breaking news
Komaram Bheem
-
పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాల పురోగతి వివరాలను పోర్టల్లో న మోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి మిషన్ భగీర థ, వ్యవసాయ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య, విద్యుత్, హౌజింగ్ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో 2023– 24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్లో నమోదు చేసే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల్లో సాగు విస్తీర్ణం, పంటల వివరాలు, పశువులకు అందుబాటులో ఉన్న పశుగ్రాసం, బ్యాంకు సేవలు, బ్యాంకు మిత్ర, నగదు డిపాజిట్, ఉపసంహరణ సేవలు, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ని ర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతోపాటు ఇతర వివరాలు నమోదు చేయాలని ఆదేశించా రు. తెల్ల రేషన్కార్డులు కలిగిన కుటుంబాల సంఖ్య, కబ్జా నివాస గృహాల వివరాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలపై జరిగిన ఘటనల వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులు, ఆరోగ్య బీమా కలిగిన కుటుంబాల సంఖ్య, అందుబాటులో ఉన్న నర్సరీలు, సామాజిక పింఛన్ల వివరాలు ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ప్రతీ సమాచారం క్లుప్తంగా సేకరించాలని సూచించారు. సమావేశంలో డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
నరకయాతన
ప్రసవ వేదన.. ‘వర్షాలకు మా గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో గ్రామానికి అంబులెన్స్ రాదు. ఉట్నూర్లో స్కానింగ్ సెంటర్ ఉన్నా అక్కడ స్కానింగ్ చేయడం లేదు. స్కానింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్నానికి వెళ్తున్నాం. రానుపోను నాలుగు గంటల సమయం పడుతుండగా, ఆస్పత్రిలో మూడు గంటలపాటు నిరీక్షించాలి. తిరిగి ఇంటికి రావాలంటే రాత్రి అవుతుంది..’ అని లింగాపూర్ మండలం పట్కాల్ మంగి గ్రామానికి చెందిన గర్భిణి రాథోడ్ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. దహెగాం మండలంలోని మరుమూల గిరిజన గ్రామమైన లోహకు చెందిన సిడాం రామయ్య, చిన్నక్క దంపతుల కుమార్తె పుష్పలత గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఈ నెల 15న పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. లోహకు వెళ్లేదారి బురదమయంగా ఉండటంతో గ్రామం వరకు అంబులెన్స్ రాలేకపోయింది. కుటుంబ సభ్యులు నెలలు నిండిన పుష్పలతను ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఎడ్లబండిలో తరలించాల్సి వచ్చింది. ప్రసవం తర్వాత కూడా అంబులెన్స్ సిబ్బంది వారిని గ్రామం వరకు తీసుకెళ్లలేకపోయారు. మళ్లీ మూడు కిలోమీటర్లు ఎడ్లబండిలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు.● జిల్లాలో రహదారి సౌకర్యం లేని 101 హైరిస్క్ గ్రామాలు ● రాకపోకలకు వాగులు, ఒర్రెలు అడ్డంకి.. బురదమయంగా రోడ్లు ● అంబులెన్స్లు వెళ్లడం కష్టమే.. ● స్కానింగ్, ప్రసవాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గర్భిణులు ఆసిఫాబాద్: పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మారాయి. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో గర్భిణులు పరిస్థితి దుర్భరంగా మారింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగడంతోపాటు మట్టిరోడ్లు బురదమయంగా మారుతుండటంతో అంబులెన్స్లు, 108, 102 వాహనాలు వెళ్లడం లేదు. ఫలితంగా ఏజెన్సీ గ్రామాల నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రానికి రావడానికి పడరానిపాట్లు పడుతున్నారు. 2,930 మంది గర్భిణులుజిల్లాలో 20 పీహెచ్సీలు, రెండు యూపీహెచ్సీలు, ఐదు సీఎస్సీలు ఉన్నాయి. వీటిలో 44 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 27 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ప్రస్తుతం 2,930 మంది గర్భిణులు ఉండగా, వీరిలో తొమ్మిది నెలలు నిండిన 636 మంది ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 1,699 ప్రసవాలు జరిగాయి. జిల్లాలో రహదారి సౌకర్యం లేని 101 హైరిస్క్ గ్రామాలను అధికారులు గుర్తించారు. లింగాపూర్, సిర్పూర్– యూ, జైనూర్, దహెగాంతోపాటు ప్రతీ మండలంలో రహదారి సౌకర్యం లేని పల్లెలు ఉన్నాయి. ప్రసవానికి వారం రోజుల ముందు సమీపంలోని పీహెచ్సీ, ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణులను తరలించి, వైద్యాధికారి పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుంది. అధ్వానంగా గ్రామీణ రహదారులుజిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామీణ రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పక్కారోడ్లు లేకపోవడంతో వర్షాలకు బురదమయంగా మారుతున్నాయి. కల్వర్టులు, వంతెనలు లేకపోవడంతో ఆస్పత్రులకు వెళ్లడం గర్భిణులకు కష్టంగా మారుతోంది. చాలా గ్రామాలకు కనీసం 108, 102 అంబులెన్స్లు కూడా వెళ్లడం లేదు. గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో ఎడ్లబండ్లలో ఆస్పత్రికి వెళ్తున్నారు. 15 మండలాలకు 108 సర్వీసులు 15 ఉండగా, 102 సర్వీసులు 15 ఉన్నాయి. పలు సందర్భాల్లో వైద్యచికిత్స కోసం రోగులను గ్రామీణ ప్రాంతాల నుంచి పీహెచ్సీలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా తరచూ మంచిర్యాల, ఆదిలాబాద్కు రెఫర్ చేస్తున్నారు. ఇలా ప్రతీరోజు 4 వాహనాలు రెఫర్కే వెళ్తున్నారు. నెలకు సుమారు 500 కేసులు రెఫర్ చేస్తున్నారు. 108, 102 వాహనాలు మంచిర్యాల, ఆదిలాబాద్ వెళ్లి రావడానికి 3 నుంచి 6 గంటల సమయం పడుతుండటంతో ఇతరులకు అత్యవసర సేవలకు వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులకు సిబ్బంది నుంచి సరైన స్పందన ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.రెండు స్కానింగ్ కేంద్రాలు జిల్లాలో రెండు స్కానింగ్ కేంద్రాలు గర్భిణులకు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కాగజ్నగర్ ఆస్పత్రిలో స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని స్కానింగ్ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఆరు నెలులుగా రేడియాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు ప్రైవేటులో స్కానింగ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఏజెన్సీ మండలాల ప్రజలు ఆదిలాబాద్లోని రిమ్స్కు వెళ్తున్నారు. ఇక కాగజ్నగర్ కేంద్రంలో వారానికి ఒకరోజు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిరుపేద మహిళలు ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కో స్కానింగ్ టెస్టుకు రూ.1000 చెల్లించాల్సి రావడంతో పేదలకు భారంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏళ్లుగా గైనకాలజిస్టు లేకపోవడంతో కేవలం నార్మల్ డెలివరీలు మాత్రమే చేస్తున్నారు. సిజేరియన్ ఆపరేషన్లు అవసరమైతే మంచిర్యాల, కాగజ్నగర్ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.రహదారుల సమస్య ఉంది మారుమూల రహదారి సౌకర్యం లేని గ్రామాల్లోని గర్భిణులను ప్రసవానికి వారం రోజుల ముందు సమీపంలోని పీహెచ్సీకి, లేదా వారి బంధువుల ఇళ్లకు తరలిస్తున్నాం. జిల్లాలో రహదారుల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లో రేడియాలజిస్టు, గైనకాలజిస్టు పోస్టులు భర్తీ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – సీతారాం, డీఎంహెచ్వో -
శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలని డీఈవో యాద య్య అన్నారు. పీఎంశ్రీ అటల్ టింకరింగ్ ల్యాబ్ల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శుక్రవారం గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేష న్ మిషన్ సహకారంతో రూ.20లక్షలతో ని ర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్లు వినియోగించుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ వంటి సాంకేతిక రంగాలపై అవగాహన క ల్పించడం, ప్రయోగాలు చేయించడం ద్వారా విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఆధునిక ఆవిష్కర్తలుగా తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, రిసోర్స్పర్సన్లు అమీర్, శివకృష్ణ, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఆదివారం డీలర్లకు శిక్షణ
ఆసిఫాబాద్: ఇక నుంచి ప్రతీ ఆదివారం డీలర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శుక్రవారం డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ డీలర్ శిక్షణ తరగతులకు హాజరై విషయ పరిజ్ఞానం పొందాలని సూచించారు. నానో యూరియా వినియోగంపై శిక్షణజిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శుక్రవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమి టెడ్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికా రులు, ఏఈవోలకు నానో యూరియా, డీఏ పీ వాడకంపై ఒక రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. సీనియర్ అగ్రనమిస్ట్ సుధాకర్రెడ్డి, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటె డ్ జోనల్ మేనేజర్ మనోజ్ కుమార్ యూరి యా, డీఏపీ వాడే విధానం, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించారు. డీఏవో శ్రీనివాసరావు, కోరమాండల్ సేల్స్ ఆఫీసర్ శ్రావణ్, ఏడీలు మిలింద్కుమార్, వెంకటి, మనోహర్, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
చింతలమానెపల్లి(సిర్పూర్): ప్రజల సమస్యలు పరి ష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్మే పాల్వా యి హరీశ్బాబు అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ, చింతలమానెపల్లి, ఖర్జెల్లి, దిందా, గూ డెం, కేతిని గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. బాలాజీఅనుకోడ పంచాయతీ పరిధిలోని పాల్వాయినగర్లో నూతన విద్యుత్లైన్ పనులు ప్రారంభించారు. అనంతరం ఖర్జెల్లి– గూడెం రహదారిని పరిశీలించారు. రహదారి మరమ్మతులకు రూ.కోటి 50లక్షలు మంజూరయ్యాని తెలిపారు. మట్టి మొ రంతో మరమ్మతులు చేపట్టొద్దని, కంకర వినియోగించాలని డీఈ లక్ష్మీనారాయణకు సూచించారు. దిందా వంతెన పరిశీలించి.. హైలెవల్ వంతెన ని ర్మాణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. వాతావరణం అనుకూలించగానే త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అనంతరం పోడురైతులతో సమావేశమయ్యారు. భూముల వి షయంలో పోడు రైతులు సరైన ఒప్పందానికి రావా లని సూచించారు. గూడెం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులలో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. హెల్త్ సబ్సెంటర్ అద్దెభవనంలో ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆ యన దృష్టికి తీసుకెళ్లారు. గూడెం, సమీప గ్రామాల కు ఉపయోగపడేలా పీహెచ్సీ మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు. గూడెం ఉన్నత పాఠశాలలో 9, 10 వతరగతులు అప్గ్రేడ్ చేయాలని డీఈవోతో ఫోన్లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న గూడెం మాజీ సర్పంచ్ పూల్చంద్ జైశ్వాల్ను పరామర్శించారు. చింతలమానెపల్లిలో పలువురు పార్టీలో చేరగా.. కండువా కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేందర్గౌడ్, చింతలమానెపల్లి, కౌటాల మండలాల అధ్యక్షులు డోకె రామన్న, కుంచాల విజయ్, నాయకులు మల్లయ్య, చౌదరి నానయ్య, తుకారాం, సుధాకర్, చౌదరి రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
‘రోడ్డు వేయకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం’
లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని జాముల్ధార గ్రామం నుంచి కీమానాయక్ తండా, పంగిడిమాదర గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని శుక్రవారం మూడు పంచాయతీల ప్రజలు కీమానాయక్ తండా రోడ్డుపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మూడు పంచాయతీల పరిధిలో 20కి పైగా అనుబంధ గ్రామాలు ఉన్నాయని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు అధ్వానంగా మారిందని, బురదతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామన్నారు. అంబులెన్స్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. -
‘స్థానిక’ పోరుకు సన్నద్ధం
● జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు ● ఎన్నికల విధుల్లో 7,045 మంది సిబ్బంది ● ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ నివేదిక సాక్షి, ఆసిఫాబాద్: స్థానిక ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం జిల్లాలోని 15 మండలాల్లో గల 335 గ్రామ పంచాయతీలకు గాను 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ సభ్యుల స్థానాలను బుధవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అధికారులు సైతం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2019లో జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఈ ఏడాది రెండు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడత శిక్షణ పూర్తి..పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులు ఇప్పటికే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధి కారులు, సిబ్బందికి తొలి విడత శిక్షణ ఇచ్చారు. ఆ వివరాలను ‘తెలంగాణ పోల్’లో నమోదు చేశారు. ఇటీవల బదిలీలు, నూతన నియామకాలు, పదవీ విరమణలు జరిగాయి. దీని దృష్ట్యా జాబితాను మళ్లీ పరిశీలించి, సవరణలు చేసి పంపేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారు. పంచాయతీ, వార్డుల వారీగా సిబ్బంది..జిల్లాలో పంచాయతీ, వార్డుల వారీగా ఎన్నికల సిబ్బంది జాబితాను ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కొద్దినెలల కిందటే పది శాతం రిజర్వు సిబ్బందితో కలుపుకొని మొత్తం 7,045 మందిని విధులకు ఎంపిక చేశారు. విధుల్లో పాల్గొనే వారిలో పీవోలు 3,161, ఓపీవోలు 3,515, స్టేజ్–2 ఆర్వోలు 369 మంది ఉన్నారు. 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రానికి ఒక పీవో, ఓపీవోను నియమిస్తారు. అంతకంటే ఎక్కువ మంది ఓటర్లుంటే అదనంగా ఓపీవోలను పెంచుతారు. 650 కంటే ఎక్కువ మంది ఓటర్లుంటే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రాలు 2,565, 200 నుంచి 400 మంది వరకు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 295, నాలుగు వందల నుంచి 650 మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 14 ఉన్నాయి. మొత్తంగా 2,874 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. బీసీలకు 53 ఎంపీటీసీలు..!బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి కొత్త రిజర్వేషన్లు వర్తిస్తే జిల్లాలోని మొత్తం 127 ఎంపీటీసీ సభ్యుల స్థానాల్లో 53 బీసీలకు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వు చేయనున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించారు. మండలాన్ని యూనిట్గా తీసుకుని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు. తొలుత ప్రాదేశిక, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సమాయత్తంఅవుతోంది. కసరత్తు మళ్లీ షురూ..గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాను పునఃపరిశీలించి పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఆదేశించడంతో జిల్లా అధికారులు వివరాల సేకరణపై దృష్టి సారించారు. రెండు విడతల్లో జిల్లాలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్ మండలంలో 27 పంచాయతీలు, జైనూర్లో 26, కెరమెరిలో 31, లింగాపూర్లో 14, రెబ్బెనలో 24, సిర్పూర్(యూ)లో 15, తిర్యాణిలో 29 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడతలో వాంకిడి మండలంలోని 28, కాగజ్నగర్ నియోజకవర్గంలోని బెజ్జూర్లో 22, చింతలమానెపల్లిలో 19, దహెగాంలో 24, కాగజ్నగర్ రూరల్లో 28, కౌటాలలో 20, పెంచికల్పేట్లో 12, సిర్పూర్(టి)లో 16 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
రోడ్డు వేయాలని విద్యార్థుల రాస్తారోకో
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం జీడిచేను నుంచి భట్టుపల్లి వరకు రోడ్డు వేయాలని కాగజ్నగర్– దహెగాం ప్రధాన రహదారిపై భట్టుపల్లి వద్ద శుక్రవారం విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జీడిచేను గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నామన్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వర్షాకాలంలో నడవలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కోట ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు రోజుల్లో ప్రత్యేక నిధులతో రోడ్డుకు మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు. -
జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలి టీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్గా మారి 17 నెలలు గడుస్తున్నా కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనా లు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సమ్మెకు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ బాధ్య త వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు మాట్ల రాజయ్య, కార్యదర్శులు తోట సమ్మయ్య, నాయకులు బాలేశ్, ప్రభాకర్, శంకర్, ఇస్తారి, లక్ష్మి, బాలయ్య, పద్మ, శ్యామల, మల్లేశ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారలోపం గుర్తింపునకు సర్వే
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్: పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్త సర్వే చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల తన చాంబర్లో డీఎంహెచ్వో సీతారాం, యూనిసెఫ్ ప్రతినిధులతో జిల్లాలో పోషకాహార లోపం కలిగిన పిల్లల నిష్పత్తిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్ల లకు సకాలంలో సరైన ఆహారం, మందులు అందించి పోషకాహార లోపాన్ని నియంత్రించాలన్నారు. యూనిసెఫ్ బృందం సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని సూచించారు. సమావేశంలో యూనిసెఫ్ పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఖ్యాతి తివారి, న్యూట్రిషియన్ ఆఫీసర్ రేష, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో వసతులు కల్పించాలికాగజ్నగర్టౌన్: నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పించి, లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పట్టణంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి గురువారం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బోరిగాం శివారులో 12 బ్లాక్ల్లో 228 డబుల్ బెడ్రూంలు నిర్మించామన్నారు. విద్యుత్, తాగునీరు, కిటికీలు, తలుపులు, అంతర్గత రహదారుల నిర్మాణాలు, పెయిటింగ్ తదితర పెండింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ హౌజింగ్ పీడీ వేణుగోపాల్, తహసీల్దార్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంచు జాగా వదిలిపెట్టం’
కెరమెరి(ఆసిఫాబాద్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాలు విలీనం చేసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, ఇంచు జాగా కూడా వదిలిపెట్టమని కెరమెరి మండల బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు. సుప్రీం కోర్టులో సరిహద్దు గ్రామాలపై కేసు కొనసాగుతుండగా మహారాష్ట్ర సీఎం, రెవెన్యూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం, పార్టీ మండల అధ్యక్షుడు అంబాజీ, నాయకులు యూనుస్, రూప్లాల్, రాజయ్య, జగన్నాథ్రావు, జాహెద్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ షురూ
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ శివారులోని కొండాపూర్ వద్ద ఉన్న నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల నుంచి 180మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. గురువారం క్వాలిఫై పోటీలు నిర్వహించగా.. శుక్రవారం నుంచి ఈ నెల 20వరకు ప్రధాన పోటీలు కొనసాగుతాయి. అండర్–19 బాలురు, బాలికలు, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్, వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్గౌడ్, మహేష్, ప్రణీత్, నందకుమార్ పోటీలను పర్యవేక్షించనున్నారు. శుక్రవారం మెయిన్ డ్రా పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. -
గిరిజన విద్యార్థికి ల్యాప్టాప్ అందజేత
ఉట్నూర్రూరల్: కెరమెరి మండలంలోని నిషాని గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ఆత్రం వంశీకృష్ణ పైచదువుల నిమిత్తం గురువారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన కార్యాలయంలో ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్లో అపజయాలు ఉండవని, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్మానం కళామందిర్ ఫౌండేషన్ ద్వారా ఇటీవల సేవారత్న పురస్కారం అందుకున్న కాథ్లే మారుతిని గురువా రం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సన్మానించారు. ఆ దిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన మారుతి ఎంతోమంది గిరిజన విద్యార్థులకు వి లువిద్యలో శిక్షణ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఫౌండేషన్ తరపున అతనికి రూ.లక్ష నగదు, జ్ఞాపిక అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏసీఎంవో జగన్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి పాల్గొన్నారు. -
‘ఉమ్మడి జిల్లా బంద్కు సహకరించాలి’
ఆదిలాబాద్: జీవో 49 రద్దు చేయాలని కోరుతూ ఈనెల 21న చేపట్టనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు సహకరించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు, ప్రజాస్వామ్యవాదులు, గ్రామ పటేళ్లు, రాయి సెంటర్ సార్మేడీలు, ఆదివాసీ కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, ప్రజా సంఘాలు బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వెడ్మ బొజ్జు, ముకుందరావు, పీ. నాగోరావు, గెడం ఆనందరావు, దుర్వ జుగాథిరా వు, ఆత్రం మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చోడలో దొంగల బీభత్సం
● ఒకేరోజు మూడిళ్లలో చోరీ ● బంగారం, వెండి, నగదు అపహరణఇచ్చోడ: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన జాదవ్ దేవిదాస్ మూడు రోజుల కిత్రం ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి సొనాల మండలంలోని ఘన్పూర్కు వెళ్లారు. తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లో చొరబడి తులం బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు దొంగిలించారు. విద్యానగర్ కాలనీలోని రమేశ్ ఇంట్లో చొరబడి 4 గ్రాముల బంగారంతో పాటు నగదు అపహరించారు. అదేకాలనీలో ఉన్న చిక్రం జంగు ఇంట్లో తులం బంగారం, ఐదు తులాల వెండి దొంగిలించారు. సంతోషిమాత ఆలయం వద్ద పార్క్ చేసిన పల్సర్ 220 బైక్ను తీసుకెళ్లి ఆదిలాబాద్ బైపాస్ వద్ద వదిలేసి పరారయ్యారు. అప్రమత్తమైన పోలీసులు క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ బృందాలను రప్పించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. -
రుచికరమైన భోజనం అందించాలి
ఆసిఫాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్మెట్రిక్ బాలికల వసతిగృహంలో ఆశ్రమ పాఠశాలల వంట సిబ్బందికి గురువారం ఒకరోజు వృత్యంతర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడు తూ వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. నిర్ణీత సమయంలో విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. కాలం చెల్లిన సామగ్రిని వంటకు విని యోగించొద్దని, వర్షాకాలం దృష్ట్యా నిత్యం ఆహార పదార్థాలను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవోలు చిరంజీవి, శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యమాలకు సిద్ధం కావాలి
● జీవో 49 వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల పిలుపుకాగజ్నగర్రూరల్: ఆదివాసీలు, ప్రజలను గ్రామా ల నుంచి దూరం చేసే జీవో నంబర్ 49 రద్దుకు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని జీవో నం. 49 వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన నాయకులు లాల్కుమార్, సోయం చిన్నయ్య, ఎండీ చాంద్పాషా మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజలకు భద్రత లేదన్నారు. పశువులను మేపడానికి అడవుల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని, వంట చెరుకు కోసం వెళ్లనీయడం లేదని ఆరోపించారు. పులుల సంరక్షణ పేరుతో ప్రజల జీ వనాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. మెజారీటి ప్రజల ఆమోదం లేనందున జీవో 49 రద్దు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ నె 21న చేపట్టే బంద్ జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్, తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, భారత్ బచావో ఆందోళన్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఇన్నయ్య, బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొండయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయదేవ్ అబ్రహంతోపాటు ప్రజా, ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
108లో సుఖప్రసవం
కోటపల్లి: మండలంలోని పంగిడిసోమారం గ్రామానికి చెందిన గర్భిణి రెడ్డి లవలోకకు పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త అర్జన్న 108కి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అంబులెన్సులో కోటపల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికం కావడంతో పంగిడిసోమారం అటవీప్రాంతంలోనే సుఖప్రసవం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇరువురిని కోటపల్లి పీహెచ్సీకి తరలించారు. కార్యక్రమంలో ఈఎంటీ షబనాజ్, ఫైలట్ ఫరీద్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం
కెరమెరి(ఆసిఫాబాద్): ఉన్నత లక్ష్యాలు సా ధించేందుకు విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణ లో గురువారం మండలస్థాయి వాలీబాల్ టో ర్నమెంట్ను ప్రారంభించారు. ఏఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఆరో గ్యవంతమైన జీవన శైలిని పాటించాలని సూ చించారు. గంజాయి మొక్కలు పెంచడం, సరఫరా చేయడం, విక్రయించడం చట్ట విరుద్ధమన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల ని ర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్ఎం పంచఫులా తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో ఆర్టీఐకి అడ్డంకులు
● సమాచార అధికారుల నియామకంలో జాప్యం ● నిలిచిన దరఖాస్తుల స్వీకరణ శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్టీఐ దరఖాస్తులకు అడ్డంకి ఏర్పడింది. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్లో అధికారులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్–2005) దరఖాస్తులు స్వీకరించడం లేదు. మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమాచారం కోరే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా పరిధిలో ఈ చట్టం కింద దరఖాస్తులు స్వీకరించాల్సిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అఫీసర్ (ఏపీఐవో) లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. పీఐవో గా బాధ్యతలు స్వీకరించిన ఓ డీజీఎం అధికారి ఏ ప్రిల్ 15న అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆతర్వాత ఏపీఐవోగా బాధ్యతలు నిర్వహించిన అధికా రి కూడా గత నెల ఇక్కడి నుంచి ఇతర ఏరియాకు బదిలీ అయ్యాడు. ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయలేదు. దీంతో ఈ రెండు సీట్లు ఖాళీగానే ఉంటున్నా యి. పీఐవో బాధ్యతలు నిర్వహించే అధికారి మృతి చెందిన తరువాత మరో పూర్తిస్థాయి అధికారిని నియమించే వరకు ఏపీఐవోకు ఇన్చార్జి పీఐవో బాధ్యతలు అప్పగించడానికి అనుమతి కోరుతూ ఏరియా అధికారులు కార్పొరేట్ అధికారులకు లేఖ రాశారు. వారు ఆలస్యంగా స్పందించడంతో ఆలోపే సదరు ఏపీఐవో అధికారి కూడా ఇక్కడి నుంచి వేరే ఏరియాకు బదిలీ అయ్యారు. దీంతో ఈ రెండు బాధ్యతలను చూసేవారు కరువయ్యారు. వెనుదిరిగి పోతున్న దరఖాస్తుదారులు సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకో వడానికి జీఎం కార్యాలయానికి వచ్చిన కార్మికులు, సమాచార చట్టం కార్యకర్తలు, పౌర సమాజ కార్యకర్తలు అక్కడ అధికారులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఆ స్థానాల్లో అధికారులు వచ్చేంత వరకు తమకు ఈ దరఖాస్తులు స్వీకరించే అధికారం లేదని ఇతర అధి కారులు వారికి చెప్పి తిప్పి పంపిస్తున్నారు. దీనికి తోడు ఇది వరకే పీఐవోకు దరఖాస్తు చేసుకున్నాక సరైన సమాచారం, స్పందన లేకపోవడంతో అప్పిలేట్ అఽధికారిగా ఉన్న ఏరియా జీఎంకు దరఖాస్తులు చేసుకున్న వారూ ఉన్నారు. ఆ దరఖాస్తులపై కూడా నిర్ణయం తీసుకోవాలంటే కూడా పీఐవో వద్ద సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. పీఐవో లేకపోవడంతో అప్పిలేట్ దరఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోకుండా మరుగునపడ్డాయి. కార్పొరే ట్ అధికారుల జాప్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. చట్టబద్ధత గల ఇలాంటి పోస్టుల భర్తీలో జాప్యం చేయడం సరికాదని, ఇలా చట్టాలను నీరుగార్చుతున్నారని దరఖాస్తు దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం పరిరక్షణ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్కు లేఖ రాశాం.. పీఐవో, ఏపీఐవో పోస్టులు భర్తీ చేయడం కోసం కార్పొరేట్ అధికారులకు లేఖ రాశాం. కార్పొరేట్ అధికారుల ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరుగుతాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. – ఎం.శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్ -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్టౌన్: షట్టర్ లిఫ్టింగ్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన రాజుసింగ్ మోహన్సింగ్, సేవక్ సింగ్ రఘుబీర్సింగ్, సుర్దిప్ సింగ్ ముగ్గురు బంధువులు. నిర్మల్ జిల్లాలో కూలి పనులు చేసేవారు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న రాత్రి బైక్పై లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ చేరుకుని పెట్రోల్ బంక్ సమీపంలోని ఇంటి ముందున్న బైక్ను దొంగలించారు. అనంతరం ఓ గోల్డ్షాప్లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. అదే రాత్రి ఉమ్రికి వెళ్తూ మార్గమధ్యలో కుంటాల మండలం కల్లూరు బస్టాండు సమీపంలో రెండు దుకాణాల తాళాలు పగులగొట్టి రూ.2,500ల నగదు అపహరించారు. గురువారం నిర్మల్లో బంగారం విక్రయించడానికి వచ్చారన్న పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2.7 కిలోల వెండి, 17 గ్రాముల బంగారం, రూ.2,500 నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు వెండి ఆభరణాలను ‘నిర్మల్ పోలీస్’ అని అందంగా అలంకరించి, తప్పించుకోలేరని ఒక మెసేజ్ ఇచ్చారు. కేసును ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, అశోక్, పీసీఆర్ ఎస్సై ప్రదీప్ కుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
చెరువులో పడి బాలుడు మృతి
దిలావర్పూర్: ప్రమాదవశా త్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెంది న కొప్పుల అశ్విత్ (15) బుధవారం సాయంత్రం ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మండల కేంద్రంలోని కుడి చెరువులో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలకృత్యాల కోసం వెళ్లి చెరువులో జారిపడి మృతి చెందినట్లు అశ్విత్ తల్లి కొప్పుల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరి మృతిభైంసాటౌన్: పట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. మండలంలోని వానల్పాడ్కు చెందిన సిద్దివార్ రమణ (45) పట్టణంలోని కోర్వగల్లిలో నివాసముంటున్నాడు. కుమారుడు రాజుతో కలిసి ఉదయం స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్మల్లో కిడ్నాప్ కలకలంనిర్మల్టౌన్: నిర్మల్లో బాలుడి కిడ్నాప్కు యత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ మండలం అనంతపేట్కు చెందిన ఐదేళ్ల బాలుడికి తండ్రి కిరాణా కొట్టువద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఇంటికి వెళ్లమని చెప్పాడు. అదే గ్రామానికి వెంట్రుకలు కొనుగోలు చేయడానికి ఆటోలో వచ్చిన ఆరుగురు మహిళలు బాలున్ని ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. బాలుడు ఇంటికి రాకపోయేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు అనుమానంతో బంగల్ పేట్ మహాలక్ష్మి వద్ద ఉన్న తెలిసిన వారికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అప్పటికే ఆ మహిళలు మహాలక్ష్మి కాలనీకి కొద్ది దూరంలో బాలుడిని దించి వెళ్తుండగా పట్టుకుని నిలదీశారు. తమకేం తెలియదని బుకాయించడంతో వారిపై దాడి చేశారు. అనంతరం మహిళలను పోలీసులకు అప్పగించారు. పిచ్చికుక్క స్వైరవిహారంవేమనపల్లి: మండలంలోని జక్కెపల్లిలో గురువారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఏడుగురిపై దాడి చేసి గాయపర్చింది. అల్లాడి అనసూర్య ఎడమచేయి మణికట్టు వద్ద, ఆలం సాంబయ్య కాళ్లకు, చెన్నూరి బక్కు తల వద్ద, శనిగారపు పోశం కాళ్లకు, తలండి శ్రీనివాస్ చేతులను కొరికింది. చెన్నూరి శేఖర్పై పడి కొరికేందుకు ప్రయత్నించగా కర్రతో కొట్టి చంపాడు. జిల్లెడలో కూడా మరో నలుగురిపై దాడి చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆటో సాయంతో వేమనపల్లి పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కుక్క దాడిలో ఇరువురికి గాయాలుకాగజ్నగర్టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కాపువాడకు చెందిన కర్ల కళావతిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరి మేయడంతో ప్రాణాపాయం తప్పింది. రైల్వే స్టేషన్కు వెళ్లే మరో ప్రయాణికునిపై కూడా కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్లో కుక్కల బెడద ఉందని ‘సాక్షి’ బుధవారమే కథనాన్ని ప్రచురించింది. అయినా అధికా రులు స్పందించక పోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైల్వే స్టేషన్ పరిసరాల్లో కుక్కల బెడదను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
హౌరా పట్టాలెక్కేనా..?
● కలకత్తాకు బెంగాళీలు, వ్యాపారుల రాకపోకలు ● కాగజ్నగర్ మీదుగా ఎక్స్ప్రెస్ రైలు నడపాలని విన్నపం ● ప్రతిపాదనలకే పరిమితమైన వైనం కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ రైల్వే స్టేషన్ మీదుగా పశ్చిమ బెంగాల్కు హౌరా ఎక్స్ప్రెస్ నడిపించాలనే కల నెరవేరడం లేదు. కా జీపేట్ నుంచి కాగజ్నగర్ మీదుగా మహానగరమై న కలకత్తాకు నేరుగా రైలు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. రైల్వే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పిస్తున్నా బుట్టదాఖలే అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని బసంత్నగర్, రామకృష్ణాపూర్, నజ్రూల్నగర్, రవీంద్రనగర్, సిర్పూర్(టి) తోపాటు మహారాష్ట్రలోని బల్లార్షా తదితర ప్రాంతాల్లో బెంగాళీలు అధిక సంఖ్యలో స్థిరనివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా నిత్యం వ్యాపార నిమిత్తం కలకత్తాకు తరచూ వెళ్తుంటారు. వ్యాపార నిమిత్తం పారిశ్రామిక ప్రాంతమైన పశ్చిమ బెంగాల్ ప్రధాన రాజధాని కలకత్తాకు వాణిజ్య అవసరాల కోసం ఎంతోమంది రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలో దుస్తులు, తదితర వస్తువుల తయారీ కేంద్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీరి సౌకర్యార్థం రైలు లేకపోవడంతో వీరంతా కాజీపేటకు వెళ్లి అక్కడి నుంచి వరంగల్, విజయవాడ మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. అదే కాజీపేట నుంచి కాగజ్నగర్ మీదుగా వెళ్తే తక్కువ దూరంతోపాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయి. గతంలో కాగజ్నగర్ నుంచి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఒక బోగీ ఉండేది. అది కాజీపేట వరకు వెళ్లి అక్కడి నుంచి లింక్ ఎక్స్ప్రెస్కు కలుపుకుని వయా వరంగల్ మీదుగా ఒక బోగీ హౌరాకు వెళ్లేది. కానీ కొన్ని కారణాలతో దానిని రద్దు చేశారు. ప్రయాణ ప్రయాస..ప్రయాణికులు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలంటే కలకత్తా వరకు సుమారు రెండు వేల కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి. వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి రైల్వేస్టేషన్ల నుంచి సికింద్రాబాద్ లేదా, కాజీపేటకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లాలి. ఫలక్నూమ ఎక్స్ప్రెస్(12704), ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(18045), వయా నల్గొండ, సికింద్రాబాద్ – షాలీమార్(కోల్కత్తా) వీక్లి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(22850), వయా వరంగల్ మీదుగా వెళ్తున్నాయి. హౌరా రైలు ప్రారంభమైతే బసంత్నగర్, కాగజ్నగర్లోని బెంగాళీ క్యాంప్, బల్లార్షాలోని బెంగాళీ క్యాంప్లలో సుమారు 52వేల మంది బెంగాళీలకు ప్రయోజనకరంగా ఉంటుంది.కాగజ్నగర్ రైల్వేస్టేషన్కేంద్ర మంత్రులు సహకరిస్తేనే..కాగజ్నగర్ మీదుగా హౌరా వరకు రైలు నడిపించేందుకు కేంద్ర మంత్రులు సహకరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు, ప్రస్తుత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కలకత్తాకు రైలు నడపాలని పలుమార్లు ప్రతిపాదనలు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసినప్పటికీ రైల్వే అధికారులు స్పందించకపోవడంతో ఈ మార్గం గుండా రైలు నడిపిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
దొంగల బెడద
● బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు ● తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా రెచ్చిపోతున్న వైనం ● పోలీసులకు సవాల్గా మారుతున్న ఘటనలు కౌటాల(సిర్పూర్): చోరీలు జిల్లా ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆలయాలు, ఇళ్లే లక్ష్యంగా దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. పగలు రెక్కీ నిర్వహిస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తూ రాత్రిపూట తాళాలు పగులగొట్టి సొత్తు ఎత్తుకెళ్తున్నారు. మహారాష్ట్రకు జంప్..!జిల్లాలోని సగం మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. అలాగే కాగజ్నగర్, రెబ్బెన, సిర్పూర్(టి)లో రైల్వేస్టేషన్లతోపాటు రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి. దీంతో పొరుగురాష్ట్రం నుంచి వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చింతలమానెపల్లి, కౌటాలలో మంగళవారం జరిగిన దొంగతనంలోనూ మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. స్థానిక నేరస్తులు చోరీలకు పాల్పడినా.. సరిహద్దు దాటి వెళ్లి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు. ఇటీవలి ఘటనలు కౌటాల మండల కేంద్రంలోని సదాశివపేట కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి ఇంట్లో ఈ నెల 15 న రాత్రి దొంగతనం జరిగింది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కరీంనగర్ వెళ్లిన ఆయన.. తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తుల కదలికలు గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు. వారు గోడ దూకి పరారయ్యారు. ఈ ఘటనలో రూ. 7వేలు ఎత్తుకెళ్లారు. చింతలమానెపల్లి మండలం డబ్బా ఎక్స్రోడ్డులోని మహేశ్గౌడ్ ఫర్టిలైజర్ షాపులో ఈ నెల 15న రాత్రి దొంగలు పడి రూ.50 వేల వరకు నగదు దోచుకెళ్లారు. షాపులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. మే 30న కాగజ్నగర్ ఓల్డ్ కాలనీలో దొంగలు పడి నగదు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగజ్నగర్ పట్టణంలో రాత్రి సమయంలో పార్కింగ్ చేసిన నాలుగు లారీల బ్యా టరీలను జూన్ 18న రాత్రి గుర్తు తెలియ ని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న త్రినేత్ర శివాలయంలో జూన్ 10 న రాత్రి గుర్తుతెలియని చొరబడ్డారు. గ ర్భగుడి తాళం పగలగొట్టి శివలింగం పై ఉన్న వెండి నాగపడగ అపహరించారు. జాగ్రత్తలు అవసరంఏటా జిల్లాలో దొంగతనాలు జరుగుతున్నాయి. 2023లో 104 దొంగతనాలు జరగగా, 2024లో 78 చోరీలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. రూ.లక్షల్లో నగదు, విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. రికవరీ మాత్రం అంతంతే ఉంటోంది. చోరీ జరిగినట్లు గురిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ ఊరికి వెళ్తే విలువైన ఆభరణాలు వెంట తీసుకెళ్లాలి. లేదా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం మేలు. ఇంట్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉంచుకోవద్దు. ఇరుగుపొరుగు వారితోపాటు పోలీసులకు సమాచారం అందిస్తే రాత్రిపూట పెట్రోలింగ్ చేసే అవకాశం ఉంటుంది. అనుమానితులు కాలనీల్లో కనబడితే పోలీసులకు సమాచారం అందించాలి. కొందరు సామగ్రి విక్రయిస్తున్నట్లు కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. అనుమానాస్పదంగా తిరిగే చిరువ్యాపారులపైనా ఓ కన్ను వేసి ఉంచాలి. ముఖ్యంగా ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్
జైనథ్ : అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరె స్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేల మండలానికి చెందిన సుమిత్, అతని మిత్రుడైన సలీం షకిల్తో కలసి మహారాష్ట్రకు చెందిన కృష్ణతో గ్యాంగ్గా ఏర్పడ్డారన్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, బేల, మహారాష్ట్ర కోర్పణ మండలాల్లో బైక్లను అపహరించి ఇతరులకు విక్రయిస్తుండేవారన్నారు. వారి వద్దనుంచి 12 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్కు తరలించామన్నారు. రేషన్ బియ్యం పట్టివేతకోటపల్లి: మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. కోటపల్లి మండలంలోని రాంపూర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ సంజయ్ను అదుపులోకి తీసుకుని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించమన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. రెండోలీగ్లో ఓడిన ఉమ్మడి జిల్లా జట్టుమంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎ స్సార్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో రెండో లీగ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు సాయి సత్య టీంతో 90 ఓవర్ల చాంపియన్షిప్లో ఓడిపోయింది. ఆదిలాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 30.3 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన సాయిసత్య టీం 24.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టులోని సాయికుమార్ 7 వికెట్లు సాధించడం గమనార్హం. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో, ఇరుజట్లు పరుగులను చేసేందుకు ఇబ్బంది పడ్డాయని కోచ్ ప్రదీప్ తెలిపారు. దివ్యాంగులకు రైలులో రాయితీపై ప్రయాణంమంచిర్యాలఅర్బన్: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్ర యాణ సౌకర్యం కల్పిస్తోందని సికింద్రాబాద్ డివిజన్ (ఎస్సీఆర్) అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐఎస్ఆర్ మూర్తి అన్నారు. గురువా రం మంచిర్యాల రైల్వేస్టేషన్లో అవగాహన కల్పించారు. మంచిర్యాల కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పథకం
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్: జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పథకం అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరాన్ని జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్తో కలిసి పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సహాయ ఉపకరణాల పథకం కింద అర్హులకు పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. దివ్యాంగుల అర్హత పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పలువురు దివ్యాంగులు అదనపు కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకురాగా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సమావేశంలో వైద్యులు, సంక్షేమ శాఖ సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
వాంకిడి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎనోలి గ్రామానికి చెందిన సోయం మారు (35) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో నిత్యం భార్యతో గొడవపడేవాడు. మంగళవారం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమారుడు గణేశ్ను కొట్టాడు. దీంతో భార్య నీలాబాయి నిలదీయడంతో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బుధవారం గ్రామ శివారులోని ఓ చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘జన్మన్’తో గిరిజనుల అభివృద్ధి
● కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ● జిల్లాలో విస్తృత పర్యటనఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/తిర్యాణి/వాంకిడి/: ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. రెండోరోజు బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. తిర్యాణి మండలం సుంగాపూర్లోని శాటిలైట్ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పీఎం జన్మన్ పథకం కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హాజరయ్యారు. ఆదివాసీ గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. దేవలతలకు పూజలు చేసి, టేకం భీంపటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. పీవీటీజీల కోసం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పీఎం జీవన జ్యోతి, అటల్ బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్ర రుణాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని సూచించారు. పీఎం జన్మన్ కింద పీవీటీజీ గిరిజనులకు 11 రకాల వ్యాధు ల పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు, శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో పీఎం జన్మన్ యోజన శిబిరాలు నిర్వహించి ఆధార్ కార్డు ఇప్పించడంతోపాటు బ్యాంకు ఖాతాలు తెరిపించామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ గిరిజనులకు ఆధార్కార్డులు, ఉపాధిహామీ జాబ్కార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, జన్మన్ ఖాతా పుస్తకాలు అందించారు. మల్టీపర్పస్ కేంద్రం సందర్శన అనంతరం వాంకిడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రసూతి వార్డులో బాలింతతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మండలంలోని లింబుగూడలో పీఎం జన్మన్ పథకంలో భాగంగా రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్ను సందర్శించారు. గిరిజనులు సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకుంటూ అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో మల్టీపర్పస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని మహాదేవుని ఆలయంలో పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని 140కోట్ల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో విద్య, వైద్యం, రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు రూ.1200 కోట్లతో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మించడంతో పట్టణాలకు కనెక్టివిటీ పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, చెర్ల మురళి, అరిగెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలకు అనాథ మృతదేహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాలలోని కాలేజ్రోడ్లో నిర్వహిస్తున్న అనాథ వృద్ధుల, మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి మందమర్రిలో నిస్సహాయ స్థితిలో రహదారి పక్కన ఉన్న వృద్ధురాలు(90)కు గత నెల 28 న మందమర్రి ఎస్సై రాజశేఖర్ సూచన మేరకు మేరకు ఆశ్రమంలో చోటు కల్పించారు. సదరు వృద్ధురాలు మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఎస్సై సూచన మేరకు మృతదేహాన్ని బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. అయినప్పటికీ మృతురాలికి సంబంధించి బంధువులెవరైనా ఉంటే 9701973636 నంబర్ను సంప్రదిస్తే మృతదేహం అప్పగిస్తామన్నారు. లేనిపక్షంలో వైద్యకళాశాల వినియోగిస్తుందని ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు ములుకాల కుమార్ తెలిపారు. -
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
పెంచికల్పేట్(సిర్పూర్): మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన అగర్గూడకు చెందిన తుమ్మిడే రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ వ్యాపారి కృష్ణ, అతడి సతీమణి వేధింపులతో రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. చట్టంప్రకారం పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. బెయిల్పై వచ్చిన నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పోలీసులు వెంటనే సాక్షుల స్టేట్మెంట్ నమోదు చేయాలని సూచించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు షరీఫ్, నవీన్, బాబాజీ, నరేశ్, దేవాజీ తదితరులు పాల్గొన్నారు.నేడు రౌండ్టేబుల్ సమావేశంకాగజ్నగర్రూరల్: కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు(జీవో నం. 49) రద్దు చేయాలని గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చాంద్పాషా, కోయ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
నెన్నెల: ఈ నెల 10న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని కోణంపేటకు చెందిన దుర్గం రాజేంద్రప్రసాద్ (26) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ రెండేళ్ల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్లో బొలెరో తీసుకున్నాడు. గిరాకీ లేకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నానని ఇంట్లో చెప్పుకుని బాధపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటివద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యంకోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వివరించారు. -
వింత వ్యాధితో 17 మేకలు మృతి
భైంసారూరల్ : మండలంలోని ఇలేగాంలో కదం దత్తురాంకు చెందిన 17 మేకలు వింత వ్యాధి సోకి మృతి చెందినట్లు బాధితుడు తెలి పారు. మంగళవారం ఉదయం మేకలను మేతకోసం గ్రామ శివారులోని అడవికి తీసుకెళ్లాడు. మేత మేస్తుండగానే ఒక్కొక్కటిగా సాయంత్రం వరకు అడవిలోనే ఏడు మేకలు మృతి చెందాయి. దీంతో ఏంచేయాలో తెలియక మిగిలిన మేకలను తోలుకుని ఇంటికి వచ్చి పాకలో తోలాడు. బుధవారం ఉదయం చూసేసరికి మరో 10 మేకలు చనిపోయి ఉన్నాయి. పశువైద్యాధికారి విఠల్కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా పరిశీలించి సీసీపీపీ(కంటైజెస్ క్యాప్ట్రెన్ ఫ్లూరో నిమోనియా)తో మృతి చెందినట్లు తెలిపారు. సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో చోరీలు ● చేతికి చిక్కినట్టే చిక్కి.. తప్పించుకుని పరారీ ● ద్విచక్ర వాహనం, ఫోన్ స్వాధీనం చింతలమానెపల్లి/కౌటాల: చింతలమానెపల్లి, కౌ టాల మండలాల్లో మంగళవారం రాత్రి దొంగలు బీ భత్సం సృష్టించారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా ఓ ఉపాధ్యాయుడు సాహసించి పట్టుకునే ప్రయత్నం చేయగా చేజారాడు. ఎస్సైకి ఎదురుపడగా.. అనుమానంతో పట్టుకునే ప్రయత్నం చేయగా చిక్కినట్టే చిక్కి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం అడెపల్లి చౌరస్తాలోని శ్రీసాయి ఫర్టిలైజర్ దుకాణంలో మంగళవారం రా త్రి 10.30గంటలకు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక వైపు తలుపు పగులగొట్టి రూ.70వేలు ఎత్తుకెళ్లడంతోపాటు సీసీ కెమెరాలు, డీవీఆర్ ధ్వంసం చేశారు. ఉదయం గమనించిన యజమాని మహేష్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌటాలలో చేతికి చిక్కి.. కౌటాల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి కరీంనగర్కు వెళ్లారు. రాత్రి 11గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో ఇద్దరు దొంగలు ఉండడాన్ని గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ దొంగను పట్టుకోగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అతడి బట్టలు సైతం చిరిగిపోయాయి. సెల్ఫోన్ అక్కడే పడిపోయింది. అయినా గోడ దూకిన దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. పెట్రోలింగ్ పోలీసులకు ఎదురుపడి.. ఇదే సమయంలో కౌటాలలో ఎస్సై గుంపుల విజయ్ వాహనాల తనిఖీ, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 12గంటల ప్రాంతంలో మోటార్సైకిల్ వేగంగా రావడాన్ని గమనించి అనుమానంతో అనుసరించారు. దీంతో దొంగలు మోటార్సైకిల్ను ధనురేటి గ్రామ సమీపంలో వదిలేసి పారిపోయారు. మోటార్సైకిల్ నంబరు ఆధారంగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. మోటార్సైకిల్తోపాటు మొబైల్ఫోన్ను కౌటాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రెండు మండలాల్లో చోరీకి పాల్పడింది ఒకే ముఠా దొంగలని తెలుస్తోంది. డబ్బాలో చోరీకి పాల్పడడానికి సమీపంలోని మెకానిక్ దుకాణం నుంచి గునపాన్ని దొంగిలించి అదే గునపంతో డబ్బా, కౌటాలలో తలుపులను పగులగొట్టినట్లు సీసీ కెమెరాల్లో వీడియోలను బట్టి తెలుస్తోంది. వేర్వేరుగా నమోదైన కేసుల్లో విచారణను వేగవంతం చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని కౌటాల ఎస్సై గుంపుల విజయ్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు. -
ఒక్క విద్యార్థి.. ముగ్గురి పర్యవేక్షణ
ఖానాపూర్: ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల లేమి వంటి కారణాలతో విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపేందుకు తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. మండలంలోని అడవి సారంగాపూర్ పంచాయతీ పరిధి రాజులమడుగులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కొద్దిరోజులుగా ఇద్దరు గైర్హాజరు అవుతుండడంతో ఒకే విద్యార్థి పాఠశాలకు వస్తున్నాడు. బుధవారం నిర్మల్ ఏసీఎంవో శివాజీ ఎస్సీఆర్టీ జంగు పటేల్తో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకే విద్యార్థి భీష్ము అందుబాటులో ఉన్నాడు. ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు అధికారులు కలిసి ఒక్క విద్యార్థిని పర్యవేక్షించాల్సి వచ్చింది. -
వైద్యానికి కావొద్దు వాగు అడ్డంకి
కెరమెరి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కు మండలంలోని టెమ్లగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం నడుములోతులో నీళ్లు ఉన్నప్పటికీ వైద్యసిబ్బంది వాగుదాటి అ వుతల ఉన్న సొమ్లగూడ, తుమ్మగూడ, టెమ్లగూడ గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 43 మందికి వైద్య పరీక్షలు ని ర్వహించి మాత్రలు అందించారు. రక్తపూతలు సేకరించారు. వర్షాకాలంలో సంక్రమించే వ్యా ధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మె స్రం సోము, హెచ్ఏలు శంకర్, వసంత్, ఏఎన్ఎంలు సంఘమిత్ర, సుమలత పాల్గొన్నారు. బెదిరింపులకు పాల్పడిన ఒకరి రిమాండ్ఆదిలాబాద్టౌన్: డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన విద్యానగర్కు చెందిన మణిశేఖర్పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కు మార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ వసీమ్ 2024 డిసెంబర్లో రాంలీలా మైదానంలో ఎగ్జిబిషన్ మేనేజర్గా వ్యవహరించాడు. మణిశేఖర్ వసీమ్ను బెదిరించి రూ.2లక్షలు ఇవ్వాలని, లేదంటే హైకోర్టుకు వెళ్లి ఎగ్జిబిషన్ బంద్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు రూ.20వేలు ఇచ్చాడు. మిగితా డబ్బులు తర్వాత ఇవ్వాలని, లేదంటే చంపుతానని హెచ్చరించాడు. దీంతో బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మణిశేఖర్ను రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికజన్నారం: మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆకుల అనన్య బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రాజన్న తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేనో బీఫోర్ ఇట్స్ టూ లేట్ అనే కామిక్ వ్యాస రచన, కామిక్ డ్రాయింగ్ పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థినిని, గైడ్ టీచర్స్ దాముక కమలాకర్, మణెమ్మను డీఈవో ఎస్.యాదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: నకిలీ పత్రాలు సృష్టించి రోడ్డును కబ్జా చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన రంగినేని శ్రీనివాస్ శాంతినగర్లోని మున్సిపల్ రోడ్డుకు తన బావ అమూల్ పేరిట డోర్ నంబర్ తీసుకొని ఇంటి పన్నులు చెల్లించాడు. ఆ తర్వాత అమూల్ తన భార్య శ్వేత పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో మున్సిపల్ వారు ఆ స్థలాన్ని రంగినేని శ్వేత పేరిట మ్యూటేషన్ చేశారు. ఆదిలాబాద్అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులరైజేషన్ కోసం రూ.22,900 చలాన్ చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోగా అధికారులు అనుమతించారు. ఈ స్థలా న్ని విక్రయించేందుకు సైతం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ రోడ్డు పక్కన ఉన్న జిన్నింగ్ ఫ్యాక్టరీ గేటును కబ్జా చేసి స్థలాన్ని ఆక్రమించడంతో కౌటివార్ సుశీల్ వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేయడంతో కేసు నమోదైంది. పత్రాలను పరి శీలించగా నకిలీవని తేలింది. దీంతో రంగినేని శ్రీని వాస్తో పాటు అతని తండ్రి సూర్యప్రకాశ్రావు, చెల్లెలు శ్వేత, బావ అమూల్పై కేసు నమోదు చేయగా శ్రీనివాస్, అమూల్ను రిమాండ్కు తరలించిన ట్లు పేర్కొన్నారు. సమావేశంలో వన్టౌన్, రూరల్ సీఐలు సునీల్ కుమార్, ఫణిందర్ పాల్గొన్నారు. ఐదుగురి రిమాండ్.. గుడిహత్నూర్కు చెందిన జాదవ్ రమేశ్ కేఆర్కే కాలనీలోని సర్వే నం.68లో ప్లాట్ కొనుగోలు చేయగా అట్టి స్థలాన్ని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 8 మంది ఆక్రమించేందుకు యత్నించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఆ ప్లాట్ను తక్కువ ధరకు విక్రయించాలని, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో మహ్మద్ ముజాహిద్ అలియాస్ పత్తి ముజ్జు, ఇస్మాయిల్ అలియాస్ తౌఫిక్, షేక్ ఆబిద్, షేక్ ఆదిల్, సర్ల బుచ్చన్నను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, ఆదినాథ్, అతీఖ్, సయ్యద్ అహ్మద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
● కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ ఎల్పుల రాజేందర్ ● ‘సాక్షి’ ఫోన్ఇన్కు స్పందనకాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కమిషనర్ ఎల్పుల రాజేందర్ అన్నారు. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణవాసులు పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఓపికగా ఆయన సమాధానాలు ఇస్తూ.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాన రోడ్లపై గుంతలు పూడ్చేందుకు జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించనున్నామని తెలిపారు. ఇటీవల 100 వీధి దీపాలు అమర్చామని పేర్కొన్నారు. ప్రశ్న: వీధి దీపాలు లేక రాత్రిపూట ఇబ్బంది పడుతున్నాం. పోచమ్మ టెంపుల్ సమీపంలో లైట్లు లేక చీకట్లో బయటికి వెళ్లలేకపోతున్నాం. ఓల్డ్ కాలనీలో కూడా వీధీదీపాలు లేవు. – మహ్మద్ సర్దార్, గుంటూరు కాలనీ/ ఆదిల్, వార్డు నం 1/ రహెమాన్, సర్సిల్క్ కాలనీ/ కౌశిక్ భట్టాచార్య, ఓల్డ్ కాలనీకమిషనర్: రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వీధిదీపాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: విద్యుత్ స్తంభం ఎర్త్ వస్తోంది. వర్షాలకు ప్రమాదాలు జరగకముందే మరమ్మతు చేయించాలి. ఇంటి పైనుంచి విద్యుత్ తీగలు వెళ్తున్నాయి. – మహ్మద్ జాక్, విజయబస్తికమిషనర్: విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న: చెత్త పేరుకుపోయి అవస్థలకు గురవుతున్నాం. డ్రెయినేజీ నిండి మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. – ప్రసాద్, న్యూకాలనీకమిషనర్: మురుగునీటి కాలువల్లో చెత్తాచెదారం తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: ఇంటి వద్ద డ్రెయినేజీ నిండడంతో మురుగు నీరంతా బావిలోకి చేరుతోంది. నీటిని కనీస అవసరాలను వినియోగించుకోలేకపోతున్నాం. – పుల్లూరి చందర్, బాలాజీనగర్కమిషనర్: నాలాల్లో పేరుకుపోయిన చెత్త తొలగిస్తాం. నాలా నుంచి వచ్చే మురుగు నీరు బావిలోకి చేరకుండా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: వారానికి ఒకసారి మాత్రమే కేరళ పబ్లిక్ స్కూల్ లైన్కు చెత్తబండి వస్తుంది. చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తుంది. ప్రతీరోజు చెత్తబండి వచ్చేలా చూడాలి – సలీం, వార్డు నం.10/ యుసుఫ్, వార్డు నం.9కమిషనర్: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు 20 ఆటోలు ఉన్నాయి. రెండు పనిచేయడం లేదు. అయినా ప్రతీరోజు అన్ని వార్డుల్లో చెత్త సేకరిస్తున్నాం. చెత్త తీసుకెళ్లేందుకు ప్రతీరోజు వెళ్లాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచిస్తాం. ప్రశ్న: ఇంటి ముందు ఉన్న ఇంటి స్తంభం ఎప్పుడు విరిగి పడుతుందో తెలియడం లేదు. విరగకముందే చర్యలు చేపట్టాలి. బాలాజీనగర్ నుంచి నౌగాం బస్తికి వెళ్లే మార్గంలో ఇంటిని ఆనుకుని విద్యుత్ స్తంభం ఉంది. గాలి వీచినప్పుడు వైర్లు తగిలి మంటలు చెలరేగుతున్నాయి. ఇళ్ల వద్ద ఉన్న స్తంభాలు తొలగించాలి. – నదీం ఖాన్, నిజాముద్దీన్ కాలనీ/ సతీశ్, బాలాజీనగర్కమిషనర్: విద్యుత్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ప్రశ్న: తమ కాలనీలోకి వింత పురుగులు వచ్చి ఇ బ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంట్లోని కర్ర వ స్తువులు తొలుస్తున్నాయి. గతంలో కూడా ము న్సిపల్ అధికారులకు వినతి పత్రాలు అందించినా చర్యలు తీసుకోలేదు. అలాగే డ్రెయినేజీలు లేవు. వీధి దీపాలు వెలగడం లేదు. – సాగరిక, గోపాల్, కోటేశ్వర్, సాయికుమార్, కాపువాడకమిషనర్: ఎస్పీఎం మిల్లు నుంచి పురుగులు వస్తున్నట్లు గుర్తించాం. మిల్లుకు తీసుకువచ్చే కర్ర ద్వారా వచ్చే వీటి నివారణకు త్వరలోనే చర్యలు తీసుకుంటాం. డ్రెయినేజీలో పూడిక తీతతోపాటు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తాం. ప్రశ్న: తమ ఇంటి నం. 1–16–429/1 వేరే వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యింది. డుప్లికేట్ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేయించుకున్నారు. మ్యుటేషన్ రద్దు చేయాలి – మహ్మద్ ముజాయిద్కమిషనర్: రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. పూర్తి వివరాలతో తమను సంప్రదించాలి. ప్రశ్న: చిన్న వర్షానికే రోడ్డంతా బురదమయంగా మారుతుంది. నడవడానికి కూడా వీలు పడడంలేదు. రాత్రి వేళ వీధిదీపాలు వెలగడం లేదు. – సువర్ణ, మారుతినగర్కమిషనర్: రోడ్ల మరమ్మతు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో జనరల్ ఫండ్ ద్వారా రోడ్ల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టనున్నాం. ప్రశ్న: ప్రధాన తాగునీటి పైపులైను లీకేజీ కావడంతో నీరంతా వృథా పోయి రోడ్డు బురదమయంగా మారుతుంది. తాగునీటి కాలుష్యమై రోగాల బారిన పడుతున్నాం. ప్రధాన నాలా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – హర్షద్, ద్వారకానగర్కమిషనర్: పైపులైన్కు మరమ్మతు చేపట్టి లీకేజీ అరికడుతాం. డ్రెయినేజీని ఆక్రమించుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.ప్రశ్న: మా కాలనీకి మంజూరైన సీసీరోడ్డు వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే సీసీరోడ్డు వేసి బాధలు తీర్చాలి. – నేరేళ్ల గోపి, సంజీవయ్య కాలనీకమిషనర్: రికార్డులు పరిశీలించి సీసీరోడ్డు మంజూరైతే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. లేకుంటే రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రశ్న: ఈఎస్ఐ గేటు వద్ద చెత్త వేస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ కూడా ఇదే ప్రాంతంలో క్లీన్ చేస్తుండడంతో విపరీతమైన దుర్గంధం వస్తుంది. – కుందారపు రాజుకమిషనర్: ఈఎస్ఐ గేటు వద్ద చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం. మరోసారి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తే సిబ్బందిపై చర్యలు చేపడుతాం.ప్రశ్న: డ్రెయినేజీలు లేక మురుగు నీరు రోడ్లపైకి చేరుతుంది. కనీసం నడవలేని పరిస్థితి ఉంది. డ్రెయినేజీ వ్యవస్థ పటిష్టం చేయాలి. – ప్రసాద్, కాపువాడ/ వినయ్, రాంమందిర్ రోడ్కమిషనర్: నూతనంగా డ్రెయినేజీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాం. చెత్త పేరుకపోతే తమ దృష్టికి తీసుకురావాలి. ప్రశ్న: దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నాం. కాలనీల్లో ఫాగింగ్ చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. – రవీందర్, శ్రీరాంనగర్కమిషనర్: దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టడంతోపాటు బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నీటి తొట్టీల్లో నిల్వ నీటిని ఉంచొద్దు. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. -
● పెద్దపులుల ప్రవేశమార్గంలో తిరిగి పచ్చదనం ● అడవిగా రూపాంతరం చెందుతున్న పోడు భూములు ● సింగరేణి గనులపై పచ్చదనానికి యాజమాన్యం పెద్దపీట ● జిల్లాలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు
సాక్షి, ఆసిఫాబాద్: అటవీ, డీఆర్డీఏ, సింగరేణి సంస్థలు చేపడుతున్న చర్యలతో అటవీ ప్రాంతాలు పునర్ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. కొన్నేళ్లుగా మైదాన ప్రాంతాలుగా ఉన్న అడవులు పచ్చదనం పరుచుకుంటున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అడవుల ఖిల్లాగా పేరుంది. అయితే చాలా అటవీ ప్రాంతం అన్యాక్రాంతమైంది. కొంతమంది పోడు వ్యవసాయం పేరిట అడవుల ను ఆక్రమించగా.. మరికొందరు భూస్వాములు గిరిజనుల పేరుతో చెట్లు కొట్టి వ్యవసాయ భూములుగా మార్చారు. సింగరేణి బొగ్గు గనులతో కూడా అడవి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ స మతౌల్యం కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రవేశమార్గంలో పచ్చదనం మహారాష్ట్రలోని తడోబా– అంధారి టైగర్ రిజర్వ్ నుంచి పులులకు సిర్పూర్(టి) అటవీ రేంజ్ పరి ధిలోని ఇటిక్యాలపహాడ్ అటవీ ప్రాంతం కీలకమైన ప్రవేశమార్గంగా ఉంది. ఐదేళ్ల క్రితం వరకు పోడు సాగుతో మైదానంగా మారిన అటవీ ప్రాంతాన్ని అధికారులు దట్టమైన అడవిగా మార్చారు. ఆహార, నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం పులుల నివాసానికి మరింత అనుకూలంగా మారుతోంది. ఇటీవల పులులు ఇక్కడికి వచ్చినట్లుగా పగ్మార్కుల ద్వారా అధికారులు నిర్ధారించారు. పర్యవేక్షణ బృందం కదలికలను ట్రాక్ చేస్తోంది. 1000 ఎకరాల్లో చింత, జామ మొక్కలు.. గిరిజనేతర రైతులు పోడు సాగు కోసం పెద్దఎత్తున అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. అటవీ హక్కులను ఉల్లంఘించారు. అయితే కాలక్రమేణా అటవీ అధికారులు, పోలీసులు కలిసి ఆక్రమణకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రారంభంలో ప్రతిఘటించినా.. తర్వాత చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న 1000 ఎకరాల్లో ఐదేళ్లుగా అటవీశాఖ అధికారులు జామ, చింతతోపాటు ఇతర దేశీయ మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం దట్టమైన అడవిగా రూపాంతరం చెందింది. డంప్ యార్డులపై పచ్చదనం.. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ పెద్దపీట వేస్తోంది. ఏటా ఏరియాల వారీగా ఖాళీ స్థలాలు, గనులు, డిపార్టుమెంట్లు, కాలనీల్లో మొక్కలు నాటుతోంది. కొత్త గనుల ఏర్పాటు, విస్తరణ పనులతో చాలా ప్రాంతాల్లో పెద్ద వృక్షాలతోపాటు కొంతమేర అటవీప్రాంతాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఖాళీ స్థలాలు వదలకుండా పచ్చదనం పెంపొందిస్తోంది. డీ గ్రేడ్ ఫారెస్టు భూములను అభివృద్ధి చేస్తోంది. మూసివేతకు గురైన ఓసీపీ ప్రదేశాలు, ఓబీ డంపింగ్ యార్డులపై మొక్కలు నాటి పర్యావరణ సమతౌల్యానికి దోహదపడుతోంది. గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారడంతో మూసివేతకు గురైన గనుల ప్రదేశాలు, డంపింగ్ యార్డులు అడవులను తలపిస్తున్నాయి.1700 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాంఐదేళ్లలో సుమారు 1700 ఎకరాల అటవీ భూములను స్వాధీనం చేసుకున్నాం. ఇందులో వెయ్యి ఎకరాల్లో స్థానిక జాతుల మొక్కలను నాటాం. 2023– 24లో 200 ఎకరాలు, 2024– 25లో 500 ఎకరాలు.. ఇప్పటివరకు ఇలా మొత్తం 1000 ఎకరాలు తోటలుగా మారాయి. ఐదడుగుల ఎత్తు వరకు మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ ఏడాది 7.47 లక్షలకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 6 లక్షల మొక్కల వరకు నాటాం. మిగిలిన మొక్కలు ఆగస్టు నాటికి నాటుతాం. – నీరజ్కుమార్ టిబ్రేవాల్, డీఎఫ్వోవనమహోత్సవం లక్ష్యం 51 లక్షలు.. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిధిలోని 15 మండలాల్లో జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ, అటవీ, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఈ ఏడాది 51 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలోనే ఈ ఏడాది 35.20 లక్షల మొక్కలు నాటనున్నారు. గతేడాది 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 35 లక్షలు మొక్కలు నాటారు. ఈ ఏడాది బెల్లంపల్లి ఏరియా పరిధిలో కై రిగూడ ఓసీపీతోపాటు ఇతర ప్రాంతాల్లోని 40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సింగరేణి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఓబీ డంపింగ్ యార్డులతోపాటు సింగరేణి ఉద్యోగుల నివాసం ఉండే కాలనీలు, రహదారుల వెంట నాటనున్నారు. -
షార్ట్సర్క్యూట్తో మంటలు
బెల్లంపల్లి: పట్టణంలోని బజారు ఏరియాలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్సర్క్యూట్ తీవ్ర కలకలం రేపింది. నో నేమ్ రెడీమేడ్ షాపు ఎదు ట ఉన్న విద్యుత్ తీగలపై ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. కాంటా చౌరస్తా వద్ద నుంచి పాత బస్టాండ్ వైపు వెళ్లే విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు పరుగులు పెట్టారు. విద్యుత్ శాఖ సి బ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రెండు తీగలు పరస్పరం తాకడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ఘటన బజారు ఏరియాలో చర్చనీయాంశమైంది. -
తెలంగాణ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు
● వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● రెండో స్నాతకోత్సవంలో పట్టాల ప్రదానం ● 113 మందికి గోల్డ్మెడల్స్.. 157 మందికి డాక్టరేట్లు అందజేతతెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కా న్వొకేషన్) బుధవారం డిచ్పల్లి క్యాంపస్లో అట్ట హాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభా గాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. తెయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బంగారు పతకాలు.. డాక్టరేట్ పట్టాలు 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. 2017 నుంచి 2025 జూన్ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్డీ(డాక్టరేట్) పట్టాలను అందజేశారు. -
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. జన్కాపూర్లో జన్మన్ పథకం కింద రూ.19 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. జెడ్పీ ఉన్న త పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్లో రచించిన యంగ్ మైండ్స్ టైమ్లెస్ టేల్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 24 మంది విద్యార్థుల ఆలోచనలతో కథలు రాసేలా ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును అభినందించారు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సహకారంతో నిర్మించిన సంచార సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభు త్వ వైద్య కళాశాల విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కేంద్ర సహా య మంత్రి బృందాన్ని శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, డీఎఫ్వో నీరజ్కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్వో సీతారాం, మాస్టర్ మైండ్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, విద్యుత్శాఖ ఎస్ఈ శేషారావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని..
నేరడిగొండ: కుంటాల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతు న్న ఓ విద్యార్థిని హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మామడ మండలంలోని వాస్తాపూర్కు చెందిన ఆత్రం త్రివేణి (15) ఈనెల 11న శుక్రవారం వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు విద్యార్థిని నెలక్రితం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గాలిదుమారం వీచింది. దీంతో టెంటు కర్ర ఆమె తలపై పడడంతో గాయాలుకాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అనంతరం పాఠశాల పునఃప్రారంభం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. -
వ్యాపారి ఇంటి ఎదుట రైతుల ఆందోళన
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని బీట్బజార్కు చెందిన విశ్వనాథం అనే వ్యాపారి ఇంటి ఎదుట బుధవారం లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన శ్రీధర్ లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల రైతుల వద్ద ధాన్యం కొనుగోలు, ఇతర లావాదేవీలు కొనసాగిస్తుండేవాడు. ఈక్రమంలో పలువురి వద్ద అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. కొద్ది రోజుల క్రితం ఐపీ పేరుతో నోటీసులు పంపుతున్నాడనే సమాచారంతో అప్పు ఇచ్చిన రైతులు ఈ నెల 8 న శ్రీధర్ ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. వ్యా పారి విశ్వనాథం కూడా శ్రీధర్కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. దీంతో దండేపల్లిలో ఉన్న భూమి అప్పుకింద రాయించుకున్నాడని, అట్టి భూమిని బాధితులందరికీ పంచాలని బుధవారం రైతులు విశ్వనాథం ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై గోపతి సురేష్ రైతులతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. -
సింగరేణి ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్
● టీబీజీకేఎస్ నేతలతో కేటీఆర్ భేటీశ్రీరాంపూర్: సింగరేణిలో టీబీజీకేఎస్ను మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీబీజీకేఎస్ నాయకులతో బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై దిశానిర్ధేశం చేశారు. పార్టీ నుంచి సింగరేణికి ఇన్చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో యూనియన్కు పూర్వవైభవం తీసుకు రావాలని సూచించారు. ఏ ప్రభుత్వం చేయని మేలును బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేసిందన్నారు. సింగరేణి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక హామీలు ఇచ్చి గెలిచాక మోసం చేశారని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, వారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కార్మిక క్షేత్రాల్లో పోరాడాలని తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బీజేపీ, కాంగ్రెస్ ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయని, ఆ పార్టీలు, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలని అన్నారు. పోరాటాలు చేయడంలో ఏ సమస్య వచ్చినా కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో సింగరేణిలో పర్యటించి విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శులు మాదాసు రామ్మూర్తి, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు పారుపల్లి రవి, అధికార ప్రతినిధి వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
● జ్వరంతో బాలిక మృతి ● ముత్తంపేటలో విషాదం
ఏడేళ్లకే నూరేళ్లు..●కౌటాల: ఆ బాలికకు ఏడేళ్లకే నూరేళ్లు నిండాయి. విషజ్వరం ఆ చిన్నారిని బలి తీసుకుంది. అల్లరు ముద్దుగా చూసుకుంటున్న ఒక్కగానొక్క కుమార్తె మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమురంభీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన రైపూర్ నాగేశ్వర్, జయ దంపతులకు కుమార్తె మన్విత (7), కుమారుడు ఉన్నాడు. నాగేశ్వర్ వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మన్విత స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన బాలికకు జ్వరం రావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. రాత్రి తల్లి స్థానిక ఆశ వర్కర్ వద్ద పారాసిటమల్ మాత్రలు అడిగి వేశారు. జ్వరం తగ్గకపోవడంతో బుధవారం కౌటాల పీహెచ్సీకి తీసుకెళ్లగా సిబ్బంది మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. బుధవారం సాయంత్రం ఇంటి వద్ద బట్టల్లోనే మూత్రం పోసుకుని కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. -
కేంద్ర పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎఫ్వో నీరజ్కుమార్, ఏఎస్పీ చిత్తరంజన్, కేంద్ర మంత్రి వ్యక్తిగత కార్యదర్శి భరత్తో కలిసి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులపై రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పథకాలు నిర్ణీత సమయంలో లబ్ధిదారులకు చేరేవిధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 117 ఆస్పిరేషనల్ జిల్లాలను గుర్తించగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సైతం ఆస్పిరేషన్ కింద ఎంపికై ందని తెలిపారు. నీతి ఆయోగ్ ద్వారా గిరిజనులకు అందుతున్న మౌలిక వసతుల కల్పన, పథకాలపై వివరాలు తెలుసుకునేందుకు ప్రతీ ఆస్పిరేషనల్ ప్రాంతంలో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీ గిరిజనుల గ్రామాల్లో వసతులు, ఇళ్లు, తాగునీరు, రహదారులు, వైద్య సేవలు, సామాజిక భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జాతీయ జల్ మిషన్ కింద శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఉపాధిహామీ కింద వందరోజుల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. పీఎం గ్రామీణ సడక్ యోజన కింద ఎంపికై న రహదారులు పూర్తి చేయాలని, పీఎం సమ్మర్ యోజన, పీఎం కిసాన్ కింద అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద 3500 పీవీటీజీ కుటుంబాలకు నివాస గృహాలు నిర్మించాలని సూచించారు. స్వాగతం పలికిన జిల్లా అధికార యంత్రాంగంరెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్లోని సింగరేణి గెస్ట్ హౌస్ వద్ద కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్ ఘన స్వాగతం పలికారు. ఎస్పీ పుష్పగుచ్ఛం అందించారు. పోలీస్ సిబ్బంది కేంద్ర సహాయ మంత్రికి గౌరవ వందనం చేశారు. కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష లైబ్రరీ సందర్శన శ్యామాప్రసాద్ ముఖర్జీ మిషన్ కింద నిర్మించి న జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కేంద్ర సహా య మంత్రి హర్ష్ మల్హోత్రా సందర్శించారు. రీడింగ్ గదులు, లైబ్రరీ గది, మినరల్ వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు తెలుసుకున్నారు. అధికారులతో కలిసి గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జన్కాపూర్లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నాయని తెలిపారు. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి గ్రామంలో జాతీయ జల్జీవన్ మిషన్ కింద నిర్మించిన శుద్ధ నీటి ట్యాంకు పరిశీలించారు. గ్రామంలోని ఇగురపు లక్ష్మి ఇంటిని సందర్శించి.. శుద్ధజలం సరఫరాపై ఆరా తీశారు. ఈ సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్వో సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం
● దరఖాస్తులు కోరుతున్న కేంద్రం ● గరిష్టంగా రూ.25 వేలు అందజేత ● ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులకు ప్రయోజనంనిర్మల్చైన్గేట్: బీడీ కార్మికుల పిల్లలు చదువులో రాణించేలా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేయూతనిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.25 వేలు అందజేస్తూ వారి ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులు 75,200 మంది ఉన్నారు. ఆయా కుటుంబాలకు చెందిన విద్యార్థులు సుమారు లక్షా 20 వేల మంది వివిధ స్థాయిల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా పథకం కింద దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందనున్నారు. దరఖాస్తు గడువు.. అర్హులైన విద్యార్థులు http:// scholarship. gov. in వెబ్సైట్లో సంబంధిత వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతపరచాలి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, తదితర వృత్తి విద్యా కోర్సులు, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, సందేహాల నివృత్తికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ చౌరస్తాలో గల బీడీ కార్మికుల ఆస్పత్రిలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అవగాహన లేమి.. బీడీ కార్మికుల పిల్లలకు జాతీయస్థాయిలో ఉపకార వేతన స్కీం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అ యినా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు, కొన్ని సందర్భాల్లో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, దరఖాస్తు అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యల వల్ల చాలామంది ఉపకార వేతనం పొందలేకపోతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు అప్లోడ్ కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా బీడీ కార్మికుల పిల్లల కోసం కేంద్రం ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. దీనిపై ప్రచారం కల్పించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీడీలు చుడుతున్న మహిళా కార్మికులుఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా బీడీ కార్మికులు నిర్మల్ 70,000 ఆదిలాబాద్ 3,000 కుమురంభీం 1,500 మంచిర్యాల 700 మొత్తం 75,200సద్వినియోగపర్చుకోవాలి బీడీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏటా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలి. – డాక్టర్ మహేష్, బీడీ కార్మిక ఆస్పత్రి వైద్యాధికారి, నిర్మల్ అర్హతలు పదోతరగతి, ఇంటర్లో నేరుగా ఉత్తీర్ణులై ఉండాలి. సప్లిమెంటరీ విద్యార్థులు అనర్హులు. దూరవిద్య అభ్యసించిన వారు అనర్హులు. తండ్రి లేదా తల్లికి పీఎఫ్ గుర్తింపు కార్డు తప్పనిసరి. కుటుంబ ఆదాయం నెలకు రూ.10వేల లోపు ఉండాలి. జత చేయాల్సిన పత్రాలు 2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం. విద్యార్థి పేరిట బ్యాంక్ ఖాతా గత సంవత్సరం చదివిన తరగతి, కోర్సుకు సంబంధించిన మార్కుల మెమో ఉపకార వేతనం (రూ.ల్లో) తరగతి స్కాలర్షిప్ 1 నుంచి 4 1,000 5 నుంచి 8 1,500 9 నుంచి 10 2,000 ఇంటర్ 3,000 డిగ్రీ, పాలిటెక్నిక్, ఇతర వృత్తి విద్యాకోర్సులు 6,000 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ 25,000 -
అజ్ఞాతం వీడుతున్నారు..!
● జనంలోకి మావోయిస్టులు ● ఉమ్మడి జిల్లా నేతల లొంగుబాటు ● ఆపరేషన్ కగార్తో పంథా మారిన వైనంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఇప్పటికీ కొందరు దశాబ్దాలుగా కుటుంబ సభ్యులు, సొంతూరును విడిచి అడవుల్లోనే గడుపుతున్నారు. రోజు రోజుకు పోలీసు బలగాలు అడవులు, మావోయిస్టు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా ఉద్యమానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరుతున్నారు. తాజాగా మావోయిస్టు దంపతులు అజ్ఞాతం వీడగా.. ఊరిలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఉనికిని కోల్పోతున్న పార్టీనిత్యం పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఘర్షణ నుంచి నేడు పార్టీ ఉనికే లేకుండాపోయే రోజులొచ్చాయి. గడచిన ఏడాదిలోనే పార్టీ వేగంగా క్షీణిస్తోంది. కేంద్ర కమిటీలో పని చేసిన కటకం సుదర్శన్ ఉరఫ్ ఆనంద్(69) మొదలు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలీ జిల్లా ఇన్చార్జి కాసర్ల రవి ఉరఫ్ అశోక్, కంతి లింగవ్వతోపాటు అనేక మంది సీనియర్లను పార్టీ కోల్పోయింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు చనిపోయారు. గత నెల 6న రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం కమిటీ ఇన్చార్జి మైలరాపు అడెల్లు ఉరఫ్ భాస్కర్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆయనపై రూ.45లక్షల రివార్డు ఉంది. దళంలోనే ఒక్కటై..తాజాగా లొంగిపోయిన మావోయిస్టులు లచ్చన్న, అంకుబాయి అప్పట్లో క్రియాశీలకంగా ఉన్న సిర్పూర్ దళంలోనే పని చేస్తూ ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లికి చెందిన లచ్చన్న 1983లో పీపుల్స్వార్ గ్రూప్ చెన్నూరు దళంలో చేరారు. 2002లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2007లో నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సాంకేతిక విభాగం ఇన్చార్జిగా పని చేశారు. 2023నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. ఈయనపై పలు పోలీసుస్టేషన్లలో 35కేసులు ఉన్నాయి. మిగిలిందెందరు?గతంలో అనేకమంది ఉమ్మడి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పని చేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదిలోపే చేరింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు కీలక హోదాల్లో ఉన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లికి చెందిన ఇర్రి మోహన్రెడ్డి, సెంట్రల్ పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీలో సాంకేతిక విభాగంలో ఉన్నారు. మరో ముఖ్య నేత మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ ఉరఫ్ దాదా సింగరేణి కోల్బెల్ట్ కమిటీ చూస్తున్నారు. ఈయనను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్లుగా సమాచారం. అలాగే ఈయన సహచరులుగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు ఎన్కౌంటర్లో మరణించారు. సలాకుల సరోజ, జాడి వెంకటి, పుష్పలత ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అన్న వచ్చిన 37ఏళ్లకు..కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చౌదరి అంకుబాయి 1988లో తన అన్న చిన్నన్నను కలిసేందుకు వచ్చి పార్టీలోకి వెళ్లింది. పీపుల్స్వార్ సిర్పూర్ దళ సభ్యురాలిగా చేరి, ఆ సమయంలోనే ఆత్రం లచ్చన్నను పెళ్లి చేసుకుంది. 1995లో లచ్చన్నతో పట్టణ ప్రాంతానికి బదిలీ కాగా, 2002లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సాంకేతిక విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం నార్త్ బస్తర్ డివిజనల్ కమిటీ టెక్నికల్ విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఈమైపె 14కేసులు ఉన్నాయి. అయితే అన్న కోసం అడవికి వెళ్లిన అంకుబాయి చిన్నన్న కొన్నేళ్ల క్రితమే లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. చెల్లె మాత్రం గత 37ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయింది. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తానూరు: మండలంలోని బోంద్రట్లో ఈ నెల 13న పట్టపగలు గ్రామానికి చెందిన జగ్మే సవిత్రిబాయి, నారాయణ్ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పోలీస్స్టేషన్లో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సోన్కాంబ్లె రాహుల్ ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి రూ.70 నగదు, పదమూడున్నర గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి దొంగిలించాడు. బోంద్రట్ ఎక్స్రోడ్డు సమీపంలోని హైవే పక్కన పొదలో గుంతతవ్వి అందులో దాచి పెట్టాడు. ఎస్సై షేక్ జుబేర్ నిందితుడిని వేలిముద్రల ఆధారంగా పట్టుకున్నాడు. నిందితుని వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
తుంగమడుగుకు రోడ్డు వేయాలి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం తుంగమడుగు గ్రామానికి వెంటనే రోడ్డు వేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్ డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు పలు సమస్యల ను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పట్టణానికి ఆనుకు ని ఉన్నా తుంగమడుగు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, గర్భిణులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మె ల్యే హరీశ్బాబు గెలిచిన తర్వాత రోడ్డు వేయిస్తానని చెప్పి.. ప్రస్తుతం పట్టించుకోవడం లేద ని ఆరోపించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి హైదరాబాద్ నుంచి రామోజీఫిల్మ్ సిటికి 40 కిలోమీటర్ల దూరానికి కూడా ప్రజల సొమ్ముతో హెలీకాప్టర్ వాడుకుంటున్నారన్నారు. రోడ్డు కోసం ధర్నా చేస్తే 30 యాక్టు అమలులో ఉందని, కేసులు పెడతామని పోలీసులు బెదిరించడం దారుణమన్నారు. అనంతరం గ్రామంలోని ఏకోపాధ్యాయ పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు. మూడో తరగతి విద్యార్థులకు ఒకటో తరగతి పుస్తకం కూడా చదవడం రావడం లేదన్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, వీధిలై ట్లు, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 15 రోజుల్లో రోడ్డు వేయని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహిస్తామని తెలిపారు. -
పట్టణంలో సమస్యలా..!
● ఫోన్ చేయండి.. ● మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాల్టీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ ఏ.రాజేందర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ బుధవారం నిర్వహించనుంది. తాగునీరు, డ్రెయినేజీ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు.తేదీ: 16.07.2025(బుధవారం) సమయం: ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సంప్రదించాల్సిన నంబర్లు : 63006 88040, 99089 42431 -
దిందాలో మళ్లీ పోడు రగడ
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని దిందా గ్రామంలో మళ్లీ పోడు రగడ చోటు చేసుకుంది. దిందా శివారులోని బందెపల్లి బీట్ వద్దకు మంగళవారం ఆయా రేంజ్లకు చెందిన అధికారులు చేరుకున్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. కొంతమేరకు మొక్కలు నాటగా.. విషయం తెలుసుకున్న పోడు రైతులు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారులు గతంలో తమకు భూములు ఇస్తామని ప్రకటించారని, ఏకపక్షంగా అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. తమ పొట్టకొట్టేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఈ క్రమంలో మొక్కలు నాటేందుకు వెళ్తున్న అధికారులు, సిబ్బందిని అడ్డుకున్నారు. కొంతమేర మొక్కలు నాటిన అనంతరం అధికారులు వెనుదిరిగారు. -
విద్య.. వైద్యం.. విజ్ఞానం
● ఒకేచోట సేవలు అందేలా మల్టీపర్పస్ కేంద్రాలు ● ‘పీఎం జన్మన్’లో భాగంగా జిల్లాకు 23 సెంటర్లు ● ఒక్కో సెంటర్కు రూ.60 లక్షలు ● అన్ని హంగులతో లింబుగూడ కేంద్రం ముస్తాబు ● నేడు ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రివాంకిడి(ఆసిఫాబాద్): పీవీటీజీ గిరిజనుల సమగ్రాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జన్మన్ పథకం కింద మల్టీపర్పస్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 23 పీవీటీజీ గ్రామాలకు మల్టీపర్పస్ సెంటర్లు మంజూరు చేసింది. వాంకిడి మండలం లింబుగూడలో ఇప్పటికే పనులు పూర్తికాగా.. అధికారులు ప్రారంభానికి సిద్ధం చేశారు. బుధవారం లింబుగూడ మల్టీపర్పస్ కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి హర్హ్ మల్హోత్రా ప్రారంభించనున్నారు. ఒకేచోట సదుపాయాలువిభిన్న జీవన శైలి, తక్కువ జనాభా, స్వతంత్ర ఆర్థి క వ్యవస్థ(వేట, సేకరణ), నిలకడ లేని ఆరోగ్యం, విద్యాస్థాయిలతోపాటు ఇతరులతో పోలిస్తే ఎక్కువ పేదరికం అనుభవిస్తున్న గిరిజనులను కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ సమూహంగా గుర్తించి వారి సమగ్రాభివృద్ధి కృషి చేస్తోంది. పీవీటీజీ గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపించడం, దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో 2023లో పీఎం జన్మన్ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద మల్టీపర్పస్ కేంద్రాలు నిర్మిస్తోంది. విద్యతో పాటు వైద్యం, విజ్ఞానం, ఆర్థికాభివృద్ధి సాధించేలా ఒకేచోట సౌకర్యాలు కల్పించనున్నారు. భవనాన్ని అత్యంత ఆధునిక విధానంలో ఆకర్షణీయంగా ని ర్మిస్తున్నారు. భవనం లోపల అంగన్వాడీ కేంద్రం, ఏఎన్ఎం(హెల్త్ సెంటర్) కేంద్రం, కంప్యూటర్ ల్యా బ్, ఆఫీస్ రూంలు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే మధ్యలో గోళాకారంలో ఒక హాల్ నిర్మించా రు. భారీ ప్రొజెక్టర్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. గోడల ను రంగులతో అందంగా గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా గుస్సాడీ, దేవర, తునికాకు సేకరిస్తున్న మహిళ, వాయిద్యాలు, వన్యప్రాణుల చిత్రాలతో తీర్చిద్దారు. పాఠశాల విద్యార్థులకు ఏఐ బోధన, ప్రొజెక్టర్ ద్వారా విజ్ఞాన బోధన అందించనున్నా రు. ఒకేచోట విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి. పనుల్లో నాణ్యతలేమి..!ఆసిఫాబాద్ డివిజన్లో పీవీటీజీలు ఉన్నందున మొత్తం 23 మల్టీపర్పస్ కేంద్రాలు నిర్మిస్తున్నారు. అందులో మూడు టెండర్ దశలో ఉండగా.. మిగిలినచోట పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం రూ.60 లక్షలు వెచ్చిస్తుంది. అయితే అందంగా కనిపిస్తున్న భవనాలను క్షుణ్నంగా పరిశీలిస్తే నాణ్యతలేమి బహిర్గతమవుతోంది. వాంకిడి మండలం లింబుగూడ కేంద్రంలో కిటికీలు ప్రారంభానికి ముందే ఊగుతున్నాయి. భవనం ముందు ఏర్పాటు చేసిన మెట్ల టైల్స్ దెబ్బతిన్నాయి. వరండా సైతం పగుళ్లు తేలింది. కొన్నిరోజుల క్రితం వర్షాలకు వరండాలో సిమెంట్ పైకి లేచింది. జిల్లా అధికారులు గమనించడంతో తిరిగి మరమ్మతు చేయించినట్లు తెలుస్తోంది. ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన తలుపు సక్రమంగా లేదు. ప్రస్తుతం భవనానికి పెయింట్ చేసి చిత్రాలు అద్దడంతో లోపాలు బహిర్గతం కావడం డం లేదని తెలుస్తోంది. జిల్లాలోని మిగితా గ్రామాల్లో కేంద్రాల నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. మండలాల వారీగా కేంద్రాలు మంజూరైన గ్రామాలుఆసిఫాబాద్ : బండగూడ, సల్పలగూడ, బనార్గూడ, వడిగోంది(ఎన్), కుటోడ(కె) ఎర్రగుట్ట, శాకన్గొంది, గుట్టచెల్మ, కౌడియాన్ మొవాడ్, అడఘాట్ వాంకిడి : మన్నెగూడ, లింబుగూడ, ఎనగోంది, సడక్గూడ, చౌపన్గూడ కెరమెరి : చింతగూడ, కొలాంగూడ, కొలాంగూడ(అగర్వాడ) తిర్యాణి : కొలాంగూడ(మంగీ), రెబ్బెన : కొలాంగూడ(గోలేటి) లింగాపూర్ : ములగూడ, రింగారిట్ జైనూర్ : పానపటార్ నేడు లింబుగూడలో ప్రారంభంకేంద్ర సహాయ మంత్రి హర్హ్ మల్హోత్రా బుధవారం తిర్యాణి మండలం సుంగాపూర్లో పర్యటించి.. అ క్కడి నుంచి జన్కాపూర్ పాఠశాలను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి సరాసరి మధ్యాహ్నం 12.30 గంటలకు వాంకిడి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం లింబుగూడలో పీఎం జన్మన్ పథకంలో భాగంగా నిర్మించిన మల్టీపర్పస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.నైపుణ్యాభివృద్ధికి దోహదం మల్టీపర్పస్ కేంద్రాలు గిరిజనులకు విద్య, వైద్యంతోపాటు నైపుణ్యాభివృద్ధికి దోహదపడతాయి. ఈ కేంద్రాల ద్వారా ఒకేచోట విద్య, వైద్యం అందిస్తారు. ఏఐ బోధన, ఇంటర్నెట్ పరిజ్ఞానం కల్పించేందుకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తారు. జిల్లాలో మొత్తం 23 కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తాం. సమీప గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రమాదేవి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిరూ.60 లక్షలతో నిర్మాణం పీఎం జన్మన్ పథకంలో భాగంగా పీవీటీజీ గ్రామాల్లో రూ.60 లక్షలతో మల్టీపర్పస్ భవనాలు నిర్మిస్తున్నాం. అంగన్వాడీ, ఏఎన్ఎం సెంటర్(హెల్త్ సెంటర్), కంప్యూటర్ గది, మరుగుదొడ్లు, ప్రొజెక్టర్ హాల్ వంటివి ఒకేభవనంలో వేర్వేరుగా ఉంటాయి. గిరిజనులకు మౌలిక వసతులు ఒకేచోట లభించనున్నాయి. జిల్లాలో మూడు కేంద్రాల పనులు పూర్తయ్యాయి. మరో మూడు టెండర్ దశలో ఉన్నాయి. మిగతా చోట్ల పనులు కొనసాగుతున్నాయి. నాణ్యతతో పనులు చేపడతాం. – జె.తానాజీ, టీడబ్ల్యూ ఈఈ -
అండర్ ట్రయల్ కేసులపై సమీక్ష
ఆసిఫాబాద్రూరల్: అండర్ ట్రయల్ కేసులపై జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మంగళవారం సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, డీఎస్పీ రామానుజంతో కలిసి సమీక్ష నిర్వహించారు. అండర్ ట్రయల్ కేసులకు సంబంధించి కక్షిదారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారం కృషి చేయాలని సూచించారు. చార్జ్షీట్ వేసిన, వేయని కేసుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. బెయిల్ మంజూరైన వెంటనే నిబంధనల మేరకు నిందితులను విడుదల చేయాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ జైలర్ ప్రేమ్కుమార్, డీసీఆర్బీ ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నవోదయలో ఆటలపోటీలు
● 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడలు ● రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు రాక కాగజ్నగర్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు చదువుతో ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం పీఈటీలు విద్యార్థులకు క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో నేషనల్ స్థాయి క్రీడల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల క్లస్టర్స్థాయి పోటీలు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కాగజ్నగర్లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో జరగనున్నాయి. జరుగనున్న ఈవెంట్స్ అండర్ 14, 17, 19 విభాగంలో హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒక్కో క్రీడలో 6 టీంలుగా 18 జట్లు క్రీడల్లో పాల్గొనున్నాయి. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 29, 31 తేదీల్లో కేరళలో జరిగే రీజినల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రపదేశ్, కేరళ జట్లు పాల్గొననున్నాయి. చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పీఈటీలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల కిత్రం కరుణాకర్, హరీష్నాయక్, నిశ్విత్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – రేపాల కృష్ణ, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయం, కాగజ్నగర్ -
ఆర్కే 5 గనిలో దొంగల బీభత్సం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు వ్యక్తులు గని ఆవరణలోని గోడదూకి స్క్రాప్, కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. గమనించిన సెక్యూరిటీ గార్డు పూర్ణ వెంకటేశ్ విజిల్ వేసి ఇతర సిబ్బందిని అలర్ట్ చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అలికిరి విని దొంగలు చీకట్లో దాక్కుకున్నారు. వెంకటేశ్ వారి వద్దకు వెళ్లడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. మిగతా సెక్యూరిటీ గార్డులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాళ్లతో దాడి చేశారు. దీంతో మధుకర్, కుమార్కు గాయాలయ్యాయి. ఇంతలో ఏసీటీఎస్ టీం సభ్యులు రావడంతో అందరూ కలిసి చాకచక్యంగా ముగ్గుర్ని పట్టుకోగా ఇద్దరు పరారయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డికి సమాచారం అందించగా ఆయన శ్రీరాంపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తక్షణమే స్పందించి కొద్ది గంటల్లోనే మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన నరేంద్ర, పవన్కుమార్, శివ, మునియప్ప, భూమయ్యపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా జీఎం ఎం శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి అభినందించారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం!
మంచిర్యాలక్రైం: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రాంనగర్కు చెందిన సెటిపెల్లి శ్రీనివాస్ వద్ద కలీమ్ ఐదు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లించడంలో జాప్యం జరగడంతో కాలేజ్రోడ్ ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ షఫీ ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా సోషనల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన కలీమ్ ఆటోస్టాండ్ వద్ద ఆలౌట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఫిర్యాదు రాలేదన్నారు. ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యతలమడుగు: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు సుంకిడి గ్రామానికి చెందిన గంగాధర నందిని (19) ఆదిలాబాద్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్లుగా మానసిక స్థితి సరిగాలేదు. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకుని కనిపించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బేలలో యువకుడు..బేల: మండల కేంద్రంలోని కుమురం భీం కాలనీకి చెందిన కుడిమెత రాంచందర్ (30) ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు రాంచందర్ కుటుంబంలో కొన్నిరోజులు గా కలహాలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంట్లో భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. చనిపోతానని తాడు తీసుకుని బయట కు వెళ్లాడు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఓ చెట్టు కొ మ్మకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య ల క్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మధుకృష్ణ తెలిపారు. మనస్తాపంతో మరొకరు..తానూరు: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు బామ్ని గ్రామానికి చెందిన కోతిమీర గౌతం (35) కొంతకాలంగా మద్యానికి బానిసై ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యలు పుష్పలత, అర్చన, కుమార్తె ఉన్నారు. లింబగూడలో ఇంటర్ విద్యార్థి..సిర్పూర్(టి): మండలంలోని లింబగూడలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సుర్పం శేఖర్ (17) సిర్పూర్లోని ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. ఆసిఫాబాద్లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఈ నెల 11న ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని చెప్పగా పోనని ఇంటివద్దే ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి సుర్పం యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి’
ఇంద్రవెల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టినట్లు ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ అన్నారు. జూన్ 23న చేపట్టిన చైతన్యయాత్ర మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు ‘రూపాయి దాని సమస్య పరిష్కర మార్గం’ అనే అంశంపై పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్కు ఇచ్చారని, దాని ఫలితంగానే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడిందని గుర్తు చేశారు. అంబేద్కర్ లేకుంటే ఆర్బీఐనే లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లక్ష మందితో పోస్ట్ కార్డులు రాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సోన్కాంబ్లే మనోహర్, వాగ్మరే కామ్రాజ్, కాంబ్లే ఉత్తం, బాలాజీ, మస్కే రాజువర్ధన్, పరత్వాగ్ సందీప్, సూర్యవంశీ ఉత్తం, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు. -
పస్తులుంటున్నా పట్టించుకుంటలేరు..
● మోదీ గారు ఇండియాకు రప్పించండి ● కువైట్లో మండల వాసి నరకయాతన ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ జన్నారం: ‘ప్రధాని మోదీ సార్ మూడు రోజుల నుంచి తిండి లేదు. పోలీసుస్టేషన్కు వచ్చిన సార్.. పోలీసులు పట్టించుకుంట లేరు. రెండేళ్ల క్రితం కువైట్ పోయిన.. రెండు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు.. తిండి లేదు, ఇంటికి పంపడం లేదు.. ఎండలు చాలా కొడుతున్నాయి.. సార్ నన్ను కాపాడండి..’ అంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య ప్రధానిని వేడుకుంటూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాంతయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ దేశం వెళ్లి కూలీ గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా యజమాని జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. జీతం రాకపోవడంతో తిండికి గోసైతందని, ఇండియాకు పంపివ్వమంటే పాస్పోర్టు ఇవ్వడం లేదని తెలిపాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పడానికి వెళ్తే మూడు రోజులుగా తిప్పించుకుంటున్నారని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అబుసుల్తాన్ అనే వ్యక్తి పాస్పోర్టు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని, తన నంబరును బ్లాక్లిస్టులో పెట్టాడని, రెండు నెలలుగా వేరేచోట పని చేయగా.. వారూ వెళ్లగొట్టారని పేర్కొన్నాడు. ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వం ఇండియాకు రప్పించాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. శాంతయ్యను రప్పించండి: కుటుంబీకులు శాంతయ్యను ఇండియాకు రప్పించాలని ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు గొర్రె శంకరయ్య, లక్ష్మీ, భార్య ప్రమీల, కుమారుడు సాయితేజ, కూతురు వైష్ణవి వేడుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్నామని, తమ కొడుకు ఏడుస్తూ వేడుకుంటుంటే తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
● 8 మందికి గాయాలు
బొలెరోను ఢీకొట్టిన కారు●రెబ్బెన: మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై బొలెరోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. సిర్పూర్ (టి) రైల్వేస్టేషన్లో పనిచేస్తున్న సాగర్ సోమవారం విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భార్య అరుణ, కుమారులు విశ్వక్రాజ్, విహాన్ రాజ్లతో కలిసి బొలెరో వాహనంలో బయలుదేరాడు. రెబ్బెన మండల పరిధిలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో రెడిమిక్స్ ప్లాంట్ వద్దకు చేరుకోగా రెబ్బెన వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్కారు అతివేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులు, డ్రైవర్ సంతోష్కు, షిప్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులను రెబ్బెన పీహెచ్సీ తరలించి ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలించారు. సాగర్ సోదరుడు రజినికాంత్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ వినాయక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణాలు కాపాడి.. కుటుంబ సభ్యులకు అప్పగించి
లోకేశ్వరం: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని బ్లూకోల్ట్ సిబ్బంది కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన పుసవర్ల శ్రీనివాస్ మంగళవారం పంచగుడి వంతెన వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100కు డయల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే బ్లూ కోల్ట్ సిబ్బంది సబ్ధర్ హుస్సేన్, ధన్రాజ్ అక్కడికి చేరుకుని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈక్రమంలో మద్యానికి బానిసై ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గంజాయి కేసు నమోదునెన్నెల: గంజాయి సేవిస్తున్న యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. జెండావెంకటాపూర్ గ్రామ శివారు మామిడి తోటలో గంజాయి సేవిస్తున్నాడని తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఎస్కూరి శశికుమార్ను దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. అతడి వద్ద నుంచి 130 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. స్టేషన్కు తరలించి విచారించగా భీమారం మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి రాకేష్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. సెల్ఫోన్ పేలి యువకుడికి గాయాలుభీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన గంగాధర్ జేబులో ఉన్న సెల్ఫోన్ మంగళవారం అకస్మాత్తుగా పేలడంతో స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గంగాధర్ మహారాష్ట్రలోని బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో భోరజ్ హైవే వద్ద సెల్ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో స్వల్ప గాయాల పాలైన ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
గల్ఫ్లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతి మామడ: కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లిన వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. మండలంలో ని పొన్కల్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ (46) ఆరునెలల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. కంపెనీలో ఉద్యోగం లభించిందని కుటుంబ స భ్యులకు కొన్నిరోజుల క్రితం ఫోన్చేసి చెప్పడంతో సంతోషపడ్డారు. సోమవారం అబుదాబిలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు తీరుతా యని అనుకుంటున్న సమయంలోనే మృత్యు వు గుండెపోటు రూపంలో కబలించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అబుదాబిలోని హెల్పింగ్ హాండ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఓవైసీనగర్కు చెందిన షేక్ అహ్మద్, బంగాలగల్లీకి చెందిన సుల్తాన్ ఖాన్ స్థానిక గాంధీగంజ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై నవనీత్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 2.5 కిలోల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైందన్నారు. సమావేశంలో సీఐ జి గోపీనాథ్, ఎస్సై నవనీత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ అవినాష్కుమార్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నిర్మల్టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థా నికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జిల్లా పద్మశాలి సంఘం సమన్వయకర్త, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ కోకన్వీనర్ ఆడెపు భూమన్న (61) సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలో కాలినడకతో రోడ్డు డివైడర్ను దాటే క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
అర్హత లేని వైద్యం..!
దహెగాం మండలం గెర్రెలోని ఆర్ఎంపీ బినయ్ సర్కార్ గత నెల 22న నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగపల్లి శ్రీనివాస్(36)కు తెలిసీతెలియని వైద్యం అందించాడు. చికిత్స అందిస్తుండగానే శ్రీనివాస్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితుడిని ఆర్ఎంపీ తన కారులో ఎక్కించుకుని ఓ చోట రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించాడు. 108కు సమాచారం అందించి అక్కడి నుంచి పరారయ్యాడు. శ్రీనివాస్ మృతి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని జాడె పూజ(16)కు జ్వరం రావడంతో గతేడాది ఆగస్టు 10న ఆర్ఎంపీ వద్ద చికిత్స అందించారు. ఆర్ఎంపీ సైలెన్ బాటిల్ ద్వారా కొన్ని ఇంజక్షన్లు ఇస్తుండగానే పూజ తీవ్ర అస్వస్థతకు గురైంది. భయపడిన అతడు మధ్యలోనే వైద్యం నిలిపేశాడు. కుటుంబ సభ్యులు విద్యార్థిని వెంటనే చంద్రపూర్కు తరలించగా అక్కడ మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యం వికటించి గతేడాది అదే గ్రామానికి చెందిన కాళీదాస్ అనే యువకుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. ● రోగులకు ప్రాణ సంకటం ● క్లినిక్లలో ఆర్ఎంపీ, పీఎంపీల వైద్యం ● గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు ● చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు -
పట్టణంలో సమస్యలా..!
● ఫోన్ చేయండి.. ● మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాల్టీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ ఏ.రాజేందర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ బుధవారం నిర్వహించనుంది. తాగునీరు, డ్రెయినేజీ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు.తేదీ: 16.07.2025(బుధవారం) సమయం: ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సంప్రదించాల్సిన నంబర్లు : 63006 88040, 99089 42431 -
పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ
చింతలమానెపల్లి(సిర్పూర్): చింతలమానెపల్లి మండలం డబ్బా పంచాయతీ పరిధిలోని ధరంపల్లి గ్రామంలో సోమవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పర్యటించారు. ఈ సందర్భంగా నూతన పాఠశాల భవనానికి భూమిపూజ చేశారు. గ్రామంలో పాఠశాల సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగుతోంది. పాఠశాలకు కేటాయించిన స్థలం వివాదాస్పదంగా మారడంతో నిర్మాణం జరగలేదు. సబ్ కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించారు. రూ.15లక్షల చేపట్టే పనులు ప్రారంభించారు. తహసీల్దార్ మడావి దౌలత్, ఎంఈవో జయరాజ్, ఆర్ఐ విజయ్ పాల్గొన్నారు. -
రేపు మల్టీపర్పస్ కేంద్రం ప్రారంభం
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం లింబుగూడలో ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ కేంద్రాన్ని ఈ నెల 16న కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రారంభిస్తారని అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. లింబుగూడలోని మల్టీపర్పస్ కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పీఎం జన్మన్ పథకం కింద బహుళార్థక ప్రయోజన కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీప గ్రామాలకు చెందిన ప్రజలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలందించేందుకు ఈ కేంద్రం ఓ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ప్రారంభోత్సవానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయని తెలిపారు. -
క్రీడాపోటీలకు హాజరు కావాలని ఆహ్వానం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని నవోదయ పాఠశాలలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర జవహార్ నవోదయ విద్యాలయాల క్లస్టర్స్థాయి పోటీలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ సోమవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబును ఆహ్వానించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల నవోదయ విద్యాలయాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. అండర్– 14, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమం అధికారుల దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి జిల్లా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని రవిచంద్ర కాలనీకి చెందిన వొడ్నాల లలిత, ఆసిఫాబాద్ మండలం గోవింద్పూర్కు చెందిన వైరాగడే జగ్రూబాయి వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. పట్టా భూమిని అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్కు చెందిన కవిత మండల్ ఫిర్యాదు చేసింది. తనకు జారీ చేసిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాలో ఇతరుల ఆధార్ నంబర్ నమోదు కావడంతో ప్రభుత్వ రాయితీలు రావడం లేదని, దీనిని సవరించాలని కెరమెరి మండలం కరంజివాడకు చెందిన కుమ్రం లక్ష్మీబాయి కలెక్టర్కు విన్నవించింది. తన తండ్రి కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వమంటే కొంతమంది బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన కోవ దాదారావు కోరాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేయాలని బెజ్జూర్ మండలం సోమిని గ్రామానికి చెందిన గిరిజనులు దరఖాస్తు సమర్పించారు. 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమికి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలని బెజ్జూర్ మండలం మర్దిడి గ్రామానికి చెందిన జూంది ఈశ్వరయ్య కోరాడు. తన కుమార్తెకు రెబ్బెన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు ఇప్పించాలని కెరమెరి మండలం దేవుడిపెల్లికి చెందిన జాడి తిరుపతి దరఖాస్తు విన్నవించాడు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేగుడిసెకు నిప్పంటించి తరిమేశారు నాకు కుమారులు లేరు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 60 సెంట్ల భూమి ఉంది. నా భూమిని గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా పట్టా మార్పు చేయించుకున్నారు. భూమి కోసం ఇంట్లో పడుకుని ఉండగా గుడిసెకు నిప్పంటించి తరిమివేశారు. మూడేళ్లుగా తిరుగుతున్నాను. వెంటనే నాకు న్యాయం చేయాలి. – చాపిడి సోంబాయి, డబ్బా, మం.చింతలమానెపల్లి -
మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్కెరమెరి(ఆసిఫాబాద్): మాదక ద్రవ్యాల వినియోగం జీవితంతోపాటు కుటుంబం, భవిష్యత్తును నాశనం చేస్తుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా సోమవారం మండలంలోని మోడి బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత ప్రమాదకర మత్తు వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి ప్రభావంపై జిల్లాలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ మోసాలకు గురైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు. డ్రగ్స్ గురించి తెలిస్తే వెంటనే 1908 లేదా 87126 70551 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్ఎం ప్రేందాస్ పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో మార్గదర్శకాలు పాటించాలి
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సోమవారం ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నిక మార్గదర్శకాలు, నిబంధనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డీపీవో, ఎంపీడీవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకానికి జాబితా రూపొందించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై సమీక్షలు నిర్వహించాలని, దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని ఆదేశించారు. వాగులు, ఒర్రెలు ఉప్పొంగిన సమయంలో బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిరాశ్రయులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థినులకు అభినందనఆసిఫాబాద్రూరల్: ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన జిల్లా కేంద్రంలోని బాబాపూర్ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలకు చెందిన హిమబిందు, బిక్కుబాయిని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి అభినందించారు. విద్యార్థినులు ఎవరెస్టు శిఖరం బేస్ పాయింట్ వద్దకు చేరుకుని జాతీయ జెండా ఆవిష్కరించారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుకన్య, డీఆర్డీవో దత్తరావు, డీడబ్ల్యూవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో ఆదివా రం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోట్నాక విజయ్, ఉపాధ్యక్షులుగా పుర్క ఉద్దవ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, లక్ష్మి, సుభాష్, కార్యదర్శి గా లక్ష్మణ్, సహాయ కార్యదర్శులుగా స్వప్న, ప్రవీణ్, హరికృష్ణ, తులసీదాస్, రవీందర్, కోశాధికారిగా మంగవతి, ఈసీ సభ్యులుగా జంగు, సాయిబాబా, యాదగిరి, విజయలక్ష్మి, చిన్నక్క, బరికిరావ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి సారంగపాణి పరిశీలకులు గా.. ఎన్నికల అధికారిగా వెంకటేశ్వర్రెడ్డి వ్య వహరించారు. గిరిజన క్రీడల అధికారి మీనా రెడ్డి ఎన్నికల నిర్వహణ పూర్తిచేశారు. కార్యక్రమంలో క్రీడాపాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు, రాజేశ్, వాసుదేవరావు, చంద్రశేఖర్రెడ్డి, విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, రవి తదితరులు పాల్గొన్నారు. -
పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్
ఆసిఫాబాద్అర్బన్: అనారోగ్యంతో బాధపడు తూ మెరుగైన చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చులు, విద్య, ఇతర అత్యవసర అవసరాల కోసం ఆర్థిక సహాయం కోరినవారికి సీఎంఆర్ఎఫ్ గొప్ప అవకాశం అని అన్నారు. అర్హులకు సకాలంలో సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో అగ్రగామి..
● నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే ● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ● ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ● పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం ● నలుగురు మంత్రుల రాకతో పండుగ వాతావరణం మధిరతో సమానం..మంచిర్యాల జిల్లాను తన సొంత నియోజకవర్గం మధిరతో సమానంగా భావిస్తూ రాష్ట్రంలో రోల్మాడల్గా నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళ శక్తి సొలార్ ప్రాజెక్టు ప్రారంభోత్స వం అనంతరం మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లక్సెట్టిపేటలో 50 పడకల ఆస్పత్రి, కళాశాల భవన నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఎమ్మెల్యేప్రేమ్సాగర్రావు కోరినట్లుగా దండేపల్లి మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 220, 400 మెగావాట్ల సబ్స్టేషన్లు దశలవారీగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్దికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. దండేపల్లి/ జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: అభివృద్ధిలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంచిర్యా ల జిల్లా పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు పుష్కల అవకా శాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. లక్సెట్టిపేటలో నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిహ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టు, హాజీపూర్ మండలం వేంపల్లిలో 212 ఎకరాల్లో నిర్మించే దత్తసాయి ఇండస్ట్రీయల్ పార్కు, ఐటీ పార్కు, ఆటోనగర్ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధికి నాంది..మంచిర్యాలలో 300 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రీయల్, ఆటోనగర్ పార్కులను ఏర్పాటుతో అభివృద్ధికి నాంది పడిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మొదటి దశగా 240 ఎకరాల భూమిని సేకరించి, 212 ఎకరాల్లో ఈ పార్కుల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.30 కోట్ల నిధులను కేటాయించామన్నారు. ఇందుకు పరిశ్రమల శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పార్కుల ఏర్పాటుతో 2 వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు ప్రశంసించారు. నిధుల సేకరణ, అభివృద్ధి పనుల సరళీకరణలో ఆయన చూపిస్తున్న చొరవ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపే దిశగా సాగుతోందని తెలిపారు. ఆదర్శంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి..మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, మంచిర్యాలలో నిర్మించిన 650 పడకల సూపర్ స్పె షాలిటీ ఆస్పత్రిలో హైదరాబాద్తో సమానమైన సౌ కర్యాలతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకంగా అభివృద్ధి..ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపా రు. కళాకారులకు చేయూతనిస్తామని హామీ ఇచ్చా రు. రూ.2 కోట్లతో కళాభవనం నిర్మాణం చేపడతా మని తెలిపారు. హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రా మ పంచాయతీ పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో గాంధారీ ఖిల్లా సఫారీ కోసం రెండు నూ తన వాహనాలను మంత్రులు ప్రారంభించారు. వ నమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులకు అటవీ శాఖ అధికారులు జంతువుల ఫొటోలతో కూడిన ఫ్రేమ్లు జ్ఞాపికలుగా అందజేశారు. ప్రజల మద్దతుతో ముందుకు..మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మద్దతు, నమ్మకంతోనే ముందుకు సాగుతున్నానని, వారి శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేస్తానని అన్నారు. ఇంద్రవెల్లి, నస్పూర్లో జరిగిన బహిరంగ సభలకు లక్షలాది మంది హాజరై మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దండేపల్లి మండలంలో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రెండు విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కే.శశాంక్, అటవీ శాఖ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిశ్సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, కలెక్టర్ కుమార్ దీపక్, ఎఫ్డీవో సర్వేశ్వర్, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాష్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, డీఎంహెచ్వో హరీశ్రాజ్, సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ కోటేశ్వర్ డీసీపీ భాస్కర్, ఏసీసీ ప్రకాశ్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఐఎన్టీయూసీ నేతలు జనక్ప్రసాద్, ప్రేమ్చంద్, శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజం..లక్సెట్టిపేట : పట్టణంలో సామాజిక ఆస్పత్రి, ప్రభు త్వ కళాశాల భవనాల ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులలోని బెంచీలపై కూర్చుని చిన్నానాటి జ్నాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి విద్యార్థి వద్ద పుస్తకాన్ని తీసుకుని చదివారు. కళాశాల గదులన్నీ తిరిగి పరిశీలించారు. విద్యార్థి సంఘం నాయకులు స్కాలర్షిప్ల విడుదల కోసం వినతిపత్రం అందజేశారు. -
పోడుకు సాగునీరు
● ఇందిర సౌర గిరి జలవికాసం పథకానికి శ్రీకారం ● గిరిజన రైతుల భూములకు బోర్వెల్తోపాటు సోలార్ విద్యుత్ సౌకర్యం ● జిల్లాలో తొలివిడతలో 1,101 మందికి లబ్ధితిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లాలోని పోడు భూములకు సాగు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిజనులు వ్యవసాయంలో రాణించేందుకు ఇందిర సౌర గిర జలవికాసం పథకం అమలు చేయనుంది. అటవీ భూములకు పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. వర్షాలే ఆధారం..జిల్లాలోని మెరుగైన నీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు దాదాపు వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. ఇక పోడు భూములు సాగు చేసే రైతులు ఏడాదిలో కేవలం ఒకే పంట పండిస్తున్నారు. మిగితా సీజన్లలో ఇతర పనులపై ఆధార పడుతుండగా, పొలాలు బీళ్లుగా ఉంటున్నాయి. దీంతో గిరిజన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పేరుతో పథకం అమలు చేయనుంది. అటవీ భూములను సాగు చేసుకుంటూ పోడు పట్టాలు ఉన్న రైతులను లబ్ధిదారులుగా గుర్తించనున్నారు. ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో పోడు భూముల్లో బోర్వెల్ వేసుకోవాలంటే అటవీశాఖ నుంచి విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అనుమతి లభించేంది కాదు. ప్రస్తుతం ప్రభుత్వమే సౌర విద్యుత్ ద్వారా మోటార్లు అందించనుంది. బోర్లు వేసేందుకు అవకాశం రావడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల కమిటీల ద్వారా ఎంపికఇందిర సౌర జలవికాసం పథకం అమలు కోసం మండల స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంపీడీవో చెర్మన్గా కొనసాగనుండగా.. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి కన్వీనర్గా ఉంటారు. వీరితోపాటు ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో ఏఈ, మండల వ్యవసాయ శాఖ అధికారి, భూగర్భ జల శాఖ, హర్టికల్చర్ అధికారి, ఫారెస్టు రేంజ్ అధికారి, ఉపాధిహామీ ఏపీవోలు సభ్యులుగా కొనసాగుతారు. మండల పరిధిలోని పోడు భూముల్లో కమిటీ సభ్యులు సర్వే నిర్వహించి బోర్వెల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నవాటిని గుర్తిస్తారు. అనంతరం భూములకు సంబంధించిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మండల కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత జిల్లా కమిటీకి పంపిస్తారు. జిల్లాస్థాయిలో ఈ పథకానికి కలెక్టర్ చైర్మన్గా, ఐటీడీఏ పీవో కన్వీనర్గా ఉంటారు. ఈ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన మండల కమిటీల ఏర్పాటుపై ఇటీవల కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.2.5 ఎకరాలకు ఒక యూనిట్జిల్లాలో అటవీహక్కు పత్రాలు కలిగిన పోడు రైతులు 25,091 మంది ఉన్నారు. వీరు 81,476 ఎకరాలను సాగు చేస్తున్నారు. మొదటి ఏడాది జిల్లాలోని 1,101 రైతులకు ఇందిర సౌర గిర జలవికాసం పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. 3,034 ఎకరాలకు నీటిసదుపాయం కల్పించాలని నిర్ణయించారు. మిగిలిన నాలుగేళ్లలో ఏడాదికి 5,710 రైతుల చొప్పున 18,281 ఎకరాలకు సాగునీటి వసతి అందుబాటులోకి రానుంది. జిల్లాలో ఐదేళ్లలో 23,939 మంది రైతులకు సంబంధించిన 76,159 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందిర సౌర గిరి జల వికాస పథకం కింద 2.5 ఎకరాలను ఒక్క యూనిట్గా ఎంపిక చేశారు. అర్హులైన రైతుకు 2.5 ఎకరాల కంటే తక్కువగా భూమి ఉంటే ఇద్దరు, ముగ్గురు రైతులను కలుపుకుని యూనిట్గా గుర్తించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో యూనిట్కు దాదాపు రూ.6 లక్షలవరకు నిధులు వెచ్చించనున్నారు. బోర్వెల్తో పాటు సౌర విద్యుత్ ద్వారా మోటార్ ఏర్పాటు చేసుకునే సదుపాయం కల్పిస్తారు. అలాగే ఉద్యావనశాఖ ఆధ్వర్యంలో డ్రిప్ సైతం అందిస్తారు. ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగనుంది. అర్హులను ఎంపిక చేస్తాం ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలు కోసం అన్ని మండలాల్లో అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సభ్యులు సర్వే నిర్వహించి అర్హత ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులను ఎంపిక చేసి గిరిజనులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్ దోత్రే, కలెక్టర్, ఇందిర సౌర గిరి జల వికాసం పథకం చైర్మన్ -
నిర్వహణ భారం
కెరమెరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన పెంటపర్తి మీనా గత నెల 2న కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించింది. మూడు రోజులు పీహెచ్సీలోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ ఒకే రోజు తర్వాత ఇంటికి పంపించారు. మూడు రోజులపాటు భోజన వసతి కల్పించాల్సి ఉండగా.. ఒక్కపూట కూడా పెట్టలేదు. దీనిపై ప్రశ్నిస్తే నిధులు లేవని సిబ్బంది చెబుతున్నారని మహిళా కుటుంబ సభ్యులు వాపోయారు. జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్లకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏటా అందించే నిధులు ఆగిపోవడంతో క్షేత్రస్థాయిలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. నిధుల లేమితో రెండేళ్లు కనీస మరమ్మతులు చేపట్టడం లేదు. కెరమెరి(ఆసిఫాబాద్): వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తోంది. దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఒక్కో ఆస్పత్రిలో ప్రతిరోజూ 60 నుంచి 70కి ఓపీ తగ్గడం లేదు. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులు అందకపోవడంతో సౌకర్యాలు మెరుగుపడడం లేదు. హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ రెండేళ్లుగా నిలిచిపోవడంతో సిబ్బందితోపాటు రోగులు అవస్థలు పడుతున్నారు. 2023 నుంచి బంద్..జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. ఐదు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. హా స్పిటల్ డెవలప్మెంట్ కమిటీలకు కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ హెల్త్ మిషన్ కింద మంజూర య్యే నిధులు 2023 నుంచి విడుదల కాలేదు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి, వసతుల కల్పన పనులు ఆగిపోయాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏటా రూ.1.70 లక్షలు, కమ్యూనిటీ కేంద్రాలకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరు చేయాలి. రెండేళ్లుగా ఈ నిధులు రాకపోవడంతో చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. కూలీలకు జీతాలు, పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి వసతుల కల్పనకు కొన్నిచోట్ల అధికారులే సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఇతర వసతుల కల్పనకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు బిగించడం, భవనాలకు రంగులు వేయడం, కిటీకీలు, తలుపులకు మరమ్మతులు కూడా ఆగిపోయాయి. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. ల్యాబ్ నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులు, పేపర్ కొనుగోలు కూడా హెచ్డీఎస్ నిధులతోనే చేపట్టేవారు. అన్నం కూడా లేదు..ప్రసవాల కోసం ఆస్పత్రుల కోసం వచ్చే గర్భిణులు, ప్రసవం అయిన తర్వాత బాలింతల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ప్రసవాల సమయంలో మందుల కొనుగోలుకు ఒక్కో కేసులో రూ.1,600 చొప్పున ఖర్చు చేసేవారు. భోజనం ఖర్చుల కింద రూ.100 వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ కాన్పు అయితే మూడు రోజులు, సిజేరియన్ కేసులకు ఏడు రోజులపాటు బిల్లులు చెల్లించేవారు. ప్రస్తుతం ఇవేవీ రోగులకు అందడం లేదు. జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారులు లేవు. వాగులు, ఒర్రెలు దాటి వచ్చిన వారు ఆస్పత్రుల్లో కొద్దిరోజులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఆస్పత్రుల్లో బాలింతలకు భోజనం అందించడం లేదు. గర్భిణులు, బాలింతలు, వారి వెంట వచ్చిన బంధువులు బయటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అందని నిధులు రెండేళ్లుగా నిలిచిన హెచ్డీఎస్ ఫండ్స్ మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులునివేదిక పంపించాం రెండేళ్లుగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలకు ఎన్హెచ్ఎం స్కీం ద్వారా అందించే నిధులు నిలిచిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో నిధులు విడుదల అత్యవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వ ఆస్పత్రులకు అనారోగ్య కారణాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. నిధుల లేమి ప్రభావం ఆస్పత్రుల నిర్వహణపై పడుతోంది. – సీతారాం, డీఎంహెచ్వో -
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
● గ్రూపులు వీడి పార్టీ గెలుపునకు కృషి చేయాలి ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ ● జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశంఫ్లెక్సీ వివాదంజిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం సందర్భంగా ప్రేమల గార్డెన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో నియోజకవర్గ ఇన్చార్జి ఫొటో పెట్టకపోవడం ఒక సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడడమేనని రెబ్బెన మండల నాయకుడు దుర్గం సోమయ్య అన్నారు. పార్టీలో రెండు వర్గాలు ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆసిఫాబాద్: పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, గ్రూపులు వీడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యు డు అనిల్కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో శనివారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు అధ్యక్షతన కాంగ్రెస్ సంస్థాగత ని ర్మాణ సమావేశం నిర్వహించగా, అనిల్కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ నమ్ముకుని ఉ న్నవారే నిజమైన కార్యకర్తలని, అలాంటి వారికి గు ర్తింపు ఉంటుందన్నారు. పార్టీ కోసం పనిచేసిన తన కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలు స్థా నిక ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయంలో జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలని సూచించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రాస్రోడ్ నుంచి ప్రేమల గార్డెన్ వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆయనకు స్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ జిల్లా పరిశీలకుడు రమేశ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. త్వరలో జిల్లా కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు తమ బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ సమష్టి కృషితో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీని గెలిపించాలని కోరారు. 18 నెలల్లోనే మార్పు ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎంతో మార్పు వచ్చిందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతోపాటు 65వేల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. గతంలో మంత్రి సీతక్క సహకారంతో ఉపాధిహామీ కింద జిల్లాకు రూ.58 కోట్లు, సీఆర్ఆర్ కింద రూ.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ధరణి పక్కనపెట్టి భూభా రతి చట్టం అమలు చేసిందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ కొంతమంది కుట్రలతో ఓటమి పాలయ్యాయనని ఆరోపించారు. తనకు 60 వేలకు పైచిలుకు ఓట్లు సాధించేందుకు సహకరించిన కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. వారికి స్థానిక ఎన్నికల్లో బీఫాంలు ఇస్తే ఆర్థికంగా సపోర్టు చేసి గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తమకు అన్నివిధాలా సహకరిస్తే అన్ని జెడ్పీటీసీ, ఎంపీసీటీ, సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పదవుల్లో జిల్లాకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ సర్వే చేయించి గెలుపు గుర్రాలకు బీఫాంలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ సూచించారు. సమావేశంలో నాయకులు నరేశ్ జాదవ్, బాలేశ్వర్గౌడ్, అనిల్గౌడ్, తిరుపతి, విశ్వనాథ్, గజ్జి రామయ్య, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉపాధికి ఊతం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: హాజీపూర్ మండలం వేంపల్లిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రీయల్ పార్క్ కొత్త పరిశ్రమల స్థాపనకు, ఉపాధి అవకాశాల సృష్టికి ఊతమివ్వనుంది. ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఈ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే చొరవతో.. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హాజీపూర్ మండలం వేంపల్లి, పోచంపాడు శివారులో 250 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ పార్క్ కోసం రైతుల నుంచి భూములు సేకరించి పరిహారం చెల్లించారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిర్మాణ పనులూ వేగవంతమవుతున్నాయి. వ్యవసాయ ఆధారిత, అనుబంధ రంగ, తయారీ, శీతల గిడ్డంగులు, పశు, పౌల్ట్రీ, పాల ఆధారిత పరిశ్రమలతోపాటు ఐటీ కంపెనీల కోసం ఐటీ హబ్ను సైతం ఏర్పాటు చేయనున్నారు. సబ్సిడీలు, సౌకర్యాలు.. ఇండస్ట్రీయల్ పార్కులో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుంది. రూ.కోటి నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు సౌకర్యాలు కల్పించనున్నారు. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, రవాణా వంటి మౌలిక సదుపాయాలతోపాటు విద్యుత్ సబ్సిడీలు, రాయితీలు, రుణ సౌకర్యాలను అందించనున్నారు. జాతీయ రహదారి 63, మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉండడం, పెద్దపల్లి జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయం వంటి రవాణా సౌకర్యాలు ఈ పార్క్ను ఆసిఫాబాద్, మహారాష్ట్ర, పెద్దపల్లి జిల్లాలకు అనుసంధానిస్తాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆదివారం మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. లక్సెట్టిపేటలో ఆస్పత్రి భవనం ప్రారంభోత్సవం, జూనియర్ కాలేజీ, హైస్కూల్ విద్యార్థులతో భోజనం, దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భూమిపూజ చేస్తారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. తర్వాత వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు. వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు.. నేడు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జిల్లా అభివృద్ధికి మరో అడుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు -
పోలీసులకు చిక్కిన ‘ఆంధ్రా సురేశ్’
● నకిలీ విత్తనాల కేసులో పీడీ యాక్టు నమోదు ● చర్లపల్లి జైలుకు తరలింపుఆసిఫాబాద్అర్బన్/చింతలమానెపల్లి: నకిలీ విత్తనాల సరఫరా కేసుల్లో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన గోరంట్ల సురేశ్బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. శనివారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వివరాలు వెల్లడించారు. నకిలీ విత్తనాల సరఫరా కేసులో నిందితుడు సురేశ్పై చింతలమానెపల్లి పోలీస్స్టేషన్లో ఈ ఏడాది ఏప్రిల్ 4న కేసు నమోదైంది. ఈ నెల 3న రవీంద్రనగర్– 1 సమీపంలో పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. 2018 నుంచి 2025 వరకు నకిలీ విత్తనాల సరఫరాకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో అతడిపై పీడీ యాక్టు నమోదు చేశారు. కౌటాల సీఐ ముత్యం రమేశ్ ఆధ్వర్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం భీమవరానికి చెందిన గోరంట్ల సురేశ్బాబు జిల్లాలోని చింతలమానెపల్లి, బెజ్జూర్, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ మండలాల్లో నమోదైన నకిలీ విత్తనాల సరఫరా కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నా మళ్లీ తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. శాశ్వత చర్యల్లో భాగంగా పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. కాగా, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, భీమినితోపాటు జిల్లాలోని చింతలమానెపల్లి, దహెగాం మండలాలకు ఈ ఏడాది నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో ఆయా పోలీస్స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. ‘ఆంధ్రా సురేశ్ ఎవరు?’ అంటూ ‘సాక్షి’లో ‘నకిలీ ముప్పు’ పేరుతో కథనం కూడా ప్రచురితమైంది. నిందితుడిపై రామగుండం కమిషనరేట్ పరిధిలోనూ కేసులు నమోదై ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. జిల్లాలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంటుందని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. -
ఎట్టకేలకు మోక్షం
● జిల్లాలో 7,154 కొత్త రేషన్ కార్డులు మంజూరు ● రేపటి నుంచి జారీ ప్రక్రియ ప్రారంభం ● సెప్టెంబర్లో బియ్యం అందించేందుకు ఏర్పాట్లునిబంధనలివే..కొత్త రేషన్కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతంలో వార్షికాదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల మించి ఉండకూడదు. మాగాణి 3.5 ఎకరాలు, మెట్ట అయితే 7.5 ఎకరాల మించకుండా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వైద్యులు, కాంట్రాక్టర్లు, నాలుగుచక్రాల వాహనదారులను అనర్హులుగా పరిగణిస్తారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసిఫాబాద్: కొత్త కార్డుల మంజూరు ప్రక్రియలో ఎట్టకేలకు ముందడుగు పడింది. దరఖాస్తుదారుల ఎదురుచూపులకు త్వరలోనే మోక్షం కలగనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. పేదలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. జిల్లా అధికారులు సైతం అందుకు తగిన ఏర్పాట్లతో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం సమగ్ర కులగణన సర్వే ప్రాతిపదికన లబ్ధిదారులను గుర్తించింది. అర్హులైన చాలామంది కొత్త కార్డుల కోసం, ఇప్పటికే కార్డులు ఉన్న కుటుంబాల్లో కూడా కొంతమంది పేర్లు నమోదు కాకపోవడంతో.. వారు పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబంలో చిన్నపిల్లలు, పెళ్లయిన కొత్త కోడళ్లు కూడా పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రామాణికంగా తీసుకోవడంతో రేషన్ కార్డులకు ప్రాధాన్యత ఏర్పడింది. 7,154 కొత్త కార్డులు జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో 314 రేషన్ దుకాణాలు ఉండగా, ప్రస్తుతం 1,39,734 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 13,192 అంత్యోదయ కార్డులు కాగా, 1,26,542 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు. ప్రతినెలా సుమారు 2,949.746 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇప్పటికే లబ్ధిదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించారు. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులకు సెప్టెంబర్ నుంచి సరుకులు ఇవ్వనున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో కార్డులేని వారు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో 1,63,647 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొత్త రేషన్కార్డుల కోసం 17,044 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు మీసేవ కేంద్రాల్లో సైతం కొత్తగా దరఖాస్తులు చేశారు. ప్రస్తుతం కొత్తగా 7,154 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కొత్తకార్డులు జారీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. -
జీవో 49 రద్దుపై గ్రామాల్లో సీపీఎం ప్రచారం
కాగజ్నగర్రూరల్: జీవో నంబర్ 49 రద్దు చేయాలని కాగజ్నగర్ మండలం రేగులగూడ, ఊట్పల్లి గ్రామాల్లో శనివారం సీపీఎం నాయకులు కరపత్రాలతో ప్రచారం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడుతూ ఆదివాసీలను జల్ జంగిల్ జమీన్కు దూరం చేసే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో సీపీఎం ఆధ్వర్యంలో కరపత్రాలతో ప్రచారం చేస్తామని తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం సిగ్గుచేటన్నారు. పులుల సంరక్షణ, అడవుల సంరక్షణ పేరుతో గ్రామాలను ఖాళీ చేయించి, అటవీ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్కుమార్, చాపిలే సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపడంతో శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆ రోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, నాయకులు అనిల్గౌడ్, సోమశేఖర్, చరణ్, శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
దహెగాం(సిర్పూర్): యువకులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాగజ్నగర్ డీ ఎస్పీ రామానుజం అన్నారు. మండలంలోని కుంచవెల్లి గ్రామంలో శనివారం మండల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు చెడు వ్యసనాలు వీడాలని సూచించారు. మా దకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు వాడినా, విక్రయించినా వెంటనే 1908, 87126 70551 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలి పారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ రూరల్ సీఐ శ్రీని వాస్రావు, ఎస్సై విక్రమ్, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. -
తీరని ‘దిందా’ కష్టాలు!
● ఏటా వర్షాలకు జలదిగ్బంధంలో గ్రామం ● అత్యవసరమైతే ప్రాణాలు పోవాల్సిందేనా..? ● గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వని ప్రభుత్వ యంత్రాంగం ● వాగు దాటుతూ మరో యువకుడు మృత్యువాతచింతలమానెపల్లి(సిర్పూర్): వర్షాకాలం వచ్చిందంటే చింతలమానెపల్లి మండలం దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. ప్రధాన రహదారి నుంచి వచ్చే మార్గం నీటిలో మునిగిపోతుంది. ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. వరద కష్టాలు తీర్చాలని ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చింతలమానెపల్లి మండల కేంద్రం నుంచి గూడెం మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిలో కేతిని నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో దిందా గ్రామం ఉంది. దట్టమైన అటవీప్రాంతంలోని ఈ గ్రామానికి రెండు వైపులా ప్రాణహిత నది ఉండగా, మరోవైపు వాగు ఉంది. ప్రజలు బయటకు రావాలంటే కేతిని వైపు, చిత్తం వైపు వాగు దాటాల్సిందే. ఏటా వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలకు లోలెవన్ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోతాయి. మహారాష్ట్రలో కురిసే వర్షాలతోనూ ప్రాణహిత ఉప్పొంగి లోలెవల్ వంతెన మునిగిపోతుంది. దాదాపు మూడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తు వరకు వరద నిలుస్తుంది. రోజుల తరబడి పరిస్థితి అలాగే ఉంటే ప్రాణాలకు తెగించి గ్రామస్తులు వాగు దాటుతున్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల సైతం రోజుల తరబడి మూసి ఉంటుంది. వాగుకు అవతలి వైపు పొలాలకు వెళ్లాలంటే రైతులు సాహసం చేయాల్సిందే.. అంబులైన్స్ రాని దుస్థితి నెలకొంది. ఈత వచ్చినా ఇబ్బందే..ఎంబీఏ చదువుతున్న డోకె రామకృష్ణ అనే యువకుడు 2015లో వాగు దాటుతూ మృతి చెందాడు. తాజాగా కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్ గురువారం వాగులో గల్లంతు కాగా, శుక్రవారం మృతదేహం లభ్యమైంది. దిందా వాగు ఉధృతిగా ఉన్నప్పుడు దాటడం కష్టమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కోచోట వెడల్పుగా, మరోచోట ఇరుకుగా ఉంటూ వరద సుడులు తిరుగుతుంటుందని చెబుతున్నారు. గతంలో మృతి చెందిన రామకృష్ణ వాగులో సగం దూరం ఈదుకుంటూ రాగా.. ఆ తర్వాత ఉధృతిలో చిక్కుకున్నాడు. మరో యువకుడు సుమన్ సైతం గట్టుకు చేరుకునేలోపే కొట్టుకుపోయాడు. పోరుబాట పట్టినా..వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.3కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీశాఖ అనుమతులు మంజూరు కాలేదు. రెండేళ్ల క్రితం వాగు వద్ద వరదనీటిలో గ్రామస్తులు ధర్నా చేశారు. వారం పాటు నిరసన తెలిపారు. స్పందించిన అధికారులు వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చి వెళ్లారు. అయినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. గతేడాది యువకులు వంతెనకై పోరుదీక్ష పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఉన్నతాధికారుల నుంచి హామీ వచ్చినా వంతెనకు మోక్షం కలగలేదు. గతేడాది అటవీ శాఖ అనుమతులు లభించినట్లు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. కానీ నిధులు సరిపోవంటూ కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదు. వంతెన నిర్మించాలి దిందా వాగు లోలెవల్ వంతెనపై వరద ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నాం. ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం హైలెవల్ వంతెన నిర్మించాలి. – నికాడే వెంకన్న, దిందా కాంట్రాక్టు రద్దు చేయండి కాంట్రాక్టర్ పనుల్లో అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే నిజమైతే కాంట్రాక్టు రద్దు చేసి అతడిపై చర్యలు తీసుకోవాలి. త్వరగా రీటెండర్ నిర్వహించాలి. అప్పటివరకు ప్రజలు వాగు దాటేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. – డోకె రామన్న, బీజేపీ మండలాధ్యక్షుడు -
ముంపులోనే పంటలు
రావులపల్లి శివారులో మునిగిన పత్తి పంటదహెగాం/పెంచికల్పేట్: ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పలు మండలాల్లో పంటలు మూడు రోజులుగా నీట మునిగే ఉన్నాయి. దహెగాం మండలంలో ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాలైన మొట్లగూడ, రాంపూర్, రావులపల్లి, పెంచికల్పేట్ మండలం మురళీగూడ, జిల్లెడ గ్రామాల శివారులో సాగు చేసిన పత్తి పంట మూడు రోజులుగా వరదలోనే ఉంది. మొక్కలు మురిగిపోతాయని రైతులు వాపోతున్నారు. దహెగాం మండలంలో 900 ఎకరాలు, మురళీగూడ, జిల్లెడ శివారులో 200 ఎకరాలు వరదనీటితో దెబ్బతిన్నట్లు అన్నదాతలు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు. త్వరగా సర్వే నిర్వహించి పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. మురళీగూడ శివారులో మునిగిన పంటలు -
హాస్య రచన పోటీల్లో ప్రతిభ
ఆసిఫాబాద్అర్బన్: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘శ్రుతి మించక ముందే దూరంగా ఉండండి’ అనే అంశంపై జిల్లాస్థాయి హాస్య రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థిని దివ్వకు రూ.560, ద్వితీయ బహుమతి పొందిన మోడల్ స్కూల్కు చెందిన కౌషిక్కు రూ.300, తృతీయ బహుమతి పొందిన జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన రాజ్యలక్ష్మికి రూ.200 నగదును జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ అందించారు. ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు వెంకట్రావ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా
● టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్ఆసిఫాబాద్: జిల్లాలోని వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం చీఫ్ ఇంజినీర్ ఆపరేషన్– 1 అశోక్తో కలిసి విద్యుత్ శాఖ డీఈఈలు, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, అధికరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మధుసూదన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అన్నిరకాల పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించడానికి మెయింటనెన్స్ చేపట్టాలని ఆదేశించారు. అన్ని లైన్లు పరిశీలించి ప్రమాదకరమైన లొకేషన్లు గుర్తించి, సరిచేయాలని సూచించారు. ఉద్యోగులు పనిచేసే సమయంలో భద్రతా పరికరాలు ఉపయోగిస్తూ ప్రమాదాలు నివారించాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. -
కాన్పుల మధ్య ఎడం తల్లీబిడ్డకు శ్రేయస్కరం
ఆసిఫాబాద్అర్బన్: కాన్పుల మధ్య సరైన ఎడం పాటించడం తల్లీబిడ్డకు శ్రేయస్కరమ ని మాతాశిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సిద్దార్థ అన్నారు. ప్రపంచ జనాభా ది నోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐడీఏసీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరో గ్య సంస్థ ఈ ఏడాది ఆరోగ్యకరమైన సమ యం, కాన్పుల మధ్య దూరం తల్లీబిడ్డలకు శ్రేయస్కరం అనే నినాదాన్ని ఇచ్చిందని తెలి పారు. 15 నుంచి 49 ఏళ్లలోపు సీ్త్రలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నా రు. శాశ్వత కుటుంబ నియంత్రణతోపాటు తాత్కాలిక నియంత్రణ పద్ధతులైన ఐయూడీ, నిరోధ్, గర్భ నిరోధక సాధనాల వినియోగం గురించి వివరించాలని సూచించారు. జనా భా విస్పోటనాన్ని నియంత్రించేందుకు అవగాహన కల్పించాలన్నారు. వైద్యులు వినోద్, సిబ్బంది రవిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
బస్టాండ్లలో భద్రతేది..?
కాగజ్నగర్ నుంచి చింతలమానెపల్లికి ఆర్టీసీ బస్సులో మే 19న చింతలమానెపల్లికి చెందిన రమ్య ప్రయాణిస్తుండగా బ్యాగులోని మూడున్నర తులాల బంగారం చోరీకి గురైంది. సిర్పూర్(టి)– లోనవెల్లి మధ్య హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దొంగలించారు. ఆర్టీసీ సిబ్బంది కౌటాల పోలీస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు నిలిపి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సు సురక్షితమని ఎక్కితే.. బంగారం ఎత్తుకెళ్లారని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ నెల 7 పాఠశాల విద్యార్థినులను ఇద్దరు యువకులు ఏడిపిస్తూ వేధింపులకు గురిచేశారు. వారిని ఆసిఫాబాద్ షీటీం సభ్యులు స్వప్న, రజని, దినేశ్ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పోకిరీల చేష్టలు ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు. కౌటాల(సిర్పూర్): మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ తీవ్రంగా పెరిగింది. సీటు కో సం పోటీ పడుతున్నారు. ఇక పల్లె వెలుగు బస్సుల్లో అయితే కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. అయితే బస్సులు, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు చోరీ లకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. రద్దీ సమయంలో బస్సుల్లో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు దొంగలు తమ పనిని సులువుగా కానిస్తున్నారు. అమాయకుల బ్యాగులు, మెడలోని ఆభరణాలు, జేబుల్లోని పర్సులు, సెల్ఫోన్లను క్షణాల్లో మాయం చేస్తున్నారు. బాధితులు తేరుకునేలోపే నష్టం జరుగుతోంది. ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్నచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా సంస్థ అలసత్వం ప్రదర్శిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రద్దీ సమయాల్లో..జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్ పట్టణం, కౌటా ల, వాంకిడి, పెంచికల్పేట్ మండల కేంద్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. పండుగలు, శుభకార్యాల సమయంలో బస్టాండ్ ప్రాంతాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శి స్తున్నారు. బస్సు ఎక్కి, దిగే సమయంలో సొమ్ము, నగలు కాజేస్తున్నారు. ఆయా సరిహద్దు మండలాల్లోని ప్రజలకు మహారాష్ట్ర ప్రజలతో సత్సంబంధాలు ఉండడంతో రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు. బస్టాండ్లు, బస్సుల్లో చోరీలకు పాల్పడేవారు సరిహద్దు దాటి పారిపోతున్నారు. నిందితులను పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. కొత్తగా వచ్చే వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. నిఘా నేత్రాలు పటిష్టంగా లేకపోవడం వైఫల్యంగా మారుతోంది. ప్రయాణికుల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లా వివరాలు ప్రయాణ ప్రాంగణాల్లో నిఘా కరువు చేతివాటం చూపుతున్న దొంగలు ఆందోళన చెందుతున్న ప్రయాణికులునిఘా కరువు..జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గతంలో పోలిస్తే బస్సులు, ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు ఐదారు వేల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన ఈ బస్టాండ్లో రెండు సీసీ కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అవి కూడా కొంతవరకు మాత్రమే కవర్ చేస్తున్నాయి. చోరీలు జరిగినప్పుడు దొంగలు గుర్తించడం కష్టంగా మారుతుంది. అలాగే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు కాగజ్నగర్ ఆర్టీసీ బస్టాండ్ కీలకమైంది. ఇక్కడ గ్రామీణ మండలాలతోపాటు మంచిర్యాల, హైదరాబాద్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి సక్రమంగా పనిచేయడం లేదు. భద్రత మా బాధ్యత ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం కల్పించడంతోపాటు ప్రయాణికులకు భద్రత కల్పించడం మా బాధ్యత. ఆసిఫాబాద్లోని బస్టాండ్లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగజ్నగర్ బస్టాండ్లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రద్దీకి అనుగుణంగా పోలీసుల సహకారంతో భద్రత కల్పిస్తాం. ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీ సిబ్బందిని నియమించాం. ఇబ్బందులకు గురితే సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించాలి. – రాజశేఖర్, ఆసిఫాబాద్ డిపో మేనేజర్ -
దిందా వాగులో పడి యువకుడు గల్లంతు
చింతలమానెపల్లి: దిందా వాగులో పడి యువకుడు గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్(18) సుమన్ తన స్నేహితులతో కలిసి గురువారం దిందా వాగుకు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో వారు వాగు దాటేందుకు ప్రయత్నించారు. సుమన్కు ఈతవచ్చినప్పటికీ అవతలివైపు చేరుకునే సమయంలో వాగు ఉధృతి పెరిగింది. సుమన్ గట్టుపై ఉన్న చెట్టును పట్టుకోగా చెట్టుకొమ్మ విరిగింది. దీంతో వాగు ఉధృతిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాగు ఉధృతి ఎక్కువగా ఉండడం, చీకటి పడడంతో సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. గల్లంతైన సుమన్ డిగ్రీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డైట్ సెట్ పరీక్షకు హాజరయ్యాడు. తిరుపతి అమృత దంపతులకు సుమన్ పెద్దకుమారుడు. మరో అజయ్, కిషన్, కల్పన సంతానం ఉంది. -
ఉమ్మడి కుటుంబం..ఆత్మీయం
తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ శ్రీకాంత్ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సయ్య–లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె వివాహం అనంతరం కొన్నేళ్లకు తండ్రి నర్సయ్య మృతిచెందాడు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ అన్నీతానై కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుని ముందుకు నడిపించాడు. కుటుంబం కోసం వ్యాపారం ప్రారంభించి, తమ్ముడు అశోక్ను ఉన్నతంగా చదివించాడు. అన్న కష్టానికి తగ్గట్టుగా పట్టుదలతో చదివి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం సాత్నాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్కు సన్నద్ధమై ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. ఇటీవల గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 250వ ర్యాంక్, గ్రూప్–3లో 417 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం తల్లితోపాటు వివాహమైనప్పటికి సోదరులు ఇద్దరు ఉమ్మడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు, తల్లి మొత్తం తొమ్మిది మంది ఒకే చోట ఉంటున్నారు. -
వాన జోరు.. వరద హోరు!
● జిల్లా అంతటా ఎడతెరిపిలేని వర్షం ● పొంగిపొర్లుతున్న వాగులు, ఒర్రెలు ● ఉప్పొంగిన ప్రాణహిత ● నీటమునిగిన పంటలు ఆసిఫాబాద్/కెరమెరి/చింతలమానెపల్లి/దహెగాం/పెంచికల్పేట్/బెజ్జూర్/సిర్పూర్(టి)/కౌటాల:జిల్లా అంతటా రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు కుమురంభీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేశారు. జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్లోని లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచి పోయి ఆర్ఆర్కాలనీ వాసులు ఇబ్బందిపడ్డారు. కెరమెరి మండలంలోని లక్మాపూర్, అనార్పల్లి వా గులు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. సుమారు 15 గ్రామాలకు చెందిన ప్రజలు వాగు దాటి రాలేకపోతున్నారు. సాంగ్వి కల్వర్టుపై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చింతలమానెపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గురువారం 51.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాబాసాగర్ నాయకపుగూడ దారిలో వాగు ఉప్పొంగడంతో రవాణా నిలిచిపోయింది. పాల్వాయినగర్, చింతలపాటి వద్ద వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో కౌ టాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మార్గంలో రవా ణా స్తంభించింది. గూడెం వద్ద అంతర్రాష్ట్ర వంతెన శ్లాబ్ను తాకేలా ప్రాణహిత నది ప్రవహిస్తోంది. పలు పాఠశాలల ఆవరణలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. శివపెల్లి, దిందా, నాయకపుగూడ, గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నా యి. బూరెపల్లి, రణవెల్లి గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు కొనసాగుతున్నందువల్ల వాగుల ఉధృతి కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దహెగాం మండలంలోని ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో మొట్ల గూడ, రావులపల్లి, రాంపూర్ శివారులో 3 నుంచి 4వందల ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి–గొల్లవాడ మధ్య ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తా త్కాలిక రోడ్డు కొట్టుకు పోయింది. బొక్కివాగు, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అనిల్ కుమార్ సూచించారు. బెజ్జూర్ మండలంలో ప్రాణహిత న ది ఉప్పొంగి సోమిని, తలాయి, తిక్కపల్లి, భీమా రం, ఇప్పలగూడ, మొగవెళ్లి, తదితర గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి. కృష్ణపల్లి, సుస్మిర్ సమీపంలోని రెండు ఒర్రెలు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్(టి) మండలంలో వెంకట్రావ్పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర హైలెవల్ వంతెనకు ఆనుకోని పెన్గంగ నది వరద నీరు ఉదృతంగ ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే తెలంగాణ–మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. వరద నీరు గంట గంటకూ పెరుగుతుండటంతో నదీ తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహితనది, తాటిపెల్లి వద్ద వార్థానది, గుండాయిపేట సరిహద్దులోని పెనగంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి.కెరమెరి: సాంగ్వి కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు -
● ఏటేటా పెరుగుతున్న జనాభా ● అమ్మాయిల జననాలే అధికం ● క్రమంగా తగ్గుతున్న మహిళల సంఖ్య ● ఉమ్మడి జిల్లాలో జనాభా తీరిదీ ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఈ ఏడాది థీమ్.. ‘‘యువతకు న్యాయమైన, ఆశాజనక ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి వారిని శక్తివంతం చేయడం’’ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం. రెప్పపాటులో పుట్టుక చావులు జరిగిపోతున్నాయి. ఏటేటా జనాభా పెరిగిపోతోంది. గతంతో పోలిస్తే జనన, మరణాల సంఖ్య పెరుగుదల రేటు తగ్గిపోతోంది. మారుతున్న పరిస్థితులు జనాభాను నియంత్రిస్తున్నాయి. అందరికీ అన్ని సౌకర్యాల కల్పన మానవ సమాజంలో క్లిష్టంగా మారింది.. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో జనాభాతోపాటు పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. గిరిజన, మైదాన ప్రాంతాల్లో మార్పులు వస్తున్నాయి. తగ్గుతున్న మహిళా జనాభా ప్రతీ వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలు సర్వేల్లోనూ లింగనిష్పత్తి తగ్గుతూ వస్తోంది. పురుషులకు సమానంగా సీ్త్రలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2011అధికారిక జనాభా లెక్కల్లోనే ఇది స్పష్టమైంది. సీ్త్ర, పురుష సమానత్వం లేకపోతే సమాజంలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు లింగనిర్ధారణ చేస్తు ఆడశిశువులను పురిటిలోనే చంపేయడం జనాభాలో అసమతుల్యతకు కారణంగా మారుతున్నాయి. అమ్మాయిలే పుడుతున్నారు.. ‘సీఆర్ఎ్స్(రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) 2021 నివేదికలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 26576మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25124మంది జన్మించారు. అదే సమయంలో మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832మంది మరణించారు. పెరుగుతున్న వలసలు.. గ్రామాలు వదిలి విద్యా, ఉద్యోగ, ఉపాధి సౌకర్యాల కోసం అధికంగా వలసలు పెరుగుతున్నాయి. దీంతో క్రమంగా పట్టణీకరణ పెరుగుతోంది. 2011లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా 43.8శాతం, ఆదిలాబాద్ 23.7శాతం, నిర్మల్ 21.4, కుమురంభీం జిల్లాలో 16.9శాతంతో పట్టణ జనాభా ఉంది. ప్రస్తుతం 2025నాటికి సంఖ్య మరింత పెరగనుంది. అయితే పట్టణాల్లో పెరుగుతున్న వలసలకు అనుగుణంగా శుభ్రమైన తాగు, ఉండేందుకు ఇల్లు, విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వసతలు కల్పన జరగాల్సి ఉంది. లేకపోతే అల్పాదాయంతో పేదరికంలో అధిక జనాభా మగ్గాల్సి వచ్చే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రతీ చదరపు కిలోమీటరకు జనసాంద్రత చూస్తే ఆసిఫాబాద్ జిల్లా తక్కువ ఉండగా, పట్టణీకరణ చెందిన మంచిర్యాల జిల్లాలో అధికంగా ఉంది. ప్రస్తుతం 2025 నాటికి జనసాంద్రత మరింత పెరగనుంది. వసతులు, సౌకర్యాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు వలసలతో ఆ ప్రాంతాల్లో జన సాంద్రత పెరుగుతోంది. -
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్కలెక్టర్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, పోలీసుశాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపెల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు ఉప్పొంగితే ప్రభావిత గ్రామాల వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వాగులు దాటకుండా బందోబస్తు చేపట్టాలన్నారు. శిథిలావస్థ ఇళ్లల్లో ఉండే వారిని సురక్షితప్రాంతాలకు తరలించాలని, అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్లో విపత్తు రక్షణ బృందాలను ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించామన్నారు. ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా జరగాలి..జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం వచ్చిన దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం అంకుసాపూర్ శివారులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలన్నారు. ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
● ఉమ్మడి కుటుంబాలతోనే మేలు ● చిన్నకుటుంబాలపైనే యువత ఆసక్తి ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
మంచిర్యాలటౌన్/ఆదిలాబాద్/బెల్లంపల్లి/చెన్నూర్: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. యువజన భారతంగా వెలుగొందుతున్న దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అంచనా ఉంది. గతంలో ఇద్దరు పిల్లలే ముద్దు అనే నినాదం ఉండగా.. ప్రస్తుతం ఒక్కొక్కరూ ముగ్గురు కంటే ఎక్కువ మందిని కనాలనే సూచన వస్తోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ యువతీ, యువకులు, పెళ్లయిన జంటలు 300 మందిని పలు అంశాలపై గురువారం సర్వే నిర్వహించింది. వీరిలో అధిక శాతం ఉమ్మడి కుటుంబాలతోనే మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలే చాలని.. భవిష్యత్ ప్రణా ళికలోనూ ఇద్దరే ముద్దు అని పేర్కొన్నారు. ఉద్యోగం, ఉపాధి తదితర కారణాలతో చిన్న కుటుంబాలుగా వేరుపడడానికే మొగ్గు చూపారు. 4. ఉమ్మడి కుటుంబాల వల్ల ప్రయోజనమా.. చిన్న కుటుంబాల వల్లనా..?1.దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కరు ముగ్గురు పిల్లల కన్న ఎక్కువ మందిని కనాలన్న సూచనలపై మీరేమంటారు..3. మీది ఉమ్మడి కుటుంబమా..? చిన్న కుటుంబమా..? 2. పెళ్లి తర్వాత పిల్లలపై మీ ప్రణాళిక ఏమిటిపాటించాలిఇద్దరు చాలుఉమ్మడి కుటుంబాలుచెప్పలేంఇద్దరుచిన్న కుటుంబాలుచిన్నదేఉమ్మడి225364169502847 -
సమగ్ర నివేదికలు లేకుండా ఎలా వస్తారు?
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లా అధికారులు సమగ్ర నివేదికలు లేకుండానే ‘దిశ’ సమావేశానికి ఎలా హాజరవుతారని ఎంపీ గోడం నగేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన దిశ(జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ) సమావేశానికి ఎంపీ హాజరై కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మైనింగ్, విద్య, వైద్య, వ్యవసాయ, బీఎస్ఎన్ఎల్. గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల పురోగతిపై ఆయా శాఖల వారీగా సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 973 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 137 అంగన్వాడీ టీచర్లు, 357 ఆయా పోస్టులు ఖాళీలుగా ఉన్నాయన్నారు. బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల చదువు, ఆరోగ్యంపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తిర్యాణి మండలం గోవేన గ్రామ పంచాయతీలో విద్యుత్తు సరఫరా లేని ఆవాస ప్రాంతాలకు వెంటనే విద్యుత్తు సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులపై అసంతృప్తి...దిశ సమావేశంలో పలు శాఖల అధికారులపై ఎంపీ నగేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో గతేడాది, ప్రస్తుత ఏడాదిల్లో ఎలాంటి పనులు చేపట్టారని, ఎంత మందికి పని దినాలు కల్పించారని, ఎన్ని నిధులు వ్యయం చేశారని ప్రశ్నించగా.. ఆ శాఖ పీడీ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎన్ని సీసీరోడ్లు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారు? సీసీరోడ్లకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు, ఇన్చార్జి మంత్రి నుంచి ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయని ప్రశ్నించారు. సీసీ రోడ్ల మంజూరులో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఏదైనా అడిగితే జిల్లా ఇన్చార్జి మంత్రి వద్ద నుంచి సిఫార్సు తీసుకురావాలని చెబుతున్నారని, మీరు కూడా ఇన్చార్జి మంత్రి నుంచి సిఫార్సు తెస్తున్నారా? అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. ఈ అంశంపై ఎంపీ గోడం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అందరికీ సమానంగా పనులు ఇవ్వాలని సూచించారు. అధ్వానంగా మారిన రోడ్లకు ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదని ఆర్అండ్బీ, పంచాయరాజ్ శాఖల అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న తిర్యాణి రోడ్డు గురించి ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలుపగా.. ఆ రహదారి పనులు చేపట్టేందుకు అటవీశాఖ నుంచి అనుమతులు ఇవ్వడం లేదని ఆర్అండ్బీ ఎస్ఈ పేర్కొన్నారు. అక్కడే ఉన్న డీఎఫ్ఓ నీరజ్కుమార్ దానిని ఖండిస్తూ ఆ రహదారి విషయంపై నాకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని సమాధానం ఇచ్చారు. వారిరువురి మధ్య సంభాషణ కొనసాగుతుండగా ఎంపీ కలుగజేసుకుని వెంటనే తిర్యాణి రహదారి పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా, డీఎఫ్వో నీరజ్కుమార్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీ గోడం నగేష్ కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష పలు శాఖల అధికారులపై అసంతృప్తి -
నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
● అదుపులో నలుగురు, పరారీలో ఒకరు ● కారు, బైక్, ఆటో బంగారు, వెండి స్వాధీనం ఇచ్చోడ: నకిలీ పోలీసుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కార్యాలయంలో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నిడమనూర్ గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (పశువుల వ్యాపారి), చింతల చెరువు ప్రశాంత్(లారీ క్లీనర్), బదనపూరి అజయ్(మోటార్ మెకానిక్) బొప్పరం సుధాకర్(సెల్ పాయింట్), ఒట్కురి నరేష్ (పెట్రోల్ బంక్ ఉద్యోగి) ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎస్సై పేరు చెప్పి వివిధప్రాంతాల్లో బంగారు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. గతనెల 27న రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండోజు నరసింహచారికి ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం 11 గ్రాముల బంగారం కొన్నారని కేసు కాకుండా ఉండాలంటే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన నరసింహచారి తనకు ఫోన్ చేసిన వ్యక్తి నకిలీ ఎస్సైగా గుర్తించి ఇచ్చోడ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 4న హైదరాబాద్కు చెందిన రుద్రంగి కిరణ్ కుమార్కు ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి మాట్లాడుతున్నట్లు చెప్పి, దొంగ బంగారం కొన్నారని బెదిరించి సదరు వ్యక్తి నుంచి రూ1.50 లక్షలు వసూళ్లు చేశారు. అనుమానం వచ్చిన కిరణ్కుమార్ సైతం ఇచ్చోడలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఎస్సై అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో నలుగురిని మండల కేంద్రంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఒట్కురి నరేశ్ పరారీలో ఉన్నారు. వీరిపై గతంలో నల్గొండ, హుజుర్నగర్ పోలీస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నవి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చైన్నె నగరాల్లోని ఆభరణాల షాపుల యజమానులకు ఫోన్ చేసి బెదిరించి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసి జల్సాలకు వాడుకున్నట్లు తేలింది. నిందితుల నుంచి కారు, ఆటో, బంగారు, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
ఎలక్ట్రానిక్స్ గోదాంలో చోరీ
నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాంలో జరిగిన దొంగతనాన్ని నిర్మల్ పోలీసులు ఛేదించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రూరల్ సీఐ కృష్ణ వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా గోదాంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించకుండా పోవడాన్ని యజమాని వెంకటరమణ గుర్తించారు. దీంతో ఆడిట్ నిర్వహించారు. అనుమానాస్పదంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నవత్ శ్రీకాంత్, జిందాడే సచిన్, సాబ్లే జగదీశ్వర్, కూసులే నవీన్ను విచారించగా వారు దొంగతనానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేసిన వస్తువులను తరలించేందుకు ఆటో డ్రైవర్ సయ్యద్ ఇమ్రాన్ సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఫ్రిడ్జ్, గీజర్, సామ్సంగ్ టీవీ, ఆరు కూలర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో ఎస్సై సంజీవ్ ఉన్నారు. కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్కరీంనగర్క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్పల్లికు చెందిన శ్రీనివాస్తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పర్చారు. శ్రీనివాస్కు కోర్టు ఈ నెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. గుడ్లబోరిలో మద్యనిషేధంకౌటాల: మండలంలోని గుడ్లబోరి గ్రామంలో గురువారం మద్య నిషేధం విధిస్తున్నట్లు మహిళలు తీర్మానించారు. గుడ్లబోరి పంచాయతీ పరిధిలోని విజయనగరం, వైగాం, సైదాపూర్, మరియపూరం గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారని వారుత తెలిపారు. యువత మద్యానికి బానిసై ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో మద్యం, గంజాయి విక్రయిస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని మహిళలు తీర్మానం చేశారు. శ్రావంతి, విఠబాయి, సవిత, తారబాయి, మమత, పోచుబాయి, విమలబాయి పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డెప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ వేమనపల్లి: విధుల్లో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డెప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ అన్నారు. పీహెచ్సీలో ప్రసవ వేదన శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి కృపబాయితో కలిసి పీహెచ్సీలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రసూతి కోసం కొండగొర్ల సోనియా పీహెచ్సీకి వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటివి పునరావృతమైతే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర వేళ 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా కమ్యూనిటీ అధికారి వెంకటేశ్వర్, బీపీహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, ఎస్యూఓలు జగదీశ్, వసంత, సూపర్వైజర్ అపరంజి, రాంశెట్టి బాపు ఉన్నారు. ఎఫెక్ట్.. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఎస్సై ఇ.సాయన్న, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలో దనోరా(బి) పంచాయతీ పరిధి ఇన్కార్గూడకు చెందిన ఎల్నారే అనిల్, ఉమ దంపతులకు ఏకై క కుమారుడు శుభం(23). డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 7న మద్యం తాగి ఇంటికొచ్చిన కుమారుడిని రోజు మద్యం ఎందుకు తాగుతున్నానవని తల్లి ఉమ మందలించింది. క్షణికావేశంతో వ్యవసాయ చేనుకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి చెప్పాడు. గ్రామస్తుల సహాయంతో ఓ ప్రైవేట్ వాహనంలో ఆదిలాబాద్లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు.. సోన్: అప్పుల బాధ, భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన పట్టం పోశెట్టి(34) గతంలో దుబాయ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. భార్య పోసవ్వ అలియాస్ అరుణకు కుమారుడు ఉన్నాడు. ఆమె ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అటు అప్పుల బాధ, ఇటు భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన పోశెట్టి గురువారం ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి అక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. -
నీట్లో విద్యార్థి ప్రతిభ
లక్సెట్టిపేట: నీట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన కందుల కుషీంద్రవర్మ ప్రతిభ కనబర్చి రాష్టస్థాయి 59 ర్యాంకు సాధించాడు. పదో తరగతి వరకు పట్టణంలోని గుడ్ షెప్పర్డ్ పాఠశాల, చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి మంచి మార్కులు సాధించాడు. ఈయన తండ్రి ప్రవీణ్కుమార్ ప్రైవేటు టీచర్, తల్లి సుమలత గృహిణి. కుమారుడు నీట్లో ర్యాంక్ సాధించడంపై పలువురు అభినందించారు. గుడుంబా పట్టివేతజైపూర్: బైక్పై గుడుంబా తరలిస్తుండగా ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భీమారం మండల కేంద్రంలో ఆరెపల్లి క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్తూర్ మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ శంకర్ బైక్పై 30లీటర్ల గుడుంబా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించగా జోడువాగు వద్ద శంకర్ను అదుపులో తీసుకుని బైక్, గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాసరలో ముగిసిన గురుపౌర్ణమి వేడుకలుబాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు గురువారంతో ముగిశాయి. వ్యాసమహర్షి, సరస్వతి, వ హాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ ఉన్నారు. -
కలిసుంటే కలదు సుఖం..
● ఉమ్మడి కుటుంబాల్లో ఆత్మీయత, ప్రేమానురాగాలు ● ఆత్మస్థైర్యంతోపాటు బలం ● ఆదర్శంగా నిలుస్తున్న పలు ఫ్యామిలీలు కాలం మారుతోంది.. జీవితం బిజీగా మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలు అన్న భావన నెలకొంది. దీంతో పెద్ద కుటుంబాలు విడిపోయి, ఒక్కొక్కరూ ఒక్కో చోట జీవనం సాగిస్తున్న రోజులివి. చిన్నచిన్న మనస్పర్థలు, వ్యక్తిగత ఆలోచనలు వీరిని దూరం చేస్తున్నాయి. కానీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బంధాలను బలోపేతం చేస్తూ, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ప్రేమ, అనురాగం, ఆత్మీయ ఆప్యాయతలకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు కష్టసుఖాలను పంచుకుంటూ, ఒకరికొకరు అండగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవనం సాగిస్తూ, ఇవి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకరి ఆనందంలో అందరూ భాగస్వాములవుతూ, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఈ కుటుంబాలు సామాజిక సమతుల్యతను కాపాడుతున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, ఉమ్మడి కుటుంబాల విలువను గుర్తుచేసుకోవడం అవసరం. ఇవి కేవలం కుటుంబ సభ్యులను కలిపే సంస్థానం మాత్రమే కాదు..సమాజంలో ప్రేమ, సామరస్యం, సహకార భావనలను పెంపొందించే బలమైన ఆధారాలు. ఇటువంటి కుటుంబాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా.. ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని ఆదిత్యనగర్ కాలనీకి చెందిన నానక్ సింగ్ పరివారం ఉమ్మడి కుటుంబం. గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబమంతా ఒకేచోట కలిసి ఉంటుండడం విశేషం. నానక్ సింగ్–మంజీత్ కౌర్ దంపతులకు ఆరుగురు సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. చిన్నపాటి ఇనుప వస్తువులు, పనిముట్లు చేసుకుని జీవనం సాగిస్తున్నా, పరివారమంత ఒకే దగ్గర ఆత్మీయంగా కలిసి ఉంటున్నారు. కుటుంబంలో ఒక అబ్బాయికి తప్పా అందరికీ వివాహాలు జరిగాయి. తమ మధ్య ఉన్న అనుబంధమే మా అందరిని 40 ఏళ్లుగా కలిపి ఉంచిందని నానక్ సింగ్ చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా, తామందరం బాధ్యతలు పంచుకుని ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకు శ్రమిస్తామని పేర్కొంటున్నారు.చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ బోథ్: మండలకేంద్రానికి చెందిన రాజశేఖర్ దీప దంపతులు. వారికి పిల్లల సంఖ్య కన్నా, వారిపై పెట్టే శ్రద్ధ ముఖ్యమని నమ్మారు. మేము ఒక్కరే కావాలనుకున్నారు. ఆ ఒకరిలో అన్ని విలువలు, విజ్ఞానం, మంచి భవిష్యత్తును ఇవ్వాలని అనుకురు. సంతానంగా కూతురు రుతిక పుట్టింది. ఆమె అభ్యున్నతికి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఇటీవల విడుదలైన లాసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. చిన్న కుటుంబం వల్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చామని అనుకుంటున్నాం. -
హోరాహోరీగా బాలికల ఫుట్బాల్ పోటీలు
● సెమీస్కు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జట్లు రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఉదయం లీగ్ కమ్ నాకౌట్ పోటీలు నిర్వహించారు. మధ్యాహ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్సాహంగా సాగాయి. మహబూబ్నగర్–నల్గొండ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు దీటుగా తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించకపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్లు నిర్వహించారు. ఇందులో నల్గొండ జట్టు 2–1 తేడాతో మహబూబ్నగర్పై గెలిచి సెమీస్కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో వనపర్తి–ఖమ్మం జట్లు తలపడగా 0–1 తేడాతో ఖమ్మం గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్లో నిజామాబాద్–గద్వాల్ జట్లు తలపడగా 7–1 గోల్స్తో నిజామాబాద్ గెలుపొందింది. ఇక ఆతిథ్య ఆదిలాబాద్ జట్టుకు క్వార్టర్ ఫైనల్స్లో నిరాశే ఎదురైంది. రంగారెడ్డి–ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 4–0 గోల్స్తో రంగారెడ్డి గెలిచి సెమీస్కు చేరింది. శుక్రవారం ఉదయం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ నల్గొండ–నిజామాబాద్ల మధ్య, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఖమ్మం–రంగారెడ్డి జట్ల మధ్య జరుగనుంది. -
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లా నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎంపీ అనిల్కుమార్యాదవ్, నాయకులు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణహిత ప్రాజెక్టుపై కాలయాపన చేయొద్దు
కౌటాల(సిర్పూర్): ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయొద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు అనేవారికి ఈ వరద నీటిని చూసి కనువిప్పు కలగాలన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి దిగువనున్న గోదావరిలోకి ఇప్పటికే 40 టీఎంసీల నీరు కలిసిందని, ఇక్కడ ఏటా 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నిర్మిస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు డీపీఆర్ కూడా సిద్ధం చేయలేదన్నారు. అంతకుముందు కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల, వీర్ధండిలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ ప్రమోద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవ య్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఎంపీడీవో రమేశ్, ఏపీఎం ముక్తేశ్వర్, ఏపీవో పూర్ణిమ, జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, మండల అధ్యక్షుడు కుంచాల విజయ్, మాజీ ఎంపీటీసీ మోతిరాం, నాయకులు తిరుపతి, రవి, మధుకర్, భూమయ్య, మహేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
దండేపల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనోద్దిన్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నెల్కి వెంకటపూర్ గ్రామానికి చెందిన కోవ మహేందర్ (19) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన మహేందర్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించగా మద్యం మానేసి, మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని వైద్యులు చెప్పారు. కానీ మహేందర్ మద్యం మానేయలేదు. ఈనెల 5న కడుపునొప్పి తీవ్రంగా ఉందని, చనిపోవాలని ఉందంటూ అన్న లక్ష్మణ్కు చెప్పాడు. తాగుడు మానివేసి మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని లక్ష్మణ్ సముదాయించాడు. అదేరోజు మధ్యాహ్నం మందుల కోసం ఇంట్లో నుంచి వెళ్లిన మహేందర్, దండెపల్లి వాగులో పురుగుల మందు తాగి స్నేహితుడు మోకాషి శేఖర్కు ఫోన్ చేసి చెప్పాడు. శేఖర్ వెంటనే లక్ష్మణ్కు ఫోన్ చేయగా లక్ష్మణ్ అక్కడకు చేరుకుని బైక్పై మహేందర్ను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జోరుగా గ్లైఫోసెట్ రవాణా!
● మహారాష్ట్ర నుంచి జిల్లాకు.. ● నిషేధిత గడ్డిమందుతో పర్యావరణానికి ముప్పు ● వానాకాలం సీజన్లో విచ్చలవిడిగా వినియోగంచింతలమానెపల్లి(సిర్పూర్): గ్లైఫోసెట్ మానవాళికే ప్రమాదకరంగా మారిన ఓ గడ్డిమందు. ఈ నాన్ సెలక్టివ్ హెర్బిసైడ్ ద్వారా దుష్పరిణామాలు ఎన్నో ఉన్నా జిల్లాలో చాలామంది విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఈ కలుపు నివారణ మందు మొక్కల్లో ఉండే జీవ ఎంజైమ్లను నాశనం చేయడం ద్వారా మొక్కలను ఎదగకుండా చేస్తుంది. మొదట ఓ అమెరికా కంపెనీ రౌండప్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత దుష్పరిణామాలను పరిగణనలోకి తీసుకుని చాలా దేశాలు దీనిని నిషేధించడమో.. లేక పరిమితి విధించి నియంత్రించడానికి చట్టాలు రూపొందించాయి. జిల్లాలో నిషేధం.. మహారాష్ట్రలో అనుమతి తెలంగాణలో పూర్తిస్థాయి నిషేధం ఉండగా, సరిహద్దులోని మహారాష్ట్రలో నియంత్రణ మాత్రమే ఉంది. అక్కడ అధికారులు సిఫార్సు చేయకుండా వినియోగించే అవకాశం లేదు. రైతులు పత్తి పంటలో కలుపు మొక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు విస్తృతంగా బీటీ 3 విత్తనాలు సాగు చేస్తున్నారు. ఈ విత్తనాలు వాడిన చేలలో గ్లైఫోసెట్ వినియోగించవచ్చు. కలుపు పెరిగినా శ్రమ లేకుండా నివారించవచ్చు. ఈ కారణంతోనే జిల్లాలో బీటీ 3 విత్తనాలు, గ్లైఫోసెట్ గడ్డి మందు వాడుతున్నారు. జిల్లాకు సరిహద్దుగా వాంకిడి, సిర్పూర్(టి), చింతలమానెపల్లి మండలాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అలాగే కొంతమంది రైతులు కూడా మహారాష్ట్రలో కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, ఆష్టి, గోండ్పిప్రి, అహేరి, ఆళ్లపల్లి పట్టణాలోని జి ల్లా రైతులను లక్ష్యంగా చేసుకునే విక్రయాలు జరుపుతున్నారు. వ్యాపారులు మహారాష్ట్రలో లీటర్ రూ.500కు కొనుగోలు చేసి స్థానికంగా రూ.వెయ్యి నుంచి రూ.1200లకు విక్రయిస్తున్నారు. తాజాగా చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద సోమవారం రాత్రి రూ.16వేల విలువైన గ్లైఫోసెట్ మందు, ఖర్జెల్లి శివారులో నిర్వహించిన తనిఖీల్లో రూ. 24వేల విలువైన 30లీటర్ల గ్లైఫోసెట్ గడ్డిమందు లభ్యమైంది. వాంకిడి మండలంలోనూ సోమవారం రాత్రి 40 లీటర్లను పోలీసులు పట్టుకున్నారు. -
వసతుల కల్పనకు చర్యలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఐఈవో కళ్యాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, పంచాయతీరాజ్ డీఈ కృష్ణతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల కల్ప న, అదనపు గదుల నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారులు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో తాగునీరు, మూత్రశాలలు, భవనాలకు మరమ్మతు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, కంప్యూటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు ఇతర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆస్పిరేషనల్ బ్లాక్లో భాగంగా తిర్యాణి మండలంలో రహదారుల అభివృద్ధి, పాఠశాలల్లో వసతులు కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలల నిర్మాణాలు, విద్యుదీకరణ, భవనాల పెయింటింగ్ పనులు చేపట్టాలని సూచించారు. గతంలో ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. -
● కేజీబీవీలకు సరఫరా కాని ఇంటర్ పాఠ్యపుస్తకాలు ● ఇప్పటికే ప్రారంభమైన తరగతులు ● ఆందోళన చెందుతున్న విద్యార్థులు ● ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పంపిణీ పూర్తి
ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని సంజన. దహెగాం కేజీబీవీలో ఇంట ర్మీడియెట్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తరగతులు ప్రారంభమై 25 రోజులు దాటినా ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. పాత పుస్తకాలతోనే కాలం వెల్లదీస్తోంది. ఆలస్యం అవుతుండడంతో చదువులో వెనుకబడిపోతున్నామని వాపోయింది. జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న బాలికలందరిదీ ఇదే పరిస్థితి.దహెగాంలోని కేజీబీవీలో బోధిస్తున్న అధ్యాపకురాలు(ఫైల్)దహెగాం(సిర్పూర్): చదువు మధ్యలో ఆపిన బాలికలు నష్టపోవద్దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) ఏర్పాటు చేసింది. పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రైవేట్ కళాశాలలకు వెళ్లలేని వారి కోసం ప్రభుత్వం విడతల వారీగా ఇంటర్ తరగతులు సైతం ప్రారంభిస్తున్నారు. అయితే కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు నేటికీ పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై 25 రోజులు దాటడంతో బాలికలు పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నారు. 13 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు జిల్లాలో మొత్తం 15 కస్తూరిబా విద్యాలయాలు ఉండగా, 13 చోట్ల కళాశాలలు కొనసాగుతున్నాయి. పెంచికల్పేట్, కౌటాల కేజీబీవీల్లో ఇంకా ఇంటర్ అందుబాటులోకి రాలేదు. జూన్ 12 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నేటికీ ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 623 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరంలో 547 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు నష్టపోకుండా పాత పుస్తకాలతోనే పాఠాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బాలికలు పాత పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నారు. అయితే పాత పుస్తకాలు ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ కాలేజీలకు సరఫరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభమై నెల రోజులు కావొస్తోంది. జూన్ 1 నుంచే వీరికి తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఫస్టియర్లో 1,577 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,535 మంది చదువుకుంటున్నారు. వీరందరికి గత నెలలోనే పాఠ్య పుస్తకాలు అందించారు. తరగతులు సైతం కొనసాగుతున్నాయి. -
● కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ సూచనతో ప్రారంభం ● ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరణకు సిబ్బంది నియామకం ● ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు
ఆసిఫాబాద్: భూసమస్యలు పరిష్కరించాలని, గ్రామానికి రోడ్డు వేయాలని, పింఛన్ మంజూరు చేయాలని, ఉపాధి చూపి ఆదుకోవాలని.. ఇలా అనేక సమస్యలతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి బాధితులు ప్రతీ సోమవారం కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. అధికారులకు బాధలు చెప్పుకుని పరిష్కారించాలని వేడుకుంటున్నారు. ప్రజల సౌకర్యార్థం ఇక నుంచి సోమవారం మాత్రమే కాకుండా ప్రతీ రోజు దరఖాస్తులు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జీ– 3లో దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ సెల్ ప్రారంభించారు. ఇన్చార్జి మంత్రి సూచనతో.. ప్రతీ సోమవారం కలెక్టరేట్తోపాటు కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వారానికి సగటున వందకు పైగా అర్జీలు వస్తున్నాయి. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతీరోజు దరఖాస్తులు స్వీకరించేలా కలెక్టరేట్లలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనలకు అనుగుణంగా ఆసిఫాబాద్లోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఈ నెల 8న అధికారులతో కలిసి ‘ప్రతి దినం ప్రజల కోసం కలెక్టర్ గ్రీవెన్స్’ పేరుతో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఇద్దరు సిబ్బందిని నియమించారు. కార్యాలయ పని వేళల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. పనివేళల్లో స్వీకరణ కలెక్టరేట్లో ఇక నుంచి పనిరోజుల్లో ఎప్పుడైనా ప్రజలు అర్జీలు సమర్పించవచ్చు. కలెక్టర్ అందుబాటులో ఉంటే నేరుగా ఆయనకే బాధలు చెప్పుకోవచ్చు. లేనిపక్షంలో గ్రీవెన్స్ సెల్లో సిబ్బంది దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వాటిని ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపిస్తారు. మంగళవారం రెండు దరఖాస్తులు రాగా, వాటిని ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత మండలాలకు పరిష్కారం కోసం పంపించారు. జవాబుదారీతనం పెరగడంతోపాటు సమస్యల పరిష్కారంలో పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంప్రజల సౌకర్యం కోసమే జిల్లా కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కొంతమందికి అనుకూలంగా లేకపోవడంతో నిత్యం దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేశాం. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకే ఈ కేంద్రం ప్రారంభించాం. దరఖాస్తులు పరిష్కార స్థితి ఏ స్టేజీలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇది కొత్త ఆలోచన విధానం. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశ్ దోత్రే, కలెక్టర్ ఏడాదిలో 2,244 దరఖాస్తులుప్రత్యేక జిల్లాగా మారిన తర్వాత ప్రజలకు పాలన చేరువైంది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో సుమారు వందకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో మొత్తం 2,244 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,517 దరఖాస్తులు పరిష్కరించగా, 625 పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన 102 అర్జీలను పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించారు. గ్రీవెన్స్లో అధికంగా వ్యవసాయ సంబంధిత సమస్యలే ఉంటున్నాయి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లుతోపాటు వివిధ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. -
కదం తొక్కిన కార్మిక లోకం
● జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతంఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ చౌక్ వద్ద మహాధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులు హరించి వేయడంతోపాటు సంఘాలను సైతం అణచివేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పదేళ్లలో కార్మికులు మరింత కష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, నాయకులు కమలాకర్, అశోక్, పిడుగు శంకర్, ఆత్మకూరి చిరంజీవి, సుధాకర్, సారిక, దుర్గం దినకర్, మాలశ్రీ, కార్తీక్, రాజు, దివాకర్, కొమురక్క తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను పునరుద్దరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంలోని బాలభారతి పాఠశాల నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్లతో కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్.త్రివేణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్కుమార్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, నాయకులు నగరం పద్మ, శంకర్, సంజీవ్, వివిధ వర్గాల కార్మికులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో సక్సెస్ రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన కార్మికులెవ్వరూ విధులకు హాజరు కాలేదు. కైరిగూడ ఓసీపీతోపాటు వివిధ డిపార్టుమెంట్లు వెలవెలబోయాయి. ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోగా రవాణా కూడా ఆగిపోయింది. మొదటిషిఫ్టు నుంచి నైట్ షిఫ్టు వరకు మూడు షిఫ్టులో కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో ఏరియా సుమారు 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని కోల్పోవాల్సి వచ్చింది. సింగరేణి అధికారుల అంచనా ప్రకారం.. సమ్మె ప్రభావంతో ఏరియాలో 8 వేల టన్నుల ఉత్పత్తి నష్టం సంభవించగా.. ఉత్పత్తి పరంగా ఏరియా రూ.84.5లక్షల వరకు నష్టపోయినట్లు అంచనా వేశారు. ఏరియాలో సుమారు 800 మంది కార్మికులు పనిచేస్తుండగా.. వారు రూ.38లక్షల వరకు జీతాల రూపంలో నష్టపోయారు. సమ్మె విజయవంతం కావడంపై ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. -
పీహెచ్సీలో ప్రసవ వేదన
వేమనపల్లి: పురిటినొప్పులతో వేమనపల్లి పీహెచ్సీకి వెళ్తే గర్భిణీకి వైద్యం కరువైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా నర్సయ్యపల్లికి చెందిన కొండగొర్ల సోనియా కాన్పు కోసం మూడు నెలల క్రితం వేమనపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. పీహెచ్సీ వైద్యంపై నమ్మకం లేక మంచిర్యాల, చెన్నూర్ ప్రైవేట్ వైద్యుల వద్ద వైద్యపరీక్షలు చేయించుకుంటోంది. ఈ నెల 17వ తేదీన ప్రసవానికి సమయం ఇచ్చారు. కాగా బుధవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో వేమనపల్లి పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఏ ఒక్క సిబ్బంది అందుబాటులో లేరు. గత్యంతరం లేక పీహెచ్సీలోని బెడ్పై పడుకోబెట్టగా తీవ్రమైన నొప్పులతో విలవిలలాడింది. పీహెచ్సీలోనే గంటసేపు వేచి చూశారు. కొంతసేపటికి గ్రామంలోనే ఉన్న కాంటిజెంట్ వర్కర్ నిర్మల వచ్చారు. వైద్యాధికారి రాజేశ్కు సోనియా అన్నయ్య రజినీకాంత్ ఫోన్ చేసినా స్పందించలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని 108 అంబులెన్స్లో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నట్లు భర్త స్వామి, తల్లి గౌరక్కలు తెలిపారు. -
వసతిగృహాల్లో శుభ్రత పాటించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): వసతిగృహాల్లో శుభ్రత పాటించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని వసతి గృహాలు, గిరిజన పాఠశాలలు, లింబుగూడలోని మల్టీపర్పస్ సెంటర్, మండల ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీవో మాట్లాడుతూ నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం రావాలన్నారు. మండల ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుడు వినయ్ ఉప్రేను ఆదేశించారు. మల్టీ పర్పస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెయింటింగ్, మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వారి వెంట డీటీడీవో రమాదేవి, వివిధ శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
రెబ్బెన: ఇటీవల ట్రాక్టర్ బోల్తాపడి పులికుంట గ్రామానికి చెందిన దుర్గం మారుతి మృతి చెందగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం పులికుంట వద్ద జాతీయ రహదారిపై మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ట్రాక్టర్ యజమాని మృతుడి కుటుంబానికి రూ. 5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ యజమాని వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. సుమారు 45 నిమిషాల పాటు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు విషయాన్ని ఏఎస్పీ చిత్తరంజన్ దృష్టికి తీసుకెళ్లగా హుటాహుటిన ఆయన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గురువారం ట్రాక్టర్ యజమానిని పిలిపించి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో రాస్తారోకో విరమించారు. -
ట్రిపుల్ఐటీలో ముగిసిన కౌన్సెలింగ్
భైంసా: ట్రిపుల్ఐటీ బాసర, మహబూబ్నగర్ సెంటర్లకు 2025 –26 విద్యా సంవత్సరానికి గాను తొలివిడత కౌన్సెలింగ్ బుధవారం ముగిసింది. మూడవ రోజు ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్లు కౌన్సెలింగ్ ప్రారంభించారు. రెండు సెంటర్లలో కలిపి 1690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మూడు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్లో 1472 మంది విద్యార్థులు హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలోనే వెయిటింగ్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని క్యాంపస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ బాసర క్యాంపస్ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్బాల్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులపాటు జరుగనున్న పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు మరలకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. సరైన మార్గంలో జీవనం సాగించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచింగ్ క్యాంప్ రామకృష్ణాపూర్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, గణపతి తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు లీగ్ పోటీలు.. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల కోసం స్టేడియంలో రెండు గ్రౌండ్లు సిద్ధం చేశారు. మొదటిరోజు గ్రౌండ్ నంబర్ 1లో నిజామాబాద్ –సిద్దిపేట జట్లు తలపడగా నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జట్లు పోటీ పడగా మహబూబ్నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ మధ్య జరిగిన లీగ్లో ఆదిలాబాద్ గెలుపొందాయి. రెండో గ్రౌండ్లో మెదక్ –గద్వాల్ జట్లు తలపడగా గద్వాల్, కరీంనగర్ –నల్గొండ జట్ల మధ్య జరిగిన లీగ్లో నల్గొండ జట్లు గెలుపొందాయి. -
ప్రాజెక్టులో యువకుడి మృతదేహం లభ్యం
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వచ్చి గల్లంతైన యువకుడి మృత దేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన అడ్డెల రఘు(24) తన స్నేహితుడితో కలిసి సరదాగా ప్రాజెక్టు వద్దకు మంగళవారం చేపలు పట్టడానికి వచ్చారు. చేపలు పట్టే క్రమంలో ప్రాజెక్టు గేట్ల సమీపంలో రఘు ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. తన స్నేహితుడు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నీటిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి సోదరుడు అజయ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. బాధితుడికి నష్టపరిహారం అందజేతకాసిపేట: మండలంలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన రైతు బుద్దె రాజలింగుకు చెందిన లేగదూడ పెద్దపులి దాడిలో మృతి చెందగా బాధితుడికి అటవీశాఖ ఆధ్వర్యంలో 24గంటల్లో నష్టపరిహారం అందజేశారు. ముత్యంపల్లి సెక్షన్ పరిధి మల్కేపల్లి బీట్లో మంగళవారం పెద్దపులి దాడిలో లేగదూడ మృతి చెందగా బుధవారం బాధిత రైతుకు బెల్లంపల్లి రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి పూర్ణచందర్ రూ. 20వేల నష్టపరిహారం అందజేశారు. డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్నాయక్, ఎఫ్బీవో శ్రీధర్ పాల్గొన్నారు. కోడి పందేల స్థావరంపై దాడిజైపూర్: మండలంలోని దుబ్బపల్లి గ్రామ శివారులో బుధవారం కొంతమంది వ్యక్తులు కోడి పందేలు ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మాట్లాడుతూ కోడి పందెం ఆడుతున్న సీసీసీ, నస్పూర్కు చెందిన గడ్డం సతీశ్, లక్షెట్టిపేట కుమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేశ్, శ్రీరాంపూర్ తీగలపహాడ్కు చెందిన కట్కూరి రాజేశ్లను పట్టుకోగా ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్, యతిరాజు వంశీ, మహేశ్, వైద్య గణేశ్లు, టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్, గోదావరిఖనికి చెందిన పాకి సందీప్, నస్పూర్కు చెందిర రంగు సాయి, అరుణక్కనగర్కు చెందిన ఉదయ్లు పోలీసులను చూసి పారిపోయినట్లుగా తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద ఒక్క కోడి, 31కోడి కత్తులు, రూ.3840లు, మూడు సెల్ ఫోన్లు, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. చెన్నూర్ ఎంఈవోపై విచారణచెన్నూర్: మండల విద్యాధికారి కొమ్మెర రాధాకృష్ణమూర్తిపై డీటీఎఫ్ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.లలిత బుధవారం విచారణ చేపట్టారు. ఎంఈవో విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఉపాధ్యాయుల సర్వీసు బుక్ రికార్డు పూర్తి చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విచారణ నివేదిక డీఈవోకు నివేదించనున్నట్లు లలిత తెలిపారు. -
దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
కుభీర్: దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి దొంతుల పుష్ప అనే మహిళ నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భైంసా వెళ్లేందుకు దొంతుల పుష్ప అనే మహిళ మండల కేంద్రంలోని బస్టాండ్కు వచ్చారు. అక్కడ ఆమెకు ఒక పర్సు దొరికింది. అందులో రూ.24,416ల నగదు, వెండి కాళ్లగజ్జలు (ఒక జత), ఇద్దరు మహిళలు, ఒక పిల్లడి ఫొటోలు ఉన్నాయి. ఒక ఫొటోపై యువతి పేరు కవిత అని రాసి ఉంది. కాగా దొంతుల పుష్ప దొరికిన పర్సును తన భర్త దత్రాత్రితో పోలీస్స్టేషన్కు పంపించి తన నిజాయితీ చాటుకున్నారు. భర్త పర్సును ఎస్సై కృష్ణారెడ్డికి అప్పగించారు. డబ్బు పోగొట్టుకున్న వారు సరైన ఆధారాలు చూపి డబ్బు తీసుకుపోవచ్చని ఎస్సై తెలిపారు. -
ఇసుక లారీ పట్టివేత
బోథ్: మండల కేంద్రంలో ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర రావు, ఎస్సై ప్రవీణ్ కుమార్లు తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా సోఫీనగర్ నుంచి ఇసుక లారీ అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా బుధవారం మండల కేంద్రానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మాజీద్ అనే వ్యక్తి మండల కేంద్రానికి చెందిన ఇజాజ్ అనే వ్యక్తికి 40 టన్నుల ఇసుక తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. -
జలదిగ్బంధంలో కామాయి గ్రామం
సాత్నాల: భోరజ్ మండలంలోని కామాయి గ్రామానికి చిరుజల్లులు పడితేనే రాకపోకలు నిలిచిపోతున్నాయి. గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. పెన్ గంగ నది పరీవాహక ప్రాంతంలో ఉండే ఈ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రహదారిపై లోలెవల్ వంతెన ఉండటంతో చిన్నవర్షానికే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుంది. కుడి వైపున పెన్గంగా, ఎడమవైపు లో లెవల్ వంతెనపై వరదనీరు పొంగిపొర్లడంతో బుధవారం సాయంత్రం వరకు గ్రామస్తులు జలదిగ్బంధంలో కూరుకుపోయారు. సాయంత్రం 7 గంటల తర్వాత బ్రిడ్జిపైన వరద నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బాధితుడి నిర్వాకంతో అధికారుల హైరానా
కై లాస్నగర్: కలెక్టర్ను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి కలెక్టరేట్లో మూర్చ పేరిట కిందపడిపోయి అధికారులు హైరానా పడేలా చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇచ్చోడ మండలం గెర్జాం గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తి తన భూ సమస్యను కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చాడు. తహసీల్దార్ చాంబర్లోకి వెళ్లి మూర్చపోయినట్లు కిందపడ్డారు. దీంతో తహసీల్దార్ శ్రీనివాస్తో పాటు కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆర్డీవో వినోద్కుమార్ సైతం అక్కడి చేరుకున్నారు. బాధితుడు పడిపోయి ఉండడంతో వివరాలు ఆరా తీశారు. ఆ సమయంలోనే చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. దీంతో కార్యాలయ సిబ్బంది 108 అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. కాగా తన భూమిని కొందరు కబ్జా చేయగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మూర్చపోయినట్లు నాటకాలు ఆడినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
సమస్య గుర్తింపు ఇక ఈజీ
● విద్యుత్ లైన్లపై లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు ● సమస్య గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు కొత్త విధానం ● అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు ● త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. కడెం: అటవీ ప్రాంతాల్లో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతుంటాయి. వానాకాలంలో ఈదురుగాలులు సంభవించినప్పుడు విద్యుత్లైన్పై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ సమస్య ఏర్పడినపుడు సమస్యను గుర్తించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్శాఖ సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తుంటారు. అంతవరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతారు. ఇక నుంచి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయానికి చెక్ పడనుంది. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్శాఖ అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా లైన్ఫాల్ట్ కండక్టర్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 12 చోట్ల ఏర్పాటు.. విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పరిష్కరించేలా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు విద్యుత్ సరఫరా అందించే విద్యుత్లైన్లపై అటవీ ప్రాంతాల్లో లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశారు. కడెం, పెంబి మండలాల్లోని 33 కేవీ లైన్పై ఆరుచోట్ల, కడెం మండలంలోని అల్లంపల్లి, ఉడుంపూర్, ఖానాపూర్ మండలంలోని రాజురా 11 కేవీ విద్యుత్లైన్లపై సైతం వీటిని ఏర్పాటు చేశారు. లైన్ఫాల్ట్ కండక్టర్ల ద్వారా విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైవిద్యుత్ సమస్య తలెత్తిన ప్రాంతానికి వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. పని తీరు ఇలా.. విద్యుత్ సరఫరా నిలిచిపోగానే వైర్లకు ఉన్న మూడు కండక్టర్లు ఎరుపు రంగులో మెరుస్తుంటాయి. లైన్ఫాల్ట్ కండక్టర్ల వద్ద విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం ద్వారా లైన్మెన్, ఏఈఈ, డీఈఈ, ఎస్ఈ వరకు అంతరాయం సమాచారం అందజేస్తుంది. ఇందుకు సోలార్ సిస్టంలో సిమ్ వేసి ఉంచుతారు. అందులో సేవ్ చేసిన నంబర్లకు సమాచారం వెళ్తుంది. దీంతో పాటు విద్యుత్ లైన్కు ఎంత దూరంలో సమస్య ఉందని సమాచారం తెలిపే సిస్టం కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి సేవలు అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు పలుచోట్ల విద్యుత్లైన్లకు లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశాం. త్వరలోనే వీటి పూర్తిస్థాయి సేవలు అందుబుటులోకి వస్తాయి. – ఎం.రాంసింగ్, ఏఈఈ -
సమస్య పరిష్కరించాలని రైతు ఆత్మహత్యాయత్నం
లక్ష్మణచాంద: తన భూ సమస్య పరిష్కరించడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణచాందకు చెందిన రైతు పసుపుల గంగాధర్కు 10 గుంటల భూమి ఉంది. దానికి పట్టాపాస్ బుక్ ఉండడంతో పాటు ఏటా వివిధ ప్రభుత్వ పథకాలు కూడా పొందుతున్నాడు. అయితే ఆ భూమిని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తనదిగా చెబుతూ సాగు చేసుకుంటున్నాడు. తన భూమిని తనకు చూపాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. మనస్తాపం చెందిన గంగాధర్ బుధవారం మధ్యాహ్న సమయంలో తహసీల్ధార్ కార్యాలయం వద్దకు వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా గమనించిన రైతులు, అధికారులు అడ్డుకొని మందు డబ్బా లాక్కున్నారు. అనంతరం తహసీల్దార్ సరిత రైతుతో మాట్లాడారు. దీనిపై సాక్షి తహసీల్దార్ సరితను వివరణ కోరగా రైతు ఫిర్యాదుతో గతంలోనే సర్వేయర్ వెళ్లి పంచనామా నిర్వహించారన్నారు. దానికి రైతు సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో డీఐకి, ఏడీ నిర్మల్కు చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు ఫిర్యాదు పంపుతున్నట్లు తెలిపారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు రోగులకు తెలిసీతెలియని వైద్యం అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రథమ చికిత్స మా త్రమే అందించాలనే, ఇతర కేసులను ప్రభు త్వ ఆస్పత్రులకు రెఫర్ చేయాలని సూచించా రు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎ లాంటి చికిత్స చేయొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కొరత లేదు
యూరియా● జిల్లాలో 6,400 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది ● రైతులెవరూ ఆందోళన చెందొద్దు ● నెలాఖరు వరకు సరిపడా నిల్వలు ● మోతాదుకు మించి వినియోగించొద్దని సూచన ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఏవో రావూరి శ్రీనివాసరావు వెల్లడిసాక్షి, ఆసిఫాబాద్: ‘వానాకాలంలో జిల్లాలోని రైతులు ప్రధానంగా పత్తి, సోయా, కంది, వరి పంటలు సాగు చేస్తున్నారు. యాసంగిలో మొక్కజొన్న, జొన్న పంటలు పండిస్తున్నారు. పంటల్లో అధిక దిగుబడి సాధించాలని, మొక్కలు ఏపుగా పెరగాలనే ఉద్దేశంలో రైతులు యూరియాను విచక్షణారహితంగా వినియోగించడంతో నేల పాడవడమే కాక.. పర్యావరణానికి హాని కలుగుతోంది. ఇది ధరిత్రికి, రైతులకు మంచిది కాదు. ప్రస్తుతం జిల్లాలో యూరియా కొరత లేదు. అధికంగా యూరియా వాడితేనే పంట ఏపుగా పెరుగుతుందనే అపోహాతో ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నారు. అయినా ఈ నెలాఖరు వరకు సరిపడా ని ల్వలు ఉన్నాయి.’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) రావూరి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లా రైతులు వానాకాలంలో ఏ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు? పంటల సాగు అంచనా ఎంత?డీఏవో: జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని 4.45 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని అంచనా వేశాం. ఇందులో ప్రధానంగా పత్తి 3.35 లక్షల ఎకరాలు, వరి 55 వేలు, కంది 32 వేలు, పెసర, సోయా, ఇతర హార్టికల్చర్ పంటలు మరో 23వేల వరకు ఉంటాయి. సాక్షి: యూరియా కొరతతో జిల్లాలో రైతులు బ్లాక్లో ఎరువులు కొనాల్సిన పరిస్థితులు ఉంటు న్నాయి? నిజంగా జిల్లాలో కొరత ఉందా? డీఏవో: జిల్లాలో పంట సాగుకు అనుగుణంగా 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 45 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 20 వేల మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరమవుతుందనే అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అలాగే కాంప్లెక్స్ 18 వేలు మె.టన్నులు, పొటాష్ 230 మెట్రిక్ టన్నులు దిగుమతి అయ్యింది. సాక్షి: గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఎరువులు పంపుతోంది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? డీఏవో: కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం, నేల ఆరోగ్యం కాపాడాలనే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే యోచన చేస్తోంది. గతంలో ఒకేసారి ఎరువులు దిగుమతి అయ్యేవి. రైతులు యూరియాను మోతాదుకు మించి వినియోగించడం అలవాటు చేసుకున్నారు. దీనిని గమనించిన కేంద్రం.. ఇప్పుడు నెలవారీగా రైతులకు సరిపడా మాత్రమే ఎరువులను రాష్ట్రాలకు పంపిస్తోంది. సాక్షి: ఇప్పటివరకు జిల్లాలో ఎంత యూరియా నిల్వ ఉంది? ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు ఎంత అవసరం పడుతుంది? డీఏవో: జిల్లాలో 6400 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. ఇది ఈ నెలాఖరు వరకు సరిపోతుంది. ఆగస్టుకు సంబంధించి 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఇండెంట్ను సర్కారుకు పంపించాం. సెప్టెంబర్కు సంబంధిచిన ఎరువులు ఆగస్టు నెలాఖరున వస్తాయి. సాక్షి: మోతాదుకు మించి యూరియా వాడితే జరిగే నష్టమేంటి? డీఏవో: రైతులు విత్తనం వేసిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు వినియోగించాలి. అంతేకానీ మొక్క వచ్చాక కూడా వాటిని వినియోగించరాదు. ఒక ఎకరానికి 90 కేజీల నుంచి 120 కేజీల వరకు వినియోగిస్తే సరిపోతుంది. కానీ జిల్లాలో ఎకరాకు రెండు, మూడు బస్తాలు వినియోగిస్తున్నారు. దీంతో నేల ఆరోగ్యం పాడవడమే కాకుండా చీడపీడల ఉధృతి పెరుగుతుంది. ఫలితంగా ఆశించిన దిగుబడులు రాకపోవచ్చు. సాక్షి: నానో యూరియా ఎప్పుడు వినియోగించాలి? దాని వల్ల ఉపయోగాలేంటి? డీఏవో: యూరియాకు బదులుగా రెండో దఫాలో నానో యూరియా స్ప్రేను రైతులు వినియోగించాలి. ఎకరాకు అర లీటరు చొప్పున వాడాలి. రెండు విడతలు వాడితే సరిపోతుంది. దీని వల్ల భూసారం దెబ్బతినదు. సాక్షి: జిల్లా చాలామంది రైతులు కాంప్లెక్స్, పొటాష్ వినియోగించడం లేదు? ఎందుకు? డీఏవో: వాస్తవానికి యూరియాతోపాటు పంటలకు పొటాష్, భాస్వరం ఇతర కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉంటుంది. పొటాష్ తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల మొక్క ధృడంగా పెరుగుతుంది. అయితే వీటి ధర ఎక్కువగా ఉండటంతో రైతులు పెద్దగా మొగ్గు చూపడం లేదు. -
వైఎస్సార్ ఆశయాలు నెరవేరుస్తాం
ఆసిఫాబాద్అర్బన్: బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్యాంనాయక్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలను వైఎస్సార్ అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆయన కలలను నిజం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాపర్తి మురళి, నిజాం, లచ్చన్న, వినోద్, విశ్వనాథ్, బాలేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర వసతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు. సబ్జెక్టుల వారీగా అర్థమయ్యేలా బోధించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో దోమల వ్యాప్తిని అడ్డుకుని, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాల పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వంటగది, స్టోర్రూం, మరుగుదొడ్లు నిత్యం శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం పదో తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. -
కలెక్టరేట్లో ప్రతిరోజూ ప్రజావాణి
● గ్రీవెన్స్ సెల్ ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో ప్రతీ సోమవారం ని ర్వహించే ప్రజావాణితోపాటు ఇక నుంచి ప్రతి రో జూ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని జీ– 3లో ఏర్పాటు చేసి న గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ను అదనపు కలెక్టర్లు దీప క్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడు తూ ప్రతిరోజూ గ్రీవెన్స్ సెల్లో సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. గ్రీవెన్స్సెల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు. రెండు దరఖాస్తులు రాగా, ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత మండలాలకు పరిష్కారం కోసం పంపించారు. కలెక్టరేట్ ఏవో కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఇందిర గిరిజల వికాసం’ అమలుకు కమిటీలుఆసిఫాబాద్: జిల్లాలో ఇందిర గిరి జలవికాసం పథకం అమలు కోసం మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ ఎఫ్డీవో సుశాంత్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిర సౌర గిరిజల వికాసం పథకం మొదటి విడతలో పోడు పట్టా భూములకు సాగునీరు అందించేందు కు బోర్లు, వ్యవసాయ బావులు మంజూరు చేసి, సౌ ర విద్యుత్ అందించనున్నట్లు వివరించారు. రెండున్నర ఎకరాలు కలిగిన రైతులకు బోరు సౌకర్యం, రెండున్నర ఎకరాల లోపు రైతులుంటే ఇద్దరికి కలిపి బోర్లు, బావి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐదు విడతలుగా కార్యక్రమం ఉంటుందని, అటవీశాఖ నుంచి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. అనంతరం సంక్షేమ, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, డీఏవో శ్రీనివాసరావు, జిల్లా ఉ ద్యానవన శాఖ అధికారి నదీమ్, మిషన్ భగీరథ ఈ ఈ సిద్దిక్, ట్రాన్స్కో ఎస్ఈ శేషారావు పాల్గొన్నారు. -
చిన్నారుల మోములో చిరునవ్వులు
● కొనసాగుతున్న ‘ఆపరేషన్ ముస్కాన్– 11’ ● ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో రెండు బృందాలు ఏర్పాటు ● బాలకార్మికుల గుర్తింపు కోసం విస్తృతంగా తనిఖీలు ● గతేడాది 61 మంది చిన్నారులకు విముక్తి పెంచికల్పేట్(సిర్పూర్): పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి న బాలలు రెక్కల కష్టం చేస్తున్నారు. పుస్తకాలు, ఆటలతో గడవాల్సిన బాల్యం పరిశ్రమలు, వ్యాపా ర సముదాయాల్లో బందీగా మారుతోంది. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించే దిశగా, బందీలుగా మారిన చిన్నారుల మోములో చిరునవ్వులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ – 11 కార్యక్రమం జూలై 1 నుంచి 31 వరకు కొనసాగనుంది. నెల రోజులపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల పరిధిలో తనిఖీలు చేపట్టేందుకు రెండు బృందాలు ఏర్పాటు చేశారు. బాలకార్మికుల స్థావరాలుగా నిలిచే పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో దాడులు నిర్వహించనున్నారు. గతేడాది ఆపరేషన్ ముస్కాన్– 10లో భాగంగా జిల్లావ్యాప్తంగా తనిఖీ లు నిర్వహించి 61 మంది చిన్నారులను గుర్తించా రు. వీరిలో 48 బాలకార్మికులు మంది ఉండగా.. బాల్య వివాహం జరిగిన ఒకరు, బడిమానేసిన పిల్ల లు 12 మంది ఉన్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి పిల్లలను వారికి అప్పగించారు. అలాగే 2022 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో మొత్తం 143 మందికి విముక్తి కల్పించారు. విస్తృతంగా తనిఖీలుజిల్లాలో 335 గ్రామ పంచాయితీలు ఉండగా, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగజ్నగర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. పోలీసు అధికారులు, శిశుసంరక్షణ, కార్మిక, బాలల హక్కుల పరిరక్షణ సమితి, విద్యాశా ఖ సమన్వయంతో ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజ న్లలో బందీలుగా ఉన్న బాలలను గుర్తించడానికి రెండు బృందాలు ఏర్పాటు చేశారు. కాగజ్నగర్ డివిజన్ బృందంలో ఎస్సై యాదగిరి, ఆసిఫాబాద్ డివిజన్ బృందంలో ఎస్సై చంద్రశేఖర్రావుతో పాటు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్, కార్మిక శాఖ నుంచి ఒకరి ని సభ్యులుగా నియమించారు. వీరు తప్పిపోయిన పిల్లలు, అనాథలు, వీధి బాలలను గుర్తిస్తారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, దాబాలు, మిల్లులు, ఇటుక బట్టీల్లో పనిచేసున్న పిల్లలకు విముక్తి కల్పిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అనాథ బాలికలను జిల్లా కేంద్రంలోని వసతి గృహాలకు తరలించి ఉచితంగా విద్య, వైద్యం, భోజన వసతి కల్పించనున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ వంటి పట్టణాలకు జిల్లా నుంచి వెళ్లి అనేకమంది రైసు మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అధికారులు వీరిపైనా దృష్టి సారించి పనుల్లో ఉన్న చేరిన చిన్నారులను గుర్తించాల్సి ఉంది. మరోవైపు జిల్లాలో ఇటీవల మానవ అక్రమ రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాలికలు, యువతులను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బాలికల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. బాలలను పనిలో పెట్టుకుంటే కేసులు బాలలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించింది. వారి హక్కులను కాలరాస్తూ పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. బడీడు పి ల్లలందరినీ తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు పంపించాలి. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేస్తాం. బాలకార్మికులను గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 నంబర్లకు సమాచారం అందించాలి. – బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు చర్యలు
ఆసిఫాబాద్: ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా రూ.5 లక్షలతో సమకూర్చిన 4 సీట్లతో కూడిన బోటు, 50 లైఫ్ జాకెట్లు, 20 రబ్బర్ ట్యూబులు, ఒక కోత యంత్రాన్ని మంగళవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్తో కలిసి పోలీస్, అగ్నిమాపక శాఖలకు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజల రక్షణ, ఆస్తులు నష్టపోకుండా సత్వరమే రెస్క్యూ చేసేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పోలీస్, అగ్నిమాపక శాఖల్లో 15 మందితో కూడిన శిక్షణ సిబ్బంది ఉన్నారన్నారు. గతంలో విపత్తులు సంభవించినప్పుడు మంచిర్యాల నుంచి సిబ్బంది వచ్చేవారని, ఇప్పుడు జిల్లాలోనే అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
జైనూర్(ఆసిఫాబాద్): సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని జైనూర్ మండల కేంద్రంలో మంగళవారం రైతులు రోడ్కెక్కారు. ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ వానాకాలం సీజన్లో ఎరువులు చేసేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో యూరియా కొరత ఏర్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవికుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. వ్యవసాయాధికారులతో మాట్లాడి ఎరువుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
మత్తుకు బానిస కావొద్దు
కాగజ్నగర్రూరల్: యువత మత్తుకు బానిస కావొద్దని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్నగర్ మండలం బురదగూడ గ్రామంలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనకు ప్రజలు, యువత, విద్యార్థులు సహకరించాలని కోరారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల బారినపడి యువత జీవితాలు కోల్పోతున్నారన్నారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని, వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి, చెడులు వివరించి, క్రమశిక్షణ నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, రూరల్ సీఐ శ్రీనివాస్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్భయంగా సేవలు వినియోగించుకోవాలిఆసిఫాబాధ్: జిల్లా ప్రజలు నిర్భయంగా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిస్థితి, పరిష్కారానికి సూచనలు ఇచ్చా రు. ఆయన మాట్లాడుతూ ప్రజలు మూడో వ్యక్తి ప్ర మేయం లేకుండా పోలీస్ సేవలు వినియోగించుకో వాలని సూచించారు. చట్టప్రకారం సమస్యలు పరి ష్కరించేందుకు పోలీసులు పనిచేస్తారని తెలిపారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ -
కొత్తరూపు!
రహదారులకు ● ‘హామ్’ పథకం కింద జిల్లా రోడ్లకు మహర్దశ ● తొలిదశలో 308.13 కిలోమీటర్ల వరకు అభివృద్ధి ● ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఆర్అండ్బీ, పీఆర్ శాఖలు ● డీపీఆర్ రూపకల్పనకు రంగంలోకి దిగిన కన్సల్టెన్సీ సంస్థసాక్షి, ఆసిఫాబాద్: అడుగు లోతు గుంతలు.. కంకర తేలిన రహదారులు.. ఇదీ జిల్లాలోని చాలా మార్గాల్లో రోడ్ల పరిస్థితి. త్వరలో ఈ రహదారులకు మహర్దశ పట్టనుంది. ‘హామ్’(హైబ్రిడ్ యూన్యుటీ మోడ్) పథకంతో గుంతలు, కంకర తేలిన రహదారులు సరికొత్త రూపుదిద్దుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పథకంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తొలిదశలో భాగంగా 308.13 కిలోమీటర్ల పొడవైన పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. వాటికి సంబంధించిన పనులను సర్వే చేసి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) రూపకల్పన కోసం ఓ ప్రైవేట్ కన్సెల్టెన్సీ సంస్థకు సర్కారు అప్పగించినట్లు తెలుస్తోంది. సదరు డీపీఆర్ ఆధారంగా సింగిల్ లేన్ రహదారులను రెండు లేన్లు, కంకర రోడ్లను తారు రోడ్లుగా మార్చనున్నారు. ఆర్అండ్బీ రహదారులు అప్గ్రేడ్..జిల్లా పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిదశలో భాగంగా 308.13 కిలోమీటర్ల పొడవున ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లను నూతనంగా నిర్మించనున్నారు. కిలోమీటరు సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో నెలరోజుల్లో టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. జిల్లా రహదారులు, భవనాల శాఖ(ఆర్అండ్బీ) పరిధిలో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రం నుంచి మండల కేంద్రానికి, గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారులను విస్తరించనున్నారు. మూడు విభాగాల్లో ఇప్పుడున్న రహదారులను రెండు, నాలుగు లేన్లుగా అప్గ్రేడ్ చేయనున్నారు. జిల్లా పరిధిలోని 122.3 కిలోమీటర్ల పొడవున రహదారులను నవీకరించనున్నారు. ఇందులో ఉట్నూర్– ఆసిఫాబాద్ 68 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.68 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్(టి) 28.8కిలో మీటర్ల పొడవున ఉన్న రోడ్డు కోసం సుమారు రూ.29 కోట్లు, సిర్పూర్– మకోడి మార్గంలో 10.5 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.11 కోట్ల వరకు, కల్వడ– వడ్డుగూడ 15 కిలోమీటర్ల రహదారి పనులకు రూ.15 కోట్లు వ్యయం కానుంది.పంచాయతీ రోడ్ల అభివృద్ధి ఇలా..ఇక జిల్లాలో పంచాయతీరాజ్ మంచిర్యాల సర్కిల్ పరిధిలో వచ్చే రహదారుల విషయానికి వస్తే.. ఈ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. మొత్తం మూడుదశల్లో 139 రహదారులను 633.90 కిలోమీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించడానికి ప్రతిపాదించారు. తొలిదశలో భాగంగా ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గాల పరిధిలోని 34 రోడ్లకు సంబంధించి 185.83 కిలో మీటర్ల పొడవున రహదారులు నిర్మించనున్నారు. ఇందులో ప్రధానంగా వీవీపీ రోడ్డు నుంచి బహ్లాన్పూర్ వరకు 22 కిలోమీటర్ల రహదారిని నవీకరించనున్నారు. అలాగే దాంపూర్ నుంచి అర్జున్లొద్ది వయా గిన్నెధరి, గాడలపల్లి రహదారిలో 13.4 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. రెండోదశలో 44 రహదారుల్లో 224.20 కిలోమీటర్ల వరకు, ఆ తర్వాత మూడో దశలో 61 రహదారుల్లోని 223.80 కిలోమీట్లర పొడవున రోడ్లు నవీకరించనున్నారు. మూడు దశల్లో అభివృద్ధి జిల్లా పరిధిలో ‘హామ్’ పథకం కింద మొదటిదశలో 185.83 కిలోమీటర్ల పంచాయతీ రాజ్శాఖ పరిధిలోని రహదారులను అప్గ్రే డ్ చేయనున్నాం. మొత్తం మూడు దశల్లో 139 మార్గాల్లో 633.90 కిలోమీటర్ల వరకు నూతన రహదారులను నిర్మించనున్నాం. ‘హామ్’ పథకంతో జిల్లాలోని రహదారులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. – అజ్మీరా కృష్ణ, పీఆర్ ఎస్ఈ -
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
ఆసిఫాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్క రూ మొక్కలు నాటాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భా గంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సో మవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో దత్తారావు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రహదారులకు ఇరువైపులా, ప్ర భుత్వ భూములు, కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాల ని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. -
సమస్యల వెల్లువ
● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అర్జీలు స్వీకరించి బాధితులకు భరోసా కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కాగజ్నగర్ మండలం అందవెల్లికి చెందిన జెల్లా వాణి, చింతలమానెపల్లి మండలం బాబాపూర్కు చెందిన పుణ్యపురెడ్డి కవిత, ఆసిఫాబాద్ మండలం నూర్నగర్కు చెందిన ఫర్జానా బేగం వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. వితంతు పింఛన్ ఇప్పించాలని కాగజ్నగర్ మండలం చింతగూడకు చెందిన డి.శాంత విన్నవించింది. ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడలోని పోచమ్మ దేవాలయానికి వెళ్లే దారిని కొంతమంది ఆక్రమించుకున్నారని, విచారణ చేపట్టి శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. కోసిని గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక నిర్మాణ పనులు పూర్తి చేశానని, బిల్లులు ఇప్పించాలని చింతలమానెపల్లి మండలం గంగాపూర్కు చెందిన దంద్రె శ్రీధర్ కోరాడు. వంశపారపర్యంగా వచ్చిన పట్టా భూమిని కొందరు ఆక్రమించుకుని పట్టా మార్చుకున్నారని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఆసిఫాబాద్ మండలం పర్శనంబాలకు చెందిన తానుబాయి కోరింది. తనకు తెలియకుండా పట్టా భూమిని వేరే వ్యక్తులు పట్టా మార్చుకున్నారని, విచారణ చేపట్టాలని తిర్యాణి మండలం కోయతలండికి చెందిన పెట్టం రాజలింగు కోరాడు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.పెంకుటింట్లో ఉంటున్నాం నేను నిరుపేదరాలిని. పెంకుటింట్లో ఇబ్బందిగా కాలం వెల్ల దీస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు కోసం గతంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికై నా ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – దుప్ప శాంత, చింతగూడ, మం.కాగజ్నగర్ఉద్యోగం ఇప్పించాలి మా తండ్రి పైకురావును 1990లో మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగావకాశం కల్పించింది. నాకు ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం కల్పించడం లేదు. నా వయస్సు దాటిపోయి, నా కుమారుడు మేజర్ అయినప్పటికీ స్పందన లేదు. నాకుగానీ.. కుమారుడికిగానీ అర్హత ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం కల్పించి పరిహారం చెల్లించాలి. – కొట్నాక కిషన్రావు, గుందాడ, మం.వాంకిడి -
సార్వత్రిక సమ్మెకు దూరంగా ఉండాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి పరిధిలో పరిష్కరించే డిమాండ్లు లేనందున ఈ నెల 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంస్థ ఉద్యోగులు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వగా, ఈ సమ్మెలో అధికశాతం డిమాండ్లతో సింగరేణి కార్మికులకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు. సంస్థ పరిధిలో లేని సమస్యల కోసం సమ్మెకు వెళ్లడం సరికాదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తితోపాటు ఓబీ వెలికితీతలో వివిధ కారణాలతో వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. జూలై, ఆగస్టులో వర్షాల ప్రభావంతో ఓసీపీల్లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలగనుందని, వార్షిక లక్ష్య సాధనకు కార్మికులు సహకరించాలని కోరారు. సింగరేణి సంస్థలో ఒక రోజు రూ.76 కోట్ల ఉత్పత్తి జరుగుతుందని, కార్మికులు వేతనాల రూపంలో రూ.13.07 కోట్లు నష్టపోతారని ఆయన తెలిపారు. సమావేశంలో డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, డీవైపీఎం రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు
ఆసిఫాబాద్: జిల్లాలో ఈ నెల 18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఆర్డీవో దత్తారావుతో కలిసి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, సెర్ప్ ఏపీఎంలు, డీపీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించేందుకు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 8వ తేదీన ప్రతీ మండలంలో మండల సమాఖ్య సభ్యులు, 9న గ్రామ సమాఖ్య సభ్యులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే ప్రమాదబీమా, రుణబీమా వర్తింపజేస్తుందన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, సోలార్ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, చేపల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, పాల డెయిరీలను ఏర్పాటు చేస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో మహిళా శక్తి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 22 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొనుగోలు చేయగా, రూ.20 లక్షల కమీషన్ వచ్చిందని వెల్లడించారు. 446 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ.7.82 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఏకరూప దుస్తులు అందించడంలో మహిళా సంఘాల కృషి అభినందనీయమన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి వనిత, కోశాధికారి కుసుమ, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా అనిల్యాదవ్
కైలాస్నగర్: క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యే క దృష్టి సారించింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్ర ధాన కార్యదర్శులను నియమించిన టీపీసీ సీ.. తాజాగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జీలను ని యమించింది. ఉమ్మడి ఆదిలాబాద్కు రాజ్య సభ సభ్యుడు ఎం.అనిల్కుమార్ యాదవ్కు బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగి గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ కమిటీల నియామక ప్రక్రియ పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి సారించడంపై శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు అనిల్ కుమార్ ఈ వారంలోనే జిల్లా పర్యటనకు రానున్నట్లుగా సమాచారం. -
‘జీవో 282 రద్దు చేయాలి’
రెబ్బెన: వ్యాపార సముదాయాల్లో పనివేళలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 282 వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల వేతనాలు పెంచాలని ఎనిమిదేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనక్కి తగ్గి 12 గంటల పనివిధానం అమలు చేసేందుకు భయపడుతున్నాయని అన్నారు. కార్మిక సంఘాలన్ని జేఏసీగా ఏర్పడి కేంద్రంపై పోరాడుతుండగా జేఏసీలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘం కూడా ఉండి రాష్ట్రంలో కార్మికుల పనివేళలు పెంచడం సిగ్గుచేటన్నారు. దొడ్డిదారిన తీసుకువచ్చిన 282 జీవో వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో కార్మికులు శంకర్, రవి, గురుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
అందని బ్యాంకు రుణాలు
ఆసిఫాబాద్: మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా స్వయం సహా యక సంఘాలను ఏర్పాటు చేసింది. ఆయా సంఘాల కు అవసరాల మేరకు తక్కువ వడ్డీకి బ్యాంకు లింకేజీతో రుణాలు అందజేస్తోంది. కానీ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహా యక సంఘాలకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా జూన్లో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తారు. జిల్లాలో 6,295 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ ఏడాది 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.232.44 కోట్లు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణలక్ష్యం పెంచారు. ఒక్కో గ్రూప్లో 15 మంది సభ్యులు ఉండగా గ్రూప్కు రూ.15 లక్షల వరకు రుణాలు పంపిణీ చేస్తున్నారు. తీసుకున్న రుణాలను ప్రతీ నెల విడతల వారీగా చెల్లిస్తున్నారు. ఆన్లైన్లో కానరాని వివరాలుజిల్లా కేంద్రం ఆసిఫాబాద్ గతంలో గ్రామ పంచాయతీ ఉండగా రెండేళ్లక్రితం మున్సిపాలిటీగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో 12 మంది వీవోలు, 12 గ్రామ సంఘాలు, 271 స్వయం సహాయక సంఘాలు, 2,730 మంది సభ్యులు ఉన్నారు. వారంతా కొన్ని సంవత్సరాలుగా బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఆరు మాసాలుగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల వివరాలు ఆన్లైన్లో సెర్ఫ్, మెప్మా జాబితాలో చూపడంలేదు. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలకోసం ఇబ్బందులకు గురవుతున్నారు. రుణాలకోసం నిరీక్షణఆరు మాసాలుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలకోసం నిరీక్షిస్తున్నారు. ఆన్లైన్లో గ్రూపుల వివరాలు కనిపించక పోవడంతో గతనెల 30న ఆర్పీలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సెర్ఫ్, మెప్మా జాబితా లో సభ్యుల వివరాలు కనిపించక పోవడంతో వ్యవసాయ రుణాలకోసం సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకు రుణం అందించాలి ఉపాధికోసం ఏటా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నా. ఆన్లైన్లో జాబి తా కనిపించడంలేదని ఈ ఏడాది ఇప్పటి వరకు రు ణాలు ఇవ్వలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్యాంకు రుణం అందించి ఆదుకోవాలి. – జుల్లూరి శోభ, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, ఆసిఫాబాద్ సమస్య పరిష్కరిస్తాం సాంకేతిక కారణాల వల్ల ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల వివరాలు ఆన్లైన్లో రావడం లేదు. త్వరలో సమస్య పరిష్కరించి, రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం.– రామకృష్ణ, డీఆర్డీఏ అదనపు పీడీ పోర్టల్లో కానరాని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సంఘాల వివరాలు ఆరు మాసాలుగా సభ్యుల నిరీక్షణ -
యువవిలాపం
తిర్యాణి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు నెలల క్రితం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకుని రూ.4 లక్షల వరకు వివిధ రకా ల యూనిట్ల కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూ డిన రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ. 50 వేల యూనిట్కు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం 70 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 29,756 దరఖాస్తులురాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో వివిధ వ ర్గాలకు చెందిన నిరుద్యోగులు 29,756 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికకోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖారా రు చేశారు. దీంతో పాటుగా అధికారులు దరఖాస్తుదారులకు సంబంధింత బ్యాంకు సిబ్బందితో కలిసి ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. దీంతో లబ్ధి దారుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇందుకు అనుగుణంగానే ఈ పథకాన్ని జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభిస్తామని ప్ర భుత్వం ప్రకటన చేసింది. కానీ నేటికీ పథకం అమలుకు నోచుకోలేదు. నెల రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి యువ వికాసం అమలుపై ఎలాంటి సృష్టత రాకపోవడంతో దరఖాస్తుదారుల్లో త్రీవ అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా? లేదా అని నిరుద్యోగులు ఆందోళ న చెందుతున్నారు. కాగా పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే సమాచారం కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికా రి, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.మండలం దరఖాస్తుదారులుఆసిఫాబాద్ 3040 బెజ్జూర్ 1788 చింతలమానెపెల్లి 1907 దహెగాం 1622 జైనూర్ 1860 కాగజ్నగర్ 5486 కెరమెరి 1761 కౌటాల 2327 లింగాపూర్ 793 పెంచికల్పేట్ 1072 రెబ్బెన 2827 సిర్పూర్(టి) 1616 సిర్పూర్(యూ) 893 తిర్యాణి 1690 వాంకిడి 1074 మొత్తం 29,756 ఇంటర్వ్యూలకే పరిమితమైన పథకం తదుపరి ప్రక్రియలు నిలిపివేత.. దరఖాస్తుదారుల్లో అసంతృప్తి ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంటర్ పూర్తి చేసిన నేను రాజీవ్ యువ వికాసం పథకంలో ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నా. జూన్ 2 నుంచే రుణాలు ఇస్తామని చెప్పారు. నేటికీ ఇవ్వలేదు. ఎవర్ని అడిగినా వివరాలు చెప్పడంలేదు. లోన్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతా. ప్రస్తుతం ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నా. – మహదేవుని పవన్, గోలేటి, రెబ్బెనమోసం చేయడం సరికాదు యువ వికాసం పేరిట రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకుండా దరఖాస్తుదారులను మోసం చేయడం సరికాదు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాలయాపన చేయకుండా వెంటనే అర్హులైన నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలి. – ఇగురపు సంజీవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి -
త్యాగధనుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ
ఆసిఫాబాద్అర్బన్: సమైఖ్య భారతావని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిదని సీనియర్ న్యాయవాది పంచదార దీపక్రావ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శ్యామప్రసాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు శ్యాంప్రసాద్ ఆశయ సాధనకు అంకిత భావంతో ముందుకు సాగాలన్నారు. ఒకేదేశం, ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఆయన ఆశయమని, అది ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే అమలు చేయడం జరిగిందన్నారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముఖర్జీ తప్పుపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వినోద్, నాయకులు ఎగ్రస్ శ్రీకాంత్, మేకర్తి కోటేశ్, రాపర్తి పోశన్న, వవాల్కర్ పెంటన్న, తదితరులు పాల్గొన్నారు. కౌటాల: కేంద్ర మాజీ మంత్రి, జన్సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. ఆదివారం కౌటాలలో ముఖర్జీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్సంఘ్ స్థాపించి ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, మండల అధ్యక్షుడు కుంచాల విజయ్, మాజీ ఎంపీటీసీ దుర్గం మోతీరాం, నాయకులు రవి, కమలాకర్, భూమయ్య, మిథున్, నాగయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు. -
క్యాప్ స్కాలర్షిప్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: ప్రతిష్టాత్మక క్యాప్ స్కాలర్షిప్ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి బెల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థి ఎంపికయ్యాడు. మహారాష్ట్ర పూణెలోని ఇర్ఫాన్ పఠా న్ క్రికెట్ అకాడమీలో ఇటీవల క్యాప్ స్కాలర్షిప్ కోసం విద్యార్థుల ఎంపిక పోటీలు జరి గాయి. బెల్లంపల్లి అశోక్నగర్ బస్తీకి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థి రెడ్డి.రిత్విక్ అండర్–14 విభాగంలో సత్తాచాటాడు. క్యాప్ స్కాలర్షిప్ కోసం నిర్వహించే తుది క్రికెట్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించాడు. రిత్విక్ మరో మూడు క్రికెట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఆ పోటీల్లో మెరుగ్గా రాణిస్తే స్కాలర్ షిప్ పొందడానికి ఎంపికవుతాడు. ఎంపికై న విద్యార్థులకు రూ.2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. -
మధ్యాహ్నం దాటితే.. వాట్సాప్ వైద్యమే!
● రిమ్స్లో కొందరు సీనియర్ వైద్యుల తీరు ● జూడాలు వాట్సాప్ చేస్తే చికిత్సను వివరిస్తున్న వైనం ● అత్యవసర వైద్యం అందక రోగుల ఇక్కట్లు ● ఇటీవల ఓ వైద్యుడిపై ఆదిలాబాద్ కలెక్టర్ చర్యలు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఇటీవల మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రిమ్స్లో తనిఖీ చేపట్టారు. ఆ వార్డులో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేడు. దీంతో కలెక్టర్ సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించిన ఏడు రోజుల వేతనంలో కోత విధించారు. ఆర్ఎంవోగా పనిచేసే ఓ వైద్యురాలిని విధుల నుంచి తప్పించాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 4న మావల మండలంలోని శంకర్గుట్టకు చెందిన లక్ష్మణ్ కాలుకు గాయం కావడంతో కుటుంబీకులు రిమ్స్కు తీసుకొచ్చారు. వైద్యులు దాదాపు గంటకు పైగా వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత జూనియర్ డాక్టర్ వచ్చి కాలు గాయం ఫొటో తీసి సీనియర్ వైద్యులకు పంపినట్లు బాధితుడి కుటుంబీకులు తెలిపారు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో రక్తస్రావం కావడంతో ఆయన మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబీకులు టూటౌన్లో వైద్యులపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఆదిలాబాద్టౌన్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్లో పనిచేస్తున్న కొందరు వైద్యుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు. ఇక్కడ విధులు నిర్వహించడం కంటే ప్రైవేట్ ప్రాక్టీస్పైనే మక్కువ చూపుతున్నారు. కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు హెచ్చరించినా పెడచెడిన పెడుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నమే ఇంటిముఖం పడుతున్నారు. అత్యవసరమైతే జూనియర్ డాక్టర్ల ద్వారా వాట్సాప్ వైద్యం అందిస్తునట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో వైద్యం అందక పలువురు రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. రిమ్స్లో పనిచేసే చాలా మంది వైద్యులు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూనియర్ వైద్యులతోనే..జిల్లాకు పెద్ద దిక్కయిన రిమ్స్ ఆస్పత్రిలో నాణ్యమై న వైద్యం గగనంగా మారింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న పేదలు వైద్యం కోసం రి మ్స్కు వస్తున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం అందక ఇబ్బందులకు గురవుతున్నారు. రిమ్స్లో సీనియర్ వైద్యులు కొందరు తరచూ విధులకు ఎగనామం పెడుతున్నారు. రూ.లక్షల్లో వేతనం తీసుకుంటున్నా వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారని పలువురు పేర్కొంటున్నా రు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో వైద్యసేవలు అందించాల్సి ఉన్నా కొంతమంది మాత్రమే సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుండగా, మిగతా వైద్యుల జాడ లేకుండా పోతుంది. మెడికో లు, జూనియర్ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, పీజీ వైద్యులే రోగులకు దిక్కవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జూనియర్ వైద్యులు సీనియర్ వై ద్యులకు వాట్సాప్ ద్వారా కేషీట్, రిపోర్టులు పంపి వైద్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వారు వాట్సాప్లో చికిత్స గురించి తెలియజేస్తే ఆ ప్రకా రం రోగికి అందిస్తున్నా రు. రాత్రి వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఫోన్ చేస్తే వచ్చి వైద్యం అందించి ఇంటిముఖం పడుతున్నారు.రిమ్స్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులు మారని తీరు..రిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంది వైద్యుల తీరులో మార్పు కానరావడం లేదు. ఒకప్పుడు వైద్యు ల కొరత ఉండగా, ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి చూస్తే అత్యవసర విభాగాలైన ఎస్ఎన్సీయూ, ఎంఐసీ యూ, మెటర్నటి, ఇతర వార్డుల్లో డాక్టర్లు కని పించకుండా పోతున్నారు. ఆ సమయంలో జూనియర్ వైద్యులు సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం పూట హాజరు కోసమే వస్తున్నారనే విధంగా మారింది. ప్రతిరోజు రిమ్స్ డైరెక్టర్తో పాటు అప్పుడప్పుడు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా డుమ్మా వైద్యుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. వైద్యులు అందుబాటులో ఉంటున్నారు.. రిమ్స్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. రోగులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపడుతున్నాం. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
ఆదివాసీ భవన్ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
కెరమెరి: మండల కేంద్రంలోని నెహ్రూనగర్ సమీపంలో ఉన్న కుమురంభీం ఆదివాసీ భవన్ను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండల కేంద్రంలో ఉన్న ఏకై క ఆదివాసీ భవన్లో పక్కా ప్రణాళికతో టైల్స్ పగులగొట్టి విద్యుత్ వైర్లను, బోర్డు, బోరు స్టార్టర్ను దొంగిలించినట్లు తెలిపారు. దుండగులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, ఆదివాసీ సీనియర్ నాయకుడు సిడాం జగన్నాథ్రావు, రాజ్గోండ్ సేవాసమితి మండలాధ్యక్షుడు పెందోర్ రాజేశ్వర్, నాయకులు సోము, సిడాం ధర్మూ, కుమురం భీంరావు, తదితరులు పాల్గొన్నారు. -
బాలికల వసతి గృహం తనిఖీ
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాన్ని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి(డీడీ)దుర్గాప్రసాద్ ఆదివారం తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది పరిసర ప్రాంతాలను కలియతిరిగారు. నిత్యావసర సరుకులు, రిజిస్టర్ పరిశీలించారు. భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహంలో బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి నిర్వహించారు. దుర్గాప్రసాద్ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రవీందర్గౌడ్, వసతిగృహ సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు. -
బస్సుకోసం గంటలకొద్దీ నిరీక్షణ
చింతలమానెపల్లి: ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతోంది. సమయపాలన పాటించని బస్సులు, వసతులు లేక ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహారాష్ట్ర సరిహద్దులో గూడెం గ్రామం ఉంది. ఆదివారం మండల కేంద్రానికి, పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు, పలువురు చిన్నారులు గూడెంలో బస్సులు నిలిపే ప్రాంతానికి చేరుకున్నారు. ఒకవైపు వర్షం మరోవైపు బస్సు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రావాల్సిన సమయానికి బస్సు రాకపోవడంతో 40 మందికి పైగా ప్రయాణికులు కొన్ని గంటలపాటు రోడ్డుపైనే వేచిఉన్నారు. గూడెంలో ప్రయాణ ప్రాంగణం నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
గిరిజనుల అభివృద్ధికి పీఎం జుగా
తిర్యాణి: గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పీఎం జుగా పథకాన్ని ప్రవేశపెట్టిందని డీటీడీవో రమాదేవి అన్నారు. శనివారం మండలంలోని దంతాన్పెల్లిలో పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులందరికీ ఆధార్కార్డు ఆప్డేట్తో పాటు నూతన కార్డు మంజురూ, బర్త్ సర్టిఫికెట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీఎం జుగాపై కళాజాత బృందం సభ్యులు నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సమావేశంలో ఎంపీడీవో మల్లేశ్, వెటర్నరీ వైద్యుడు సాగర్, ఏపీఎం శ్రీనివాస్, పీఎం జుగా మండల కోఆర్డినేటర్ వెడ్మ యశ్వంత్రావు, తదితరులు పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలితిర్యాణి: నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం దంతాన్పెల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఏడాదిలో కనీసం రెండు మొక్కలు నాటాలన్నారు. మొక్కలను విరివిరిగా పెంచడం ద్వారానే పర్యావరణ సమతుల్యం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేముల మల్లేశ్, టెక్నికల్ అసిస్టెంట్ వోడిగ సాగర్, పంచాయతీ కార్యదర్శి రాము, తదితరులు పాల్గొన్నారు. -
‘మహిళా శక్తి’ పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పంచాయతీరా జ్ ఈఈ అజ్మెర కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికా భివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రూ.5 కోట్ల ప్రత్యేక నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది అక్టోబర్ చివరిలోగా పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాలో నగదు జమచేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ గజానంద్, సంబంధిత అధికారులు ఉన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే