Komaram Bheem
-
ఎల్ఆర్ఎస్ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఎల్ఆర్ఎస్పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం సబ్సి డీ ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్– 2002 పథకం కింద 3,499 దరఖాస్తులు వచ్చాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి 2,993 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 116 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారన్నారు. గ్రామ పంచాయతీల్లో 3,665 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా 2,299 అర్హత ఉన్నవిగా గుర్తించామని తెలిపారు. వీరిలో 229 మంది ఫీజు చెల్లించారన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, టౌన్ప్లానింగ్ అధికారి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్కు అభినందన
ఆసిఫాబాద్అర్బన్: ఇటీవల హర్యానాలో నిర్వహించిన 73వ ఆల్ ఇండియా పోలీసు స్పోర్ట్స్ మీట్లో సెపక్ తక్రా చాంపియన్షిప్లో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించిన ఆసిఫాబాద్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ పొట్ట గోపిని శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ చూపి పోలీసుశాఖకు పేరు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, సీసీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి
ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు జీవతంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జన్కాపూర్లోని పాత కలెక్టరేట్ భవనంలో గల టాస్క్ కేంద్రంలో 40 రోజుల కంప్యూటర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు శుక్రవారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి సర్టిఫికెట్లు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ 40 రోజులపాటు కంప్యూటర్ శిక్షణ, టైపింగ్ మెలకువలు నేర్పించినట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. శిక్షణ కేంద్రం సమన్వయకర్త సాయికుమార్, శిక్షకులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
● జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగళ్లు ● ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు ● విరిగిపడిన స్తంభాలు.. నిలిచిన విద్యుత్ సరఫరా ● ఇళ్ల రేకులు ఎగిరిపోవడంతో నష్టం ● కాగజ్నగర్లో గోడ కూలి వృద్ధుడు మృతికౌటాల/తిర్యాణి/కాగజ్నగర్రూరల్: జిల్లాలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు పడటంతోపాటు భారీగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. కాగజ్నగర్ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోచమ్మ గుడి వద్ద 150 ఏళ్ల భారీ మర్రి చెట్టు నేలకొరిగింది. కాగజ్నగర్ మండలంలోని బురదగూడ సమీపంలో రహదారిపై విద్యుత్ తీగలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్కుమార్ ఘటనస్థలికి చేరుకుని సిబ్బందితో కలిసి విద్యుత్ తీగలను పైకెత్తి పట్టుకుని వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పట్టణంలోని నౌగాంబస్తీలో ఇంటి గోడ కూలి దావులత్(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని ఈజ్గాం శివాలయం ఆవరణలోని షెడ్డు కూలిపోయింది. ఈజ్గాం, సీతానగర్, నామానగర్, జంబుగ తదితర గ్రామాల్లో ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. కాగజ్నగర్– పెంచికల్పేట్ రహదారిలో చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. స్తంభాలపై చెట్లు పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ● కౌటాల మండలంలో గాలివానతో కౌటాల– కాగజ్నగర్ ప్రధాన రహదారిపై కుమురంభీం చౌరస్తా వద్ద చెట్టు పడింది. సదాశివపేట కాలనీలో కౌటాల– బెజ్జూర్ ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. కౌటాల పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ జేసీబీతో చెట్లను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కనికి గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ● చింతలమానెపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. గూడెం– కర్జెల్లి రోడ్డు బురదమయంగా మారింది. విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ● దహెగాం మండలంలో వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మిర్చి తోటల్లో పంట నేలరాలింది. మామిడి తోటల్లో కాయలు రాలిపడటంతో రైతులకు నష్టం వాటిల్లింది. ● తిర్యాణి మండలంలోని అటవీప్రాంతంలో భారీ వర్షానికి గుండాల జలపాతం ఉప్పొంగింది. జలకళను సంతరించుకుంది. గాలులకు చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెబ్బెనలో భారీ నష్టంరెబ్బెన: మండలంలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది. రెబ్బెన, గోలేటి, వరదలగూడ, గొల్లగూడ, నంబాల తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ ఆవరణలో ఉన్న షెడ్డు, గొల్లగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్లు నామరూపాలు లేకుండా దెబ్బతిన్నాయి. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గోలేటి టౌన్షిప్లో సింగరేణి సబ్ స్టేషన్ సమీపంలో భారీ నీలగిరి వృక్షం విరిగి విద్యుత్ తీగలపై పడింది. కార్మిక కాలనీల్లోనూ చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. వరదలగూడ గ్రామానికి చెందిన కోడిపుంజుల సంతోష్ ఇంటిపై చెట్టు కొమ్మలు విరిగిపడి ఇల్లు ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే గ్రామానికి చెందిన దేనవేణి తిరుపతి, మంత్రి తిరుపతి, పోగుల రమేశ్, అప్పాల రవి, గోగారం రాజేశ్తోపాటు పలువురి ఇళ్ల ఎదుట వేసిన రేకుల షెడ్ల పైకప్పు రేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. మండల కేంద్రానికి చెందిన సత్రపు సత్తయ్య ఇంటి ఎదుట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపై చెట్టు విరిగి పడ్డాయి. బైక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన దుకాణాల ఎదుట రేకులు లేచిపోయాయి. -
రుణాల పంపిణీలో భేష్
తిర్యాణి(ఆసిఫాబాద్): స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణా ల చెల్లింపుల్లో జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేస్తోంది. అవసరాల మేరకు వారికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలతోపాతోపాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నారు. మహిళలు ప్రతినెలా ఈఎంఐ రూపంలో తిరిగి బ్యాంకులకు చెల్లిస్తుంటారు. 4,046 సంఘాలకు రుణాలుస్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.221.73 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో తొమ్మిది రోజుల సమయం ఉండగానే అధికారులు లక్ష్యం చేరుకున్నారు. జిల్లాలో 4,046 మహిళా సంఘాలకు రూ.230.18 కోట్ల రుణాలు అందించి లక్ష్యం అధిగమించారు. మరోవైపు సీ్త్రనిధి ద్వారా రూ.25 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు రూ.24 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. జిల్లాలో అత్యధికంగా రెబ్బెన మండలంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.12.15 కోట్ల రుణ లక్ష్యానికి 282 మహిళా సంఘాలకు రూ.22.10 కోట్ల రుణాలు అందించి మొదటిస్థానంలో నిలిచారు. అలాగే అత్యల్పంగా లింగాపూర్ మండలంలో రూ.9.70 కోట్ల రుణ లక్ష్యానికి 186 సంఘాలకు కేవలం రూ.6.38 కోట్లు మాత్రమే చెల్లించి జిల్లాలో చివరిస్థానంలో నిలిచింది. రికవరీ ఇలా..బ్యాంకు లింకేజీ ద్వారా అందించిన రుణాల్లో దాదాపు రూ.58 కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఈ ఏడాదిలో రూ.42 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.28 కోట్ల రుణాలు రికవరీ చేశారు. రుణాల ఇవ్వడంతోపాటు రికవరీ కోసం క్షేత్రస్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను సభ్యులకు వివరిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి 2024– 25 ఆర్థిక సంవత్సరంలో మహిళ సంఘాల సభ్యులకు రూ.221.73 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు రూ.230.18 కోట్ల రుణాలు సంఘాలకు అందజేశాం. సీ్త్రనిధి ద్వారా రూ.25 కోట్ల రుణ లక్ష్యంలో రూ.24 కోట్లు పంపిణీ చేశాం. లోన్ రికవరీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. – దత్తారావు, డీఆర్డీవోమండలాల వారీగా రుణ పంపిణీ వివరాలుమండలం మహిళా లక్ష్యం అందించిన మొత్తం సంఘాలు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) ఆసిఫాబాద్ 394 23.92 22.46 బెజ్జూర్ 207 12.33 11.91 దహెగాం 208 11.71 11.85 జైనూర్ 337 22.33 18.46 కాగజ్నగర్ 338 23.17 24.68 రెబ్బెన 282 12.15 22.10 సిర్పూర్(యూ) 237 11.69 8.66 సిర్పూర్(టి) 228 13.01 15.20 వాంకిడి 342 18.19 21.74 తిర్యాణి 278 11.96 12.84 పెంచికల్పేట్ 115 5.87 6.14 లింగాపూర్ 186 9.70 6.38 కౌటాల 221 13.54 15.45 కెరమెరి 423 14.44 18.52 చింతలమానెపల్లి 250 17.66 13.72 రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జిల్లా స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.230.18 కోట్లు సీ్త్రనిధి ద్వారా మరో రూ.24 కోట్ల చెల్లింపులు -
‘పది’ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 36 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు లాంగ్వేజ్ పరీక్షకు 6,560 మంది విద్యార్థులకు 6,531 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరయ్యారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు తెలిపారు. 99.5 శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు. జన్కాపూర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సందర్శించారు. విద్యార్థుల హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక సోషల్ వెల్ఫేర్ స్కూల్ను ఎస్సీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. అలాగే జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ డేవిడ్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఆర్డీవో లోకేశ్వర్రావు పర్యవేక్షించారు. వాంకిడి, కెరమెరి, ఈజ్గాంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.ప్రయాణమే ‘పరీక్ష’ దహెగాం: సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. దహెగాం మండలంలోని ఇట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రా రంభమవుతుండగా ఆ సమయంలో కా గజ్నగర్, మంచిర్యాల రూట్లో బస్సు సర్వీసులు లేవు. దీంతో విద్యార్థులు శుక్రవారం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే ట్ ఆటోలో ఇలా వేలాడుతూ కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు బస్సులు నడిపించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.విద్యార్థులకు కౌన్సెలింగ్ సిర్పూర్(టి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఎస్సై కమలాకర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై పదో తరగతి పరీక్షకు వెళ్లిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు వెళ్లేందుకు మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే పిల్లలతోపాటు ఇతరులకు నష్టం జరుగుతుందన్నారు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్లు లేనివారికి జరిమానా విధించారు. తొలిరోజు 99.5 శాతం హాజరు పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ, అధికారులు -
22, 23న ఇందిర ఫెల్లోషిప్ బూట్ క్యాంప్
ఆసిఫాబాద్: లింగాపూర్ మండలం చోర్పల్లిలో ఈ నెల 22, 23 తేదీల్లో ఇందిర ఫెల్లోషిప్ తెలంగాణ రాష్ట్ర బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు శక్తి అభియాన్ ఇందిర ఫెల్లోషిప్ ఆదిలాబాద్ లోక్సభ కోఆర్డినేటర్, పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫెల్లోషిప్ బ్యూట్ క్యాంప్నకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరవుతారని తెలి పారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జ్ఞాపకార్థం రాజకీయాలు, పాలనతో సహా వివిధ రంగాల్లో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్ ఇందిర ఫెల్లోషిప్ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇందిర ఫెల్లోషిప్ సభ్యులు దుర్గం కళావతి, యశోద, ఇందిర, ప్రతిభ, విజయ, రాజేశ్వరి, పద్మ, శంకరమ్మ, రేణుక, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ శ్యాం, నాయకులు సుధాకర్, భీమ్రావు, తిరుపతి, గంగారాం, సురేశ్ పాల్గొన్నారు. -
ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి
ఆసిఫాబాద్అర్బన్: స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు ఆన్లైన్లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి 6, 7, 8 ఫారాల దరఖాస్తులు 5,481 వచ్చాయని తెలిపారు. 4,559 దరఖాస్తులను పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేశామన్నారు. వివరాలు సక్రమంగా లేకపోవడంతో 369 దరఖాస్తులు తిరస్కరించామని పేర్కొన్నారు. మరో 553 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు జాబితాను బూత్స్థాయి ఏజెంట్లకు అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
జాబ్మేళాకు విశేష స్పందన
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫాక్స్కాన్ సంస్థ మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు. పదో తరగ తి, ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన ని రుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని యు వతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో జాబ్మేళా నిర్వహించామని తెలిపా రు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అలీబిన్ అహ్మద్, గంధం శ్రీనివాస్, ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతుల చేతిలో నాలుగు ఎకరాల్లోపే..
ఉమ్మడి జిల్లాలో భూ కమతాల సగటు చూస్తే గతేడాది, తాజా సర్వే ప్రకారం యధావిధిగా ఉన్నాయి. అంటే భూమి చేతులు మారుతున్నప్పటికీ రైతుల వద్ద ఉన్న భూమి అలాగే కొనసాగుతోంది. గత ఆర్థిక సర్వేలోనూ ఉమ్మడి జిల్లాల్లో సగటు కమతం ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టం 3.78ఎకరాలు ఉండగా, కనిష్టంగా మంచిర్యాలలో 2.29ఎకరాలు ఉంది. ఈ జిల్లాలో జనాభా తక్కువ, భూ లభ్యత ఎక్కువ కావడంతో సగటులో ఎక్కువ వస్తోంది. జిల్లాలో సగటు భూ కమతాలు (ఎకరాల్లో)ఆదిలాబాద్ 3.78ఆసిఫాబాద్ 1.39నిర్మల్ 2.47మంచిర్యాల 2.29 -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
● నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు.. ● హాజరు కానున్న 6,421 మంది విద్యార్థులుఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జిల్లాలోని 36 కేంద్రాల్లో 6,421 మంది విదార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 2,894 మంది, బాలికలు 3,527 మంది ఉన్నారు. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలు తొలిసారి సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 డిపార్ట్మెంట్ అధికారులు, 36 మంది సీ సెంటర్ కస్టోడియన్లు, 432 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించారు. పోలీస్ స్టేషన్ దూరంగా ఉన్నట్లు గుర్తించిన మోడీ, మహాగావ్, గంగాపూర్ పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక కస్టోడియన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ సెంటర్ వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బంది, ఒకరు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఐదు నిమిషాల మినహాయింపుకాగజ్నగర్లో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆసిఫాబాద్లో 5, కెరమెరి 3, సిర్పూర్(టి) 3, రెబ్బెన 3, జైనూర్ 2, వాంకిడి 2, కౌటాలలో 2, దహెగాం 2, బెజ్జూర్ 2, తిర్యాణి, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండలాల్లో ఒకటి చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసిఉంచాలని సూచించారు.జిల్లా కేంద్రంలో హాల్టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బందినిర్భయంగా రాయాలి విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు కీలకమైనవి. ఆందోళనకు గురికాకుండా విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి. 30 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. – యాదయ్య, డీఈవో -
విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి
కెరమెరి: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు నిర్భయంగా రాయాలని ఏసీఎంవో (జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి) పుర్క ఉద్దవ్ అన్నారు. మండలంలోని అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు హాల్టిక్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధిస్తే పెద్ద కళాశాలల్లో ఉచితంగా సీటు వచ్చే ఆస్కారం ఉందన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు రాత్రి, పగలు చదవాలని, పక్కా ప్రణాళికతో చదివితే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం అనార్పల్లి, జైరాంగూడ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం రాము, ఎస్సీఆర్పీ నరేశ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
సహాయ ఉపకరణాలు వినియోగించుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: దివ్యాంగ విద్యార్థులు సహాయ ఉపకరణాలను వినియోగించుకోవా లని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, స్టడీ చైర్లు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అలింకో సంస్థ జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శించి 136 మంది దివ్యాంగులను గుర్తించిందన్నారు. వీరికి అవసరమైన సహాయ ఉపకరణాలు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంగవైకల్యం కలిగిన వారు తమ పనులు స్వయంగా చేసుకోవడానికి ఈ ఉపకరణాలు దోహదపడతాయని తెలిపారు. దివ్యాంగులపై చిన్నచూపు చూడకుండా వారిని గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో అలింకో సంస్థ ఫైనాన్షియల్ అధికారి దేవాజీ, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఎంఈవో సుభాష్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ రుసుం వసూలుపై ప్రత్యేక దృష్టి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్అర్బన్: లేఅవుట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్ఆర్ఎస్–2020 పథకంలో దరఖాస్తుదారుల నుంచి రుసుం వసూలుపై దృష్టి సా రించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్రావు, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్కుమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించా రు. రుసుం చెల్లింపు ప్రక్రియలో జాప్యం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. 25 రాయితీని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలోని పలు లేఅవుట్లను పరిశీలించా రు. సమావేశంలో ఎంపీడీవో సత్యనారాయణ, పీటీఎస్ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ‘బేటీ బచావో– బేటీ పడావో’ అమలుకు కార్యాచరణ రూపొందించాలి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2025 –26 ఆర్థిక సంవత్సరంలో బేటీ పడావో– బేటీ బచావో కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రతీ పంచాయతీలో బాలసభలు నిర్వహించాలని, వి ద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో బా లికల విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మానసిక నిపుణులతో భవిష్యత్తుపై కౌన్సెలింగ్, కెరీర్ గైడె న్స్ గురించి వివరించాలని, లైంగిక దాడులు జరుగకుండా ఆత్మ రక్షణ కోసం కరాటే శిక్షణ ఇప్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భా స్కర్, డీఎంహెచ్వో సీతారాం, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్, సీడీపీవో రేణుక, జిల్లా మహిళా సాధికారత సమన్వయ కర్త శారద, సభ్యులు మమత, రాణి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడికి లోనుకావొద్దు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నిర్భయంగా పరీక్షలు రాస్తేనే ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. గతంతో పోలిస్తే పరీక్షల తీరులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని, విద్యార్థులు వీటిని గుర్తించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లపై బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించారు?డీఈవో: వేసవి నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమయ్యాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రతీ కేంద్రం వద్ద వైద్యసిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో సిద్ధంగా ఉంటారు. సాక్షి: జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.. ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?డీఈవో: జిల్లాలోని 172 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 6,421 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 2,908 మంది, బాలికలు 3513 మంది ఉన్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెట్లు 36 మంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 36 మంది, సీ సెంటర్ కస్టోడియన్లు ముగ్గురు, ఇన్విజిలేటర్లు 432 మందిని నియమించాం. అలాగే మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. సాక్షి: గతేడాది ఫలితాల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో 30వ స్థానంలో నిలిచింది.. ఈ ఏడాది మెరుగైన ఫలితాలకు ఎలాంటి చర్యలు చేపట్టారు?డీఈవో: కొన్నేళ్లుగా పదో తరగతి వార్షిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సారి మాత్రం ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాం. డిసెంబర్లోనే సిలబస్ పూర్తి చేయించి.. విద్యార్థులతో రివిజన్ చేయించాం. 45 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేసి రోజూ పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలు విశ్లేషించాం. ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాస్లు నిర్వహించాం. పరీక్షల భయం పోగొట్టేందుకు ప్రేరణ తరగతులు సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లా టాప్ 10లో ఉంటుందని ఆశాభావంతో ఉన్నాం. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు..డీఈవో: విద్యార్థులు తమ కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకోవాలి. సెల్ఫోన్లు, టీవీలకు పూర్తిగా దూరంగా ఉండాలి. సమయాన్ని వృథా చేయొద్దు. సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలకు సహకరించాలి. ‘పది’ విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో యాదయ్యసాక్షి: ఈ విద్యా సంవత్సరంలో పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు ఏంటి?డీఈవో: 2024– 25 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ కొత్త నిర్ణయాలు అమలు చేయనుంది. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు 24 పేజీలతో కూడిన జవాబు పత్రం(అన్సర్షీట్) ఇస్తారు. గతంలో నాలుగు పేజీలతో కూడిన బుక్లెట్ ఇచ్చేవారు. నాలుగు పేజీలు రాసిన తర్వాత విద్యార్థులు అవసరానికి అనుగుణంగా రెండు పేజీలతో కూడిన జవాబు పత్రాలు ఇచ్చేవారు. పిల్ల ల సమయం వృథా కాకుండా ఈసారి 24 పేజీలతో బుక్లెట్ అందజేస్తున్నాం.సాక్షి: పరీక్షల సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి?డీఈవో: పరీక్ష సమయం కంటే 30 నిమి షాలు ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా, విద్యార్థులను ఉ దయం 8:30 నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయంలో ఐదు నిమి షాలు సడలింపు ఇచ్చారు. ఉదయం 9:35గంటల తర్వాత అనుమతి ఉండదు. -
● ‘ప్రాణహిత– చేవెళ్ల’కు రూ.32.2 కోట్లు మాత్రమే.. ● మిగతా ప్రాజెక్టులకు అరకొర నిధులు ● విద్యారంగం కేటాయింపులపై విద్యార్థి సంఘాల అసంతృప్తి ● సంక్షేమ పథకాల కొనసాగింపుపైనే ప్రభుత్వం దృష్టి ● ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా పోడు రైతులకు లబ్ధి
ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2025– 26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. గతేడాది మాదిరి ఈసారి కూడా అరకొర నిధులే కేటాయించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణంపై మాత్రం దృష్టి సారించలేదు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఆశించిన కేటాయింపులు జరగలేదు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు జరగనుంది. గిరిజన జనాభా అధికంగా ఉండటంతో పోడు రైతులకు పంపు సెట్లు అందించేందుకు ప్రవేశపెట్టిన ఇందిరా గిరి జల వికాసం పథకం ప్రయోజనకరంగా మారనుంది. కేటాయింపులు ఇలా.. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎకరాకు రూ.12 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు రుణమాఫీ కింద జిల్లాలో 51,523 మంది రైతులకు రూ.465.84 కోట్లు అందించారు. అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించినా స్పష్టమైన బడ్జెట్ కేటాయింపులు లేవు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ప్రతిరోజూ సుమారు 26 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నట్లు అంచనా.. ఉచిత వంటగ్యాస్ పథకం కింద జిల్లాలో 73 వేల మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 69,636 మందికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.2,146 కోట్లు చెల్లిస్తోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, తాజా బడ్జెట్లో 7.57 శాతం నిధులు కేటాయించడంపై విద్యార్థి సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు రూ.63.29 కోట్లు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.63.29 కోట్లు కేటాయించారు. కుమురంభీం ప్రాజెక్టుకు రూ.24.44 కోట్లు(కేంద్ర, రాష్ట్ర పథకాలు కలిపి), వట్టివాగు ప్రాజెక్టు రూ.4.75, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు రూ.10.70 కోట్లు, ఎర్రవాగు ప్రాజెక్టు(పీపీరావు)కు రూ.1.2 కోట్లు కేటాయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన హామీల్లో ఒక్కటైన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో కేవలం రూ.32.2 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర నిధులతో పనులు ముందుకు సాగ డం అనుమానమే.. ఆశించిన నిధులు కేటాయించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవ‘సాయం’ కొనసాగింపు వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24,439 కోట్లు కేటాయించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో 1.10 లక్షల మంది రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందనున్నారు. రైతుబీమా పథకం కింద గతేడాది జిల్లాలో 215 మంది రైతుల కుటుంబాలకు రూ.10.75 కోట్లు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేలా రైతులకు పోత్సాహం అందించనున్నారు. రైతులకు టన్నుకు రూ.2 వేలు అదనంగా చెల్లించనున్నారు. పౌరసరఫరాల శాఖకు రాష్ట్ర బడ్జెట్లో రూ.5,734 కోట్లు కేటాయించగా, చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగనుంది. ఇందులో జిల్లాలో 1,39,782 మంది లబ్ధిదారులు ఉన్నారు.వట్టివాగు ప్రాజెక్టు (ఫైల్) -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
● కలెక్టరేట్లోకి వెళ్లకుండా అధికారులు, సిబ్బందిని అడ్డుకున్న ఆశవర్కర్లుఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూని యన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశవర్కర్లు చేపట్టిన ధర్నా, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం 9 గంటలకే ఆశవర్కర్లు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్రధాన దారికి రెండు వైపులా బైఠాయించారు. అధికారులు, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, ఆశవర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఏఎస్పీ చిత్తరంజన్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి సిబ్బందిని లోపలికి పంపించారు. అదనపు కలెక్టర్ కలెక్టరేట్కు కార్యాలయానికి వస్తుండగా ఆశలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు. ఎండలోనూ మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. సీఐటీయూ నాయకులు రాజేందర్, శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే మరో 106 రోజుల పోరాటం తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిపి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆశలకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రమాదబీమా కింద రూ.50 లక్షలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కమిటీ సభ్యులు కృష్ణమాచారి, నాయకులు నగేశ్, స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర సహాయం అందించాలి
ఆసిఫాబాద్అర్బన్: సఖి కేంద్రానికి వచ్చే బాధితుల కు సత్వర సహాయం అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురా లు ఈశ్వరీబాయి అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశా రు. రిజిస్టర్లు పరిశీలించి, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మా ట్లాడుతూ సఖి కేంద్రం ద్వారా అందుతున్న సేవల పై ప్రతీ మండలంలో అవగాహన కల్పించాలన్నా రు. బాధిత మహిళల రక్షణ, వారి సమస్యల పరి ష్కారం కోసం నిత్యం అందుబాటులో ఉండాలన్నా రు. అనంతరం సిబ్బందిని ఈశ్వరీబాయిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, సిబ్బంది మమత, సుమలత, రమేశ్, సత్యశీల తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ● వంతెనలు లేక రాకపోకలకు అవస్థలు ● ఏళ్లు గడుస్తున్నా మెరుగుపడని వైద్యం ● నిధుల కేటాయింపుపైనే ప్రజల ఆశలు ● నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి
పేరుకే ఆస్పత్రి అప్గ్రేడ్జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయడంతో స్థానిక 50 పడకల ఆస్పత్రిని 330 పడకలకు అప్గ్రేడ్ చేశారు. అయినా వసతులు మెరుగుపడటం పడకపోవడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్కే వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా గైనకాలజిస్టు లేకపోవడం సిజేరియన్ కాన్పులు జరగడం లేదు. ఈ నెల 9న ఆసిఫాబాద్ మండలానికి చెందిన ఓ గర్భిణిని మంచిర్యాలకు రెఫర్ చేయగా.. 108 వాహనంలో తరలిస్తుండగానే మార్గమధ్యలో కవలలకు జన్మనిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి కేవలం రెఫరల్ కేంద్రంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ని యామకం జరగలేదు. కాంట్రాక్టు వైద్యులతో కాలం వెల్లదీస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథ కం బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి.కంకర తేలిన ఆసిఫాబాద్ మండలం యాపల్పట్టి గ్రామానికి వెళ్లే రహదారిప్రజలకు అభివృద్ధి ఫలాలు కాస్త చేరువైనా.. అనుకున్న రీతిలో మౌలిక వసతులు మెరుగుపడలేదు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో యాసంగికి నీళ్లందక పంట పొలాలు బీళ్లుగా మిగులుతున్నాయి. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ వంటి కాలేజీలు లేక స్థానిక విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. ఇటీవల ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల మంజూరైనా.. సిర్పూర్ నియోజకవర్గానికి కేటాయించలేదు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జిల్లా ప్రజలు కాంగ్రెస్ సర్కారు బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలకే ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యంగా రహదారులు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన నిధులు కేటాయించకపోవడంపై జిల్లా ప్రజలు, రైతులు అసంతృప్తితో ఉన్నారు. రాకపోకలకు తంటాలుగతేడాది జిల్లాలోని 76 చోట్ల ప్రధాన వంతెనల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి ఒక్కపైసా మంజూరు కాలేదు. రహదారుల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లపై గుంతలు పడ్డాయి. వర్షాకాలంలో మరీ అధ్వానంగా మారి రాకపోకలకు ప్రజలు తంటాలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 400కు పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి బ్రిడ్జి నిర్మాణం ముందుకు సాగడం లేదు. 15 ఏళ్లుగా పిల్లర్ల దశలోనే మగ్గుతోంది. రూ.2.5 కోట్లతో ప్రారంభమైన అంచనా వ్యయం ప్రస్తుతం రూ.14.40 కోట్లకు పెరిగింది. అలాగే లక్మాపూర్ బ్రిడ్జి అసంపూర్తిగా ఉంది. జిల్లా కేంద్రం నుంచి ఉట్నూర్ ఆర్అండ్బీ రహదారి గుంతలమయంగా మారింది. రీ బీటీ చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు కేటాయించడం లేదు. కుమురంభీం ప్రాజెక్టునిధులు కేటాయిస్తేనే.. సాగునీరుజిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటా యింపు లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. జగన్నాథ్పూర్, కుమురంభీం(అడ) ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ పూర్తి కావడానికి సుమారు రూ.250 కోట్లు అవసరమవుతాయని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు కుమురంభీం ప్రాజెక్టుకు రూ.7.95 కోట్లు, జగన్నాథపూర్ ప్రాజెక్టుకు రూ.12.32 కోట్లు, వట్టివాగు ప్రాజెక్టుకు రూ. 2.59 కోట్లు, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుకు రూ. 15.60 లక్షలు, పీపీరావు సాగర్కు రూ.2.34 కో ట్లు కేటాయించింది. ఇందులో చాలా వరకు నిధులు ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అడ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 53 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. కాల్వలు అసంపూర్తిగా ఉండటంతో కనీసం 10వేల ఎకరాలకు కూడా సాగునీరందడం లే దు. ప్రాజెక్టు కట్ట బీటలు తేలి మూడేళ్లవుతు న్నా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఇటీవల హైదరాబాద్ నుంచి ఇరిగేషన్ ఈఎన్సీ ప్రాజెక్టు సందర్శించి కాంక్రీ ట్ పోర్షన్ కట్టాలని సూచించారు. మరమ్మతులకు సుమారు రూ.30 కోట్లు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ఆరేళ్లక్రితం రూ.27.76 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా నిధులు కేటాయించలేదు. కుమురంభీం ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ.20 లక్షలు, వట్టివాగు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు మాత్రమే మంజూరు చేస్తున్నారు. 20 ఏళ్లక్రితం ప్రారంభించిన జగన్నాథ్పూర్ ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసినగొంగళి అక్కడే ఉంది. ప్రాజెక్టులో ముంపునకు గురైన రైతులకు నేటికీ నష్టపరిహారం అందలేదు. నిధులు కేటాయించక పోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలోనే నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల్లో ఇది ఒక్కటి. -
కలెక్టర్ను కలిసిన డీఎం
ముగిసిన 48 గంటల ధర్నాఆసిఫాబాద్: గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 48 గంటల ధర్నా కార్యక్రమం మంగళవారం ముగిసింది. సీఐటీయూ జిల్లా నా యకులు మాట్ల రాజు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు ప్రతినెలా వేతనాలు 1వ తేదీనే చెల్లించాలని, గ్రాట్యుటీ వర్తింపజేసి ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన రూ.18 వేల వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడీ టీచర్లు 10 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతి ని ధులు త్రివేణి, గంగామణి, అరుణ, స్వరూ ప, రాజేశ్వరి, కమల, అంజలి, మల్లేశ్వరి, అంగన్వాడీ టీచర్లు, హె ల్పర్లు పాల్గొన్నారు. ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేవీ రాజశేఖర్ మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా రవాణాశాఖ అధికారి రాంచందర్ను కలిశారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
● అసెంబ్లీలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్అర్బన్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభలో జీరో అవర్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు. ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని, జాప్యంతో అంచనాలు పెరిగాయని తెలిపారు. రానున్న వర్షాకాలం ప్రారంభం నాటికి బ్రిడ్జి పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెరమెరి మండలం లక్మాపూర్ వంతెన పూర్తి చేయడంతో పాటు, ఆదిలాబాద్కు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని అన్నారు. -
భగీరథ పైపులైన్ పునరుద్ధరణ
● నెల రోజుల తర్వాత 64 గ్రామాలకు తాగునీరుదహెగాం(సిర్పూర్): కాగజ్నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగు వంతెన వద్ద అధికారులు ఎట్టకేలకు మిషన్ భగీరథ పైపులైన్ పునరుద్ధరించారు. దాదాపు నెల రో జుల తర్వాత 64 గ్రామాలకు తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. అందవెల్లి పెద్దవాగు వంతె న అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు నెల రోజుల క్రి తం ప్రారంభించారు. ఈ క్రమంలో వంతెన పైనుంచి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్లైన్ తొలగించారు. దహెగాం, కాగజ్నగర్, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని 64 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 14న ‘సాక్షి’లో ‘నెల రోజులుగా భగీరథ బంద్, మళ్లీ ఈ నెల 16న ‘మిషన్ భగీరథ నీళ్లు వచ్చేదెప్పుడు..?’ అంటూ వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. మంగళవారం పైపులైన్కు మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. రాత్రి వరకు భగీరథ తాగునీటి సరఫరాను పునరుద్ధరించామని ఏఈ సాయికృష్ణ తెలిపారు. ఎఫెక్ట్ -
అర్హత పోటీలకు బయల్దేరిన జిల్లా విద్యార్థులు
ఆసిఫాబాద్రూరల్: హైదరాబాద్లోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీ స్కూల్ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 18 మంది బాలబాలికలను ఎంపిక చేసినట్లు డీటీడీవో రమాదేవి, డీఎస్వో మీనారెడ్డి తెలిపారు. విద్యార్థులు మంగళవారం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు. మార్చి 19న హైదరాబాద్లోని బోయిన్పల్లి వాటర్ స్పోర్ట్ అకాడమీ స్కూల్లో అర్హత క్రీడాపోటీలు ఉంటాయని డీటీడీవో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పోటీలకు జిల్లా నుంచి 11 మంది బాలురు, ఏడుగురు బాలికలను పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్లు విద్యాసాగర్, అరవింద్, హెచ్ఎం జంగు, వార్డెన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణలో అలసత్వం వద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొక్కల సంరక్షణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బూర్గుడ గ్రామ పంచాయతీలోని నర్సరీని మంగళవారం పరిశీలించారు. పంచాయతీ నిర్వహణ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో మొక్కల పెంపకంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ నీటిని అందించాలన్నారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఏపీవోను ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిందని తెలిపారు. పంచాయతీలో 78 మంది దరఖాస్తుదారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించారని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్పీవో ఉమర్, ఎంపీవో మౌనిక, ఏపీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, కారోబార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రంగనాయక ఆలయానికి నిధులు కేటాయించాలి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకౌటాల/బెజ్జూర్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ ధార్మిక, ధర్మాదాయ బిల్లుపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని అతిపురాతన రంగనాయక ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శేష పాన్పుపై నిద్రిస్తున్న శ్రీరంగనాయక స్వామి విగ్రహం మహా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఈజ్గాం శివమల్లన్న ఆలయ కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. బాసర ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే ఆరోగ్య శ్రీ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కాళేశ్వరం జోన్లో కొత్త సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని ఆయన కోరారు. -
ఉయ్యాల తాడే.. ఆమెకు ఉరితాడు
కాకినాడ క్రైం: అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన బిడ్డను నిద్రపుచ్చేందుకు కట్టిన ఉయ్యాల తాడుతోనే.. ఆ తల్లి ఉరి వేసుకుని శాశ్వత నిద్రలోకి జారుకుంది. మద్యానికి బానిసైన భర్త వైఖరి.. అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోననే ఆందోళన.. జీవితాన్ని ఎదురొడ్డలేనేమోనన్న నిస్సహాయత వెరసి.. ఎన్నో కలలుగన్న ఆ వివాహిత తన నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించి తనువు చాలించింది. ఎన్నో కలలు చూపించి, ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తకు మద్యం ముందు భార్యాబిడ్డలు ఆనకపోవడంతో.. తమ మరణంతోనైనా భర్తకు కనువిప్పు కలుగుతుందనుకుంటూ తనకు తాను మరణ దండన విధించుకుంది. తన ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను శాశ్వతంగా దూరం చేసి, జీవితాంతం గుండెకోతను మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కొట్టేడు స్వాతి(26)కి 2017లో కాకినాడకు చెందిన తలాటం సురేష్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. కార్ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్ పెళ్లయిన తొలి నాళ్లలో భార్యతో బాగానే ఉండేవాడు. మద్యం అలవాటు శ్రుతి మించడంతో కొంతకాలం తర్వాత భార్యను పట్టించుకోవడం మానేశాడు. వీరికి నాలుగేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. నిత్యం మద్యం మత్తులో జోగుతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అతడి వైఖరితో స్వాతి తీవ్ర అసహనంతో ఉండేది. ఎంత నచ్చజెప్పినా సురేష్లో మార్పు రాలేదు. స్నేహితులతో కలిసి తాగుబోతులా మారాడని తల్లిదండ్రుల వద్ద స్వాతి బాధపడుతుండేది. ఈ క్రమంలో దంపతుల మధ్య వాదులాటలు జరిగేవి. ఆదివారం అర్థరాత్రి మద్యం తాగొచ్చిన సురేష్.. భార్యాపిల్లలు పడుకున్న గదిలో నిద్రపోయాడు. భర్త రాకను స్వాతి గమనించి, ఇంతేనా జీవితం అంటూ ప్రశ్నించింది. దీంతో సురేష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇలాగే ఉంటే తమ పిల్లల సంగతేంటని ప్రశ్నించడంతో, సురేష్ తిరగబడ్డాడు. దీంతో విసుగెత్తిన స్వాతి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. పిల్లల కోసం కట్టిన ఉయ్యాల తాడునే ఉరితాడుగా మార్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరుడు నగేష్ ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిర్యాదుదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణిలో భాగంగా వచ్చి న ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీ కరించారు. సంబంధి త ఎస్సై, సీఐలతో ఫోన్లో మాట్లాడి సమస్య పరి ష్కారానికి పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీ సు సేవలను వినియోగించుకోవాలని సూచించా రు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పని చేస్తోందన్నారు. బాధితులకు అండగా భరోసా సెంటర్ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని బాధిత మహిళలకు, చిన్నారులకు భరోసా సెంటర్ అండగా నిలుస్తోందని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావ్ అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వచ్చిన విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ని బాధిత మహిళలు ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భరోసా సెంటర్ ద్వారా పోలీసు, వైద్య, న్యాయ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే 8712670561 లేదా డయల్ 100 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో భరోసా సెంటర్ ఇన్చార్జి ఎస్సై తిరుమల, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్హెచ్సీ జిల్లా కమిటీ ఎన్నిక
కెరమెరి: మానవ హక్కుల జిల్లా కమిటీని సోమవారం మండల కేంద్రంలో ఎన్నుకున్న ట్లు ఎన్ఆర్హెచ్సీ చైర్మన్ రాథోడ్ రమేశ్ తెలి పారు. జిల్లా వైస్ చైర్మన్లుగా రాథోడ్ గోపాల్, పెందోర్ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్గా జాదవ్ ఆకాశ్, జనరల్ సెక్రెటరీగా అలుగొట్టు నవీన్కుమార్, కెరమెరి మండల వైస్ చైర్మన్గా రాథోడ్ అర్జున్ ఎన్నికయ్యారు. ఈ మేరకు వారికి నియామకపత్రాలు అందజేశారు. ఆర్టీసీ డీఎంగా రాజశేఖర్ బాధ్యతల స్వీకరణ ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్గా కేవీ రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని కూకట్పల్లి డిపోలో మెకానికల్ ఫోర్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రమోషన్పై డీఎంగా బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ డీఎంగా పని చేసిన విశ్వనాథ్ బోధన్ డిపోకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది నూతన డీఎంను సన్మానించారు. -
‘జగదీశ్రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి’
ఆసిఫాభాద్అర్బన్: స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మె ల్యే జగదీశ్రెడ్డి సభ్యత్వం రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ డిమాండ్ చేశారు. సో మవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతు ప్రజాప్రతినిధులు ప్రజలకు రోల్ మోడల్గా నిలవాలని, ఇలా సభాపతి పై అ నుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నా రు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై అనవసరమైన ఆరోపణ లు చేస్తే సహించేది లేదన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. సమావేశంలో నా యకులు తిరుపతి, రమేశ్, పరశురాం, ముర ళి, బాలేష్, అన్నారావ్, రవినాయక్, రవీందర్, నిజాం, జక్కన్న, సత్తన్న, శంకర్నాయక్, దుర్గం సోమయ్య, మధు పాల్గొన్నారు. -
కొత్త అధ్యాపకులొచ్చారు..
● జిల్లాలో 47 మంది నియామకం ● అతిథి అధ్యాపకులు ఇంటికి ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని 11 ప్రభుత్వ జూని యర్ కళాశాలలకు 47 మంది జూనియర్ లెక్చర ర్లు వచ్చారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో బోధన కష్టాలు తీరనున్నాయి. నూతన అధ్యాపకుల భర్తీతో ఇంటర్ విద్య మరింత బలోపేతం కానుంది. కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల ఖాళీల కొరతతో అతిథి ఒప్పంద అధ్యాపకులతో విద్యను అందించారు. ఎట్టకేలకు 13 సంవత్సరాల తర్వాత జిల్లాకు వచ్చిన 47 మంది కొత్త అధ్యాపకులు ఈనెల 13న విధుల్లో చేరారు. కళాశాలల వారీగా కేటాయింపు ఇలా...జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 47 మంది జూనియర్ లెక్చరర్లు వి ధుల్లో చేరారు. బెజ్జూర్కు ఇంగ్లిష్, ఆర్థిక శాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయ న శాస్త్రం అధ్యాపకులను కేటాయించారు. దహెగాంకు ఇంగ్లిష్, హిందీ, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జైనూర్కు ఆర్థిక శాస్త్రం, జంతుశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, కెరమెరికి గణితం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, కౌటాలకు ఆర్థికశాస్త్రం, గణితం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, రెబ్బెనకు హింది, వృక్ష శాస్త్రం, రసాయన శాస్త్రం, సిర్పూర్ (టీ)కి ఇంగ్లిష్, పౌరశాస్త్రం, జంతుశాస్త్రం, కాగజ్నగర్కు ఇంగ్లిష్, ఉర్దూ, ఆర్థికశాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, తిర్యాణికి కామర్స్, వృక్షశాస్త్రం, వాంకిడికి ఆర్థిక శాస్త్రం, హిందీ, గణితం, వృక్షశాస్త్రం, ఆసిఫాబాద్ కళాశాలకు ఉర్దూ, అర్ధశాస్త్రం, చరిత్ర, పౌర శాస్త్రం, హిందీ, ఆర్థికశాస్త్రం అధ్యాపకులను కేటాయించారు. అతిథి అధ్యాపకుల పరిస్థితి ఏమిటి?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 186 మంది అతిథి అధ్యాపకులు పది సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జూనియర్ కళాశాలల్లో అధ్యాపకు ల పోస్టులను భర్తీ చేయడంతో అతిఽథి అధ్యాపకుల కొలువులకు ఎసరొచ్చింది. 2014 నుంచి అతిథి అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొత్త లెక్చరర్ల ని యామకంతో వారికి ఇబ్బందికరంగా మారింది. తమ సర్వీస్ ప్రాతిపదిక చేసుకుని ప్రభుత్వ కళాశాలల్లో అలాగే కొనసాగించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఎంటీఎస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు పలు సందర్భాల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేస్తున్నా రు. నూతన నియామకంతో అతిఽథి అధ్యాపకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయంపైనే అతిథి అధ్యాపకుల కుటుంబాల పరిస్థితి ఆధారపడి ఉంది. ఇంటర్ విద్య మరింత బలోపేతం.. అధ్యాపక పోస్టుల భర్తీతో జిల్లాకు 47 మంది కొత్త లెక్చరర్లు వచ్చారు. దీంతో జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత నా ణ్యమైన విద్య అందనుంది. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులతో కూడిన విద్య అందిస్తాం. – కళ్యాణి, డీఐఈవో -
ఒత్తిడిని జయించి ఉత్తమ ఫలితాలు సాధించాలి
వాంకిడి/కెరమెరి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏఎస్పీ చిత్తరంజన్ సూచించారు. సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కెరమెరి మండలంలోని మోడి, హటి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా 768 మందికి పరీక్ష ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు, 2500 మందికి పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల, సమయ పాల న విజయానికి ముఖ్య సూత్రాలన్నారు. అ లాంటి పట్టుదలతోనే తాను ఈస్థాయికి చేరుకోగలిగానని, మీరంతా కూడా ఉన్నత శిఖరా లకు చేరుకునేలా కష్టపడాలని సూచించారు. పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, ఎంఈవో శివచరణ్ కుమార్, హెచ్ఎం నటరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
● కలెక్టర్ వెంకటేష్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య తాను పుట్టుకతో దివ్యాంగుడినని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఎర్ర లక్మీకాంత్ తనకు గిరి వికాసం పథకంలో మంజూరైన బోరుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించాడు. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్కు చెందిన గైని మొగిలి తాను చేస్తున్న పోడు భూమిని సర్వే నిర్వహించి పట్టా మంజూరు చేయాలని వేడుకున్నాడు. బెజ్జూర్ మండలం కుకుడ గ్రామానికి చెందిన యెరుగు రమేశ్ తమ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల భవన మరమ్మతులు చేపట్టాలని కోరాడు. కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఓంకార్ అభిలాష్ తన తండ్రి పేరిట దహెగాం మండలం కమ్మర్పల్లి శివారులో ఉన్న లావుని పట్టా భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. హన్మకొండ జిల్లాకు చెందిన మీర్సలీం అలీ తనకు కౌటాల మండలం మొగడ్దగడ్ గ్రామ శివారులో ఉన్న పట్టా భూములకు పట్టాదారు పాస్తు పుస్తకాలు జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన శాంతాబాయి తనకు గల పట్టాభూమి ధరణి పోర్టల్లో మిస్సింగ్ అయినందున తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధార్కార్డు ఇప్పించండి నేను కొన్ని సంవత్సరాలు గా రెబ్బెన మండలంలో ని వాసం ఉంటున్నా. నాకు మాత్రం ఆధార్కార్డు ఇచ్చా రు. ప్రస్తుతం నాకు ఐదుగు రు పిల్లలు ఉన్నారు. వారికి ఎక్కడికి వెళ్లినా ఆధార్కార్డు ఇవ్వడం లేదు. దీంతో పాఠశాలలకు వెళ్లలేక ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. ఇప్పటికై నా చిన్నారుల విద్యాభ్యాసం దృష్టిలో ఉంచుచుని ఆధార్కార్డు మంజూరు చేయాలి. – బికె.సింగ్, రెబ్బెన -
● నిధులు లేక నీరసిస్తున్న గ్రామాలు.. ● ‘ప్రత్యేక’ పాలనలో సమస్యల తిష్ట ● చిన్న పనులకు సొంత డబ్బులు పెడుతున్న కార్యదర్శులు ● బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న వైనం..
వాంకిడి మండలం సోనాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మచ్చగూడ (మహగవ్)కు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదు. దీంతో గ్రామస్తులు బావి నీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలంటే లక్ష వరకు ఖర్చవుతుంది. నిధులు లేక చేయడం లేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని స్థితిలో గ్రామస్తులు ఉన్నారు. సిర్పూర్ మండల కేంద్రంలోని అంగడిబజర్ ఏరియాలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో డ్రెయినేజీ చెత్తాచెదారంతో కంపు కొడుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో జీపీ ట్రాక్టర్కు డీజిల్ పోయలేని పరిస్థితిలో అధికారులు ఉండడంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోతోంది. బెజ్జూర్: జిల్లాలోని గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రత్యేక అధికారు ల పాలనలో సమస్యలు తిష్ట వేశాయి. పనుల నిర్వహణకు కార్యదర్శులు లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా నిధుల కొరత కారణంగా గ్రామాల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఇంతకాలం అప్పులు తెచ్చి పనులు చేపట్టాం.. ఇప్పటి నుంచి మావల్ల కాదని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గ్రామాల్లో వీధిదీపాలు వెలగకపోయినా, ట్రాక్టర్లలో డీజిల్ లేకపోయినా, మోటారు మరమ్మతులకు వచ్చినా, పైపులైను లీకేజీలు, వాటర్ పైప్లైన్ లీకేజీ నిర్మాణాలు కార్యదర్శులు చేపట్టాల్సి ఉంటోంది. లేదంటే వాటి ఫలితం ప్రజలు అనుభవించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకాలం కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేసినవి తిరిగి రాకపోగా, నగదు చెల్లించకుండా సామగ్రిని షాపు నిర్వాహకులు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో పనులన్నీ నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. నిధుల కొరత..ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. పంచాయతీల్లో పాలకవర్గాలు లేనందున నిధులు విడుదల చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం నిధులు సక్రమంగా విడుదలై ఉండేవి. కానీ ఆవేం లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఒక్కో అధికారికి మూడు పంచాయతీల బాధ్యతలను అప్పగించడంతో వారు చుట్టపుచూపుగా గ్రామాలకు వచ్చి వెళ్తున్నారు. దీంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అప్పుల పాలవుతున్న కార్యదర్శులు జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1,102 గ్రామాలు ఉన్నాయి 320 మంది కార్యదర్శులు ఉన్నారు. 130 మంది గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఉన్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో డ్రెయినేజీల నిర్మాణం, మంచినీటి పైపులైన్లు, రోడ్లతో పాటు కొన్ని గ్రామాల్లో వీధిలైట్ల మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతోంది. పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండగా, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెల్లో సమస్యలు పేరుకు పోతుడడంతో చేసేదేమీ లేక అప్పులు చేసి పైపులైన్ల లీకేజీలు, బోర్ల మరమ్మతు చేయిస్తున్నారు. సమస్యలపై పంచాయతీరాజ్ జిల్లా అధికారి భిక్షపతి గౌడ్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.పడకేసిన ప్రత్యేక ప్రాలన..దెబ్బతిన్న రోడ్లు, మంచినీటి పైపులైన్లు, వీధిలైట్ల మరమ్మతులు, నూతన అభివృద్ధి పనులను చేపట్టకపోవడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్పంచు ల పదవీకాలం ముగిసి 13 నెలలు గడిచినా ఇంతవరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా స్థానికంగా పంచాయతీ కార్యదర్శులపైనే భారం పడుతోంది. అభివృద్ధి పనులు పడకేశాయి. మరమ్మత్తులు అటకెక్కాయి. ఎప్పుడు చూసినా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలే దర్శనమిస్తున్నాయి. -
హామీలు అమలు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి త్రివేణి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని భావిస్తోందన్నారు. ఇందులో భాగంగానే నూతన జాతీయ విధానం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇది అమలైతే ఐసీడీఎస్లో అనేక మార్పులు జరుగుతాయన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణమాచారి, అంగన్వాడీ యూనియన్ నాయకులు వనిత, రాజేశ్వరి, అంజలి, మల్లేశ్వరి, షీలా, జయప్రద, జ్యోతి, జయ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణహిత ప్రాణం తీయొద్దు
కౌటాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణం తీయొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం చుట్టూ నదులున్నా ప్రయోజనం లేదన్నారు. రైతుల కోసం 16 ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి తరలించి నవ్వుల పాలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సిర్పూర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించలేకపోతోందన్నారు. ఈ వేసవిలో ప్రాణహిత ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్టును నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 60 శాతం నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, మండలాధ్యక్షుడు కుంచాల విజయ్, నాయకులు రవి, చందు, అశోక్, సత్తయ్య, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. -
● అయోమయంలో అన్నదాతలు ● నాలుగో విడతలోనూ పేరు రాకపోవడంతో ఆవేదన ● వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణ ● ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు
ఈ రైతు పేరు చెన్నుపాటి ప్రభాకర్రావు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఇతను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2023 జూన్లో రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాడు. 2024 ఆగస్టులో రుణాన్ని రెన్యూవల్ చేసుకోగా అతని పేరుపై రూ.1.94 లక్షల రుణం మాత్రమే ఉంది. రుణమాఫీకి అన్నీ రకాలుగా అర్హుడిగానే ఉన్నా రుణమాఫీ కాలేదని వాపోతున్నాడు. మరో జాబితాను ప్రకటించి రుణమాఫీ చేయాలని కోరుతున్నాడు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా అర్హులైనా రుణమాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారు. రుణమాఫీ కాక బయట వడ్డీలకు అప్పులు తీసుకుని బ్యాంకుల్లో రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాంకిడి(ఆసిఫాబాద్): నాలుగు విడతలుగా రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మళ్లీ ఐదో విడత మాఫీ ప్రక్రియ చేపడుతుందా? లేదా? అనే విషయంపై మాఫీ కానీ రైతుల్లో సందిగ్ధం నెలకొంది. జిల్లాలోని సుమారు 25 నుంచి 30 శాతం రైతుల పంట రుణాలు మాఫీ కాలేదని సమాచారం. అయి తే ప్రభుత్వం నుంచి ఐదో విడతపై ఎలాంటి స్పష్ట త లేకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. రూ.2లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని రైతులు అప్పులు చేసి మరీ బ్యాంకులకు చెల్లించారు. కానీ నాలుగో విడత ముగిసి మూడు నె లలు కావస్తున్నా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ‘మాకెప్పుడు రు ణమాఫీ’ అంటూ వ్యవసాయ కార్యాలయాలు, పీఏ సీఎస్లు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు. అప్పులు చేసి చెల్లించారు..రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల లోపు పంట రుణాలు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయడం జరుగుతుందని, ఆ పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని చెప్పడంతో రూ.2లక్షల పైన రుణాలు ఉన్న రైతులు అప్పులు చేసీ మరీ పైన ఉన్న మొత్తాన్ని చెల్లించారు. కానీ చాలా మంది రైతులకు మాఫీ కాలేదు. మొదటి విడతలో రూ.లక్షలోపు. రెండో విడతలో రూ.లక్షన్నర లోపు, మూడో విడతలో రూ.రెండు లక్షల లోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేశారు. వివిధ కారణాలతో మాఫీ కానీ రైతుల నుంచి రైతు వేదికల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాత లాక్ పడి ఉండటం, ఆధార్ కార్డులో పట్టా పాస్పుస్తకంలో పేర్లు వేరుగా, తప్పుగా ఉండటం, ఫోన్ నంబర్లు సరిపోలకపోవడం వంటి కారణాలతో రుణమాఫీకి నోచుకోని రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం నాలుగో విడతలోనూ మాఫీ ప్రక్రియ చేపట్టింది. కానీ అందులో కూడా చాలా మంది అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఎక్కువగా రేషన్ కార్డు లేకుండా రూ.2 లక్షల లోపు రుణం కలిగి ఉన్న వారికి మాత్రమే మాఫీ జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 శాతం రైతులకు మాఫీ వర్తించ లేదని తెలుస్తోంది. నాలుగో విడతలో అత్యధికంగా రేషన్ కార్డు లేని వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమాఫీ చేశారు. అనేక కారణాలతో చివరి విడత తరువాత దరఖాస్తు చేసుకున్న చాలా వంది రైతులు చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకులో వడ్డీ పెరిగిపోతుందని ఆందోళనకు గురవుతున్నారు. విడతల వారీగా మంజూరు..రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చి న హామీ మేరకు నాలుగు విడతల్లో 51,583 మంది రైతులకు రూ.465,36,95,472 రుణాలు మాఫీ చేసింది. మొదటి విడతలో 21,776 మంది రైతుల కు గానూ రూ.123.77 కోట్లు, రెండవ విడతలో 14,410 మంది రైతులకు గానూ రూ.150.80 కోట్లు, మూడో విడతలో 11,733 రైతులకు గానూ రూ.154.08 కోట్లు, నాలుగో విడతలో 3,664 మంది రైతులకు గానూ రూ. 36.70 కోట్లు మాఫీ చేసింది. మూడో విడతలో పేర్లు రాణి రైతులకు నాలుగో విడతలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ ఇంకా చాలామంది రైతులు మరో జాబితాపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నాం.. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు. నా కుటుంబంలోని నలుగురి పేరున బ్యాంకులో రూ.2.40 లక్షల పంట రుణం తీసుకున్నా. కనీసం నాలుగో విడతలోనైనా మాఫీ అవుతుందనుకున్నా. కానీ కాలేదు. రైతు వేదికలో దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఫలితం లేదు. కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – కాటేల కళ, దహెగాంఎలాంటి సూచనలు రాలేదు మొదటి విడతలో రూ.లక్ష లోపు, రెండో విడతలో రూ.1.50 లక్షల లోపు, మూడో విడతలో రూ.2లక్షలలోపు రైతుల రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. వివిధ కారణాలతో మూడో విడతలోనూ మాఫీ కాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి నాలుగో విడతలో రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేశాం. మరో జాబితాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
మార్చిలోనే.. మంటలు
కౌటాల: జిల్లాలో సూరీడు సుర్రుమంటున్నాడు. నాలుగు రోజులుగా నిప్పులు కక్కుతున్నాడు. అధికారిక రికార్డుల ప్రకారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వడగాలులతో సామాన్య ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో ఉదయం 9 గంటల నుంచే జనం చెమటతో తడిసిపోతున్నారు. అధిక వేడికి తోడు వడగాలులు వీస్తుండడంతో జనం ఇళ్లలోనే ఉడికిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం గమనించాల్సిన అంశం. పెరిగిన ఉష్ణోగ్రతలతో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘సన్’ డే..జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉదయం 10 దాటితే ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడుగంటల వరకు తగ్గడం లేదు. గంట గంటకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉపాధి హామి పనులు కూడా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వేసవి వేడిమి పెరగడం నిత్య శ్రమజీవులకు గుదిబండగా మారింది. మధ్యాహ్నం వేళ అంతా కార్యాలయాలు, ఇళ్లకే పరిమితం అవుతుండడంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఆదివారం రెబ్బెనలో 41.8, తిర్యాణిలో 41.7, ఆసిఫాబాద్లో 41.6, కెరమెరిలో 41.5, కౌటాల, కెరమెరి, సిర్పూర్(టి)లో 41.3, కాగజ్నగర్లో 40.8, వాంకిడిలో 40.5, పెంచికల్పేట్లో 40.4, చింతలమానెపల్లిలో 40.2, బెజ్జూర్లో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సిర్పూర్(యు), లింగాపూర్, దహెగాం మండలాలు పరిశీలన జోన్లో ఉండగా మిగతా 12 మండలాలు అలెర్ట్ జోన్లో ఉన్నాయి. మరింత మంటలే..!అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావ డం కలవరపరుస్తోంది. గతేడాదితో పోల్చితే వేసవి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి రెండో వారంలోనే ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పుడే భానుడి ప్రతాపం ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటుందోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ విభాగం ముందే చెప్పినట్లు ఈ వేసవి నిప్పుల కొలిమిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్ల ఈ పరిస్థితి కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలి ప్రజలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఉదయం 11 నుంచి మూడు గంటల మధ్య కిరణాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉపాధి హామీ కూలీలు, రైతులు ఉదయం 10 గంటలలోపే పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాలి. వేసవిలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి. ఎండకు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ నవత, మెడికల్ ఆఫీసర్, కౌటాలనిర్మానుష్యంగా కౌటాల–తలోడి రోడ్డునాలుగు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలుతేదీ ప్రాంతం ఉష్ణోగ్రతలు 13న రెబ్బెన 40.8 14న గిన్నెధరి 40.4 15న ఆసిఫాబాద్ 42.4 16న రెబ్బెన 41.8 నాలుగు రోజులుగా సుర్రుమంటున్న సూరీడు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి రెబ్బెనలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -
‘పెండింగ్ వేతనాలు చెల్లించాలి’
ఆసిఫాబాద్రూరల్: పెండింగ్లో ఉన్న వేతనా లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గిరిజన ఆ శ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాకు ఆదివారం వి ద్యార్థి, యువజన సంఘాల నాయకులు మ ద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హాస్టల్ డైలీ వెజ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వర్కర్లు సమ్మె చేస్తుంటే అధి కారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, జీవో 64 నిలిపి వేయాలని, 2014 నాటికి ఐదేళ్లు పూర్తయిన వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘం నాయకులు శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణ, వివిధ సంఘాల నాయకులు పద్మ, దినకర్, రాజేందర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
‘స్పీకర్పై వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం’
ఆసిఫాబాద్అర్బన్: స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రా వ్ అన్నారు. ఇందుకు నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జగదీశ్రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహ నం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభాపతిపై ఇష్టం వచ్చిన ట్లు మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు అగ్రకుల అహ ంకారంతోనే మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నా యకులు బాలేశ్వర్గౌడ్, చరణ్, గుండాశ్యాం, అసద్, మారుతీపటేల్, రూప్నార్ రమేష్, గోపాల్నాయక్, శివప్రసాద్ పాల్గొన్నారు. -
23న భీం అవార్డు ప్రదానోత్సవం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రేమలా గార్డెన్లో ఈనెల 23న నిర్వహించనున్న కుమురంభీం జాతీయ అవార్డు ప్రదానోత్సవాన్ని విజయవంతం చేయాలని నవజ్యోతి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు కోరారు. ప్రముఖ సినీ నటుడు సాయికుమార్కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. స్వర్ణోత్సవాల నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న నవజ్యోతి సంస్థ ఏర్పాట్లపై సన్నద్ధ సమావేశాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయిని రాజశేఖర్, కార్యనిర్వాహక అ ధ్యక్షుడు రామారావ్, ప్రతినిధులు చంద్రశేఖ ర్, రాధాకృష్ణాచారి, రమేశ్, సత్యనారాయణ, వెంకట్రావ్, శ్రీనివాస్, విజయ్కుమార్, గుండ వెంకన్న, సిడాం అర్జుమాస్టర్, సుధాకర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
వన్య ప్రాణుల వేట
● ఎండల తీవ్రతతో అడవుల నుంచి మైదానాల్లోకి మూగజీవులు ● విద్యుత్ తీగలు అమర్చి హతమారుస్తున్న వేటగాళ్లు ● పెద్దపులికి పొంచి ఉన్న ప్రమాదం ● కట్టడి చేయడంలో అటవీశాఖ అధికారుల వైఫల్యంఇటీవలి సంఘటనలు.. ● ఈనెల 2న నందిగామ వద్ద అడవి జంతువులను హతమార్చేందుకు విద్యుత్ తీగలను అమర్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీ సుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ● ఈ నెల 14న అగర్గూడ బీట్లో నీలుగాయిని వేటాడిన నలుగురు వ్యక్తులపైన కేసు నమోదు చేసి వేటాడటానికి ఉపయోగించిన విద్యుత్ తీగలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. ● ఈనెల 15న రాత్రి లోడుపల్లిలో చుక్కల దుప్పిని హతమార్చిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దుప్పి చర్మం స్వాధీనం చేసుకున్నారు ● వారం రోజుల కిత్రం కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ ఆలయం వద్ద ఉన్న ఓవర్హెడ్ ట్యాంక్ వద్దకు దప్పిక తీర్చుకునేందుకు వచ్చిన జింకను వేటగాళ్లు ఉచ్చులు అమర్చి హతమార్చారు.పెంచికల్పేట్: వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న జిల్లాలో మూగజీవాల వేట యధేచ్ఛగా కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించి వేటగాళ్లపైన కేసులు నమోదు చేస్తున్నా వారి తీరుమారడం లేదు. జిల్లాలో 6,04,172 ఎకరాల్లో దట్టమైన అటవీ విస్తీర్ణం ఉంది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల పరిధిలో అనేక రకాల వన్యప్రాణులు ఆవాసంగా మార్చుకుని జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల మండుతున్న ఎండలకు అటవీ ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు వనం నుంచి మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నాయి.. గ్రామ సమీపాల్లోని చెరువులు, నీటి కుంటలు, సెలయేర్ల వైపు పరుగులు పెడుతున్నాయి. దీంతో వేటగాళ్ల కన్ను వన్యప్రాణులపై పడింది. దీంతో విద్యుత్ తీగలు, ఉచ్చులు అమర్చి వాటిని హతమారుస్తున్నారు. వాటి మాంసాన్ని విక్రయిస్తూ వేటనే వృత్తిగా ఎంచుకున్నారు. పెంచికల్పేట్ రేంజ్లో మూడు రోజుల్లో మండలంలోని అగర్గూడ బీట్లో నీలుగాయిని, లోడుపల్లి వద్ద చుక్కల దుప్పిని వేటగాళ్లు హతమార్చారు. కాగజ్నగర్ డివిజన్ పరిధిలో..కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), కాగజ్నగర్, కౌటాల రేంజ్ ల పరిధిని ఆనుకుని ప్రాణహిత, పెద్దవాగు ప్రవహిస్తున్నాయి. దీంతో వేసవిలో సైతం వన్యప్రాణులు ఆయా రేంజ్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఆవా సం ఏర్పాటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో పెద్దపులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, చు క్కల దుప్పులు, జింకలు, నీలుగాయిలు, మెకాలు, సాంబార్లు, కొండగొర్రెలతో పాటు అనేక రకాల ప్రాణులు ఆవాసంగా మార్చుకుని సంతతి వృద్ధి చేసుకుంటున్నాయి. అధికారులు అటవీ ప్రాంతాల్లో గడ్డి క్షేత్రాల పెంపకం చేపడుతుండడంతో సహజంగానే శాఖాహార జంతువుల సంఖ్య పెరిగింది. గ్రామాల వైపు పరుగులు..ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో అడవుల్లోని సహజ నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. వనం నుంచి వచ్చిన ప్రాణులు గ్రామాల సమీపంలో ఉన్న వనరుల వద్ద దాహం తీర్చుకుంటున్నాయి. ఎల్లూర్ సమీపంలోని బొక్కివాగు ప్రాజెక్టు, లోడుపల్లి సమీపంలోని ప్రాణహిత కెనాల్, అగర్గూడ సమీపంలోని పెద్దవాగు వైపు వస్తున్నాయి. దీంతో వేటగాళ్లు ముఠాగా ఏర్పడి విద్యుత్ తీగలు, ఉచ్చులు, కుక్కలతో దాడులు చేసి సులువుగా హతమారుస్తున్నారు. కేసుల నమోదుతో సరి..వన్యప్రాణులను వేటాడుతున్న వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నా వేట నిరంతరం సాగుతూనే ఉంది. అటవీ ప్రాంతంలో నీటి వసతి కల్పించి వన్యప్రాణులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నీటి కొరకు బయటికి వస్తున్న వన్యప్రాణులను వేటగాళ్లు సులువుగా హతమారుస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. సంరక్షణకు చర్యలు ఎండలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సహజ వనరులను అభివృద్ధి చేస్తున్నాం. నీరు లభించే ప్రాంతాల్లో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నాం. అడవుల్లో సోలార్ పంపు సెట్ల ద్వారా నీటిని నింపుతున్నాం. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. వన్యప్రాణుల సంరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలి. – సుశాంత్ బొగాడే, ఎఫ్డీవో, కాగజ్నగర్ పులికి పొంచి ఉన్న ప్రమాదం..పెంచికల్పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), దహేగాం మండలాల్లోని అటవీ ప్రాంతంలో పెద్దపులులు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో శాఖాహార జంతువులు ఎక్కువగా ఉండడంతో పాటు నీటి వసతిని ఆధారంగా చేసుకుని స్థిరనివా సంగా మార్చుకున్నాయి. గ్రామాల సమీ పంలో ఉన్న విద్యుత్ తీగలతో వేటగాళ్లు వేటకు ఉపక్రమిస్తుండటంతో పెద్దపులికి ముప్పు తప్పేలా లేదు. ఆహారం కొరకు అడవి నుంచి బయటికి వచ్చే క్రమంలో పెద్దపులులు విద్యుత్ తీగలతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. -
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా రాథోడ్ రమేశ్
కెరమెరి: జాతీయ మా నవ హక్కుల కమిష న్ (ఎన్హెచ్ఆర్సీ) కుమురంభీం జిల్లా చై ర్మన్గా కెరమెరి మండలానికి చెందిన రమేశ్ రాథోడ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆ కమిషన్ నేషనల్ చైర్మన్ బీ శ్రీనివాస్రెడ్డి ఆదివారం ని యామక పత్రాన్ని విడదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవినీతి, అక్రమాలు బహిర్గ తం చేయడంతో పాటు మానవహక్కుల ఉల్లంఘనలు నిరోధించడానికి కృషి చేస్తానని, ప్రజల కు నిస్వార్థంగా సేవచేస్తానని, తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తానని రమేశ్ పేర్కొన్నారు. -
● అయోమయంలో అన్నదాతలు ● నాలుగో విడతలోనూ పేరు రాకపోవడంతో ఆవేదన ● వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణ ● ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు
ఈ రైతు పేరు చెన్నుపాటి ప్రభాకర్రావు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఇతను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2023 జూన్లో రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాడు. 2024 ఆగస్టులో రుణాన్ని రెన్యూవల్ చేసుకోగా అతని పేరుపై రూ.1.94 లక్షల రుణం మాత్రమే ఉంది. రుణమాఫీకి అన్నీ రకాలుగా అర్హుడిగానే ఉన్నా రుణమాఫీ కాలేదని వాపోతున్నాడు. మరో జాబితాను ప్రకటించి రుణమాఫీ చేయాలని కోరుతున్నాడు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా అర్హులైనా రుణమాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారు. రుణమాఫీ కాక బయట వడ్డీలకు అప్పులు తీసుకుని బ్యాంకుల్లో రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాంకిడి(ఆసిఫాబాద్): నాలుగు విడతలుగా రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మళ్లీ ఐదో విడత మాఫీ ప్రక్రియ చేపడుతుందా? లేదా? అనే విషయంపై మాఫీ కానీ రైతుల్లో సందిగ్ధం నెలకొంది. జిల్లాలోని సుమారు 25 నుంచి 30 శాతం రైతుల పంట రుణాలు మాఫీ కాలేదని సమాచారం. అయి తే ప్రభుత్వం నుంచి ఐదో విడతపై ఎలాంటి స్పష్ట త లేకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. రూ.2లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని రైతులు అప్పులు చేసి మరీ బ్యాంకులకు చెల్లించారు. కానీ నాలుగో విడత ముగిసి మూడు నె లలు కావస్తున్నా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ‘మాకెప్పుడు రు ణమాఫీ’ అంటూ వ్యవసాయ కార్యాలయాలు, పీఏ సీఎస్లు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు. అప్పులు చేసి చెల్లించారు..రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల లోపు పంట రుణాలు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయడం జరుగుతుందని, ఆ పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని చెప్పడంతో రూ.2లక్షల పైన రుణాలు ఉన్న రైతులు అప్పులు చేసీ మరీ పైన ఉన్న మొత్తాన్ని చెల్లించారు. కానీ చాలా మంది రైతులకు మాఫీ కాలేదు. మొదటి విడతలో రూ.లక్షలోపు. రెండో విడతలో రూ.లక్షన్నర లోపు, మూడో విడతలో రూ.రెండు లక్షల లోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేశారు. వివిధ కారణాలతో మాఫీ కానీ రైతుల నుంచి రైతు వేదికల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాత లాక్ పడి ఉండటం, ఆధార్ కార్డులో పట్టా పాస్పుస్తకంలో పేర్లు వేరుగా, తప్పుగా ఉండటం, ఫోన్ నంబర్లు సరిపోలకపోవడం వంటి కారణాలతో రుణమాఫీకి నోచుకోని రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం నాలుగో విడతలోనూ మాఫీ ప్రక్రియ చేపట్టింది. కానీ అందులో కూడా చాలా మంది అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఎక్కువగా రేషన్ కార్డు లేకుండా రూ.2 లక్షల లోపు రుణం కలిగి ఉన్న వారికి మాత్రమే మాఫీ జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 శాతం రైతులకు మాఫీ వర్తించ లేదని తెలుస్తోంది. నాలుగో విడతలో అత్యధికంగా రేషన్ కార్డు లేని వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమాఫీ చేశారు. అనేక కారణాలతో చివరి విడత తరువాత దరఖాస్తు చేసుకున్న చాలా వంది రైతులు చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకులో వడ్డీ పెరిగిపోతుందని ఆందోళనకు గురవుతున్నారు. విడతల వారీగా మంజూరు..రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చి న హామీ మేరకు నాలుగు విడతల్లో 51,583 మంది రైతులకు రూ.465,36,95,472 రుణాలు మాఫీ చేసింది. మొదటి విడతలో 21,776 మంది రైతుల కు గానూ రూ.123.77 కోట్లు, రెండవ విడతలో 14,410 మంది రైతులకు గానూ రూ.150.80 కోట్లు, మూడో విడతలో 11,733 రైతులకు గానూ రూ.154.08 కోట్లు, నాలుగో విడతలో 3,664 మంది రైతులకు గానూ రూ. 36.70 కోట్లు మాఫీ చేసింది. మూడో విడతలో పేర్లు రాణి రైతులకు నాలుగో విడతలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ ఇంకా చాలామంది రైతులు మరో జాబితాపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నాం.. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు. నా కుటుంబంలోని నలుగురి పేరున బ్యాంకులో రూ.2.40 లక్షల పంట రుణం తీసుకున్నా. కనీసం నాలుగో విడతలోనైనా మాఫీ అవుతుందనుకున్నా. కానీ కాలేదు. రైతు వేదికలో దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఫలితం లేదు. కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – కాటేల కళ, దహెగాంఎలాంటి సూచనలు రాలేదు మొదటి విడతలో రూ.లక్ష లోపు, రెండో విడతలో రూ.1.50 లక్షల లోపు, మూడో విడతలో రూ.2లక్షలలోపు రైతుల రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. వివిధ కారణాలతో మూడో విడతలోనూ మాఫీ కాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి నాలుగో విడతలో రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేశాం. మరో జాబితాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆసిఫాబాద్అర్బన్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర ంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం సన్మాన కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబుతో కలిసి హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పథకాలను గడపగడపకూ అందేలా చూడాలన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలన్నారు. జిల్లాలో వనరులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డిని శాలువాలతో సత్కరించారు. నాగేశ్వర్రావ్, కొత్తపల్లి శ్రీనివాస్, గోనె శ్యాంసుందర్రావ్, కోట్నాక విజయ్, అరిగెల మల్లికార్జున్, బోనగిరి సతీశ్బాబు, సెర్ల మురళి, మల్లారెడ్డి, రఘునాథ్, సొల్లు లక్ష్మి, కృష్ణకుమారి, సతీశ్, మాటూరి జయరాజ్, ప్రసాద్గౌడ్ పాల్గొన్నారు. -
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్
పెంచికల్పేట్: మండలంలోని అగర్గూడ అటవీ ప్రాంతంలో నీలుగాయిని హతమార్చి న నలుగురిని అరెస్ట్ చేసినట్లు పెంచికల్పేట్ డిప్యూటీ రేంజ్ అధికారి జమీల్ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి కొమ్ముగూడ–అగర్గూడ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కని పించడంతో అదుపులోకి తీసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించి విచారించగా అగర్గూడ బీట్ పరిధిలో విద్యుత్ తీగలను అమర్చి నీలుగా యిని హతమార్చినట్లు అగీకరించారన్నారు. సంఘటన స్థలానికి తీసుకెళ్లి వేటాడటానికి ఉపయోగించిన తీగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నీలుగాయిని వేటాడిన పెంచికల్పేట్కు చెందిన అప్పాజి శ్రీనివాస్, అప్పాజి వెంకటేశ్, మేకల ర మేశ్, ఒడ్డుగూడకు చెందిన బీంకరి తిరుపతిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. ఆయన వెంట బీట్ అధికారులు సతీశ్, సంగదీప్, మహేష్, దినేష్, సిబ్బంది ఉన్నారు. -
31లోగా ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లిస్తే 25 శాతం రాయితీ
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ రుసుం ఈ నెల 31లోగా చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు వివరాలందించేందుకు కాల్సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. దరఖా స్తుదారులు lrs.telangana.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పట్టుదలతో చదివి.. కొలువులు సాధించి
● నాలుగు ఉద్యోగాలు సాధించిన యువకుడు ● ఆదర్శంగా నిలుస్తున్న సాయిరాంగౌడ్ కౌటాల: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు ఆ పేదింటి యువకుడు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలని భావించాడు కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మండల సాయిరాంగౌడ్. ఇప్పటి వరకు నాలుగు ఉద్యోగాలు సాధించి ఔరా అని పించాడు. మండల రాజేశంగౌడ్– తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. తల్లి గృహిణి కాగా తండ్రి వృత్తిరీత్యా గీత కార్మికుడు. తల్లిదండ్రుల కష్టాలను చూసి భవిష్యత్లో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో తొలి ప్రయత్నంలోనే గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కొలువు సాధించి ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్కు సన్నద్ధమవుతున్న క్రమంలో గతేడాది గ్రూప్–4 ప్రకటన వెలువడగా అందులో ఉత్తీర్ణత సాధించి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు. ఈ నెల 11న వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191వ ర్యాంకు సాధించాడు. శుక్రవారం ప్రకటించిన గ్రూప్–3 ఫలితాల్లో సైతం రాష్ట్రస్థాయిలో 349 ర్యాంక్ను సాధించాడు. గ్రూప్–1 మెయిన్స్లో 436 మార్కులు సాధించానని, సివిల్స్ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నాడు. సాయిరాంగౌడ్ను కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. -
‘అంగన్వాడీల ధర్నా విజయవంతం చేయాలి’
ఆసిఫాబాద్అర్బన్: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న 48 గంటల ధర్నా విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి త్రివేణి పిలుపునిచ్చారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్ను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన జాతీయ విద్యావిధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని శనివారం జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ పీడీ భాస్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, పేద ప్రజలతో పాటు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు నష్టం వాటిల్లే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వనిత, సువర్ణ, వినోద, అంజలి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ నీళ్లు వచ్చేదెప్పుడు?
దహెగాం: కాగజ్నగర్ మండలం అందవెల్లి పెద్దవా గుపై కూలిన వంతెన స్థానంలో మరోవంతెన ని ర్మించారు. అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. భగీరథ పైప్లైన్ కనెక్షన్ తొలగించి కూడా నెల దాటింది. అప్పటి నుంచి దహెగాం, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని 64 గ్రామాల కు భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయి వారంరోజులు కావస్తోంది. ప్రస్తుతం రివిట్మెంట్ పనులు కొనసాగుతుండగా అందుకు వాడే బండరాళ్లను రోడ్డుపై పైప్లైన్కు అడ్డుగా వేయడంతో పనులు చేయలేక పోతున్నామ ని భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో నాలుగు మండలాల్లోని 64 గ్రామాల ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్అండ్బీ అధి కారులు పనులు పూర్తి చేయలేక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భగీరథ పైప్లైన్ వేయడానికి అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రేషన్ దొంగలు
రూటు మార్చినగుండాయిపేట వద్ద వార్ధానది కౌటాల: పేదల కడుపు నింపాల్సిన బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా.. ఇందులో అందరికీ వాటాలు ఉండడంతో రాయితీ బియ్యం పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ఆయా గ్రామాలకు తరలించడం నిత్యకృత్యంగా మారింది. దళారులతో పాటు రేషన్ డీలర్లు సైతం లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలో పీడీఎస్ బియ్యం దందాను అరికట్టేందుకు అధికారులు, పోలీసుశాఖ చేస్తున్న ప్రయత్నాలకు రేషన్ దుకాణాల డీలర్లే గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దందాకు లోపాయికారిగా డీలర్లే సహకరిస్తుండడంతో జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా బహిరంగంగానే కొనసాగుతోందనే విమర్శ వినిపిస్తోంది. అనేక మంది లబ్ధిదారులకు దుకాణాల వద్దే రేషన్ డీలర్లు నేరుగా కిలోకు రూ.16 నుంచి రూ.18 వరకు చెల్లిస్తున్నారు. 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు పోగు చేసి మహారాష్ట్రలో రూ.26 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ పాలిష్ చేసి, ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రేషన్ దందాపై పోలీస్శాఖ ఉక్కుపాదం మోపడంతో అక్రమార్కులు దందా రూట్ మార్చినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లులకు తరలింపు?జిల్లాలో చాలా మంది ప్రజలు సన్న బియ్యం తింటుండగా ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండడంతో చాలామంది వాటిని తినడానికి ఇష్టపడడం లేదు. రేషన్ దుకాణాల్లో విక్రయించి వాటి బదులు డబ్బులు, నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారు. దీంతో నేరుగా డీలర్లే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. రేషన్ డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్థరాత్రి, తెల్లవారు జామున టాటా ఏసీట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు మహారాష్ట్రకు తరలించడంతో పాటు రీసైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్లై గోడౌన్లకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లై శాఖలోని ఒకరిద్దరు అధికారులే ఈ దందాను ముందుండి నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. చౌకధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకే అందేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం వేలిముద్రల నిబంధన ప్రవేశపెట్టినా.. అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. లబ్ధిదారులతో రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు వేయించి నేరుగా అక్కడి నుంచే పీడీఎస్ బియ్యం బొలెరో వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గతంలో లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్లి ఏజెంట్లు బియ్యం సేకరించేవారు. కానీ ఈ దందా విస్తరించిన క్రమంలో నేరుగా రేషన్ దుకాణాల నుంచే సేకరించే స్థాయికి చేరుకుంది. పీడీయాక్టు నమోదు చేస్తాం రాయితీ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తాం. అసాంఘిక కార్యకలాపాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించాం. 2024 నుంచి జిల్లాలో ఇప్పటి వరకు 124 కేసుల్లో 1,594 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. 214 మందిని రిమాండ్కు తరలించాం. తాజాగా హుడ్కిలి చెక్పోస్టు వద్ద 208 క్వింటాళ్ల రాయితీ బియ్యం పట్టుకుని 12 మందిని రిమాండ్కు తరలించాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ రోడ్డు, రైలుమార్గంపై అధికారుల నిఘా తరచూ పట్టుబడుతున్న వైనం జలమార్గాన్ని ఎంచుకున్న అక్రమార్కులు.. రైస్ మిల్లులకు బియ్యం తరలింపుజిల్లా వివరాలుప్రతీనెల పంపిణీ చేస్తున్న బియ్యం 3వేల మెట్రిక్ టన్నులుఆహార భద్రత కార్డులు 1,39,784అన్నపూర్ణ కార్డులు 21అంత్యోదయ కార్డులు 13,024 నాటు పడవల్లో..జిల్లా పోలీసు యంత్రాంగం బియ్యం దందాపై ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ బియ్యం అక్రమ దందాను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. ఇటీవల పోలీసులు సిర్పూర్(టి) మండలం హుడ్కిలి వద్ద వాహనాల్లో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. దీంతో రోడ్డు మార్గంలో పీడీఎస్ బియ్యం మహారాష్ట్రకు తరలించడం కష్టమని భావించిన అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా దందాలో రూట్ మార్చారు. జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి వార్ధా, ప్రాణహిత, పెన్గంగా నదుల్లో నాటు పడవల్లో ప్రమాదకరంగా మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలకు తరలిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సంచుల్లో మూటలు కట్టి రాత్రి సమయాల్లో జలమార్గం ద్వారా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కౌటాల మండలం ప్రాణహిత నదికి సరిహద్దు గ్రామాలు తుమ్మిడిహెట్టి, రణవెల్లి, బూరపెల్లి, కోర్సిని, వార్ధా నది సరిహద్దు గ్రామాలు గుండాయిపేట, వీర్ధండి, తాటిపల్లి, లోనవెల్లి, సాండ్గాం గ్రామాల మీదుగా నది మార్గన తరలించి సొమ్ము చేసుకుంటూ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. కొందరు అక్రమార్కులు రైలు మార్గన సైతం మహారాష్ట్రకు బియ్యం తరలిస్తూ దందా చేస్తున్నారు. -
‘మధ్యవర్తుల వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి’
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కా ర్యాలయంలో కొనసాగుతున్న మధ్యవర్తి వ్యవస్థపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ, టీఏజీఎస్ నాయకులు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏవో మధుకర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకుని ఆర్టీవో కార్యాలయానికి వెళ్తే మధ్యవర్తులతో రావాలని వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వేరే అవకాశం లేక తప్పని పరిస్థితుల్లో మధ్యవర్తులతోనే పనులు చేయించుకోవాల్సి వ స్తోందన్నారు. అమాయకులను ఆసరా చేసుకుని అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్నారు. కా ర్యాలయంలో ఏ వాహనానికి ఎంత చలాన్ చెల్లించాలో ధరల పట్టిక కూడా పెట్టడం లేదన్నారు. -
ఏఐ బోధన సద్వినియోగం చేసుకోవాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): కృత్రిమ మేధ(ఆర్టిఫిషియ ల్ ఇంటిలిజెన్స్)తో కూడిన విద్యా బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని తక్కళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విద్యాబోధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులకు బోధనను అందించే కంప్యూటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతగా చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం 4 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్లను రాష్ట్ర ప్రభుత్వం, ఏక్ స్టెప్ ఫౌండేషన్ల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో మరికొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భాష, గణిత సామర్థ్యాల సాధనను పెంపొందించేందుకు ఈ విద్యాబోధన ఎంతగానో దోహదపడుతుందన్నారు. కృత్రిమ మేధస్సును విద్యారంగంలో అమలు చేయడం విప్లవాత్మకమైన ఆలోచన అన్నారు. ప్రాథమిక స్థాయిలో భాష, గణితంలలో అభ్యాసన సామర్ాధ్యలతో పాటు కృత్రిమ మేధ సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్ాధ్యలను సాధించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలన్నారు. తక్కళ్లపల్లి పాఠశాలలో మార్పులు తీసుకువచ్చిన ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో శంకరమ్మ, సమన్వయ కర్త శ్రీనివాస్, హెచ్ఎం మహేశ్వర్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఏఐతో మరింత నైపుణ్యంకెరమెరి(ఆసిఫాబాద్): ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్)తో విద్యార్థులు మరింత నైపుణ్యం సాధిస్తారని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం గోయగాం ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఏఐ విద్యాబోధన కేంద్రాన్ని ప్రారంభించారు. తెలుగు, గణితం, ఆంగ్లంలో ఏఐ బోధనను పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులతో పాటు పోషకులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు, గణితం, ఆంగ్లంలో వెనుకబడిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసేందుకు ఏఐ పద్ధతిని అవలంబిస్తున్నామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రతీ పాఠశాలకు చేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులకు సద్వినియోగం చేయాలని, ప్రతీరోజు పిల్లలను బడికి పంపించాలని పోషకులను కోరారు. అనంతరం ఝరి ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పెయింటింగ్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, ఝరి హెచ్ఎం భరత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే -
సీఎం దిష్టిబొమ్మ దహనం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డిని శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అలీబిన్ అహ్మద్, సంజీవ్కుమార్, పెంటు, అజయ్కుమార్, మల్లేశ్, నిసార్, రాజు, తుకారాం, శ్రీధర్, భీమేశ్, వినోద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
మేలుకో.. తెలుసుకో..
రెండేళ్ల క్రితం తాండూరు మండలం కాసిపేటకు చెందిన కస్తూరి శివకృష్ణ జిల్లా కేంద్రంలోని ఓ షోరూంలో బైక్ కొనుగోలు చేశాడు. ఆ బైక్ బ్యాటరీ రెండేళ్ల వారంటీ ఉండగా.. ఏడాదికే పాడైంది. దీనిపై షోరూం వాళ్లను అడిగితే కి.మీ. సాకు చూపిస్తూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి షోరూంపై న్యాయపోరాటం చేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ ఆన్లైన్ ఉత్పత్తుల కంపెనీపై ఫిర్యాదు చేశాడు. తనకు నాసిరకం వస్తువు అంటగట్టారని ఆ కంపెనీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందడంలో చాలా చోట్ల మోసపోతూనే ఉన్నారు. డబ్బులు చెల్లించి కంపెనీ ఉత్పత్తుల పేర్లు, బరువు, నాణ్యత, కల్తీ, ఉత్పత్తుల్లో మోసాలతోపాటు నిబంధనల మేరకు సర్వీస్ అంద డం లేదు. నిత్యం వినియోగించే ఉప్పు, పప్పు నుంచి తినే తిండే, తాగే నీళ్లు, విలువైన వస్తువులు మా ర్కెట్లో జరిగే ప్రతీ లావాదేవీలు, పౌరసేవల్లో మో సం, నిర్లక్ష్యం తప్పడం లేదు. వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే సమయంలో అవగాహన లోపం, సేవలు పొందడం తెలియక చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. చాలా సంస్థలు నాసిరకం వస్తువులు, సరుకులు తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నాయి. వినియోగ దారుల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయి. దీనిని నివారించేందుకు కేంద్రం ప్ర త్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు ఏ వస్తువునైనా షాపులోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మోసాలు సైతం మరింతగా పెరిగిపోతున్నాయి. హక్కులను మరింతగా రక్షించేందుకు కన్జూమర్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తుంది. వేల కేసుల పరిష్కారానికి చొరవ చూపింది. నష్టపోయినదానికంటే అధికంగా పరిహారం అందించి బాధితులకు అండగా నిలిచింది. జిల్లాలో పలువురు విని యోగదారుల హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆయా సంబంధిత శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ.. పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నా చూసీచూడనట్లుగా వదిలేయడంతో వినియోగదారులకు నష్టం జరుగుతోంది. అవగాహనే శ్రీరామ రక్ష..ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదు. ప్ర స్తుత సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై కనీ సం ఫిర్యాదు సైతం చేయకుండా పోతున్నారు. న చ్చిన వస్తువుల సేవలు ఎంచుకోవడంతో పాటు వా టి నాణ్యత, పనితీరు గురించి తెలుసుకోవడం, అ భిప్రాయం తెలియజేయడం తదితర హక్కులు విని యోగదారులకు ఉంటాయి. వస్తుసేవల విషయంలో సమస్య తలెత్తితే వాటి విలువ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు. వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలే తయారీ, తూకం, నాణ్యత, ధరల్లో మాయాజాలం సేవల్లో వినియోగదారులకు తప్పని తిప్పలు నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంమంచిర్యాలకు చెందిన శ్రవణ్కుమార్ సినిమా థియేటర్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల పార్కింగ్ ఫీజులు తీసుకుంటున్నారని వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. థియేటర్ లోపల తినుబండారాలు, శీతల పానీయాలను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు విక్రయిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. ఈ రెండూ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.హక్కులు, బాధ్యతలు ఉన్నాయి వినియోగదారులకు నాణ్యమైన సేవలు పొందే హక్కులు ఉన్నాయి. అదే సమయంలో బాధ్యతలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరు తమ హక్కులు పొందేలా అవగాహన ఉండాలి. మా సంస్థ తరఫున మోసపోయిన వినియోగదారులకు మద్దతుగా నిలుస్తున్నాం. –టి.చేతన సోనీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంస్థప్రశ్నిస్తేనే న్యాయంవినియోగదారుల సంరక్షణ చట్టం ప్రకారం తయారీ, నాణ్యత, తూకం, ప్రామాణిక ముద్ర, గడువు, ధర, జీఎస్టీ, తదితరాలు కచ్చితంగా ఉండాలి. చెల్లించిన ధరకు సేవలు పొందాలి. కానీ ఎక్కడైనా సేవల్లో అంతరాయం ఏర్పడితే కొందరే ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోనే వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కమిషన్ ఉంది. 2024లో మొత్తం 163 ఫిర్యాదులు రాగా, ఇందులో 29 పరిష్కరించగా, మరో 134 పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఆయా కంపెనీల, తయారీదారులపైనా జరిమానాలు విధించారు. ప్రస్తుతం వినియోగదారులు ఆన్లైన్లోనూ సెంటర్ అండర్ కన్జూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ (సీసీసీ), ఈ జాగృతి వెబ్సైట్, హెల్ప్లైన్ 1915కు కాల్ చేయెచ్చు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరసన
ఆసిఫాబాద్రూరల్: పెండింగ్ వేతనాలు చె ల్లించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లకు ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. హోలీ పండు గ రోజు సైతం సమ్మె చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాల వర్కర్లు రాము, పద్మ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
ఏఐ బోధనకు సిద్ధం
● జిల్లాలో నాలుగు పాఠశాలలు ఎంపిక ● ఒక్కో పాఠశాలలో పది మంది విద్యార్థులకు బోధన ● కనీస సామర్థ్యాల పెంపే లక్ష్యం ● నేటి నుంచి తరగతులు ప్రారంభంజిల్లాలో ఎంపికై న పాఠశాలలుకెరమెరి(ఆసిఫాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంచేందుందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయం తీసుకునేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడతలో నాలుగు ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ పాఠాలు బోధించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యాశాఖ 1 నుంచి ఐదో తరగతి వరకు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం అమలు చేస్తోంది. ఉపాధ్యాయులకు శిక్షణ అందించడంతోపాటు టీచింగ్, లర్నింగ్, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, హ్యాండ్బుక్స్ ముద్రించి సరఫరా చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ఏఐ ద్వారా ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం మరింత మెరుగ్గా అమలు చేయనున్నారు. నేటి నుంచి ప్రారంభం..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరిగింది. అన్నిరంగాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఈ సాంకేతికత సాయంతో ప్రాథమిక విద్య మరింత బలోపేతం కానుంది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని నాలుగు ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శనివారం నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతోపాటు అదనపు కలెక్టర్లు, అధికారులు ఆయా పాఠశాలల్లో ఏఐ బోధనను అధికారికంగా ప్రారంభించనున్నారు. పది మంది విద్యార్థులు ఎంపిక..ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఆశించిన స్థాయిలో అభ్యనన సామర్థ్యాలు, చతుర్విద ప్రక్రియల్లో వెనుకబడుతున్నారు. ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితాలు మెరుగుపడడం లేదు. ఈ నేపథ్యంలో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో సీ గ్రేడ్లో ఉన్న సామార్థ్యాలను మెరుగుపర్చడం కోసం చర్యలు చేపట్టారు. జిల్లాలోని తక్కెళ్లపల్లి, గోయగాం, ఖిరిడి, సలుగుపల్లి ప్రాథమిక పాఠశాలల నుంచి పది మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో వెనుకబడిన విద్యార్థులను ఏఐ పాఠాల కోసం సంసిద్ధం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు సమీప ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లను వినియోగించనున్నారు. బోధన ఇలా..ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పిల్లలను ఆకట్టుకునేలా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన సాగనుంది. 3, 4, 5 తరగతుల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల నుంచి ఐదుగురి చొప్పున ఒక బ్యాచ్ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాచ్కు తెలుగువాచకం, గణితం అభ్యాసాలపై 20 నిమిశాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధించనున్నారు. సదరు విద్యార్థి పాఠ్యాంశం అర్థం చేసుకుంటున్నాడా..? లేదా అని గుర్తించి.. అర్థం కాకుంటే సరైన మార్గంలో బోధన సాగిస్తుంది. ప్రతీ విద్యార్థి అభ్యసన సామార్థ్యాలు మదింపు చేయడంతోపాటు గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. వారంలో నాలుగు రోజులు ఏఐ పాఠాల బోధన సాగనుంది. విద్యార్థులకు ఉపయోగం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపునకు ప్రస్తుతం ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమల్లో ఉంది. మరింత మెరుగైన సామర్థ్యాలు సాధించేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో నాలుగు ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశాం. ఆయా పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభమవుతుంది. విద్యార్థులకు చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాల పెంపుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. – ఉప్పులేటి శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ మండలం పాఠశాల విద్యార్థులు రెబ్బెన తక్కెళ్లపల్లి 10 కెరమెరి గోయగాం 10 వాంకిడి ఖిరిడి 10 బెజ్జూర్ సలుగుపల్లి 10 -
మార్చిలోనే 40 డిగ్రీల ఎండ
● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● గతేడాదితో పోల్చితే అధికం తిర్యాణి(ఆసిఫాబాద్): వేసవి ప్రారంభంలోనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ప గటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు మధ్యాహ్నం బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మార్చిలో నే పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా నమో దు కావడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలుజిల్లాలోని రెబ్బెనలో బుధవారం అత్యధికంగా 40.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే రెండో గరిష్ట ఉష్ణోగ్రత.. గతేడాది మార్చి 12న రెబ్బెనలో 38.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికంగా నమోదు కావడం విశేషం. జిల్లాలో గడిచిన మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. తాజాగా బుధవారం రెబ్బెనలో 40.6 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, కౌటాల, బెజ్జూర్లో 40.5, కెరమెరి, దహెగాం, తిర్యాణి మండలాల్లో 40.4, ఆసిఫాబాద్లో 40.3, పెంచికల్పేట్లో 40.2, సిర్పూర్(టి)లో 40.1, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 15 మండలాలకు పది మండలాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు వడగాలులు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఆత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మానుష్యంగా రోడ్లుజిల్లాలో మూడు రోజులుగా ఎండలు పెరగడంతో పగటిపూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో రోజంతా కూలర్లకే అతుక్కుపోతున్నారు. ఎండల నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశారు. ఉపాధిహామీ కూలీలు ఉదయం 9 గంటలకే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. జ్యూస్ సెంటర్లు, కొబ్బరిబొండాలు, కీరదోసకాయల దుకాణాలకు జనాల తాకిడి పెరిగింది. -
‘అపార్’ నమోదు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల అపార్ గుర్తింపు కా ర్డుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అపార్ గుర్తింపు సంఖ్య అందించాలన్నారు. వేసవిలో పాఠశాలల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, డీటీడీవో రమాదేవి, ఎస్వోలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు 47 మంది జూనియర్ లెక్చరర్లు
ఆసిఫాబాద్రూరల్: టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న వారు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం జి ల్లాకు 47 మంది జూనియర్ లెక్చర్లర్లను కే టాయించిందని డీఐఈవో కళ్యాణి తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం పలువురు విధుల్లో చేరారు. కాగా, జిల్లాలో పదేళ్లుగా 61 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. నూతన అధ్యాపకులు చేరడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు విద్యా వ్యవస్థలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
వేసవి వేడి.. ఒంటిపూట బడి
● ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు ● ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు అమలు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ‘పది’ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి స్కూళ్లుకెరమెరి(ఆసిఫాబాద్): మార్చిలోనే భానుడు తన ప్ర తాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత పెరిగిన నే పథ్యంలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు. జిల్లాలో 1,273 పాఠశాలలుజిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఆశ్రమ, ఆదర్శ, గురుకులాలు, కేజీబీవీలు మొత్తం 1,273 పాఠశాలలు ఉ న్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా స్కూళ్లలో 98వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యాన్లు లేవు. నల్లాలు ఏర్పాటు చేసినా భగీరథ నీటి కనెక్షన్ ఇవ్వలేదు. ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసంతో అనారోగ్యం బారిన పడతారు. ఎండ, వేడి కారణంగా అలసటకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఏటా ప్రభుత్వం వేసవిలో ఒంటిపూట బడులు నిర్వహిస్తుంది. 21 నుంచి ‘పది’ వార్షిక పరీక్షలుఈ నెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. జిల్లాలోని 174 ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చే యనున్నారు. ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఉ న్నత పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకా రం ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మోడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులుపాఠశాలల పనివేళలు ఇలా..మొదటి గంట ఉదయం 8 గంటలు రెండో గంట ఉదయం 8:05 గంటలు ప్రార్థన ఉ.8:05 నుంచి 8:15 మొదటి పీరియడ్ 8:15 నుంచి 8:55 రెండో పీరియడ్ 8:55 నుంచి 9:35 మూడో పీరియడ్ 9:35 నుంచి 10:15 స్వల్ప విరామం 10:15 నుంచి 10:30 నాలుగో పీరియడ్ 10:30 నుంచి 11:10 ఐదో పీరియడ్ 11:10 నుంచి 11:50 ఆదో పీరియడ్ 11:50 నుంచి మధ్యాహ్నం 12:30జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఉపాధ్యాయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలి. – యాదయ్య, జిల్లా విద్యాధికారి -
వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మండలంలోని కౌటగూడ, జన్కాపూర్ అంగన్వాడీ కేంద్రాలను గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మంజూరైన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. చిన్నారులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందించే పోషకాహారం గర్భిణులు, పిల్లలకు సక్రమంగా అందించాలన్నారు. వేసవిలో ఇబ్బందులు లేకుండా నిత్యం సూపర్వైజర్లు సెంటర్లను సందర్శించాలని సూచించారు. కాలం చెల్లిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించొద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా పోషణ్ అభియాన్ సమన్వయకర్త గోపాలకృష్ణ, సూపర్వైజర్లు లైలా, పెంటుబాయి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలిఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్కు వివిధ పనులకు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్ను పరిశీలించారు. ఎండల నేపథ్యంలో ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు చల్లని తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏవో మధుకర్ను ఆదేశించారు. ఫ్రిడ్జ్లో లోపాలుంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. -
గుడ్డు ధరలు పెంపు
● ‘మధ్యాహ్న’ ఏజెన్సీ మహిళలకు ఊరట ● సర్కారు పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం ● రూ.5నుంచి రూ.6కు పెంచుతూ ఉత్తర్వులు జారీ మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న కోడిగుడ్డు ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్డు అందిస్తోంది. ఇటీవల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ధరాభారం తాము మోయలేమంటూ మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని పాఠశాలల్లో వారంలో గుడ్డుకు బదులు అరటిపండు ఇస్తుండగా.. ఇంకొందరు వారంలో ఒక గుడ్డుతో సరిపెడుతున్నారు. కోడిగుడ్డు కొనుగోలు అంటేనే వంట ఏజెన్సీ మహిళలు తమవైపు గుర్రుగా చూస్తున్నారని టీచర్లు వాపోయిన సందర్భాలు లేకపోలేదు. మార్కెట్లో గుడ్డు ధరలకు ప్రభుత్వం చెల్లించే ధరల్లో వ్యత్యాసం ఉండడంతో ఏజెన్సీలకు అదనపు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుడ్డు ధరను ఒక రూపాయి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కోడిగుడ్డు ధర రూ.5నుంచి రూ.6 వరకు పెంచింది. దీంతో ఏజెన్సీ మహిళలకు ఉపశమనం కలుగనుంది. ఆకాశాన్నంటిన ధరకోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్లో ఆకాశాన్ని అంటుతోంది. మధ్యాహ్న భోజన తయారీ ఏజెన్సీలకు భారంగా మారుతోంది. మంచిర్యాల జిల్లాలోని 747 పాఠశాలల్లో 37,241మంది విద్యార్థులు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 732 ప్రభుత్వ పాఠశాలల్లో 43,110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తాయి. తొమ్మిది, పది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు వండి పెట్టేందు కు రూ.6.19, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రూ.9.29 స్లాబ్ ధరలతోపాటు కోడిగుడ్డుకు అదనంగా రూ.5 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 9, 10వ తరగతుల వరకు రూ.10.68 పైసలు బిల్లులో కోడిగుడ్డు ధర కలిపి ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తోంది. కూరల కోసం పప్పు, కూరగాయలు, నూనెను వంట ఏజెన్సీ మహిళలు సమకూర్చుకుంటారు. విద్యార్థులందరికీ సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్న భోజనంలో ఉడికించిన కోడిగుడ్డు అందించాలి. గతంలో గుడ్డుకు రూ.4 చెల్లించే ప్రభుత్వం 2022లో అప్పటి ధరల ప్రకారం రూ.5కు పెంచింది. కానీ కొద్ది నెలలుగా గుడ్డు ధర అమాంతం పెరగడంతో చాలా పాఠశాలల్లో వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే వడ్డిస్తున్నారు. దీంతో విద్యార్థులు పోషకాహారానికి దూరం అవుతున్నారు. ఒక్కో గుడ్డుకు రూ.5 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. ప్రస్తుత మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7వరకు పలుకుతున్న సందర్భాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకెంత పెరుగుతుందోనని ఏజెన్సీ నిర్వాహకులు ధరలు పెంచాలని ఆందోళన చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం వంట ధరలను పెంచుతూ కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు. కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత మధ్యాహ్నం భోజనం వంట ధరల పెంపుతో ఏజెన్సీలకు కాస్త ఊరట కలిగిస్తోంది. మూడు రోజులు అందించాలి కోడిగుడ్డు ధరలు పెంచుతూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్కెట్లో గుడ్డు ధరలు పెరగడం వల్ల ఏజెన్సీల నిర్వాహకులు కొంత ఇబ్బంది పడిన విషయం తెలియంది కాదు. రూపాయి పెంచడం వల్ల ఏజెన్సీలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. పోషకాలు అందించేందుకు విద్యార్థులకు విధిగా వారానికి మూడు రోజులు ఉడకబెట్టిన గుడ్డు అందించాల్సిందే. – యాదయ్య, డీఈవో -
సమస్య ఉంటే సమాచారం ఇవ్వాలి
దహెగాం(సిర్పూర్): విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉంటే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని ట్రాన్స్కో ఏఈ శేషారావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం ట్రాన్స్కో ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సాగు మోటార్లకు స్టార్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పంటల సాగుకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో డీఈ నాగరాజు, ఏఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
నెలరోజులుగా ‘భగీరథ’ బంద్
● అందవెల్లి వంతెన అప్రోచ్ రోడ్డు పనులతో పైప్లైన్ తొలగింపు ● పనులు పూర్తయినా నీటి సరఫరా పునరుద్ధరించని అధికారులు ● నాలుగు మండలాల్లోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులుదహెగాం(సిర్పూర్): మిషన్ భగీరథ నీటి సరఫరా నెల రోజులుగా నిలిచిపోయింది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. కాగజ్నగర్ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పనులు ఫిబ్రవరి 12న ప్రారంభించారు. వంతెన పైనుంచి భగీరథ పైప్లైన్ ఉండటంతో అప్రోచ్ పనుల సమయంలో ఆ పైప్లైన్ తొలగించారు. అప్పటి నుంచి భగీరథ నీటి సరఫరా కావడం లేదు. నెల రోజులైనా పునరుద్ధరించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి తంటాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా..నెల రోజులుగా భగీరథ పథకం నీటి సరఫరా నిలి చిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ బోర్ల వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. దహెగాం మండలం ఒడ్డుగూడ, బామానగర్, ఐనం గ్రామాల్లో తీవ్రమై న నీటి ఎద్దడి ఉన్నందున పంచాయతీల ఆధ్వర్యంలో ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. చిన్న ఐనంలో తాగునీటి ఎద్దడిపై ‘సాక్షి’లో కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించి వాగు వద్ద బోరు కు మోటర్ బిగించి సమస్యను పరిష్కరించారు. మిగిలిన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు కొనసాగుతున్నాయి. పట్టించుకోని అధికారులు..నెల రోజులుగా గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని చేతిపంపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఎడ్లబండ్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయి మూడు రోజులు కావొస్తున్నా పైప్లైన్ పనులు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మూడు రోజుల్లో పూర్తి చేస్తాం అందవెల్లి పెద్దవాగు వద్ద వంతెన అప్రోచ్ పనులు ప్రారంభించడంతో భగీరథ పైప్లైన్ కనెక్షన్ తొలగించాం. అప్రోచ్ పనులు పూర్తయిన నేపథ్యంలో మూడు రోజుల్లో పైప్పైన్ పనులు పూర్తి చేస్తాం. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. త్వరలో తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. – సాయికృష్ణ, భగీరథ ఏఈ64 గ్రామాలకు బంద్..అందవెల్లి పెద్దవాగు వంతెన వద్ద భగీరథ పైప్లైన్ తొలగించడంతో వంతెన అవతలి వైపు 64 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అసలే వేసవి కావడంతో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. కాగజ్నగర్ మండలంతోపాటు కన్నెపల్లి, భీమిని, దహెగాం మండలాల్లో 64 గ్రామాలకు ఈ పైప్లైన్ ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది. నెల రోజులుగా పైప్లైన్ కనెక్షన్ తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందవెల్లి పెద్దవాగు వంతెన వద్ద అప్రోచ్ పనులు మూడు రోజుల క్రితమే పూర్తి చేశారు. అయినా పైప్లైన్ మరమ్మతులు చేపట్టడం లేదు. -
ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలి
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావుఆసిఫాబాద్అర్బన్: పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో బుధవారం హైదరాబాద్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఈసీజీ, షుగర్, బీపీ, పల్స్రేట్, 2డీ ఏకో తదితర వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసే పోలీసులు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, డీఎస్పీ కరుణాకర్, సీఐ రాణాప్రతాప్, ఆర్ఐ పెద్దన్న, సీఐ రవీందర్, డీసీఆర్డీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సిబ్బంది శంకర్రెడ్డి, విజయ్, సీనియర్ ఆర్థో సర్జన్ విశ్వనాథ్, కార్డియాలజిస్ట్ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు ● జిల్లాలో వందమందికి పైగా పేషెంట్లు ● రెండు డయాలసిస్ కేంద్రాల్లో బాధితులకు సేవలు ● నేడు వరల్డ్ కిడ్నీ డే
ఆసిఫాబాద్: మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనవి కిడ్నీలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరం నుంచి వ్యర్థాలు బయటికి వెళ్లి ఆరోగ్యంగా ఉంటారు. కానీ మారిన ఆహారపు అలవాట్లు, వివిధ అనారోగ్య సమస్యలతో కొంతమంది మూత్రపిండాలు చిన్నవయస్సులోనే దెబ్బతింటున్నాయి. గతంతో పోలిస్తే జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. గురువారం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కథనం. వందమంది బాధితులు డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్లు అధికంగా వినియోగించడం, ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, ఆటోఇమ్యున్ వ్యాధితో పాటు జన్యుపరమైన సమస్యలతో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్ను దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అంటారు. కిడ్నీలు 80 శాతం వరకు పాడయ్యే వరకు పనిచేస్తాయి. ఇందులో ఐదు దశలు ఉండగా, చివరి దశకు చేరితే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు భావిస్తారు. జిల్లావ్యాప్తంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో వంద మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బాధితులకు సేవలందించేందుకు జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఐదు డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. ఆసిఫాబాద్లో 40 మంది, కాగజ్నగర్లో 40 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. స్లాట్ దొరక్కపోతే ఇతర ప్రాంతాలకు.. కొంతమంది వ్యాధిగ్రస్తులకు స్లాట్ బుకింగ్ దొరక్కపోవడంతో మంచిర్యాల, కరీంనగర్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్థిక స్థామత ఉన్న కొంతమంది మంది హైదరాబాద్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఒక్కొసారి డయాలసిస్ కోసం రూ.6 వేలు వెచ్చించాల్సి వస్తుంది. వారానికి రెండుసార్ల చొప్పున నెలకు ఎనిమిది సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉటుంది. ఇందుకు నెలకు సుమారు రూ.50 వేలు ఖర్చవుతుంది. బతుకుపై ఆశతో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆస్తులు అమ్ముకుని చికిత్స చేయించుకుంటున్నారు. కిడ్నీ సమస్య ముదిరితే అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం కూడా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన ఓ బాధితుడు మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులు(ఫైల్)జాగ్రత్తలు పాటించాలి హైబీపీ, డయాబెటీస్, కుటుంబంలో ఎవరికై న కిడ్నీవ్యాధిగ్రస్తులు ఉంటే తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురైతే తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అవసరం లేకున్నా ఒత్తిడిగా అనిపించడం, ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం వ్యాధికి సంకేతంగా భావించాలి. షుగర్ వ్యాధితో బాధపడేవారిలో 40 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్లు పోవడం క్లిష్టమైన అంశం. మూత్ర పరీక్షల ద్వారానే గుర్తిస్తారు. అనుమానం ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మూత్రంలో రక్తం వస్తుంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
సీ్త్రనిధి రుణాలు వందశాతం రికవరీ చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: మహిళా సంఘాల అభివృద్ధిలో భాగంగా అందించే సీ్త్రనిధి రుణాలను మార్చి నెలాఖరులోగా రికవరీ చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి ఏపీఎంసీ, సీసీలు, మెప్మా సిబ్బందితో సీ్త్రనిధి రుణాల రికవరీ, నూతన రుణాల జారీ, ప్రమాద బీమా, బ్యాంకు లింకేజీ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రనిధి కింద తీసుకున్న రుణాలు, ఓవర్ డ్యూస్ రికవరీ వందశాతం పూర్తి చేసేవిధంగా అధికారులు మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. అధిక బకాయిలు ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వందశాతం రుణాలు చెల్లించిన సంఘాలకు నూతన రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ప్రమాద బీమాకు ప్రీమియం చెల్లించేలా అవగాహన కల్పించడంతోపాటు వందశాతం బ్యాంకు లింకేజీ పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మండలాల వారీగా సమీక్షించారు. అదనపు డీఆర్డీవో రామకృష్ణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మెప్మా ప్రాజెక్టు అధికారి మోతీరాం, సీ్త్రనిధి సిబ్బంది పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని గోయగాం ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. మధ్యాహ్నం భోజనం, హాజరు పట్టికను పరిశీలించారు. పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షల తీరును పర్యవేక్షించారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం మండలంలోని ధనోరా వద్ద ఉన్న మిషన్ భగీరథ పంప్హౌస్ను సందర్శించారు. ఈఈ రాకేశ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో ఆడే ప్రకాశ్, ఉపాధ్యాయులు, ఏఈలు ఉన్నారు. ‘ధరణి’ దరఖాస్తులు పరిష్కరించాలి ఆసిఫాబాద్అర్బన్: వివిధ భూ సమస్యలపై ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో ధరణి(భూభారతి)లో వచ్చిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలించి, రికార్డులు సరిచూసి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ప్రతీ ఫైల్ వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీవో లాగిన్లో ఉన్న రికార్డులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై అధికారులు ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని సూచించారు. -
రుణాల పేరుతో మోసం!
● కాగజ్నగర్లో రూ.లక్షలు కాజేత ● లబోదిబోమంటున్న బాధిత మహిళలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహిళలకు సులువుగా రుణాలు ఇస్తామని చెప్పి రూ.లక్షలు వసూళ్లు చేసి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ నెల 7న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ముగ్గురు వ్యక్తులు తాము ఆంధ్రా నుంచి వచ్చామని చెప్పుకుంటూ కాలనీల్లో ఇంటింటికీ తిరిగారు. మహిళలకే రుణాలు అంటూ, ఒక్కొక్కరికి కనీసం రూ.50వేల చొప్పున రుణాలు ఇస్తామని నమ్మించారు. ముందుగా మహిళలు గ్రూప్గా ఏర్పాటు చేసుకోవాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.3వేల చొప్పున వసూలు చేశారు. అలా పట్టణంలోని విజయ్ బస్తీ, కోసిని, సర్దార్బస్తీ, తదితర కాలనీలకు చెందిన మహిళలు, అంగన్వాడీ టీచర్లు, గృహిణులు మొత్తం వందమందికి పైగా డబ్బులు కట్టారు. అయితే ఈ నెల 11న డబ్బులు చెల్లించిన వారందరికీ రుణాలు ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. కానీ గత రెండు రోజులుగా రుణాల కోసం మహిళలు కాల్స్ చేస్తే అటు నుంచి ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టిన మహిళలకు రూ.3వేలు తీసుకుని రూ.వెయ్యి విలువైన టేబుల్ ఫ్యాన్లు అంటగట్టారని వాపోతున్నారు. ఆసిఫాబాద్ పట్టణం జూబ్లీ మార్కెట్లో తమ ఆఫీసు ఉందని చెబితే అక్కడికి వెళ్లి చూస్తే ఎలాంటి ఆఫీసు లేదు. ఈ వ్యవహారమంతా చూస్తే మోసపోయినట్లుగా గుర్తించారు. ఇంకా కొత్తగా ఎవరూ కూడా డబ్బులు కట్టడం చేయొద్దని బుధవారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇదంతా చెప్పుకుంటే ఇబ్బందిగా ఉంటుందని ఎవరూ కూడా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇవ్వలేదు. మారుమూల ప్రాంతాల్లో ఇంకా బాధితులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే రుణాల మోసంపై అందరం కలిసి ఫిర్యాదు చేస్తామని బాధిత మహిళ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
క్రీడాపాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: ఉమ్మడి జిల్లా గిరిజన ఆదర్శక్రీడా పాఠశాలలో ప్రవేశానికి జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడాపాఠశాలలో బుధవారం ఎంపిక పోటీలు నిర్వహించినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. ఐదో తరగతిలో 40 సీట్లకు 60 మంది, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లు కోసం 80 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన 40 మంది బాలికలను ఎంపిక చేస్తామన్నారు. అనంతరం తిర్యాణి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పీడీ లక్ష్మణ్ ఇటీవల బాడీబిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఆదిలాబాద్ టైటిల్ని సొంతం చేసుకోవడంతో డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, డీటీడీవో రమాదేవి శాలువాతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో కోచ్లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, పీడీలు పీఈటీలు మధుసూదన్, సంగీత, వెంకటేశ్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
సైన్స్తో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం
పెంచికల్పేట్(సిర్పూర్): సైన్స్తో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందుతుందని జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ అన్నారు. మండలంలోని చేడ్వాయి ఉన్నత పాఠశాలలో బుధవారం మొబైల్ సైన్స్ ల్యాబ్ ద్వారా పలు ప్రయోగాలు చేశారు. ఆయన మాట్లాడుతూ సైన్స్ ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందన్నారు. పరిశోధన శక్తి పెరిగి నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రమేశ్బాబు, ఉపాధ్యాయులు రాకేశ్, సుమిత, రాజ్కమలాకర్రెడ్డి, శిల్ప, స్వప్న పాల్గొన్నారు. -
మద్యంతో ప్రమాదాలు..
కౌటాల మండలం తాటిపల్లి వద్ద పెన్గంగలో స్నానాలు(ఫైల్)చింతలమానెపల్లి(సిర్పూర్): చిన్నాపెద్ద, కుల, మత బేధం లేకుండా హోలీ పండుగను అంతా కలిసి ఉల్లాసంగా జరుపుకొంటారు. సామూహికంగా జరుపుకునే ఈ పండుగకు క్రేజ్ ఎక్కువే. రంగులు చల్లుకుంటూ విందులు, వినోదాలతో సంతోషంగా గడపుతుంటారు. జిల్లావ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో పౌర్ణమి సందర్భంగా రెండు రోజులపాటు హోలీ నిర్వహించుకుంటారు. విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ హోలీ పండుగ కొత్త అలవాట్లకు వేదికగా మారుతుంది. సంబురాల అనంతరం యువత ఎక్కువగా స్నానాలకు వెళ్తుంటారు. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో నదులు, వాగులు, చెరువులు, కుంటలు, నీటిప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. రంగులు చల్లుకున్న అనంతరం స్నానాలకు వెళ్లడం సర్వసాధారణం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వట్టివాగు, అడ ప్రాజెక్టు, పెద్దవాగుకు స్నానాలకు వెళ్తుంటారు. కాగజ్నగర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల ప్రజలు సమీపంలోని పెద్దవాగు, ప్రాజెక్టులు, సిర్పూర్(టి), కౌటాల మండలాల్లో పెన్గంగ నది వద్దకు, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల వాసులు ప్రాణహిత నదికి స్నానాలకు వెళ్తుంటారు. నిత్యం నీటి ప్రవాహం జిల్లాలోని జీవనదులైన పెద్దవాగు, ప్రాణహిత, పెన్గంగ నదుల్లో ఏడాదంతా నీటి ప్రవాహం కొనసాగుతోంది. అడ, వట్టివాగు ప్రాజెక్టుల్లో నిత్యం జలకళ ఉంటుంది. సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు పండుగ వేళల్లో స్నానాలకు నీటి వనరుల వద్దకు వెళ్లడం సాధారణ విషయం. పెద్దవాగు, ప్రాణహిత, పెన్గంగ నదుల్లో పలుచోట్ల ప్రమాదకర మడుగులు, ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం ఉంటుంది. హోలీ జరుపుకునే వారు గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. హోలీ సమయంలో ప్రమాదాలకు ఆస్కారం ఉండటంతో కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోని చిన్నపిల్లలు, యువకులు ప్రాణా ల విలువ గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. ముందస్తుగా హెచ్చరించడం ద్వారా ప్రమాదాల బారినపడకుండా అప్రమత్తంగా ఉంటారు. నదులు, వాగుల వద్ద ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. అవసరమైన చోట నీటిమట్టం సూచించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. గతంలో ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు, ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటే చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. జిల్లావ్యాప్తంగా రేపు హోలీ సంబురాలు వాగులు, నదుల వద్ద స్నానాలు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలకు ఆస్కారంహోలీ వేడుకల్లో మద్యం సేవించడం, విందులు జరుపుకోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇవి శృతిమించితే రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. మద్యం తాగి నదులకు స్నానాలకు వెళ్లేటప్పుడు అత్యుత్సాహంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు మార్కెట్లో రంగులు ప్రమాదకరంగా ఉంటున్నాయి. రసాయన రంగులు వినియోగించడం ద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. మార్కెట్లో ఎక్కువగా కాఫర్సల్ఫేట్, కాల్షియం క్రోమియం, లిరాకై ్సడ్ వంటి రసాయనాలను సాధారణంగా బట్టలకు రంగులు వేయడానికి వినియోగిస్తుంటారు. వీటిని చర్మంపై చల్లుకోవడం ద్వారా చర్మ సంబంధమైన వ్యాధులు, కళ్లలో పడితే కంటి సంబంధిత వ్యాధులు, ముక్కు, నోటిద్వారా శ్వాసనాళాల్లోకి వెళ్లినా, జీర్ణాశయంలోకి వెళ్లినా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీటిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సహజంగా ప్రకృతి పదార్థాలతో తయారు చేసే రంగులను వినియోగించడం శ్రేయస్కరం.గతేడాది హోలీ పండుగ కౌటాల మండలంలో విషాదం నింపింది. పండుగ సంబురాల అనంతరం నదికి స్నానానికి వెళ్లిన కౌటాల మండల కేంద్రానికి ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. పండుగ రోజు చేతికందిన కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబాలు తీరని దుఃఖంలో మునిగిపోయాయి.. పండుగ సమయంలో ఏమరుపాటుగా ఉంటే జరిగే ప్రమాదాలకు ఈ ఘటన నిదర్శనం.. ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం.ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆసిఫాబాద్అర్బన్: జిల్లా ప్రజలు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు వేడుకలు ముగించుకోవాలని సూచించారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు, నీటిని చల్లొద్దన్నారు. నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులను వాడొద్దన్నారు. మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధమని, మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
కూలీలకు వంద పనిదినాలు కల్పించాలి
పెంచికల్పేట్(ఆసిఫాబాద్): ఉపాధిహామీ పథకంలో కూలీలకు వంద పనిదినాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాబ్కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి పనిదినాలు కల్పించాలన్నారు. పనులను ముందుగా గుర్తించి సుమారు వందమంది కూలీలు పనిచేసేలా ప్రోత్సహించా లని సూచించారు. పంచాయతీల్లోని నర్సరీలను ప్రతిరోజూ సందర్శించి మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు ఉన్నారు. -
మహిళల అభ్యున్నతికి చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: మహిళల అభ్యున్నతి, రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా సీ్త్ర, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు బ్యాంకు లింకేజీ ద్వారా స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గృహ హింస, లైంగిక వేధింపుల బాధితులకు సఖి కేంద్రం ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బేటీ పడావో.. బేటీ బచావో కార్యక్రమం ద్వారా బాలికల్లో అక్షరాస్యత పెరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో మోటివేషన్ స్పీకర్లను నియమించినట్లు తెలిపారు. భావితరాలకు మహిళలు ఆదర్శంగా నిలవాలని, ఉన్నత లక్ష్యాలు సాధించాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సూచించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబం, సమాజం వారిని గుర్తిస్తుందన్నారు. ఆత్మ నూన్యత భావన విడిచి ముందడుగు వేయాలని సూచించారు. భ్రూణ హత్యలు, బాల్యవివాహా లు అరికట్టినప్పుడే సమాజం అభివృద్ధి వైపు పయనిస్తుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, సీడీపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీ, హౌజింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కా ర్యదర్శులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీ క్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణా ళికతో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వందశాతం ఆస్తిపన్నులు వసూలు చేసేలా అధి కారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. లేఅవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్– 2020లో భాగంగా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత గల వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, జాబ్కార్డు కలిగిన వారికి వందరోజుల ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం, సాయంత్రం పనులు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాకు ఇంటిగ్రేటెడ్ గురుకులం
● ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు ● వాంకిడి మండలం ఇందాని శివారులో స్థలం పరిశీలన ● రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాద్రూరల్: పేదరికాన్ని రూపుమాపే ఏకై క ఆయుధం విద్య మాత్రమే.. పేద కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వాంకిడి మండలం ఇందాని సమీపంలో ప్రభు త్వ స్థలాన్ని ఇటీవల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావు, అధికారులు తదితరులు పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థలం గుర్తింపుబడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు 25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవనాలు నిర్మించనున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా వసతులు కల్పించనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీ జిల్లాలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 25 ఎకరాల స్థలం అందుబాటులో లేకపోవడంతో వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో 321 సర్వే నంబర్లో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లా కేంద్రానికి సమీపంలో నిర్మిస్తే అన్ని మండలాల విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో పరిస్థితి..జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు కలిపి మొత్తం 1,265 ఉన్నాయి. ఇందులో కళాశాలలు 17, పాఠశాలలు 1,248. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా చోట్ల 1,03,264 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2,898 మంది విద్యార్థులు, ఏడు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2,917 మంది, 38 ఆశ్రమ పాఠశాలల్లో 7,065 మంది, 15 కేజీబీవీల్లో 3,917 మంది, ఐదు బీసీ జ్యోతిబా పూలే గురుకులాల్లో 2,215 మంది, మూడు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 1,185 మంది, రెండు మోడల్ స్కూళ్లలో 1,304 మంది, 19 ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్ వసతి గృహలు, ఎస్సీ బాలబాలికల వసతి గృహాల్లో 385 మంది, 11 బీసీ వసతి గృహల్లో 789 మంది, 107 ప్రైవేట్ పాఠశాలల్లో 29,779 మంది, 732 ప్రభుత్వ పాఠశాలల్లో 43,110 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండాలి ఆసిఫాబాద్కు సమీపంలో చాలా వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. జిల్లా కేంద్రం పరిధిలో ఐదు కి.మీ.ల దూరంలో సమీకృత గురుకులం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ఆదర్శ డిగ్రీ కళాశాలను బెండారలో ఏర్పాటు చేయడంతో దూరభారంతో విద్యార్థులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. – తిరుపతి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
విద్యార్థులకు సమస్యలు రానీయొద్దు
వాంకిడి(ఆసిఫాబాద్): బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రానీయొద్దని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సజీవన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వసతిగృహాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూం, వంటగది, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా మెనూ పాటిస్తూ ప్రతిరోజూ ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్నారు. వసతిగృహాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు పూర్తినమ్మకంతో కష్టపడి చదవాలన్నారు. పరీక్షల తీరుపై అవగాహన కల్పించారు. ఆయన వెంట బీసీ హాస్టల్ వార్డెన్ మధుకర్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ తిరుపతి తదితరులు ఉన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరును నామకరణం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం అంబేడ్కర్ చౌక్ వద్ద పద్మశాలీ సేవా సంఘం సభ్యులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు మాట్లాడుతూ వాంకిడి మండల కేంద్రానికి చెందిన కొండాలక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులు సైతం లెక్కచేయలేదన్నారు. వాంకిడిలో సేవాసదన్ సంస్థకు చెందిన భూమిలో బాపూజీ స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎమ్మెల్సీ దండె విఠల్ రూ.30లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, శ్రీకాంత్, లింగయ్య, పుష్పలత, సునీత, ఇరుకుల మంగ, ప్రణయ్, భద్రయ్య, శ్యాం, శైలేందర్, శ్రీనివాస్, ధర్మయ్య, సత్యనారాయణ, మహేష్, మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగోసె శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
దాహం తీరేదెలా..?
● జిల్లాలో మండుతున్న ఎండలు ● అటవీ ప్రాంతాల్లో నీటి కరువు ● తాగునీటి కోసం మైదాన ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ● పొంచి ఉన్న వేటగాళ్ల ముప్పుపెంచికల్పేట్(సిర్పూర్): మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరువయ్యాయి. వేడి, పొడి వాతావరణంతో అడవుల్లోని సహజ నీటి వనరులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఫలితంగా అటవీ ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. ఎండలు మొదలై 15 నుంచి 20 రోజులవుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నీటి వసతి కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. దాహానికి తట్టుకోలేక వన్యప్రాణులు నీటి వనరులను వెతుక్కుంటూ అడవులను విడిచి మైదాన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో అటవీ జంతువులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. అలాగే వీధికుక్కల దాడిలోనూ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. 6,04,172 ఎకరాల్లో అడవులుజిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లలో 11 రేంజ్లు, 79 సెక్షన్లు, 245 బీట్లు, 846 కంపార్టుమెంట్లు ఉన్నా యి. జిల్లావ్యాప్తంగా 6,04,172 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. పెద్దపులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, జింకలు, మెకాలు, దుప్పులు, నీలు గాయి, కొండగొర్రెలు, అడవి పందులతోపాటు అనేక రకాల అరుదైన జంతువులు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో గడ్డి మైదానా లు, నీటి ఊటలు ఉన్నాయి. నిత్యం నీటితో కళకళలాడే పెన్గంగ, ప్రాణహిత నదులు, పెద్దవాగు వ న్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. జిల్లాలోని ము ఖ్యమైన ప్రాంతాల్లో అటవీ జంతువుల దాహం తీ ర్చడానికి అధికారులు 159 సాసర్పిట్లు, 19 సోలా ర్ నీటి కుంటలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వేసవిలో నీటి వనరులు అడుగంటిపోతాయి. ఈ సమయంలో అధికారులు ఏర్పాటు చేసే నీటికుంటలు, సాసర్ పిట్లే వాటికి ఆధారం. పొంచి ఉన్న ముప్పు..ఎండాకాలంలో అడవి జంతువులకు నీటి సౌకర్యం కల్పించడం, వేటగాళ్ల బారి నుంచి కాపాడటం అఽధికారులకు సవాలుగా మారింది. అడవుల నుంచి దాహంతో మైదాన ప్రాంతాల్లోకి వస్తున్న వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉంది. నిరంతరం నీరు లభించే ప్రాంతాలు వేటగాళ్లకు అనుకూలంగా మారాయి. నీటివసతి ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, ఉచ్చులు బిగించి వన్యప్రాణులను వేటాడుతున్నారు. మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్చిలోనే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వేడికి అల్లాడుతున్న వన్యప్రాణులు ఏప్రిల్, మేలో వేటగాళ్ల ఉచ్చులకు బలయ్యే అవకాశం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.పెంచికల్పేట్ రేంజ్లో నీరు లేక ఖాళీగా ఉన్న సాసర్పిట్జిల్లా వివరాలుఫారెస్టు సాసర్ సోలార్ రేంజ్లు పిట్లు కుంటలు పెంచికల్పేట్ 15 5 బెజ్జూర్ 26 1 కాగజ్నగర్ 22 8 సిర్పూర్(టి) 22 2 కర్జెల్లి 29 1 రెబ్బెన 10 2 ఆసిఫాబాద్ 15 0 జోడేఘాట్ 5 0 కెరమెరి 5 0 తిర్యాణి 5 0 గిన్నెధరి 5 0 ఖాళీగా సాసర్పిట్లు..వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ఆయా రేంజ్ల పరిధిలో ఏర్పాటు చేసిన నీటికుంటలు, సాసర్పిట్లు, సోలార్ నీటి కుంటలు అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయి. సాసర్పిట్లలో ట్యాంకర్ల ద్వారా వారం రోజులకు ఒకసారి నీటితో నింపాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వన్యప్రాణుల కోసం ఉప్పుగడ్డలు మాత్రం నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏడాదిగా కంపా నిధులు నిలిచిపోవడంతో అడవి జంతువుల దాహార్తి తీర్చడం అటవీశాఖ అధికారులకు భారంగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం ఎండల తీవ్రతతో అడవిలోని సహజ వనరులు ఎండిపోతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు రాగానే సాసర్పిట్లలో నీటిని నింపే ప్రక్రియ ప్రారంభిస్తాం. వన్యప్రాణులు మైదాన ప్రాంతాల్లోకి వస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. వన్యప్రాణులను వేటాడితే కేసులు నమోదు చేస్తాం. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ -
వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
రెబ్బెన: వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల ని ట్రాన్స్కో ఎస్ఈ రాథోడ్ శేషారావు అన్నా రు. మండలంలోని నంబాల సబ్స్టేషన్లో కొ త్తగా ఏర్పాటు చేసిన బ్రేకర్ను మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కొత్త బ్రేకర్ను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సత్వరమే వాటిని పరిష్కరించి విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. డీఈఈ వీరేశం, ఏడీఈ ఫిరోజ్ఖాన్, సంతోష్, ఏఈ ఇమ్రాన్, సిబ్బంది రయీస్, సురేశ్, హరీశ్, సత్తయ్య, నసీరుద్దీన్, మధు పాల్గొన్నారు. -
నాణ్యతతో పనులు చేపట్టాలి
ఆసిఫాబాద్అర్బన్: ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల్లో నాణ్య త పాటించాలని పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ సూర్యప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వి విధ మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద పనులు చేపడుతున్న ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులకు పంచాయతీరాజ్ ఈఈ ప్రభాక ర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఈ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో పనులు పూర్తిచేయడంతోపాటు నాణ్యత ప్రమాణాలు పాటించి నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నా రు. రానున్న రోజుల్లో నాణ్యత పరీక్షించిన త ర్వాతే బిల్లుల చెల్లింపులు జరుగుతాయని స్ప ష్టం చేశారు. పనులు పూర్తిచేయడంలో అలసత్వం ప్రదర్శించొద్దని హెచ్చరించారు. సమావేశంలో డీఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల ని డీవైఎఫ్ఐ, టీఏజీఎస్ నాయకులు మంగళవారం కలెక్టరేట్లో ఏవో మధుకర్కు వినతిపత్రం అందించారు. నాయకులు కార్తీక్, మాల శ్రీ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజ లకు కనీస వసతులు కూడా లేవన్నారు. ట్రా ఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బంది ప డుతున్నారని, వ్యాపారులు పగటిపూటే భారీ వాహనాలు రోడ్లపై నిలుపుతున్నారని ఆరో పించారు. గోదాంలను కాలనీల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నా రు. పట్టణంలో సులభ్ కాంప్లెక్స్లు, పా ర్కింగ్ స్థలాలు, తాగునీటి కోసం చలివేంద్రాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జన్కాపూర్ మైదానానికి ప్రహరీ నిర్మించి, సెక్యూరిటీ పెంచాలన్నారు. నాయకులు శ్రావణి తదితరులు ఉన్నారు. -
డోర్లి–2 ఓసీపీ సందర్శన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన డోర్లి– 2 ఓసీపీని మంగళవారం కోల్ కంట్రోల్ అధికారులు సందర్శించారు. నాగ్పూర్ కోల్ కంట్రోల్ కార్యాలయ ఓఎస్డీ సందీప్ ఎస్ పరాంజ పేతో పాటు కొత్తగూడెం కోల్ కంట్రోల్ కార్యాలయ ఓఎస్డీ డీవీ సుబ్రమణ్యం ఏరియా అధికారులతో కలిసి మూతపడిన గని, పరిసర ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం చేపట్టిన పర్యావరణ పనులు, ఓసీపీ వద్ద నాటిన మొక్కలు, ఎదిగిన వృక్షాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న నీటి నిర్వహణ, మృతిక సంరక్షణ చర్యల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గోలే టి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో ఇన్చార్జి జీఎం నరేందర్ కోల్ కంట్రోల్ అధికారులకు ఏరి యా స్థితిగతుల వివరాలను వెల్లడించారు. కార్యక్రమాల్లో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా సర్వే అధికారి ఆప్సర్ పాషా, డీవైఎఎస్వో శేఖర్, కార్పొరేట్ అదనపు మేనేజర్లు తిరుపతి, బాబ్జీ, డోర్లి– 2 మేనేజర్ మహేశ్, ఎన్విరాన్మెంట్ అధికారి హరీశ్, ఫారెస్టు అధికారి రమణారెడ్డి, ఎస్టేట్ అధికారి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశీలిస్తున్న కోల్ కంట్రోల్ అధికారులు -
పదోన్నతితో మరింత బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్/కెరమెరి: పదోన్నతితో ఉద్యోగిపై మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. కెరమెరి పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జాదవ్ ఉల్లాస్ ఎస్సైగా పదోన్నతి పొందగా, సోమవారం జిల్లా కేంద్రంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. 1989లో ఉల్లాస్ పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం పొందగా 2012లో హెడ్ కానిస్టేబుల్, 2000లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయనను జైనూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా నియమించారు. గతంలో ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, సోన్, నీల్వాయి, కెరమెరి పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎస్పీకి మొక్క అందిస్తున్న ఎస్సై ఉల్లాస్ -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● కలెక్టరేట్లో ప్రజావాణి ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణిలో ప్రజలు అందించే అర్జీలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అద నపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన పట్టా భూమికి హద్దులు నిర్ధారించాలని రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన మసాడి రాజేశ్వరి దరఖాస్తు చేసుకుంది. ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులో చేపలు పెంచడానికి అవకాశం కల్పించా లని తిర్యాణి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు కోరారు. తన పట్టా భూమిని నిషే ధిత జాబితా నుంచి తొలగించాలని బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన చాపిడి శంకర్ విన్నవించాడు. దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లికి చెందిన చౌదరి ఓంకార్ వినతిపత్రం సమర్పించాడు. ప్రస్తుతం తాను సాగు చేసుకుంటున్న భూమికి పట్టా మంజూరు చేయాలని బెజ్జూర్ మండలం ముంజంపల్లికి చెందిన నికోడే లచ్చుంబాయి వేడుకుంది. సదరం సర్టిఫికెట్ అందించాలని కౌటాల మండలానికి చెందిన శంకర్ కోరాడు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలానికి చెందిన మురళీ, మహేందర్ దరఖాస్తు చేసుకున్నారు. వాంకిడి మండలం సరండి శివారులోని భూమిని ధరణి పోర్టల్లో నమోదు చేయాలని రాజేశ్వర్ విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు నిర్ణీత గడువులోగా న్యాయం చేయాలన్నారు. వేతనం రావడం లేదు చింతలమానెపల్లి మండలం డబ్బా రైతువేదికలో 2021 నుంచి వాచ్మెన్గా పనిచేస్తున్నా. ప్రారంభంలో మూడు నెలలు సక్రమంగా చెల్లించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు వేతనం రావడం లేదు. – నక్క జగానంద్, చింతలమానెపల్లి -
ఉపాధికి నిబంధనాలు
● కొత్త జాబ్కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం ● జాబ్కార్డు లేక ఉపాధికి దూరమవుతున్న కూలీలు ● ‘ఆత్మీయ భరోసా’తో గ్రామాల్లో పెరిగిన డిమాండ్రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కొత్త జాబ్కార్డుల మంజూరులో విధించిన నిబంధనలు కొత్త కూలీల పాలిట శాపంగా మారింది. కొన్ని నెలలుగా కొత్తగా కార్డులు జారీని నిలిపివేయడంతో అర్హులకు ఉపాధి దక్కడం లేదు. ఉపాధిహామీ చట్టం ప్రకారం ఆసక్తి చూపే ప్రతీ కూలీకి తప్పనిసరిగా పనులు కల్పించాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు చట్టానికే తూట్లు పొడుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. వేసవిలో ఉపాధి పనులే దిక్కు..జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రజలంతా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. జనవరి నాటికే వానాకాలం పంటల సీజన్ పూర్తవుతుంది. వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు ఉపాధిహామీ పనులే దిక్కుగా మారుతాయి. జనవరి నుంచి జూన్ వరకు కొనసాగే ఉపాధిహామీ పనులు వేసవిలో కూలీలకు బాసటగా నిలుస్తున్నాయి. ఈజీఎస్ కింద కూలీలకు చెల్లించే రోజువారి కూలి సైతం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏటా జిల్లాలో ఉపాధిహామీ పనులు చేసే కూలీల సంఖ్య సైతం పెరుగుతోంది. జిల్లాలో మంజూరైన జాబ్కార్డులకు, పనిచేసే కూలీల సంఖ్యకు పొంతన ఉండటం లేదు. అధికారులు జిల్లాలో 1,23,035 జాబ్కార్డులను మంజూరు చేయగా, ప్రస్తుతం కేవలం 91,721 జాబ్కార్డులు మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి. 2,43,969 మంది కూలీలు ఉండగా 1,70,268 మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు. పెరిగిన డిమాండ్అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థికసాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేసి భూమి లేని నిరుపేదలకు ఆర్థికసాయం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే పేదలను గుర్తించేందుకు ఉపాధిహామీ పథకంలో ఏడాదిలో కనీసం 20 రోజులపాటు పనిచేయాలని నిబంధన విధించారు. జనవరిలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు రూ.6వేల నగదు అందించింది. దీంతో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకే ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందనే భావనతో గ్రామీణ ప్రాంత ప్రజలు పనుల కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. భూములు ఉన్న రైతులు సైతం కొత్తగా జాబ్కార్డుల కోసం ఆసక్తి చూపుతున్నారు. ఈజీఎస్ అధికారులు కొత్త జాబ్కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో దరఖాస్తులు స్వీకరించి దగ్గర పెట్టుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే జాబ్కార్డులు ఉన్న కూలీలు పూర్తిస్థాయిలో పనులకు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గతంలో స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను కూడా జాబ్కార్డులు ఉన్న వారికి మాత్రమే మంజూరు చేశారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయి బిల్లులు తీసుకున్న వారు జాబ్కార్డులను పక్కన పడేశారు. రైతులు సైతం వ్యవసాయ భూముల్లో పనుల కోసం జాబ్కార్డులు తీసుకుని పనులు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో పనిచేసే కూలీల సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు కొత్త జాబ్కార్డుల మంజూరు, మార్పులు చేర్పులపై ఆంక్షలు విధించడంతో కొత్తగా పని చేసేందుకు ఇష్టపడుతున్న కూలీలపై ప్రభావం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు జాబ్కార్డులు మంజూరు చేసి పనులు కల్పించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.విచారణ తర్వాతే జారీ ఉపాధిహామీ పనులు చేసేందుకు జాబ్కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా జారీ చేస్తాం. కానీ ఆత్మీయ భరోసా పథకం వర్తించాలనే కోరికతో జాబ్కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. అ లాంటి వాటిని విచారణ చేపడతాం. ప్రభుత్వం ఉ పాధిహామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తుండటంతో కొత్త జాబ్కార్డు ల కోసం చాలామంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. అర్హత ఉంటేనే కొత్త జాబ్కార్డు ఇస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవోనిలిచిన కొత్త కార్డుల జారీవేసవిలో చేసేందుకు పనులు లేక ఉపాధి కోసం ఆరాటపడే కూలీలకు ఉపాధిహామీ వరంలా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్కార్డుల మంజూరును తాత్కాలికంగా నిలిపివేయడంతో కొత్తగా పనులు చేసేందుకు ఆసక్తి చూపే కూలీలు ఉపాధి పనులకు దూరమవుతున్నారు. కొత్త జాబ్కార్డుల జారీతోపాటు పాత జాబ్కార్డులో పేర్ల తొలగింపులు, చేర్పుల ప్రక్రియపై సైతం నిబంధనలు విధించింది. చనిపోయిన కూలీల పేర్ల తొలగింపు ప్రక్రియ సైతం నిలిచిపోవడంతో పనిచేసే కూలీల సంఖ్య తగ్గుతోంది. పెళ్లికి ముందు తల్లిదండ్రులతో కలిసి జీవించి వివాహ అనంతరం వేరు కాపురం ప్రారంభించిన కుమారులకు సైతం కొత్త జాబ్కార్డులు రావడం లేదు. పలువురు పనులు చేసేందుకు ముందుకొస్తున్నా అధికారులు వారికి అవకాశం కల్పించలేకపోతున్నారు. చేసేదేమీ లేక కూలీలు ఇతర పనులను వెతుక్కుంటున్నారు. వేసవి ప్రారంభం కావడంతో పనుల కోసం కూలీలు వలస వెళ్లాల్సి వస్తోంది. -
ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని సీపీఎం పార్టీ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని వట్టివాగు, అడ ప్రాజెక్టు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టుల్లో నీరున్నా పంటల సాగుకు ఉపయోగపడటం లేదన్నారు. కాలువలకు మరమ్మతులు లేకపోవడం, అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన్న, నాయకులు దినకర్, శ్రీనివాస్, ఆనంద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,046 మంది విద్యార్థులకు 4,917 మంది హాజరుకాగా, 129 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,315 మందికి 4,207 మంది, ఒకేషనల్ వి భాగంలో 731 మందికి 710 మంది హాజరయ్యారని డీఐఈవో కళ్యాణి తెలిపారు. ఆసిఫాబాద్, కౌటాల, దహెగాంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలిజిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సౌకర్యాల కల్పన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. -
డిగ్రీ విద్యార్థినుల ప్రతిభ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న మహిళా డిగ్రీ గురుకులానికి చెందిన విద్యార్థినులు మౌంటెన్ బైక్ సైక్లింగ్లో ఉత్తమ ప్రతిభ చూపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శారద సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన తొమ్మిదో రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్లో కళాశాలకు చెందిన స్నేహ టైం ట్రయల్ 20 కిలోమీటర్లు, మాస్ స్టార్ట్స్ 40 కిలోమీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించిందని తెలిపారు. అలాగే వాణిశ్రీ రజత పతకం, ప్రియాంక కాంస్య పతకం, శ్రీదేవి రజత పతకం సాధించారని వెల్లడించారు. విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని పీడీ హారిక ఆకాంక్షించారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పదో తరగతి విద్యార్థులు వా ర్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏటీడీవో శ్రీనివాస్ అన్నారు. మండలంలో ని జోడేఘాట్, బాబేఝరి, హట్టి ఆశ్రమ పాఠశాలలను సోమవా రం సందర్శించారు. పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలకు పరిశీలించారు. వార్షిక పరీక్షలకు పది రోజులే గడువు ఉన్నందున కష్టపడి చదవాలన్నారు. ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు మోతీరాం, జంగు, పంచఫుల తదితరులు ఉన్నారు. -
అందవెల్లి వంతెనపై రాకపోకలు షురూ
దహెగాం(సిర్పూర్): కాగజ్నగర్ మండలం అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికావడంతో సోమవారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. 2021లో భారీ వరదలకు పెద్దవాగు ఉప్పొంగి వంతెన కుంగిన విషయం తెలిసిందే. మరోసారి వరదలు వచ్చి వంతెన మరింత కుంగి ప్రమాదకరంగా మారింది. 2023లో వంతెన కూలడంతో పూ ర్తిగా రాకపోకలు నిలి చిపోయాయి. వాగులో తాత్కాలిక రోడ్డు వేసి రాకపోకలు సాగించా రు. గతేడాది వంతెన మరమ్మతులు పూర్తి కాగా, వర్షాకాలంలో మట్టితో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు వేసి ప్రయాణాలు పునరుద్ధరించారు. గత నెలలో మళ్లీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించడంతో మ రోసారి వాగులో నుంచి తాత్కాలిక రోడ్డు వే శారు. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికావడంతో వాహనాల రాకపోకలకు అనుమతించారు. -
దివ్యాంగులకు యూనిక్ డిజేబులిటీ ఐడీ
ఆసిఫాబాద్అర్బన్: ప్రస్తుతం అందిస్తున్న సద రం సర్టిఫికెట్ స్థానంలో దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం యూనిక్ డిజేబులిటీ ఐడీలను అందుబాటులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివా రితో కలిసి జిల్లా పరిషత్, జిల్లా సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమి షనర్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులకు అవగా హన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ దివ్యాంగులకు 21 కేటగిరీల్లో యూడీఐడీ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉన్న వారికి స్పీడ్ పోస్టు ద్వారా కార్డులు పంపిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగుల సౌ కర్యార్థం ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి భాస్కర్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తుజిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఈవీ ఎం గోదాంను సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. -
ఉద్యోగులకు అభినందన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీ గడిచిన ఫిబ్రవరిలో అధిక ఉత్పత్తిని సాధించడంతో ఓసీపీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అభినందించారు. సోమవారం కై రిగూడ ఓసీపీని సందర్శించి కై రిగూడ ఓసీపీ 135 శాతం బొగ్గు ఉత్పత్తి సాధనకు కృషి చేసిన ఉద్యోగులను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియాకు 37.5లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 21 రోజుల గడువు మిగిలి ఉందని, వందశాతం ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు మొ గిళి, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, సేఫ్టీ అధికారి నారా యణ, మేనేజర్ శంకర్, డీవైపీఎం వేణు, నాయకులు శేషు, దివాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా క్రీడాకారులకు పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): హర్యానా రాష్ట్రంలోని కర్ణాల్లో జరిగిన 73వ ఆల్ ఇండియా పోలీస్ సెపక్తక్రా చాంపియన్షిప్ టీం ఈవెంట్లో రాష్ట్ర జట్టు తరుఫున బరిలో దిగిన జిల్లా క్రీడాకారులు కాంస్య పతకాలు సాధించినట్లు సెపక్తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్రెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 7 నుంచి జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ సెపక్తక్రా చాంపియన్షిప్లో రెబ్బెన మండలానికి చెందిన పోలీస్ క్రీడాకారులు ఆర్.వెంకటేశ్, ఆడే రాజేందర్, పి.గోపి అద్భుత ఆట తీరు ప్రదర్శించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు సాధించిన పోలీ స్ క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ ఉ మ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, బాల్బ్యాడ్మింటన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, సెపక్ తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష అభినందించారు. -
నిధులు రాక నిరుపయోగం
ఆసిఫాబాద్రూరల్: వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రైతువేదికల నిర్వహణ గాడితప్పింది. సర్కారు నుంచి నిధులు విడుదల కాకపోవడంతో వాటి పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ఇలా..జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 70 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. రైతులకు సాగులో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు 15 మండలాల్లో 70 రైతు వేదికలు నిర్మించారు. ఒక్కో దాని నిర్మాణానికి రూ.22 లక్షలు వెచ్చించారు. ఈ రైతు వేదికల నిర్వహణకు నెలకు కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేలు ఖర్చవుతుంది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల పాటు సక్రమంగా నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నిధుల విడుదల నిలిచిపోయింది. అప్పటి నుంచి వాటి నిర్వహణను పట్టించుకునే వారు కరువయ్యాయి. నిర్వహణ ఏఈవోలకు తలకు మించిన భారంగా మారింది. విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులు వారు సొంతంగా చెల్లించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. గ్రామాలకు దూరంగా నిర్మాణంజిల్లాలో 70 రైతువేదికలు ఉన్నాయి. నాలుగు నుంచి ఐదు పంచాయతీలను కలుపుకుని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి క్లస్టర్ ఒక రైతువేదిక నిర్మాణం చే పట్టారు. ఇందులో చాలావరకు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ సర్కారు ప్రతీ మంగళవా రం రైతునేస్తం కార్యక్రమం పేరుతో పంటల సాగు విధానంలో నూతన పద్ధతులు, అధిక దిగుబడి వి ధానాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయాధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున 15 రైతువేదికలను ఇందు కోసం వినియోగిస్తున్నారు. మిగిలినవి నిరుపయోగంగా ఉంటున్నాయి. కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు కూడా అందకపోవడంతో కొన్నిచో ట్ల మరుగుదొడ్లు నిర్మించలేదు. మరికొన్ని చోట్ల అసంపూర్తిగానే ఉన్నాయి. తాగు నీటి సదుపాయం లేదు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం ఎంపిక చేసిన రైతువేదికల్లో ప్రస్తుతం ప్రతీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులను ఆహ్వానిస్తున్నాం. రైతువేదికల స్థితిగతులపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నిధులు మంజూరు కాగానే వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, జిల్లా వ్యవసాయాధికారి గ్రామాలకు దూరంగా రైతువేదికలు 15 చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సేవలు మిగిలినవి అలంకారప్రాయమే.. -
నూతన బొగ్గు బ్లాక్లు సింగరేణికి కేటాయించాలి
● డిప్యూటీ సీఎంకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వినతి శ్రీరాంపూర్: సింగరేణికి నూతన గనులను కేటాయించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ నాయకులు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్లో భట్టి విక్రమార్క నివాసంలో ఆదివారం కలిశారు. వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. సింగరేణిలో కొత్త గనులను ఏర్పాటు చేస్తేనే సంస్థకు భవిష్యత్ ఉంటుందన్నారు. సత్తుపల్లి ఓసీపీ 3, ఇల్లెందు ఓసీపీ 3తోపా టు గతంలో అనుమతి ఇచ్చిన తాడిచర్ల గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు. వీటిలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీవీకే ఓసీపీ, కేటీకే ఓసీపీ, ఇల్లెందు ఓసీపీలలో బొగ్గు తీసే పనులను కాంట్రాక్టర్లతో కాకుండా సింగరేణి కార్మికులతో చేపట్టాలని కోరా రు. తమ విన్నపాలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని యూనియన్ నా యకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీయూసీకి చెందిన మిర్యాల రంగయ్య, కె.వీరభద్రయ్య, సారయ్య, వైవీ.రావు, మడ్డి ఎల్ల య్య, షేక్ బాజీసైదా, ఐఎన్టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, త్యాగరాజన్, సమ్మయ్య శంకర్రావు, వికాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గోలేటి భీమన్న జాతర
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటి గ్రామ శివారులో గల శ్రీ భీమన్న ఆలయంలో ఆదివారం జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భీమన్న దేవుడిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కోళ్లు, మేకలు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో వనభోజనాలు చేశారు. సాయంత్రం భీమన్న దేవుడి రథోత్సవం నిర్వహించారు. భీమన్న ఆలయంలో మొదటిసారిగా జాతర మహోత్సవం నిర్వహించగా, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీని ఎస్సై చంద్రశేఖర్ ప్రారంభించారు. -
వైద్యకళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ వైద్యకళాశాలకు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచా ర్య కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివా రం నిర్వహించిన అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభ వేదికపై ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. కళాశాల ఏర్పాటు నుంచీ జిల్లాకు చెందిన అనేక మంది తెలంగాణవాదులు, అభిమానులు మెడిక ల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నా మకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఉద్యమకారుడికి గుర్తింపు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మంత్రులు, కలెక్టర్తోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వ వైద్యకళాశాలకు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణం చేస్తామని సీఎం ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అంబులెన్స్లో కవలలు జననం
ఆసిఫాబాద్: ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన ఎం.హారిక ప్రసవం కోసం ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు, స్కానింగ్ చేసిన అనంతరం గర్భంలో కవలలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో 108 అంబులెన్స్లో మంచిర్యాలకు రెఫర్ చేశారు. అంబులెన్స్లో తరలిస్తుండగా రెబ్బెన సమీ పంలో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంటీ టెక్నీషి యన్ హెచ్.వెంకటేశ్, పైలెట్ ఆర్.కార్తీక్ తెలి పారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. -
సమాన పనికి సమాన వేతనం అందించాలి
ఆసిఫాబాద్రూరల్: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు. శనివా రం జిల్లా కేంద్రంలోని బాలికల డిగ్రీ కళాశాలలో ‘ప్రమాదంలో మహిళల హక్కులు– మన కర్తవ్యం’ అనే అంశంపై మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా చైల్డ్ కేర్ లీవ్ రెండేళ్లకు గాను ఇవ్వాలని, కాంట్రాక్ట్ సిస్టంలో పని చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో పని చేస్తున్న వారి కి భారతీయ లేబర్ కోడ్కు అనుగుణంగా మి నిమం పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు తిరుమల, శారద, సబిత తదితరులు పాల్గొన్నారు. -
● ‘పీఎంశ్రీ’ పాఠశాలలకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● విజ్ఞానయాత్రకు ప్రభుత్వ విద్యార్థులు ● ఒక్కొక్కరికి రూ.500 కేటాయింపు
కెరమెరి(ఆసిఫాబాద్): నిత్యం నాలుగు గోడల మ ధ్య పాఠ్యాంశాల్లో మునిగిపోయే విద్యార్థులు సాధారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీరికి కొంత ఊరట కలిగించేందుకు ఉపాధ్యాయులు ఏటా విద్యార్థులను సొంత ఖర్చులతో విజ్ఞాన, విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. అయితే సొంత డబ్బులు వెచ్చించే స్తోమత పేదింటి విద్యార్థులకు ఉండదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారు విహారయాత్రకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ (పీఎంశ్రీ) స్కీంను తెచ్చి జిల్లాలో 18 పాఠశాలలను ఇందుకు ఎంపిక చేసింది. ఈ పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. సర్కారు పాఠశాలల అభివృద్ధికి వివిధ రకాలుగా తోడ్పాటునందిస్తోంది. ఫర్నిచర్, పెయింటింగ్ ఇతర అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. దీంతో పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలలు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ.500 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేదకుటుంబాలకు చెందినవారే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి సర్కారు స్కూళ్లలో చదువుకుంటున్నవారే. ఇలాంటి వారికి బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు గాను విజ్ఞాన, విహారయాత్రల కోసం ఒక్కో విద్యార్థికి రూ.500 విడుదల చేసింది. దీంతో ఆయా పాఠశాలల నిర్వాహకులు విద్యార్థులకు సమీప చరిత్రాత్మక ప్రదేశాలను చూపించేందుకు విహార, విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తున్నారు. ఇటీవల పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల విద్యార్థులందరినీ అత్యధికంగా కెరమెరి మండలంలోని జోడేఘాట్తోపాటు చంద్రాపూర్లోని వి సాపూర్ బొటానికల్ గార్డెన్కు తీసుకెళ్తున్నారు. జోడేఘాట్లోని కుమురంభీమ్ మ్యూజియం, కుమురంభీమ్ ప్రతిమ, సమాధి, నృత్యం చేస్తున్న గుస్సాడీలు, ఆదివాసీల ఆభరణాలు, వాయిద్యాలు, వేటకు వాడే పనిముట్లు, ఆదివాసీల దేవతల ప్రతిమలను విద్యార్థులు తిలకించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రాపూర్లోని బొటానికల్ గార్డెన్లో మానవ శరీర నిర్మాణం, మైక్రోస్కోప్, 360 డిగ్రీస్ స్క్రీన్ కలిగిన థియేటర్లో త్రీడి ఎనిమల్ డాక్యుమెంటరీ, రాకెట్, న్యూటన్ నియమాలు, కండర వ్యవస్థ, ప్రపంచపు అతిపెద్ద పుష్పం, గుండె రక్తప్రసరణ, పాకే మొక్కల తీగలు తదితర అంశాల గురించి ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. విద్యార్థుల చేతికి ట్యాబ్లుసాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు మంజూరు చేయగా.. జాతీయ విద్యావిధానంలో భాగంగా పిల్ల లను సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు పీఎంశ్రీలో భాగంగా ట్యాబ్ల ద్వారా బోధిస్తున్నారు. పీఎంశ్రీకి 14 ఉన్నత పాఠశాలలు ఎంపిక కాగా ఒక్కోదానికి 25 ట్యాబ్ల చొప్పున మంజూరయ్యాయి. వీటిని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అందించి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు వినియోగిస్తున్నారు. జిల్లాలో పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలలుఉన్నత పాఠశాలలు 14ప్రాథమికోన్నత పాఠశాలలు 2ప్రాథమిక పాఠశాలలు 2విద్యార్థుల సంఖ్య 6,475 -
భద్రత కల్పనలో విఫలం
చింతలమానెపల్లి: హిందూ ఆలయాలకు భద్రత క ల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారని బీజే పీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆరోపించారు. మండలంలోని డబ్బా గ్రామంలోని సమ్మక్క–సారక్క ఆలయంలో జంపన్న గద్దె మంటల్లో కాలిపోయిన నేపథ్యంలో శనివారం ఆయన ఘటనాస్థలికి చేరుకుని మాట్లాడారు. ఆలయంలో జంపన్న గద్దె వద్ద మంటలు అంటుకుని కాలిపోవడం విచారకరమని తెలిపారు. మండలంలో గతంలో ఖర్జెల్లి ముసలమ్మ గుట్ట శివాలయంలో, మండల కేంద్రంలోని చిలకలయ్య ఆలయంలో పలువురు దుశ్చర్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భద్రత వైఫల్యాల కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినశిక్ష విధించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జంపన్న గద్దె మంటల్లో కాలిపోవడంలో వస్తున్న అనుమానాలను పోలీసులు నివృత్తి చేయాలని కోరారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని డి మాండ్ చేశారు. ఆలయాల భద్రత విషయంపై పో లీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలి పారు. అక్కడికి చేరుకున్న కౌటాల సీఐ రమేశ్, ఎ స్సై నరేశ్ ఆయనతో మాట్లాడుతూ.. సమ్మక్క గద్దె ల వద్ద సెక్యూరిటీ కెమెరా ఏర్పాటు చేశామని తెలి పారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు డోకె రామన్న, కౌటాల అధ్యక్షుడు కుంచాల విజయ్, నాయకుడు ఎల్ములె మల్లయ్య తదితరులున్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆసిఫాబాద్అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సెషన్ జడ్జి ఎంవీ రమేశ్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కో ర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్, జూ నియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి జిల్లా, జడ్జి సతీ మణితో పాటు మహిళా న్యాయమూర్తులు, సి బ్బందిని శాలువాలతో సన్మానించారు. పూల మొక్క బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ఏదైనా సాధించవచ్చని, ప్రతీ ఒక్కరికి విద్య ప్రాముఖ్యతను వివరించాలని పేర్కొన్నారు. మహిళా న్యాయవాదులు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్, గాయత్రి, మధురిమ, స్వప్న, ప్రత్యూష, సురేశ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
పోచమ్మ ఆలయంలో హోమం
బెజ్జూర్: మండల కేంద్రంలో నూతనంగా ని ర్మించిన పోచమ్మ ఆలయంలో శనివారం హో మం నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి విగ్రహాన్ని భాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది వారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మ ధ్య నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదా నం చేశారు. నాయకులు మనోహర్గౌడ్, శ్రీవర్ధన్, చంద్రశేఖర్, భాస్కర్రాజు, తిరుపతి, మహేశ్, ఇస్తారి, శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఫీజు రాయితీని వినియోగించుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● ఎల్ఆర్ఎస్పై అవగాహన ఆసిఫాబాద్: ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కల్పించిన ఫీజు రాయితీని యజమానులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూ చించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దరఖాస్తుదారులు, సబ్రిజి స్ట్రార్ రైటర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించిందని తెలిపారు. ఈ నెల 31లోపు ఫీజు చె ల్లించినవారికి 25 శాతం రాయితీ ఇవ్వనుందని పే ర్కొన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల పరిధిలో 3,529 దరఖాస్తులు రా గా, 3,102 దరఖాస్తులను గుర్తించి ఎల్ఆర్ఎస్ చే సుకోవాలని లేఖలు పంపించినట్లు తెలిపారు. 335 గ్రామపంచాయతీల పరిధిలో 4,170 దరఖాస్తులు రాగా, 1,665 పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నా రు. ఇప్పటివరకు 32 మంది ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించి ప్రొసీడింగులు పొందినట్లు తెలిపారు. గతంలోలాగా కాకుండా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ రు సుం చెల్లిస్తే సంబంధిత అధికారులు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ రుణసౌకర్యం కూడా పొందవచ్చని తెలిపారు. సమస్యలు ని వృత్తి చేసుకునేందుకు గ్రామపంచాయతీ, మున్సి పల్ అధికారులను నేరుగా సంప్రదించాలని పేర్కొన్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీ హెల్ప్ డెస్క్ను 6300688040, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ హెల్ప్ డెస్క్ను 966648821 నంబర్లలో, గ్రామపంచాయతీల్లో కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, టౌన్ప్లానింగ్ అధికారి యశ్వంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాల అభివృద్ధికి మరో అవకాశం
ఆసిఫాబాద్: మహిళా సంఘాల అభివృద్ధి కో సం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సంఘాల అభివృద్ధి దిశగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం మహిళా సంఘాల అద్దె బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి వెళ్లిన రెండు బస్సులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా దినో త్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ప్రతీ మహిళా సమాఖ్యకు ఒక బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నుంచి 100 మంది మహిళా సంఘాల సభ్యులు రెండు బస్సుల్లో వెళ్లినట్లు పేర్కొన్నారు. -
సమాన పనికి సమాన వేతనం అందించాలి
ఆసిఫాబాద్రూరల్: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు. శనివా రం జిల్లా కేంద్రంలోని బాలికల డిగ్రీ కళాశాలలో ‘ప్రమాదంలో మహిళల హక్కులు– మన కర్తవ్యం’ అనే అంశంపై మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా చైల్డ్ కేర్ లీవ్ రెండేళ్లకు గాను ఇవ్వాలని, కాంట్రాక్ట్ సిస్టంలో పని చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో పని చేస్తున్న వారి కి భారతీయ లేబర్ కోడ్కు అనుగుణంగా మి నిమం పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు తిరుమల, శారద, సబిత తదితరులు పాల్గొన్నారు. -
● పని ప్రదేశంలో వసతులు కరువు ● ఎండలోనే పని చేస్తున్న కూలీలు ● అమలు కాని అదనపు భత్యాలు
గిట్టుబాటు కావడం లేదుగతంలో ఎండకాలం పనులు చేసినప్పుడు వేతనంతో పాటు వేసవి భత్యం అందజేసేవారు. ప్రస్తుతం ఎలాంటి అదనపు భత్యాలు లేకపోవడంతో కూలి గిట్టుబాటు కావడం లేదు. బయట వేరే పనులు దొరకకపోవడంతోనే ఉపాధి పనులకు వెళ్తున్నాం. – రమేశ్, ఉపాధి కూలీ, నవేగూడ, వాంకిడి మండలంమౌలిక వసతులు కల్పించాలిచాలాచోట్ల పని ప్రదేశాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. దీంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. పని ప్రదేశంలో తప్పనిసరిగా టెంట్, తాగునీటి సౌక్యరం కల్పించాలి. సౌక్యరాలు కల్పించకుంటే ఆందోళన చేస్తాం. – నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడుతిర్యాణి: దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభించిన నుంచి గ త మూడేళ్ల దాకా పనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాఫ్ట్వేర్ను వినియోగించారు. 2022వ ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రానికి సంబంధించిన సాఫ్ట్వేర్ వాడుతున్నారు. కాగా, ఉపాధి కూలీలకు క్షేత్రస్థాయిలో సరైన సౌక్యరాలు కల్పించకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 91,721 యాక్టీవ్ జాబ్ కార్డులుండగా.. 1,70,268 మంది కూలీలు పని చేస్తున్నారు. ఎండలోనే పనులు చేస్తూ.. జిల్లాలో వారంరోజులుగా ఎండలు జోరందుకున్నా యి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో న మోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే భా నుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జిల్లా అధికారుల ఆదేశాలతో పని ప్రదేశంలో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లతో పాటు తాగునీటి సదుపాయం క ల్పించారు. కూలీలకు గాయాలైనప్పుడు చికిత్స అందించేందుకు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచారు. కానీ.. ఈ ఏడాది పనులు ప్రారంభమై రెండు వారాలైనా ఇప్పటివరకు చాలా పని ప్రదేశాల్లో కూలీలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో వారు ఎండలోనే పనులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కూలీలకు పని ప్రదేశంలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఒక్కో కూలీకి రూ.2.50 చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానరాని అదనపు భత్యం పాత సాఫ్ట్వేర్లో వేసవి భత్యం పేరిట ఫిబ్రవరి నుంచి జూన్ వరకు చేసిన పనికి వచ్చే వేతనంతో పాటుగా 20–35శాతం వరకు ఆదనంగా కలిపి ఇ చ్చేవారు. అంతే కాకుండా పని ప్రదేశం ఊరి నుంచి ఐదు కిలో మీటర్ల కన్నా దూరంగా ఉంటే కిలో మీట రుకు కొంత చొప్పున జమచేయడంతో పాటు పార, గడ్డపార వినియోగించినందుకు కూలీలకు అదనపు భత్యం అందజేసేవారు. గతంలో గడ్డపారలు కూ డా ప్రభుత్వమే కూలీలకు ఉచితంగా సరఫరా చేసే ది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చెల్లింపులు చేపట్ట డం లేదు. దీంతో కూలీలకు వేతనం గిట్టుబాటు కాక ఉపాధి పనులపై అనాసక్తి చూపుతున్నారు.అసౌకర్యాల ‘ఉపాధి’ఈ చిత్రంలో కనిపిస్తున్నది తిర్యాణి మండలం చింతపెల్లి పంచాయతీ పరిధి చెలిమల వాగు వద్ద చేపల కుంటలో పూడిక తీస్తున్న కూలీలు. నిబంధనల ప్రకారం పంచాయతీ అధికారులు పని ప్రదేశంలో టెంట్, తాగునీరు, ఫస్ట్ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ.. ఇక్కడ అవేమీ కనిపించలేదు. ఎండలోనే కూలీలు పనులు చేస్తున్నారు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీటినే తాగుతున్నారు. ఈ పరిస్థితి ఈ ఒక్కచోటే కాదు.. జిల్లాలోని అత్యధిక పని ప్రదేశాల్లో కనిపిస్తుంది. -
వేతనాలు చెల్లించాలని నిరసన
పెంచికల్పేట్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ఎల్కపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం పలువురు కా ర్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఎనగందుల తిరుపతి మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్లో బుచ్చక్క, జయ, సుగుణ, పంచా యతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మల్ల క్క, నిర్మలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికి వెంటనే జీతాలు మంజూరు చేయాలని కోరారు. వీరికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బీజేపీ నాయకుడు హరీశ్, కాంగ్రెస్ నాయకుడు రమేశ్ మద్దతు తెలిపారు. -
నల్లనేలలో నారీ శక్తి
● బొగ్గు ఉత్పత్తిలోనూ మహిళల శ్రమ ● పురుషులతో సమంగా అతివలు ● భూగర్భంలోకి దిగుతున్న వైనం ● సింగరేణిలో పెరుగుతున్న ప్రాధాన్యతసాక్షి ప్రతినిధి, మంచిర్యాల/శ్రీరాంపూర్/రెబ్బెన(ఆసిఫాబాద్): బొగ్గు గని అంటే చీకటి గుహ. మగవాళ్లకే పరిమితమైన విధులను మహిళలు సైతం చేసి చూపిస్తామని నిరూపిస్తున్నారు. ‘మీరేం పని చేస్తారు’ అన్న ఎగతాళీ నోళ్లకు ముక్కుతాడు వేస్తూ మహిళలు తలచుకుంటే ఏ పనైనా చేయగలమని నిరూపించారు. కంపెనీలో కారుణ్య ఉద్యోగాల కారణంగా మహిళల సంఖ్య 1995 మందికి చేరింది. గత కొంతకాలంగా భూగర్భంలో కూడా పని చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కంపెనీలో పని చేస్తున్న మహిళలపై కథనం..కోర్టు తీర్పుతో హక్కులు..బ్రిటీష్ కాలంలో పురుషులతోపాటు సమానంగా మహిళలు గనుల్లో పని చేసేవారు. ప్రమాదాలు నిత్యకృత్యంగా జరిగినా, తిండి లేక చావడం కంటే పిడికెడు మెతుకుల కోసం పనులకు వచ్చేవారు. ఎక్కువగా వితంతువులే ఈ పనులకు వెళ్లేవారు. దేశ స్వాతంత్య్రం వచ్చాక మహిళలను గనుల్లో తీసుకోవడం నిలిపివేశారు. ప్రమాదవశాత్తు గనుల్లో కార్మికులు చనిపోతే వారి స్థానంలో భార్యలకు ఉద్యోగం కల్పించే వారు. అది కూడా ఉపరితలంలోనే గుట్కాల షెడ్డులు, కార్యాలయాల్లో అటెండర్లుగా నియమించారు. మహిళలకు కూడా అవకాశాలు కల్పించాలనే ఓ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. అన్ని స్థాయిల్లో విధులుకారుణ్య కోటాలో మొదట జనరల్ మజ్దూర్(ఫిమేల్)గా నియమిస్తూ ఆఫీసులు, సివిల్ డిపార్టుమెంట్లలో తేలిక పాటి పనులకు తీసుకునే వారు. వీరి సంఖ్య పెరగడంతో ఓసీపీలు, వర్క్షాప్లు, స్టోర్స్, సీహెచ్పీలతోపాటు భూగర్భ గనుల్లో కూడా దిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓసీపీల్లో హెమ్ సెక్షన్లో పురుషులతోపాటు వీరు సమానంగా యంత్రాలను మరమ్మతు చేస్తున్నారు. సీనియర్ మహిళా కార్మికులు సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. జనరల్ మజ్దూర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, సబ్ ఓవర్సీస్ ట్రైనీ, స్టాఫ్నర్స్, క్లే పిల్ మజ్దూర్, స్వీపర్ బదిలీ వర్కర్లతోపాటు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అండర్ మేనేజర్లు, లా ఆఫీసర్స్ వంటి 27 హోదాల్లో పని చేస్తున్నారు. అడవుల రక్షణకు కట్టుబడి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అడవుల రక్షణకు కట్టుబడి పనిచేస్తున్నా. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ప్రజలు కూడా సహకరించినప్పుడే విధులు సులభతరం అవుతాయి. నా కుమార్తెను ఐఎఫ్ఎ్స్ చదివేందుకు సన్నద్ధం చేస్తున్నా. – స్వప్న, బీట్ అధికారి, సుర్దాపూర్ నిరంతరం అప్రమత్తం అడవిలో విధులు నిర్వర్తించడం మహిళలకు కష్టమైన పని. అయినా విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటాం. చిన్నతనం నుంచి యూనిఫాం విభాగంపై మక్కువ. డిగ్రీ తర్వాత అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేసిన అనంతరం అటవీశాఖ ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఇన్చార్జి రేంజ్ అధికారిగా పనిచేస్తున్నా. సమాజంలో పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలను గుర్తించాలి. – సరోజిని, రేంజ్ అధికారి, గిన్నెధరిఅధికారుల సహకారం అవసరం ఇతర శాఖలతో పోల్చితే అటవీ శాఖలో ఉద్యోగం కత్తిమీద సామే. 24 గంటలపాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతాధికారుల సహకారం లేకుండా పనిచేయడం ఇబ్బందిగా మారుతుంది. అటవీశాఖలో మహిళా ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఎంతో అవసరం. యూనిఫాం ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. – అనూష, అటవీ సెక్షన్ అధికారి, జైనూర్ ప్రోత్సహిస్తే రాణిస్తారు సమానత్వం చూపెట్టి ప్రోత్సహిస్తే మహిళలు పురుషులకంటే మిన్నగా రాణిస్తారు. ఏ పని అప్పగించినా నిజాయతీగా, అంకితభావంతో పని చేస్తారు. మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. కంపెనీ వారి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఆరు నెలలు మెటర్నిటీ, పిల్లలకు 18ఏళ్లు వచ్చే లోపు 2ఏళ్ల చైల్డ్ కేర్ లీవులు ఉన్నాయి. ఎవరైనా వేధింపులకు గురైతే ఏరియా ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మహిళల సంరక్షణకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటోంది. – ఎస్.శిరీషారెడ్డి, డీజీఎం(లా ఆఫీసర్), శ్రీరాంపూర్పోరాడి సాధించాం.. బీటెక్లో మైనింగ్ కోర్సు అంటే అందరూ భయపెట్టినా పట్టించుకోలేదు. 2017లో కంపెనీ ఎంజీఈటీ నోటిఫికేషన్లో మొదట మెన్ అనే నిబంధన ఉంది. మైనింగ్ కోర్సుకు అవకాశం ఇచ్చి ఉద్యోగానికి వచ్చే సరికి ఎందుకు పనికి రామని ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ రాశాం. ఎమ్మెల్యేలను కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. మా పోరాటం ఫలితంగా గత సంవత్సరం జేఎంఈటీ, ఎంజీటీ పోస్టుల్లో ఉమెన్కు అవకాశం కల్పిస్తే ఉద్యోగం సాధించాను. అందరూ సహకరిస్తున్నారు. – పి.లక్ష్మి, ఎంజీటీ (అండర్ మేనేజర్ ), ఆర్కే 7 గని, శ్రీరాంపూర్కన్వేయర్ ఆపరేటర్గా.. మాది తిర్యాణి మండలంలోని దేవాయిగూడ గ్రామం. నాలుగు సంవత్సరాల క్రితం పీడీఎఫ్ కింద సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. మొదట బదిలీ వర్కర్గా, ప్రస్తుతం జనరల్ మజ్దూర్గా పని చేస్తున్నా. సీహెచ్పీలో ప్రస్తుతం కన్వేయర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాం. గతంలో కన్వేయర్ ఆపరేటర్లుగా కేవలం పురుషులు మాత్రమే పనిచేసేవారు. కానీ ఇప్పుడు కన్వేయర్ ఆపరేటర్లుగా, పంపు ఆపరేటర్లుగా, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ హెల్పర్లుగా, గ్రీసర్ హెల్పర్లుగా అన్ని విధులు నిర్వర్తిస్తున్నాం. – సిడాం అనురాధ, జనరల్ మజ్దూర్, గోలేటి సీహెచ్పీపనిలో తేడా లేదు పని విషయంలో ఆడ మగ అని తేడా ఏమీ లేదు. సంవత్సర కాలంగా క్వాలిటీ విభాగంలో కెమిస్ట్గా విధులు నిర్వహిస్తున్నా. గతంలో సింగరేణిలో మహిళా ఉద్యోగులు అతి తక్కువ సంఖ్యలో ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఆఫీస్ అటెండెంట్ పనులకే పరిమితం కాకుండా అన్నిరకాల విధులు నిర్వహిస్తూ సత్తా చాటుకుంటున్నారు. – కలవోతు జ్యోతి, జూనియర్ కెమిస్ట్, గోలేటి సీహెచ్పీప్రభుత్వ కొలువు వదిలి.. మాది దేవాయిగూడ గ్రామం. గతంలోనే ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం వస్తే ఐదేళ్లపాటు తిర్యాణి మండలం చోపిడిలో పని చేశా. కై రిగూడ ఓసీపీలో మా భూములు, ఇల్లు ముంపునకు గురికావడంతో 34 జీవో ప్రకారం సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. టీచర్ కొలువు వదులుకుని సింగరేణి ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం పంపు ఆపరేటర్గా, కన్వేయర్ ఆపరేటర్గా పురుషులతో సమానంగా విధులు నిర్వర్తించడం సంతోషంగా ఉంది. – వరలక్ష్మి, జనరల్ మజ్దూర్, గోలేటి సీహెచ్పీసింగరేణిలో మహిళా ఉద్యోగులుభూగర్భంలోనూ విధులుప్రస్తుతం వీలున్న చోట్ల భూగర్భ గనుల్లో మహిళలు పని చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే 7, ఎస్సార్పీ 3 గనుల్లో ఎలక్ట్రీషియన్లు, ఫోర్మెన్, జేఎంఈటీ, ఎంజీటీ(మైన్ అండర్ మేనేజర్)లు ఉద్యోగ పరీక్షలు రాసి ఎంపికయ్యారు. మైనింగ్ అధికారులుగా మహిళలు ఆరంగేట్రం చేయడంతో కంపెనీలో కొత్తదనం సంతరించుకుంది. ఎంజీటీగా రెండేళ్ల తర్వాత అండర్ మేనేజర్గా, ఓసీపీల్లో ఈపీ ఆపరేటర్లుగా అవకాశం కల్పిస్తున్నారు. -
బస్టాప్ల్లో ఇబ్బందే..!
చెప్పలేను 59ఉంది 87మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశంలేదు 204సెల్ఫోన్లో వచ్చే మెస్సేజ్లతో 72మీ కాలేజీ, పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..తెలియని వారు 204తెలిసిన వారే.. 146బస్టాప్లో 204కాలేజీ లేదా ఆఫీసులో 74 -
● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులే ● తెలియని వారితోనే సమస్యలు ● మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్/చెన్నూర్/నిర్మల్/వాంకిడి/బోథ్/ఆసిఫాబాద్రూరల్: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాల ను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో రాణిస్తున్నా రు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడం వల్ల అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది. -
‘అన్నిరంగాల్లో అతివలే మేటి’
ఆసిఫాబాద్అర్బన్: సమాజంలో నేడు అన్నిరంగాల్లో అతివలే మేటి అని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట ఎస్పీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సిబ్బందితో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువని, ప్రపంచానికి వెలుగు చూపేది వారేనని కొనియాడారు. పురుషులతో సమానంగా పోటీ పడుతూ విధులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పోలీసుశాఖలోనూ ఉత్తమ ప్రతిభ చూపుతున్నారన్నారు. మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎ స్పీ కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐ రవీందర్, ఎంటీవో ఆర్ఐ అంజన్న, ఎస్సైలు తేజస్విని, సౌమ్య, తిరుమల, శిరీష, భరో సా కేంద్రం, షీటీం, ఐటీకోర్, డీసీఆర్బీ, సఖి కేంద్రం సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
ఎండల నుంచి రక్షణకు చర్యలు చేపట్టాలి
ఆసిఫాబాద్: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి జిల్లా టాస్క్ఫోర్స్ సమన్వయ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి మొదటి వారం నుంచి ఎండ తీవ్రత పెరిగినందున ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించా రు. వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపు పనులు ముగించుకోవాలని సూచించారు. పనిప్రదేశాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటితొట్టీలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో సీతారాం, డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీవో రాంచందర్, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య పాల్గొన్నారు. -
అన్నీ తానై..
● భర్త మరణంతో నలుగురు పిల్లల భారం మోసి.. ● కౌలు రైతుగా మారి.. ● ఆదర్శంగా తానుబాయి జీవితం కెరమెరి(ఆసిఫాబాద్): నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత అనారోగ్యంతో భర్త చనిపోయాడు. మనస్తాపంతో తానూ ఈ లోకాన్ని విడిచిపోవాలని అనుకుంది. అయితే పిల్ల లు గుర్తుకొచ్చి ఆగిపోయింది. చిన్నారుల పరిస్థితి ఎలా అని ఆలోచించింది. బాధను దిగమింగుకుని కూలీ పనులు చేసుకుంటూ.. కౌలుకు భూమి సాగు చేస్తూ పిల్లల ను ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆదర్శమూర్తిగా నిలిచింది వాడై తానుబాయి. వ్యవసాయం చేస్తూ..కెరమెరి మండల కేంద్రంలోని గోపాల్వాడకు చెందిన తానుబాయి భర్త మల్లేశ్ 2011 ఫిబ్రవరిలో అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికే వారికి 11 ఏళ్ల నాగమ ణి, ఏడేళ్ల ఆరుణ, ఐదేళ్ల ప్రియాంకతో పాటు నాలుగేళ్ల కుమారుడు విజయ్ ఉ న్నారు. పిల్లల కడుపు నింపేందుకు కూలీ పనులకు వెళ్లడం ప్రారంభించింది. చిన్నారులను బంధువుల ఇళ్లలో ఉంచేది. కూలీ డబ్బులు సరిపోకపోవడంతో భూమిని కౌ లుకు తీసుకుని సాగు చేయడం ప్రారంభించింది. కొడుకును వీపుపై కూర్చొబెట్టుకుని పనులు చేసేది. క్రమంగా జీవితంలో స్థిరపడి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిపించింది. కొడుకును కూడా ప్రయోజకుడిగా మార్చేందుకు శ్రమిస్తోంది. మన భయమే వెనుకబాటుతనానికి కారణమని, ధైర్యంతో ముందుకెళ్తే విజయం సాధించవచ్చని తానుబాయి అంటోంది. -
‘హస్త’వ్యస్తం!
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్లో నెలకొన్న విబేధాల దాగుడుమూతల వ్యవహారానికి పూర్తిగా తెరపడ్డట్లయింది. ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఎదుటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽధిలోని ముఖ్య నాయకులు పార్టీ స్థితిగతుల గురించి చెబుతూ వాపోయారు. వ్యవహారం ఇలాగే కొనసాగితే పార్టీ పూర్తిగా పట్టు కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు జిల్లా నేత ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం శృతిమించిపోయిందని ఇన్చార్జి ఎదుట నేరుగా ఆ నేత పేరు చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీలో సంచలనం కలిగిస్తోంది. మొత్తంగా పార్టీ పరిస్థితులను చక్కదిద్దాలంటే ఇక్కడ ప్రత్యేక కమిటీలు నియమించాల్సిందేనని రాష్ట్ర ఇన్చార్జి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆ దిశగా కార్యచరణకు సిద్ధం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. దిద్దుబాటు చర్యలేవి?కాంగ్రెస్లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచే నెలకొన్న విబేధాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. పార్టీలో ముఖ్య నాయకులు ఇన్నాళ్లు చెప్పుకోలేని పరిస్థితిలో మౌనం దాల్చగా, కొత్తగా నియమితులైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాక, ఆమె సమావేఽశంలో ఏ విషయాన్నైనా నేరుగా చెప్పండని నాయకులతో పేర్కొనడంతో వారు కూడా ధైర్యం చేసి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఆమె ముందు ఏకరువు పెట్టారు. దీంతో కొన్నాళ్లుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీలో తీవ్రరూపం దాల్చిన పరిస్థితులు రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి వెళ్లాయి. బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఇన్చార్జితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ పరిధి నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి ఐకే రెడ్డి, వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ దండే విఠల్, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, శ్రీహరిరావు, ఆడె గజేందర్, సీనియర్ నాయకులు నరేశ్జాదవ్, బోరంచు శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపూరావు తదితరులు హాజరయ్యారు. సమన్వయ లేమితోనే.. ఈ దశలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నేతల మధ్య సమన్వయలేమి ఉందని రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి ఇవే కారణమయ్యాయని ఆమె వివరించారు. రాష్ట్ర కేబినెట్ను పూర్తిస్థాయిలో విస్తరించిన తర్వాత, సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా తాను తప్పుకొంటానని సీతక్క పేర్కొనడం ఈ సమావేశంలో కలకలం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్లో పార్టీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని, ఈ సమస్యను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)కి సిఫారసు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఓ త్రీమన్ కమిటీని నియమించి పార్టీని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అంతే కాకుండా జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి డీసీసీ, నామినేట్ పదవుల నియామకంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పక్క జిల్లా నేత జోక్యంపై గుస్సా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిఽధిలో గత ఎన్నికలకు ముందు నుంచి పక్క జిల్లా నేత జోక్యం చేసుకోవడం, అన్ని వ్యవహారాల్లో కల్పించుకోవడంపై జిల్లా నాయకులు రాష్ట్ర ఇన్చార్జికి ఫిర్యాదు చేశారు. అసలు జిల్లాకు ఆయనకు సంబంధం లేకపోయినా అన్ని వ్యవహారాల్లో ఆయనే జోక్యం చేసుకోవడమేమిటని వారు ఆవేదన వెల్లగక్కారు. ఈ విషయంలో ఒకరిద్దరు నాయకులు ఆ నేత తీరును వివరించినప్పటికీ, మొదట పేరు చెప్పనట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఇన్చార్జి జోక్యం చేసుకుని నేత పేరు చెప్పాలని నాయకులతో పేర్కొనడంతో వారు ధైర్యం చేసి అందిరి ముందే అతడి పేరు వెల్లడించినట్లు సమాచారం. దీంతో సమావేశంలో కొంతమంది నేతలకు ఈ పరిస్థితి మింగుడుపడని విధంగా మారినట్లు చెప్పుకొంటున్నారు. అంతే కాకుండా జిల్లాతో సంబంధమున్న ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఫోన్ చేసినా లేపడం లేదని కాగజ్నగర్కు చెందిన ఓ నేత రాష్ట్ర ఇన్చార్జి ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పట్టు పోతోందన్న కాంగ్రెస్ నేతలు పక్క జిల్లా నేత కారణమని ఆరోపణ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఎదుట ఆవేదన సమన్వయం లేదన్న మంత్రి సీతక్క దిద్దుబాటు చర్యలకు ప్రత్యేక కమిటీనేతల మధ్య కుదరని సయోధ్యపార్టీలో పాత నాయకులు తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఓ వైపు వాపోతుండగా.. పార్టీ లోకి వచ్చిన ముఖ్య నేతలు తమకు పార్టీలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని రాష్ట్ర ఇన్చార్జి ఎదుట ఏకరువు పెట్టినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ తనకు నియోజకవర్గంలో పర్యటనలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి, ఆతర్వాత ఇతర పార్టీలోకి వెళ్లిన తాను మళ్లీ మాతృ పార్టీలోకి వచ్చిన తర్వాత గుర్తింపు లభించడం లేదని ఇన్చార్జి ఎదుట వాపోయినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి అని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ పరిధిలో పార్టీ పరంగా ఉన్న పరిస్థితులు రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి వెళ్లడంతో ఇకనైన పార్టీని గాడిలో పెడతారా.. అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బాలికలు ఉన్నత లక్ష్యాలు సాధించాలి
ఆసిఫాబాద్రూరల్: బాలికలు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని పట్టుదలతో అనుకున్నది సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్లోని జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో గురువారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో.. బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికలను బతికించుకుని.. వారిని ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, శిశు సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేదల భూముల్లో అక్రమ దందా!
● నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల్లో క్వారీలు ● ఎన్వోసీ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ● నష్టపోతున్న రైతులు కౌటాల(సిర్పూర్): కొందరు వ్యక్తులు ధనదాహంతో పేదల సంపదను కొల్లగొడుతున్నారు. నిరుపేదలు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన భూముల్లో క్వారీలు నిర్వహిస్తూ దందా సాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధి కారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామ శివారులో నాలుగు స్టోన్ క్రషర్లు ఉన్నాయి. వీటికి బండరాళ్లు తవ్వడం కోసం క్వారీలు నడుస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్థానిక ప్రజలు బ్లాస్టింగ్లతో భయంభయంగా గడుపుతున్నారు. క్వారీల యజమానులు పేలుడు పదార్ధాల విషయంలో ఇష్టారీతినా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వకుండానే పని కానిస్తున్నారు. బ్లాస్టింగ్ విషయంలో లెక్కాపత్రం లేకుండా పోయింది. గనులశాఖ సైతం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలపై పట్టింపేది..?కౌటాల మండలం ముత్తంపేట సమీపంలో 8 కంకర క్వారీలు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఐదు హెక్టార్లకు మించి విస్తీర్ణంలో ఉంటే రాష్ట్రస్థాయి అధికారులు, అంత కంటే తక్కువగా ఉంటే క్వారీల నిర్వహణకు కలెక్టర్, ఆర్డీవో, కాలుష్య నియంత్రణ మండలి, డీఎఫ్వోలతో పాటు మరో 12 మంది అధికారులు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటేనే అనుమతులు జారీ చేస్తారు. సదరు భూములు సాగుకు యోగ్యంగా లేవని, అసైన్డ్ కావని, తహసీల్దార్ ఎన్వోసీ జారీ చేస్తారు. క్వారీలు గ్రామాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని కాలుష్య నియంత్రణ మండలి ఈసీ ఇచ్చిన తర్వాతే తవ్వకాలు ప్రారంభించాలి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అసైన్డ్ భూముల్లో ఏర్పాటుకౌటాల మండలం చందారం శివారులోని సర్వే నంబర్ 22లో పూర్తిగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోనే వందల ఎకరాలను పేద ప్రజలకు అసైన్డ్ చేశారు. ప్రస్తుతం ఈ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు కొనసాగుతున్నాయి. ‘క్వారీల ఏర్పాటుకు భూములు ఇస్తే ఎంతోకొంత నగదు వస్తుంది.. లేకుంటే నయాపైసా రాదు’ అంటూ నిర్వాహకులు రైతులను భయపెట్టారు. అధికారులు, పోలీసుల చుట్టూ అన్నదాతలు తిరిగి గత్యంతరం లేక భూములు అప్పగించారు. అప్పటినుంచి నిత్యం తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన అధికార బృందం.. పూర్తి అసైన్డ్ భూముల్లో క్వారీల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు. కొందరు రెవెన్యూ, గనులశాఖ అధికారులు మామూళ్లకు ఆశపడి అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక్కరే సర్వేయర్ ఉండటంతో క్వారీల తనిఖీలు పూర్తిస్థాయిలో చేపట్టడం లేదు. దీంతో కంకర తరలింపుపై లెక్కాపత్రం లేకుండా పోతోంది. అసైన్డ్ భూముల్లో అక్రమంగా సాగుతున్న ఈ కంకర క్వారీలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేలుళ్ల ధాటికి భారీ బండరాళ్లు పంట చేలలోకి వచ్చి పడుతున్నాయి. సమీపంలో ఉన్న ముత్తంపేట గ్రామంలో ఇళ్లు పగుళ్లు తేలుతున్నాయి. కంకర తరలించే వాహనాలతో సిర్పూర్(టి) మండలంలో రోడ్లు గుంతలమయంగా మారాయి. కొత్తగా వేసిన రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. అసైన్డ్ భూముల్లోనే.. కౌటాల మండలంలోని చందారం శివారులో అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు ఏర్పాటు చేశారు. పేదరైతుల భూముల్లోని సంపదను కొల్లగొడుతున్నారు. క్రషర్ యజమానులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – ఆదే వసంత్రావు, ముత్తంపేట, కౌటాల ఎన్వోసీ ఇవ్వలేదు నేను విధుల్లో చేరినప్పటి నుంచి ముత్తంపేట సమీపంలో క్వారీల ఏర్పాటుకు ఎలాంటి ఎన్వోసీ ఇవ్వలేదు. క్వారీలు తనిఖీ చేసి.. ఏ భూమిలో ఏర్పాటు చేశారో పరిశీలిస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. – పుష్పలత, తహసీల్దార్, కౌటాల -
నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అంకుసాపూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో ప్రతి మొక్కనూ రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా నీటిని అందించాలని ఆదేశించారు. ఉపాధిహామీ సిబ్బంది నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అనంతరం మండలంలోని ఎల్లారంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఎండాకాలంలో ఉపాధిహామీ కూలీల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. జాబ్కార్డు కలిగిన ప్రతిఒక్కరికి పని కల్పించాలన్నారు. ఆయన వెంట డీఆర్డీవో దత్తారావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గడువు!
ముంచుకొస్తున్న ● జిల్లాకు ఈజీఎస్ ద్వారా 354 పనులు మంజూరు ● 174 పనులు మాత్రమే గ్రౌండింగ్ ● ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు ● రోడ్లు సకాలంలో పూర్తికాకుంటే నిధులు వెనక్కి..రెబ్బెన మండలం బాలాజీ నగర్లో సీసీరోడ్డు మంజూరైన అంతర్గత రోడ్డు 354 పనులు.. రూ.13 కోట్లుజిల్లాలోని 15 మండలాలకు ప్రభుత్వం రూ.13 కోట్ల ఈజీఎస్ నిధులతో 354 పనులు మంజూరు చేసింది. అన్ని మండలాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికే ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత క్రమంలో సీసీ రోడ్ల కోసం ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. ప్రభుత్వం ఆ మోద ముద్రవేసింది. గత నెలలోనే సీసీరోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉండగా ఈసారి ఆలస్యంగా మొదలయ్యాయి. 354 పనుల్లో ఇప్పటివరకు కేవలం 174 పనులు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ వా రంలోనే మిగిలిన పనులు ప్రారంభించి, ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మార్చి 31లోగా పూర్తవుతాయా.. లేదా అనేది అనుమానంగా మా రింది. వారంలోగా రోడ్ల నిర్మాణానికి కావా ల్సిన ఇసుక, కంకర, మిషనరీ, కూలీలను సమకూర్చుకోవడం కష్టతరంగా మారనుంది. గడువు దాటిన తర్వాత పూర్తయితే బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాకు మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తారా.. లేక చేతులు ఎత్తేస్తారా అనేది చూడాలి. రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామాల్లో చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారే రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం నిధులతో సీసీరోడ్లు మంజూరు చేసింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ పనులు ఈ నెలాఖ రున పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో పనులు పూర్తికావడంపై అనుమానాలు నెలకొన్నాయి. వాస్తవానికి గత నెలలోనే అన్ని మండలాల్లో ఈ పనులు ప్రారంభించాలి. అని వార్య కారణాలతో ఆలస్యంగా మొదలయ్యాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం పనులు కొనసాగుతుండగా.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇంకా మొదలు పెట్టలేదని తెలుస్తోంది. యుద్ధ ప్రతిపాదికన రోడ్డు నిర్మాణాలు పూర్తిచేసేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మార్చి 31లోగా జిల్లాకు మంజూరైన పనులన్నింటి నీ పూర్తిచేయని పక్షంలో నిధులు వెనక్కి వెళ్లిపోనున్నాయి. గతేడాది కూడా సకాలంలో పనులు ప్రారంభించని కారణంగా ఈజీఎస్ నిధులు వెనక్కివెళ్లిపోయాయి. పర్యవేక్షణతోనే పనుల్లో నాణ్యతఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాకు మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించి, పూర్తి చేసేందు కు కేవలం 24 రోజుల గడువు మాత్రమే మిగిలింది. తక్కువ సమయంలో హడావుడిగా చేపట్టే పనుల్లో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. గ్రామాల్లో పనులన్నీ ఏకకాలంలో ప్రారంభమైతే ఇంజినీరింగ్ అధి కారుల పర్యవేక్షణ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. మండలానికి ఒక్క ఏఈఈ మాత్రమే ఉన్నారు. వారు ఒక్కరే అన్ని పనులను పర్యవేక్షించడం సా ధ్యం కాదు. కాంట్రాక్టర్లు సిమెంట్, ఇసుక, కంకర సమపాళ్లలో వాడకుండా నాసిరకమైన పనులు చేప ట్టే అవకాశం ఉంది. రోడ్లు పూర్తయిన కొన్నాళ్లకే బీ టలు వారే ప్రమాదం ఉంది. సీసీరోడ్డు నిర్మాణ ప నులు పూర్తయ్యాక కనీసంగా 15 రోజులపాటు త ప్పనిసరిగా క్యూరింగ్ చేయాలి. కానీ కాంట్రాక్టర్లు ఒకటి, రెండు రోజులే క్యూరింగ్ చేసి చేతులు దు లుపుకొంటున్నారు. కొద్దిరోజులకే రోడ్లు కంకర తేలి దెబ్బతింటున్నాయి. గతంతో పోల్చితే ఈసారి త క్కువ సమయం మాత్రమే ఉండటంతో పనుల్లో నా ణ్యతపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.సకాలంలో పూర్తిచేస్తాం జిల్లాకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి రూ.13 కోట్ల ఈజీఎస్ నిధులతో 354 పనులు మంజూరయ్యాయి. ఇందులో కొన్నిరోడ్లు ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన పనులు కూడా ఈ వారంలోగా ప్రారంభిస్తాం. సకాలంలో పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్, మిషనరీ సమకూర్చుకుంటున్నారు. దీంతో పనులు పూర్తి చేయడం తేలిక అవుతుంది. – ప్రభాకర్, పంచాయతీరాజ్ ఈఈ -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ సెకండియర్ వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ని రెండు నియోజకవర్గాల్లో 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,984 మంది విద్యార్థులకు 4,855 మంది హాజరు కాగా, 129 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,248 మందికి 4,148 మంది, ఒకేషనల్ విభాగంలో 736 మందికి 707 మంది పరీక్ష రాశారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డీఐఈవో కళ్యాణి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, వాంకిడిలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. -
విద్యుత్ సరఫరాకు ముందస్తు ప్రణాళిక
ఆసిఫాబాద్: వేసవిలో అంతరాయం లేకుండా వి ద్యుత్ సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళిక సి ద్ధం చేసినట్లు ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజి నీర్ రాథోడ్ శేషారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం మాట్లాడారు. సర్కిల్ పరిధిలో 33/11 కేవీ సబ్స్టేషన్లలో రెండుచోట్ల 3.15 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నాలుగు చోట్ల 3.15 ఎంవీఏ టీవో, 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటనెన్స్ సమయంలో ఒక లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా వినియోగదారులకు ప్రత్యామ్నాయ లైన్(ఇంటర్లింక్ లైన్) ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా ఎనిమిది చోట్ల లింకింగ్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఓవర్లోడ్ పెరిగే అవకాశం ఉన్నచోట 36 అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. మరో 8 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామని పేర్కొన్నారు. బంచ్ ఫీడర్లు ఉన్న చోట ఇప్పటివరకు కొత్తగా 10 వీసీబీలు అమర్చామని తెలిపారు. భారీ వర్షాలకు విద్యు త్ అంతరాయం ఏర్పడితే.. వేగంగా పునరుద్ధరించేందుకు బ్రేక్ డౌన్ టీంలు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్ఫర్మర్ స్ట్రక్చర్ల వద్ద సరీసృపాలతో షార్ట్ సర్క్యుట్ కాకుండా 474 ప్రాంతాల్లో మోనోపాస్ట్లు ఏర్పాటు చేశామని వివరించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. -
వార్షిక లక్ష్య సాధనకు కృషి చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ కృషి చే యాలని ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి సూచించారు. ఏరియాలోని కై రిగూడ ఓసీపీని గురువారం సందర్శించారు. ఫిబ్రవరిలో కైరిగూడలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన షావల్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్లతోపాటు ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ 2024– 25 ఆర్థిక సంవత్సరంలో కైరిగూడ ఓసీపీకి నిర్దేశించిన 37.5లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు ఉద్యోగులంతా స మష్టిగా కృషి చేయాలని అన్నారు. ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి శంకర్, ప్రాజె క్టు ఇంజినీరు వీరన్న, సేఫ్టీ అధికారి నారాయణ, డీవైపీఎం వేణు, ఏఐటీయూసీ నాయకులు దివాకర్, ఓదెలు పాల్గొన్నారు. -
క్రీడాపాఠశాలలో ప్రవేశానికి అర్హత పోటీలు
ఆసిఫాబాద్రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ప్రవేశానికి బాలబాలికలకు అర్హత పోటీలు నిర్వహించినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలికల క్రీడా పాఠశాలలో ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. డీ టీడీవో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా అర్హత క్రీ డాపోటీలకు 105 మంది బాలికలు, 64 మంది బాలురు హాజరయ్యారని తెలిపారు. తొ మ్మిది అంశాల్లో క్రీడాపోటీలు నిర్వహించామన్నారు. ప్రతిభ చూపిన బాలురులకు ఈ నెల 10న ఉట్నూర్లో, ఈ నెల 12న జిల్లా కేంద్రంలో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, పీడీలు, పీఈటీలు పాల్గొన్నా రు. -
విద్యుత్షాక్తో యువకుడు మృతి
సిరికొండ: విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తుమ్మల్పాడ్ గ్రామానికి చెందిన ఇంగోలే నాగోరావ్, కుసుంబాయి దంపతుల రెండో కుమారుడు ఇంగోలే విలాస్ (24)బుధవారం ఇంటి మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ వైరుకు తగలడంతో షాక్కు గురయ్యాడు. కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఇచ్చోడ ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. మృతుడు ఆరునెలల క్రితమే దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. గోండుగూడలో ఒకరు..కడెం: మండలంలోని చిట్యాల్ గోండుగూడకు చెందిన పందిరి జలపతి (56) గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలపతి ఈనెల 4న స్నానం చేయడానికి గోదావరినదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య సీతాబాయి ఫిర్యాదు మేరకు బుధవా రం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వగ్రామం చేరిన మృతదేహంలక్సెట్టిపేట: గత నెల 27న ఓమన్లో మృతి చెందిన వలస కూలీ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల కొమురయ్య(48) ఉపాధి నిమిత్తం రెండేళ్లక్రితం ఓమన్ దేశానికి వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో పనిచేస్తుండగా అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించా రు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధుడు ఆత్మహత్యదండేపల్లి: గడ్డిమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వెల్గనూర్కు చెందిన అక్కల మల్లేశం (79) కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు కుమారులను కోల్పోయాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందడంతో ఈనెల 4న గడ్డిమందు తాగి వాంతులు చేసుకోవడంతో గమనించిన స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు రెఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని కుమార్తె రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. అధికారి ఇంట్లో చోరీకి విఫలయత్నంభైంసాటౌన్: పట్టణంలోని సాయికాటన్ ఏరియాలో ఉంటున్న ఆర్అండ్బీ డీఈఈ సునీల్ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి వి ఫలయత్నం చేశారు. సాయికాటన్లోని ఓ ఇంట్లో అ ద్దెకు ఉంటున్న భైంసా ఆర్అండ్బీ డీఈఈ సునీల్ మంగళవారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవా రం ఇంటి తాళం తెరిచి ఉండడం గమనించిన స్థా నికుల సమాచారంతో అతను వచ్చి పరిశీలించగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు లేవని చెప్పారు. అడవి పందుల దాడిలో ఇద్దరికి గాయాలుపెంబి: మండలంలోని సిక్కిగూడ గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్, సిడాం తుకారాం మంగళవారం రాత్రి షెట్పల్లి సమీపంలో ఉన్న చేనుకు కాపలాగా వెళ్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ కృష్ణ, పైలెట్ అజర్ ప్రథమ చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
121ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్ష ఫలితాలు నిలిపివేత
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకాడమిక్కు ఫీజులు చెల్లించని 121 ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఫలితాలను నిలిపి వేశారు. ఇప్పటికే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. అప్పట్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వడం లేదని, కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక యూనివర్సిటీ అకాడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్లు పంపారు. బుధవారం వరకు 121 ప్రైవేటు కళాశాలలు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన కళాశాలల ఫలితాలు వెబ్సైట్లో ఉంచి చెల్లించని వారివి నిలిపివేశారు. తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ స్పష్టం చేశారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
● టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా సమష్టిగా ముందుకు సాగాలని టీపీసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, రేఖానాయక్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి, పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశా రు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా పార్టీ పటిష్టత, స్థానిక సంస్థలన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. -
గంజాయి సేవిస్తున్న ఎనిమిది మంది అరెస్టు
చెన్నూర్: మండలంలోని కిష్టంపేట శివారులో గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. పోలీసు స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిష్టంపేట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న పదిమంది యువకులను పట్టుకుని విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ఒకరు మైనర్కాగా మరొకరు పరారయ్యారన్నారు. సమావేశంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బీదరిల్లి గ్రామానికి చెందిన డోన్ గాలే మారుతి (34) కుటుంబ సభ్యులతో కలసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్తో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం బాసర గోదావరినదికి వచ్చారు. స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటమునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..తాండూర్: ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. అచ్చులాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పెరుగు రాజయ్య (57) ఐబీ నుంచి నయారా పెట్రోల్బంక్ వద్దకు బైక్పై వెళ్తుండగా రేచినీ గ్రామానికి చెందిన భీంరావు ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. ఘటనలో రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు..నెన్నెల: గత నెల 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలి పారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన తోకల రాజేశం (34) అత్తగారి ఊరైన నెన్నెల మండలం మైలారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు తోకల సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి మహిళ..సోన్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గాంధీనగర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (54) మంగళవారం సరస్వతీ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లింది. చేపలు పట్టే క్రమంలో ఒడ్డు మీద నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయింది. బుధవారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హైమద్ మోహినుద్దీన్ తెలిపారు. -
ఒకరిపై కేసు
కౌటాల: మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. వీరవెల్లి గ్రామానికి చెందిన కేడ్కర్ నాగోరాం ఈ నెల 1న అదే గ్రామానికి చెందిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో తన కోరిక తీర్చకుంటే చంపేస్తానంటూ అక్కడే ఉన్న బకెట్తో దాడి చేయడంతో ఆమె ఎడమ కంటిపై గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారంనిర్మల్ఖిల్లా: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన కవిసంధ్య సాహితీ సంస్థ, నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుమ్మల దేవరావుకు కవిసంధ్య పురస్కారం దక్కింది. అతను రచించిన ‘వరి గొలకులు’ కవిత కన్సోలేషన్ బహుమతికి ఎంపికై నట్లు కవిసంధ్య సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈట శిఖామణి, దాట్ల దేవదానం రాజు తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంనర్సాపూర్(జి): మండలంలోని బూరుగుపల్లి (జి) గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు బుధవారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. దినేష్ తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2 లక్షల 50 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ సుమలత , పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సందర్శించి పంచనామా నిర్వహించారు. తిమ్మాపూర్లో 800 కోళ్లు మృతిభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్లో పునేంధర్కు చెందిన ఫామ్లో బుధవారం 800 కోళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి విఠల్ కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. కోళ్లు తాగే నీటిలో విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ల్యాబ్ నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత కోళ్ల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పునేంధర్ వాపోయాడు. ముగ్గురిపై వీధికుక్కల దాడిభీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో బుధవారం వీధి కుక్కలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న హర్ష అనే బాలుడిపై, కొట్రంగి చంద్రక్క, నాజర్పై క కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. బాధితులను బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. -
జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం
ఆదిలాబాద్: జిల్లాకు ఎయిర్ పోర్ట్ తప్పకుండా తీసుకువస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మాట్లాడారు. ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న జోగు రామన్న జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏర్పాటు కోసం 2014లో తాను ఎంపీగా ఉన్న సమయంలో కృషి చేశానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగానే ఎయిర్ పోర్ట్ అకాడమీ పెండింగ్లో ఉందన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు సంబంధించి 2011లోనే సర్వే జరిగిందన్నారు. ఇదే రైల్వే లైనుకు ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ కు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇద్దరు మంత్రులను కలిసినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేద వ్యాస్, రఘుపతి, లాలా మున్నా, నగేష్, కృష్ణ, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● ఎంపీ గోడం నగేష్ -
● చింతలమానెపల్లి మండలంలో 132/33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం ● తుదిదశకు పనులు ● త్వరలో విద్యుత్ సరఫరాకు అధికారుల ప్రణాళిక ● నాలుగు మండలాల పరిధిలోని గ్రామాలకు ప్రయోజనం
త్వరలో ప్రారంభిస్తాంరవీంద్రనగర్– 2 సబ్స్టేషన్ను పూర్తి ఆధునికంగా నిర్మిస్తున్నాం. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా నిర్మాణం చేపడుతున్నాం. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో ఈజ్గాం 132/33 సబ్స్టేషన్పై లోడ్ తగ్గుతుంది. భవిష్యత్తులో ఈ సబ్స్టేషన్లో సమస్యలు తలెత్తితే ఈజ్గాం నుంచి కౌటాలకు నేరుగా సరఫరా చేస్తున్నాం. కాగజ్నగర్ డివిజన్లోని కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లో చాలావరకు విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయి. – శేషారావు, సూపరింటెండెంట్ ఇంజినీర్, జిల్లా విద్యుత్ శాఖచింతలమానెపల్లి(సిర్పూర్): గాలి వీచినా.. వాన ప డినా కరెంట్ నిలిచి పోవాల్సిందే.. మండల కేం ద్రం, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా తర చూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.. ఇకపై ఈ కరెంట్ కష్టాలకు చెక్ పడనుంది. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్–2 సమీపంలో 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. వచ్చే నెల రోజుల్లో ఈ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభించనున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈజ్గాం సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండగా, దూరం కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నా యి. సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ మండలాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నతరహా పరిశ్రమలు, దుకా ణాలు, జిన్నింగ్ మిల్లులు, రైస్మిల్లుల యజమానులకు నష్టాలు ఎదురవుతున్నాయి. ఇళ్లలో నీటి సరఫరాకు ఇ బ్బంది పడే పరిస్థితి. కొత్త సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తే కరెంట్ కష్టాలు తీరనున్నాయి. అతి పొడవైన విద్యుత్లైన్ సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్నగర్ మండలం ఈజ్గాంలోని 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి గ్రామీణ మండలాలకు విద్యుత్ సరఫరా చే సే లైన్ను జిల్లాలోనే అతి పొడవైన లైన్గా చెబుతుంటారు. సుమారుగా వంద కిలోమీటర్ల దూరం వరకు ఈ లైన్ ఉంటుంది. 33కేవీ సామర్థ్యం కలిగిన 8 సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సు మారుగా 300 ఆంప్స్ లోడ్ కలిగిన విద్యుత్ను ఈజ్గాం నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ మార్గంలో వి ద్యుత్ లైన్కు అటవీప్రాంతంలోని చెట్లు అడ్డంకిగా ఉన్నాయి. పిడుగులు, ఉరుములు, భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతోనూ తరచూ సమస్యలు వస్తున్నారు. ఎక్కడ సమస్య ఏర్పడినా సరఫరాలో అంతరాయం తలెత్తి విద్యుత్ నిలిచిపోతుంది. పొడవైన ఈ లైన్ వెంబడి తీగలు తెగిపోవడం, ఇన్సులేటర్లు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఉద్యోగులకు సమస్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సరఫరా పునరుద్ధరించడం తలకు మించిన భారంగా మారింది. వర్షాకాలంలో రాత్రిపూట అటవీప్రాంతంలో మరమ్మతులు చేయడం క త్తిమీద సాములా తయారైంది. ప్రత్యామ్నాయంగా సబ్స్టేషన్ నిర్మాణం విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయానికి కాగజ్నగర్ మండలంలోని ఈస్గాం సబ్స్టేషన్ నుంచి వందకిలోమీటర్ల దూరం వరకు కరెంట్ సరఫరా చేయడమే ప్రధాన కారణం. ఈ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. కౌటాల మండలంలో ప్రత్యామ్నాయంగా 132/33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. ఏళ్లుగా ప్రజల నుంచి డిమాండ్ రావడంతో చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ సమీపంలో 132/33 సబ్స్టేషన్ను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.3.5 కోట్ల నిధులను కేటాయించగా.. కాగజ్నగర్ నుంచి టవర్లైన్ మంజూరైంది. కరెంట్ సరఫరాకు అంతరాయం లేకుండా 165 టవర్లు, సబ్స్టేషన్.. మొత్తంగా రూ.32 కోట్లతో పనులు చేపట్టారు. 2023 అక్టోబర్లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం తుదిదశకు చేరుకున్నాయి.భారీ ట్రాన్స్ఫార్మర్లు132/33 కేవీ సబ్స్టేషన్లో మొత్తంగా నాలుగు విద్యుత్ సరఫరా ఫీడర్లు ఏర్పాటు చేయనున్నారు. సిర్పూర్(టి), లోనవెల్లి, కౌటాల, గుండాయిపేట్, రవీంద్రనగర్, ఖర్జెల్లి, బెజ్జూర్ మండలంలోని రెబ్బెన సబ్స్టేషన్ల పరిధిలోని సుమారుగా 300 గ్రామాలకు ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు. అలాగే ప్రాణహిత, పెన్గంగ నదులపై నిర్మించిన ఐదు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక ఫీడర్పై రెండు సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. ఎనిమిది సబ్స్టేషన్లు, 161 కిలోమీటర్ల విద్యుత్ లైన్లకు సరఫరా చేయడానికి 16 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో లోడ్ పెరిగినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సబ్స్టేషన్ను పర్యవేక్షించేందుకు ఏడీ, ఏఈ స్థాయి అధికారులు, మరో ముగ్గురు సబ్స్టేషన్ నిర్వహణ సిబ్బందిని నియమించనున్నారు. -
విద్యుత్ తీగలు అమర్చిన ఇద్దరి అరెస్టు
పెంచికల్పేట్: వన్యప్రాణులను వేటాడటానికి విద్యుత్ తీగలను అమర్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎఫ్ఆర్వో అనిల్ కుమార్ తెలి పారు. కమ్మర్గాం గ్రామానికి చెందిన తలండి వెంకటేశ్, సిడాం అశోక్ వన్యప్రాణులను వేటడానికి పంట చేనులో విద్యుత్ తీగలను అమర్చరానే పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులో తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులను ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. వారి వెంట ఎఫ్ఎస్వో జగన్మోహన్, ఎఫ్బీవో విజయలక్ష్మీ, సిబ్బంది ఉన్నారు. -
అసాంఘిక శక్తులకు సహకరించొద్దు
● ఏఎస్పీ చిత్తరంజన్ ఆసిఫాబాద్అర్బన్: ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అసాంఘిక శక్తులకు సహకరించొద్దని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. సిర్పూర్(యూ) మండలం రుద్దేకాస గ్రామంలో బుధవారం పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతిఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేశ్, సిర్పూర్(యూ) ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. యువత ఉన్నతస్థాయికి ఎదగాలి కెరమెరి(ఆసిఫాబాద్): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ.. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండలంలోని మారుమూల టోకెన్మోవాడ్, చాల్బాడి, పాటాగూడ, పిట్టగూడ గ్రామాల్లో బుధవారం బైక్పై పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు. గంజాయి సాగు చేయొద్దని, విద్యుత్ తీగలతో వన్యప్రాణులను వేటాడొద్దన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యానారాయణ, ఎస్సై గంపుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మహారాష్ట్రలో ట్రాలీ బోల్తా..
● గుడిహత్నూర్ వాసులకు గాయాలు గుడిహత్నూర్: మహారాష్ట్రలో ట్రాలీ వాహనం బోల్తా పడిన ఘటనలో మండలానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని గురుజ గ్రామానికి చెందిన జాదవ్ రాజు మంగళవారం 16 మంది బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనానికి మహారాష్ట్రంలోని చంద్రపూర్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కోర్పణ గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో రాజుతో పాటు అతని తల్లి సీతాబాయి, మరో యువకుడు గెడం జగదీష్, నాందేడ్కు చెందిన మహిళ, రాజు మేన కోడలుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా రిమ్స్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సీతాబాయిని హైదరాబాద్కు, అత్త, మేనకోడలిని నాందేడ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. గెడం జగదీష్తో పాటు పలువురు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని కోర్పణ పోలీసులు తెలిపారు. -
మలేషియా జైలులో కడెం వాసులు
కడెం: మండలంలోని లింగాపూర్కు చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మండలంలోని మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ ఉపాధి నిమిత్తం గతేడాది మలేషియాకు వెళ్లారు. కొన్ని కారణాల వలన జైలులో ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కలిసి విడుదల చేయించాలని వేడుకున్నారు. మలేషియా వెళ్లి ఉన్నతాధికారులను సంప్రదించాడు. అక్రమ ఆయుధ చట్టం కింద జైలులో ఉన్నారని తెలుసుకుని బాధితులను పరామర్శించాడు. విడుదల చేసేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించాడు. -
దాహం తీర్చండి సారూ..!
చెలిమె నీళ్లే దిక్కుఆసిఫాబాద్అర్బన్: వాంకిడి మండలం పాటగూ డ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామస్తులు ‘దాహం తీర్చండి సారూ’ అంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం ఖాళీ బిందెలతో నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఒక్కసారిగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం గ్రామస్తులు, ప్ర జా సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 25 కుటుంబాలు, 200 మంది ప్ర జలు నివసిస్తున్నారని తెలిపారు. గ్రామంలోని బోర్ల వద్ద అర్ధరాత్రి నుంచి వేచిచూడాల్సి వ స్తుందన్నారు. ఒక బిందె నిండేందుకు గంటకుపైగా సమయం పడుతోందని తెలిపారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి గ్రామంలో పర్యటించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కలెక్టరేట్లో ఏవో మధుకర్, మిషన్ భగీరథ డీఈ ఇర్ఫాన్కు వేర్వేరుగా వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాలశ్రీ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, నాయకులు శ్రావణి, కృష్ణమాచారి, జలపతి, గ్రామ పటేల్ ధర్మూ తదితరులు పాల్గొన్నారు.● కలెక్టరేట్ ఎదుట కొలాంగూడ గ్రామస్తుల ధర్నా -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
● గ్రాడ్యుయేట్లోనూ బీజేపీ హవా ● అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి ● మూడు రోజులు సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ● ముగ్గురికే 92.52శాతం ఓట్లుసాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి: కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్లతో బీజేపీ గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో ఆయననే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడంతో శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా మూడు షిప్ట్ల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు పక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేపట్టి బుధవారం ఉదయం 8.30గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్లను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్లలో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ పక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటైన ఓట్లలో 92.52శాతం(2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగతా 53మంది స్వతంత్ర అభ్యర్థులు 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ పక్రియను చేపట్టగా అందులో సైతం బీజేపీ అభ్యర్థి అధిక్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్కు 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,404 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరూ సాధించకపోవడంతో మూడో స్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో విజయం దక్కింది. -
తొలిరోజు ప్రశాంతం
పరీక్షలు సజావుగా నిర్వహించాలి ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల, తెలంగాణ మోడల్ స్కూల్లోని కేంద్రాలను సందర్శించారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ● ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభంఆసిఫాబాద్రూరల్: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 5,076 మంది విద్యార్థులకు 4,828 మంది హాజరయ్యారు. 248 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,283 మందికి 4,100 మంది, ఒకేషనల్ విభాగంలో 793 మందికి 728 మంది హాజరయ్యారు. తొలిరోజు కావడంతో విద్యార్థులు ఉదయమే కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 గంటల నుంచి సెంటర్లలోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ తావులేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఐఈవో కళ్యాణి తెలిపారు. వాంకిడి, కాగజ్నగర్, రెబ్బెనలోని కేంద్రాలను ప్లయింగ్ స్క్వాడ్ సభ్యులు తనిఖీ చేశారు. కేంద్రాలు తనిఖీ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, పీటీజీ బాలుర, బాలికల గురుకులాల్లోని కేంద్రాలను డీఐఈవో కళ్యాణి, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఆసిఫాబాద్ సీఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: అధికారులు, ప్రజాప్రతినిధుల సమస్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వసతి గృహాల్లో రాత్రిపూట బస చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా జనవరి నుంచి ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ట్రాన్స్ఫార్మర్లు మార్చడంతో పాటు విద్యుత్ లైన్లు సరి చేస్తున్నామని వివరించారు. ఏడాదిలో ఈ ప్రాంతం గురించి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలతో మమేకమై అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో సంక్షేమంపై దృష్టి సారిస్తానని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపుఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం గుండి రహదారిలోని ఓ ప్రైవేటు భవనంలోకి మార్చినట్లు సబ్ రిజిస్ట్రార్ అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొత్త భవనంలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. -
పక్షుల లెక్క తేలింది
● జన్నారం డివిజన్లో 201 రకాలు గుర్తింపు ● అటవీశాఖ, వరల్డ్వైడ్ లైఫ్ఫండ్ ఆధ్వర్యంలో సర్వే జన్నారం(ఖానాపూర్): పక్షుల గమనానికి పరిధిలు లేవు. అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయి. ఇలాంటి పక్షులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పక్షుల వివరాలను తెలుసుకునేందుకు అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి 24 నుంచి 26 వరకు జంతుగణన మాదిరి కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో పక్షుల గణన చేశారు. 28 మంది సభ్యులు ఏడు బృందాలుగా ఏర్పడి డివిజన్లోని 40 అటవీ బీట్లలో సర్వే చేశారు. డివిజన్లో సంచరిస్తున్న పక్షుల వివరాలను సేకరించారు. వీటితో పాటుగా అంతరించిపోయే దశలో ఎన్నిరకాల పక్షులు ఉన్నాయి? ఏఏ కేటగిరీలో ఏ పక్షులున్నాయో సర్వేలో తేలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 201 రకాల పక్షులు జన్నారం అటవీ డివిజన్లో నిర్వహించిన సర్వేలో 201 రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ, వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో పక్షులపై సమగ్ర పరిశీలన చేశారు. 11 రకాల పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయని, 57 రకాల పక్షులు కేవలం అటవీ, ప్లాంటేషన్ ఏరియాలో సంచరిస్తున్నాయని, మన పరిసరాల్లో తిరిగే పక్షులు 18, కీటకాలు తినే పక్షులు 99 రకాలు, కేవలం పండ్లను మాత్రమే తినే పక్షులు 16 రకాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పక్షులపై అవగాహన ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో పక్షులు, వాటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే సైన్స్ టీచర్లను అడవుల్లోకి తీసుకెళ్లి బర్డ్వాక్ కార్యక్రమం చేపట్టనున్నారు. వీటితో పాటుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలు పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించనున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పక్షుల సంరక్షణపై, పక్షులు అంతరిస్తే కలిగే నష్టాలు, జీవ వైవిద్యంలో పక్షుల పాత్ర, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రతీ ఆర్నెల్లకోసారి.. ప్రతీ ఆర్నెల్లకోసారి పక్షులపై అవగాహన కల్పించే యోచన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పక్షుల రకాలను గుర్తించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వలంటీర్లగా నియమించాలని యోచిస్తున్నాం. అర్హులైన స్థానికులను నేచర్ గైడ్లుగా నియమిస్తాం. – శివ్ఆశిష్సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి, మంచిర్యాల -
వీడని ఉత్కంఠ
తేలని ఫలితంసాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్– ఆదిలాబాద్– మెదక్– నిజా మాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియం కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఎవరూ నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆసక్తి నెలకొంది. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. దీంతో ట్రయాంగిల్గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. త్రిముఖ పోటీ..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని గెలుపు కోటా ఓట్లుపోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే.. 1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యంమొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్రెడ్డి రెండో స్థానంలో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూ డోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ‘గ్య్రాడ్యుయేట్’ పోటీ త్రిముఖం కోటా ఓట్ల మార్కును చేరుకోని అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియతోనే తేలనున్న ఎమ్మెల్సీ ఫలితం ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కౌంటింగ్ వివరాలు: మొత్తం ఓటు ్ల(పోస్టల్ ఓట్లతో కలిపి) 2,52,100 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
‘ఎమ్మెల్సీ ఫలితాలు కాంగ్రెస్కు చెంపపెట్టు’
ఆసిఫాబాద్అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన మల్క కొమురయ్య గెలుపొందడంతో మంగళవా రం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద పార్టీ సీ నియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావ్తో కలిసి సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులతోపాటు ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం, మంత్రులు పాలన పక్కనబెట్టి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలకు ప్రజలు ఆకర్షితులై బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు, మేధావులు ముందుచూపుతో బీజేపీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొము రయ్యను గెలిపించారని తెలిపారు. పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు మురళి, జయరాజ్, పెంటయ్య, అశోక్, శ్రీకాంత్, సుగుణాకర్, ప్రసాద్గౌడ్, వెంకన్న, మధు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీజేపీలో జోష్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కై వసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా.. నేనా.. అన్నట్లు తలపడగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకే టీచర్లు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నాలుగు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని మరోసా రి సత్తా చాటింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల మద్దతుతో ఓ సీటులో విజయం సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ సైతం ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఉమ్మడి జిల్లాలో గత రెండేళ్లుగా బీజేపీ అనుకూల పవనాలే వీస్తున్నాయి. దీంతో భవిష్యత్లో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్నాయని కేడర్లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలతో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటుండటం గమనార్హం. కలిసొచ్చిన ఆత్మీయ సమ్మేళనాలుఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆది నుంచి విస్తృతంగా ప్రచారం చేసింది. పట్ట భద్రులు, టీచర్ల స్థానానికి అభ్యర్థులను బరిలో దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగినా మల్క కొమురయ్య, పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్ల ను అధికసంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయి. ముందుగా అభ్యర్థిని ప్రకటించడం కలిసిసొచ్చింది. వచ్చే స్థానిక సంస్థల్లోనూ..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాషా య పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చింద ని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇక గ్రామ స్థాయిలోనూ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో పటాకులు కాలుస్తున్న బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ ఫలితాలతో నాయకులకు ఊరట పట్టభద్రుల స్థానంలోనూ గెలుస్తామనే ధీమా ఉమ్మడి జిల్లాలో పార్టీ కేడర్లో ఉత్సాహం మరో సీటుపై ఉత్కంఠమరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గత రెండు రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ మధ్య పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు, ఓట్లు ఎక్కువగా ఉండడంతో లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి మంగళవారం సాయంత్రం వరకు ముందంజలో ఉన్నారు. ఏ అభ్యర్థి గెలుస్తారనేది బుధవారం స్పష్టత రానుంది. ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల తొలగింపు ప్రక్రియ మొదలైతే తుది విజేత ఎవరనేది తేలాల్సి ఉంది. బీజేపీ శ్రేణులు మాత్రం తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాలో ఉన్నారు. -
విజయీభవ
ఆసిఫాబాద్రూరల్: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కు జిల్లాలో 19కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,054 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,756 మంది ఫస్టియర్, 5,287 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కళ్యాణి వెల్లడించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమ ని తెలిపారు. అన్ని కేంద్రాల్లో బెంచీలు, తాగునీరు, ఫ్యాన్లు, మూత్రశాలలు తదితర వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా ప్రతీ పరీక్షాకేంద్రంలో ఐదు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా..ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ‘నిమిషం’ నిబంధన తొలగించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరికి వారు తమకిచ్చిన పత్రంపై తమ వివరాలే ఉన్నాయా? లేదా? అని సరిచూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు నిర్ధిష్ట సమయానికంటే ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకోవడం మంచిది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో..ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నా రు. ఇప్పటికే అన్ని పరీక్షాకేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక స్క్వాడ్స్తో కేంద్రాలను తనిఖీ చేయనున్నా రు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ పరీక్షాకేంద్రం కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి ఉంటుంది. పరీక్షల నిర్వహణకు 19 కేంద్రాల్లో 192 మంది ఇన్విజిలేటర్లు, 19 మంది సీఎస్లు, 19 మంది డీవోలతోపాటు రెండు సిట్టింగ్ స్క్వాండ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ కూడా పరీక్షాకేంద్రాలను పర్యవేక్షించనున్నారు. ఆయా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతీ సెంటర్కు ఇద్దరు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కేంద్రానికి సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష ముగిసేదాకా మూసి ఉంచాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలోని పరీక్షాకేంద్రాల వివరాలు ప్రాంతం పరీక్షాకేంద్రం పేరు ఆసిఫాబాద్ ప్రభుత్వం జూనియర్ కళాశాల ఆసిఫాబాద్ గిరిజన గురుకుల బాలుర పాఠశాల ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆసిఫాబాద్ గిరిజన బాలికల గురుకుల పాఠశాల వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల కెరమెరి ప్రభుత్వ జూనియర్ కళాశాల రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల కాగజ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కాగజ్నగర్ (గన్నరాం) ఎంజేపీ పాఠశాల కాగజ్నగర్ వివేకానంద జూనియర్ కళాశాల కాగజ్నగర్ వసుంధర్ జూనియర్ కళాశాల కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దహెగాం ప్రభుత్వ జూనియర్ కళాశాల సిర్పూర్(యూ) తెలంగాణ మోడల్ స్కూల్ సిర్పూర్(టి) ప్రభుత్వ జూనియర్ కళాశాల తిర్యాణి ప్రభుత్వ జూనియర్ కళాశాల నేటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఎంట్రీ హాజరు కానున్న 10,054 మంది ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నిర్భయంగా పరీక్ష రాయాలి ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 19 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా పరీక్షలు రాయాలి. – కళ్యాణి, డీఐఈవో పరీక్షాకేంద్రాల వద్ద బందోబస్తుఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షాకేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ ఎస్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్రావ్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రాల వద్ద పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల సమీప జిరాక్స్, ఇంటర్ నె ట్ సెంటర్లు మూసి ఉంచాలని పేర్కొన్నా రు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
నిరుపేదల కోసమే వైద్యశిబిరాలు
● జిల్లా అటవీ అధికారి నీరజ్కుమార్ ● బెజ్జూర్లో హెల్త్క్యాంప్ ప్రారంభం బెజ్జూర్: నిరుపేదల కోసమే అటవీశాఖ, సింగరేణి ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అటవీశాఖ క్షే త్ర అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కాగజ్నగర్ డివిజన్ అధికారి సుశాంత్ సు గ్దేవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం డీఎఫ్వో మాట్లాడుతూ.. జిల్లాలోని మారుమూల మండలంలో వైద్యశిబిరం నిర్వహణకు సింగరేణి సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నా రు. డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని నిరుపేదల కోసం వైద్యశిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అన్ని రకాల వైద్యనిపుణులతో శిబిరంలో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం కూడా శిబిరం కొనసాగుతుందని, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. రాబోవు రోజుల్లో నెలకోసారి ఆయా మండలా ల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా రోగులు భారీసంఖ్యలో వచ్చి శిబిరంలో పరీక్షలు చేయించుకుని మందులు పొందారు. సింగరేణి సంస్థ సూపరింటెండెంట్ మధుకుమార్, వైద్యులు రాధాకృష్ణ, స్టాలిన్, శ్రీదేవి, బెజ్జూ ర్ ఎఫ్ఆర్వో ముసవీర్, సెక్షన్ అధికారులు శ్రావణ్కుమార్, మల్లికార్జున్, బీట్ అధికారులున్నారు. -
న్యూస్రీల్
ఉత్తమ ఫలితాలు సాధించాలి ఆసిఫాబాద్రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ పలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీటీడీవో రమాదేవి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన సబ్జెక్టు టీచర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో 36 ఆశ్రమ పాఠశాలల్లో 1,255 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపా రు. జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా సబ్జెక్టు టీచర్లు కృషి చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సా రించాలని సూచించారు. 100 శాతం ఫలితా లు సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకోవా లని తెలిపారు. ఏసీఎంవో ఉద్ధవ్, డీఎస్వో మీనారెడ్డి, ఏటీడీవో చిరంజీవి, ఎస్వో సంతోష్, సాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పొలం బాట ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించి వ్యవసాయానికి నాణ్యమై న విద్యుత్ అందించేందుకే ‘పొలం బాట’ నిర్వహిస్తున్నట్లు ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్ఈ రాథోడ్ శేషారావ్ తెలిపారు. పొలం బాట కార్యక్రమంలో సేవలందించిన అధికారులు, సిబ్బందిని ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్కిల్ పరి ధిలో ఇప్పటివరకు 36 వంగిన స్తంబాలు, 43 లూజ్లైన్లు, 14 మధ్య స్తంభాలు సరి చేసిన ట్లు తెలిపారు. ఆటో స్టార్టర్లు తొలగించాలని రైతులకు సూచిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. డీఎంపై చర్య తీసుకోవాలి ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులను వేధిస్తున్న డీఎం విశ్వనాథ్పై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని బస్భవన్లో కార్మికులతో కలిసి టీజీఎస్ ఆర్టీ సీ ఎండీ కార్యాలయంలో ఈడీ మునీశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ.. కొంత కాలంగా డీ ఎం కార్మికులపై అధిక పనిభారం మోపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించా రు. కార్మికులు పని ఒత్తిడి తట్టుకోలేక అనా రోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. కార్మి కులకు క్యాజువల్ లీవ్లు కూడా ఇవ్వడం లేద ని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నుంచి హైదరా బాద్కు వెళ్లే సర్వీసులను నడిపితే మూడురోజుల పని దినాలను రెండు రోజులకు కు ధించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించా రు. పని చేయని యంత్రాల ద్వారా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ కార్మికులపై తప్పు డు నివేదికలు ఇచ్చి సస్పెన్షన్, తొలగింపు కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. డీఎం, ఆర్ఎం చర్యలపై విచారణ చేపట్టి చ ర్య తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో బస్ భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కోసం ఎంపిక పోటీలు ఆసిఫాబాద్రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఐదోతరగతిలో ప్రవేశం కోసం గిరిజన విద్యార్థులకు ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో కుష్ఫూ గుప్తా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గలవారు నాలుగో తరగతి చదువుతూ 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. 5 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డీఎస్వో మీనారెడ్డిని 9440010453 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
‘పది’లో పాత విధానమే..!
● వార్షిక పరీక్షలో ‘గ్రేడింగ్’ రద్దు ● మార్కుల విధానం మళ్లీ అమలు ● సవరణలు చేసిన విద్యాశాఖఆసిఫాబాద్అర్బన్: ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్ష ల విధానంలో విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న గ్రేడింగ్ (జీపీఏ) విధానాన్ని రద్దు చేసింది. పూర్వ పద్ధతిలోనే మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే నాలుగు పేజీల జవాబు పత్రాల స్థానంలో 24పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థులకు సరిపడా బుక్లెట్లు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,421 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. నాలుగు చోట్ల రిసీవింగ్ కేంద్రాలుజిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్, జైనూర్, కౌటా లలో రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేంద్రాలకు 24 పేజీలు కలిగిన ఆన్సర్ బుక్లెట్లు చేరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో సీఎస్ పర్యవేక్షణలో రిసీవింగ్ సెంటర్ల నుంచి ప్రశ్నాపత్రాలతో పాటు ఆన్సర్ బుక్లెట్లను పరీక్షాకేంద్రాలకు తరలించనున్నారు. ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్తో పాటు ప్రతీ పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, మెడికల్ సిబ్బంది, సీఎస్ విధులు నిర్వహించనున్నారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే.. రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం పదోతరగతి పరీ క్షా విధానంలో నూతన మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో మార్కుల విధానాన్ని అమలు చేస్తోంది. జవాబు పత్రాల స్థానంలో 24 పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు పరీక్షల నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.ఉదయ్బాబు, జిల్లా పరీక్షల సహాయాధికారి జిల్లాకు సంబంధించిన వివరాలుప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 172పదో తరగతి పరీక్షా కేంద్రాలు : 36హాజరు కానున్న విద్యార్థులు : 6,421 -
యాసంగి పంటలకు సాగునీరు అందించాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆసిఫాబాద్అర్బన్: యాసంగిలో ప్రాజెక్టులు, చెరువుల కిందసాగు చేసే పంటలకు సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సాగునీటి, వ్యవసాయ, విద్యుత్శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఈ సీజన్లో ఒక ఎకరం కూడా ఎండిపోవద్దని, వచ్చే 15 రోజులు చాలా కీలకమైన సమయమన్నారు. ప్రాజక్టుల నీటితో చెరువులను నింపాలని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షించాలన్నారు. సాగునీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. తహసీల్దార్, నీటిపారుదల శా ఖ ఏఈ, మండల వ్యవసాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకుని తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నూతన మెనూ అమలుపై తనిఖీ నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, డీఏవో శ్రీనివా స్రావ్, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావ్, నీటిపారుదల శాఖ ఈఈలు ప్రభాకర్, గుణవంత్రావ్, డీఆర్డీఏ దత్తారాం పాల్గొన్నారు. -
ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం
● ఆలిండియా భిక్కు సంఘం ప్రధాన కార్యదర్శి భంతే భదంత్ ధమ్మ సారథి వాంకిడి: ప్రపంచ శాంతికి గౌతమ బుద్ధుడు చూపించిన బౌద్ధ మార్గమే శరణ్యమని ఆలిండియా భిక్కు సంఘం ప్రధాన కార్యదర్శి భంతే భదంత్ ధమ్మ సారథి అన్నారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్లో భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ధమ్మ దీక్ష శ్రామ్నేర్ శిబిర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువులు భంతే వివేక్, రాహుల్ బోధి, నిబ్బాన్లతో కలిసి బౌద్ధ సూత్రోచ్ఛరణలు ప్రభోదించి దీక్ష స్వీరించేందుకు ముందుకొచ్చిన 30 మందికి కాషాయ దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బౌద్ధం అనేది మతం కాదని, ప్రపంచ శాంతికి మార్గం అన్నారు. ప్రజ్ఞా, శీలం, కరుణ అనే అంశాలపైనే మనిషి జీవన శైలి ఆధారపడి ఉంటుందన్నారు. 1956 ఏప్రిల్ 14న అంబేడ్కర్ లక్ష మందితో కలిసి నాగ్పూర్ పట్టణంలో బౌద్ధాన్ని స్వీకరించారని, శాంతిని బోధిస్తూ, అస్పృశ్యతకు అవకాశం లేకుండా సమ సమాజ నిర్మాణానికి, మూఢ నమ్మకాలను విడనాడేందుకు బౌద్ధం ఒక సూచికలా ఉపయోగపడుతుందన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బౌద్ధాన్ని ఆచరించాల్సిన అవసరం నేటి ప్రపంచానికి ఎంతైనా ఉందన్నారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, ఉపాధ్యక్షుడు వినేష్ ఉప్రే, మండల అధ్యక్షుడు జైరాం ఉప్రే, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్, నాయకులు విలాస్ ఖోబ్రగడె, రాజేంద్ర ప్రసాద్, హంసరాజ్, రోషన్, విఠల్, విజయ్ ఉప్రే, నాగ్సేన్, తదితరులు పాల్గొన్నారు.