breaking news
Komaram Bheem
-
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎ దుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ సీఎస్సీ సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, హెల్త్కార్డులు ఇ వ్వాలని, జీవో 12 సవరించాలని, సహజ మరణానికి పరిహారం రూ.5 లక్షలకు పెంచా లని, వెల్ఫేర్ బోర్డు నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చే శారు. అనంతరం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సప్త బాలకిషన్, ధర్మాయి రవి, కె.కమలా కర్, రాంచందర్, శంకర్, సదయ్య, నరస య్య, మురళి, బాలాజీ, మోయిన్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ క్రీడాకారిణికి సన్మానం
రెబ్బెన: గత నెల 14 నుంచి 19 వరకు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన వరల్డ్కప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణి దేవల్ల శ్రావణిని శుక్రవారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి సన్మానించారు. శాలువాతో సత్కరించి రూ.5 వేలు బహుమతిగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏరియాకు చెందిన క్రీడాకా రిణి గోలేటిలోనే క్రీడా ఓనమాలు నేర్చుకుని నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాజ మల్లు, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్రావు, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, హరిలాల్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మల్లేశ్, చందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి
కాగజ్నగర్టౌన్: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ శాస్త్రవేత్త భాస్కర్రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ఏకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వా డకం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయన్నారు. మార్కెట్కు వెళ్లే ప్రతిఒక్కరూ గుడ్డ సంచులు తీసుకెళ్లాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో వి ద్యార్థుల పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు దేవేందర్రెడ్డి, నర్సింగరావు, మల్లికార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు. -
సిలిండర్ల కొరత లేకుండా చూడాలి
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్రావ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావ్, ఇతర అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు. జిల్లాస్థాయిలో ఎల్పీజీ డీలర్లతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతీరోజు సమీక్షించాలన్నారు. మంత్రి నాగేశ్వర్రావ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగా హన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావ్ మాట్లాడుతూ ఎల్పీజీ సిలిండర్లపై పత్రికలు, మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై కలెక్టర్లు వెంటనే స్పందించాలన్నారు. కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ సిలిండర్లు అవసరానికి సరిపడా ఉన్నాయన్నారు. సిలిండర్లు కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రబీ సీజన్లో వరి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు సాగులో ఉన్నాయని, ప్రస్తుతం ప్రాజెక్టుల్లో సాగు, తాగునీటికి సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావ్, నీటిపారుదల శాఖ ఈఈలు గుణవంత్రావ్, ప్రభాకర్, వ్యవసాయ శాఖ అధికారి వెంకటి, పౌరసరఫరాల శాఖ అధికారి వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలిఆసిఫాబాద్అర్బన్: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని, కరీంనగర్లో ని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల రక్తదానం చాలా గొప్పదన్నారు. ప్రాణా పాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణాలు నిలబెట్టిన వారవుతారన్నారు. డీఆర్డీఏ దత్తారావ్, డీఎంహెచ్వో సీతారాం, డీపీవో భిక్షపతిగౌడ్ పాల్గొన్నా రు. -
విజయీభవ..
ఆసిఫాబాద్రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లలిత తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని ఆమె సూచించారు. ఏర్పాట్లు పూర్తి..జిల్లాలో నేటి నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణకు 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డీవోలు, 38 మంది సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 2, ఒక్కో బృందానికి ముగ్గురు అధికారులతో పాటు 500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. దీంతో పాటు పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు తావులేకుండా ప్రతీ సెంటర్ను కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈవో, ఎంఈవో, ఒక పోలీస్ సిబ్బంది తనిఖీ చేస్తారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. విద్యార్థులు ఫోన్లు, ఇతర సామగ్రి భద్రపర్చుకోవడానికి పరీక్ష కేంద్రం వద్ద క్లాక్ రూం ఏర్పాటు చేశారు. ఎండల తీవ్ర నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో చల్లటి నీరు. అవసరం ఉన్న చోట టెంట్లు ఏర్పాటు చేశారు జిల్లాలో 38 సెంటర్లు..జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు గానూ 38 సెంటర్ల ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రైవేట్ విద్యార్థుల కోసం 5, రెగ్యులర్ విద్యార్థుల కోసం 33 సెంటర్ల ను ఏర్పాటు చేశారు. కాగజ్నగర్లో 8, ఆసిఫాబాద్లో 5, కెరమెరిలో 2, సిర్పూర్(టి)లో 3, రెబ్బెనలో 3, జైనూర్, వాంకిడి, కౌటాల, దహెగాం, బెజ్జూర్, తిర్యాణి, చింతలమానెపల్లిలో రెండేసిసెంటర్లు, పెంచికల్పేట్లో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. నిర్భయంగా పరీక్ష రాయాలి విద్యార్థులు ఎలాంటి ఒత్తి డి, ఆందోళనకు గురికాకుండా నిర్భయంగా పరీక్ష రా యాలి. భయం లేకుండా ప రీక్షలు రాస్తే మంచి మార్కులు సాధిస్తారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – లలిత, డీఈవో -
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతోనే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్లు మెంగ్రె ఆకాశ్, షాహిన్ సుల్తానాతో కలిసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచులు, కౌన్సిలర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులతో తమ పరిధిలోని పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటికి ప్రాధాన్య త ఇవ్వాలన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రణాళికలు రూపొందించాలని, భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, నీటి పొదుపు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్ర త, మహిళల ఆరోగ్యం, సురక్షిత ప్రయాణం, సంక్షేమ పథకాల అమలు, చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల కట్టడి, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, పాఠశాలల్లో వసతుల కల్పన, యువజన క్రీడలు, సేవలు, మహిళల సంక్షేమం, పర్యావరణ రక్షణ వంటి పది అంశాలపై ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందాలిఅన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. విద్యాలయాలను ఏకీకృతం చేసేందుకు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ముందుగా ప్రాధాన్యత గల పనులు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతీ ఇంటికి నీటిని సరఫరా చేయాలని సూచించారు. కాగా, ఉదయం ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం మహిళల సంక్షేమం, బాల్య వివాహాల నిషేధం, మహిళల ఆరోగ్యం, మహిళా సాధికారత, పేదరిక నిర్మూల న, ఉపాధి కల్పన, అందరికీ విద్య, ఇతర శాఖల సంబంధిత కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సందేహాల ను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీటీడీవో రమాదేవి, డీఎంహెచ్వో సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
పశువులకు టీకా అభయం
కౌటాల: జిల్లాలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 9 వరకు నెల రోజుల పాటు పశువులకు టీకాలు వేయనున్నారు. వేసవి నేపథ్యంలో ఉద యం 6 గంటల నుంచి చల్లదనాన్ని బట్టి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తున్నారు. పాడిరైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఇవే.. సాధారణంగా గాలికుంటు వ్యాధి సోకిన గేదెలు, ఆవులు 24 గంటలోపు బక్కచిక్కి అల్సర్ బారిన పడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులు, కాలి గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి మూగజీవాలు చనిపోయే ప్రమాదం ఉటుంది. వైద్యుల సూచనల మేరకు వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల వద్ద ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్, నార్మల్ సైలెన్ వాటర్తో శుభ్రం చేయాలి. మరోసారి ఇన్ఫెక్షన్ బారినపడకుండా యాంటీ బయాటిక్స్, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులను వాడాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన పశువులను ఇతర వాటితో కలిసి ఒకేచోట ఉంచొద్దు. అలాగే ఎప్పటికప్పుడు కొట్టాన్ని శుభ్రం ఉంచాలి. వారానికి ఒకసారి సున్నం చల్లి, క్రిమికీటకాల నివారణకు చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతే వినియోగించాలి. వ్యాధి సోకిన పశువు చనిపోతే తప్పనిసరిగా బ్లీచింగ్ పౌడర్ చల్లి గోతిలో పాతిపెట్టాలి. సద్వినియోగం చేసుకోవాలి రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. మంగళవారం నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రారంభించాం. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 9 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు అందిస్తాం. టీకాలు వేయించడం ద్వారా మూగజీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పశు పోషకులు ఈ అవకాశాన్ని స్వదినియోగం చేసుకోవాలి. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా సిబ్బందికి సమాచారం అందించాలి. – సురేశ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఏటా రెండుసార్లుగాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టీకాలు వేయించాలి. ప్రాణాంతకమైన వ్యాధి కావడంతో చిన్నపాటి అలసత్వం చేసినా మూగజీవాలు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమతో ఉపాధి పొందుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేస్తున్నాయి. జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 19 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. ఏడు సబ్ సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలో ఆవులు, గేదెలు కలిపి 3,39,200 వరకు ఉన్నాయి. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సిబ్బంది టీకాలు వేస్తున్నారు. పశువులను ఇంటి వద్ద ఉంచి టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
‘ఆశ’ల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి
ఆసిఫాబాద్అర్బన్: రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆశవర్కర్ల సమస్యలు లేవనెత్తాలని గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో సు మారు 28 వేల మంది ఆశవర్కర్లు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వేతనాలు పెంచుతా మని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఆశవర్కర్లకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, ఎన్హెచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు స్వరూప, అనిత, నవీన, లక్ష్మి, నిర్మల, రేణుక, చంద్రకళ, అరుణ, కళావతి, లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు. -
జీపీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
కాగజ్నగర్టౌన్: పంచాయతీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాల ని, వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో పట్ట ణంలోని ఎమ్మెల్యే హరీశ్బాబు నివాసంలో వినతిపత్రం అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్ మాట్లాడుతూ మార్చి 2న ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవా లని డిమాండ్ చేశారు. పంచాయతీల నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ చానల్ ద్వారా 1వ తేదీన వేతనాలు చెల్లించా లన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీవో నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, వసంత్ బాలాజీ, రమేశ్, జానమ్మ, ప్రమీళ, వంశీ, ఆకాశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఉండాలి
కౌటాల: డిజిటల్ చెల్లింపులపై ప్రజలకు అవగాహన ఉండాలని టీజీబీ ఆర్ఎం ప్రశాంత్ బాలచంద్ర అన్నారు. కౌటాల రైతు వేదికలో గురువారం సురక్షిత డిజిటల్ చెల్లింపులపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీల పై అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు సేవల ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రుణా లు తీసుకుని, సకాలంలో చెల్లించాలని సూ చించారు. బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఫోన్లు చేసి ఓటీపీలు అడగరని తెలిపా రు. బీమా పథకాలను సద్వినియోగం చేసుకో వాలన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు బీమా చెక్కులు అందించారు. కార్యక్రమంలో బిజినెస్ చీఫ్ మేనేజర్ రవి కిశోర్, సంధ్య, బ్యాంకు మేనేజర్ రమేశ్, శ్రీనివాస్, ఏపీఎం వినేశ్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
సౌకర్యాల లేమి!
ఉపాధిహామీ.. తిర్యాణి: ఉపాధిహామీ పథకంలో నూతనంగా అమలు చేస్తున్న నిబంధనలు కూలీలకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. పారదర్శకత కోసం తీసుకువచ్చిన మార్పులతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుకు రెండుసార్లు హాజరు వేయాల్సి రావడంతో కూలీలు ఎక్కువ సమయం పని ప్రదేశంలో గడుపుతున్నారు. ఎండలు పెరిగినా అధికారులు మాత్రం వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. తాగేందుకు నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు. 1,61,268 మంది కూలీలుదారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కనీస ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో 2005లో ప్రత్యేక చట్టం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి శ్రీకారం చుట్టారు. పథకం ప్రారంభమైన నాలుగేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాఫ్ట్వేర్తో నిర్వహించారు. 2022 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన కేంద్ర ప్రభుత్వం పథకం పేరును వీబీ జీ రామ్జీగా మార్చి నూతన నిబంధనలు అమలు చేస్తోంది. గతంలో ఉన్న వందరోజుల పనిదినాలను సైతం 125 రోజులకు పెంచారు. జిల్లాలో 88,721 యాక్టీవ్ జాబ్ కార్డులు ఉండగా అందులో 1,61,268 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ దాదాపు 15 వేల మందికి పైగా కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. వేసవి భత్యం బంద్పాత సాఫ్ట్వేర్ అమలు చేసిన సమయంలో కూలీల కు వేసవి భత్యం అందేది. ఫిబ్రవరి నుంచి జూన్ వ రకు వేతనంతోపాటు 20 శాతం నుంచి 35 శాతం వరకు అదనంగా చెల్లించేవారు. అలాగే పని ప్రదే శం గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల కంటే దూరంగా ఉంటే కిలోమీటర్కు కొంత జమ చేసేవారు. పార, గడ్డపార వినియోగించినందుకు కూలీకు అదనపు భత్యం అందించేవారు. గతంలో గడ్డపారలు సైతం ప్రభుత్వమే కూలీలకు ఉచితంగా సరఫరా చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చెల్లింపులు చేపట్టడం లేదు. వేతనం గిట్టుబాటు కాక ఉపాధి పనులపై కూలీలు అనాసక్తి చూపుతున్నారు.పని ప్రదేశంలోనే అధిక సమయంవారం రోజులుగా ఎండలు పెరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరువగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతా పం చూపిస్తున్నాడు. గురువారం రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత జిల్లానే నమోదైంది. ఉపాధి కూలీలు పనులు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారదర్శకత కోసం ఆన్లైన్ ద్వారా కూలీల ఫొటోలు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు కేవలం రోజుకు ఒక్కసారి ఫొటో తీసి అప్లోడ్ చేసేవారు. ప్రస్తుతం రోజుకు రెండుసార్లు ఫొటో తీస్తున్నారు. మొదటి ఫొటో తీసి అప్లోడ్ చేసిన నాలుగు గంటల తర్వాత మరో ఫొటో తీయాల్సి ఉంటుంది. దాదాపు నాలుగు గంటలకుపైగా పని ప్రదేశంలో కచ్చితంగా ఉంటున్నారు. పనిప్రదేశంలో మౌలిక సౌక్యరాల కల్పనకు ఆయా పంచాయతీలకు ఒక్కో కూలీ రూ.2.50 చొప్పున అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ పని ప్రదేశాల్లో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్, తాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో కూలీలు ఎండలోనే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచే తాగునీటిని తెచ్చుకుంటున్నారు. -
కుమురం భీం
7వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. పగలు వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. ల్యాప్టాప్ కష్టాలు బాసర ట్రిపుల్ ఐటీలో మూడు వేల మందికి ఇప్పటివరకు ల్యాప్టాప్లు అందించలేదు. ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 8లోu శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026 -
ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు
తిర్యాణి: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందించారు. ఆయన మాట్లాడుతూ విద్యతోనే జీవితంలో ముందుకెళ్లవచ్చన్నారు. ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, దానిని సాధించేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురికావొద్దన్నారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై పోరాటం
కాగజ్నగర్టౌన్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో బుధవారం జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉందని తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తలండి మధుకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుడుమెత శ్రీని వాస్, ప్రధాన కార్యదర్శి మండాది దేవ్రావు, కోశాధికారి ఆలం సందీప్, ఉపాధ్యక్షుడు కేశవులు, నా యకులు భిక్షపతి, లాలయ్య, పాపయ్య, వెంకటేశ్, కిష్టయ్య, నందక్క, శ్రీరంగం పాల్గొన్నారు. ప్రమోషన్లు కల్పించాలని ధర్నారెబ్బెన: పంప్ ఆపరేటర్లకు ప్రమోషన్లు కల్పించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రమోషన్ల విషయంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ఏడు నెలలుగా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. మైన్స్, స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి స్పందన లేదన్నారు. అర్హులకు ప్రమోషన్ ఆర్డర్లు ఇవ్వని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, జీఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యులు శేషశయనరావు, జూపాక రాజేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కిరణ్బాబు, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, నాయకులు అంజయ్య, నరేశ్, గణేష్, రారాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
వర్క్షాప్ మూసివేసే చర్యలు మానుకోవాలి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని మాదారం, గోలేటి భూగర్భ గనులు, ఉపరితల గనులకు అనేక రకాలుగా ఉపయోగపడిన వర్క్షాప్ను మూసివేసే చర్యలను వెంటనే మానుకోవాలని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు డిమాండ్ చేశారు. వర్క్షాప్ డీజీఎం జ్ఞానేశ్వర్ను బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏరియా వర్క్షాప్ను మూసివేసే దిశగా సూపర్వైజర్లు, టెక్నీషన్లను యాజమాన్యం ఖైరిగూర ఓసీపీకి బదిలీ చేస్తే అడ్డుకోవాల్సిన ఏఐటీయూసీ నాయకత్వం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. సేఫ్టీ, మైన్స్, జీఎం కమిటీల్లో ఐఈడీ ప్రకారం ఏరియా వర్క్షాప్లో సూపర్వైజర్లు, టెక్నీషన్లు తక్కువగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏరియా ఆర్గనైజర్ ఎస్కే ఇనూస్, ఆర్గనైజర్లు రాజశేఖర్, సంతోష్, శేఖర్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
లింగాపూర్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, కంచన్పల్లి ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్సై గంగన్న, కేజీబీవీ ఎస్వో మీనా కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ప్రశాంతంగా పరీక్షలు రాయాలి రెబ్బెన: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వార్షిక పరీక్షలు రాయాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యార్థులకు బుధవారం పరీక్ష సామగ్రి అందించారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతి తర్వాత ఐదేళ్ల కెరీర్ను ఈ పరీక్షలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. పదో తరగతిలో సాధించే మార్కులపై ఉన్నత చదువులు ఆధారపడతాయని వివరించారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, గురుకుల ప్రిన్సిపాల్ చైతన్య, సీఆర్పీ మిట్ట దేవేందర్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి వాంకిడి: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్లో బుధవారం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై సూచనలు చేశారు. 400 మందికి పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్, ఎంఈవో శివచరణ్, హెచ్ఎం నటరాజ్ పాల్గొన్నారు.పరీక్ష సామగ్రి పంపిణీకెరమెరి: మండలంలోని మోడి కేజీబీవీలో బుధవారం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏఎస్పీ చిత్తరంజన్ 250 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు, పెన్నులు అందించారు. అలాగే జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 450, సిర్పూర్(యు) పరిధిలో 70 మంది విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై ఎన్.మధుకర్, సర్పంచ్ ఆత్రం లక్ష్మణ్, హెచ్ఎం ప్రేందాస్, కేజీబీవీ ఎస్వో ప్రవీణ పాల్గొన్నారు. -
ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శిక్షణ
కాగజ్నగర్టౌన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా టైలరింగ్, కంప్యూటర్ శిక్షణలు అందిస్తున్నామని జీఎం హెచ్ఆర్ ఎంఎస్ గిరి తెలిపారు. పట్టణంలోని హెచ్ఆర్డీ హాల్లో టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ పొందిన 214 మంది యువతీ యువకులకు బుధవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ స్థానిక యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో మిల్లు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్యాస్ ధరల పెంపుపై నిరసన
ఆసిఫాబాద్అర్బన్: గృహ వినియోగం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బుధవారం సీపీఎం నాయకులు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో యుద్ధ సమయంలో ధరలు పెంచిందని మండిపడ్డారు. అమెరికా మెప్పు కోసం మిత్ర దే శాలతో శతృత్వం పెంచుకోవడం సరికాదన్నా రు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజల కో సం గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, టీకానంద్, నాయకులు నిఖిల్, రాజ్కుమార్, పవన్, మహిళలు పాల్గొన్నారు. -
● పెరిగిన వంట నూనె, ఎల్పీజీ గ్యాస్ ధరలు ● జిల్లాలో రూ.982కు చేరిన గృహావసరాల సిలిండర్ ● పేద, మధ్య తరగతి ప్రజలపై భారం
ఆసిఫాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం నేరుగా వంటింటిపై పడుతోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో వంట నూనెలతోపాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. మరోవైపు బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు 25 రోజుల ఇంటర్ బుకింగ్ పీరియడ్ నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీంతో 25 రోజుల వరకు రెండో సిలిండర్ బుక్ చేసుకునేందుకు వీలుండదు. వాణిజ్య సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గ్యాస్ ఏజెన్సీల నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లోని హోటళ్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన వంటనూనెలు తాజాగా వంట నూనెల ధరలు పెరగడం భారంగా మారింది. ముఖ్యంగా సన్ఫ్లవర్, పామాయిల్ రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచే సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో వంటనూనెలు లీటర్కు రూ.5 వరకు పెరిగాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత భారమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ప్రముఖ బ్రాండ్ల వంట నూనెలు లీటర్కు రూ.161 నుంచి రూ.167 వరకు పెరిగాయి. జిల్లాలో అధిక శాతం ఆదివాసీ, చిన్న రైతు కూలీ కుటుంబాలు ఉండటంతో వారికి రేట్లు భారంగా మారాయి. ఎల్పీజీ రేట్లు ౖపైపెకి జిల్లాలో గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.60 పెరిగి రూ.982కు చేరింది. అలాగే కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.115 పెరిగి రూ.2,144కు చేరింది. జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, సుమారు.1,40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 28 వేలు డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేలకు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్ కనెక్షన్లు, 600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.1.30 కోట్ల వంట గ్యాస్ భారం పడనుండగా, అలాగే వంటనూనె ధరలతో సుమారు రూ.80 లక్షల భారం పడనుంది.నిలకడ లేని ధరలుగతంలో గ్యాస్ ధరలు ఏళ్లపాటు నిలకడగా ఉండేవి. రెండేళ్లుగా గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. నాలుగేళ్ల్ల క్రితం 2022 మార్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండడర్ ధర రూ.875 ఉండగా, 2023 జనవరిలో రూ.976కు పెరిగింది. ఏప్రిల్లో సిలిండర్పై రూ.50 పెంచడంతో రూ.1019 చేరింది. జూన్లో మళ్లీ సిలిండర్పై రూ.50 పెంచడంతో రూ.1072 చేరింది. గత ఆగస్టు వరకు వంటగ్యాస్ రూ.1172 చేరగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై రూ.200 తగ్గించింది. 2024 మార్చిలో సిలిండర్పై మళ్లీ రూ.100 తగ్గించింది. గతేడాది కేంద్రం సిలిండర్పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్ ధర రూ.922కు చేరింది. తాజాగా రూ.60 పెరగడంతో రూ.982కు చేరింది.ఆర్థికంగా భారంపెరిగిన వంటగ్యాస్ ధర సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భా రమవుతుంది. వంటగ్యాస్తో పాటు వంటనూనెల ధరలు పెరిగాయి. బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం రేట్లు అదుపులో ఉంచాలి. – మౌనిక, గృహిణి, ఆసిఫాబాద్ ధరలు నియంత్రించాలిప్రభుత్వం నిత్యావసర వస్తువులు, గ్యాస్, వంటనూనె ధరలను నియంత్రించాలి. పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. పట్టణ ప్రాంతాల్లోని పేదలను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కమల, కూలీ, ఆసిఫాబాద్ -
క్రమశిక్షణతో చదివితే మెరుగైన భవిష్యత్తు
ఆసిఫాబాద్రూరల్: క్రమశిక్షణతో చదివితే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని డీఈవో లలిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన పదో తరగతి వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ చిత్తరంజన్ విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, సీఐ బాలాజీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి
పెంచికల్పేట్: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో గ్రా మాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ గుర్తింపును ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా సముద్రాల రాజన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రం అందించి శాలు వాతో సన్మానించారు. పెంచికల్పేట్ సర్పంచ్ షేక్ ఉస్మాన్, నాయకులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పోలీసు, రెవెన్యూ, ఎస్సీ సంక్షేమ, శిశు సంక్షేమ, డీవీఎంసీ సభ్యులతో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బాధిత కుటుంబాలకు వేగంగా న్యాయం జరగాలన్నారు. 2025లో 31 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, 2026లో ఇప్పటివరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 3, కాగజ్నగర్ సబ్ డివిజన్ పరిధిలో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆయా కేసులు త్వరగా విచారించి నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతినెలా 30న ప్రతీ మండలంలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ అధికారి అశోక్, డీఆర్డీవో దత్తారావు, సీఐ బాలాజీ వరప్రసాద్, డీవీఎంసీ సభ్యులు కేశవ్రావు, సిడాం అర్జు, గుంగుబాయి, అశోక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సదరం శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న శిబిరాన్ని బుధవారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు తాగునీరు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఎం పెన్షన్ విభాగం రామకృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
28న జాతీయ లోక్ అదాలత్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఏ.వీరయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసు, అటవీ, ఎకై ్సజ్ శాఖ అధికారులతో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి మాట్లాడుతూ లోక్అదాలత్లో రాజీమార్గం ద్వారా క్రిమినల్, సివిల్, ప్రీలిటిటేషన్, భూతగాదాలు, వివిధ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
పెంచికల్పేట్: నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులు గ్రామ పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. మండలంలోని ఎల్కపల్లి రైతు వేదికలో వార్డు సభ్యుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరై సర్టిఫికెట్లు అందించారు. డీపీవో మాట్లాడుతూ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు, వీధిదీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరాతోపాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. అంతకు ముందు దరోగపల్లి, చేడ్వాయి, బొంబాయిగూడ, ఎల్కపల్లి గ్రామాలను సందర్శించి కార్యదర్శులకు సూచనలు చేశారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎల్పీవో హరిప్రసాద్, ఎంపీడీవో అల్బర్ట్, ఎంపీవో మహేందర్ రెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
కుష్ఠు లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
వాంకిడి: కుష్ఠు లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని డీఎంహెచ్వో సీతారాం అన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఖమాన, ఖిరిడి గ్రామాల్లో కుష్ఠు, బోదకాలు వ్యాధులపై కళాజాత నిర్వహించా రు. ఆటపాటలతో ప్రజలకు అవగాహన క ల్పించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ శరీరంపై రాగి రంగు స్పర్శ లేని మచ్చలు ఉంటే ఆస్పత్రిలో చూపించుకుని వైద్యుడి సలహాలు తీసుకోవాలన్నారు. కుష్ఠు లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యానికి దారి తీస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి ఉచితంగా మందులు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఎన్ఎల్ఈపీ ఆఫీసర్ వినయ్ ఉప్రె, డీఈఎంవో మార్తా, డీఎస్వో రమేశ్ చంద్ర, సమన్వయకర్త శ్యాంలాల్, ఆరోగ్య విస్తరణ అధికారి రవిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడోసారి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తిలో శరవేగంగా ముందుకు సాగుతోంది. గడిచిన రెండు సంవత్సరాలుగా వందశాతం వార్షిక ఉత్పత్తి సాధించగా.. ఈసారి సైతం నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందు కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అధిక వర్షాలు, పావురాల గుట్ట వద్ద రోడ్డు దెబ్బతిని బొగ్గు ర వాణా ఆటంకాలు, అనేక సవాళ్లు ఎదురైనా అధి కారులు ముందస్తు ప్రణాళికలతో ఏరియాను ఉత్పత్తిలో ముందంజలో నిలిపారు. ఫిబ్రవరి నాటికి 99 శాతం సాధించారు. ప్రారంభ రెండు నెలల్లో నిరాశపూరిత ఉత్పత్తి కనిపించింది. ఆ వెంటనే వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో నెలలో 20 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. అయినా అధికారులు, ఉద్యోగులు మొక్కవోని దీక్ష ఉత్పత్తిని పరుగులు పెట్టించారు. ముందస్తు ప్రణాళికలతో..ఈ ఏడాది బెల్లంపల్లి ఏరియాను అధిక వర్షాలు అతలాకుతలం చేశాయి. గతేడాది వర్షాకాలంలో కేవలం 1200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 2099 మి.మీ.లుగా నమోదైంది. వర్షాల ప్రభావం ఏరియాలోని ఏకై క ఓసీపీ ఖైరిగూరపై పడింది. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి కురిసిన వర్షాలతో ఆగస్టు, సెప్టెంబర్లో కేవలం ఒక నెల టార్గెట్ చేరుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే బొగ్గు ఉత్పత్తిని చేపట్టేందుకు ఏరియా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా పంపులను సిద్ధం చేసుకున్నారు. అదనపు మోటార్లు, హైకెపాసిటీ మోటార్లను ఏర్పాటు చేసి ఓసీపీ క్వారీ లోపలికి వచ్చే వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడారు. దీంతో వర్షాకాలంలోనూ కొంతమేర ఉత్పత్తి సాధ్యమైంది. అక్టోబర్ నుంచి మరింత వేగం పెంచారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా ఓబీ మట్టి వెలికితీత పనులపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ముందస్తుగా కోల్బెంచ్లు సిద్ధంగా ఉండాలి. కోల్బెంచ్లపై ఉన్న ఓబీని వెలికితీసే బాధ్యత కాంట్రాక్టర్పై ఉంటుంది. అయితే స్థానిక ఓబీ కాంట్రాక్టర్ సైతం బెల్లంపల్లి ఏరియా అధికారులకు పూర్తి సహకరించి పనులు చేపట్టారు. రోజువారీ ఓబీ ఉత్పత్తిని వందశాతానికి మించి వెలికితీయడంతో అక్టోబర్ నుంచి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఉరకలు వేసింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతినెలా నెలవారీ ఉత్పత్తి టార్గెట్ను వందశాతానికి మించి చేపట్టింది. లక్ష్య సాధన వైపు అడుగులుబెల్లంపల్లి ఏరియా ఒకప్పుడు భూగర్భ గనులు, ఓసీపీలతో కళకళలాడింది. కాలక్రమేణా భూగర్భ గనులు, ఓసీపీలు మూసివేతకు గురికాగా ఖైరిగూర ఓసీపీ ఒక్కటే జీవనాడిగా మారింది. గోలేటి ఓసీపీ కోసం ఏరియా అధికారులు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితం లేకుండా పోయింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి గోలేటి ఓసీపీలో ఉ త్పత్తి ప్రారంభమవుతుందని, ప్రస్తుత ఓసీపీకి అతి తక్కువ టార్గెట్ కూడా విధించారు. అయితే ఓసీపీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు రాకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. గతేడాది ఏరియా వార్షిక ఉత్పత్తిలో 97 అని రికా ర్డుకు చూపిస్తున్నా గోలేటి ఓసీపీ ఉత్పత్తి టార్గెట్ను మినహాయిస్తే ఏరియా వందశాతం సాధించింది. 2023– 24 ఆర్థిక సంవత్సరంలోనూ ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఫిబ్రవరి వరకు ఏరియా 99 శాతం వార్షిక ఉత్పత్తిని సాధించగా.. మార్చి నెలాఖరులోపే వందశాతం సాధించనుంది. ఈ ఆ ర్థిక సంవత్సరంలో ఏరియాకు 31.5లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఫిబ్రవరి నెల వరకు 31.06 టన్నులతో 99 శాతం ఉత్పత్తి పూర్తయ్యింది. వార్షిక లక్ష్య సాధనకు కేవలం 43,982 టన్నులు మాత్రమే సాధిస్తే సరిపోతుంది. దానికి ఏరియాకు దాదాపు 20 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 నుంచి 12 వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. దీంతో వరుసగా మూడో సంవత్సరం సైతం ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించనుంది. చిన్న ఏరియా అయినా ఇక్కడి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ఏరియా ఉత్పత్తిలో దూసుకుపోతూ సింగరేణి సంస్థకు లాభాలను తెచ్చిపెడుతోంది. గడువుకు ముందే సాధిస్తాం బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందు సాధించబోతున్నాం. ఈసారి అధిక వర్షపాతం నమోదైనా ముందస్తు ప్రణాళికలను అమలు చేయడంతో వార్షిక టార్గెట్ను వందశాతం సాధించనున్నాం. పావురాల గుట్ట వద్ద రోడ్డు దెబ్బతిని 25 రోజులపాటు రవాణా నిలిచిపోయినా ఆ ప్రభావం టార్గెట్పై పడకుండా చూసుకున్నాం. – విజయ భాస్కర్రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం -
సీ్త్రలను గౌరవించే సమాజంలోనే అభివృద్ధి
ఆసిఫాబాద్: సీ్త్రలు లేనిదే సృష్టి లేదని, సీ్త్రలను గౌరవించే సమాజంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవా రం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకు ల మంగ, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి వని తలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతీ మహిళ జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న వారేనని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ దేశానికి సేవలందించిన మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తు న్న పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలుఅంర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిని నృత్య నిలయం మంచిర్యాల విద్యార్థినులు చేసిన సంప్రదాయ నృత్యం, సన్నీ సెల్స్ డిఫెన్స్ అకాడమీ చిన్నపిల్లలు చేసిన కరాటే వి న్యాసాలు అందరినీ అకట్టుకున్నాయి. క్యాంపెయి న్పై కలెక్టర్, ఎమ్మెల్యే సంతకాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్, జీసీడీవో శకుంతల, జిల్లా సాధికారత సభ్యులు శారద, రాణి, రాజేశ్వర్, మమత, అధికారులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన భారత్ లక్ష్యంగా బైక్ యాత్ర
వాంకిడి: ఆరోగ్యకరమైన భారత్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా బైక్ యాత్ర చేపట్టినట్లు ‘మిషన్ హెల్తీ భారత్’స్థాపకురాలు తాప్సీ ఉపాధ్యాయ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి చేపట్టిన యాత్ర మంగళవారం వాంకిడి చేరుకోగా బీజేవైయం రాష్ట్ర అధికార ప్రతినిధి యెలగతి సుచిత్ ఆధ్వర్యంలో నేతలు ఘన స్వాగతం పలికారు. స్థానిక కేజీబీవీలో జీవనశైలి సంబంధిత వ్యాధులు, యువతలో పెరుగుతున్న స్థూలకాయంపై అవగాహన కల్పించారు. ఫిట్నెస్, సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు తదితర అంశాలను వివరించారు. అనంతరం ‘మన లక్ష్యం ఆరోగ్యకరమైన భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో బైక్ యాత్ర నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విశాల్, వికాస్, వానేశ్, స్వరాజ్, కుందన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
Iవాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. జీవితానికి ‘పొగ’ పెట్టొద్దు! ధూమపానం శ్వాసకోశ, గుండెపోటు, నోటి క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. నేడు ‘జాతీయ ధూమపాన నిరోధక దినోత్సవం’ సందర్భంగా కథనం. IIలోu బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026 -
‘తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’
రెబ్బెన: మెడికల్ బోర్డు విషయంలో తప్పుడు ప్రచారాన్ని కార్మికులు నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. గోలేటి టౌన్షిప్లో మంగళవారం ఐఎన్టీయూసీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మెడికల్ అధికారిపై అవినీతి కేసుల కారణంగా మెడికల్ బోర్డు నిర్వహణలో ఆలస్యం జరిగింద ని, త్వరలోనే బోర్డును పునఃప్రారంభిస్తారని తెలిపా రు. పెర్క్స్పై ఆదాయపు పన్ను మాఫీ, సొంతింటి పథకం అమలు, మెడికల్ బోర్డు పునరుద్ధరణ వంటి కీలక అంశాలను ఐఎన్టీయూసీ నిరంతరం ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తుందన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండేళ్లయినా కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఏఐటీయూసీ రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని ఆరోపించారు. సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ధర్మపురి, సమ్మయ్య, శంకర్రావు, జనరల్ సెక్రెటరీ లు వికాస్కుమార్, వైస్ ప్రెసిడెంట్లు వడ్డెపలి దాస్, సదానందం, యూత్ ప్రెసిడెంట్ రాజు, ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ప్రకాశ్రావు, నాయకులు శ్రీనివాస్, అంబేడ్కర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డీఈవోగా లలిత
ఆసిఫాబాద్రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)గా లలిత మంగళవారం జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి డీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి బదిలీ కావడంతో మరో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో ఏడీగా పనిచేస్తున్న లలితను జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ కె.హరితను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. డీఈవో కార్యాలయ సిబ్బంది నూతన డీఈవోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, ఎస్వోలు శ్రీనివాస్, దేవాజీ, లతీఫ్, వరప్రసాద్, జనార్దన్, రాము తదితరులు పాల్గొన్నారు. -
ఖర్జెల్లి.. కలప పక్కదారి..!
గత నెలలో ఖర్జెల్లి రేంజ్లోని అంబగట్ట గ్రామంలో నిల్వ ఉంచిన కర్రను డిప్యూటీ రేంజ్ అధికారి, ఆమె భర్త అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదైంది. అనంతరం విచారణ చేపట్టారు.తాజాగా ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని కోయపల్లి సమీపంలో పంగోలిన్ అనే అరుదైన రెండు వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తూ బెజ్జూర్ రేంజ్ అటవీ అధికారులకు పట్టుబడ్డారు. ఖర్జెల్లి రేంజ్లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. చింతలమానెపల్లి: తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరిహద్దులోని ప్రాణహిత నదిని ఆనుకుని ఉన్న జిల్లా కీలకమైన ఖర్జెల్లి అటవీ రేంజ్ అక్రమాలకు నిలయంగా మారుతోంది. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి విలువైన కలప తరలిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యాయి. మరోవైపు సంరక్షకులుగా నిలవాల్సిన అధికారులపై ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ మండలాల్లో విస్తరించి ఉన్న ఖర్జెల్లి రేంజ్ పరిధిలో 6 సెక్షన్లు, 18 బీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 18 బీట్లకు ఐదుగురు బీట్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. చింతలమానెపల్లి మండలంలోని సుమారు 20కిలోమీటర్ల అంతర్రాష్ట్ర రహదారి ఈ అటవీ ప్రాంతంలోనే ఉంది. విస్తారమైన టేకు చెట్లుఖర్జెల్లి రేంజ్ అటవీ పరిధిలో భారీస్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ టేకు చెట్లు విస్తారంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. కాటేపల్లి, గూడెం, దిందా గ్రామాలను కేంద్రంగా చేసుకుని గతంలో భారీ ఎత్తున కలప తరలిపోయింది. కానీ నమోదైన కేసులు మాత్రం నామమాత్రమే. ఇటీవల నమోదైన రెండు ఘటనల్లో రేంజ్ అధికారుల వైఫల్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అంబగట్ట ఘటనలో టేకు దుంగలను స్థానికులు పట్టుకోగా.. పంగోలిన్ వన్యప్రాణిని బెజ్జూర్ అటవీ రేంజ్ సిబ్బంది పట్టుకోవడం గమనార్హం. అధికారులపైనే ఆరోపణలు..!ఖర్జెల్లి రేంజ్లో విధుల్లో ఉండే అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అ డవుల అభివృద్ధికి పదుల సంఖ్యలో ఉద్యోగులు వి ధుల్లో ఉన్నా.. రూ.కోట్లు వెచ్చిస్తున్నా తీరుమారడం లేదు. గతంలో ఇక్కడ పని చేసిన ఒక డిప్యూటీ రేంజ్ అధికారి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జిల్లాస్థాయిలో విచారణ నిర్వహించా రు. సదరు అధికారి ఒక ప్రాంతంలో కలపను నిల్వ ఉంచి తరలించినట్లు ఆరోపణలు వచ్చినా విచారణ మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. ఒక నర్సరీలో చేపట్టిన మొక్కల పెంపకంలో సదరు అధికారి తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గోప్యంగా వివరాలు సేకరించారు. అధికారి బదిలీతో అన్నీ మరుగున పడ్డాయి. కబ్జాదారుల నుంచి మామూళ్లు తీసుకుని అటవీ భూముల ఆక్రమణకు సహకరించారని పలువురు అధికారులపైనా ఆరోపణలు వచ్చాయి. కాటెపల్లి, గూడెం, దిందా, గంగాపూర్, బూరెపల్లి బీట్లలో పనిచేసే అధికా రులపై పలుమార్లు విచారణలు జరిగాయి. అంబగట్ట గ్రామంలో నిల్వ ఉంచిన కర్రను తరలించేందు కు ప్రయత్నించిన డిప్యూటీ రేంజ్ అధికారిపై శా ఖాపరమైన చర్యలు సైతం తీసుకున్నారు. చెట్లు న ష్టపోయిన సందర్భాల్లో బీట్ అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకున్నారు. వారి వేతనాల నుంచి రికవరీ విధించారు.స్మగ్లింగ్కు రహదారిఖర్జెల్లి రేంజ్ మహారాష్ట్రలోని ఆళ్లపల్లి డివిజన్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్లకు మధ్యలో ఉంది. గతంలో ఈ మార్గంలో అక్రమంగా భారీ స్థాయిలో కలపను తరలించగా మహారాష్ట్ర అధికారులు కాగజ్నగర్ డివిజన్లో పలు కేసులు నమోదు చేశారు. తాజాగా పంగోలిన్ అనే అరుదైన వ న్యప్రాణులను తరలిస్తుండగా అటవీ సిబ్బంది పట్టుకున్నారు. మహారాష్ట్రలోని అడవుల నుంచి కాగజ్నగర్ మీదుగా, బెజ్జూర్ మండలం మీదుగా వన్యప్రాణులు, కర్రను స్మగ్లింగ్ చేయడానికి స్మగ్లర్లు రేంజ్లోని మార్గాలను వినియోగించుకుంటున్నారు. రేంజ్కు ప్రాణ హిత నది సరిహద్దుగా ఉండగా ఈ మార్గంలో గూడెం వద్ద మాత్రమే వంతెన ఉంది. పటిష్టంగా నిఘా ఖర్జెల్లి రేంజ్లో స్మగ్లింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది నిర్లక్ష్యం ఉన్న సందర్భాల్లో రికవరీ చేపట్టడం సాధారణం. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా యూనియన్ నాయకుడిగా అండగా ఉంటున్నా. అంబగట్ట ఘటనలో కేవలం రూ.47వేల విలువైన కర్రను మాత్రమే సదరు డీఆర్వో తరలించారు. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదు. అంత పెద్ద అడవిలో ఇలాంటి చిన్న ఘటనలు జరగడం సాధారణం. – సుభాష్, ఖర్జెల్లి రేంజ్ అటవీ అధికారి -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడెంకు చెందిన జామ్లాబాయ్ తనకి వ్యవసాయ క్షేత్రానికి సాగునీరు అందించేందుకు పైపులు మంజూరు చేయాలని, సిర్పూర్ (యు)కు చెందిన గేడం గజానంద్ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండ మండలానికి చెందిన రామారావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఉపాధికోసం తిరుగుతున్నా.. నేను దివ్యాంగురాలిని. కుటుంబ పోషణ భారంగా ఉంది. ఏదైనా ఉపాధి కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటా. పలుమార్లు ఐటీడీఏకు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా సమస్య పరిష్కరించాలి.– కొడప అంజన బాయి, మాంజ్రీ గ్రామం, నార్నూర్ -
ఆర్జీయూకేటీలో హ్యాకథాన్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో సోమవారం 9 ఏఎం కెరీర్స్ సంస్థ ఆధ్వర్యంలో నోవా కోడ్ చాలెంజ్ (హ్యాకథాన్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి సురేశ్ విద్యార్థులకు ఐటీ రంగంలో ఉన్న అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు పరిశ్రమలో చేరడానికి అనుసరించాల్సిన మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి టెక్మోజో సంస్థకు చెందిన సీనియర్ హెచ్ఆర్ మణిదీప్ కూడా హాజరై విద్యార్థులతో పరస్పర చర్చలు జరిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ పి.మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ కె.మహేష్, కంప్యూటర్ సైన్స్ విభాగం హెడ్ డా.బి.వెంకటరామన్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు శ్రీమతి జి.సృజనా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. నెన్నెల గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బర్ల శంకర్ (64) తన భార్య రాజేశ్వరితో కలిసి ద్విచక్ర వాహనంపై మంచిర్యాల నుంచి నెన్నెల వైపు వెళ్తుండగా టోల్ప్లాజా వద్ద బైక్ అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేశ్వరికి గాయాలు కావడంతో గమనించిన స్థానికులు మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రెయినేజీలో పడ్డ ఆవు సురక్షితంచెన్నూర్: పట్టణంలోని కోర్టు సమీపంలో ఓ ఆవు సోమవా రం ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయింది. బయటికి రా వడానికి మార్గం లేక పోవడంతో ఇబ్బంది పడుతోంది. చెత్తను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కనిపించడంతో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్కుమార్కు సమాచారం అందించారు. అతని ఆదేశాల మేరకు సిబ్బంది ఆ వును బయటకు తీసి యజమానికి అప్పగించారు. -
ఉమ్మడి జిల్లాలో పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు
కుమురంభీంనిర్మల్మంచిర్యాల ఆదిలాబాద్నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శిరీష ఇటీవల తరచూ తలనొప్పి, ఆందోళనతో బాధపడుతోంది. పరీక్షలు గుర్తుకొస్తే చేతుల్లో చెమటలు పట్టడం, చదవడానికి కూర్చుంటే గజిబిజి ఆలోచనలు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. ఇది ఒక్క గాయత్రి పరిస్థితి మాత్రమే కాదు.. జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక రెండురోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రిలో పదోతరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంత చదివినా ఏ పరీక్షలోనైనా పాస్ మార్కులు మాత్రమే వస్తున్నాయని తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేవాడు. ఆదివారం ఉదయం తల్లి నిద్రలేపి చదువుకొమ్మని చెప్పింది. కాసేపటి తర్వాత వచ్చి చూసే సరికి ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. మార్కులు తక్కువ వస్తున్నాయనే ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
కాసిపేట: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు దేవాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పూలందేవి వాడకు చెందిన కొత్తకాటు మనోజ్కుమార్ (27) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 8న అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి మామిడిచెట్టుకు ఉరేసుకున్నాడు. తెల్ల వారు జామున గమనించిన కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బస్టాండులో పర్సు పోగొట్టుకున్న మహిళమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ఓ ప్రయాణికురాలు పర్సు పోయిందని రోదించిన తీరు ప్రయాణికులను కలచి వేసింది. ఆసిఫాబాద్ జిల్లా బురుగుపల్లికి చెందిన వనిత పనినిమిత్తం మంచిర్యాలకు వచ్చి ఇంటికి వెళ్లేందుకు మంచిర్యాల బస్టాండ్లో ఆసిఫాబాద్ వెళ్లే బస్సు ఎక్కేక్రమంలో ఆమె పర్సు కిందపడిపోయిది. బస్సు ఎక్కిన తర్వాత తనవద్ద ఉన్న పర్స్ కనిపించక పోవడంతో కిందకు దిగి రోదించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజిని పరిశీలించగా ఓ వృద్ధురాలు పర్సును తీసుకొని రోడ్డుపైకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. పర్సులో అరతులం బంగారు చైన్ ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఘటనపై స్థానిక సీఐని వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్స్టేషన్లో సంతకం చేసిన ఎమ్మెల్యేమందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఫిబ్రవరి 17న జరిగిన అల్లర్ల ఘటనలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు వచ్చి ష్యూరిటీ సబ్మిట్ చేసి సంతకం చేసి వెళ్లారు. -
వేసవిలో కూరగాయల సాగు
చెన్నూర్రూరల్: జిల్లాలోని రైతులు యాసంగి సీజన్లో కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నా రు. పెట్టుబడి తక్కువ, కొద్ది రోజుల్లోనే పంట చేతికి అందిరావడంతో పాటు లాభాలు కూడా అధికంగానే ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యా సంగి సీజన్లో రైతులు సుమారు వెయ్యికి పైగా ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. చెన్నూర్ మండలంలోని కత్తెరసాల, సుద్దా ల, శివలింగాపూర్, సుబ్బరాంపల్లి, కిష్టంపేట, అంగ్రాజ్పల్లి, దుగ్నెపల్లి, చింతలపల్లి, అక్కెపల్లి, ఆస్నాద, తదితర గ్రామాల్లోని రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు 10 గుంటల నుంచి ఎకరం వరకు కూరగాయల సాగుకు కేటాయించారు. అందులో అల్చంత, బెండ, వంకాయ, మిరప, టమాట, గోబీ వంటి కూరగాయలతో పాటు తోటకూర, కొత్తిమీర, పాలకూర, పూదీన, చుక్కకూర లాంటి ఆకుకూరలు సాగు చేస్తున్నారు. మొక్కలకు ప్రతీరోజు ఉదయం బోరుబావుల ద్వారా నీటిని అందిస్తున్నారు. పంటలు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రెండు రోజులకు ఒకసారి తోటకూర, బెండ, మిరప, టమాట, వంకాయలు 20 కిలోల నుంచి 30 కిలోల వరకు వెళ్తాయని వాటిని చెన్నూర్ లేదా మంచిర్యాల, గోదావరిఖని మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తామని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి ధరలు ఉండడంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో చదవాలి
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛ వాతావరణంలో చదవాలి. లక్ష్యాన్ని ఎంచుకుని క్రమపద్ధతిలో కృషి చేస్తే విజయం సాధించడం కష్టంకాదు. ‘ఒత్తిడిని భయంగా కాకుండా సవాల్గా తీసుకుంటే విజయం కచ్చితంగా సిద్ధిస్తుంది. – అల్లం సాయికృష్ణ, కెరీర్ గైడెన్స్ నిపుణులు, బోథ్, ఆదిలాబాద్ ఒత్తిడికి గురికావొద్దు పరీక్షల సమయంలో విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికావొద్దు. ప్రతిరోజూ చదువు కోసం సమయపట్టిక రూపొందించుకుని మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా సరిపడా నిద్ర, సమతుల్య ఆహారం, తేలికపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. పరీక్షలను జీవితంలో ఒక దశగా మాత్రమే భావించాలి. ఫలితాలకంటే నేర్చుకున్న జ్ఞానమే ప్రధానం. – అడ్డిగ శ్రీనివాస్, సైకాలజిస్టు, మోటివేషన్ స్పెషలిస్టు -
రెండు ట్యాంకర్లు ఢీ.. డ్రైవర్ మృతి
నస్పూర్: సీసీసీ టౌన్షిప్ సమీపంలోని 363 జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ రూప్నార్ అర్జున్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై మేకల ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు జాతీయ రహదారికి సంబంధించిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అజ్మీరా శంకర్ వాహనాన్ని నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తుండగా వెనకాల పైపుతో డేగ రాయమల్లు అనే వర్కర్ చెట్లకు నీళ్లు పడుతున్నాడు. ఈ క్రమంలో బెల్లంపల్లి నుంచి శ్రీరాంపూర్ వైపు అతివేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ను ఢీ కొట్టింది. దీంతో వాటర్ ట్యాంకర్ పల్టీ కొట్టి రోడ్డు పక్కకు పడిపోయింది. ఆయిల్ ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జు అయి డ్రైవర్ అందులోనే ఇరుక్కుని మృతి చెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సిరూర్ తాలుకాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీ్త్రనిధి ఏజెంట్ చేతివాటం
● రూ.7 లక్షలు సొంతానికి వాడుకున్న వైనం సాత్నాల: భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న రాయిడి స్వప్న సీ్త్రనిధి సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు సొంతానికి వాడుకోవడం కలకలం రేపింది. ఎస్సై పవర్ గౌతమ్ కథనం మేరకు గ్రామానికి చెందిన వీవోఏ రాయుడి స్వప్న సీ్త్రనిధి స్వయం సహాయక సంఘాలకు ఏజెంట్గా పనిచేస్తుంది. 2022 నుంచి 10 సంఘాలు, 54 మంది సభ్యులు శ్రీనిధి రుణాలు తీసుకున్నారు. సదరు మహిళల వద్ద నుంచి ప్రతీనెల డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టినట్లుగా రసీదులు చూపించింది. గడువు ముగిసిన తర్వాత దుమ్మ సంగీత, దుమ్మ బూమక్క, కోర చిన్నమ్మ, నలిమెల కాంత మళ్లీ రుణంకోసం అడుగగా బ్యాంకులో తీసుకున్న పాత లోన్ డబ్బులు పూర్తిగా కట్టలేదని అన్నారు. దీంతో సదరు మహిళలు స్వప్నను సంప్రదించగా రూ.7 లక్షలు వాడుకున్నట్లు ఒప్పుకుంది. నెలరోజులకు చెల్లిస్తానని బాండు రాసి ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత సీ్త్రనిధి సంస్థకు చెందిన అధికారులు డబ్బుల విషయం అడుగగా నేను ఇవ్వలేనని చెప్పింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చిన్నారికి నారీ పురస్కార్ఆదిలాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన కల్చరల్, ఫ్యాషన్ అవార్డ్స్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కొంకటి ఇతిక్ష విశేష ప్రతిభ కనబర్చింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యురాలు సరిత గోగుల, నేషనల్ బంజారా భారత్ మహిళా కన్వీనర్ అద్దంకి నాగమణి, ప్రముఖ నటి సంధ్యారాణి చేతుల మీదుగా నారీ పురస్కారాన్ని అందుకుంది. చిన్నారి తల్లిదండ్రులు కొంకటి సృజన, శ్రావణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
నిర్మల్: పెన్షనర్లను ఇబ్బందికి గురిచేసేలా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టీఎస్జీఆర్ఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని కోరా రు. కేంద్రం ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏలకు వ్యతిరేకంగా చేసిన బిల్లుపై పునరాలోచించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 25న బ్లా క్డే నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ అధ్యక్షుడు కాండ్లీకర్ రమేశ్, కార్యదర్శి పూదరి జనార్దన్, యూనిట్ ఆర్థిక కార్యదర్శి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
కాగజ్నగర్టౌన్: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో 2కే రన్ను వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనితతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్గాంధీ చౌరస్తా వరకు ఈ రన్ కొనసాగింది. చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజ లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లని తెలిపారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవ న విధానాన్ని పెంపొందించడం, పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా మార్చడమే 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, కావేటి విజయ్ కుమార్, వసీమున్సీస, పెందోర్ మాణిక్యారావు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘శ్రమ దోపిడీకి గురిచేస్తున్న యాజమాన్యం’
ఆసిఫాబాద్అర్బన్: టీజీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను యాజమాన్యం శ్రమ దోపిడీకి గురిచేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మండిపడ్డారు. జిల్లా క ేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ప్రైవేటు హైర్బస్ డ్రైవర్లతో డిపో అధ్యక్షుడు మధుసూదన్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఉపేందర్ మాట్లాడుతూ ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో ఆర్టీసీ అభివృద్ధికి ప్రైవేట్ హైర్బస్ డ్రైవర్లు కృషి చేస్తున్నారని తెలిపారు. అయినా కార్మిక చట్టాలు అమలు చేయకపోవడంతో శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనంగా రూ.26వేలు చెల్లిస్తూ ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమావేశంలో పీహెచ్బీ డ్రైవర్స్ సజిత్హుస్సేన్, అశోక్, సాయికిరణ్, రమేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు. -
పది పరీక్షలకు వేళాయె
దహెగాం: పదో తరగతి వార్షిక పరీక్షలకు కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది కంటే ఈసారి ఉత్తమ ఫలితాల సాధనకు ముందస్తు ప్రణాళికతో పాటుపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఏటా జనవరి నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభిస్తుండగా డీఈవో బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి అదనపు కలెక్టర్ దీపక్ తివారి డిసెంబర్ నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన బదిలీ అయినా మార్చి 13 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి. 6,949 మంది విద్యార్థులుజిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 175 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 6,949 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్లు, పరీక్షల నిర్వహణ అధికారుల నియామకం పూర్తయ్యింది. ఈ నెల 14 నుంచి ప్రారంభం ఏప్రిల్ 16 వరకు దాదాపు నెలరోజులపాటు కొనసాగనున్నా యి. ప్రభుత్వం నుంచి షెడ్యూల్ విడుదలైన సమయంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఒక్కో పరీక్షకు మధ్య కనీసం రెండు నుంచి వారం రోజుల వ్యవధి ఉంది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫలితాల శా తం కూడా పెరిగే అవకాశం ఉంది. 2024– 25 విద్యాసంవత్సరం పదో వార్షిక ఫలితాల్లో జిల్లాలో 87.3 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి ఉత్తీర్ణత పెంచడానికి కసరత్తు చేస్తున్నారు. వీరికి దూరభారం.. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు దురభారం తప్పేలా లేదు. దహెగాం మండల కేంద్రంలో పరీక్ష కేంద్రానికి ఇట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుమారు 17 కిలోమీటర్ల ప్రయాణించాలి. అలాగే కుంచవెల్లి, చినరాస్పెల్లి, కల్వాడ, బీబ్రా పాఠశాలలు సెంటర్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆర్టీసీ సేవలు లేనందున విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే. కౌటాల మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రం నుంచి గుండాయిపేట విద్యార్థులు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మిగతా హైస్కూళ్లు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చింతలమానెపల్లి కేంద్రానికి డబ్బా, గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. పెంచికల్పేట్ పరీక్ష కేంద్రానికి చేడ్వాయి 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా అక్కడి విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో రానున్నారు. సిర్పూర్(టి) పరీక్షకేంద్రంలో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని లోనవెల్లి, వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో పరీక్ష కేంద్రానికి పాపన్పేట, సల్గుపల్లి, కుంటలమానెపల్లి పాఠశాలల విద్యార్థులు 7 నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. మూడేళ్లుగా ఉత్తీర్ణత ఇలా..వెబ్సైట్లో హాల్టికెట్లుపదో తరగతి విద్యార్థుల హాల్టికెట్లను పాఠశాలలకు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచారు. ఇప్పటికే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో ఉన్నత పాఠశాలలకు హాల్టికెట్లు చేరుతాయని అధికారులు వెల్లడించారు. -
మూడు దశల్లో పోరాటం
వాంకిడి: కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన మూడు దశల పోరాటాన్ని విజయవంతం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ, కేజీబీవీలో సోమవారం భోజన విరామం సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. శృతిక మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. దీర్ఘకాలంగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నా అరకొర వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. గత పోరాటాల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ బడ్జెట్ సమావేశాలో సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకోకుంటే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల కార్యదర్శి తిరుమల, సీఆర్పీల సంఘం మండల అధ్యక్షుడు విజయబాబు, సభ్యులు వెంకటేశ్, రైజా, లలిత, శ్రీలత, వెంకటలక్ష్మి, మమత, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లీ ‘శిక్ష’..!
కెరమెరి: సుదీర్ఘ కాలంగా విద్యావ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు(ఎస్ఎస్ఏ) మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇందులో భా గంగా సోమవారం జిల్లాలో పాఠశాలల స్థాయి, ఎ మ్మార్సీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీరికి టీఎస్యూటీఎఫ్ అండగా నిలిచి పోరాటాన్ని ముందుండి నడిపించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మూడు విడతల్లో చేపట్టే నిరసనల్లో భాగంగా సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపగా, ఈ నెల 16న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ప్రదర్శనలు, 20న ‘చలో అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. 2024లో నిరసనలుఏడాదికి పైగా స్తబ్ధుగా ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. 2023 ఆగస్టు, సెప్టెంబర్, ఆ తర్వాత 2024 డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, కుల, మహిళా సంఘాలు వీరికి సంఘీభావం తెలిపాయి. మొదటి దఫాలో 24 రోజులు, రెండో దఫాలో 29 రోజులపాటు ఉద్యమం కొనసాగింది. ఈ క్రమంలోనే అప్పటి ఉప ముఖ్యమంత్రితో చర్చలు జరపగా, మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనలు విరమించారు. అపరిష్కృతంగా సమస్యలుఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్లో 607 మంది, కుమురం భీం ఆసిఫాబాద్లో 473 మంది, మంచిర్యాలలో 513 మంది, నిర్మల్లో 424 మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేజీబీవీల్లో బోధన, బోధనేతర, సీఆర్పీలు, ఎంఈఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీవో, ఐఈఆర్పీ, పీటీఐ, మెసెంజర్లు, తదితర విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా సేవలందిస్తున్న వీరి సమస్యలు రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేతనంలో 30 శాతం పెంచడంతో కొంత సాంత్వన చేకూరినా ప్రస్తుతం ప్రజాప్రతినిధులు ఈ విషయంపై నోరు మెదపడం లేదు. గతేడాది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది నేటికీ అమలు కాలేదు. చాలీచాలని వేతనాలతో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాల జీవన స్థితిగతులను అర్థం చేసుకోవా లని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో మరణించిన 235 మంది కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రధాన డిమాండ్లు.. -
బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి
ఆసిఫాబాద్అర్బన్: గర్భాశయ క్యాన్సర్ నివారణకు 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో సోమవారం డీఎంహెచ్వో సీతారాం, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్తో కలిసి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అపోహలు లేకుండా బాలికలు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి మహిళా సిబ్బంది కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. టీహబ్ మేనేజర్ సస్పెన్షన్జిల్లా కేంద్రంలోని టీహబ్ మేనేజర్ అర్జున్ విధులకు గైర్హాజరవుతున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీహబ్ మేనేజర్ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, డీడబ్ల్యూవో భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయాలిఆసిఫాబాద్అర్బన్: కళాజాత ప్రదర్శన ద్వారా ప్రజ లను చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ కె.హరి త అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆ వరణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఏర్పాటు చేసిన కుష్ఠు, బోద వ్యాధుల నివారణ కళాజాత ప్రదర్శన రథాన్ని సోమవారం ప్రారంభించారు.కలెక్టర్ మాట్లాడుతూ కుష్ఠు, బోదకాల వ్యాధుల నివారణ, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో సీతారాం, డీఆర్డీవో దత్తారావు, కోఆర్డినేటర్ శ్యాంలాల్, వైద్య సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు. -
మహంకాళి జాతర విజయవంతం చేయాలి
రెబ్బెన: మండలంలోని ఇందిరానగర్లో గల కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో ఏప్రిల్ 2, 3 తేదీల్లో నిర్వహించే జాతరను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన మహంకాళి ఆలయంలో చైత్రపౌర్ణమి అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఏటా జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో జాతర నిర్వహణకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిప ల్ చైర్మన్ అకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెం తిరుపతిగౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి, సభ్యులు దుర్గం తిరుపతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చెడు అలవాట్లతో జీవితాలు నాశనం
ఆసిఫాబాద్రూరల్: చెడు అలవాట్లతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాలోని 20 పాఠశాలల ప్రహరీ క్లబ్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత దేశ భవిష్యత్తు అని, మన ఆరోగ్యం బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. విద్యార్థులు క్రీడలు ఆడటం, పుస్తకాలు చదవడం, సృజనాత్మక ఆలోచనలతో మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. సీఐ రవీందర్, ఎస్సై రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా తరలిస్తే కేసులు
పెంచికల్పేట్: మండలంలోని పెద్దవాగు నుంచి జ రుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఈ నెల 7వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇసుక తోడేళ్లు’ అనే కథనానికి భూగర్భ గనులశాఖ, రెవెన్యూ అధికారులు స్పందించారు. అనుమతులు లేకుండా పెద్దవాగు నుంచి ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ తిరుపతి సోమవారం హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కార్యాలయంలో టోకెన్లు అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు తరలిస్తున్న ఇసుక ఒక్కో ట్రాక్టరుకు రూ.1400 చొప్పున బ్యాంకులో డీడీ చెల్లించాలని ఆయన సూచించారు. -
విన్నవించి.. పరిష్కారం కోరి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. బాధితులు సంబంధిత అధికారులకు సమస్యలు చెప్పుకుని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామానికి చెందిన కోట సరిత దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించింది. రెబ్బెన మండలం వంకుటం గ్రామానికి చెందిన శంకరమ్మ తనకు ఉపాధి కల్పించాలని దరఖాస్తు చేసుకుంది. పత్తి పంట నష్టపోయిన తనకు పరిహారం అందించాలని ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ గ్రామానికి చెందిన యటకా రి మల్లేశ్ వేడుకున్నాడు. తాను సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి పట్టా ఇవ్వాలని సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన మహాల్కర్ రవి కోరా డు. పెంచికల్పేట్ మండలం పోతెపల్లి గ్రామంలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్ దుర్గం పోషన్న దరఖాస్తు చేశాడు. వ్యవసాయ చేనులో కూలిపోయిన సాగునీటి బావికి మరమ్మతులు చేపట్టాలని జైనూర్ మండలం ఆశపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ హరి అర్జీ చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన కోలె బిక్కాజీ, పలువురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే వివరాలను ఆన్లైన్ చేసిన డబ్బులు చెల్లించాలని దరఖాస్తు చేసుకున్నారు. సిర్పూర్(టి) మండలం జైభీంనగర్కు చెందిన డోంగ్రె తులసీరాం తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూమికి పట్టా చేయించాలని విన్నవించాడు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
పారదర్శకంగా పనులు చేపట్టాలి
తిర్యాణి: ఉపాధి పనులు పారదర్శకంగా చేపట్టాల ని డీఆర్డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. సభ్యులు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8.61కోట్లతో చేపట్టిన 519 పనులపై క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన వివరా లను సభలో చదివి వినిపించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి రూ.95 వేల జరిమానా విధించారు. డీఆర్డీవో మాట్లాడుతూ పనుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గడువులోగా జరిమానాలు చెల్లించాలని సూచించారు. మండలంలో చాలాచోట్ల ఒకే కుటుంబానికి రెండేసి జాబ్కార్డులు జారీ అయినట్లు తెలిసిందన్నారు. వెంటనే రెండు జాబ్కార్డులు ఉన్నచోట ఒకటి తొలగించాలని సిబ్బంది ఆదేశించారు. ఎంపీడీవో వేముల మల్లేశ్, జిల్లా విజిలెన్స్ అధికారి ఆంజనేయులు, హెచ్ఆర్ మల్లేశ్, ఏపీవో షాకీర్ ఉస్మాని ఉన్నారు. -
ఘనంగా శిశుమందిర్ వార్షికోత్సవం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశు మందిర్ 47 వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ కార్యక్రమానికి హాజరై మాట్లాడా రు. విద్యార్థులకు కాలనుగుణంగా సాంకేతికతను అందిస్తూ జాతీయ స్థాయిలో ఒలింపియాడ్ పరీక్షల్లో శిశుమందిర్ ర్యాంకులు సాధిస్తుందని చెప్పారు. వక్త కృష్ణభాస్కర్ మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలో పంచ పరివర్తన రావడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు కుటుంబ విలువలు, పెద్దలపై గౌరవం, దేశభక్తి, దైవభక్తిని పెంపొందించే కథలు వివరించాలనని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సేవ్ ట్రీ సేవ్ లైఫ్, కోలాటం, డంబుల్స్, యోగాచాప్, పిరమిడ్, కరాటే, మొబైల్ స్కిట్ ఆహూతులను అలరించాయి. మూడోతరగతి వి ద్యార్థిని శ్రీహిత వేసిన శంభాజీ మహరాజ్ ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. రాష్ట్ర స్థాయిలో క్రీడలు, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మెడల్స్తో సత్కరించారు. ప్రధానాచార్యుడు గుండేటి కోటేశ్వర్రావ్, పాఠశాల అధ్యక్షుడు చిలువేరు వెంకన్న, భోనగిరి సతీశ్బాబు, ఎంఈవో రాథోడ్ సుభాష్, దేవభూషణం, ఖాండ్రె విశాల్, వేణుగో పాల్, నాగుల శ్రీనివాస్, వాసుదేవన శైలేశ్, రమాదే వి, వైష్ణవి, వాణి, సుప్రజ, సుమలత పాల్గొన్నారు. -
రోడ్డు పనులు పూర్తి చేయించాలని వినతి
రెబ్బెన: అసంపూర్తిగా నిలిచిన రాంపూర్ బీటీ రోడ్డు పనులు పూర్తయ్యేలా చూడాలని రాంపూర్ సర్పంచ్ చల్లూరి మాయ, ఉప సర్పంచ్ చాపిడి పురుషోత్తం ఆదివారం గ్రామానికి వ చ్చిన కలెక్టర్ హరితను కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాంపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం రూ.1.5 కోట్లతో చేపట్టిన 1.8కిలో మీటర్ల బీ టీ రోడ్డు పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే వ దిలేశాడని తెలిపారు. రోడ్డుపై కంకర వేసి వ దిలేయడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వా హనాలు అదుపుతప్పి బోల్తాపడుతుండటంతో పలువురు గాయాలపాలవుతున్నారని తె లిపారు. బిల్లులు రావడం లేదనే సాకుతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేయడంతో బీటీ రోడ్డు కలగానే మిగిలిపోయిందని పేర్కొన్నా రు. వెంటనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ హరిత వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
ఆర్సీఎం క్లబ్లో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్లోని బీజోన్ ఏరియాలోగల ఆర్సీఎం క్లబ్లో ఆదివారం ఫస్ట్ ఇంటర్ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే పోటీలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రఘునా థ్రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఆటలతో క్రీడాకారుల్లో మనోధైర్యం, శారీరక దారుఢ్యం పెరుగుతుందని తెలిపారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించారు. నిర్వాహకులు జూల శ్రీనివాస్, ఆషాఢం శ్రీనివాస్, కరాటే మాస్టర్ రమేశ్రాజా, వివిధ ఏరియాల కరాటే మాస్టర్లు, కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య, అజీజ్ తదితరులున్నారు. -
బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
కాగజ్నగర్టౌన్: ఉచిత హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను పట్టణంలోని సామాజిక ప్రభుత్వాస్పత్రిలో మున్సిపల్ చైర్పర్సన్ సాహీన్ సుల్తానా ఆదివారం జిల్లా వైద్యాధికారి సీతారాంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. జిల్లాలోని 14–15 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా ముందస్తుగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. జిల్లాలోని కాగజ్నగర్, బెజ్జూరు, సిర్పూర్(టీ), తిర్యాణి, జైనూర్, వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. పీహెచ్సీల పరిధిలోని బాలికలు ఆయా ఆస్పత్రులకు ఆధార్కార్డుతో వెళ్లి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో మూడు నెలల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం బాలికలకు వ్యాక్సినేషన్ చేశారు. సీహెచ్సీ సూపరింటెండెంట్ అవినాష్, సీహెచ్వో సంపత్, డిప్యూ టీ ఎస్వో రమేశ్చంద్ర, డీపీవో వెంకటేశ్, వైద్యురాలు అరుణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై వ్యాక్సిన్ వేసుకున్న బాలికల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
గ్యాస్ ధరల పెంపుపై నిరసన
కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.115 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం ఫలితంగానే ఇరాన్ మన చమురు ట్యాంకర్లను సముద్రంలో నిలిపివేసిందని తెలిపారు. ఈ కారణంగానే కేంద్రం గ్యాస్ ధరలు పెంచిందని మండిపడ్డారు. ఇరాన్ ఎప్పటి నుంచో మన మిత్ర దేశమని, మోదీ ప్రభుత్వం అమెరికా మెప్పు కోసం మిత్ర దేశాలతో శతృత్వం పెంచుకుంటోందని ఆరోపించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే యుద్ధాలు, విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యుడు టీకానంద్, నాయకులు కృష్ణమాచారి, సుధాకర్, రవి, రాజేందర్, ముంజం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
● అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ హరిత
మహిళలు నిర్ణయాత్మకశక్తిగా ఎదగాలిఆసిఫాబాద్అర్బన్: ప్రతీ మహిళ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాసవీ ఆలయంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఉదయ్బాబు అధ్యక్షతన నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు రాజకీయాల్లో మరింతగా రాణించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. నేటికీ మహిళల ఆలోచన తీరు పూర్తిగా మారలేదని, ఆర్థికంగా బలోపేతమైతేనే మహిళల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అనంతరం క్లబ్ సభ్యులు కలెక్టర్, ఎమ్మెల్యే, ఏఎంసీ చైర్మన్తోపాటు ఎస్టీవో కరుణశ్రీ, మహిళా సంఘం సభ్యురాలు మార స్వరూపను శాలువాలతో సత్కరించారు. క్లబ్ ప్రధాన కార్యదర్శి బాల శ్రీనివాస్, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్, అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో రాణించాలి రెబ్బెన: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ హరిత సూచించారు. గోలేటి టౌన్షిప్లోని ఆఫీసర్స్ క్లబ్లో బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హా జరై బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఎంచుకున్న రంగాల్లో పట్టుదలతో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆ కాంక్షించారు. వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణపత్రాలు అందజేశారు. వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారుల నృత్యాలు అ లరించాయి. సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ టిబ్రెవాల్ సతీమణి ఆర్తి, బెల్లంపల్లి ఏరియా సేవాసమితి అధ్యక్షురాలు ఎం. పద్మ విజయభాస్కర్రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు నరేందర్, సీనియర్ సేవా సభ్యులు శంకరమ్మ, కోమల తదితరులు పాల్గొన్నారు. -
పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
సిర్పూర్(టి): పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైల్డ్లైఫ్ పీసీసీఎఫ్ వినయ్కుమార్ సూచించారు. ఆదివారం సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్(టి) రేంజ్పరిధిలోని ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో పులుల సంచారం అధికంగా ఉందని, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి రాకపోకలు సాగించే కారిడార్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటిక్యాల పహాడ్ అ టవీప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ఏర్పా టు చేసిన నీటి కుంటలు, సోలార్ నీటి కుంటలు, చెక్డ్యాంల ద్వారా వన్యప్రాణుల దాహా ర్తి తీరుతుందని తెలిపారు. అనంతరం పులికారిడార్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, నీటికుంటలు, నీటి వసతుల వద్ద వన్యప్రాణులు వచ్చి వెళ్లే చిత్రాలు, వీడియోలు పరిశీలించారు. టైగర్ ట్రాకింగ్ విధానం గురించి సెక్షన్ అధికారి మోహన్రావ్ను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై అధికారులు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో వన్యప్రాణులు, పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలను ప్రశంసించి సెక్షన్ అధికారి మోహన్రావ్, బీట్ అధికారి నరేశ్, సిబ్బందిని అభినందించారు. కవ్వాల్ ఎఫ్డీపీటీ శాంతారాం, డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్, నిర్మల్ డీఎఫ్వో సుశాంత్ సింగ్ బొబాడే, ప్రొబెషనరీ ఐఎఫ్ఎస్ భార్గవ్కుమార్, కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్య, ఎఫ్ఆర్వోలు అనిల్కుమార్, రమాదేవి, ఎఫ్ఎస్వోలు, బీట్అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
● క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● ఎండవేడికి అల్లాడుతున్న జిల్లా జనం ● ప్రత్యామ్నాయ చర్యలతో ఉపశమనం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
మధ్యాహ్నం నిర్మానుష్యంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిఆసిఫాబాద్అర్బన్: వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాత్రివేళ చలి ఉంటుండగా ఉదయం 10గంటలు దాటితే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పశుపక్షాదులు కూడా ఎండలకు అల్లాడుతున్నాయి. కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గతంలోనూ మార్చిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలున్నాయి. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఈనెల 7న పెంచికల్పేట మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 నమోదు కాగా, అత్యధికంగా 38.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం బెజ్జూర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 18.4 డి గ్రీలు నమోదు కాగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 38.6 డి గ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే ఎండ తీ వ్రత ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నా రు. ఎండలు పెరుగుతుండడంతో వీధి వ్యాపారులు పక్కా షెడ్లు లేక గొడుగుల కిందే వ్యాపారాలు చేసుకుంటున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సినవారు ఎండ నుంచి రక్షణకు తలకు టోపీ లేదా టవల్ ధరిస్తున్నారు. జ్యూస్ సెంటర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది. మధ్యాహ్నం వేళ జ్యూస్ సెంటర్లు, కూల్డ్రింక్ షాపులు కిటకిటలాడుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండేందుకు రోజుకు తగినంత నీరు తాగాలి. ఇంటి నుంచి బ యటకు వెళ్లేటపుడు తేలికపాటి దుస్తులు, తలకు టోపీ, ముఖానికి మాస్క్, కళ్లకు సన్గ్లాసెస్ ధరించాలి. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకువెళ్లకపోవడమే మంచిది. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలి. కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటే మరీ మంచిది. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకో వాలి. పోషకాలు కలిగిన కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్స్ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వ్యాయామం, యోగా, సూర్య నమస్కారాలు చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంటి ని చల్లగా ఉంచుకోవాలి. పగటి వేళ కిటికీలు, తలు పులు మూసి ఉంచి సాయంత్రం వేళ తెరవాలి. శరీ రంలో ఏవైనా మార్పులు సంభవిస్తే వైద్యుడిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.జ్యూస్ సెంటర్ వద్ద సేదతీరుతున్న యువకులు -
తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలి
కాగజ్నగర్టౌన్: తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ చెత్త వాహనంలో వేయాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్ 2, 12 వార్డుల్లో పరిశుభ్రతపై ఆదివారం అవగాహన కల్పించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. అనంతరం వార్డు కౌన్సిలర్ దుర్గమ్మ ఆధ్వర్యంలో కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందిని శాలు వాలతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సి లర్ బాబురావు, రెవెన్యూ అధికారి రాజేందర్, సిబ్బంది రఫీక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, పర్యావరణ ఇంజినీర్ ప్రణిల్, వార్డు అధికారి ఉష, కాలనీవాసులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
కాగజ్నగర్టౌన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎ మ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివారం పట్ట ణంలోని గాంధీ పార్క్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ తిరుప తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్ర జా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాపాలన కా ర్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు చెత్త ను ఇంటింటా తిరిగే మున్సిపల్ చెత్తవాహనాల్లో వే యాలని సూచించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో పట్టణంలో సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ప్రత్యేకాధికారి సాయి, మున్సిపల్ డీఈ, మున్సిపల్ చైర్పర్సన్ సాహిన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత, కౌన్సిలర్లు జ్యోతి, వసీమున్నీసా, విజయ్కుమార్, విశ్వేశ్వర్రావు, నా యకులు దస్తగీర్, షబ్బీర్, శివ, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. -
అరణ్యంలో అతివలు
అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుకుసాగుతున్నా యూనిఫాం విభాగంలో పని చేయడం కత్తిమీద సామే. అయినప్పటికీ కష్టమైనా ఇష్టంతో అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. అటవీ సంరక్షణలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మోట్లగూడ సెక్షన్ అధికారి స్వప్న, గిన్నెదరి రేంజ్ అధికారి సరోజ ఉత్తమ అవార్డులు పొందారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..అడవుల రక్షణకు కట్టుబడి విధులు నిర్వహిస్తున్నాం ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా అడవుల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నాను. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ వారి సలహాలు, సూచనలతో ముందుకు సాగుతున్నాను. నా కూతురును ఐఎఫ్ఎ్స్ చదివేందుకు సిద్ధం చేస్తున్నాను. – స్వప్న, సెక్షన్ అధికారి, మోట్లగూడ కష్టమైనా ఇష్టంతోనే.. అడవిలో విధులు నిర్వహించడం మహిళలకు చాలా కష్టమైన పని. చిన్నప్పటి నుంచి యూనిఫాం సర్వీస్పై నాకు మక్కువ ఎక్కువ. ప్రస్తుతం అటవీశాఖలో రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తూ అటవీ పరిరక్షణకు కృషి చేస్తున్నాను. సమాజంలో పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. – సరోజ, ఫారెస్ట్ రేంజ్ అధికారి, గిన్నెదరి కత్తి మీద సామే అయినా.. ఇతర ఉద్యోగాలతో పోల్చితే అటవీశాఖ లో విధులు నిర్వర్తించడం కత్తిమీద సామే. అయినా, ఉన్నతాధికారుల సహకారంతో విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచే యూనిఫాం ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. నా కల నెరవేరింది. దీంతో సంతోషంగా విధులు నిర్వర్తిస్తున్నాను. – అనూష, అటవీ సెక్షన్ అధికారి, జైనూర్ -
జిల్లా పాలనలోనూ..
మహిళలు నిబద్ధతతో పనిచేస్తారు ప్రజాసమస్యలను నా సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తున్నాను. గ్రీవెన్స్ విభాగానికి వచ్చే సమస్యలను ఫాలోఅప్ చేస్తూ బాధితుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాను. ప్రకృతితో నిండి ఉన్న జిల్లాలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. విధి నిర్వహణలో ట్రావెల్ చేయడం కష్టమనిపించదు. మగవారి కంటే మహిళలు ఎంతో నిబద్ధతతో పనిచేస్తారు. – కె.హరిత, కలెక్టర్ జిల్లాపై ఎస్పీది ప్రత్యేక ముద్ర బాధ్యతలు స్వీకరించిన నుంచి ఎస్పీ నితిక పంత్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతూ బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
నస్పూర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం ఆయన ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భా గంగా కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి 30, 16వ డివిజన్లలో పర్యటించారు. 30వ డివిజన్లో వీధి దీపాలు వెలుగడం లేదని స్థానికులు తెలుపగా ఎమ్మెల్యే వెంటనే ఏఈ రాంచందర్కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. విలేజ్ శ్రీరాంపూర్ బస్టాప్ వద్ద బస్సులు నిల పడం లేదని మహిళలు దృష్టికి తీసుకు రాగా.. డిపో మేనేజర్ శ్రీనివాస్కు ఫోన్ చేసి బస్సులు నిలపాలని ఆదేశించారు. కార్పొరేటర్లు శ్రీనివాస్, త్రివేణి ఉన్నారు. -
తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు. పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డు రియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు. మత్తుపదార్థాల నివారణే లక్ష్యం వేమనపల్లి: డ్రగ్స్ రహిత తెలంగాణతోపాటు గంజాయి, నాటుసారా ఇతర మత్తు పదార్థాలపై నివారణే లక్ష్యంగా పని చేద్దామని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని మంగనపల్లి క్రాస్ రోడ్డు వద్ద పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్షలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరలు, పదవ తరగతి విద్యార్థులకు కంపాక్స్ బాక్సులు, ప్యాడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ క్రిష్ణ, ఎస్సై జగదీష్రెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు. ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలిపాతమంచిర్యాల/లక్సెట్టిపేట: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఆస్పత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖి చేసి పురోగతిని పరిశీలించారు. అనంతరం సాయికుంటలో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లక్సెట్టిపేట ఆసుపత్రి సందర్శించి రోగులతో మాట్లాడారు. రోగులకు అత్యవసర వేళలో తక్షణమే వైద్యం అందించాలని సూచించారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అ మలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబా ద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా హాజరుకాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవ రీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించి వాటి వివరాలను శాఖ లు, పనిచేయిస్తున్న ఏజెన్సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మై నింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించా లని సూచించారు. సంక్షేమ పథకాలకు గాను లబ్ధి దారుల ఎంపిక, అమలు కోసం సాంకేతికత విని యోగించుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరు చేశారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాద వ్, వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా నోడల్ అధికారి అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి వీడియో కాన్ఫరెన్స్కు ఆసిఫాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
సేంద్రియం వైపు ‘సాగు’దాం..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు కెరమెరి మండలం దనోరా గ్రామానికి చెందిన కేంద్రె బాలాజీ. 2015 నుంచి పదెకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కంది, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, అనుములతోపాటు కూరగాయలైన టమాట, చిక్కుడు, అలసంద, వంకాయ పండిస్తున్నారు. అలాగే బత్తాయి, ఆపిల్, మామిడి, బొప్పాయి సాగు చేస్తున్నారు. ఏడాదికి రూ.4 లక్షలు పెట్టుబడి పెడుతుండగా, రూ.7 లక్షల ఆదాయం వస్తోంది. సంవత్సరానికి రూ.3 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. జిల్లాలోనే సేంద్రియ పంటలు పండించిన తొలి రైతుగా ఆయన గుర్తింపు పొందారు. కెరమెరి: అధిక దిగుబడుల కోసం రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిమితికి మించి వాడుతున్నారు. దీంతో బియ్యం, పప్పులు, నూనెగింజలు వంటి ఆహార ధాన్యాల్లో రసాయన అవశేషాలు ఉండి మనుషుల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రజలకు, పర్యావరణానికి మేలు చేస్తుందని భావించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అన్నదాతలను సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’(ఎన్ఎంఎన్ఎఫ్) పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో క్లస్టర్లో 125 మంది ఎంపికకేంద్ర అమలు చేస్తున్న ప్రభుత్వం జాతీయ వ్యవసా య పథకం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ – 2024లో భాగంగా జిల్లాలోని 15 మండలాలకు చెందిన సీఆర్పీలకు గత నెలలో నిపుణులతో శిక్షణ అందించారు. జిల్లాలో మొత్తం 70 వ్యవసాయ క్లస్ట ర్లు ఉండగా 24 క్లస్టర్లను ఇందుకోసం గుర్తించారు. ఒక్కో క్లస్టర్కు 125 మంది రైతులను ఎంపిక చేశా రు. సీఆర్పీలు ప్రస్తుతం రైతులకు సేంద్రియ వ్యవసాయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. మట్టి నమూనాలు సేకరణభూసార పరీక్షల కోసం 3,000 మంది రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించారు. ఫలితాల ఆధారంగా భూమిని సహజ సాగుకు యోగ్యంగా మార్చాల్సి ఉంటుంది. వచ్చే యాసంగి నాటికి ప్రతీ రైతు కనీసం ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ముందుగా మహిళా సంఘాల్లోని సభ్యులను ‘కృషి సఖీ’లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా ఇతర రైతులకు అవగాహన కల్పించనున్నారు. కెరమెరిలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన బొప్పాయిజిల్లా వివరాలుమొత్తం క్లస్టర్లు 70 పథకం అమలవుతున్నవి 24 సీఆర్పీలు 48 బీఆర్సీలు 16 ఒక్కో క్లస్టర్లో రైతులు 125 మొత్తం రైతులు 3000 జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంభూమిలో సహజంగా ఉండే జీవవైవిధ్యాన్ని, పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు, కీటకాలను కాపాడుకునేలా సహజ సేద్యం ఉంటుంది. పశువులు, ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాగులో జీవ నియంత్రణ పద్ధతులు, వృక్ష సంబంధిత కషాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీజామృతంతో విత్తన శుద్ధి, జీవామృతంతో పురుగులను అదుపు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటించాలి. దేశీ ఆవు పేడ, మూత్రం, ఇతర సహజ పదార్థాలతో ఎరువులు తయారు చేసి వినియోగించడమే ఈ పథకం లక్ష్యం. సాగు విధానం, యాజమాన్య పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. అందులో మట్టిలోని పోషక విలువలు కీలక భూమిక పోషిస్తాయి. రైతులు ప్రస్తుతం నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలను మాత్రమే వాడుతూ, మిగతా సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా నేలకు అవసరమైన పోషకాలను సహజ పద్ధతిలో పెంపొందించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. -
తాగేందుకు ‘భగీరథ’ నీళ్లు మేలు
రెబ్బెన: చేతిపంపుల నీటి కంటే తాగేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు ఎంతో మేలని మిషన్ భగీరథ ఎస్ఈ రవీందర్ అన్నా రు. మండలంలోని రాంపూర్ పంచాయతీని శుక్రవారం సందర్శించారు. మిషన్ భగీరథ నీటితో పాటు బోర్వెల్స్ ద్వారా వచ్చే నీటిని పరీక్షించారు. స్థానికులు సరఫరా చేస్తున్న నీటిని వినియోగిస్తున్నారా.. సాధారణ చేతిపంపుల నీటిని వినియోగిస్తున్నారా అని ఆరా తీశారు. భగరీథ నీటిని ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నామని చెప్పగా.. చేతిపంపుల నీటితో పోల్చితే భగరథ నీటిలో టీడీఎస్ తక్కువగా ఉందని తెలిపారు. టీడీఎస్ ఎక్కువ ఉన్న నీటిని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. మినరల్ వాటర్ ఎప్పటి పరిస్థితుల్లో వినియోగించవద్దని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీలో రికార్డులు, వాటర్ ట్యాంక్ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఈ శైలేందర్, ఏఈఈ వికాస్, గ్రిడ్ ఏఈఈ రాజేశ్, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, ఉప సర్పంచ్ పురుషోత్తం పాల్గొన్నారు. -
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం
ఆసిఫాబాద్: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం అత్యంత అవసరమని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నీటికాసుల(గ్లాకోమా) వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నీటికాసుల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలన్నారు. తద్వారా శాశ్వత దృష్టిలోపాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ అనంతుల్లా, విజయ పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా అన్నారు. పట్టణంలోని వార్డు నం.18లో శుక్రవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వైస్చైర్పర్సన్ కొత్తపల్లి సునీత, కమిషనర్ తిరుపతితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధి కారులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. 99 రోజులపాటు నిర్వహించే పనులను అధి కారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
పరిశుభ్రత అందరి బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: పరిశుభ్రత అందరి బాధ్యత అని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి చెత్తను సేకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్క రూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పారిశుద్ధ్యం లోపించడంతోపాటు పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభా వం పడుతుందని తెలిపారు. ఎక్కడైనా చెత్త కనిపి స్తే విధిగా డస్ట్బిన్లో వేయాలని సూచించారు. ప్రజలు చెత్తను రోడ్లపై కాకుండా మున్సిపల్, పంచాయతీల చెత్త సేకరణ వాహనాల్లో వేయాలన్నా రు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీడబ్ల్యూవో భాస్కర్, డీటీడీవో రమాదేవి, హర్టికల్చర్ అధికారి నదీమ్, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, వెటర్నరీ అధికారి సురేశ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహంకాళి జాతరకు ఆహ్వానంఆసిఫాబాద్అర్బన్: రెబ్బెన మండలం ఇందిరానగర్లోని శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2న నిర్వహించే జాతరకు హాజరుకావాలని ఆలయ అర్చకుడు దేవర వినోద్, నిర్వాహకులు కలెక్టర్ హరితను ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్తో కలిసి జాతర పోస్టర్లు ఆహ్వానించారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కల్యాణ మహోత్సవం, 3న జాతర కొనసాగుతుందని తెలిపారు. -
ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ!
ఆసిఫాబాద్అర్బన్: వేసవి ఎండల నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర పౌరసరఫరాల శాఖ లేఖలు రాసింది. ఈ క్రమంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఏప్రిల్లోనే మూడు నెలల బియ్యం అందనుంది. గోదాముల నుంచి బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 15 మండలాల పరిధిలో 315 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 1,63,765 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,389 అంత్యోదయ కార్డులకు 43,821 యూనిట్లకు 468.615 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అలాగే 1,50,356 ఆహార భద్రత కార్డులకు 4,95,204 యూనిట్లకు 2690.928 మెటిక్ టన్నులు, 20 అన్నపూర్ణ కార్డులకు 0.200 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. ప్రతినెలా సుమారు 3519.743 మెట్రిక్ టన్నుల బియ్యం చొప్పున మూడు నెలలకు కలిపి సుమారు 10559.229 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనున్నారు.జిల్లా ప్రజలకు మేలుగతేడాది వర్షాకాలంలో వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి పంపిణీ చేశారు. అలాగే వేసవిలో ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మారుమూల గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులకు మేలు జరగనుంది. తిర్యాణి మండలంలోని పల్లెలతోపాటు పలు గ్రామాల్లో స్థానికంగా రేషన్ దుకాణాలు లేవు. ఐదారు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ఒకేసారి బియ్యం అందిస్తే వీరికి దూరభారం తగ్గనుంది. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం చేస్తే రవాణా చార్జీల ఖర్చు తగ్గి, హమాలీలు, డీలర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే బియ్యం నిల్వ చేయడం సమస్యగా మారనుంది. బియ్యం తీసుకునేందుకు ఒక కార్డుదారుడు మూడుసార్లు వేలిముద్ర వేయాలి. గతంలో జిల్లాలో సిగ్నల్, సర్వర్ సమస్యతో ఒక్కో కార్డుదారుడికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. కేంద్రాల వద్ద పడిగాపులు తప్పలేదు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పౌరసరఫరాల శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.ఉత్తర్వులు అందలేదుఏప్రిల్లో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం. ప్రతీ రేషన్కార్డు దారుడు ఈ నెల చివరి వరకు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలి.– వసంతలక్ష్మి,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
జాతీయస్థాయి ఇస్నీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
బాసర:జాతీయస్థాయిలో నిర్వహించిన ఇస్నీ మోటార్ స్పోర్ట్ సీజన్–13లో పోటీల్లో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన టీమ్ గరుడ అసాధారణ ప్రదర్శనతో ఆల్ ఇండియా 5వ ర్యాంక్ సంపాదించింది. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న జట్ల మధ్య కఠిన పోటీలో ఈ ఘటన సాధించడం విశేషం. టీమ్ గరుడ వివిధ విభగాల్లో విజయాలు సాధించింది. యాక్సిలరేషన్లో 5.46 సెకన్లలో రికార్డు సమయంతో 1వ ర్యాంక్ సాధించింది. డిజైన్ క్విజ్లో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ డిజైన్ రివ్యూలో 3వ ర్యాంక్ సాధించింది. డిస్–అసెంబ్లీ/అసెంబ్లీ విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. ఆటోక్రాస్, ఎండ్యూరెన్స్లో కూడా నిలకడైన ప్రతిభ కనబర్చింది. థ్రోటిల్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా, డ్రైవింగ్ నైపుణ్యాలు, జట్టి సహకారంతో అధిగమించారు. విద్యార్థులకు అభినందన.. జాతీయస్థాయిలో ఆర్జీయూకేటీ ప్రతిభను చాటిన టీమ్ గరుడ సభ్యులను వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ ప్రశంసించారు. ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ కె.మహేశ్, డాక్టర్ ఎన్.విజయ్ కుమార్, విభాగాధిపతి ఎ.చరణ్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అన్పత్ రాహుల్ మార్గదర్శకత్వాన్ని అభినందించారు. స్పాన్సర్లు యునైటెడ్ వే హైదరాబాద్, ఫ్యూచర్ టీచ్ ఫౌండేషన్, వీఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఈఈ సిస్టమ్స్, పీఎస్ అసోసియేషన్కు జట్టు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని టీమ్ గరుడ ధీమా వ్యక్తం చేసింది. -
బైక్ను ఢీకొన్న కారు
● ఇద్దరికి తీవ్రగాయాలు బోథ్: మండలంలోని ఘన్పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనుగుట్ట గ్రామ సమీపంలో సొనాల గ్రామం నుంచి క్రాస్ రోడ్డు వైపు వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న యువకులు అనిల్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితులిద్దరూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. విధుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. -
పనిలో భద్రత ప్రమాణాలు పాటించాలి
చెన్నూర్: ప్రతీ ఉద్యోగి తన పనిలో, నిత్య జీవితంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని ఎస్టీపీపీ జీఎం ఎం.నర్సింహారావు తెలిపారు. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో గురువారం 55వ భద్రతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జీఎం నర్సింహారావు సేఫ్టీ ప్లాగ్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగి భద్రతగా ఉంటే అతడిపై ఆధారపడిన కుటుంబం భద్రంగా ఉంటుందని తెలిపారు. జాతీయ భద్రత దినోత్సవాలు ఎస్టీపీపీలో 13ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం(పీసీఎస్), వోఅండ్ఎం చీఫ్ మదన్మోహన్, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్, ఏజీఎంలు శ్రీనివాస్, ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రెట రీ పర్శయ్య, సీఎంవోఏఐ ప్రెసిడెంట్ పంతులా, డీ జీఎం అజాజుల్లాఖాన్, శ్రీధర్, శివప్రసాద్, వేణుగో పాల్, జనగామ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
ఉట్నూర్రూరల్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99రోజుల కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐటీడీఏ పీవో ఛాంబర్లో డీటీడీవో, ఏటీడీవోలు, హెచ్డబ్ల్యూవోలు, ఐటీడీఏ కార్యాలయ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. శుక్రవారం నుంచి జూన్ 12వరకు 99రోజుల కార్యాచరణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా 10 అంశాలపై కార్యక్రమం కొనసాగుతుందని, మార్చి 6నుంచి 15వరకు ఆశ్రమ పాఠశాలలోని డార్మెంటరీ, కిచెన్, ఆశ్రమ పాఠశాలలో పరిసరాలు, స్టాక్ రూంలు పరిశుభ్రం చేయాలని, పనికిరాని పాత వస్తువులను పోగు చేసి వేలం వేస్తూ వచ్చే డబ్బులతో పాఠశాలలో మరమ్మతు పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్టాక్ రూంలలో ఎలుకలు, బొద్దింకలు, కీటకాలు లేకుండా చూడాలని, పాడైన పప్పులు, సరుకులు, బియ్యం, జీసీసీకి పంపించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రధానోపాధ్యాయులదే బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాలల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా చూడాలని, ప్రతీ ఆశ్రమ పాఠశాలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. పాఠశాలలను కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారి ఎప్పుడైనా తనిఖీలు చేయవచ్చని, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులను గుర్తించి కాలేజీ ప్రిన్సిపల్, హెచ్డబ్ల్యూవోలు, పీఎంహెచ్ఎస్, విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క విద్యార్థినీ బడి బయట ఉండకుండా బడిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ అధికారులున్నారు. -
డబుల్ రిజిస్ట్రేషన్ మోసం కేసులో నిందితురాలి అరెస్ట్
ఆదిలాబాద్రూరల్: మావల గ్రామ పరిధిలో ఒకే ప్లాట్ను పలుసార్లు విక్రయించి పలువురిని మోసం చేసిన కేసులో కీలక నిందితురాలు చింతలపల్లి ఆశాలతను గురువారం అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో మావల గ్రామంలోని సర్వే నంబర్ 175లోని 23వ ప్లాట్ను నిందితురాలు రూ.1.10 లక్షలకు రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా విక్రయించింది. అదే ప్లాట్ను 1996లో డాక్టర్ మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల ద్వారా వెల్లడైంది. అయితే, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి షేక్ ఇక్బాల్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు తన భర్తతో కలిసి సుమారు 30ఏళ్ల కిందట సర్వే నంబర్ 175లో లేవుట్ రూపొందించి 1996లో ప్లాట్లు అమ్మిన తర్వాత, అవే ప్లాట్లను మళ్లీమళ్లీ ఇతరులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది. బాధితులు ప్రశ్నించిన సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు 1996లో జరిగిన అసలు అమ్మకాల రిజిస్ట్రేషన్ పత్రాలు, అనంతరం జరిగిన మోసపూరిత రిజిస్ట్రేషన్ల ఽధ్రువీకరణ పత్రాలు తదితర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్డులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ప్రజలు కనీసం 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు, ఎంకంబ్రెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) పరిశీలించి జాగ్రత్తగా కొనుగోలు చేయాలని సూచించారు. సుంపుటం శివారులో తాబేలు శిలాజాలువేమనపల్లి: మండలంలో ఏ మట్టి దిబ్బల్లో ఏం ఖనిజం ఉంటుందో తెలియదు. ఇక్కడ ఒక్కోరాయి ఒక్కో చరిత్ర చెబుతుంది. వృక్ష, చేప, నత్తగుల్ల, రాకాసి బల్లి, ఎన్నోరకాల శిలాజ అవశేషాలు ఇక్కడ కోకొల్లలు. తాజాగా సుంపుటం సమీప వంతెన వద్ద తాబేలు ఆకృతి శిలాజాలు వెలికిచూశాయి. విధులకు వెళ్లిన అటవీ శాఖ బేస్క్యాంప్ సిబ్బంది ఈ శిలాజాలను గమనించి తమ కెమెరాల్లో బందించారు. అక్కడకి సమీప ప్రాణహితా నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా పలురకాల శిలాజాలు ఉన్నాయి. ఏడాది క్రితం రోడ్డు పనుల కాంట్రాక్టర్ వంతెన అప్రోచ్రోడ్డుకు బండ రివిట్మెంట్ కోసం ఈ అరుదైన శిలాజాలను ధ్వంసం చేశారు. పురాతన చరిత్ర ఆనవాళ్లు కనుమరుగు కాకుండా పురావస్తు, భూగోళ శాస్త్ర అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
చైన్స్నాచింగ్ కేసులో నిందితురాలి అరెస్ట్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లో ఇటీవల జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం మందమర్రి సీఐ పర్స రమేష్, పట్టణ ఎస్సై శ్రీధర్ వివరాలు వెల్లడించారు. గోదావరిఖని చెందిన గాజంగి శ్రావణి, మంచిర్యాలకు చెందిన లాస్యకు గతంలో పరిచయం ఉంది. లాస్య శ్రావణిని మభ్యపెట్టి ఈ నెల 2న రామకృష్ణాపూర్కు తీసుకొచ్చింది. శ్రావణి టాయిలెట్కు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు లాగేసుకుని అక్కడే పడి ఉన్న మొబైల్ఫోన్ను దొంగిలించి పారిపోయింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న రామకృష్ణాపూర్ పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక సాయంతో ఆధారాలు సేకరించారు. దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు వచ్చిన లాస్యను గురువారం మంచిర్యాలలో పట్టుకుని పుస్తెలతాడు, మొబైల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. లాస్య భర్త, కుమారుడిని వదిలి జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తోందని సీఐ వివరించారు. నిందితురాలిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఆర్జీయూకేటీ విద్యార్థులకు సిమెన్స్ స్కాలర్షిప్
బాసర:నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ఇంజినీరింగ్ విద్యార్థులు సిమెన్స్ ఇండియా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రోగ్రాంలో చోటు సంపాదించారు. యువ ప్రతిభలను ప్రోత్సహించి, ఆధునిక టెక్నాలజీ నాయకులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఎంపికై న విద్యార్థులకు ఆర్థిక సహాయంతోపాటు వృత్తి అభివృద్ధి అవకాశాలు అందుతాయి. స్కాలర్షిప్ ప్రయోజనాలు ఈ పథకం విద్యార్థులకు సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తుంది. పూర్తి ఆర్థిక సహకారం విద్యా ఖర్చులకు. పరిశ్రమ నిపుణుల ప్రత్యక్ష మెంటర్షిప్. అధునాతన సాంకేతిక శిక్షణ, ప్రాక్టికల్ అనుభవం. ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్లు, ఆధునిక ఇంజినీరింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఈ అవకాశాలు విద్యార్థుల కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ స్కాలర్షిప్కు ఎంపికై న బి.శ్వేత, సమీనా, చిన్నారెడ్డి, శ్యామ్, హిమబిందును అభినందించారు. ఈ అవకాశం వారి కెరీర్ శిఖరాలు, దేశ సాంకేతిక పురోగతికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. స్కాలర్షిప్ సెక్షన్ ఇన్చార్జ్ డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ టి.రాకేశ్రెడ్డి, డాక్టర్ బావ్సింగ్తోసహా సిబ్బంది అభినందించారు. -
ఉపాధిహామీ కూలీ మృతి
కౌటాల: మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన నికోడే దివాంజీ(55) అనే ఉపాధిహామీ కూలీ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దివాంజీ వారం రోజులుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. గురువారం ఉదయం పని ప్రదేశంలో బీపీ పెరిగి సొమ్మసిల్లి కిందపడ్డాడు. తోటి కూలీలు గమనించి కౌటాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు పరీక్షించి దివాంజీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య ఎంకుబాయి, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
గుంజాల శివారులో పులి సంచారం
తాంసి: భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామశివారులోగల పంటచేలలో పులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గుంజాల గ్రామ శివారులో పంటచేలకు వెళ్లే దారి లో రైతులకు పులి పాదముద్రలు కనిపించడంతో దాని సంచారం ఉందని భయపడుతున్నారు. గ్రా మానికి చెందిన రైతులు ధనోర గ్రామం వైపునున్న పంటచేలకు ఉదయం పూట వెళ్తూ మట్టిరోడ్డుపై పులి పాదముద్రలు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, గత నెల 3న గొల్లఘాట్ శివారులోని పంటచేలల్లో మేతకు వెళ్లిన లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు దాని కదలికలు తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు సెక్షన్ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి పులి కదలికలను నిరంతరం పరిశీలించారు. దాని కదలికలు కనిపించకపోవడంతో తిరిగి పులి మహారాష్ట్ర వైపు వెళ్లి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కానీ, మళ్లీ గుంజాల శివారులో పులి పాదముద్రలు కనిపించడంతో అదే పులి సంచరిస్తూ ఇటు వైపు వచ్చిందా.. లేదా వెరే పులి మహారాష్ట్ర వైపు నుంచి మళ్లీ వచ్చిందా.. అనేది తెలియాల్సి ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి పులి నుంచి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అదనపు కట్నం కోసం వేధించిన భర్తపై కేసు
లక్సెట్టిపేట: అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు మద్యంమత్తులో దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. లక్సెట్టిపేటలోని మోదెల నెహ్రుకు చెందిన మంచాల కవితను ఆమె భర్త మంచాల సుధాకర్ అదననపు కట్నం కోసం వేధిస్తున్నాడని తెలిపారు. 2009లో కవితకు సుధాకర్తో వివాహం జరుగగా, కూతురు(10) ఉందని, పెళ్లయిన ఏడాది నుంచే సుధాకర్ మద్యానికి బానిసై ఆమెను అనేక సార్లు కొట్టాడని తెలిపారు. ఈ విషయమై పలువురు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారని తెలిపారు. సుధాకర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గురువారం బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
ఇంద్రవెల్లి: అనారోగ్యంతో బాధపడుతూ మండలంలోని దస్నాపూర్గూడకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాయన్న, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దస్నాపూర్ పంచాయతీ పరిధి దస్నాపూర్గూడకు చెందిన కరాలే సిద్ధేశ్వర్ (23) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు, గ్రామస్తులు 108 అంబులెన్స్లో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించగా చిక్సిత పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి వృద్ధుడి ఆత్మహత్యభైంసాటౌన్: కడుపునొప్పి భరించలేక ఓ వృద్ధుడు గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. భైంసా పట్టణంలోని ధోబీగల్లీకి చెందిన తాండ్రోల్ల పోశెట్టి(66) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గురువారం గడ్డెన్న ప్రాజెక్టు నీటిలో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. సరిహద్దులో చోరీల కలకలంకెరమెరి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం లేండిగూడ గ్రామంలో చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. లేండిగూడ గ్రామానికి చెందిన సూర్యవంశీ రామేశ్వర్, భారతి దంపతులు పత్తితీత పనుల కోసం 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కాగజ్నగర్ మండలానికి వెళ్లారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో లైట్లు వేసి ఉండడాన్ని రామేశ్వర్ సోదరుడు నారాయణ గమనించాడు. బీరువా తెరిచి ఉండటంతో రామేశ్వర్ దంపతులకు సమాచారం అందించాడు. గురువారం బాధితులు ఇంటికి వచ్చి కెరమెరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీరువాలోని 5 గ్రాముల బంగారు గొలుసు, రూ.16వేల నగదు ఎత్తుకెళ్లారని వారు తెలిపారు. నెల రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాగ్మారే శివాజీ ఇంట్లోనూ దొంగలు పడి ఐదు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితులు మహారాష్ట్రలోని జివితి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ నగలు దొంగలు దొరకలేదు. -
విద్యార్థి అదృశ్యం కథ సుఖాంతం
చెన్నూర్: చెన్నూర్లోని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి పెద్దపోలు నాగవర్థన్ అదృశ్యం కథ సుఖాంతమైంది. విద్యార్థి అదృశ్యంపై తల్లిదండ్రులు స్వరూప, సమ్మగౌడ్, కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. బాలుడు క్షేమంగా రావడంతో స్థానిక పోలీసుస్టేషన్లో తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. నాలుగు రోజులు క్రితం నాగవర్థన్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో చెన్నూర్లోని మహాంకాళివాడలో నివాసం ఉంటున్న తండ్రి సమ్మగౌడ్ వచ్చి తీసుకెళ్లాడు. ఆరోగ్యం కుదుట పడడంతో బుధవారం ఉదయం 10:36 గంటలకు పాఠశాలలో అప్పగించాడు. సాయంత్రం 7గంటలకు పాఠశాల యాజమాన్యం తండ్రికి ఫోన్ చేసి విద్యార్థి పాఠశాలలో లేడని చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం పాఠశాల, పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలించి నాగవర్థన్ టాటా ఎస్లో మంచిర్యాలకు వెళ్లినట్లు గుర్తించారు. మధ్యాహ్నం సమ్మగౌడ్కు అతడి బంధువు ఫోన్ చేసి నాగవర్థన్ కరీంనగర్లో తన వద్ద ఉన్నాడని చెప్పాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెళ్లి తీసుకొచ్చారు. బాలుడిని విచారించగా చదువు ఇష్టం లేక వెళ్లిపోయినట్లు చెప్పాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సమావేశంలో ఎస్సైలు శ్యాంపటేల్, సుబ్బారావు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థులపై వేధింపులు
భైంసా: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో విద్యార్థులను పోలీసులు, యాజమాన్యం వేధిస్తున్నాయని, బెదిరింపులకు దిగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై హైదరాబాద్లో తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు గురువారం ఫిర్యాదు చేసినట్లు ఆప్ నేతలు తెలిపారు. విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ప్రశ్నిస్తే కేసులు పెడతామని, వారి భవిష్యత్తును నాశనం చేస్తామని బెదిరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన యాజమాన్యం, పోలీసులు వారిని భయపెట్టడం సరైన విధానం కాదని ఆప్ నేతలు విమర్శించారు. కొన్నేళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న వరుస విద్యార్థుల మరణాలు, ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు అయిన విద్యార్థుల ప్రాణరక్షణ, విద్యా హక్కుల పరిరక్షణ కోసం ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
అలరించిన ‘యూత్ పార్లమెంట్’ పోటీలు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో గురువారం నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలు ఆకట్టుకున్నాయి. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది గట్టు కుమార్ కార్తీక్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని యువతను సామూహికం చేసేందుకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఇలాంటి ఉపన్యాస పోటీలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. యువత ఆలోచన దృక్పథం మారాలని, సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ పోటీలో గెలుపొందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అక్కడ ప్రతిభ చూపిన ముగ్గురు పార్లమెంట్ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ కళాశాల నుంచి హాజరైన విద్యార్థులు ‘అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై ఉపన్యాసించారు. అసోసియెట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.లక్ష్మీనరసింహం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ, రిటైర్డ్ ఎంఈవో శంకరయ్య, కాగజ్నగర్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు తాళ్లపల్లి సురేందర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలు వేరు శ్రీనివాస్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దత్తాత్రేయ, అకడమిక్ కోఆర్డినేటర్ జనార్దన్, అధ్యాపకులు రాజేశ్వర్, శారద, దేవేందర్, వెంకటేశం, క్రిష్ణవేణి, మేరి, శాంభవి, సోనియా పాల్గొన్నారు. -
పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ కె.హరిత జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జూ మ్ మీటింగ్ ద్వారా అదనపు కలెక్టర్ డేవిడ్, జి ల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టా ల్సిన అభివృద్ధి పనులపై కార్యాచరణ రూపొందించాలన్నారు. 10 అంశాలపై 99 రోజుల పా టు కార్యక్రమం కొనసాగుతుందని, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలన్నారు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ప్రగతి ప్రణాళికకు సంసిద్ధం
ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6 నుంచి 99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఐదు దశల్లో అమలు చేయనున్నారు. శుక్రవారం నుంచి జూన్ 12 వరకు 10 అంశాలతో వ్యవసాయం, విద్య, యువత క్రీడలు, మహిళలు, పర్యావరణం సంబంధిత అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని పరిశీలించి లోపాలను సరిచేయనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గురువారం కలెక్టర్ కె.హరిత హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణపై జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరించనుంది. గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలు..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహిస్తారు. 16న మండల స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరో గ్యం, అరైవ్– అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత– క్రీడలు, మహిళలు, పర్యావరణంపై దృష్టి సారిస్తారు. ఈ నెల 6న శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నాలుగు జిల్లాల కలెక్టర్లతో ఆదిలాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో చేపట్టే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 99 రోజుల్లో శాఖల వారీగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. పర్యవేక్షణకు మొబైల్ యాప్ రూపకల్పనప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించారు. ప్రజలు తమ దరఖాస్తుల స్థితిని పరిశీలించి అప్డేట్ పొందే అవకాశం కల్పించారు. 10 అంశాల ప్రగతి, గ్రామ సభలు, మండల సమావేశాల వివరాలను మొబైల్ యాప్లోనే నమోదు చేయనున్నారు. ఫిర్యాదులు, సూచనలు నేరుగా సమర్పించి, వాస్తవ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా పారదర్శకత పెరిగి ప్రభుత్వం, ప్రజల మధ్య అంతరం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. కాగా శుక్రవారం ఈ మొబైల్ యాప్ విడుదల చేయనున్నారు. గ్రామ సభలు, మండల, జిల్లా స్థాయి సమావేశాల ద్వారా ప్రజలు తమ సూచనలు అందించడంతో పాటు ఫిర్యాదులు చేయవచ్చు. -
అవినీతిని అరికట్టాలని వినతి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల సాంఘిక సంక్షేమ అభివృద్ధి కార్యాలయంలో వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లోని నాలుగో తరగతి ఉద్యోగుల అక్రమ నియామకాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొన్ని వసతిగృహాల్లోనూ అక్రమంగా నియామకాలు చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నగేశ్, మహేశ్వర్, మహేశ్, సభ్యులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
రెబ్బెన: 108, 102కు కాల్స్ వస్తే తక్షణమే స్పందించాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అన్నా రు. మండల కేంద్రంలోని 108, 102 అత్యవసర అంబులెన్స్లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. అంబులెన్స్లో మెడికల్ స్టాక్, వైద్యపరికరాల పనితీరును పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్యం కోసం 108కు ఫోన్ చేస్తే సంఘటన స్థలానికి చేరుకుని సకాలంలో బాధితులను ఆస్పత్రులకు చేర్చాలన్నారు. విధుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం అవతలి వ్యక్తుల ప్రాణాలకు ముప్పు తెస్తుందని అన్నారు. వేసవి ఎండల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ఐస్ప్యాక్ బాక్స్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 108 మెడికల్ టెక్నీషియన్ రామన్న, పైలట్ సంతోష్ పాల్గొన్నారు. 108, 102 వాహనాలు తనిఖీవాంకిడి: మండలంలోని 108, 102 అత్యవసర అంబులెన్స్లను గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ తనిఖీ చేశారు. మందులు, పరికరాలు పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రవీణ్, అమృత్రావు, భీంరావు, రమేశ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో పన్నులు చెల్లించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలి టీ పరిధిలోని ప్రజలు పెండింగ్లో ఉన్న ఇంటి, ఇతర పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ గజానంద్ కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులో ఇంటింటికి వెళ్తూ యజమానుల వద్ద నుంచి బకాయి పన్నులు వసూలు చేశారు. ఆయన మాట్లాడుతూ 20 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని, దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నామన్నారు. ఇతర సమస్యలను కూడా పాలకవర్గం సహకారంతో త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చిలోనే భానుడి ప్రతాపం
కౌటాల: మార్చిలో భానుడు భగ్గుమంటున్నాడు. మూడు రోజులుగా వేసవి మంటలు తీవ్రమయ్యాయి. మార్చి ప్రారంభంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా, ఒకట్రెండు డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం మూడు రోజులుగా 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ తగ్గి ఉదయం 10 గంటల నుంచే జనం చెమటతో తడిసిపోతున్నారు. మరో వారంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు. ఏటా మంటలే.. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఏటా అధికంగా ఉంటోంది. సాధారణంగా మార్చి నుంచి మే మధ్య కాలాన్ని వేసవి సీజన్గా పరిగణిస్తాం. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారం నుంచే ప్రారంభమయ్యాయి. అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్లో ఏటా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గతేడాదితో పోల్చితే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్లో) ప్రాంతం ఉష్ణోగ్రతలు ఎల్కపల్లి 37.3 ఆసిఫాబాద్ 37.0 లోనవెల్లి 37.0 కౌటాల 36.9 బెజ్జూర్ 36.9 ధనోరా 36.8 రవీంద్రనగర్ 36.8కౌటాల మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు రెండు రోజుల క్రితం పని నిమిత్తం బైక్పై ఆసిఫాబాద్కు వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం ఎండలో ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో కొంత అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నాడు. ఎండలో బైక్పై ప్రయాణించడంతో వడదెబ్బ తగిలిందని, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని సదరు వైద్యుడు సూచనలు చేశారు... కాగా, మార్చిలోనే వడదెబ్బ తగిలే పరిస్థితులు ఉండగా, రానున్న రెండు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. -
కంట్రోలర్గా లక్ష్మణ్
కాగజ్నగర్: కాగజ్నగర్ బస్టాండ్ కంట్రోలర్గా ఆర్టీసీ ఉద్యోగి లక్ష్మణ్ను మంగళవారం నియమించారు. నాలుగు నెలలుగా కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులుపై ఫిబ్రవరి 28న ‘బస్టాండ్పై పట్టింపేది..?’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు డిపో మేనేజర్ రాజశేఖర్తో కలిసి ఈ నెల 2న బస్టాండ్ను సందర్శించారు. పారిశుద్ధ్యం, ఫ్యాన్లు పనిచేయకపోవడం, ఇతర సౌకర్యాలు పరిశీలించి ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగిని కంట్రోలర్గా నియమించారు. అలాగే మరమ్మతులు చేపట్టడంతో మంగళవారం నుంచి ఫ్యాన్లు తిరుగుతున్నాయి. -
సన్నగిల్లుతున్న ‘భరోసా’
రెబ్బెన: పంటల సాగుకు పెట్టుబడులు, యాజమాన్య ఖర్చులు పెరగడంతో రైతులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. అన్నదాతలకు ఆర్థిక చేయూతను అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించగా ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. ఏడాదికి ఎకరానికి రూ.12వేల చొప్పున రెండు సీజన్లకు అందిస్తామని ప్రకటించి గత వానాకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు కొనసాగుతోంది. జిల్లాలో ముందస్తుగా వేసిన పంటల దిగుబడి మరో రెండు నెలల్లో చేతికి అందనుంది. డిసెంబర్లో యాసంగి సీజన్ ప్రారంభంలో అందాల్సిన రైతుభరోసా సాయం ఇప్పటివరకు అందలేదు. గత యాసంగిలోనూ ఇదే తరహాలో ప్రభుత్వం ఊరించి.. చివరికి పెట్టుబడిసాయం అందించకుండానే దాటవేసింది. పెరిగిన పెట్టుబడి..జిల్లాలోని 15 మండలాల పరిధిలో యాసంగి సీజన్లో సుమారు 50,300 ఎకరాల్లో వరితోపాటు పప్పుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, తదితర పంటలు పండిస్తున్నారు. వానాకాలంలో సీజన్ ముగింపు సమయంలో కురిసిన అధిక వర్షాలతో ఈసారి చలితీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో సీజన్ మొదట్లో పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వరినారు ఎదుగుదల లేకపోవడంతో రైతులు నారు పెంచేందుకు అపసోపాలు పడ్డారు. తీరా చలితీవ్రత తగ్గుముఖం పట్టాక వాతావరణంలో విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పగలు ఎండలు, రాత్రి చలిగాలులు రైతులకు తలనొప్పిగా మారాయి. యాసంగి వరికి గతానికి భిన్నంగా తెగుళ్లు, పురుగు ఉధృతి ఉంది. ముందస్తుగా నాట్లు వేసిన చోట చలితో పైరులో ఎదుగుదల లేదు. రైతులు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు చల్లాల్సి వస్తోంది. దీనికితోడు సీజన్ ప్రారంభం నుంచి మొగిపురుగు, వేరుకుళ్లు తెగుళు, అగ్గితెగుళ్లు ఆశించడం క్రిమిసంహారక మందులను విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. దీంతో గతంలో కంటే ఈసారి పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. రైతులు అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు లభించేది. వానాకాలంలో 1,43,063 మందివానాకాలం సీజన్లో జిల్లాలోని 1,43,063 మంది రైతులకు ప్రభుత్వం రైతుభరోసా పెట్టుబడి సాయం కింద రూ.2,66,86,59,662 నగదు అందించింది. యాసంగి సీజన్లో ప్రభుత్వం సాగులో ఉన్న భూములకు మాత్రమే అందించాలని భావించింది. దీనికోసం శాటిలైట్ ద్వారా భూముల లెక్క తేల్చాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వానాకాలంలో సాయం అందుకున్న రైతులందరికీ యాసంగిలో అందిస్తామని తెలిపింది. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కేబినేట్ మీటింగ్లో రైతుభరోసా చెల్లింపుపై చర్చిస్తారని భావించారు. కానీ సమావేశం ఎలాంటి చర్చ లేకుండానే ముగిసింది. దీంతో యాసంగి పెట్టుబడిసాయం చెల్లింపుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తోంది. ఊరిస్తున్న ప్రభుత్వంరాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద వానాకాలం పంటల పెట్టుబడి సాయం ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమచేయగా.. యాసంగి సాయం అందించడంలో మాత్రం రైతులను ఊరిస్తోంది. పంచాయతీ ఎన్నికల సమయంలోనే రైతుభరోసా అందిస్తారని భావించగా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఎన్నికలు ముగియగానే రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. అయితే మున్సిపల్ ఎన్నికలు సైతం ముగిసినా ఉలుకుపలుకు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యాసంగి పంటల సీజన్ సగం పూర్తి కాగా.. మరో రెండు నెలల్లో పంట దిగుబడి సైతం చేతికందుతుంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో అందించా ల్సిన సాయాన్ని సీజన్ పూర్తయ్యే దశకు చేరుకున్నా విడుదల చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యాసంగి సీజన్లోనూ ఇదే తరహాలో ప్రభుత్వం రైతులను ఊరించి చివరికి పెట్టుబడి సాయాన్ని అందించకుండానే చేతులు దులుపుకొంది. -
డిమాండ్కు తగినట్లు సరఫరా
జిల్లాలో డిమాండ్కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పెరుగుతున్న విద్యుత్ లోడ్కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఓవర్ లోడ్ నియంత్రించేందుకు జిల్లాలో 14 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు ఏడు బిగించాం. అలాగే ఏబీ స్విచ్లు ఏర్పాటు చేస్తున్నాం. లోడ్ అధికంగా ఉన్న సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే దహెగాం, గుండాయపేట్, నజ్రూల్నగర్లో ఏర్పాటు చేశాం. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల్లో 33 కేవీ లైన్లు ఉన్నచోట కవర్ కండక్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. 70 కిలోమీటర్ల కేబుల్ అమర్చాం. – ఉత్తం జాడె, విద్యుత్ శాఖ ఎస్ఈ -
దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు చర్యలు
ఆసిఫాబాద్: దివ్యాంగులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో బుధవారం అధికారులు, దివ్యాంగుల హక్కుల కమిటీ సభ్యులతో హక్కులు, సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చేయూత పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద దివ్యాంగులకు తాగునీరు, నీడ, ప్రత్యేక టాయిలెట్ వసతితో పాటు సదరం శిబిరాల వద్ద వీల్చైర్లు, హెల్పర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం పథకాల్లో అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, అనుచితంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ మండలంలోని అధికారులతో దివ్యాంగుల సమస్యలపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఆర్డీవో దత్తారావు, దివ్యాంగుల హక్కుల సమితి ప్రతినిధులు ఇస్లాంబిన్ హసన్, గాలెం వెంకటేశ్, ఇప్ప రవి, శంకర్ పాల్గొన్నారు. ఇంటి వద్దకే రాములోరి కల్యాణ తలంబ్రాలుకాగజ్నగర్టౌన్: భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవ పవిత్ర తలంబ్రాలు, ప్రసాదాన్ని రాష్ట్రంలోని భక్తుల ఇళ్ల వద్దకే చేరవేసేందుకు తెలంగాణ పోస్టల్శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని కాగజ్నగర్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సిరికొండ సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతరాలయ అర్చన ప్యాకేజీ రూ.450 చెల్లిస్తే కల్యాణ తలంబ్రాలతోపాటు ఒక ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు అందిస్తారని పేర్కొన్నారు. ముత్యాల తలంబ్రాల ప్యాకేజీ రూ.151 చెల్లిస్తే కల్యాణ తలంబ్రాలు, పవిత్ర ముత్యం అందిస్తారన్నారు. భక్తులు సమీప పోస్టాఫీసుల్లో రుసుం చెల్లించి బుక్ చేసుకోవచ్చన్నారు. బుకింగ్ సమయంలో భక్తులు పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ప్రసాదం కోసం ఈ నెల 25తేదీలోగా బుకింగ్ చేసుకోవాలని కోరారు. వృద్ధాప్యం, అనారోగ్యం, దూరభారం, రద్దీ, ఇతర కారణంగా భద్రాచలం వెళ్లలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
డంపింగ్ యార్డులో చెత్తను కాల్చొద్దు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని కాలనీల్లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాక కాల్చొద్దని మున్సిపల్ కమిషనర్ తిరుపతి అన్నారు. కోసిని సమీపంలోని మున్సి పల్ డంపింగ్ యార్డును బుధవారం శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డులో చెత్తను ఎక్కడపడితే అక్కడ కాకుండా ఒక పక్కనుంచి వేయాలని, చెత్తకు నిప్పు అంట కుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
నేడు డిగ్రీ కాలేజీలో ‘యూత్ పార్లమెంట్’
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘50 సంవత్సరాల భారతదేశ అత్యవసర పరిస్థితి– భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల వారు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ప్రతీఒక్కరికి 3 నిమిషాల సమయం ఇస్తామన్నారు. భారత్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని లింక్ ద్వారా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విజేతలకు స్టేట్ లెవల్ పోటీలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తూడురు దత్తాత్రేయ, కోఆర్డినేటర్ దుర్గం జనార్దన్, అసిస్టెంట్ ప్రొ.శారద, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయికి 20 మంది ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ చూపిన 20 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, కోచ్ అరవింద్ తెలిపారు. ఎంపికై న వారికి మరో వారంపాటు కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, కోచ్ విద్యాసాగర్, హెచ్ఎం జంగు, పీడీలు రాకేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
లైన్మెన్ల పాత్ర వెలకట్టలేనిది
ఆసిఫాబాద్అర్బన్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో లైన్మెన్ల పాత్ర వెలకట్టలేనిదని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడె అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్లో బుధవారం లైన్మెన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన మండలాలకు చెందిన విద్యుత్ లైన్మెన్లు, సిబ్బందిని శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందించారు. విధులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఈ లక్ష్మి రాజ్యం, ఊర్మిల, సిబ్బంది పాల్గొన్నారు. -
● వేసవి ప్రారంభంలోనే ఎండలు ● ఉక్కపోతతో ఫ్యాన్లు, కూలర్ల వాడకం ● జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం
ఆసిఫాబాద్: జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్కు చేరువయ్యాయి. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఈ నెల 3న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,900 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోనూ 1,737 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు జిల్లా విద్యుత్శాఖ అధికారులు వెల్లడించారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, కౌటాలలో 132/33 కేవీ సబ్ స్టేషన్లు ఉండగా, 33/11 కేవీ సబ్స్టేషన్లు 34 వరకు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,77,479 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ కనెక్షన్లతో పాటు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 17.35 లక్షల యూనిట్లు వినియోగం కాగా, ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరుతుంది. మొదలైన ఫ్యాన్లు, కూలర్ల వాడకం రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమవుతుండంతో ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడడం ప్రారంభించారు. అలాగే అవసరాలకు అనుగుణంగా ప్రతీ ఇంట్లో విద్యుత్ గృహోపకరణాల వినియోగం పెరిగింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం మద్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ డిమాండ్ ఏకంగా 30 శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువ కావడంతో గ్రిడ్పై ఒత్తిడి పెరుగుతోంది. సాగుకు బోర్ల వినియోగం జిల్లాలో యాసంగి సాగు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు అవసరమైన సాగునీరందక రైతులు రాత్రిపూట బోర్లు అధికంగా వినియోగిస్తున్నారు. వేసవిలో సాధారణం కంటే అధికంగా విద్యుత్ పరికరాలు వినియోగించడంతో మీటర్లు స్పీడ్గా తిరిగి బిల్లులు పెరగనున్నాయి. గత నెల 25న 1.456 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, ఈ నెల 2న 1.735 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ లెక్కన వారం రోజుల్లోనే రోజుకు 0.279 మిలియన్ యూనిట్ల(17 నుంచి 18 మెగావాట్లు) విద్యుత్ వినియోగం పెరిగింది. జాగ్రత్తలు పాటిస్తేనే మేలు.. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ అవసరాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. వినియోగం నియంత్రించేందుకు ప్రతీ ఇంట్లోనూ ఎల్ఈడీ బల్బులు వాడాలని అధికారులు సూచించారు. ఇన్వర్టర్ గృహాలకు తక్కువ వాట్స్ విద్యుత్ సాధనాలు ఉపయోగించాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, ఏసీలు, వాటర్ హీటర్లు, టీవీలు ఆఫ్ చేయడం, రాత్రి సమయంలో వినియోగం తగ్గించాలి. రైతులు వ్యవసాయ పంపుసెట్లను ఉదయం లేదా మధ్యాహ్నం సరైన సమయాల్లో నడపాలి. డిప్ బ్కో సోలార్ పంపుసెట్లు, సౌరశక్తి ఆధారిత పరికరాలు ఉపయోగించడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గించవచ్చు. -
‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో కలెక్టర్
ఆసిఫాబాద్: హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులతో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక సమావేశానికి కలెక్టర్ కె.హరిత హాజరయ్యారు. శాఖల వారీగా 10 వివిధ థీమ్లతో 99 రోజులపాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. ఏప్రిల్ 2న గ్రామస్థాయిలో గ్రామ సభల నిర్వహణ, 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత
ఆసిఫాబాద్అర్బన్: వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని డీఎఫ్వో నీరజ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మాణిక్గూడ అ ర్బన్ పార్కులో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్యాలయ ఆవరణలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎఫ్వో కుటుంబ సభ్యులు, సి బ్బంది ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శు భాకాంక్షలు చెప్పుకున్నారు. రేంజ్ అధికారి గోవింద్చంద్ సర్దార్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేశ్ కులకర్ణి, ఝూన్సీ రాణి, సెక్షన్ అధికారులు సాయిచరణ్, మహేందర్, సతీశ్, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. పగలు వేడి, ఉక్కపోత మరింత పెరుగుతుంది. వేడి గాలులు వీస్తాయి. రాత్రి చలి పూర్తిగా తగ్గుతుంది. పరీక్షలకు ‘పది’ రోజులే..! పదో తరగతి వార్షిక పరీక్షలకు పది రోజుల సమయమే ఉంది. ప్రణాళికాబద్ధంగా చదివితే ఫలితం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 8లోu బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026 -
స్వచ్ఛ పాఠశాలలకు నిధులు
ఆసిఫాబాద్రూరల్: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాలల్లో పరిశుభ్రత, నీటి వసతి, హరిత వాతావరణం, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడానికి జాతీయస్థాయిలో స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్స్(ఎస్హెచ్వీఆర్) ఇస్తోంది. ఎస్హెచ్వీఆర్ కింద ఏటా జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికై న పాఠశాలకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు సైతం ప్రకటిస్తోంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఏడు పాఠశాలలు ఎంపికయ్యాయి. టాప్లో రెబ్బెన కేజీబీవీ..జిల్లాలో ఎస్హెచ్వీఆర్ కింద చేపట్టిన సర్వేలో 1173 పాఠశాలలు పాల్గొన్నాయి. క్షేత్రస్థాయిలో వీటిని పరిశీలించి రేటింగ్ ఇచ్చే బాధ్యతను 37 మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతంలో 1– 8 తరగతుల వరకు ఉన్న మూడు, 9– 12 తరగతులు ఉన్న మూడు, పట్టణ ప్రాంతంలో 9– 12 తరగతలు ఉన్న ఒక పాఠశాలను మూల్యాంకనం చేశారు. ఆనంతరం 4, 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు. పాఠశాలల్లో తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్ల శుభ్రత, చేతులు శుభ్రం చేసుకునే చోట సబ్బుల వినియోగం, నిర్వహణ తీరు, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు, సామర్థ్యాల పెంపు తదితర అంశాలను పరిశీలించారు. దీని ఆధారంగా జిల్లాలో ఉత్తమమైన ఏడు పాఠశాలలు ఎంపిక చేశారు. రేటింగ్లో 5 స్టార్స్తో రెబ్బెన కేజీబీవీ అగ్రభాగాన నిలిచింది. కౌటాల కేజీవీవీ, చిన్నరాస్పల్లి ఉన్నత పాఠశాల, సావర్ఖేడ్, రాంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, నాగవెల్లి ప్రాథమిక పాఠశాల, కాగజ్నగర్ పట్టణంలోని అరుణోదయ ప్రైవేట్ స్కూల్ 4 స్టార్స్ రేటింగ్ పొందాయి. -
‘వేతనాలు పెంచకుంటే సమ్మె తప్పదు’
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచకుంటే ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఏఐటీయూసీ రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ అన్నారు. మంగళవారం స్థానిక కోల్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ప్రతినిధికి సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నా.. కార్మిక చట్టాలు అమలు కాకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. బొగ్గు రవాణా చేసే లారీ డ్రైవర్లకు కనీస వేతనంగా రూ.32వేలు, క్లీనర్లకు రూ.18వేలు ప్రతినెలా 5లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్మికుడికి రూ.25లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, రూ.50లక్షల ప్రమాద బీమా కల్పించాలన్నారు. ఈపీఎఫ్ లేదా సీఎంపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏటా ఒక నెల జీతం బోనస్గా ఇవ్వాలని, ఎనిమిది గంటల పనివిధానాన్ని అమలు చేయాలన్నారు. సింగరేణి పర్మినెంట్ కార్మికులతో సమానంగా లారీ డ్రైవర్లు, క్లీనర్లకు లాభాల వాటా ఇవ్వాలన్నారు. డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీనివాస్, ప్రశాంత్, కృష్ణ, రాజు, చాందర్లాల్, మనోహర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగోత్సవం
వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో..జిల్లా కేంద్రంలో మహిళలతో ఎమ్మెల్యే కోవ లక్ష్మిపోలీసు సిబ్బందితో ఎస్పీ నితిక పంత్ వేడుకలుస్టెప్పులు వేస్తున్న ఎస్పీ నితిక పంత్ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబురాలు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే చిన్నారులు, యువకులు కేరింతలు కొడుతూ పరస్పరం రంగులు చల్లుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మిని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ నితిక పంత్ స్టెప్పులు వేస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్లు బాలాజీ వరప్రసాద్, సతీశ్, వామనమూర్తి, సత్యనారాయణ, కుమారస్వామి, సంతోష్కుమార్, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం నుంచి బ్యాండ్ మేళాతో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ బ్రాహ్మణవాడ, రావులవాడ, పొట్టి శ్రీరాములు చౌక్, అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చిలువేరు వెంకన్న, క్లబ్ ప్రతినిధులు మర్యాల ఉదయబాబు, బాల శ్రీనివాస్, కలకుంట్ల శ్రీధర్, సభ్యులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీసుల స్టెప్పులుకేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో..బ్రాహ్మణవాడలో హోలీ వేడుకలు -
ఘనంగా సత్యాగ్రహ దివస్
వాంకిడి: మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో సోమవారం సత్యాగ్రహ దివస్ ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షతో మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో గల రామ మందిరంలోకి దళితులకు ప్రవేశం కల్పించారని తెలిపారు. బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్, నాయకులు రోషన్ ఉప్రె, దుర్గాజీ, విజయ్ ఉప్రె, ప్రతాప్ రాంటెంకి, ప్రకాశ్, ప్రసాద్, నూతన్, స్వాగత్ పాల్గొన్నారు. -
బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు అన్నారు. పట్టణంలోని బస్టాండ్ను సోమవారం ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్తో కలిసి తనిఖీ చేశారు. బస్టాండ్లోని మూత్రశాలలు, తాగునీటి వస తి, సైకిల్ స్టాండ్ పరిసరాలను పరిశీలించా రు. బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తుందని, ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ లేకనే బస్టాండ్ అపరిశుభ్రంగా తయారవుతుందని మండిపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందిస్తే నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
కుమురం భీం
9వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. పగలు వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. వేడుక.. కావొద్దు విషాదం ఆనందోత్సాహాలతో జరుపుకొనే హోలీ నిర్లక్ష్యం కారణంగా విషాదం మిగల్చొద్దు. వాగులు, నదుల్లోకి స్నానానికి వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. 10లోu మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026 -
అదుపులేని వేగం..!
కర్రతో ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న లారీ అధిక లోడ్ కారణంగా ఫిబ్రవరి 25న ఆసిఫాబాద్ మండలం బూర్గుడ వద్ద ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. అదేరోజు సిమెంట్ ఇటుకల లోడ్తో వస్తున్న ట్రాక్టర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు ఎదుట మలుపు తిరుగుతున్న క్రమంలో పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రెబ్బెన మండల కేంద్రంలోని పీహెచ్సీ సమీపంలో ఫిబ్రవరి 27న బిస్కెట్ల లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కాగజ్నగర్ వైపు వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడడంతో సరుకు రోడ్డుపై పడింది. డ్రైవర్ ఖాజా పాషాకు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అలాగే గత నెలలో చింతలమానెపల్లి మండలం కర్జెల్లి సమీపంలో కంకర టిప్పర్ బోల్తా పడింది. కౌటాల: జిల్లాలోని రహదారులపై వందలాది వా హనాలు, కంకర టిప్పర్లు, సరుకు లారీ రయ్.. రయ్.. అంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో అదుపులేని వేగం, పరిమితికి మించి ఓవర్ లోడ్ కారణంగా హెవీ వాహనాలు బోల్తా పడుతున్నాయి. దీనిపై గనుల శాఖ, రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 32 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 18 మంది మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు. మరోవైపు పోలీస్ శాఖ అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలకు జరిమానాలు విధిస్తోంది. గత నెల 23న రెబ్బెన మండల కేంద్రంలో అధిక లోడ్తో వెళ్తున్న 13 లారీలకు రూ.13 వేల జరిమానా విధించారు. అలాగే గత నెల 25న అధిక లోడ్తో వెళ్తున్న 19 లారీలకు రూ.16,700 జరిమానా విధించారు. కఠిన చర్యలు కరువువాహనాల రాకపోకలు, ఓవర్ లోడ్పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. రవాణా శాఖ, మైనింగ్, ఇతర శాఖల అధికారులు నిత్యం తనిఖీలు చేపడుతూ జరిమానా విధించాలి. అవసరమైతే డ్రైవర్లతోపాటు యజమానులపైనా కేసులు నమోదు చేయాలి. కానీ జిల్లాలో ప్రమాదాలు జరిగిన తర్వాత నామమాత్ర పు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓవర్ లోడ్తో దొరికే లారీలను తొలుత సీజ్ చేసి యజమానులకు భారీ ఫైన్లు విధించడం, డ్రైవర్ లైసెన్సు రద్దు చేయడం, మళ్లీ అదే పునరావృతమైతే వాహన పర్మిట్లను రద్దు చేసే అధికారం ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. ట్రక్కుల్లో స రుకులు నింపేటప్పుడే లోడ్ పరిమితులను పాటించేలా, ఒక వేళ ఓవర్ లోడ్తో వాహనాలు రోడ్డు మీదకు వస్తే నిర్వాహకులకు భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఓవర్ లోడ్తో ప్రమాదాలుజిల్లాలో వాహనాలు అతివేగం, అధిక లోడుతో ఇష్టారాజ్యంగా దూసుకుపోతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా క్వారీల యజమానులు పొరుగు రాష్ట్రాలకు కంకర తరలించే క్రమంలో గ్రామీణ రోడ్లను వినియోగిస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్లు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా వాహనాల్లో అధిక లోడుతో విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని తరలిస్తున్నారు. మరోవైపు నిత్యం వాగులు, నదుల నుంచి అక్రమంగా ఓవర్ లోడుతో ఇసుక రవాణా సాగుతోంది. ఈ వాహనాలు, టిప్పర్లు, ట్రాక్టర్లు కనీస నిబంధనలు పాటించడం లేదు. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా అవి 25 నుంచి 26 టన్నులు, 12 టైర్ల లారీ 26 టన్నులకు బదులు సుమారు 32 టన్నులకు పైగానే లోడ్తో తిప్పుతున్నారు. ట్రాక్టర్లలో సైతం నిర్దిష్ట ప్రమాణాల కంటే ఎక్కువ టన్నులు లోడింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించాల్సి ఉండగా 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. అధిక లోడ్ కారణంగా డ్రైవర్లకు వాహనాలపై కంట్రోల్ కాక అదుపు తప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. ప్రత్యేక బృందంతో తనిఖీలు జిల్లాలో అధిక లోడ్, అతివేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అధిక లోడ్ తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చే శాం. తరచూ తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నాం. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. – రాంచందర్, ఆర్టీవో -
పట్టణ సమస్యలు పరిష్కరించాలని వినతి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణ పరిధి లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి అనిత, బీఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందించారు. పట్టణంలో తాగునీటి సరఫరాలో లోపాలు, గుంతల రోడ్లు, మురుగు కాలువల శుభ్రత, స్ట్రీట్లైట్ల ఏర్పాటు తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీ సుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కౌ న్సిలర్లు సీపీ విద్యావతి, వలీ, వనమాల శ్రీధర్, వసీం, బాబురావు పాల్గొన్నారు. -
ఏరియాలో 126శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా ఫిబ్రవరిలో 126 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరిలో ఏరియాకు 3లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 3.77 లక్షల టన్నులతో 126 శాతం ఉత్పత్తిని సాధించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలరోజుల వ్యవధిని సద్వినియోగం చేసుకుని, గడువులోగా వందశాతం వార్షిక ఉత్పత్తి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఏరియాలో ఉత్పత్తి వేగం పుంజుకుందన్నారు. అధిక వర్షాలతో కోల్పోయిన ఉత్పత్తిని సాధించేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఉత్పాదకతలో బెల్లంపల్లి ఏరియా 99 శాతంతో కొనసాగుతోందని, వందశాతం సాధించేందుకు ఉద్యోగులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఐఈడీ డీజీఎం ఉజ్వల్కుమార్ బెహారా, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం ఇప్పల నవగాంలోని పట్టా భూమికి పాసుపుస్తకం జారీ చేయాలని జెండాగూడకు చెందిన కామ్రె సోంబాయి దరఖాస్తు చేసుకుంది. మరణించిన తండ్రి పేరుతో గల పట్టా భూమిని తన పేరుతో విరాసత్ చేయాలని బెజ్జూర్ మండలం సలుగుపల్లికి చెందిన జనగాం ఫకీరు విన్నవించాడు. వాంకిడి మండలంలోని తన రిజిస్టర్డ్ మూడు ప్లాట్లకు రూ.43,785 ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించినప్పటికీ ఇప్పటివరకు ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని జిల్లా కేంద్రంలోని మార్కండేయ కాలనీకి చెందిన అనుమాండ్ల గణేశ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. కౌటాల మండలం వీర్ధండి గ్రామానికి చెందిన సిడాం తుకారాం తన పట్టా భూములను తనకు తెలియకుండా ఇతరులకు పట్టా చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరాడు. కాగజ్నగర్కు చెందిన అల్స రాజేశ్, జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన కాట్కర్ కల్పన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీపీఆర్వోతో వచ్చే రిజండర్లపై 48 గంటల్లోగా నివేదికలు అందించాలని సూచించారు. కలెక్టరేట్లో శ్రీపాదరావు జయంతిఆసిఫాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా దుద్దిళ్ల శ్రీపాదరావు ఎనలేని సేవలందించారని కలెక్టర్ కె.హరిత అన్నారు. శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మంథని శాసనసభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా శ్రీపాదరావు చేసి న సేవలను కొనియాడారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా, గాంధేయవాదిగా పేరు పొందారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, కలెక్టరేట్ ఏవో కిరణ్, అధికారులు పాల్గొన్నారు. -
మున్సిపల్ పాలకవర్గం
బాధ్యతలు స్వీకరించిన ఆసిఫాబాద్: ఇటీవల ఎన్నికై న ఆసిఫాబాద్ పాలకవర్గ సభ్యులు జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తోపాటు కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలంబిన్ అహ్మద్, కుర్సెంగ బాలకృష్ణ, దూడల లక్ష్మి, గుబుడె నాగుబాయి, జేబాషేక్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్షణలో రిజిస్టర్లో సంతకాలు చేశారు. తొలుత చాంబర్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, రాజంపేట పంచాయతీని బీఆర్ఎస్ కై వసం చేసుకుందని తెలిపారు. ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీకి తాను సైతం సర్పంచుగా సేవలందించానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జిల్లా కేంద్రంలో రూ.35 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఆస్పత్రి, మెడికల్ కాలేజీ, పిల్లల పార్కు ఇతర అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు శాలువాలు, పూలదండలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్సోకోల సరస్వతి, బీఆర్ఎస్ నాయకులు అహ్మద్, నిసార్ తదితరులు పాల్గొన్నారు. ఫొటోల రగడఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్లో నాయకుల ఫొటోలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫొటోలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోషల్ మీడియాలో అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు మంచిర్యాల కార్పొరేషన్లో అక్కడి ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎమ్మెల్యేల ఫొటోలపై అభ్యంతరం తెలపడం సరికాదని వారు పేర్కొన్నారు. -
భక్తిశ్రద్ధలతో కామదహనం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని పలు ఆల యాలు, కూడళ్ల వద్ద సోమవారం రాత్రి ప్రజలు భక్తిశ్రద్ధలతో కామదహనం నిర్వహించారు. కేశవనాథస్వామి ఆలయంలో స్వామి వారికి అర్చకులు ఒజ్జల నరేష్శర్మ ఆధ్వర్యంలో డోలోత్సవం చేపట్టా రు. పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యే క భజనా కార్యక్రమాలు, పూజలు చేశారు. బ్రాహ్మణవాడ గణపతి దేవాలయం వద్ద అర్చకుడు శిరీష్ శర్మ పూజలు చేసి రాత్రి 7.20 గంటలకు కామదహనాన్ని ప్రారంభించారు. కాగా, జాజిరి ఆటలతో కా లనీలు సందడిగా మారాయి. చిన్నారులకు బత్తీసపేర్లను మేడలో హారంగా వేసి అలంకరించారు. -
పల్లెల్లో పులారా సందడి
ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో సోమవారం పులారా సందడి నెలకొంది. ప్రజలు ఉదయమే ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు. ప్రతీ ఇంటి నుంచి కుడుకలు తెచ్చి గ్రామ పటేల్కు అందించారు. అలాగే వెదురు బొంగులకు మాతార, మాతరల్గా నామకరణం చేసి కుడుకలు, గారెలు, వంకాయలు, ఉల్లిగడ్డలు, చక్కెర బిల్లలు కట్టారు. అనంతరం గ్రామ పొలిమేరకు డోలు, సన్నాయిలతో తరలివెళ్లి కాముడి దహనం చేపట్టారు. పటేళ్ల ప్రత్యేక పూజల అనంతరం.. యువకులు మంటల నుంచి దూకేందుకు పోటీ పడ్డారు. రొట్టెలు, పప్పులు తీసుకువచ్చి కాముడి దహనం వద్ద మళ్లీ పూజలు చేశారు. సహపంక్తి భోజనాల అనంతరం రాత్రంతా అక్కడే బస చేసి ఆడిపాడారు. మంగళవారం గిరిజన గ్రామాల్లో దురాడి పండుగ(హోలీ) సంబురాలు జరుపుకోనున్నారు. – కెరమెరి సాకడలో కుడకలు స్వీకరిస్తున్న గ్రామ పటేల్సాకడలో చక్కెర బిల్లలు కడుతూ..వేడుకల్లో యువకులు.. -
ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
కాగజ్నగర్టౌన్: ప్రజలు ఆధ్యాత్మికను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బా బు అన్నారు. కాగజ్నగర్ పట్టణం న్యూకాలనీలోని గాయత్రీ మందిర్లో ఆదివారం గాయత్రీ పరివార్ ఆధ్వర్యంలో చేపట్టిన 24 కుండీల మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయత్రీ పరివార్ గొప్ప ఆధ్మాతిక సమూహంగా ఏర్పడి ప్రజల్లో వైదిక, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్రావు, ఎస్పీఎం జీఎం అనిల్కుమార్, హనుమంతరావు, రామకృష్ణ, లోకేశ్కుమార్, భక్తులు పాల్గొన్నారు. -
పంటల సర్వేలో వలంటీర్లు
కాగజ్నగర్టౌన్: గ్రామాల్లో పంటల సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించింది. జిల్లాలోని ఆసక్తి ఉన్నవారు స్థానికంగా పంటల సర్వేకు ఏఈవోలను సంప్రదించి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వారికి ఏఈవోలు యాప్ ద్వారా అవగాహన కల్పిస్తారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు డీసీఎస్(డిజిల్ క్రాప్ సర్వే) యాప్లో పేరు, విద్యార్హతలు, బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వేలో భాగంగా పంటల ఫొటోలు అప్లోడ్ చేస్తే ఒక్కో ఫొటోకు రూ.7 చొప్పున 45 రోజుల సర్వే అనంతరం నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు. 4.45లక్షల ఎకరాల సాగు భూమిజిల్లాలో లక్షా 36 వేల మంది రైతులు ఉండగా.. వారు 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. వానాకాలం సీజన్లో 3,35,363 ఎకరాల్లో పత్తి సాగు ఉండగా, వరి 56,861 ఎకరాలు, కంది 30,430 ఎకరాలు, పెసర, మినుములు, జొన్న, కూరగాయలు తదితర పంటలు 22,395 ఎకరాల్లో సాగు చేశారు. ఇక యాసంగి సీజన్లో 50,300 ఎకరాల్లో వరితోపాటు పప్పుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, తదితర పంటలు పండిస్తారు. యువతకు సదావకాశం పంటలు సర్వే చేసేందుకు గ్రామీణ యువకులకు కేంద్ర ప్రభుత్వం సదావకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సంబంధిత ఏఈవోలను సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. జిల్లాలో సర్వే చేసేందుకు యువకులు ముందుకు రావడం లేదు. వచ్చినా వారు కూడా సర్వే చేయడంలేదు. ఈ అవకాశాన్ని ఆసక్తి గలవారు వినియోగించుకోవాలి. – వెంకట్, జిల్లా వ్యవసాయాధికారిఅర్హతలివే..రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, ఎరువులు, ఇతర పథకాల అమలు కోసం ప్రభుత్వాలు ఏటా పంటల సర్వే నిర్వహిస్తాయి. ఈ వివరాల ఆధారంగానే ఏ పంట ఎన్ని క్వింటాళ్లు సేకరించాలి.. ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. ఎలాంటి ఏర్పాట్లు కల్పించాలి అనే అంశాలను నిర్ణయిస్తారు. ప్రస్తుతం వలంటీర్లతో పంటల సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు అందరూ అర్హులే. గ్రామంలో స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వ్యవసాయం అవగాహన ఉండి, మొబైల్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి. యాప్ ద్వారా సమాచారం అప్లోడ్ చేయగలగాలి. అప్లోడ్ చేసే పంట ఫొటోల సంఖ్య ఆధారంగా నగదు చెల్లిస్తారు. 45 రోజుల వరకు పనిచేయాల్సి ఉంటుంది. అనంతరం వారికి ఎమౌంట్ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. వలంటీర్లుగా చేసేవారు గ్రామంలోని పొలాలకు వెళ్లి ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేస్తున్నాడో వివరాలు యాప్లో నమోదు చేయాలి. పంటల వివరాలు, రైతు వివరాలు, సర్వే నంబర్, సాగు విస్తీర్ణం తదితర వివరాలు పక్కాగా సేకరించాల్సి ఉంటుంది. -
కుమురం భీం
7చాలా వరకు ఎండగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రిపూట చలిప్రభావం తగ్గుతుంది. జనసంద్రమైన ‘వెంకన్న’ జాతర కెరమెరిలో ఆదివారం వేంకటేశ్వర స్వామి జాతర జనసంద్రమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 9లోu సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026 -
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉపేందర్
ఆసిఫాబాద్అర్బన్: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ నియమితులయ్యా రు. వరంగల్ జిల్లాలో శనివారం జరిగిన నాలుగో రాష్ట్ర మహాసభల్లో ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం.నరసింహ తెలి పారు. ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. -
బీమాతో భరోసా
ఆసిఫాబాద్అర్బన్: కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తూ, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది. వారి జీవితాలకు మరింత ఆర్థిక భద్రతను కల్పిస్తూ, ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల బీమా పరిహారం అందించడంతో పాటు ఆమె పేరిట ఉన్న రుణాన్ని కూడా పూర్తిగా మాఫీ చేయనుంది. భరోసానిచ్చే ఈ తాజా నిర్ణయంతో మహిళా సంఘాల సభ్యుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహిళలకు చేయూత...జిల్లాలో వివిధ సమాఖ్యల్లోని 8,180 సంఘాల్లో 93,796 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా సీ్త్రనిధి రుణాలతోపాటు బ్యాంకు లింకేజీ రుణాలు పొందుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ, పట్టణ, పర్యాటక ప్రాంతాల్లో ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి బీమా పథకాలు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రుణబీమా పథకాల్లో 101 రిజిస్ట్రేషన్లు పూర్తికాగా, ప్రమాద బీమా కింద 8 రిజిస్ట్రేషన్లు జరిగాయి. లోన్ బీమాలో 42 మంది సభ్యులకు రూ.43 లక్షల ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ చేశారు. ప్రమాద బీమాలో ముగ్గురు సభ్యులకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు చెల్లించారు. మహిళా సంఘాల్లోని సభ్యులు బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవా లని అధికారులు సూచిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో మహిళలు బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. రుణబీమాలో 42 మంది సభ్యులకు రూ.43 లక్షలు చెల్లించాం. అలాగే ప్రమాద బీమాలోనూ ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున చెల్లించాం. ఆపదలో బీమా అండగా ఉంటుంది. – ఆర్.శ్రీనివాస్, సీ్త్రనిధి ఆర్ఎం అవగాహన కల్పిస్తున్నాం ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. రుణం పొందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే, రూ.10 లక్షల బీమాతో పాటు రుణమాఫీ అవుతుంది. దీనిపై మహిళా సంఘాల సభ్యులకు సెర్ప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవో అర్హులు వీరే..గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 18– 59 సంవత్సరాల వయస్సు కలిగి, స్వయం సహాయక సంఘంలో స భ్యురాలిగా ఉన్న వారికి బీమా వర్తించనుంది. మహిళా సంఘం సభ్యురాలు స హజ మరణం చెందితే, వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. అదే సీ్త్రనిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణి స్తే, ప్రభుత్వం ద్వారా అందించే రూ.10 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమవుతుంది. దీంతో పాటు వారు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేస్తారు. 50 శాతానికి మించి అంగవైకల్యం ఏర్పడితే, సదరం ధ్రువపత్రాన్ని పరిశీలించి రూ.5 లక్షలు అందించనున్నారు. -
రుణ లక్ష్యం చేరేనా..!
తిర్యాణి: మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహయక సంఘాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సంఘాల్లోని సభ్యులకు వారి అవసరాల మేరకు తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేస్తోంది. మహిళలు రుణాలను స్వయం ఆర్థికాభివృద్ధికి కోసం వినియోగించుకుని ప్రతినెలా సులభమైన వాయిదాల రూపంలో బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 29 రోజుల గడువు మాత్రమే ఉండగా అధికారులు లక్ష్య సాధనపై దృష్టి సారించారు. ఇప్పటివరకు 70.89శాతం రుణాలు పంపిణీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గడువులోగా లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రూ.164.76 కోట్ల చెల్లింపులుస్వయం సహయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.232.43 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు రూ.164.76 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు అందించారు. 70.89 శాతం లక్ష్యం చేరుకున్నారు. జిల్లాలో అత్యధికంగా సిర్పూర్(టి) మండలంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.14.77 కోట్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా.. 414 మహిళా సంఘాలకు రూ.14.67 కోట్ల రుణాలు అందించారు. రెబ్బెన మండలంలో 633 సంఘాలకు రూ.22.60 కోట్ల రుణాలకు రూ.19.72 కోట్లు మంజూరు చేశారు. అలాగే అత్యల్పంగా లింగాపూర్ మండలంలోని రూ.5.58 కోట్ల రుణ లక్ష్యానికి 142 సంఘాలకు కేవలం రూ.2.49 కోట్లు మాత్రమే అందించారు. ఆ మండలం జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. గతేడాది రాష్ట్రస్థాయిలో రెండోస్థానంఎస్హెచ్జీ సంఘాలకు రుణాలు అందించడంలో జిల్లా ఆదర్శంగా నిలుస్తోంది. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేసి రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలవడం విశేషం. మరో 30 రోజు ల గడువు ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగి సేలోగా టార్గెట్ చేరుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతోపాటు రుణాల రికవరీపైనా ఐకేపీ సిబ్బంది దృష్టి సారించారు. నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.మండలం సంఘాలు లక్ష్యం పంపిణీ ఆసిఫాబాద్ 538 20.69 15.59 బెజ్జూర్ 352 13.74 6.52 దహెగాం 436 16.33 12.90 జైనూర్ 364 13.03 9.78 కాగజ్నగర్ 752 27.71 19.99 రెబ్బెన 633 22.60 19.72 సిర్పూర్(యు) 195 7.07 4.78 సిర్పూర్(టి) 414 14.77 14.67 వాంకిడి 614 22.63 18.88 తిర్యాణి 393 14.13 7.36 పెంచికల్పేట్ 193 7.02 3.50 లింగాపూర్ 142 5.58 2.49 కౌటాల 486 17.77 11.29 కెరమెరి 425 15.77 10.38 చింతలమానెపల్లి 357 13.53 6.83 లక్ష్యం చేరుకుంటాం 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు రూ.232.43 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటివరకు రూ.164.76 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు పంపిణీ చేశాం. గడువు ముగిసేలోగా వందశాతం లక్ష్యం చేరుకుంటాం. ఈ మేరకు సిబ్బందితో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నాం. వందశాతం రుణాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవో -
సరస్వతికి జాతీయస్థాయి పురస్కారం
ఉట్నూర్రూరల్: ఆదివాసీలకు దక్కాల్సిన అటవీ హక్కులు, మహిళా సాధికారితపై నిరంతరం కృషి చేస్తున్న ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన మర్సుకోల సరస్వతికి జాతీయస్థాయి పురస్కారం లభించింది. ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ‘యాక్షన్ ఎయిడ్ సంస్థ’ నిర్వహించిన ‘ఫారెస్ట్ లైవ్లీ హుడ్ ఐడెంటిటీ’పై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి సరస్వతి పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ సందీప్ చాచ్రా, ఎస్తేర్ సెల్వం చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
చిన్నారులకు ‘ఏకరూప’ కానుక
కెరమెరి: అంగన్వాడీ కేంద్రాలకు యూనిఫాం పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. చిన్నారులకు వారి కొలతలకు అనుగుణంగా కుట్టిన దుస్తులు అందిస్తున్నారు. మరో 15 రోజుల్లో జిల్లావ్యాప్తంగా పంపిణీ పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఏటా ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఏకరూప దుస్తులు(యూనిఫాం) పంపిణీ చేస్తోంది. తరగతి గదిలో పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా విద్యార్థులందరినీ సమాన దృష్టితో చూడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని మరింతగా విస్తరిస్తూ అంగన్వాడీ కేంద్రాలకు వర్తింపజేశారు. చిన్నారులకు సైతం ఏకరూప దుస్తులను అందించాలని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. చిన్నారుల్లో సమానత్వ భావనను పెంపొందించడంతోపాటు అంగన్వాడీ కేంద్రాలపై ఆకర్షణ పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఈ మేరకు బాలబాలికలకు సరిపడా యూనిఫాం వ స్త్రం ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. వీటిని కుట్టించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. వస్త్రాన్ని మహిళా సంఘాలకు చెందిన టైలర్లకు అప్పగించగా కుట్టు పనులు ముమ్మరంగా సా గుతున్నాయి. దుస్తులను తీసుకెళ్లి కుట్టించడంలో తొలుత కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెలాఖరుకల్లా జి ల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులందరికీ అందించాలన్న లక్ష్యంతో ప్రక్రియను వేగవంతం చే శారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ స్థాయిలోనే చిన్నారులకు యూనిఫాం అందిస్తుండటంపై తల్లిదండ్రుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. 5,240 మందికి యూనిఫాంజిల్లాలో ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్నగర్, సిర్పూర్, వాంకిడిలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 3 నుంచి ఆరేళ్లలోపు బాలురు 12,310 మంది, బాలికలు 12,455 మంది మొత్తం 24,765 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ ఏకరూప దుస్తులు కుట్టిస్తున్నారు. ఈ ఐదు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 40 సెక్టార్లు, 1,006 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆసిఫాబాద్ ప్రాజెక్టు పరిధిలోని 11 సెక్టార్లలో 5,240 మంది చిన్నారులకు ఏకరూప దుస్తులు అందించారు. వాంకిడి ప్రాజెక్టులోని అన్ని కేంద్రాలకు చెందిన యూనిఫాంలను ఆసిఫాబాద్లోనే కుట్టించారు. ప్రస్తుతం ఇవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కాగా, బాలికలకు ఎరుపు, బూడిద రంగు గౌన్లు, బాలురకు ఎరుపు, బూడిద రంగు చొక్కాలు, నీలం రంగు నిక్కర్లు అందిస్తున్నారు. ఒక్కో చిన్నారికి రెండేసి జతల చొప్పున పంపిణీ చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో 434 అంగన్వాడీలుజిల్లాలోని మొత్తం 1,006 అంగన్వాడీ కేంద్రాల్లో 434 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లోనే కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో 6,784 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. వీరు పాఠశాల విద్యార్థులతో కలిసిమెలిసి ఉంటున్న నేపథ్యంలో వీరికి గతంలోనే ఒక జత యూనిఫాం అందించారు. త్వరలో రెండో జత అందించనున్నారు. అయితే కొన్నిచోట్ల యూనిఫాంలు కుట్టడంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 15 రోజుల్లో పంపిణీ పూర్తి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు 15 రోజుల్లో యూనిఫాం పంపిణీ పూర్తి చేస్తాం. ఇప్పటికే ఆసిఫాబాద్ ప్రాజెక్టు పరిధిలోని అన్ని కేంద్రాల్లో దుస్తుల పంపిణీ పూర్తి కాగా, మరో రెండు రోజుల్లో వాంకిడి ప్రాజెక్టు వారికి అందిస్తాం. యూనిఫాంలు కుట్టి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. హోలీ పండుగ నేపథ్యంలో పంపిణీ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది – ఆడేపు భాస్కర్, సంక్షేమశాఖ పీడీ -
కాగజ్నగర్లో అయ్యప్ప ధర్మప్రచార సభ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని వాసవి మినీ ఫంక్షన్ హాలులో ఆదివారం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార జిల్లా సభ నిర్వహించా రు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లం రాజు హాజరై మాట్లాడారు. ధర్మ ప్రచా ర సభ ఆధ్వర్యంలో శబరిమల సమీపంలోని నారాయణతోడ్ సమీపంలో గల అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే పలు సేవా కా ర్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని కో రారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర కోశాధికారి రమేశ్, భిక్షపతి, ఈదుల జ్యోతిష్, విజయ్ కుమార్, సాయికృష్ణ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
కాగజ్నగర్టౌన్: ప్రశాంత వాతావణంలో పవిత్ర రంజాన్ పండగను జరుపుకోవాలని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం చిరువ్యాపారులు, ముస్లిం పెద్దలతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మా సాన్ని పురస్కరించుకుని వ్యాపారులు నిర్ణీత సమయం వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని సూచించారు. పట్టణంలో అనుమానిత వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలన్నారు. సమావేశంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు ఎత్తివేయాలి
రెబ్బెన: క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఇన్చార్జిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వెళ్లిన ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. గోలేటి టౌన్షిప్లోని టీబీ జీకేఎస్ యూనియన్ కార్యాలయంలో శనివా రం మాట్లాడారు. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత ఉన్నా కాంగ్రెస్ పార్టీ, మంత్రి వివేక్ అధికార బలంతో చైర్మన్ ఎన్నికను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. పోలీసులు ఇప్పటికైనా బీఆర్ఎస్ నా యకులపై కేసులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధారావత్ మంగీలాల్, సెంట్రల్ కమిటీ నాయకులు సత్యనారాయణ, ఫిట్ కార్యదర్శి మెరుగు రమేశ్, ఆఫీస్ ఇన్చార్జి మహేందర్, నా యకులు వీరస్వామి, సీహెచ్పీ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో మృత్యుపాశాలు
పెంచికల్పేట్: అటవీ సమీప ప్రాంతాల్లోని విద్యుత్ తీగలను ఆసరాగా చేసుకుంటున్న వేటగాళ్లు రాత్రిపూట అక్రమంగా కరెంట్ కంచె ఏర్పాటు చేసి అటవీ జంతువులను హతమారుస్తున్నారు. వేటగాళ్ల ఉచ్చులకు పెద్దపులులు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, నీలుగాయిలు, కొండగొర్రె, సాంబార్లు బలవుతున్నాయి. గతేడాది పెంచికల్పేట్ రేంజ్లోని కోయచిచ్చాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి కే8 అనే పెద్దపులి మృతి చెందగా.. తాజాగా అదే ప్రాంతంలో గత నెల 22న వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి నీలుగాయి మృతి చెందింది. రేంజ్ పరిధిలో విద్యుత్ తీగలు అమర్చి పెద్దపులి, ఎలుగుబంట్లు, దుప్పులు, నీలుగాయిలను వేటాడుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ లైన్ తొలగింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వేటకు అడ్డుకట్ట పడటం లేదు. పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించి వేటగాళ్లపై కేసులు నమోదు చేస్తున్నా వారి తీరు మారడం లేదు. ఒకే ప్రాంతంలో వేట..పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని ఎల్లూర్, మేరెగూడ, కోయచిచ్చాల, లోడుపల్లి, కొండపల్లి ప్రాంతాల్లో వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడుతున్నారు. కోయచిచ్చాల ప్రాంతం నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైను వన్యప్రాణులకు శాపంగా మారింది. ఇదే ప్రాంతంలో అటవీ జంతువుల సంచారం పెద్దఎత్తున ఉంటుంది. దీంతో ఇదే లైనుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేసి ఏటా పదుల సంఖ్యలో వన్యప్రాణులను హతమారుస్తున్నారు. గతేడాది కే8 పెద్దపులి సైతం ఇదే ప్రాంతంలో విద్యుత్ తీగలకు బలికాగా కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు 32 మందిని అరెస్టు చేశారు. కేసుల నమోదుతో సరి..వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా వేట నిరంతరం సాగుతూనే ఉంది. అటవీ ప్రాంతంలో నీటి వసతి కల్పించడంతోపాటు నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వేటగాళ్లకు అనువుగా మారుతోంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.సంరక్షణకు చర్యలు పెంచికల్పేట్ రేంజ్ పరిధిలో వన్యప్రాణులను సంరక్షించడానికి చర్యలు చేపట్టాం. కోయచిచ్చాల సమీపంలోని విద్యుత్ లైన్తో వన్యప్రాణులను వేటాడుతున్నారు. వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేశాం. వన్యప్రాణులను వేటాడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అటవీ జంతువుల సంరక్షణకు ప్రజలు సహకరించాలి. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ప్రతిపాదనలు పంపించాం మెరెగూడ నుంచి పాత కోయచిచ్చాల గ్రామం మీదుగా రెవెన్యూ భూమిలో అగర్గూడ గ్రామానికి 11కేవీ విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ లైన్ తొలగించాలని అటవీశాఖ అధికారులు సంప్రదించారు. లైనుకు కేబుల్ వైర్ వేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే కేబుల్ లైన్ వేసే పనులు ప్రారంభిస్తాం. – అంజల్కుమార్, ఏఈ, పెంచికల్పేట్ -
హెల్త్ మిషన్ @100 రోజులు
ఆసిఫాబాద్: మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఆరోగ్య వ్యస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా వైద్యారో గ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మిషన్ –100 పేరుతో వంద రోజుల ప్రత్యేక వైద్యశిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో వైద్యసేవలు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంతో స్థానికులకు మేలు చేకూరనుంది. ముఖ్యంగా మహిళలకు లబ్ధి జరగనుంది. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు కొనసాగుతుంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో స్వయం సహాయక సంఘాల సభ్యులకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు చేపట్టి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించనున్నారు. జిల్లాలో 9,796 సంఘాల్లో 1,02,352 మంది మహిళా సభ్యులు ఉన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్తో తదితర రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. నాలుగు దశల్లో సేవలుజిల్లాలో మొదటి దశ మార్చి 2 నుంచి 31 వరకు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా రు. గర్భిణులు, బాలురు, వృద్ధులు, రక్తహీనత పరీ క్షలు, ఇమ్యునైజేషన్, క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టనున్నారు. క్యాన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు చేసి, ఆరోగ్య మహిళా కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. రెండోదశలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 15 వరకు అసంక్రమణ వ్యాధులపై దృష్టి సారిస్తారు. ఇక మూడో దశలో ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు అంటువ్యాధుల నియంత్రణ, టీబీ డ్రైవ్, జైళ్లలో హెచ్ఐవీ స్క్రీనింగ్కు ప్రాధాన్యత ఇస్తారు. ఎండదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక హీట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ గదులు సిద్ధం చేయనున్నారు. మే 16 నుంచి జూన్ 9 వరకు నాలుగో దశ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పట్టణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలపరచి, నిపుణులు సేవలందించడం, వైద్య శిబిరాలు నిర్వహించాలి. కార్యక్రమాల నిర్వహణ ఇలా..మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్య డ్రైవ్ నిర్వహిస్తారు. మా ర్చి 16న జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ వైద్యులకు అవార్డులు ప్రదానం చేస్తారు. జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినో త్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు చేపడతారు. నాలుగు దశల్లో కార్యక్రమాలు ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే హెల్త్ మిషన్– 100 కార్యక్రమాలు జిల్లాలో నాలుగు దశల్లో నిర్వహిస్తామని డీఎంహెచ్వో డాక్టర్ సీతారాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో శనివారం వైద్యాధికారులు, హెచ్ఎస్, హెచ్ఈఎస్లు, పీహెచ్ఎన్ఎస్లు, సీహెచ్వోలు, రాష్ట్ర బాల స్వస్థ కార్యక్రమం వైద్యాధికారుల కు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఎన్సీడీ ప్రో గ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉప్పరి వెంకటేశ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, రా ష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చే యడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. -
నవోదయలో జాతీయ విజ్ఞాన దినోత్సవం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం జాతీ య విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ విద్యార్థుల విజ్ఞాన, సైన్స్ ప్రదర్శనలను తిలకించారు. బొగ్గుగని కార్మికుల భద్రత కోసం రూపొందించిన సేఫ్టీ క్యాప్, హైడ్రాలిక్ బ్రిడ్జ్ నమూనా వంటి వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ వి ద్యార్థుల్లో దాగి ఉన్న శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమావత్, ఇలయ్య, శిరీష, తిరుపతమ్మ, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
అర్హులకు ‘ఉపాధి’ పనులు కల్పించాలి
ఆసిఫాబాద్: ఉపాధిహామీ పథకం కింద అర్హులకు పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జాబ్కార్డు ఉన్నవారికి పని కల్పించే దిశగా ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. వేసవి లో పనిప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పనులు కల్పించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికీ కొన్ని జిల్లాలో ఉపాధిహామీ పనులు ప్రారంభించలేదని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ డేవిడ్, అధికారులు -
నామమాత్రంగా తొలి సమావేశం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీ నూతన కౌన్సిల్ సభ్యుల తొలి సర్వసభ్య సమావేశం శనివారం నామమాత్రంగా సాగింది. చైర్పర్సన్ షాహిన సుల్తానా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఉదయం 11 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. అయితే చైర్పర్సన్ పక్కన వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి అనితకు సీటు కేటాయించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సమావేశ హాలులోని నేలపై నిరసన తెలుపుతుండగానే మున్సిపల్ అధికారి రఫిక్ కౌన్సిల్ ఎజెండాలోని ఆరు అంశాలను చదివి 10 నిమిషాల్లోనే ముగించుకుని ఆమోదం పొందినట్లు సమావేశాన్ని ముగించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. అనంతరం వారు బయటకు వచ్చి కార్యాలయం ఎదుట కూర్చొని రెండు గంటల పాటు నిరసన తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు తీసుకుని కౌన్సిల్ ఎజెండా ఆమోదం పొందిందని చెప్పడం సరికాదన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. కమిషనర్ తిరుపతి వారిని సముదాయించి చైర్పర్సన్ పక్కన వైస్ చైర్పర్సన్కు కుర్చీ ఏర్పాటు చేయాలనే ఎలాంటి రూల్స్ లేవని స్పష్టం చేశారు. ‘గతంలో కుర్చీ వేశారు..’కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో చైర్పర్సన్ పక్కన వైస్ చైర్పర్సన్కు కుర్చీ వేశారని, హాలులో ఇద్దరికీ కుర్చీలు ఏర్పాటు చేయాలని జీవో ఉందన్నారు. సమావేశంలోకి పత్రిక విలేకర్లను రానివ్వకపోవడం సరికాదన్నారు. పట్టణంలో ఏ అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారో ప్రజలకు తెలిజేయాలని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశాలకు మీడియాను అనుమతించి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐ ప్రేంకుమార్ కార్యాలయానికి చేరుకుని కౌన్సిలర్లను సముదాయించడంతో వారు నిరసన విరమించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి అనిత, కౌన్సిలర్లు ఎండీ వలీ, వనమాల శ్రీధర్, వసీం, మాణిక్యరావు, సీపీ విద్యావతి తదితరులు ఉన్నారు. -
రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో
ఆసిఫాబాద్అర్బన్: నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెరలో చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎ మ్మార్పీఎస్, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ, ఇతర ప్ర జా సంఘాల నాయకులు మద్దతు పలికారు. వారు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కడతల మల్లయ్య, వేములవాడ గణపతి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్, నాయకులు కేశవ్రావు, దుర్గం దినకర్, గొడిసెల కార్తీక్, జయరాజ్, మారుతి పటేల్, రాజేందర్, సాయి, రాజేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి’
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాన్ని శనివారం ఆమె సందర్శించారు. పనుల విధానం, కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆదాయం సమకూరుస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయతిస్తోందని, నిధుల కోత, పనిదినాల తగ్గింపు జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. -
నేడే ఆఖరు
కాగజ్నగర్టౌన్: రైతులకు గుర్తింపు సంఖ్య(ఫార్మర్ ఐడీ) అందించేందుకు ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను గతేడాది ప్రారంభించింది. శనివారంతో గడువు ముగుస్తుండగా జిల్లాలో ఇప్పటివరకు 56 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది. వ్వయసాయాధికారులు, ఏఈవోలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి, రైతు వేదికల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులు ముందుకు రాకపోవడంతో ఏఈవోలు క్షేత్రస్థాయికి గ్రామాల్లో తిరుగుతూ వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు. గడువు నేటితో ముగుస్తుండడంతో వ్యవసాయాధికారులు ఆయా రైతువేదికల్లో క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నారు. 70,678 మంది వివరాలు నమోదుజిల్లాలోని పదిహేను మండలాల్లో లక్ష 36 వేల మంది రైతులు ఉండగా శుక్రవారం 5.30 గంట ల వరకు 70,678 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 56,096 మంది వివరాలు నమో దు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో 59 శాతం మాత్రమే పూర్తయ్యింది. అత్యధికంగా కౌటాలలో 78 శాతం, అతి తక్కువగా లింగాపూర్లో 40 శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపురిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పథకాలు పొందే వీలుంటుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్, ఎరువులు, సబ్సిడీలు, పంటల బీమా, వ్యవసాయ రు ణాలు, పంటల కొనుగోలు సమయంలో మద్ద తు ధర వంటి ప్రయోజనాలు పొందే ఆస్కారం ఉంటుందని వ్యవసాయాధికారులు స్పష్టం చే స్తున్నారు. అలాగే పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించవచ్చు. తక్కువ వడ్డీకి రుణాలను పొందవచ్చు. క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకునే వీలుంటుంది. రైతుల భూమి రికార్డులు డిజిటల్ రూపంలో ఉంటాయి. -
మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి
కాగజ్నగర్టౌన్: మాలీ కులస్తులను ఎస్టీ జా బితాలో చేర్చాలని మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురె శ్యాంరావు శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్సీ దండె విఠల్కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలోని మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని 40 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ని వారికి ఎస్టీ హోదా కల్పించగా, తెలంగాణ లో మాత్రం బీసీలో కొనసాగడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ హోదా కల్పించేలా పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలతో కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు షెండె వాసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదె వసంత్, నాయకులు గంగారాం, రాందేవ్, గోపాల్, శ్రీనివాస్, బాబురావు, వి జయ్, పాండురంగ, రవి సురేశ్ పాల్గొన్నారు. -
యువతకు చంద్రశేఖర్ ఆజాద్ ఆదర్శం
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని యువతకు చంద్రశేఖర్ ఆజాద్ ఆదర్శమని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్మెట్రిక్ బాలుర వస తి గృహంలో శుక్రవారం చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్తీక్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం విప్లవ పోరాటం చేసి అతి చిన్న వయస్సులో దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అని తెలిపారు. మహనీ యుల బాటలో నడవాలని సూచించారు. కా ర్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీకానంద్, నా యకులు దినకర్, రాకేశ్, రాజేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
రెబ్బెన: కనీస అభ్యసన సామర్థ్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింద ని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులే టి శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల సాధన కోసం ఏఐ విద్యాబోధనను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ఏఐఏ ఎక్సెల్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 14 పాఠశాలల్లో ఏఐ ద్వారా విద్యాబోధన సాగుతోందని, సింగరేణి సంస్థ సహకారంతో తాజాగా రెబ్బెన ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలోనూ ప్రారంభించామన్నారు. 27 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో రెబ్బెన స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం విజయరాణి, స్థానిక హెచ్ఎం అడ్డూరి లావణ్య, ఉపాధ్యాయుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవర్లకు స్పష్టమైన కంటిచూపు కీలకం
కాగజ్నగర్టౌన్: వాహనాలు నడిపే డ్రైవర్లకు స్పష్టమైన కంటిచూపు అత్యంత కీలకమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం హెచ్ఆర్డీ భవనంలో రోడ్డు ప్రమాదాలు నివారణకు పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన కంటిచూపు లోపాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి నడుపొద్దన్నారు. అధికవేగాన్ని నివారిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ర్యాష్, నిర్లక్ష్యం, హెవీలోడ్ డ్రైవింగ్ చేయొద్దన్నారు. వాహనదారులు బాధ్యతగా మెలగాలన్నారు. అనంతరం పట్టణంలోని డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వర్, టౌన్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు సుధాకర్, రాజు, డ్రైవర్లు పాల్గొన్నారు. భద్రత మరింత బలోపేతంకాగజ్నగర్టౌన్: సీసీ కెమెరాలతో భద్రత మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రతను పతిష్టం చేయాలనే లక్ష్యంతో కాగజ్నగర్ పోలీసులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్, ఎన్టీఆర్ చౌరస్తా, సిర్పూర్ ప్రధాన రహదారి, తదితర ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
దివ్యాంగ విద్యార్థిని ప్రతిభ
దహెగాం: హైదరాబాద్లోని దోమలగూడలో ఈ నెల 17న రాష్ట్రస్థాయి ఫిజికల్ ఎడ్యూకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 50 మీటర్ల పరుగు పందెంలో దహెగాం మండల కేంద్రానికి చెందిన రెడ్డి దీపిక రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచి ప్రతిభ చూపింది. మండల కేంద్రంలోని ముత్యంపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సర్పంచ్ జయలక్ష్మి, ఎంఈవో శ్రీనివాస్ విద్యార్థిని అభినందించారు. శారీర క పరిమితులను అధిగమిస్తూ ధైర్యంగా పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడం గొప్ప వి షయమని కొనియాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు కిషన్రావ్, సుప్రియ, ఉప సర్పంచ్ సురేశ్, వార్డు సభ్యుడు ప్రశాంత్, టీచర్లు, సీఆర్పీలు ప్రియాంక, రవీందర్, చంద్రశేఖర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్టాండ్పై పట్టింపేది..?
కాగజ్నగర్: జిల్లాలో ఆర్టీసీకి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న కాగజ్నగర్ బస్టాండ్పై అధికారులు కనీస పట్టింపు చూపడం లేదు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఈ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ తెలంగాణలోని పలు పట్టణాలు, మహారాష్ట్రకు సైతం బస్సులు ట్రిప్పులు వేస్తుంటాయి. కౌటాల, బెజ్జూర్, మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నిజామాబాద్, తదితర పట్టణాలతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్, అహేరి పట్టణాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కంట్రోలర్ తొలగింపునాలుగు నెలల క్రితం పలు కారణాలతో కంట్రోలర్ను విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు బస్సుల టైమింగ్ తెలియడం లేదు. ఏ బస్సు ఎప్పుడు వస్తోందో తెలియక.. బస్టాండ్లో ఒకరి వద్ద మరొకరు ఆరా తీస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లోనే వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కపోత తప్పదా..?వేసవి సమీపించడంతో ఎండలు ముదిరి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడుతున్నారు. కానీ కాగజ్నగర్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన మూడు ఫ్యాన్లు తిరగడం లేదు. వాటిని ఆన్ ఆఫ్ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అవి పని చేస్తున్నాయా.. లేక మరమ్మతులు చేపట్టాలా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. అలాగే తాగునీటి కోసం ఏర్పాటు చేసి నల్లా వద్ద పరిశుభ్రత లోపించింది. మరుగుదొడ్లు సైతం కంపుకొడుతున్నాయి. వేసవి నేపథ్యంలో ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.హోంగార్డుకు విధులు సిబ్బంది కొరతతో కంట్రోలర్గా నియమించలేదు. తాత్కాలికంగా సేవలందించేందుకు హోంగార్డుకు కంట్రోలర్ పనులు అప్పగించాం. త్వరలోనే పర్మినెంట్ కంట్రోలర్ను నియమిస్తాం. అలాగే ఫ్యాన్లు బాగు చేయించడంతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం. – రాజశేఖర్, ఆర్టీసీ డిపో మేనేజర్ -
‘వన్యప్రాణుల కోసం అండర్పాస్ బ్రిడ్జి’
రెబ్బెన: వన్యప్రాణుల రాకపోకల కోసం తక్కళ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై అనిమాల్ అండర్పాస్ బ్రిడ్జి నిర్మించినట్లు రెబ్బెన రేంజ్ అధికారి కె.భానేశ్ తెలిపారు. తెలంగాణ ఫారెస్టు అకాడమీకి చెందిన 40 మంది ట్రైనీ బీట్ అధికారులు స్టడీ టూర్లో భాగంగా శుక్రవారం రెబ్బెన రేంజ్ పరిధిలో పర్యటించారు. ఎఫ్ఆర్వో వారికి అనిమల్ అండర్ పాస్ వంతెన ఆవశ్యకతను వివరించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కావడంతో పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుందన్నారు. జాతీయ రహదారి ఏర్పాటుతో వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా రోడ్డు దాటేందుకు అండర్పాస్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారులు సద్దాం, రవి, బీట్ అధికారులు రాజేశం, దేవేందర్ పాల్గొన్నారు. -
సమరం!
రోడ్డు ప్రమాదాలపై వాంకిడి: హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా సెల్ఫోన్లు చూస్తూ వాహనాలు నడుపుతూ అవగాహన లేమితో అనేకమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒకే ఘటనతో జీవితాలు మారి కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొదటి దశలో జనవరి 13 నుంచి 24 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమాలు చేపట్టారు. మళ్లీ రెండో దశలోనూ ఈ నెల 23 నుంచి 28 వరకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని పక్కా ప్రణాళికలు రూపొందించారు. అవగాహన ఇలా..రోడ్డు భద్రతలో భాగంగా ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో తొలి విడతలో అరైవ్– అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. రోజూవారీగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. రెండో దశలో రోడ్లపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, సురక్షిత ప్రయాణం, ఓవర్ టేకింగ్ తనిఖీలు, హెల్మెట్ తనిఖీలు, అమలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, నాలుగు చక్రాల వాహనాల తనిఖీలు, సీట్ బెల్ట్ అమలు, కళాజాత బృందాలతో ప్రత్యేక కార్యక్రమాలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ధ్రువపత్రాల తనిఖీలు, మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని హెచ్చరికలు, కంటి పరీక్ష శిబిరాలు, భారీ వాహన డ్రైవర్లకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ నెల 28న ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. హెల్మెట్ లేని కారణంగా ప్రమాదాల బారినపడి మృతి చెందిన కుటుంబాలను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి వారితో హెల్మెట్లు పంపిణీ చేయించారు. జిల్లా పోలీసులు మొదటి విడతలో మొత్తం 166 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రెండు నెలల్లో 32 ప్రమాదాలు..ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 32 రహదారి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అందులో 18 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానంగా నిర్లక్ష్యమే కారణమవుతుందని అధికారులు గుర్తించారు. జిల్లాలో హెల్మెట్ ధరించే ద్విచక్రవాహనదారులు అరుదుగా కన్పిస్తుండగా, వందలో పదిమంది కూడా ధరించడం లేదు. హెల్మెట్ను బరువుగా భావిస్తూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పల్లెల మాట అటుంచితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం అవగాహన రహితంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం లేదనే అపవాదు ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పటిష్ట తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్టు ధరించేలా చర్యలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. తమ తప్పిదాలు లేకున్నా ఇతరుల నిర్లక్ష్యంతోనూ ప్రమాదాల్లో హెల్మెట్ లేని కారణంగా మృత్యువాత పడినవారు అనేక మంది ఉన్నారు. మరికొందరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా మార్పు రావడం లేదు. దీనికి తోడు మైనర్ డ్రైవింగ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులు సైతం బైక్లు అతి వేగంగా నడుపుతున్నారు. అవగాహన లేని తల్లిదండ్రులు పిల్లలు వాహనాలు నడిపితే సంబుర పడుతున్నా.. ప్రమాదాల బారిన పడితే తీరని శోకం మిగులుతుందని గ్రహించలేకపోతున్నారు. అప్రమ త్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది.నిర్లక్ష్య డ్రైవింగ్తోనే అధిక ప్రమాదాలురెబ్బెన: నిర్లక్ష్య డ్రైవింగ్తోనే అధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ నితికపంత్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెబ్బెన మండలం నంబాలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయొద్దని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. రహదారులపై ప్రయాణించే సమయంలో ప్రతిఒక్కరూ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. నంబాలలో గతంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడంతో తమ వారి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాటలు, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం యువతకు హెల్మెట్లు అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి లేకుండా చర్యలు
తిర్యాణి: వేసవిని దృష్టిలో ఉంచుకుని మండలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ గడ్డి నరేశ్ అన్నారు. మండలంలోని గుండాల గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. స్థానిక తాగునీటి బావిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన చోట నూతన బోర్వెల్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట మిషన్ భగీరథ ఏఈ కృష్ణతేజ, ఎంపీవో ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. -
ముగిసిన సీసీఐ కొనుగోళ్లు
దహెగాం: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు శుక్రవారంతో ముగిశాయి. ఓ వైపు ఇంకా పత్తి చేలలోనే ఉండగా, సీసీఐ గడువు పెంచలేదు. దీంతో మిగిలి న పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్ని స్తున్నారు. మొదట ఈ నెల 20న గడువు ముగిసింది. ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి గడువు పెంచాలని డిమాండ్ రావడంతో స్పందించిన అధి కారులు వారం రోజుల పాటు గడువు పెంచారు. భారీ వర్షాలకు ఆలస్యంజిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అక్టోబర్లో భారీ వర్షాలు కురవడంతో పత్తితీత పనులు ఆలస్యమయ్యాయి. చాలా ప్రాంతాల్లో నవంబర్ నుంచి పనులు మొదలు పెట్టారు. జిల్లావ్యాప్తంగా కూలీల కొరత ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలు వలస వచ్చారు. రైతులు వారికి షెల్టర్ కల్పించి పత్తితీత పనులు చేయించుకున్నారు. అయినా ఇప్పటివరకు పూర్తికాలేదు. జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టగా, ఈ నెల 20 వరకే పత్తి కొనుగోళ్లు చేస్తామని ఆ తర్వాత నిలిపివేస్తామని సీసీఐ ప్రకటించింది. దీనిపై రైతులు ఆందోళన చెందారు. 30శాతం వరకు పంట చేలలోనే ఉండటంతో ‘సాక్షి’లో ‘గడువు గండం..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, ఎంపీ స్పందించారు. రైతులు మార్చి 15 వరకు పెంచాలని డిమాండ్ చేసినా అధికారులు వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. దీంతో అన్నదాతలకు కొంతమేర ఊరట కలిగింది. ఇంటిల్లిపాది వెళ్లి పత్తితీత పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలకు కిలోకు రూ.20 నుంచి రూ.25 వరకు చెల్లించారు. మరో 15 శాతం వరకు పత్తి తీయాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. సీసీఐ మరోసారి గడువు పెంచే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 13,61,771 క్వింటాళ్లు కొనుగోలుజిల్లావ్యాప్తంగా 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా ఇప్పటివరకు 13,61,771 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ప్రైవేటులో 39,910 క్వింటాళ్లను సేకరించారు. ఈ నెల 20 వరకు సీసీఐ కొనుగోళ్లు నిలిపేవరకు 12,92,616 కొనుగోలు చేయగా, ప్రైవేటులో 34,118 వేల క్వింటాళ్లను కొనుగోలు చేశారు. గడువు పెంచిన తర్వాత వారం రోజుల్లో సీసీఐ ద్వారా ఏకంగా 69,155 క్వింటాళ్లు సేకరించడం గమనార్హం. ప్రైవేటులోనూ 5,792 క్వింటాళ్లను కొనుగోలు చేశారు. నష్టపోయే అవకాశం ఉన్నందున మార్చి 15 వరకు గడువు పెంచాలని జిల్లా రైతులు కోరుతున్నారు. -
కుమురం భీం
7వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. పగలు వేడి పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.‘యంగ్ సైంటిస్ట్’లకు ఇస్రో ఆహ్వానం యంగ్ సైంటిస్ట్ పేరుతో ఇస్రో యువ విజ్ఞాన్(యువికా) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
పాలనలో ముద్ర.. విద్యాశాఖపై పర్యవేక్షణ
ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: పాలనలో తనదైన ముద్రవేసి, విద్యాశాఖపై పర్యవేక్షణను పెంచిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన దీపక్ తివారిని వికారాబాద్ కలెక్టర్గా నియమించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎవరినీ నియమించలేదు. జిల్లాలో రెండు సంవత్సరాల పాటు అదనపు కలెక్టర్గా ఆయన పనిచేశారు. అలాగే విద్యాశాఖ ఇన్చార్జి జిల్లా అధికారిగా నూ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా పనిచేస్తూ ప్రస్తుతం లీవ్లో ఉన్న ఆయ న సతీమణి ఖుష్బూ గుప్తాను సైతం మహబూ బ్నగర్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బదిలీకై లాస్నగర్: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజె క్ట్ అధికారి ఖుష్బూ గుప్తా బదిలీ అ య్యారు. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్న ఆమెను మహబూబ్నగర్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె తొలుత ఆదిలాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా బదిలీ అ యిన ఆమె అదే ఏడాది నవంబర్ 4 నుంచి ప్రసూతి సెలవుపై వెళ్లారు. ఈ ఏడాది మే 3వరకు ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసినా తా జాగా జిల్లా నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో పీవోగా కొత్త అధికారులెవరిని ఇంకా నియమించలేదు. ప్రస్తుతం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఇన్చార్జి పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్చార్జి డీఈవోగా ఏడు నెలలువిద్యారంగంలో వెనుకబడి ఉన్న జిల్లాలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి 2025 ఆగస్టు 5న ఇన్చార్జి డీఈవోగా బాధ్యతలు చేపట్టా రు. గాడితప్పిన విద్యాశాఖపై ఆయన పర్యవేక్షణ పెంచారు. నిత్యం పాఠశాలలను తని ఖీ చేస్తూ ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరు పెంచేందుకు కృషి చేశారు. ఐఏఎస్ స్థాయి అధికారి విద్యాశాఖ అధికారిగా ఉండటంతో ఎంఈవోలు, ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరి గింది. పాఠశాలల తనిఖీ సమయంలో స్వ యంగా పాఠాలు బోధిస్తూ, విద్యార్థులతో పుస్తకాలు చదివిస్తూ విద్యా సామర్థ్యాలు పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన పనులు పూర్తి చేయించడంతోపాటు మానిటరింగ్ వ్యవస్థను పటిష్టంగా అమలుపర్చారు. పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల సమయంలో ఉదయం, సాయంత్రం సింగరేణి ఆధ్వర్యంలో స్నాక్స్ అందించేందుకు కృషి చేశారు.


