుర్చీలు ఏర్పాటు చేయాలని జీవో ఉందన్నారు. సమావేశంలోకి పత్రిక విలేకర్లను రానివ్వకపోవడం సరికాదన్నారు. పట్టణంలో ఏ అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారో ప్రజలకు తెలిజేయాలని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశాలకు మీడియాను అనుమతించి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐ ప్రేంకుమార్ కార్యాలయానికి చేరుకుని కౌన్సిలర్లను సముదాయించడంతో వారు నిరసన విరమించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి అనిత, కౌన్సిలర్లు ఎండీ వలీ, వనమాల శ్రీధర్, వసీం, మాణిక్యరావు, సీపీ విద్యావతి తదితరులు ఉన్నారు. -
రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో
ఆసిఫాబాద్అర్బన్: నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెరలో చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎ మ్మార్పీఎస్, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ, ఇతర ప్ర జా సంఘాల నాయకులు మద్దతు పలికారు. వారు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కడతల మల్లయ్య, వేములవాడ గణపతి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్, నాయకులు కేశవ్రావు, దుర్గం దినకర్, గొడిసెల కార్తీక్, జయరాజ్, మారుతి పటేల్, రాజేందర్, సాయి, రాజేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి’
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాన్ని శనివారం ఆమె సందర్శించారు. పనుల విధానం, కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆదాయం సమకూరుస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయతిస్తోందని, నిధుల కోత, పనిదినాల తగ్గింపు జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. -
నేడే ఆఖరు
కాగజ్నగర్టౌన్: రైతులకు గుర్తింపు సంఖ్య(ఫార్మర్ ఐడీ) అందించేందుకు ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను గతేడాది ప్రారంభించింది. శనివారంతో గడువు ముగుస్తుండగా జిల్లాలో ఇప్పటివరకు 56 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది. వ్వయసాయాధికారులు, ఏఈవోలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి, రైతు వేదికల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులు ముందుకు రాకపోవడంతో ఏఈవోలు క్షేత్రస్థాయికి గ్రామాల్లో తిరుగుతూ వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు. గడువు నేటితో ముగుస్తుండడంతో వ్యవసాయాధికారులు ఆయా రైతువేదికల్లో క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నారు. 70,678 మంది వివరాలు నమోదుజిల్లాలోని పదిహేను మండలాల్లో లక్ష 36 వేల మంది రైతులు ఉండగా శుక్రవారం 5.30 గంట ల వరకు 70,678 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 56,096 మంది వివరాలు నమో దు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో 59 శాతం మాత్రమే పూర్తయ్యింది. అత్యధికంగా కౌటాలలో 78 శాతం, అతి తక్కువగా లింగాపూర్లో 40 శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపురిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పథకాలు పొందే వీలుంటుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్, ఎరువులు, సబ్సిడీలు, పంటల బీమా, వ్యవసాయ రు ణాలు, పంటల కొనుగోలు సమయంలో మద్ద తు ధర వంటి ప్రయోజనాలు పొందే ఆస్కారం ఉంటుందని వ్యవసాయాధికారులు స్పష్టం చే స్తున్నారు. అలాగే పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించవచ్చు. తక్కువ వడ్డీకి రుణాలను పొందవచ్చు. క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకునే వీలుంటుంది. రైతుల భూమి రికార్డులు డిజిటల్ రూపంలో ఉంటాయి. -
మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి
కాగజ్నగర్టౌన్: మాలీ కులస్తులను ఎస్టీ జా బితాలో చేర్చాలని మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురె శ్యాంరావు శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్సీ దండె విఠల్కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలోని మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని 40 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ని వారికి ఎస్టీ హోదా కల్పించగా, తెలంగాణ లో మాత్రం బీసీలో కొనసాగడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ హోదా కల్పించేలా పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలతో కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు షెండె వాసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదె వసంత్, నాయకులు గంగారాం, రాందేవ్, గోపాల్, శ్రీనివాస్, బాబురావు, వి జయ్, పాండురంగ, రవి సురేశ్ పాల్గొన్నారు. -
యువతకు చంద్రశేఖర్ ఆజాద్ ఆదర్శం
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని యువతకు చంద్రశేఖర్ ఆజాద్ ఆదర్శమని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్మెట్రిక్ బాలుర వస తి గృహంలో శుక్రవారం చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్తీక్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం విప్లవ పోరాటం చేసి అతి చిన్న వయస్సులో దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అని తెలిపారు. మహనీ యుల బాటలో నడవాలని సూచించారు. కా ర్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీకానంద్, నా యకులు దినకర్, రాకేశ్, రాజేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
రెబ్బెన: కనీస అభ్యసన సామర్థ్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింద ని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులే టి శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల సాధన కోసం ఏఐ విద్యాబోధనను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ఏఐఏ ఎక్సెల్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 14 పాఠశాలల్లో ఏఐ ద్వారా విద్యాబోధన సాగుతోందని, సింగరేణి సంస్థ సహకారంతో తాజాగా రెబ్బెన ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలోనూ ప్రారంభించామన్నారు. 27 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో రెబ్బెన స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం విజయరాణి, స్థానిక హెచ్ఎం అడ్డూరి లావణ్య, ఉపాధ్యాయుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవర్లకు స్పష్టమైన కంటిచూపు కీలకం
కాగజ్నగర్టౌన్: వాహనాలు నడిపే డ్రైవర్లకు స్పష్టమైన కంటిచూపు అత్యంత కీలకమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం హెచ్ఆర్డీ భవనంలో రోడ్డు ప్రమాదాలు నివారణకు పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన కంటిచూపు లోపాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి నడుపొద్దన్నారు. అధికవేగాన్ని నివారిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ర్యాష్, నిర్లక్ష్యం, హెవీలోడ్ డ్రైవింగ్ చేయొద్దన్నారు. వాహనదారులు బాధ్యతగా మెలగాలన్నారు. అనంతరం పట్టణంలోని డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వర్, టౌన్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు సుధాకర్, రాజు, డ్రైవర్లు పాల్గొన్నారు. భద్రత మరింత బలోపేతంకాగజ్నగర్టౌన్: సీసీ కెమెరాలతో భద్రత మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రతను పతిష్టం చేయాలనే లక్ష్యంతో కాగజ్నగర్ పోలీసులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్, ఎన్టీఆర్ చౌరస్తా, సిర్పూర్ ప్రధాన రహదారి, తదితర ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
దివ్యాంగ విద్యార్థిని ప్రతిభ
దహెగాం: హైదరాబాద్లోని దోమలగూడలో ఈ నెల 17న రాష్ట్రస్థాయి ఫిజికల్ ఎడ్యూకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 50 మీటర్ల పరుగు పందెంలో దహెగాం మండల కేంద్రానికి చెందిన రెడ్డి దీపిక రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచి ప్రతిభ చూపింది. మండల కేంద్రంలోని ముత్యంపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సర్పంచ్ జయలక్ష్మి, ఎంఈవో శ్రీనివాస్ విద్యార్థిని అభినందించారు. శారీర క పరిమితులను అధిగమిస్తూ ధైర్యంగా పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడం గొప్ప వి షయమని కొనియాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు కిషన్రావ్, సుప్రియ, ఉప సర్పంచ్ సురేశ్, వార్డు సభ్యుడు ప్రశాంత్, టీచర్లు, సీఆర్పీలు ప్రియాంక, రవీందర్, చంద్రశేఖర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్టాండ్పై పట్టింపేది..?
కాగజ్నగర్: జిల్లాలో ఆర్టీసీకి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న కాగజ్నగర్ బస్టాండ్పై అధికారులు కనీస పట్టింపు చూపడం లేదు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఈ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ తెలంగాణలోని పలు పట్టణాలు, మహారాష్ట్రకు సైతం బస్సులు ట్రిప్పులు వేస్తుంటాయి. కౌటాల, బెజ్జూర్, మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నిజామాబాద్, తదితర పట్టణాలతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్, అహేరి పట్టణాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కంట్రోలర్ తొలగింపునాలుగు నెలల క్రితం పలు కారణాలతో కంట్రోలర్ను విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు బస్సుల టైమింగ్ తెలియడం లేదు. ఏ బస్సు ఎప్పుడు వస్తోందో తెలియక.. బస్టాండ్లో ఒకరి వద్ద మరొకరు ఆరా తీస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లోనే వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కపోత తప్పదా..?వేసవి సమీపించడంతో ఎండలు ముదిరి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడుతున్నారు. కానీ కాగజ్నగర్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన మూడు ఫ్యాన్లు తిరగడం లేదు. వాటిని ఆన్ ఆఫ్ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అవి పని చేస్తున్నాయా.. లేక మరమ్మతులు చేపట్టాలా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. అలాగే తాగునీటి కోసం ఏర్పాటు చేసి నల్లా వద్ద పరిశుభ్రత లోపించింది. మరుగుదొడ్లు సైతం కంపుకొడుతున్నాయి. వేసవి నేపథ్యంలో ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.హోంగార్డుకు విధులు సిబ్బంది కొరతతో కంట్రోలర్గా నియమించలేదు. తాత్కాలికంగా సేవలందించేందుకు హోంగార్డుకు కంట్రోలర్ పనులు అప్పగించాం. త్వరలోనే పర్మినెంట్ కంట్రోలర్ను నియమిస్తాం. అలాగే ఫ్యాన్లు బాగు చేయించడంతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం. – రాజశేఖర్, ఆర్టీసీ డిపో మేనేజర్ -
‘వన్యప్రాణుల కోసం అండర్పాస్ బ్రిడ్జి’
రెబ్బెన: వన్యప్రాణుల రాకపోకల కోసం తక్కళ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై అనిమాల్ అండర్పాస్ బ్రిడ్జి నిర్మించినట్లు రెబ్బెన రేంజ్ అధికారి కె.భానేశ్ తెలిపారు. తెలంగాణ ఫారెస్టు అకాడమీకి చెందిన 40 మంది ట్రైనీ బీట్ అధికారులు స్టడీ టూర్లో భాగంగా శుక్రవారం రెబ్బెన రేంజ్ పరిధిలో పర్యటించారు. ఎఫ్ఆర్వో వారికి అనిమల్ అండర్ పాస్ వంతెన ఆవశ్యకతను వివరించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కావడంతో పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుందన్నారు. జాతీయ రహదారి ఏర్పాటుతో వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా రోడ్డు దాటేందుకు అండర్పాస్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారులు సద్దాం, రవి, బీట్ అధికారులు రాజేశం, దేవేందర్ పాల్గొన్నారు. -
సమరం!
రోడ్డు ప్రమాదాలపై వాంకిడి: హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా సెల్ఫోన్లు చూస్తూ వాహనాలు నడుపుతూ అవగాహన లేమితో అనేకమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒకే ఘటనతో జీవితాలు మారి కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొదటి దశలో జనవరి 13 నుంచి 24 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమాలు చేపట్టారు. మళ్లీ రెండో దశలోనూ ఈ నెల 23 నుంచి 28 వరకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని పక్కా ప్రణాళికలు రూపొందించారు. అవగాహన ఇలా..రోడ్డు భద్రతలో భాగంగా ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో తొలి విడతలో అరైవ్– అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. రోజూవారీగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. రెండో దశలో రోడ్లపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, సురక్షిత ప్రయాణం, ఓవర్ టేకింగ్ తనిఖీలు, హెల్మెట్ తనిఖీలు, అమలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, నాలుగు చక్రాల వాహనాల తనిఖీలు, సీట్ బెల్ట్ అమలు, కళాజాత బృందాలతో ప్రత్యేక కార్యక్రమాలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ధ్రువపత్రాల తనిఖీలు, మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని హెచ్చరికలు, కంటి పరీక్ష శిబిరాలు, భారీ వాహన డ్రైవర్లకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ నెల 28న ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. హెల్మెట్ లేని కారణంగా ప్రమాదాల బారినపడి మృతి చెందిన కుటుంబాలను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి వారితో హెల్మెట్లు పంపిణీ చేయించారు. జిల్లా పోలీసులు మొదటి విడతలో మొత్తం 166 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రెండు నెలల్లో 32 ప్రమాదాలు..ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 32 రహదారి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అందులో 18 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానంగా నిర్లక్ష్యమే కారణమవుతుందని అధికారులు గుర్తించారు. జిల్లాలో హెల్మెట్ ధరించే ద్విచక్రవాహనదారులు అరుదుగా కన్పిస్తుండగా, వందలో పదిమంది కూడా ధరించడం లేదు. హెల్మెట్ను బరువుగా భావిస్తూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పల్లెల మాట అటుంచితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం అవగాహన రహితంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం లేదనే అపవాదు ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పటిష్ట తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్టు ధరించేలా చర్యలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. తమ తప్పిదాలు లేకున్నా ఇతరుల నిర్లక్ష్యంతోనూ ప్రమాదాల్లో హెల్మెట్ లేని కారణంగా మృత్యువాత పడినవారు అనేక మంది ఉన్నారు. మరికొందరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా మార్పు రావడం లేదు. దీనికి తోడు మైనర్ డ్రైవింగ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులు సైతం బైక్లు అతి వేగంగా నడుపుతున్నారు. అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లలు వాహనాలు నడిపితే సంబుర పడుతున్నా.. ప్రమాదాల బారిన పడితే తీరని శోకం మిగులుతుందని గ్రహించలేకపోతున్నారు. అప్రమ త్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది.నిర్లక్ష్య డ్రైవింగ్తోనే అధిక ప్రమాదాలురెబ్బెన: నిర్లక్ష్య డ్రైవింగ్తోనే అధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ నితికపంత్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెబ్బెన మండలం నంబాలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయొద్దని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. రహదారులపై ప్రయాణించే సమయంలో ప్రతిఒక్కరూ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. నంబాలలో గతంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడంతో తమ వారి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాటలు, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం యువతకు హెల్మెట్లు అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి లేకుండా చర్యలు
తిర్యాణి: వేసవిని దృష్టిలో ఉంచుకుని మండలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ గడ్డి నరేశ్ అన్నారు. మండలంలోని గుండాల గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. స్థానిక తాగునీటి బావిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన చోట నూతన బోర్వెల్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట మిషన్ భగీరథ ఏఈ కృష్ణతేజ, ఎంపీవో ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. -
ముగిసిన సీసీఐ కొనుగోళ్లు
దహెగాం: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు శుక్రవారంతో ముగిశాయి. ఓ వైపు ఇంకా పత్తి చేలలోనే ఉండగా, సీసీఐ గడువు పెంచలేదు. దీంతో మిగిలి న పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్ని స్తున్నారు. మొదట ఈ నెల 20న గడువు ముగిసింది. ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి గడువు పెంచాలని డిమాండ్ రావడంతో స్పందించిన అధి కారులు వారం రోజుల పాటు గడువు పెంచారు. భారీ వర్షాలకు ఆలస్యంజిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అక్టోబర్లో భారీ వర్షాలు కురవడంతో పత్తితీత పనులు ఆలస్యమయ్యాయి. చాలా ప్రాంతాల్లో నవంబర్ నుంచి పనులు మొదలు పెట్టారు. జిల్లావ్యాప్తంగా కూలీల కొరత ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలు వలస వచ్చారు. రైతులు వారికి షెల్టర్ కల్పించి పత్తితీత పనులు చేయించుకున్నారు. అయినా ఇప్పటివరకు పూర్తికాలేదు. జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టగా, ఈ నెల 20 వరకే పత్తి కొనుగోళ్లు చేస్తామని ఆ తర్వాత నిలిపివేస్తామని సీసీఐ ప్రకటించింది. దీనిపై రైతులు ఆందోళన చెందారు. 30శాతం వరకు పంట చేలలోనే ఉండటంతో ‘సాక్షి’లో ‘గడువు గండం..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, ఎంపీ స్పందించారు. రైతులు మార్చి 15 వరకు పెంచాలని డిమాండ్ చేసినా అధికారులు వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. దీంతో అన్నదాతలకు కొంతమేర ఊరట కలిగింది. ఇంటిల్లిపాది వెళ్లి పత్తితీత పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలకు కిలోకు రూ.20 నుంచి రూ.25 వరకు చెల్లించారు. మరో 15 శాతం వరకు పత్తి తీయాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. సీసీఐ మరోసారి గడువు పెంచే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 13,61,771 క్వింటాళ్లు కొనుగోలుజిల్లావ్యాప్తంగా 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా ఇప్పటివరకు 13,61,771 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ప్రైవేటులో 39,910 క్వింటాళ్లను సేకరించారు. ఈ నెల 20 వరకు సీసీఐ కొనుగోళ్లు నిలిపేవరకు 12,92,616 కొనుగోలు చేయగా, ప్రైవేటులో 34,118 వేల క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గడువు పెంచిన తర్వాత వారం రోజుల్లో సీసీఐ ద్వారా ఏకంగా 69,155 క్వింటాళ్లు సేకరించడం గమనార్హం. ప్రైవేటులోనూ 5,792 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. నష్టపోయే అవకాశం ఉన్నందున మార్చి 15 వరకు గడువు పెంచాలని జిల్లా రైతులు కోరుతున్నారు. -
కుమురం భీం
7వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. పగలు వేడి పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.‘యంగ్ సైంటిస్ట్’లకు ఇస్రో ఆహ్వానం యంగ్ సైంటిస్ట్ పేరుతో ఇస్రో యువ విజ్ఞాన్(యువికా) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
బడుల్లో ‘అభ్యసన’ సర్వే
కెరమెరి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పరిశీలించేందుకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో జిల్లాలో సర్వే కొనసాగుతోంది. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా చేపట్టిన ఈ సర్వే బాధ్యతలను ఉపాధ్యాయులకు కాకుండా ప్రస్తుతం బీఈడీ, డీఈడీ చదువుతున్న ఛాత్రోపాధ్యాయులకు అప్పగించారు. వీరిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. సర్వే నిర్వహణపై ఎంపిక చేసిన వారికి జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు ప్రత్యేక శిక్షణ అందించారు. ఎస్సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను వీరు పరిశీలిస్తున్నారు. ఉర్దూ మాధ్యమంలోని విద్యార్థులకు తెలుగుకు బదులుగా ఉర్దూలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 53 పాఠశాలలు ఎంపికజిల్లాలోని 53 పాఠశాలల్లో 53 మంది ఇన్వెస్టిగేటర్లతో సర్వే చేపట్టారు. ఆసిఫాబాద్ మండలంలో ఒక పాఠశాలలో సర్వే జరుగుతుండగా.. బెజ్జూర్లో 7, దహెగాం 3, జైనూర్ 5, కాగజ్నగర్ 8, కెరమెరి 3, కౌటాల 5, పెంచికల్పేట్ 2, రెబ్బెన 6, సిర్పూర్(టి) 5, సిర్పూర్(యు) 3, తిర్యాణిలో 3, వాంకిడిలోని 3 పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగాపూర్, చింతలమానెపల్లి మండలాల్లో మాత్రం ఈ సర్వే చేపట్టలేదు. నేటితో ముగింపుఈ నెల 25, 26, 27 తేదీల్లో మూడు రోజులపాటు ఛాత్రోపాధ్యాయుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. జాతీయ విద్యావిధానం– 2020 ప్రకారం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులు చదవడం, రాయడంతోపాటు గణితంలో నాలుగు రకాల ప్రాథమిక ప్రక్రియలు (కూడికలు, తీసివేతలు వంటివి) చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 2026– 2027 నాటికి విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎఫ్ఎల్ఎన్లో సాధించిన ఫలితాలను బేరీజు వేసేందుకు చేపట్టి ఈ సర్వే శుక్రవారం ముగియనుంది. ఆ పాఠశాలల్లో సెలవుల్లేవ్..రెండో తరగతి విద్యార్థులకు సర్వే చేపట్టిన దృష్ట్యా సంబంధిత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు రద్దు చేశారు. మూడు రోజులపాటు విధిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. సర్వే కోసం వచ్చే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 25న తెలుగు, 26న గణితం పరీక్షలు పూర్తి కాగా, శుక్రవారం ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలను పరీక్షించనున్నారు.అభ్యసన సామర్థ్యాల సాధనకు దోహదం రెండో తరగతి విద్యార్థులు అభ్యర్థన సామర్థ్యాల సాధన, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎఫ్ఎల్ఎన్ సర్వే ఎంతో దోహదపడుతుంది. లోపాలు తెలుసుకునేందుకు ఛాత్రోపాధ్యాయులతో సర్వే నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు పూర్తి సహకారం అందించాలి. అన్ని తరగతుల విద్యార్థులు చక్కటి విద్యాప్రమాణాలు సాధించేలా టీచర్లు కృషి చేయాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్ -
ఉద్యాన కేంద్రాలకు జీవం
ఆసిఫాబాద్: కొన్నేళ్లుగా ఆదరణ కోల్పోతున్న జిల్లాలోని ఐటీడీఏ ఉద్యానవన కేంద్రాలు త్వరలో నవ జీవం పోసుకోనున్నాయి. రాష్ట్ర వనరుల మంత్రిత్వ శాఖ నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ శివారులోని ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజంపేట ఉద్యానవన నర్సరీ శిక్షణ కేంద్రానికి కృషి ఉన్నతి యోజన రాష్ట్రీయ వెదురు మిషన్ కింద ఆగ్రోఫారెస్ట్ నర్సరీ అభివృద్ధి కోసం రూ.6 లక్షలు మంజూరు చేయగా, కాగజ్నగర్ మండలంలోని జంబుగ ఉద్యానవన కేంద్రానికి ఆగ్రో ఫారెస్ట్రీ వెదురు మిషన్ కింద రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నర్సరీ సదుపాయాలు మెరుగుపర్చి, వృక్ష సంపద పెంపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కేంద్రాల్లో ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కలు పెంచి ఉద్యానవన అభివృద్ధికి రైతులకు అందించనున్నారు. తద్వారా జిల్లాలో పచ్చదనం పెరిగే అవకాశం ఉంది. నర్సరీల అభివృద్ధితో స్థానిక కూలీలకు ఉపాధి అవకాశం లభించనుంది. ఈ నిధులతో నర్సరీలో మొక్కల పెంపకం, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాలో వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు దోహదపడనుంది. వెదురు, టేకు, నిమ్మ, పనస, ఎర్రచందనం, మహాగని మొక్కల పెంపకం చేపట్టనున్నారు. తక్కువ ధరకు మొక్కలు సరఫరాఅతి తక్కువ ధరలో రైతులకు మొక్కలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిధులు విడుదలైన నేపథ్యంలో ఆసిఫాబాద్, జంబుగ ఉద్యానవన కేంద్రాల్లో ఎర్రమట్టి, ఎరువులు తెప్పించి మొక్కల పెంపకానికి సిద్ధం చేస్తున్నారు. గతంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కూలీలకు ఉపాధి లభించగా, నిధుల కొరత, ఆదరణ కోల్పోయి మొ క్కల ఉత్పత్తి తగ్గిపోయింది. పనులు ప్రారంభమైతే ఆసిఫాబాద్, జంబుగ కేంద్రాల్లో మరింత మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది. రెండు కేంద్రాల్లో ఇప్పటికే మొక్కల పెంపకానికి ఎర్రమట్టి కుప్పలు పోయించారు. పూర్వ వైభవం దిశగా..జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ ఉద్యానవన నర్సరీ పూర్వ వైభవం సంతరించుకోనుంది. 1988 నుంచి 1995 వరకు ఈ ఉద్యానవనం పండ్ల తోటలతో కళకళలాడింది. ఇక్కడ సుమారు వందకు పైగా మామిడి, జామ, సపోట, రేగి తోటలు ఏర్పాటు చేయడంతో ఏటా సుమారు రూ.2 లక్షల ఆదాయం సమకూరేది. ఏటా కూలీలకు సైతం చేతినిండా పని లభించేది. ఐదేళ్లుగా ఉద్యానవన కేంద్రాలను పట్టించుకోకపోవడంతో కూలీలకు ఉపాధి లభించని పరిస్థితి నెలకొంది. తాజా నిర్ణయంతో కూలీలకు మేలు జరగనుంది. -
సెకండియర్ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని 19 కేంద్రాల్లో గురువారం ఇంటర్మీడియెట్ రెండో సంవత్స రం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 4,439 మంది విద్యార్థులకు 4,345 మంది విద్యార్థులు హాజరుకాగా 94 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,776 మందికి 3,698 మంది హాజరు కాగా 78 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 663 మంది విద్యార్థుల కు 647 మంది హాజరుకాగా, 16 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో రాందాస్ వెల్లడించా రు. బెజ్జూర్ ప్రభుత్వ కళాశాలను ఆయన తని ఖీ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాలని సూచించారు. -
పాలనలో ముద్ర.. విద్యాశాఖపై పర్యవేక్షణ
ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: పాలనలో తనదైన ముద్రవేసి, విద్యాశాఖపై పర్యవేక్షణను పెంచిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన దీపక్ తివారిని వికారాబాద్ కలెక్టర్గా నియమించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎవరినీ నియమించలేదు. జిల్లాలో రెండు సంవత్సరాల పాటు అదనపు కలెక్టర్గా ఆయన పనిచేశారు. అలాగే విద్యాశాఖ ఇన్చార్జి జిల్లా అధికారిగా నూ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా పనిచేస్తూ ప్రస్తుతం లీవ్లో ఉన్న ఆయ న సతీమణి ఖుష్బూ గుప్తాను సైతం మహబూ బ్నగర్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బదిలీకై లాస్నగర్: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజె క్ట్ అధికారి ఖుష్బూ గుప్తా బదిలీ అ య్యారు. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్న ఆమెను మహబూబ్నగర్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె తొలుత ఆదిలాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా బదిలీ అ యిన ఆమె అదే ఏడాది నవంబర్ 4 నుంచి ప్రసూతి సెలవుపై వెళ్లారు. ఈ ఏడాది మే 3వరకు ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసినా తా జాగా జిల్లా నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో పీవోగా కొత్త అధికారులెవరిని ఇంకా నియమించలేదు. ప్రస్తుతం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఇన్చార్జి పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్చార్జి డీఈవోగా ఏడు నెలలువిద్యారంగంలో వెనుకబడి ఉన్న జిల్లాలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి 2025 ఆగస్టు 5న ఇన్చార్జి డీఈవోగా బాధ్యతలు చేపట్టా రు. గాడితప్పిన విద్యాశాఖపై ఆయన పర్యవేక్షణ పెంచారు. నిత్యం పాఠశాలలను తని ఖీ చేస్తూ ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరు పెంచేందుకు కృషి చేశారు. ఐఏఎస్ స్థాయి అధికారి విద్యాశాఖ అధికారిగా ఉండటంతో ఎంఈవోలు, ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరి గింది. పాఠశాలల తనిఖీ సమయంలో స్వ యంగా పాఠాలు బోధిస్తూ, విద్యార్థులతో పుస్తకాలు చదివిస్తూ విద్యా సామర్థ్యాలు పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన పనులు పూర్తి చేయించడంతోపాటు మానిటరింగ్ వ్యవస్థను పటిష్టంగా అమలుపర్చారు. పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల సమయంలో ఉదయం, సాయంత్రం సింగరేణి ఆధ్వర్యంలో స్నాక్స్ అందించేందుకు కృషి చేశారు. -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీ క్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, ఫ్యాన్లు, ఫర్చీచర్, విద్యుత్ తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగే చూడాలన్నారు. సమావేశంలో పరీ క్షల నిర్వహణ అధికారి సచ్చినంద చారి, ఎంఈవో సుభాష్, హెచ్ఎం సత్యనారాయణ, ఎస్వో లతీఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కౌటాలలో స్వల్ప భూప్రకంపనలు
కౌటాల: జిల్లాలోని కౌటాల, పెంచికల్పేట్, బెజ్జూర్ మండలాల్లో బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. 11.49 నిమిషాల సమయంలో మూడు సెకన్ల పాటు కంపనలు వచ్చాయి. అర్ధరాత్రి ప్రజలు నిద్రలో ఉండడంతో భూకంప ప్రభావాన్ని చాలామంది గుర్తించలేదు. కొందరు మాత్రం చిన్న వస్తువులు కదలడం, ఫ్యాన్లు ఊగడం గమనించి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించిన విషయాన్ని ఉదయం ఒకరిని ఒక్కరు అడిగి నిర్ధారించుకున్నారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.9గా నమోదు కాగా, ప్రాణహిత నది తీరంలో కేంద్రంగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆయా మండలాల్లో ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదు. -
మూడేళ్లుగా వేలం బంద్
ఏటా వేసవికి ముందు ఈ పండ్ల తోటలకు వేలం నిర్వహించేవారు. కానీ మూడేళ్లుగా వేలం నిర్వహించకపోవడం, ఆలనాపాలన కొరవడడంతో తోట కాస్త అడవిని తలపిస్తోంది. ఉద్యానవనం నిర్వహణ దయనీయంగా మారింది. లోపలికి వెళ్లే రహదారిపై పిచ్చిమొక్కలు పెరిగి చెత్తాచెదారంతో నిండిపోయింది. మూడేళ్లుగా పండ్లు చోరుల పాలవుతున్నాయి. టన్నుల కొద్దీ మామిడి, సపోట పండ్లు ఐటీడీఏకు చెందిన ఓ అధికారి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పేరుతో ప్రత్యేక వాహనాల్లో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఐటీడీఏ ఉన్నతాఽధికారులు విచారణ చేపడితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవన కేంద్రాల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్ కేవలం ఉట్నూర్కే పరిమితమవడం జిల్లాలోని ఇతర కేంద్రాల్లోని నర్సరీలకు ఇబ్బందిగా మారింది. ఆసిఫాబాద్ నర్సరీలో విద్యుత్ సమస్య ఉంది. విద్యుత్ సరఫరా రాగానే, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు హెచ్ఈవో జయరాజ్ వెల్లడించారు. -
ముంచుకొస్తున్న గడువు
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల హడావుడితో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సాధించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలపై దృష్టి ఏది..?జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ బకాయిల వ సూళ్లపై అధికారులు దృష్టి సాధించడం లేదనే ఆరో పణలు ఉన్నాయి. ఈ కారణంగా భారీగా పన్నులు పేరుకుపోతున్నాయి. అధికారులు ఇళ్లకు వెళ్లగానే రాజకీయ అండదండలతో ఫోన్లు రావడంతో వెనుదిరుగుతున్నారు. పేదలు మాత్రం రూ.1000 పెండింగ్ ఉన్నా ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణ ప్రజలు సహకరించాలి ఇటీవల మున్సిపల్ ఎన్నిక ల దృష్ట్యా మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు కాస్త నెమ్మదిగా కొనసాగాయి. అలాగే గ్రామపంచాయతీ రికార్డులో ఉన్న పేర్లు, వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ పన్ను వసూళ్లు చేయడంతో జాప్యం జరిగింది. మార్చి 31లోగా డిమాండ్కు తగినట్లుగా వసూళ్లు పూర్తి చేస్తాం. పట్టణ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి అధికారులకు సహకరించాలి. – గజానంద్, మున్సిపల్ కమిషనర్ఆసిఫాబాద్ బల్దియాలో 50శాతమే..ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో పన్నుల డిమాండ్ రూ.1.02 కోట్లు ఉండగా, ఇప్పటివరకు రూ.50 లక్షలు(50శాతం) మాత్ర మే వసూలయ్యాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇదివరకు గ్రామ పంచాయతీలో ఉన్న యజమానుల వివరాలను ఆన్లైన్ చేసుకోవడం, తర్వాత పన్ను వసూళ్లు చేయడం ప్రక్రియతో కాస్త ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆన్లైన్ విధానానికి పూర్తిస్థాయిలో సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. మార్చి నెలాఖరు నాటికి బకాయి వసూళ్లు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల దురహంకారానికి బలైన పసిపాప కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గణపతి డిమాండ్ చేశారు. ర జక సంఘం ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ప ట్టణంలో బుధవారం నిరసన తెలిపారు. వారు మా ట్లాడుతూ కుమ్మెరలో మల్లన్న జాతరలో రజక కు టుంబానికి చెందిన వారిని ఆలయంలోకి వెళ్లకుండా అగ్రకుల నాయకులు అడ్డుకోవడం దారుణమన్నారు. చిన్నారి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ఆగదని హెచ్చరించారు. నాయకులు రాజమల్లు, కొండపర్తి రాజేశ్, పిప్పిరి సాయి, రామరాజు, రమేశ్, సత్తయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో ప్రమాదాల నివారణ
వాంకిడి: పోలీస్ శాఖ, ఎన్హెచ్ఏఐ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. వాంకిడి మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఇందాని, గణేష్పూర్, సోనాపూర్, ఖమాన ఎక్స్రోడ్పై బ్లాక్ స్పాట్లను బుధవారం పరిశీలించారు. పోలీస్ అధికారులు, ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు మరింత అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో స్పష్టమైన సైన్ బోర్డులు, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో రోడ్ బంబ్స్, భద్రత సూచికలు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్, రిఫ్లెక్టివ్ మార్కింగ్స్ వంటివి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. వాహనదారులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు అవగాహన పెంపొందించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, వాంకిడి సీఐ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
● తుది దశకు ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టు డీపీఆర్ ● ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే చేసిన కన్సల్టెన్సీ సంస్థ ● తుది డిజైన్ ఖరారైతే తాజా రాష్ట్ర బడ్జెట్లో నిధులు ● ఏళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల రైతుల ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హ యాంలో పురుడుపోసుకున్న ఈ ప్రాజెక్టును తాజా గా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర నివేదిక(డీపీఆర్) ఇవ్వడానికి ఇటీవల ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి తుది నివేదిక ఇవ్వనుంది. తాజాగా వచ్చే 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ప్రాజెక్టు పనుల్లో వే గం పెరగనుంది. ప్రస్తుతం కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ తుది దశకు చేరినట్లుగా తెలు స్తోంది. ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ మేరకు తుది రూపం రానుంది. కొత్తగా నిర్మించబో యే ప్రాజెక్టుతో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉంది. ఈ ప్రాంత రైతులకు ఏళ్లుగా సాగు నీరందక అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే స్థానిక రైతాంగానికి ఎంతో మేలు జరుగనుంది. మైలారం మీదుగా టేకుమట్ల వాగులోకి.. ఇటీవల ప్రాజెక్టు నిర్మాణంపై డీపీఆర్ కోసం సర్వే చేసిన సమయంలో పలు అంశాలపై అధ్యయనం చేశారు. ప్రాణహిత నది నుంచి ఒకే లిఫ్టుతో 71 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉన్న కాలువల గుండా నెన్నెల మండలం మైలారం వరకు వినియోగంలోకి తీసుకురానున్నారు. అక్కడి నుంచి గ్రావిటీతో 14కి.మీ. వరకు సొరంగ మార్గం తవ్వనున్నారు. ఆ కాలువను జైపూర్ మండలం టేకుమట్ల వాగుకు కలిపి అటు నుంచి గోదావరిలోకి తరలించనున్నారు. దిగువన సుందిళ్ల బ్యారేజీ ఉండడంతో గోదావరిలోనే నీటి నిల్వ ఉండే అవకా శం ఉంది. ఎక్కువ లిఫ్టులు లేకుండా గ్రావిటీతోనే పైనున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బదులు కింద సుందిళ్ల ప్రాజెక్టులోకి జలాలను తరలిస్తే సులువుగా ఉంటుందనే నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గోదావరి పైనున్న కాళేశ్వరం బ్యారేజీ, పైనున్న సుందిళ్ల ప్రాజెక్టు నీటి నిల్వకు సముచితం కాదని ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఓ నివేదికలో పేర్కొంది. దీంతో ఆ బ్యారేజీలో నీటి నిల్వ ఎలా చేసి తరలిస్తారనే వాదన ఉంది. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణం నివేదికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏళ్లుగా సాగదీతఉమ్మడి రాష్ట్రంలో పదిహేడేళ్ల క్రితమే ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలించాలని ప్రణాళిక రూపొందించారు. అటు నుంచి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి వరకు నీటిని ఎత్తిపోస్తూ సాగు, తాగునీరు, పరిశ్రమలకు ఇచ్చేలా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా బ్యారేజీ నుంచి చింతలమానెపల్లి మండలం కర్జల్లి, బెజ్జూరు మండలం సురగలపల్లి, నెన్నెల మండలం మైలారంలో లిఫ్టులు ఏర్పాటు చేసి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించాలని భావించారు. కానీ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ప్రాజెక్టుపై పట్టింపు కరువైంది. చివరికి ప్రాజెక్టును పక్కన పెట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. తర్వాత వార్దా, పెన్గంగా తదితర చోట్ల బ్యారేజీ నిర్మిస్తామని చెప్పనప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ కాంగ్రెస్ సర్కారు రాకతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామనే హామీ మేరకు మళ్లీ కదలిక వచ్చింది. -
అవగాహన వచ్చింది
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలనే అంశంతోపాటు గ్రామపాలనపై అవగాహన కల్పించారు. వార్డు సభ్యుల పాత్ర గురించి వివరించారు. పంచాయతీ పాలనపై అవగాహన వచ్చింది. – కార్తీక్, వంజీరి, వార్డు సభ్యుడు శిక్షణ బాగుందివార్డు సభ్యురాలిగా గెలి చిన తర్వాత గ్రామంలో ఏం చేయాలనేదానిపై తెలియని పరిస్థితి. వార్డు ప్రజలకు ఏ అవసరం ఉంటుందో.. ప్రభుత్వ పథకాలు ఏవిధంగా వారికి అందించాలలో కూడా అవగాహన లేదు. ప్రస్తుతం అధికారులు అన్ని విషయాలు అర్థమయ్యేలా వివరించారు. ట్రైనర్లు అందిస్తున్న శిక్షణ బాగుంది. – మంతెన పద్మ, వంజీరి, వార్డు సభ్యురాలు -
సమస్యలు పరిష్కరిస్తా
పంచాయతీలో వార్డు సభ్యుల పాత్ర గురించి అధికారులు వివరించారు. పారిశు ద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీరుస్తా. – మొర్ల మంజుల, నందిగూడ, వార్డు సభ్యురాలు బాధ్యతలు తెలుసుకున్నాపంచాయతీలో గ్రామ సభ నిర్వహణ గురించి తెలియజేశారు. సభకు హాజరయ్యే అధికారుల వివరాలను తెలిపారు. పంచాయతీలో వార్డు సభ్యురాలిగా నా బాధ్యతల గురించి తెలుసుకున్నా. – లెండెగురె రెష్మా, వంజీరి, వార్డు సభ్యురాలు -
అంబులెన్స్ పైలెట్లకు పురస్కారాలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని లింగాపూర్, సిర్పూర్(యు), జైనూర్ మండల కేంద్రాల్లో 108, 102 అంబులెన్స్ పైలెట్లుగా విధులు నిర్వర్తిస్తున్న రాథోడ్ జగదీష్, జ్ఞానేశ్వర్, రవి, గజానంద్లకు జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ స్టార్ పైలెట్ పురస్కారాలు ప్రదానం చేసింది. ఆరు నెలలుగా అత్యవసర సేవల్లో నిబద్ధతతో పనిచేస్తూ సమయానికి రోగులను ఆస్పత్రులకు తరలించడం, అనేక ప్రాణాలను కాపాడినందుకు వీరి సేవలను గుర్తించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉత్తమ ఉద్యోగులను అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టర్ కె.హరిత, డీఎంహెచ్వో సీతారాం పురస్కారాలు ప్రదానం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 108 సేవల నిర్వాహకుడు సామ్రాట్, జిల్లా నిర్వాహకుడు మెరుగు నరేశ్ యాదవ్ పాల్గొన్నారు. -
తొలిరోజు 172 మంది గైర్హాజరు
ఆసిఫాబాద్రూరల్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 19 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రతీ కేంద్రం వద్ద ముగ్గురు పోలీస్ సిబ్బందితో బందోబస్తు కల్పించారు. సెక్షన్ 163 పకడ్బందీగా అమలు చేశారు. విద్యార్థులు ఉదయమే 40 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి తనిఖీల అనంతరం లోపలికి అనుమతించారు. ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు తొలిరోజు 5,211 మంది విద్యార్థులకు 5,039 మంది హాజరు కాగా 172 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,438 మందికి 4,316 మంది, ఒకేషనల్ విభాగంలో 773 మందికి 723 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఐఈవో రాందాస్ తెలిపారు. పరీక్ష కేంద్రాలు తనిఖీ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ కె.హరిత తనిఖీ చేశారు. పరీక్ష తీరును పరిశీలించి సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, బోర్డు ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్యసిబ్బందితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. డీఐఈవో రాందాస్ రెబ్బెన ప్రభుత్వ కళాశాలలోని కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను ఎస్సై కమలాకర్, స్క్వాడ్ బృందాల సభ్యులు పర్యవేక్షించారు. -
పాఠాలు విని.. బాధ్యతలు తెలుసుకుని
కాగజ్నగర్టౌన్: పంచాయతీ పాలనలో ప్రజాసేవలు, అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ చట్టంపై సర్పంచులు, వార్డు సభ్యులకు జిల్లా అధికారులు శిక్షణ అందిస్తున్నారు. దాదాపు 24 అంశాలపై మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. జనవరి 19 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు సర్పంచులకు విడతలవారీగా 50 నుంచి 100 మంది చొప్పున ప్రజాపాలనపై శిక్షణ అందించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 31 వరకు ఆయా మండల కేంద్రాల్లో వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 335 పంచాయతీలు ఉండగా, 332 మంది సర్పంచులు ఉన్నారు. మరో మూడుచోట్ల ఎన్నికలు జరగకపోవడంతో ఉప సర్పంచులే పరిపాలన బాధ్యతలు చేపట్టారు. అవగాహన కల్పిస్తున్న అంశాలివే.. గ్రామాలాభివృద్ధిలో పాలకవర్గాల పాత్ర అత్యంత కీలకం. మొదటిసారి ఎన్నికైన వారికి పాలనలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ తరగతులకు శ్రీ కారం చుట్టింది. పంచాయతీరాజ్చట్టం, గ్రామపాలన, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి పథకాల అ మలు, సభల నిర్వహణ, నిధుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ– పంచాయతీ, ఈ– పాలన, వివాదాల పరిష్కారం, సామాజిక న్యాయం, సీ్త్రశిశు సంక్షేమం, ఆదాయ వనరులు, సిబ్బంది, సమావేశాల నిర్వహణ, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, సామాజిక తనిఖీ, సీ్త్రల భాగస్వామ్యం అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీలో సభ్యుల విధులు, వాటి నిర్వహణ, ఆదాయ, వ్యయ నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలులో పాత్ర, ప్రజారోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. -
ప్రజల సహకారం అవసరం
సమగ్ర భూసర్వేకు ఆసిఫాబాద్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టే సమగ్ర భూసర్వేకు ప్రజల సహకారం అవసరమని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని దానాపూర్లో బుధవారం తహసీల్దార్ రియాజ్ అలీ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం భూముల వివరాలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సర్వేలో అటవీశాఖ అధికారులను సైతం భాగస్వాములను చేసి వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సర్వే సమయంలో ఏర్పడే ఇబ్బందులను జిల్లాస్థాయిలోనే సరిచేద్దామని, ప్రతీ అంశాన్ని తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు, సర్పంచ్ రాము తదితరులు పాల్గొన్నారు. గడువులోగా రుణ లక్ష్యాలు సాధించాలి ఆసిఫాబాద్అర్బన్: జిల్లాకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు గడువులోగా సాధించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం 2025– 26 సంవత్సర మూడో త్రైమాసిక సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఎం ముద్ర రుణాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి కేటాయించిన రుణాలు, పీఎం స్వయం ఉపాధి పథకం, విశ్వకర్మ, జన సురక్ష పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,023 కోట్ల రుణ లక్ష్యానికి ఇప్పటివరకు రూ.1,581కోట్ల(49 శాతం) రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పంచాయతీల అభివృద్ధి నిధులు దుర్వినియోగం కాకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం 2026– 27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పథకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం వీరభద్రుడు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీవో రాములు, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ గుప్తా, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, డీటీడీవో రమాదేవి, బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
హెల్మెట్ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు
వాంకిడి: హెల్మెట్ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో మంగళవారం ‘అరైవ్–అలైవ్’కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం హెల్మెట్ ధరించకపోవడంతోనే ప్రాణనష్టం జరుగుతుందన్నారు. అతి వేగం, మద్యం సేవించి రాంగ్ రూట్లో వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో హెల్మెట్లేని కారణంగా బెండార గ్రామానికి చెందిన నగోషే పెంటు మృతి చెందగా.. ప్రస్తుతం పెద్దదిక్కు లేని అతని కుటుంబ సభ్యుల పరిస్థితిని ప్రజలకు వివరించారు. బాధిత కుటుంబ సభ్యుల చేతుల మీదుగా 25 హెల్మెట్లు పంపిణీ చేశారు. బాధిత కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర స రుకులు అందించారు. సీఐ సత్యనా రాయణ, ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా పోలీసులకు పతకాలు
ఆసిఫాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన నాలుగో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు పోలీసులు పతకాలు సాధించారు. సెపక్తక్రాలో కానిస్టేబుళ్లు పొట్ట గోపి, కిరణ్కుమార్, రాజేశ్ సిల్వర్ మెడల్స్ సాధించగా, మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్(ఓపెన్)లో కానిస్టేబుల్ సువార్త సిల్వర్ మెడల్, కానిస్టేబుల్ ఫూల్సింగ్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్, తైక్వాండోలో బ్రాంజ్ మెడల్ సాధించారు. కానిస్టేబుల్ వినయ్కుమార్ తైక్వాండోలో బ్రాంజ్మెడల్ సాధించారు. ఎస్పీ నితిక పంత్ జిల్లా కేంద్రంలో మంగళవారం విజేతలను అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ఎమ్మెల్యేపై అక్రమ కేసును ఎత్తివేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆదివాసీ నాయకురాలు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పెట్టిన అక్రమ కేసు ను తక్షణమే ఎత్తివేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు మర్సుకోల సరస్వతి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మంగళవా రం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మ న్ ఆకాశ్తో కలిసి మాట్లాడారు. అధికార పార్టీ మంత్రి మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్లో చై ర్మన్ ఎన్నిక జరగకుండా బీఆర్ఎస్ నాయకులు బా ల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చే శారని మండిపడ్డారు. కౌన్సిలర్ అభ్యర్థులను కా ర్యాలయానికి తీసుకెళ్తున్న కోవ లక్ష్మిపై రామకృష్ణాపూర్ పోలీసులు అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ మహిళపై కేసు ను ఎత్తివేయని పక్షంలో ప్రభుత్వంపై ఉద్యమిస్తామ ని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు వెంకన్న, కుర్సెంగ బాలకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
15 గ్రామాలకు ఇదే ఆధారం
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని తుంపెల్లి వాగుపై నిర్మించిన వంతెనకు ఇరువైపులా ఎలాంటి రక్షణ పిల్లర్స్ లేవు. లోలెవల్ వంతెన కావడంతో వర్షాకాలం వాగు వరద వంతెన పైనుంచి ప్రవహిస్తుంది. దీంతో 15 గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వాగుకు అవతలివైపు ఉన్న చిర్రకుంట, తుంపెల్లి, కొసార, వట్టివాగు, మాలన్గొంది, ఘుడెట్ ఘాట్, గొండుగూడ, శాకన్గొంది, యాపలపాడు, లింగన్గూడ, భీమన్గొంది, దాంపూర్, ఎర్రగుట్ట, మన్నేపల్లి, డోర్లి తదితర గ్రామాల ప్రజలు ఏటా అవస్థలు పడుతున్నారు. -
ఆశ్రమ విద్యార్థులకు నాణ్యమైన విద్య
ఆసిఫాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన వసతి, విద్యనందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికలు, కాగజ్నగర్లోని బాలుర ఆశ్రమ పాఠశాలలను మంగళవారం తనిఖీ చేశారు. పీవో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. వసతి గృహాల పరిసరాలు, వంటగది, స్టోర్ రూం, తాగునీరు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నా పల్స్ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సామర్థ్యాల అంచనా సర్వే
ఆసిఫాబాద్రూరల్: ఎఫ్ఎస్ఎస్లో భాగంగా ఈ నెల 25 నుంచి రెండో తరగతి విద్యార్థులకు సామర్థ్యాల అంచనా సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బీఈడీ, డీఈడీ చదువుతున్న 53 మంది ఛాత్రోపాధ్యాయులకు అసెస్మెంట్పై జిల్లా కేంద్రంలోని శ్రీనిధి కళాశాలలో మంగళవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు పాఠశాలకు వెళ్లి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు టాన్జనిన్ యాప్ ద్వారా పారదర్శకంగా సామర్థ్యాలపై అసెస్మెంట్ చేస్తారని తెలిపారు. సర్వే నిర్వహించే తేదీల్లో మూడు రోజులపాటు రెండో తరగతి విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో రిసోర్స్పర్సన్లు ప్రశాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
తిర్యాణి మండల అభివృద్ధికి కృషి చేయాలి
తిర్యాణి: వెనుకబడిన తిర్యాణి మండల సమగ్రాభివృద్ధికి అధికారులు సమష్టి కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్వహణ, అంగవాడీ కేంద్రాలకు అందించే పౌష్టికాహారం, పశువుల టీకాలు తదితర అంశాలను సంపూర్ణత అభియాన్ 2.0లో చేపట్టాలన్నారు. గతంలో దేశంలోనే మండలానికి మంచి స్థానం లభించిందని, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, డీఏవో వెంకట్, తహసీల్దార్ శ్రీనివాస్, సీడీపీవో తిరుపతమ్మ, ఏవో వినయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భయంగా ప్రయాణం
మా గ్రామానికి వెళ్లే రహదారిపై ఉన్న కల్వర్టులు వరదలకు కొట్టుకుపోయాయి. కోతకు గురై భారీ గుంత ఏర్పడి నాలుగేళ్లు గడిచింది. పంగిడిమాదర నుంచి ఫూల్సింగ్తండా వరకు పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాలి. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. – రాథోడ్ అనిల్ కుమార్, ఫూల్సింగ్తండా, మం.లింగాపూర్ హైలెవల్ వంతెన నిర్మించాలి వర్షాకాలంలో తుంపెల్లి వంతెన పైనుంచి ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోతాయి. 20 గ్రామాల ప్రజలు ఈ దారి గుండానే వెళ్లాలి. రక్షణ లేకపోవడంతోపాటు ఇరుకుగా ఉంది. జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా పట్టించుకోవడం లేదు. వెంటనే హైలెవల్ వంతెన నిర్మించాలి. – మల్లేశ్, తుంపెల్లి, మం.ఆసిఫాబాద్ -
కంట్రోల్ రూం నంబర్ 08733–293713
● నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ● హాజరు కానున్న 10,301 మంది విద్యార్థులుఆల్ ది బెస్ట్ఆసిఫాబాద్రూరల్/కౌటాల: జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు మొత్తం 48 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 10,301 మంది విద్యార్థులు 19 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, బెంచీలు, ప్రతీ కేంద్రం వద్ద ఆరోగ్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచనున్నారు. భద్రత కోసం కేంద్రం వద్ద ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. ప్రత్యేక నిఘా కోసం పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల సంచులను తెరుస్తారు. అదే రీతిలో జవాబు పత్రాలను సీల్ చేస్తారు. మాస్ కాపీయింగ్కు తావుతేకుండా ప్రతీ కేంద్రానికి సీఎస్, డీవో ఉంటారు. పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఇద్దరు సభ్యులతో సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో పరిశీలకుడిని నియమించారు. అలాగే జిల్లా పరీక్ష కమిటీ, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు సైతం తనిఖీ చేపడుతారు. ఐదు నిమిషాల వరకు అనుమతి విద్యార్థులు తప్పకుండా ఉదయం 8.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతిస్తారు. ప్రైవేట్ కళాశాలల నుంచి వేధింపులను అరికట్టేందుకు వెబ్సెట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా అనుమతించాలని అధికారులు ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. అధికారులు, విద్యార్థులు సెల్ఫోన్లు వినియోగించడాన్ని నిషేధించారు. విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రభుత్వం టెలీమానస్ 14416 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాస్థాయిలో సందేహాలను నివృత్తి చేసేందుకు డీఐఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం 08733–293713 నంబర్ను ఏర్పాటు చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఐఈవో రాందాస్, డీటీవో రాంచందర్, డీపీవో భిక్షపతి, ఆర్టీసీ డీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టిపాత్రల తయారీపై వర్క్షాప్
సిర్పూర్(టి): మండలంలోని వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మట్టిపాత్రల తయారీ వర్క్షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ అధిక వినియోగంతో పర్యావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి మట్టిపాత్రల వినియోగం ఉత్తమమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు మట్టిపాత్రల తయారీపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయులు ప్రకాశ్, లక్ష్మీనారాయణ, ఓంప్రకాశ్, శాంతికుమారి, శ్రీనివాస్, సీఆర్పీ రమేశ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నృత్య శిక్షణ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆ ధ్వర్యంలో విద్యార్థులకు డ్యాన్స్లో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రముఖ డ్యాన్సర్ సుధాకర్ నేతృత్వంలో 15 రోజుల పాటు శాసీ్త్రయ, జానపద విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్ధన్, శారద, అధ్యాపకులు రాజేశ్వర్, దేవేందర్, వెంకటేశం పాల్గొన్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా ప్రజావాణి రద్దు కాగా సోమవారం పునఃప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి వివిధ మండలాలకు చెందిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని జిల్లా కేంద్రంలో ని సందీప్నగర్కు చెందిన బోయని నగేశ్ దరఖాస్తు అందించాడు. వ్యవసాయ చేనులో బోరు మంజూ రు చేయాలని జైనూర్ మండలం పార గ్రామానికి చెందిన సిడ్మారావు విన్నవించాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఎల్కరి పద్మ, అదే మండలం రాళ్లపేట గ్రా మానికి చెందిన రెడ్డి ఉమారాణి, వంకులం గ్రామానికి చెందిన ఆత్మకూరి రజిత వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రామంలో బుద్ధుడి మందిర నిర్మాణానికి అక్రమంగా చందాలు వసూలు చేస్తున్నారని కౌటాల మండలం తాటినగర్కు చెందిన దుర్గం శరత్ చంద్ర ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ కింద ఉపాధి కల్పించాలని ఆసిఫాబాద్ పట్టణం జన్కాపూర్కు చెందిన అనసూర్య అర్జీ అందించింది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. వినతులను సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. -
మార్పు మంచికే..
చింతలమానెపల్లి: సంప్రదాయ పంటలతో నష్టాలు చవిచూస్తున్న రైతులకు పంట మార్పిడి మేలు చేస్తోంది. జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు విభిన్న రకాల పంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఒక పంట ఆశించిన దిగుబడి ఇవ్వకపోయినా.. మరో పంట ద్వారా నష్టాలను పూడ్చుకుంటున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సాహించడంతో రైతులు సైతం పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. మిరప పంటలో గతేడాది చాలామంది ఎండుతెగులు కారణంగా నష్టాల బారినపడ్డారు. ఫైజోరియా సోకడంతో కారణంగా ఆర్థికంగా నష్టపోయారు. ఎన్ని రకాల ఎరువులు వినియోగించినా దిగుబడులు పెరగడం లేదని రైతులు వాపోతున్నారు. ఒకే పంటతో దిగుబడి తగ్గుముఖంరైతు ఏటా ఒకే పంటను ఒకే ప్రదేశంలో పండిస్తే దిగుబడి తగ్గుతుంది. ఒకే పంటను పండించడం ద్వారా నేలలోని పోషకాలు తగ్గి భూసారం దెబ్బతింటుంది. తెగుళ్ల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పురుగుల మందులు, రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. దీంతో పంట మార్పిడి చేసి సాగు చేయడం ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట మార్పిడి ద్వారా నేలలోని సారం పెరిగి తెగుళ్లు తగ్గుతాయి. ఒక పంటకు అవసరమైన పోషకాలను పంట మార్పిడిలో సాగు చేసే మరో పంట అందిస్తుంది. ఉదాహరణకు మొక్కజొన్న సాగు చేసినప్పుడు ఈ పంట నేలలోని నత్రజనిని వినియోగించుకుంటుంది. పంట మార్పిడిలో పప్పు ధాన్యాలు సాగు చేస్తే పప్పుధాన్యాల ద్వారా నేలకు నత్రజని అందుతుంది. నేలలో పోషకాలను సక్రమంగా వినియోగించడం ద్వారా రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది. పంట మార్పిడి వైపు అడుగులుగత వ్యవసాయ సీజన్లలో పత్తి విత్తనాలు నాటిన రైతులకు వర్షాభావ పరిస్థితుల కారణంగా విత్తనాలు ఎండిపోయాయి. పలుమార్లు విత్తనాలు నాటినా మొలకెత్తని పరిస్థితి. ఈ కారణంగా పలువురు రైతులు కొత్త తరహా పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. నూనె గింజల పంటలకు ఉన్న డిమాండ్ రైతుల్లో కొత్త ఆలోచనలు కలిగించింది. చింతలమానెపల్లి మండలంలో రణవెల్లిలో రైతులు కుసుమ నూనె గింజలను పండిస్తున్నారు. ఆయా గ్రామాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. కాగజ్నగర్ మండలం ఈస్గాం, నజృల్నగర్, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ పరిధిలో బెంగాలీలు కూరగాయలను సాగు చేస్తారు. మొదటి విడతలో పత్తి, వరి పంటలను సాగు చేసి, కోతల అనంతరం కూరగాయలు పండిస్తున్నారు. సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లో ప్రాణహిత, పెన్గంగ నదుల తీరాల్లో పత్తి నుంచి రైతులు మొక్కజొన్న, నువ్వులు, పెసర, శనగ పంటలు, తర్బూజ వంటి పళ్లు సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేసి సాగు చేస్తున్న ఈ పంటలు రైతులకు మెరుగైన దిగుబడులు ఇస్తున్నాయి. పంట మార్పిడి చేసి లాభాలు సాధించాలకునే వారు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని, వారి భూములకు తగిన పంటలను శాసీ్త్రయంగా సూచనలు వివరిస్తామని తెలియజేస్తున్నారు. మార్కెటింగ్ సమస్యచేతికందిన దశలో సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే లాభాలు సాధిస్తామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మార్కెటింగ్ సమస్యగా మారుతున్నట్లు చెబుతున్నారు. పంటల సాగుకు అనుగుణంగా పరిశీలించి కొనుగోలు చేసేలా మార్కెట్ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.పంట మార్పిడితో దిగుబడి పంట మార్పిడితో దిగుబడి పెరుగుతుంది. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. పలువురు రైతులు ఈ దిశగా పంటలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. పంట మార్పిడిలో ఖరీదైన రసాయనిక ఎరువులు కాకుండా తక్కువ ఖర్చులో సేంద్రియ, సహజ ఎరువులను వినియోగించుకోవచ్చు. సాగులో సలహాలు అవసరమైతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. – కార్తీష, వ్యవసాయ అధికారి, చింతలమానెపల్లి ఉద్యానవన శాఖ ప్రోత్సాహం రైతులు సాధారణ పంటలతోపాటు ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలి. పండ్ల తోటలు, పామాయిల్ వంటి వాటితో లాభాలు సాధించవచ్చు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహకాలు అందిస్తోంది. రైతులకు అవసరమైన నీటి సరఫరా పరికరాలను ఇస్తోంది. మామి డి, జామ, నిమ్మ, బొప్పాయి, సంత్ర, పనస డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల సాగుకు 50 శాతం, పామాయిల్ తోటల సాగుకు 90శాతం రాయితీ ఉంది. – సుప్రజ, హర్టికల్చర్ అధికారి -
సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ
చింతలమానెపల్లి: మండలంలోని గూడెం గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు భూమిపూజ చేసి ప్రారంభించారు. దిందా, గూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సబ్స్టేషన్ నిర్మాణంతో గూడెం, పరిసర గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యలు తొలగిపోతాయని అన్నారు. బెజ్జూర్ నుంచి అహేరి వరకు బస్సులు నడుస్తున్నాయని, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడిందని పేర్కొన్నారు. బాబాసాగర్ నుంచి గూడెం వరకు హ్యామ్ పథకం కింద రహదారి మంజూరైందన్నారు. అంతకు ముందు దిందా వంతెన పనులను పరిశీలించి, నాణ్యతగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, నాయకులు డుబ్బుల నానయ్య, డుబ్బుల వెంకన్న, చౌదరి నానయ్య, చౌదరి రంగయ్య, చౌదరి హరి, సత్పుతె తుకారాం, పవన్ పురోహిత్, డుబ్బుల రావు, దేశ్ముఖ్ భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అల్పపీడనం ప్రభావంతో ఆకాశం మేఘావృతం అవుతుంది. అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది. వనమహోత్సవానికి సన్నద్ధం వనమహోత్సవం కార్యక్రమం కోసం తిర్యాణి మండలంలోని 29 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మొక్కల పెంపకం చేపడుతున్నారు. 9లోu మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
సీఎం కప్ పోటీల్లో రెండోస్థానం
రెబ్బెన: వనపర్తిలో జరిగిన సెపక్తక్రా సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా పురుషుల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఫైనల్లో ఉమ్మడి ఆదిలాబాద్ పురుషుల జట్టు హైదరాబాద్ జట్టుతో తలపడిందన్నారు. హోరాహోరీగా సాగిన పోటీలో 11– 15, 17– 16, 14– 13 పాయింట్లతో సెట్ పా యింట్ కోల్పోయి వెండి పతకం కై వసం చేసుకోవా ల్సి వచ్చిందన్నారు. క్రీడాకారులను అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, జిల్లా డీవైఎస్వో అష్వక్ అహ్మద్, శిరీష, ఎగ్జిక్యూటివ్ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, సతీశ్, బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు అభినందించారు. -
‘కోర్టు స్టేకు కృషి చేస్తా’
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ గుండ స్నేహపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కోర్టు స్టేకు కృషి చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విప్ ధిక్కరించి బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఆసిఫాబాద్ 13వ వార్డు కౌన్సిలర్ గుండ స్నేహ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి గుండ స్నేహ, శ్యాం దంపతులు సోమవారం హైదరాబాద్లో కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక పరిస్థితులు వివరించారు. స్పందించిన ఆయన తన వ్యక్తిగత లాయర్తో మాట్లాడి వారం రోజుల్లోగా కౌన్సిలర్ రద్దుపై స్టే వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెల్లడించారు. వారి వెంట తిర్యాణి మండల నాయకుడు జగదీశ్ ఉన్నారు. -
బాధితుల రక్షణే ప్రథమ లక్ష్యం
ఆసిఫాబాద్అర్బన్: బాధితుల రక్షణే పోలీసుశాఖ ప్రథమ లక్ష్యమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని డీఎస్పీ, ఏఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. సమస్య స్థితి, పరిష్కారానికి పలు సూచనలు చేశారు. పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుట్రిపుల్ రైడింగ్, మైనర్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా శబ్ద కాలుష్యం సృష్టించే సైలెన్సర్లు ఉన్న ద్విచక్రజు వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు వాహనదారులు ఫ్యాన్సీ డిజైన్, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. రాంగ్సైడ్ పార్కింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, బాధ్యతారాహిత్యంగా ఓవర్ లోడ్ వాహనాలు నడపొద్దన్నారు. తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు. -
పెండింగ్ లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన: సింగరేణి ఉద్యోగులకు పెండింగ్ లే కుండా సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎంపీఎఫ్ రీజినల్ కమి షనర్ హరి పచౌరీ తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రయాస్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎంపీఎఫ్ లావాదేవీలు అన్ని సీకేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతాయన్నారు. ఉద్యోగులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా సేవలు పొందవచ్చని స్పష్టం చేశారు. సీఎంపీఎఫ్ బెనిఫిట్స్కు అర్హులు, పెన్షన్, రివైస్డ్ పెన్షన్పై అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహా లను నివృత్తి చేశారు. నామినీ పేర్లలో వ్య త్యాసం వచ్చిన సందర్భాల్లో ధ్రువీకరించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ నెలలో కమిషనర్ పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఇన్చార్జి జీఎం నరేందర్, అధికా రులు ఆయనను సన్మానించారు. రీజినల్ కమిషనర్– 2 గోవర్ధన్, డీవైపీఎం ఎస్వీ రాజేశ్వర్రావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆందోళన వీడితేనే విజయం
ఆసిఫాబాద్రూరల్: ఆందోళన వీడి పరీక్షలు రాస్తే విద్యార్థులను విజయం వరిస్తుందని జి ల్లా ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి(డీఐఈవో) రాందాస్ అన్నారు. పరీక్షలంటే భయం లేకుండా ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా రాస్తే మంచి మార్కులు సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మలుపు తిప్పే ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 10,301 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని, ఐదు నిమిషాల ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సారి పకడ్బందీగా నిఘా నేత్రాల(సీసీ కెమెరాలు) పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ కళాశాలల ఫలితాల్లో రాష్ట్రంలోనే ఒకటి, రెండు స్థానాలను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కై వసం చేసుకుంటోందని, అదే పట్టుదలతో ఈ ఏడాది కూడా రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సాక్షి: ఈ ఏడాది జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు? వారి కోసం ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?డీఐఈవో: జిల్లాలో 2025– 26 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 5,504 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,797 మంది.. ఇలా మొత్తం 10,301 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో జనరల్ విభాగంలో 8,644 మంది, ఒకేషనల్ విభాగంలో 1,657 మంది ఉన్నారు. మొత్తం 19 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో 11 ప్రభుత్వ కళాశాలలు, రెండు ప్రైవేట్ కళాశాలలు, ఆరు ప్రభుత్వ సెక్టార్ కళాశాలలు ఉన్నాయి. సాక్షి: పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు?డీఐఈవో: గతంలో లేనివిధంగా వసతులను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అన్ని పరీక్ష కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, తగినంత వెలుతురు కోసం లైట్లు, డ్యుయల్ డెస్క్లతోపాటు అవసరమైన ఫర్నీచర్ వంటి అన్ని సౌకర్యాలను కల్పించాం. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు, ఇంటర్నెట్, కంప్యూటర్, ప్రింటర్ సౌకర్యం ఉంటుంది. గైర్హాజరైన విద్యార్థుల సమాధాన పత్రాల బార్కోడ్లను స్కాన్ చేసి ఎప్పటికప్పుడు బోర్డు వెబ్సైట్కు సమాచారం పంపించేలా ఏర్పాట్లు చేశాం. అత్యవసర వైద్య సహాయం కోసం ఏఎన్ఎంలు కూడా అందుబాటులో ఉంటారు.సాక్షి: ఆలస్యంగా వచ్చే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారా?డీఐఈవో: పరీక్ష సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే జవాబు పత్రాలు అందజేస్తారు. 9 గంటల తర్వాత ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే అనుమతించేది లేదు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. సాక్షి: మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా ఎలాంటి నిఘా చర్యలు తీసుకున్నారు?డీఐఈవో: ఈసారి ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. సీసీ ఫుటేజీ పరీక్ష సమయంలో ఇంటర్ కంట్రోల్ రూమ్కు అనుసంధానమై ఉంటుంది. దీంతో మాస్ కాపీయింగ్కు అవకాశం ఉండదు. సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశాం. డిపార్ట్మెంటల్ బృందంతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లో జూ నియర్ లెక్చరర్లు, రెవెన్యూ అధికారులు, ఏఎస్సైలు ఉంటారు. జిల్లా పరీక్ష కమిటీతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్లు కూడా తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనలు అతిక్రమించి కాపీయింగ్ను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. సాక్షి: ఇంటర్ ఫలితాలపై మీ అంచనా ఏమిటి? విద్యార్థులను ఏ మేరకు సిద్ధం చేశారు?డీఐఈవో: గతేడాది మన జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది నం.1 స్థానానికి చేరే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాం. కొన్నేళ్లుగా వస్తున్న ఉత్తమ ఫలితాలను చూసి ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అకాడమిక్ మానిటరింగ్ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థుల మార్కులపై నిరంతరం దృష్టి సారించాం. విద్యార్థులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి నమూనా ప్రశ్నపత్రాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. -
మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్
ఆసిఫాబాద్: జిల్లాలోని మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ట్రైయినీ ఐఎఫ్ఎస్ అధికారి భార్గవ్కుమార్, ఆర్డీవో లోకేశ్వర్రావు, కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్యలతో కలిసి తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో కంపెనీలు, టీఫైబర్ ప్రతినిధులతో సెల్టవర్ల ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ఎయిర్టెల్, జియో సంస్థల టవర్ల నిర్మాణాలు, స్థలం గుర్తింపు, పాలనపరమైన అనుమతులు త్వరగా పొందాలని తెలిపారు. శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలిమతసామరస్యంతో శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. రంజాన్ నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్, ట్రెయినీ ఐఎఫ్ఎస్ అధికారి భార్గవ్కుమార్, ఆర్డీవో లోకేశ్వర్రావు, శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మసీదుల వద్ద ప్రతిరోజూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్తం జాడే, తహసీల్దార్లు రియాజ్ అలీ, మధుకర్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ పాల్గొన్నారు. -
స్కౌట్ అండ్ గైడ్స్తో క్రమశిక్షణ
రెబ్బెన: స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం ఎం.నరేందర్ అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఆదివారం ప్రపంచ ఆలోచన దినోత్సవం నిర్వహించారు. స్కౌట్స్ అండ్స్ గైడ్స్ పితామహుడు బడెన్ పావెల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్కౌట్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు, గురువులు సర్వమత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడెన్ పావెల్ జయంతి సందర్భంగా 165 దేశాల్లో ఆలోచన దినోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. తమ సొంత ఆలోచనలతో అటవీ ప్రాంతంలో క్యాంపు వేసుకుని ఎలా జీవించాలో చూపే ప్రదర్శన బాగుందని కితాబిచ్చారు. కార్యక్రమాల్లో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, హెచ్ఎం అర్లారెడ్డి, స్కౌట్స్ మాస్టర్ భాస్కర్, గైడ్స్ కెప్టెన్ కరిష్మా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దూరం.. అగ్నికి ఆజ్యం!
చింతలమానెపల్లి: అత్యవసర సమయాల్లో ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి అవసరాలను విస్మరిస్తోంది. మారుమూల మండలాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే సర్వం బూడిదవుతోంది. సిర్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, వందలాది గ్రామాలకు కలిపి కేవలం ఒకే ఒక అగ్నిమాపక కేంద్రం ఉండటంతో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే బాధితులు కట్టుబట్టలతో మిగిలే పరిస్థితి దాపురించింది. వేసవి ప్రారంభం కావడంతో చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లోని ప్రజలు అగ్ని ప్రమాదాల భయంతో ఆందోళన చెందుతున్నారు. గత నెలలో చింతలమానెపల్లి మండలం ఖర్జవెల్లి గ్రామంలోని చౌదరి భాస్కర్ అనే రైతు ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా పత్తి కాలిపోయింది. సుమారుగా రూ.60 వేల నష్టం సంభవించింది. గతేడాది బెజ్జూర్ మండలంలోని ఓ గ్రామం నుంచి కౌటాల మీదుగా వెళ్తున్న పత్తిలోడ్ వ్యాన్ ముత్తంపేట – కౌటాల మధ్య అగ్ని ప్రమాదానికి గురైంది. రహదారిపై జరిగిన ఈ ప్రమాదం భయాందోళన కలిగించింది. ఒకే ఫైర్ స్టేషన్సిర్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కలిపి ఒకే ఫైర్స్టేషన్ ఉంది. దాదాపుగా 100 కిలో మీటర్ల పరిధిలో సుమారుగా 130 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 300 గ్రామాలు ఉన్నాయి. కాగజ్నగర్ మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలకు కలిపి ఒకే అగ్నిమాపక కేంద్రం ద్వారా సేవలందిస్తున్నారు. ప్రజలకు అన్ని అవసరాలు తీరుస్తున్నామంటున్నా.. అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడేందుకు తగిన ఏర్పాటు చేయకపోవడంతో ప్రజ లు ఇబ్బందులకు గురవుతున్నారు. నియోజకవర్గంలోని రైతుల ఇళ్లన్నీ అధికంగా కర్ర, వెదురు, గడ్డి ఆధారంగా నిర్మితమయ్యాయి. పశువుల కోసం నిల్వ ఉంచే దాణా, గడ్డి అగ్ని ప్రమాదాలకు కారకా లుగా ఉంటున్నాయి. రైతు కుటుంబాలు గోదాములు లేకపోవడంతో ఇళ్లలోనే పంటను నిల్వ ఉంచుతున్నారు. ఆయా మండలాల్లో సుమారుగా ఏటా పదుల సంఖ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి జూన్ నెలల్లో అధికంగా అగ్ని ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. 15కు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. పొలాలలో వరికో తల అనంతరం ఉంచిన వరికుప్పలు దగ్ధమైన సందర్భాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దూరంతోనే జాప్యంకౌటాల మండల కేంద్రం కాగజ్నగర్ ఫైర్ స్టేషన్ నుండి 40 కిలో మీటర్ల దూరంలో ఉండగా, చింతలమానెపల్లి మండల కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెజ్జూర్ మండలంలోని కొన్ని గ్రామాలకు కాగజ్నగర్ ఫైర్ స్టేషన్ సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దూరం చేరుకోవాలంటే సుమారుగా 3 గంటల సమయం పడుతుంది. ఫైరింజన్ వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరుగుతోంది. నియోజకవర్గంలో కౌటాల, బెజ్జూర్, చింతలమానెపెల్లి మండలాల పరిధిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బెజ్జూర్, సిర్పూర్ మండలాలలోని సుమారు 100 గ్రామాలకు ఉపయోగపడుతుంది. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సకాలంలో ఫైరింజన్ చేరుకోగలిగితే ప్రమాదం తీవ్రతతో పాటు ఆస్థినష్టం తగ్గుతుందని, ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.నిత్యం ప్రమాదాలు మా ఊరిలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అందరం కలిసి మంటలు ఆర్పుతాం. కానీ పెద్ద ప్రమాదాల సమయంలో మంటలకు ఆస్తులు కాలిపోవాల్సిందే. – శ్రీనివాస్, రుద్రాపూర్ఫైర్స్టేషన్ మంజూరు చేయాలి అగ్ని ప్రమాదాల జరిగినప్పుడు కాగజ్నగర్ నుంచి ఫైరింజన్ రావాలంటే చాలా సమయం పడుతోంది. ఆస్తులు నష్టపోయి చాలామంది అప్పుల పాలయ్యారు. స్థానిక మండలాల్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల మండలాలకు అందుబాటులో ఉంటుంది. – బుర్రి రూపేష్, గూడెం -
సిర్పూర్(టి) రేంజ్లోనే బెబ్బులి
సిర్పూర్(టి): సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలోనే పెద్దపులి సంచరిస్తోంది. గ్రామాల పరిసర ప్రాంతాల్లో తరుచూ ఆవులు, ఎద్దులు, మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తోంది. ఏడాది కాలంగా సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోనే పెద్దపులుల సంచారం అధికంగా ఉంది. దీంతో అటవీశాఖ అధికారులు వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఏడాది కాలంలో మేడిపల్లి శివారులో ఒక ఆవు, వేంపల్లి శివారు అటవీ ప్రాంతంలో రెండు ఆవులు, చీలపెల్లి అటవీప్రాంతంలో నాలుగు ఆవులు, ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతంలో ఆరు ఆవులు, ఎద్దులు, మాకిడిలో మరో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆవులు, ఎద్దులు, మేకలు కోల్పోయిన రైతులకు అధికారులు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంతోపాటు పూర్తి పరిహారం సకాలంలో అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. నిత్యం ట్రాకింగ్..సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులులను అటవీశాఖ అధికారులు, టైగర్ ట్రాకర్స్, వాచర్స్ నిత్యం ట్రాకింగ్ చేస్తున్నారు. ప్రతిరోజూ అడవుల్లో తిరుగుతూ బెబ్బులి ఆనవాళ్లు గుర్తిస్తున్నారు. పెద్దపులులకు హాని కలిగించే పరిస్థితులను గుర్తిస్తున్నారు. పెద్దపులి కదలికలు కనిపిస్తే అప్రమత్తమై గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతోపాటు ఇతర వన్యప్రాణులు, పశువుల రక్షణ కోసం చర్యలు చేపడుతున్నారు. అలాగే అడవులకు సమీపంలో ఉన్న రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని.. దట్టమైన అటవీప్రాంతాలకు పశువులు, మేకలు తీసుకెళ్లొద్దని, ఒంటరిగా వెళ్లొద్దని వద్దని సూచిస్తున్నారు. -
ప్రశాంతంగా టీజీసెట్
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గురుకులాల ప్రవేశ పరీక్ష(టీజీసెట్) ప్రశాంతంగా ముగిసింది. 23 కేంద్రాల్లో 5,847 మంది విద్యార్థులకు 5,645 మంది హాజరు కాగా, 202 మంది గైర్హాజరయ్యారు. 5వ తరగతిలో 2,296 మందికి 2,230 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. అలాగే 6వ తరగతిలో 1,681 మందికి 53 మంది గైర్హాజరు కాగా 1,678 మంది పరీక్ష రాశారు. 7వ తరగతిలో 683 మందికి 656 మంది హాజరయ్యారు. 27 మంది హాజరు కాలేదు. 8వ తరగతి 745 మందికి 709 మంది హాజరుకాగా, 36 పరీక్ష రాయలేదు. 9వ తరగతిలో 442 మందికి 422 మంది హాజరు కాగా, 22 మంది గైర్హాజరయ్యారని డీసీవో శారద తెలిపారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ గురుకుల, కాగజ్నగర్లో పలు కేంద్రాలను డీసీవో తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడిజిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద హాల్టికెట్ నంబర్ చూసుకుంటున్న విద్యార్థులు -
మరుగుదొడ్లు మరిచిపోయారు..!
కెరమెరి: గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి ‘సంఘం బంధం’ పేరిట నిర్మిస్తున్న భవనాల్లో ప్రభుత్వం కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లను విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది మహిళలు సమావేశమయ్యే చోట వాష్రూంలు లేకపోతే ఎలా అని స్వయం సహాయక సంఘాల సభ్యులు నిలదీస్తున్నారు. రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనాల ప్లాన్లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 222 భవనాలు మంజూరుజిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 386 వీవో సంఘాలు ఉండగా, అందులో 222 వీవోలకు భవనాలు మంజూరయ్యాయి. ఇందుకోసం గ్రామాల్లో దాతల స్థలాలు, ప్రభుత్వ స్థలాలను సేకరించి ఒక్కో భవనాన్ని రూ.10 లక్షల వ్యయంతో నిర్మించేలా పనులు ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతున్నా భవన నమూనాలో మరుగుదొడ్లను చేర్చకపోవడంపై పెదవి విరుస్తున్నారు. గతంలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా బహిరంగ మల, మూత్ర విసర్జనను అరికట్టి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు మహిళల కోసమే నిర్మిస్తున్న ’సంఘం బంధం’ భవనాల్లో వాష్రూంలు లేకపోవడం విడ్డూరంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి సమావేశాల్లో పాల్గొనే వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. 200 గజాల స్థలంలో నిర్మాణంసంఘం బంధం భవనాలు 200 గజాల స్థలంలో ని ర్మిస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల వె చ్చిస్తున్నారు. ఈ అంచనా వ్యయం మొత్తాన్నీ కేవలం భవన నిర్మాణానికే కేటాయించారు. వాష్ రూంలను మాత్రం విస్మరించారు. సాధారణంగా సమావేశాలకు హాజరయ్యే మహిళలు గంటల తరబడి ఒకేచోట ఉంటారు. మూత్ర విసర్జన కోసం ఎక్కడి కి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు, ఐకేపీ అధికారులు వారు క్షేత్రస్థాయిలో భవన నమూనాను పరిశీలించి ప్లాన్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆందోళన వద్దు మహిళా సంఘ భవనాల నమూనాలో మరుగుదొడ్ల నిర్మాణానికి చోటు లేని విషయం వాస్తవమే. కానీ మహిళలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు స్వీకరించి మరుగుదొడ్లు నిర్మిస్తాం. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. – దత్తారావు, డీఆర్డీవో -
డీటీఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక
కాగజ్నగర్టౌన్: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా పొర్శెట్టి నాందేవ్, ఉపాధ్యక్షులుగా నాగోరా వు, భువనేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివా స్, కార్యదర్శులుగా మోహన్, ధర్మయ్య, రవీంద్రచారితో పాటు రాష్ట్ర కౌన్సిలర్గా విస్తారును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డీటీఎఫ్ కృషి చేస్తుందని వారు అన్నారు. ప్రభుత్వం పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ప్రమాద నివారణలో జాప్యం
గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా నేటి పరిస్థితులు మారుతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అగ్ని ప్రమాదాలు అవకాశం ఉండే వ్యవసాయ ఉత్పత్తుల ఆధార పరిశ్రమలు, మిల్లుల నిర్మాణం జరుగుతున్నాయి. చింతలమానెపల్లి మండలంలో గత రెండు సంవత్సరాల్లో నాలుగు భారీ తరహా రైస్ మిల్లులు, నిల్వ గోదాములు ఏర్పాటు కాగా, కౌటాల మండలంలో మూడు జిన్నింగ్ మిల్లులు, మరో ఎనిమిది భారీ తరహా రైస్ మిల్లులు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ప్రమాదాలు జరిగిన తర్వాత కాగజ్నగర్లోని కేంద్రం నుంచి ఫైరింజన్ సంఘటన స్థలానికి చేరుకునేసరికి బాధితులకు తీరని నష్టం జరుగుతోంది. దూరం కారణంగా సరైన సమయంలో వాహనం సంఘటన స్థలానికి చేరుకోలేపోతోంది. గ్రామస్తులు స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా బాధితుల నష్టాన్ని తగ్గించలేకపోతున్నాయి. ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు ఆర్థికంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఒక్కోసారి గాలులు ఉండడంతో మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాప్తి చెందుతున్నాయి. -
నగదు రహిత వైద్యం అందించాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు నగదురహిత వైద్యం అందించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం సంఘం నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నేటివరకు అమలు చేయడం లేదన్నారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, డే వాయిదాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు రూపొందించి, డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో తదితర పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. టీచర్లకు టెట్ మినహాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హత మార్కులు తగ్గించి, ఇన్సర్వీస్ టీచర్లకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి, ప్రధాన కార్యదర్శి ఊశన్న, ఉపాధ్యక్షుడు ఇందురావు, కోశాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విజేతలకు బహుమతుల ప్రదానం
కాగజ్నగర్ రూరల్: మండలంలోని భట్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల బామని చేనులో వారంరోజులుగా నిర్వహిస్తున్న ట్రై విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో గెలు పొందిన జట్లకు శనివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడా పోటీల్లో పాల్గొని రాణించాలని సూచించారు. విన్నర్గా నిలిచిన అందవెల్లి, రన్నర్గా నిలిచిన భట్పల్లి జట్లకు బహుమతులు అందజేశారు. కార్య క్రమంలో నాయకులు పిర్సింగుల తిరుపతి, శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
సీనియర్ లెక్చరర్లకు అవకాశమివ్వాలి
ఆసిఫాబాద్రూరల్: ఇంటర్ పరీక్షల విధుల్లో సీనియర్ లెక్చరర్లకు అవకాశం ఇవ్వాలని లె క్చరర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం డీఐ ఈవో రాందాస్కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లాలోని జైనూర్, కెరమెరి, దహెగాం ప్రభుత్వ కళాశాలల సీనియర్ లెక్చరర్లకు మొదట కళాశాలలో సీఎస్ ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 20 న వారు శిక్షణకు హాజరై పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం డీఐఈవో ఎలాంటి నో టీస్ ఇవ్వకుండా వారి ఆర్డర్ కాపీలను రద్దు చేసి అదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లకు అవకాశం ఇవ్వడం సరికాదని తెలిపా రు. వారికి అనుభవం లేదని, సీనియర్లకు అ వకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్రెడ్డి, కార్యదర్శి శ్రీనివా స్, నాయకుడు సునీల్ తదితరులున్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ఆసిఫాబాద్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కే హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదన పు కలెక్టర్ దీపక్తివారితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్నందున పనులు వేగవంతం చేయాలని తెలిపారు. పూర్తయిన పనుల బిల్లుల ప్రతిపాదనలు అందించాలని సూచించారు. సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, ఎంపీడీవోలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణ ఉపాధి పథకం కింద మంజూరైన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు, గ్రామ సమాఖ్య భవనాలు, ఫుడ్ గ్రెయిన్ గోదాం, వంటశాలల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించా రు. ఇంజినీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల అదనపు తరగతి గదులు, రహదారి పనులు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు, బీటీ రహదారుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. సంపూర్ణత అభియాన్, ప్రధానమంత్రి జన్మన్ కింద చేపట్టిన పనులు పూర్తి చే యాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, పీవీ టీజీ అవాసాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో చేపట్టిన బాలికల ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూ చించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని, అవసరమైన మరమ్మతు చర్యలు చేపట్టాలని తెలి పారు. లింగాపూర్, సిర్పూర్ (యూ), తిర్యాణి మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని పేర్కొన్నారు. ఇంకా ప్రారంభం కానివి ఉంటే లబ్ధి దారులతో మాట్లాడి త్వరగా నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం కింద చేపట్టిన పనులను మార్చి 31లోపు పూర్తి చేయించి బిల్లులు చెల్లించాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో వివిధ శాఖల అధికా రులు, ఇంజినీర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
సొసైటీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్నగర్ రూరల్: కొత్తపల్లి వెంకటలక్ష్మి–చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల ని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని కి మ్స్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో సొసైటీ ఆధ్వర్యంలో ప్రతీ ఆదివారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షకు ఎంపికై న రోగులకు శనివారం ఆయన భోజన సదుపాయాన్ని కల్పించి, ర వాణా ఖర్చులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది మందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం బెల్లంపల్లిలోని లయ న్స్ క్లబ్ కంటి ఆస్పత్రికి తరలించామని పే ర్కొన్నారు. తొమ్మిదేళ్లలో వేలాది మందికి కంటి ఆపరేషన్లు చేయించామని చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది గోపి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మాతృభాష దినోత్సవం
కాగజ్నగర్ రూరల్: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని శనివారం పట్టణంలోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఘనంగా జరుపుకొన్నారు. తెలు గు, హిందీ, ఇంగ్లిష్ విభాగాల ఆధ్వర్యంలో మాతృభాష పరిరక్షణ, ప్రాధాన్యతపై అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ.. మాతృభాష భావ ప్రకటన ఎంతో శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. నూతన అంశాలను నేర్చుకోవడంలో మాతృభాషను మించిన భాష మరొకటి లేదని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్దన్, అధ్యాపకులు రాజేశ్వర్, మహేశ్, శారద, సంతోష్, అపూర్వ, మహా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
వలయం!
సమస్యల ఆసిఫాబాద్: జిల్లాలోని ఆసిఫా బాద్, కాగజ్నగర్ బల్దియాల్లో ఏడాదిగా ప్రత్యేక పా లన కొనసాగింది. పాలకవర్గాలు లేక అభివృద్ధి కుంటుపడింది. నిధుల కొరతతో అధి కారులు పన్నుల వసూళ్లకే పరిమితమయ్యారు. ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా, చైర్మన్, వైస్చైర్మన్తో పాటు కౌన్సిలర్లు బా ధ్యతలు స్వీకరించారు. కొత్త పాలకవర్గాలపై ఆయా బల్దియాల పరిధిలోని ప్రజలు గంపెడాశతో ఉన్నా రు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లోని 50వార్డుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ము ఖ్యంగా తాగునీరు, పారిశుధ్య సమస్యలతో ప్రజలు చాలా సతమతమవుతున్నారు. అధ్వానంగా అంతర్గతరోడ్లుఆసిఫాబాద్లో 20, కాగజ్నగర్లో 30 వార్డులు న్నాయి. రెండు మున్సిపాలిటీల్లో సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. రోడ్లపై మురుగునీరు చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్, సందీప్నగర్, బజార్వాడీ, కసాబ్వాడీ, బ్రాహ్మణవాడ, గొడవెళ్లి, హీరాపూర్తో పాటు పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పైకాజీనగర్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఏటా వానాకాలంలో ఇళ్లలోకి వర్షపునీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు చౌక్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ మూసుకుపోయింది. ప్రభుత్వాస్పత్రి వద్ద డ్రైనేజీపై టేలాలు ఏర్పాటు చేయడంతో రోడ్లపైకి మురుగునీరు చేరి రాకపోకలకు తీ వ్ర ఇబ్బందులెదురవుతున్నాయి. కాగజ్నగర్ ము న్సిపాలిటీలోని మార్కెట్ ఏరియా, కాపువాడ, సంజీవయ్య తదితర కాలనీల్లో డ్రైనేజీలు లేక ఏటా వానాకాలంలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో పాటు ఇరుకురోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. రెగ్యులర్గా కాలనీల్లో చెత్తాచెదా రం తొలగించక పోవడంతో రోడ్లపై చెత్త పేరుకుపోతోంది. జెడ్పీ గ్రౌండ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్గా మారడంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. కోతులు, కుక్కలు, పందులు..జిల్లా కేంద్రంలో కోతులు, కుక్కలు, పందుల బెడద ప్రధాన సమస్యగా మారింది. కోతులు నిత్యం ఇళ్లలోకి ప్రవేశించి మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై విచ్చలవిడిగా కుక్కలు, పందులు సంచరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో నిర్మించిన శ్మశా న వాటికకు రహదారి లేక ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు. ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను పెద్దవాగు పక్కనే దహనం చేస్తున్నారు. కొ త్త పాలకవర్గాలు, అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయా మున్సిపాలిటీల పరిధిలో ని ప్రజలు కోరుతున్నారు. తాగునీటి కటకట జిల్లా కేంద్రంలో మిషన్భగీరథ ద్వారా రూ.కోట్లతో పైపులైన్ నిర్మాణం చేపట్టినప్పటికీ సరైన ప్రణాళిక, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఎక్కడ చూసినా లీకేజీ లతో పాటు కాలనీల్లో చుక్క నీరు రాని పరి స్థితి నెలకొంది. ఏటా వేసవిలో చేతిపంపుల ను ఆశ్రయిస్తున్నారు. నల్లాలకు తూటీలు ఏ ర్పాటు చేయకపోవడంతో కొన్ని కాలనీల్లో నీరు వృథాగా పోతోంది. పట్టణంలోని శివకేశవ మందిర్ వీధి, తారకరామానగర్తోపాటు పలు కాలనీల్లో నల్లాల ద్వారా భగీరథ నీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు డబ్బులు వెచ్చించి ప్రైవేట్ వాటర్ప్లాంట్ల నుంచి తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పా టించడం లేదు. సీసీ రోడ్లు వేసిన నెలలోనే కంకర తేలుతూ పాడవుతున్నాయి. తప్పని ట్రాఫిక్ తిప్పలుజిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పట్టణంలోని గాంధీచౌక్, వివేకా నంద చౌక్, అంబేడ్కర్ చౌక్ ప్రాంతాల్లో పా ర్కింగ్ సౌకర్యం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఎస్బీఐ బ్రాంచ్ వద్ద రోడ్లపైనే ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తుండగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రధాన మార్కెట్లో రోడ్లపైనే తోపుడు బండ్లపై పండ్లు విక్రయిస్తున్నారు. వివేకానంద చౌక్లో ఐ కేపీ ఆధ్వర్యంలో పాల విక్రయ కేంద్రం కో సం ఓ టేలా ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యల కు కారణమవుతున్నారు. రోడ్లపై చిరువ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేయడంతో ట్రా ఫిక్కు తీవ్ర అంతరాయమేర్పడుతోంది. జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు చౌక్, సాయిబాబా మందిర్కు వెళ్లే రహదారికి సీసీకి అప్రోచ్రోడ్ లేక వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
తడి పొడి.. నిర్వహణ కొరవడి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సెగ్రిగేషన్ షె డ్లు, వైకుంఠధామాలు, డంపుయార్డ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఈజీఎస్ పనుల్లో భాగంగా వైకుంఠధామాలు నిర్మించారు. కానీ, నేటి వరకు వాటిని వినియోగించకపోవడంతో అందులో పిచ్చిమొక్కలు, చెట్లు మొలకెత్తి గోడలు బీటలు వారుతున్నాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించినా..జిల్లా వ్యాప్తంగా ఉన్న 315 గ్రామపంచాయతీల్లోని పల్లెలను పరిశుభ్రంగా మార్చడంతో పాటు చెత్త నుంచి సంపద తయారీకి ప్రభుత్వం నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు చాలాచోట్ల నిరుపయోగమయ్యాయి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేసి గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూర్చేలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్ల రేకులు కొన్ని చో ట్ల లేచిపోయాయి. మరికొన్ని చోట్ల నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. సెగ్రిగేషన్ షెడ్లకు రూ.2.50 లక్షలు, వైకుంఠధామాలకు రూ.12.60 ల క్షలు వెచ్చించి నిర్మించి నాలుగైదేళ్లయినా నేటి వర కూ వాడకంలో లేకపోవడం గమనార్హం. రూ.కోట్లు వెచ్చించి నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. ఏళ్లు గడుస్తున్నా నిరుపయోగమే..ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఒక వైకుంఠధా మం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు అవి నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామపంచాయతీల్లో ఊరికి దూరంగా ఉండటంతో వెళ్లేందుకు దారి లేక, వానాకాలం అటు వైపు చూసేవారే కరువయ్యారు. వైకుంఠధామాలు నిర్మించినా నీరు, కరెంట్ సౌకర్యం కల్పించలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. నాసిరకం పనులు చేపట్టగా ఇప్పటికే గోడలు బీటలు వారి కూలిపోయే పరిస్థితి ఉంది. -
ఆసిఫాబాద్ పోలీసులకు మూడు రజత పతకాలు
ఆసిఫాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మైదానంలో నిర్వహిస్తున్న నాలుగో తె లంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో సెపక్ తక్రా విభాగంలో జిల్లా పోలీస్ క్రీడాకారులు కాళేశ్వ రం జోన్ రన్నరప్గా నిలిచి రజత పతకాలు సాధించారు. ఈ విజయంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు ఏఆర్ హెడ్క్వార్టర్స్కు చెందిన పోలీస్ సి బ్బంది పొట్ట గోపి (కెప్టెన్), కిరణ్కుమార్, రాజేశ్ ర జత పతకాలు కై వసం చేసుకున్నారు. వీరితో పాటు జిల్లా కేంద్రంలోని ఏఆర్ పీసీ సువార్త మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ ఓపెన్లో సిల్వర్ మెడల్ సా ధించారు. కెప్టెన్గా వ్యవహరించిన గోపి ఈ నెల 23నుంచి 27వరకు కేరళలో నిర్వహించే ఆల్ ఇండి యా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొననున్నారు. ఎస్పీ నితిక పంత్ విజేతలను అభినందించారు. భ విష్యత్లోనూ మరిన్ని పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎదగాలని, క్రీడల్లో సిబ్బందిని ప్రోత్సహించడంలో పోలీస్శాఖ ముందుంటుందని తెలిపారు. సిల్వర్ మెడల్ సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ సువార్తపతకాలు సాధించిన ఏఆర్ పోలీసులు


