breaking news
Komaram Bheem
-
ప్రస్తుత పరిస్థితి..
రైల్వే స్టేషన్లో మూడు ప్లాట్ఫాంలు ఉన్నాయి. మరుగుదొడ్లు లేవు, వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉంది. అయితే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రైవేటు పార్కింగ్ స్థలాల్లో వాహనదారులు తమ వాహనాలను నిలుపుతున్నారు. అలాగే స్టేషన్కు ముందు, వెనుకవైపు నుంచి రెండు మార్గాలు ఉండగా.. మొదటి ప్లాట్ఫాంపై మాత్రమే టికెట్ కౌంటర్లు ఉన్నాయి. పట్టణం నుంచి వచ్చే ప్రయాణికులు ముందు మార్గం నుంచి వస్తుండగా దహెగాం, కాగజ్నగర్, పెంచికల్పేట్, బెజ్జూర్ మండలాలతో పాటు కాపువాడ ప్రయాణికులు వెనుకవైపు గల మార్గం నుంచి స్టేషన్కు వస్తారు. ఒకే ప్లాట్ఫాంపై టికెట్ కౌంటర్ ఉండడంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
తలసేమియా బాధితులను ఆదుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు వందమంది తలసేమియా వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ తలసేమియా బాధితులకు దివ్యాంగుల పింఛన్ అందించాలని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తాన్ని ఎక్కించడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తుల కోసం తరచూ సదరం శిబిరాలు నిర్వహించాలన్నా రు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యనందించేందుకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. జిల్లాలోని గర్భిణులకు హెచ్బీఏ 2 తలసేమియా, సికిల్సెల్ పరీక్షలు చేయాలని డిమాండ్ కోరారు. కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ నాయకులు రత్నం తిరుపతి, బాపురావు, జాడి శ్రీనివాస్, దయాకర్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
పరిశీలించి.. పరిష్కారానికి ఆదేశించి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాలకు నుంచి వచ్చిన బాధితుల బాధలు విన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్ అందించాలని ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్నగర్కు చెందిన షేక్ మున్నా కోరాడు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అటవీశాఖ నిబంధనలతో ఇబ్బంది పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని సిర్పూర్(టి) మండలం పూసిగూడ గ్రామానికి చెందిన గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్ చేయాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన దేవయ్య అర్జీ పెట్టుకున్నాడు. సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన దుర్గం నిర్మల, కాగజ్నగర్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన పర్వీన్ సుల్తానా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. సిర్పూర్(టి) మండలం పారిగాంకు చెందిన కారుబాయి తన భర్త మరణించినందున డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలని విన్నవించింది. సాగు భూమికి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని రెబ్బెన మండలం నంబాలకు చెందిన పెద్దపల్లి లక్ష్మి అర్జీ అందించింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.గుడిసెల్లో ఉంటున్నాం.. ఇళ్లు మంజూరు చేయండి ప్రస్తుతం మేమంతా కూలీ పనులు చేసుకుంటూ చిన్నచిన్న గుడిసెల్లో ఉంటున్నాం. ఇళ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయి. మాలాంటి పేదలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉండేందుకు సరైన నివాసాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదలకు అండగా నిలవాలి. – జక్కులపల్లి మహిళలు, రెబ్బెన మండలం -
నూతన భవనం నిర్మించాలని వినతి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని, నూతన భవనాన్ని నిర్మించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సోమవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు వినతిపత్రం అందించారు. హైదరాబాద్లోని సచివా లయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలి శారు. శిథిలావస్థకు చేరిన ఈఎస్ఐ ఆస్పత్రిని కూల్చి కొత్త భవనం నిర్మించాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
గిరిజనులతోనే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: గిరిజన సంక్షేమ శాఖ పరి ధిలోని బ్యాక్లాగ్ పోస్టులను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని తెలంగాణ ఆదివా సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని బ్యాక్లాగ్ ఉద్యోగాలను కొన్నేళ్లుగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నారని తెలి పారు. వీటిని ఏటా రెన్యువల్ చేస్తుండటంతో నోటిఫికేషన్ కోసం గిరిజనులకు ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, యువతకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చే శారు. కార్యక్రమంలో నైతం రాజు, సోంరాజ్, పాలక్రావు, కిరణ్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధికి గ్రీన్సిగ్నల్..!
కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకంలో కాగజ్నగర్ రైల్వేస్టేషన్కు చోటు దక్కింది. స్టేషన్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. త్వరలోనే టెండర్ల పక్రియ అనంతరం అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు సమస్యలు వివరిస్తూ రైల్వే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీనికి స్పందనగా వారు కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో చేర్చినట్లు, త్వరలోనే పనులను చేపడుతామని ఎమ్మెల్యేకు పంపిన లేఖలో వివరించారు. కనీస సౌకర్యాలు కరువుభాగ్యనగర్, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటి ఎక్స్ప్రెస్లు కాగజ్నగర్ స్టేషన్లోని మూడో ప్లాట్ఫాంకు వచ్చి తిరిగి ప్రయాణమవుతాయి. ఈ రైళ్లలో వెళ్లే ప్రయాణికులు మూడో ప్లాట్ఫాంపైకి రావాలి. కానీ అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. టికెట్కౌంటర్, ఎస్కలేటర్, మూత్రశాలలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం ఫ్లై ఓవర్ వంతెనలు మాత్రమే ఉండగా.. మెట్లు ఎక్కడానికి వృద్ధులు, పిల్లలు అపసోపాలు పడుతున్నారు. మారనున్న రూపురేఖలుఅమృత్ భారత్ కింద వచ్చే నిధులతో కాగజ్నగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఈ నిధులతో నూతన భవన నిర్మాణంతోపాటు ప్రవేశ ముఖద్వారం, ఎస్కలేటర్, లిఫ్ట్లు, బుకింగ్ కార్యాలయాలు, మూత్రశాలలు, నీటి సౌకర్యంతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. ఫ్లైఓవర్ వంతెనలు వెడల్పు చేయడంతోపాటు మూడు ప్లాట్ఫారాలకు మూడు లిఫ్ట్లు, రెండో ప్రవేశ ద్వారంలో టికెట్ కౌంటర్, వెయిటింగ్హాల్తో పాటు మూడు వాటర్ కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్ల పక్రియను పూర్తి చేసి పనులు కొనసాగిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ ప్రకటించారు.రైల్వే స్టేషన్లోని మూడో ప్లాట్ఫాం పనులు త్వరగా చేపట్టాలి కాగజ్నగర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 1 నుంచి 2, 3కు లగేజీలతో వెళ్లేందుకు వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా చేపట్టాలి. 3వ ప్లాట్ఫాంపై టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. – ఆవుల రాజ్కుమార్, కాగజ్నగర్సంతోషంగా ఉంది కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో చేర్చడం చాలా సంతోషంగా ఉంది. కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలు ఈ పథకం ద్వారా తొలగిపోతాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి. – అన్నం నాగార్జున, కాగజ్నగర్ -
నిలిచిన పత్తి కొనుగోళ్లు
ఆసిఫాబాద్: జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం ప్రైవేటు, సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో పంటను అమ్ముకోవడం ఎలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాంతాల్లో రైతులు తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు..ఈ నెల 6న జిల్లా కేంద్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లాలోని 24 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం 10 మిల్లుల్లోనే కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ క్రమంలో తేమ శాతం 8 నుంచి 12 శాతానికి పెంచాలని, పత్తి ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కోరుతున్నాయి. జిన్నింగ్ మిల్లుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొనుగోళ్లు నిలిపి వేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి అశోక్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. కాగా, కొనుగోళ్లు నిలిపివేత గురించి రైతులకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు సమాచారం అందించారు. దీంతో పంటను విక్రయించేందుకు రైతులు జిన్నింగ్ మిల్లులకు రాలేదు. ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలిఆసిఫాబాద్అర్బన్: ఎలాంటి నిబంధనలు లేకుండా సీసీఐ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని బీసీ యువజన సంఘం నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్ర ణయ్ మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎకరానికి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో ఎక్కువ మంది ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ చొరవ చూపి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మారుతి తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ఉపాధి
ఆసిఫాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూళన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో జాతీయ నిర్మాణ రంగ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన 23 మంది భవన నిర్మాణ కార్మికులకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ధ్రువపత్రాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత ఉందన్నారు. శిక్షణ ద్వారా నైపుణ్యం మెరుగుపర్చి, పనులను వేగవంతం చే యవచ్చన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, గృహనిర్మాణ శాఖ పీడీ ప్రకాశ్రావు, అధికారులు పాల్గొన్నారు. -
చిరుతల సంచారం.. భయాందోళనలో జనం
కెరమెరి/కాగజ్నగర్రూరల్: జిల్లాలో పెద్దపులులతో పాటు చిరుతల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెబ్బులి పశువులపై దాడులకు తెగబడుతూ హతమారుస్తోంది. తాజాగా సోమవారం కెరమెరి మండలం కెలి– బి, కాగజ్నగర్ మండలం కడంబా అటవీ ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం కలకలం రేపింది. మహారాష్ట్ర నుంచి కెలి–బి వైపు..కెరమెరి మండలం కెలి– బి గ్రామ సమీపంలోని చేలల్లో సోమవారం చిరుత ఓ రైతు కంటపడింది. చేను నుంచి నడుచుకుంటూ మహారాష్ట్ర వైపు వెళ్లిందని సదరు రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఎఫ్ఆర్వో మజారొద్దీ న్ సిబ్బందితో కలిసి కెలి– బి అడవులు, పత్తి చేలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్ర నుంచి తరుచూ కెరమెరి మండలంలోని పలు ప్రాంతాలకు చిరుత రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. తడోబా కారిడార్ ప్రాంతం కెరమెరికి సమీపంలో ఉండటంతో ఇటు వైపు రావడం సహజమేనని అన్నారు. రైతులు పంట పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడంబా అటవీ ప్రాంతంలో..కాగజ్నగర్ మండలంలోని కడంబా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. సోమవారం రాత్రి కాగజ్నగర్ నుంచి బెజ్జూర్కు వెళ్తున్న అయ్యప్ప స్వాములకు కడంబా గ్రామ సమీపంలోని భీమన్న ఆలయం వద్ద చిరుత పులి ఎదురైంది. కారులో వెళ్తున్న వారు సెల్ఫోన్లో చిరుత వీడియోలు, ఫొటోలు తీసే ప్రయత్నం చేసినప్పటికీ కెమెరాకు దొరకలేదు. ఇదే విషయంపై ఫారెస్ట్ రేంజ్ అధికారి అనిల్ కుమార్ను సంప్రదించగా.. కడంబా అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ఉందని స్పష్టం చేశారు. రాత్రిపూట ఆ మార్గంలో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ఏఐ ఏజ్లో ఎడ్ల బండిపై గర్భిణి!!
దహెగాం(సిర్పూర్): ఏఐ యుగంలోనూ జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేక వైద్యానికి గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వంతెన లేకపోవడంతో ఓ గర్భిణి ప్రయాణానికి ఎడ్లబండే దిక్కయింది. ఈ ఘటన దహెగాం మండలంలో చోటు చేసుకుంది. మురళీగూడకు చెందిన కుమురం వనితకు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. మురళీగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఒర్రెపై వంతెన లేకపోవడంతో వాహనం అక్కడే ఆగిపోయింది. భర్త నాగేశ్ వనితను ఎడ్లబండిపై ఎక్కించుకుని ఒర్రె దాటించాడు.అక్కడి నుంచి అంబులెన్సు ద్వారా దహెగాం పీహెచ్సీలో చేర్పించగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని.. కాస్త ఆలస్యమై ఉంటే రెండు నిండు ప్రాణాలు పోయేవని వైద్యసిబ్బంది చెబుతున్నారు. పెసరికుంట స్టేజీ నుంచి మురళీగూడ వరకు కిలోమీటరున్నర మట్టిరోడ్డు కావడంతో వర్షాకాలంలో వాహనాల రాకపోకలు సాధ్యం కాదు. వర్షాలు లేనందున వాహనాలు ఒర్రె వరకు వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. వంతెన నిర్మించి ప్రయాణ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రభుత్వం ప్రకటించిన విధంగా సోయాబీన్ క్వింటాల్కు రూ.5,328 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. జైనూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఆదివారం సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ దళారులు, వ్యాపారులను నమ్మి మోసపోకుండా రైతులకు ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హన్ను పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వందేమాతరంతో ప్రజల్లో చైతన్యం
కాగజ్నగర్టౌన్: స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో వందేమాతరం గీతం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం కాగజ్నగర్లోని రాజీవ్గాంధీ చౌరస్తా, మార్కెట్ ఏరియాల్లో సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వందేమాతరం ప్రజల్లో స్ఫూర్తి నింపిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శివకుమార్, అశోక్, అరుణ్ లోయ, అనిల్, చారి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కాగజ్నగర్లో నిఘా నేత్రాలు
కాగజ్నగర్టౌన్: ఆధునిక కాలంలో నిఘా కెమెరాలు అత్యంత కీలకంగా మారాయి. నేర అన్వేషణ, ప్రమాదాలకు సంబంధించిన వ్యవహారాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు వినియోగించుకుంటున్నారు. కాగజ్నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో ఇటీవల దొంగతనాలు, ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో పోలీసుశాఖ నిఘా పెంచుతోంది. చోరీలకు అడ్డుకట్ట వేసి నేరస్తులను సులువుగా పట్టుకునేందుకు జనసంచారం ఎక్కువ ఉండే ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓల్డ్ కాలనీ, రైల్వే కాలనీ, రాజీవ్ గాంధీ చౌరస్తా, ఎస్పీఎం క్వార్టర్స్, న్యూ కాలనీ, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, తెలంగాణ తల్లి చౌరస్తాల్లో 35 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా, మార్కెట్ ఏరియాల్లో 23 సీసీ కెమెరాలు బిగించారు. బస్టాండ్ సమీపంలో మరో 15 ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా సిబ్బందిమినీ ఇండియాగా పిలిచే కాగజ్నగర్ పట్టణం పారిశ్రామికంగా అత్యంత కీలకమైంది. వివిధ ప్రాంతాలకు చెందిన కూలీలు, వ్యాపారులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. రైల్వే, రోడ్డు మార్గాలు అనుకూలంగా ఉండటం, మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోనే ఉండటంతో నేరాల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో పోలీసు అధికారులు పట్టణంలో శాంతిభద్రతలపై దృష్టి సారించారు. మొదటి విడతగా 58 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో బిగించిన కెమెరాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఇద్దరు పోలీసు సిబ్బందిని సైతం నియమించారు. వీరు రాత్రి, పగలు నిర్వహణ బాధ్యతలు చూసుకోనున్నారు. నిరంతరం పర్యవేక్షణ రద్దీగా ఉండే మా ర్కెట్ ఏరియాలో 23 సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతాం. బస్టాండ్ ఏరియాలో మరో రెండు రోజుల్లో 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. పట్టణంలోని అన్ని ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తాం. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్నగర్ -
సర్కారు బడులకు క్రీడానిధులు
మంచిర్యాలఅర్బన్: క్రీడలు విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. విద్యార్థులకు రోజువారీ శారీరక వ్యాయామం అవసరం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులపై దృష్టి సారిస్తారు. ఆత్మవిశ్వాసం, మానసిక చురుకుదనానికి క్రీడలు దోహదం చేస్తాయి. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి తెలంగాణ సమగ్ర శిక్ష ద్వారా సర్కారు బడులకు 50 శాతం క్రీడా నిధులు మంజూరు చేసింది. ఆటలపై శిక్షణతో పాటు క్రీడాసామగ్రికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. రెండు విడతల్లో ..పాఠశాల స్థాయిలో క్రీడలకు అవసరమైన నిధులు రెండు విడతల్లో మంజూరు చేస్తారు. మొదటి విడతలో 50 శాతం నిధులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేలు, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు రూ.25 వేల చొప్పున చెల్లించనున్నారు. వాటితో షాట్పుట్, డిస్కస్త్రో, స్కిప్పింగ్, సాఫ్ట్బాల్, టెన్నిస్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, త్రోబాల్, టెన్నిస్ బాల్, తదితర ఆటవస్తువులు కొనుగోలు చేయాల్సి ఉటుంది. పాఠశాలలకు కేటాయించిన స్పోర్ట్స్ గ్రాంట్ను గైడ్లైన్స్ ప్రకారం ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇట్టి నిధులతో ఆట స్థలాలు చదును వంటి పనులు చేయించరాదనే ఆదేశాలు ఉన్నాయి. పాఠశాలల వారీగా ఆటవస్తువులు కొనుగోలు చేసి ఫొటో తీయాలనే నిబంధనలు విధించారు. గ్రాంట్ సద్వినియోగం చేసుకుని విద్యార్థులను క్రీడాపోటీల్లో ప్రోత్సహించాలని అధికారులు ఆదేశించారు. ప్రైమరీ, యూపీఎస్, ఉన్నత పాఠశాలలకు ఇలా..ఆదిలాబాద్ జిల్లాలో 404 ప్రైమరీ పాఠశాలలకు రూ.20.20 లక్షలు, 75 యూపీఎస్లకు రూ.7.50 లక్షలు, 85 హైస్కూళ్లకు రూ.21.25 లక్షలు, 15 హెచ్ఎస్ఎస్లకు రూ. 3.75 లక్షలు స్పోర్ట్స్ నిధులు కేటాయిస్తారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 313 ప్రైమరీ పాఠశాలలకు రూ.15.65 లక్షలు, 68 యూపీఎస్లకు రూ.6.80 లక్షలు, 46 హెచ్ఎస్లకు రూ.11.50 లక్షలు, 9 హెచ్ఎస్ఎస్లకు రూ.2.25 లక్షలు, నిర్మల్ జిల్లాలో 350 ప్రైమరీ పాఠశాలలకు రూ.17.50 లక్షలు, 77 యూపీఎస్లకు రూ.7.70 లక్షలు, 107 హెచ్ఎస్లకు 26.75 లక్షలు, 14 హెచ్ఎస్ఎస్లకు రూ. 3.5 లక్షలు, మంచిర్యాల జిల్లాలోని 360 ప్రైమరీ పాఠశాలలకు రూ.18.00 లక్షలు, 81 యూపీఎస్లకు రూ. 8.10 లక్షలు, 97 హెచ్ఎస్లకు రూ.24.25, 16 హెచ్ఎస్ఎస్లకు రూ.4 లక్షల క్రీడా నిధులు కేటాయించనున్నారు.ఉమ్మడి జిల్లా వారీగా నిధుల వివరాలు (రూ.లక్షల్లో) -
ఉపాధ్యాయ అర్హత.. ‘గురు’తర బాధ్యత
నిర్మల్ఖిల్లా: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధ్యాయ నియామకాలకు టెట్ అర్హత తప్పనిసరి. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత ఉండాలని సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్సీటీఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని ముద్రించింది. దీంతో బీఈడీ, డీఈడీ చేసి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీజీహెచ్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారు టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్ విడుదల..ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ల ప్రక్రియ ప్రారంభమైంది. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన నిరుద్యోగులు, ఇన్సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నెల 29వరకు గడువు ఉంది. జనవరిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. కొత్త మార్గదర్శకాలు..ఎన్సీటీఈ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతీ ఉపాధ్యాయుడికి టెట్ అర్హత ఉండాలి. టెట్ను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో టెట్ హాజరు తప్పనిసరి అవుతోంది. డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కూడా టెట్ అర్హత సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో గుబులు.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9,791 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 2012, 2017, 2024 డీఎస్సీ ద్వారా వచ్చినవారు టెట్ అర్హత సాధించి ఉన్నారు. ఇంతకు ముందు నియామకమైన ఉపాధ్యాయులు 5,590 మందికి టెట్ అర్హత లేదు. వీరంతా పరీక్షకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా ప్రమోషన్లలో వీరంతా టెట్ అర్హత లేకుండానే పదోన్నతి పొందారు. వీరంతా ఇప్పుడు టెట్ అర్హత తప్పక సాధించాలి. జిల్లాల వారీగా వివరాలు.. -
నీటి వనరుల గణనకు వేళాయె
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో చిన్ననీటి వనరుల గణనకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. సోమవారం నుంచి నెలరోజులపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, బావుల వివరాలు సేకరించనున్నారు. ఈ గణన ద్వారా గ్రామాల్లో ఎన్ని నీటి వనరులు ఉన్నాయి.. నీటి లభ్యత లెక్క తేలనుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జలశక్తి కార్యక్రమం కింద సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో పొందుపరుస్తారు. సాధారణంగా ప్రతీ ఐదేళ్లకు ఒకసారి చిన్ననీటి వనరులను లెక్కిస్తారు. గతంలో 2017– 18లో గణన చేపట్టారు. అప్పటి లెక్కల ప్రకారం జిల్లాలో బావులు 2,513 ఉండగా, బోర్లు 3,738, చెరువులు, కుంటలు కలిపి 1,865 ఉన్నాయి.. ఈ నెల 17 నుంచి నెలరోజులపాటు చేపట్టే సర్వేలో గొట్టపు, ఓపెన్ బావులు, చెరువులు, చిన్న కుంటలు, రెండు వేల హెక్టార్లలోపు ఆయకట్టుకు సాగునీరందించే మినీ ప్రాజక్టుల వివరాలు సేకరిస్తారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చైర్మన్గా కలెక్టర్ నీటి వనరుల లెక్కింపు కార్యక్రమానికి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా జిల్లా ప్లానింగ్ అధికారులు కన్వీనర్గా ఉంటారు. గ్రామ పరిపాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు సర్వే చేపట్టనున్నారు. గణన కోసం ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. తహసీల్దార్లు వీరి సమన్వయ బాధ్యతలు చూస్తుండగా, సీపీవోపాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పర్యవేక్షిస్తారు. ఏర్పాట్లు పూర్తి జిల్లాలో చిన్ననీటి వనరుల గణన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు పూర్తి చేశాం. సంబంధిత సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. – వాసుదేవరెడ్డి, సీపీవో -
వంతెన లేక.. అంబులెన్స్ రాక
దహెగాం(సిర్పూర్): ఏఐ యుగంలోనూ జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేక వైద్యానికి గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వంతెన లేకపోవడంతో ఓ గర్భిణి ప్రయాణానికి ఎడ్లబండే దిక్కయింది. ఈ ఘటన దహెగాం మండలంలో చోటు చేసుకుంది. మురళీగూడకు చెందిన కుమురం వనితకు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. మురళీగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఒర్రైపె వంతెన లేకపోవడంతో వాహనం అక్కడే ఆగిపోయింది. భర్త నాగేశ్ వనితను ఎడ్లబండిపై ఎక్కించుకుని ఒర్రె దాటించాడు. అక్కడి నుంచి అంబులెన్సు ద్వారా దహెగాం పీహెచ్సీలో చేర్పించగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యసిబ్బంది తెలిపారు. ఇది ఆమెకు మూడో కాన్పు కాగా, గతంలో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెసరికుంట స్టేజీ నుంచి మురళీగూడ వరకు కిలోమీటరున్నర మట్టిరోడ్డు కావడంతో వర్షాకాలంలో వాహనాల రాకపోకలు సాధ్యం కాదు. వర్షాలు లేనందున వాహనాలు ఒర్రె వరకు వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. వంతెన నిర్మించి ప్రయాణ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బోనస్ దక్కేనా..?
రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన వడాయి కాంతారావు అనే యువ రైతు గత యాసంగిలో సన్నరకం ధాన్యం సాగు చేశాడు. ధాన్యంలో కొంత ప్రైవేటు వ్యక్తులకు విక్రయించగా.. క్వింటాల్కు రూ.500 బోనస్ వస్తుందనే ఆశతో మరో 50 క్వింటాళ్ల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నాడు. వానాకాలం సీజన్ ముగింపునకు వచ్చినా ఇప్పటివరకు బోనస్ నగదు అందలేదు. ఈ వానాకాలంలోనైనా బోనస్ అందుతుందనే ఆశతో ఐదెకరాల్లో సన్నరకం వరి సాగు చేశాడు... ఇలా జిల్లాలోని చాలామంది రైతులు వానాకాలంలో సన్నరకం వరి సాగు చేశారు. రెబ్బెన(ఆసిఫాబాద్): వరిసాగు చేసే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి బోనస్ ప్రకటించింది. గతేడాది వా నాకాలం పంట దిగుబడులకు బోనస్ చెల్లించిన ప్ర భుత్వం.. యాసంగిలో రైతుల నుంచి కొనుగోలు చే సిన ధాన్యానికి చెల్లించలేదు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వరికోతలు ఊపందుకున్నాయి. కనీసం ఈ సారైనా ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ చె ల్లిస్తుందా.. లేదా అని రైతులు ఎదురుచూస్తున్నారు. తుపానుతో తీవ్ర నష్టంజిల్లాలోని కాగజ్నగర్, సిర్పూర్(టి), దహెగాం, బెజ్జూర్, కౌటాల, పెంచికల్పేట్, చింతలమానెపల్లి, రెబ్బెన, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో సుమారు 52వేల ఎకరాల్లో వరి సాగైంది. పత్తి పంట తర్వాత అత్యధికంగా వరి పంట మోంథా తుపానుకు దెబ్బతింది. మూడు రోజులపాటు కురిసిన అకాల వర్షాలతో కోతదశకు చేరిన పొలాల్లోని పైరు నేలవాలింది. దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. రోజుల తరబడి నీళ్లలోనే ఉండటంతో ధాన్యం మొలకలు వచ్చాయి. తుపానులో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. వర్షాలతో నీటితో నిండిన పొలాలు ఇప్పుడిడప్పుడే తడారుతుండటంతో అన్నదాతలు కోతలపై దృష్టి సారించారు. టైర్లతో నడిచే సాధారణ హార్వెస్టర్లు నడిచే పరిస్థితి లేకపోవడంతో చైన్ ట్రాక్ హార్వెస్టర్లపై ఆధారపడుతున్నారు.అన్నదాతల్లో ఆశలు ఈ సీజన్లో దాదాపు 90 శాతం మంది సన్నరకం వరి సాగు చేశారు. వరికోతలు మొదలై 15 రోజులు అవుతున్నా అధికారులు ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. బోనస్ వస్తుందనే ఆశతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉండటంతో బోనస్ కొంత అండగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389 చెల్లిస్తుండగా, సాధారణ రకానికి రూ.2,369 చెల్లిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు క్వింటాల్కు రూ.2,000 నుంచి రూ.2,100 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా కల్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17 మించకూడదనే నిబంధన ఉంది. తప్ప, తాలు ఉండకుండా చూసుకోవాలి. తప్ప, తాలు ఉంటే తూర్పారా పట్టి విక్రయించాలి. తూకం, హమాలీ ఖర్చులను రైతులే భరించాలి. దీంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. బోనస్ చెల్లిస్తేనే లాభం ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యానికి బోనస్ చెల్లిస్తేనే రైతులకు లాభం ఉంటది. ప్రైవేటోళ్లు వచ్చి పచ్చి వడ్డనే కొని తీసుకుపోతున్నరు. కాంటా ఖర్చు కూడా అడుగుతలేరు. అదే ప్రభుత్వ కేంద్రంలో క్వింటాల్కు రూ.50 చొప్పున హమాలీ ఖర్చు రైతులే భరించాల్సి వస్తుంది. – వడ్గూరి విజయ్, రైతు యాసంగి నగదు అందలేదు పోయిన నెలలో తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాతో పంటలన్నీ దెబ్బతిన్న యి. సరిగ్గా గింజ పాలుపోసుకునే సమయంలో పంట తీవ్రంగా దెబ్బతింది. బోనస్ వస్తుందనే ఆశతో గత యాసంగిలో సన్నవడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే బోనస్ నగదు అందలేదు. వానాకాలంలో కూడా సన్నవడ్లనే సాగుచేసిన. ఈసారైనా బోనస్ పడుతుందో లేదో తెలుస్తలేదు. – శివరాం, నక్కలగూడ -
‘దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలి’
ఆసిఫాబాద్: రానున్న 25 ఏళ్లలో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార కల్పగురి ప్రభుకుమార్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని జైన్మందిర్ నుంచి సాయిబాబా మందిర్ వరకు పథసంచలన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ సమాజ సంఘటనే దేశ అభ్యున్నతికి మార్గమన్నారు. డిసెంబర్లో జరగనున్న వారాట్ హిందూ సమ్మేళనానికి ప్రజలు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ విభాగ్ సహా కార్యవాహ మాధవరపు రంగస్వామి, మంచిర్యాల జిల్లా కార్యవాహ కృష్ణ భాస్కర్, గౌతం చంద్ లోఢా, కొత్తపల్లి శ్రీనివాస్, నాగేశ్వర్రావు, మల్లికార్జున్, సతీశ్బాబు, విశాల్, కోటేశ్వర్రావు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీవోఈ ఎదుట విద్యార్థుల ఆందోళన
బెల్లంపల్లి: పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులలో ఇటీవల విలీనం చేసిన సిర్పూర్(టి) విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. అక్కడ గురుకుల భవనం శిఽథిలావస్థకు చేరుకోవడంతో 9, 10 తరగతుల విద్యార్థులను బెల్లంపల్లి సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ కళాశాలకు షిఫ్ట్ చేశారు. 140 మంది సీవోఈ గురుకులంలో చదువుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న 600 మందికి తోడుగా అదనంగా 140 మంది రావడంతో సౌకర్యాల సమస్య ఏర్పడింది. దీంతో సిర్పూర్ (టి) గురుకుల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమను వెంటనే వసతులు ఉన్న భవనంలోకి పంపించాలని విద్యార్థులు సీవోఈ కళాశాల గేట్ తెరిచి రోడ్డెక్కారు. లగేజీ సర్దుకుని ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. గమనించిన ప్రిన్సిపాల్ విజయసాగర్, కొంతమంది ఉపాధ్యాయులు, సిబ్బంది వెళ్లి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సిర్పూర్(టి) గురుకుల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. తిరిగి కళాశాలలోకి వచ్చారు. -
పౌష్టికాహారం అందించాలి
వాంకిడి: మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి సూచించారు. శనివారం మండలంలోని ఖమాన గ్రామంలోగల ప్రభుత్వ ప్రా థమికోన్నత పాఠశాలను సందర్శించారు. మ ధ్యాహ్న భోజనం, బోధన విధానం, హాజరు పట్టిక, పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమ య్యే రీతిలో సులభ పద్ధతిలో బోధించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అ నంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. -
పునర్నిర్మాణానికి సహకరించాలి
కాగజ్నగర్ టౌన్: వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీరామచంద్ర జీయర్స్వామి సూచించారు. శనివారం కాగజ్నగర్ పట్ట ణంలోని ఆర్ఆర్వో కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బాలాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రామచంద్ర జీయర్స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో గోదాదేవి, లక్ష్మి అమ్మవార్లతో పాటు వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో పునర్నిర్మాణ ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు, వ్యాపారులు పాల్గొన్నారు. -
రాజీమార్గంలోనే సమస్యలు పరిష్కారం
సిర్పూర్(టీ): కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకుని డబ్బు, సమయం ఆదా చేసుకో వాలని జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ అజయ్ ఉల్లం సూచించారు. శనివారం మండల కేంద్రంలో ని జూనియర్ సివిల్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కక్షిదారులు క్షణికావేశాలకు పోయి తమ విలు వైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించా రు. ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించుకో వడం ఉత్తమమని పేర్కొన్నారు. అనంతరం సిర్పూర్(టీ) కోర్టు పరిధిలోని కాగజ్నగర్, కాగజ్నగర్టౌ న్, కాగజ్నగర్ రూరల్, ఈజ్గాం, సిర్పూర్(టీ), కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల పోలీస్స్టేషన్ల పరి ధిలోని 247 కేసులు పరిష్కరించారు. న్యాయవాదులు వజ్జల కిశోర్కుమార్, పీ సతీశ్కుమార్, గంట కళ్యాణ్, అబ్దుల్ మతిన్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక వికాసం
ఆసిఫాబాద్అర్బన్: క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వాసవీ గార్డెన్స్లో అర్జున్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తాటిపల్లి గోపాలకృష్ణ జ్ఞాపకార్థం నిర్వహించిన 33వ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ ప్రైజ్ మనీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ ఓటమి భవిష్యత్ విజయానికి నాంది అని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి చెస్ ఆడి వారిని అభినందించారు. కార్యక్ర మంలో సుధాకర్, గడ్డాల శ్రీనివాస్, కరుణాకర్రె డ్డి, గోపాలకృష్ణ, స్వరూప తదితరులున్నారు. విద్యార్థులతో చెస్ ఆడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
కొనసాగుతున్న వారోత్సవాలు
ఆసిఫాబాద్అర్బన్: జాతీయ గ్రంథాలయ వా రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, కేజీబీ వీలు, జేపీఎస్ఎస్ బాలికలు, టీఎస్డబ్ల్యూఆర్ఎస్జేసీ బాలుర నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు హేమంత్షిండే, చంద్రశేఖర్, నవీన, దేవాజి, గ్రంథాలయం సి బ్బంది, లైబ్రేరియన్లు ప్రవీణ, స్వర్ణలత, స దానందం, రికార్డ్ అసిస్టెంట్ సతీదేవి, సలీం, రామయ్య, గోపి, పాఠకులు పాల్గొన్నారు. -
పులి సంచారంపై అవగాహన
తిర్యాణి: పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం మండలంలోని మొర్రి గూడ, కొత్తగూడ, లోహా గ్రామాల్లో అవగాహ న కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారికి ఫేస్ మాస్కులు, విజిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్కు పెట్టుకోవాలని, అవసరాన్ని బట్టి విజి ల్ ఉపయోగించాలని సూచించారు. రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో అటవీప్రాంతం వైపునకు వెళ్లవద్దని తెలిపారు. పత్తి చేన్లకు గుంపులుగుంపులుగా వెళ్లాలని సూచించారు. ఎఫ్ఎస్వో ఉజ్వ ల్, బీట్ అధికారి శ్రీకాంత్ తదితరులున్నారు. -
బిర్సా ముండా మహనీయుడు
ఆసిఫాబాద్: బిర్సా ముండా మహనీయుడని, అత డి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం గుజరాత్ రాష్ట్ర దేడియాపాడ నుంచి జనజాతీయ గౌరవ దివస్ వే డుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వర్చువల్గా నిర్వహించిన బిర్సా ముండా జయంత్యుత్సవాలను జిల్లా కేంద్రంలోని రైతువేదిక నుంచి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రమాదేవి, గిరిజన సంఘా ల నాయకులు, పటేళ్లు, సర్మేడిలు, అధికారులు, విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా బీర్సా ముండా చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బిర్సా ముండా 25ఏళ్ల వయస్సులో గిరిజన హక్కు ల కోసం బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడారని కొ నియాడారు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15న జన్ జాతీయ గౌరవ దివస్గా బిర్సా ముండా జయంతిని ప్రకటించిందని తెలిపారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆదివా సీ గిరిజన నాయకులను శాలువాలతో సన్మానించా రు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్, జిల్లా సర్మేడి మెస్రం దుర్గు, డీడీ అంబాజి, జీసీసీ డీఎం సందీప్, ఈఈ తానాజి, జేడీఎం నాగభూషణం, ఏటీడీవో సదానందం, మెస్రం మనోహర్, మాజీ ఎంపీపీ జైవంత్రావు, నాయకులు మర్సోకోల తిరుపతి, పెందూర్ ప్రభాకర్, కుడ్మెత తిరుపతి, పెందూర్ దాదీరావు, పుర్క బాబురావు, పెందూర్ పుష్పారాణి, బొంత ఆశారెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట రైతుల మహాధర్నా
ఆసిఫాబాద్అర్బన్: సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట పత్తి రైతులు మహాధర్నా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, కాంగ్రెస్ ని యోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ హాజరై రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. తేమ శాతం పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, కపాస్ కిసాన్ యాప్ను వెంటనే రద్దు చేయాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలును చేయాలని కోరారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం వెంటనే చెల్లించాలని, క్వింటాల్ పత్తికి రూ.12వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రతీ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేసేలా యజమానులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. బయటి మా ర్కెట్లో కాంటాలు పెట్టి అమాయక రైతుల వద్ద త క్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్న దళారులపై క ఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ర్యాలీగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు రై తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య తోపులా ట జరిగింది. దీంతో కలెక్టరేట్ ఎదుటనే బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతు హక్కుల పోరాట సమితి జేఏసీ నాయకులు రూప్ నార్ రమేశ్, జయరాం, కేశవ్రావ్, ప్రణయ్, అలీబి న్ అహ్మద్, జక్కయ్య, శంకర్, నారాయణ, అంజ న్న, తిరుపతి, దత్తు, సందీప్ తదితరులున్నారు. -
ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఏటీడీవో
ఎఫెక్ట్..దహెగాం: మండలంలోని కల్వా డ ఆశ్రమ పాఠశాలను శనివారం ఏటీడీవో శ్రీనివాస్ సందర్శించారు. శనివారం ‘సాక్షి’లో ‘చన్నీటి గజ గజ..!’ ప్రత్యామ్నా య చర్యలేవి..?’ శీర్షిక ప్రచురించిన కథనానికి స్పందించారు. ఏటీడీవో శ్రీనివాస్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి కొప్పుల ప్రశాంత్ చెట్టు పైనుంచి పడి రెండు కాళ్లు విరగగా ఘటన వివరాలు సేకరించారు. శాఖాపరమైన చర్యలకు ఐటీడీఏ పీవోకు నివేదిక అందిస్తానని పేర్కొన్నారు. ముందుగా పాఠశాల పరిసరాలు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశా రు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. స్థానికంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. చలి తీవ్రత ఉన్నందున కట్టెల పొయ్యి లేదా గ్యాస్ పొయ్యిపై నీళ్లు వేడి చేసి విద్యార్థుల స్నానాలకు అందించాలని సూచించారు. -
పత్తి కొనుగోళ్లకు బ్రేక్
ఆసిఫాబాద్: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించా రు. జిల్లాలో ఈ నెల 6న సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జి న్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కపాస్ కిసాన్ యాప్తో స్లాట్ బుకింగ్, ఎకరాకు ఏ డు క్వింటాళ్ల పరిమితితోపాటు తేమ కూడా ఎనిమి ది శాతానికి తగ్గించారు. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళన చే పట్టారు. తాజాగా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోళ్లు నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. 10 మిల్లుల్లోనే కొనుగోళ్లు జిల్లాలో 1.48 లక్షల రైతులుండగా ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 38లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. ఈ ఏడాది ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాల్కు రూ.8,100 ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 24 జిన్నింగ్ మిల్లులుండగా ఇప్పటివరకు పదింటిలోనే సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది. ఈ నెల 6న ఆసిఫాబాద్, 10న జైనూర్, 14న కాగజ్నగర్లో పత్తి కొనుగోళ్లు ప్రా రంభించారు. వారంరోజుల్లో జిల్లా వ్యాప్తంగా 32,753 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, వీటిలో సీసీఐ ద్వారా 25,536 క్వింటాళ్లు, ప్రైవేట్లో 7,217 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. రైతులపై తీవ్ర ప్రభావం మార్కెట్లో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోతే రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది. పత్తి కొనేవారు లేక ధర తగ్గే ప్రమాదముంది. క్వింటాల్కు రూ.8,100 సీసీ ఐ చెల్లిస్తుండగా, ప్రైవేట్లో రూ.6,500 ఇస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిన్నింగ్ యజమానుల సమస్య పరిష్కారమయ్యేదాకా రైతులు మార్కెట్కు పత్తి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోళ్లు సక్రమంగా జరిగేందు కు రైతులు, మిల్లర్లకు అనుకూలంగా మార్గదర్శకా లు వస్తేనే సమస్య పరిష్కారం కానుంది. జిన్నింగ్ యజమానుల డిమాండ్లివే.. పత్తి కొనుగోళ్ల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మిల్లుల్లో యజమానులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎల్1, ఎల్2, ఎల్3 పేరిట కొన్ని మిల్లుల్లోనే కొనుగోళ్లు చేపట్టడంపై రైతులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు తమ ఉనికిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లాలో అన్ని మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టగా, తాజా నిబంధనలు రైతులు, జిన్నింగ్ యజమానులకు ఇబ్బందిగా మారాయి. ఈ క్రమంలో కొన్ని మిల్లుల్లోనే విడతల వారీగా కొనుగోళ్లు చేపట్టడంతో కొనుగోళ్లు ప్రారంభించని మిల్లు యజమానులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 17నుంచి కొనుగోళ్ల్లు నిలిపివేతఆసిఫాబాద్: ఈ నెల 17నుంచి జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులకు పని కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఎల్1, ఎల్2, ఎల్3 సిస్టం ఎత్తివేయాలని, రైతులకు అందుబాటులో ఉన్న మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టాలని యజమానులు డిమాండ్ చేస్తూ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు గమనించి, తదుపరి కొనుగోళ్ల తేదీ ప్రకటించే వరకు సహకరించాలని కోరారు. -
ఉన్నతవిద్య అభ్యసించేలా ప్రోత్సహించాలి
కాగజ్నగర్ రూరల్: షెడ్యూల్ కులాల విద్యార్థులు ఉన్నతవిద్య అభ్యసించే దిశగా ప్రోత్సహించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ సూచించారు. శనివారం కాగజ్నగర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతిగృహా లను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఈడీ సురేశ్కుమార్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికా రి సత్యజిత్ మండల్తో కలిసి సందర్శించారు. అ నంతరం విద్యార్థుల సంక్షేమ, వసతి గృహాల సదుపాయాలు, విద్యాప్రమాణాలపై అధికారులతో స మీక్షించారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రొత్సహించాలని సూచించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. దళిత, అణగారిన వర్గాల సంక్షేమానికి కమి షన్ కృషి చేస్తోందని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యే హరీశ్బాబు తదితరులున్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్అర్బన్: గ్రంథాలయాల అభివృద్ధికి చ ర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి 58వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో జిల్లా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పోటీ పరీక్షలకు హాజ రయ్యే వారికి అవసరమైన మెటీరియల్, పాఠకుల కోసం దినపత్రికలు, వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, లైబ్రేరియన్లు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని బాబాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ సుకన్య తెలిపారు. పాఠశాల ఆవరణలో శుక్రవారం పీడీ షౌజియాతో కలిసి విద్యార్థినుల ను అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడు తూ ఇటీవల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి లాంగ్ జంప్లో అక్ష య, షాట్పుట్లో స్వర్ణ, కబడ్డీలో కీర్తన, సంధ్యారాణి, ఖోఖోలో హర్షిక, శ్రీదేవి, జయ, వా లీబాల్లో వైభవి, భవిష్య, శృతిక సత్తా చాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. -
అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం
వాంకిడి: అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఏఎస్పీ చిత్తరంజన్తో కలిసి తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డ్, రైటర్ రూంలు పరిశీలించారు. ఎస్హెచ్వో మహేందర్ను అడిగి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు. పెండింగ్ కేసులు, వాటి పరిష్కార మార్గాలు సూచించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించి, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు. -
కుమురం భీం
9అడవి పందులతో ఆగమాగం వరి, పత్తి పంటలు చేతికొచ్చే సమయంలో అడవి పందులు నాశనం చేస్తున్నాయి. పందుల బెడదతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 11లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయి. పగలు చల్లగాలులు వీస్తాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఐదు నెలలుగా వేతనాల్లేవ్.. ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్టీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. ఐదు నెలలుగా పెండింగ్ ఉన్నాయి. 10లోu శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
నేటి బాలలే రేపటి పౌరులు
ఆసిఫాబాద్రూరల్: నేటి బాలలే రేపటి పౌరులని డీసీపీవో మహేశ్ అన్నారు. మండలంలోని తుంపెల్లి పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ, అభివృద్ధికి జిల్లా బాలల సంరక్షణ విభాగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల గురించి వివరాలు తెలిస్తే 1098, 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. వట్టివాగు గిరిజన పాఠశాలలో నిర్వహించిన వేడుకులకు ఏసీఎంవో ఉద్దవ్, జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ పాఠశాలలో వేడుకలు సీనియర్ సివిల్ జడ్జి యువరాజ హాజరయ్యారు. తుంపెల్లిలో కేక్ కట్ చేస్తున్న డీసీపీవో మహేశ్నృత్యం చేస్తున్న విద్యార్థినులు -
నాణ్యమైన విద్యను అందించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్తూరి బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవం, తల్లిదండ్రుల సమావేశానికి హాజరయ్యారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో సుభాష్, ఎస్వో భాగ్యలక్ష్మి, నలంద పాల్గొన్నారు. భవిత కేంద్రాల్లో వసతుల కల్పనకు చర్యలుభవిత కేంద్రాల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మానసిక దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల భవనాలకు మరమ్మతులు చేసి ర్యాంపుల నిర్మాణం, ఫ్యాన్లు, గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, మూత్రశాలలు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎస్వో అబిద్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లుగా నిరుపయోగం
లింగాపూర్(ఆసిఫాబాద్): లింగాపూర్ మండలంలోని కంచన్పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు 140 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ రెండేళ్లుగా సోలార్ ప్యానెళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులంతా చన్నీటితోనే స్నానం చేస్తున్నారు. కొందరు చలికి తట్టుకోలేక మధ్యాహ్నం భోజన సమయంలో స్నానం చేస్తున్నారు. అంటువ్యాధుల భయం చలికి చాలా మంది స్నానం చేయడం లేదు. చర్మ సంబంధిత వ్యాధులతోపాటు అంటువ్యాధులు వ్యాపిస్తాయనే భయం ఉంది. అధికారులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలి. – రాజేందర్, 8వ తరగతి రెండు రోజులకోసారి.. ఏజెన్సీ ప్రాంతం కావడంతో చలి ఎక్కువగా ఉంది. చల్లటి నీటితో స్నానం చేస్తే జలుబు, జ్వరం వస్తుందేమోనని భయంగా ఉంది. రెండు రోజులకోసారి స్నానం చేస్తున్నాం. – శివమణి, పదో తరగతి -
గిరిజన ఆశ్రమాల్లో నిరుపయోగంగా సోలార్ వాటర్ హీటర్లు
ఆసిఫాబాద్రూరల్/పెంచికల్పేట్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో వాటర్ హీటర్లు పనిచేయడం లేదు. అడవుల జిల్లాను చలి వణికిస్తుండగా.. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ లోపే నమోదవుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ‘సాక్షి’ విజిట్ చేయగా, పలుచోట్ల విద్యార్థులు చన్నీటితో అవస్థలు పడుతూ కనిపించారు. వేడి నీటిని అందించేందుకు ఒక్కో ఆశ్రమ పాఠశాలలో రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఏళ్లుగా వాటికి మరమ్మతులు చేపట్టడం లేదు. ఆస్పిరేషనల్ బ్లాక్ కింద ఎంపికై న తిర్యాణి మండలంలోని ఏడు వసతి గృహాలకు మాత్రమే సోలార్ హీటర్లు మంజూరు చేసినట్లు గిరిజన శాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఉదయమే ఎముకలు కొరికే చలిలో చన్నీటితోనే స్నానం చేస్తూ గజ గజ వణుకుతున్నారు. మరికొందరు చలిని తప్పించుకునేందుకు మధ్యాహ్నం స్నానం చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వేడి నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నల్లా నీళ్లతో స్నానం ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో సోలార్ వాటర్ హీటర్లకు మరమ్మతు చేయాలి. వేడినీళ్లు అందుబాటులో లేక పాఠశాలలోని నల్లాల వద్ద చల్లని నీటితోనే స్నానం చేస్తున్నాం. – సృజన్ మండల్, పదో తరగతి -
ప్రత్యామ్నాయ చర్యలేవి..?
దహెగాం(సిర్పూర్): మండలంలోని కల్వాడ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు ట్యాంకు వద్ద చన్నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ఐదేళ్లుగా ఇక్కడి సోలార్ హీటర్ నిరుపయోగంగా మారింది. ఆశ్రమ పాఠశాలలో 201 మంది విద్యార్థులు ఉన్నారు. సోలార్ హీటర్కు మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వేడినీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. పట్టించుకోవడం లేదు ఆశ్రమ పాఠశాలలో ఐదేళ్లుగా సోలార్ హీటర్ పనిచేయడం లేదు. ఏటా చలికాలం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉదయమే కాలకృత్యాలు, స్నానానికి చల్లటి నీళ్లే దిక్కవుతున్నాయి. బాత్రూంలు సైతం సరిగా లేవు. అధికారులు పట్టించుకోవడం లేదు. – వినయ్, కల్వాడ ఆశ్రమ పాఠశాల చలికి ఇబ్బంది తరగతులకు సకాలంలో హాజరుకావాలంటే ఉదయం ఏడు గంటలకే స్నానం చేయాలి. చలితో ఇబ్బంది ఉండటంతో మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నానం చేస్తున్నాం. సోలార్ హీటర్ నిరుపయోగంగా ఉంది. – అభిలాష్, పదో తరగతి -
దేశ పురోగతికి కలిసి నడుద్దాం
ఆసిఫాబాద్: దేశ పురోగతికి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కలిసి నడుద్దామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి హాజరయ్యారు. జెండా ఊపి ఐక్యత ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కుమురంభీం చౌరస్తా మీదుగా మళ్లీ కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం వల్లాభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఏక్ భారత్– ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులను వినియోగించి ఆర్థిక రంగాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ హోంశాఖ మంత్రిగా వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత, అభివృద్ధిలో పాలు పంచుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ యువత పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మేరా భారత్ కార్యక్రమం ఇన్చార్జి, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, నోడల్ అధికారి రమాదేవి, జిల్లా యువజన శాఖ క్రీడల అధికారి అహ్మద్, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రావణి కుటుంబానికి అండగా ఉంటాం
ఆసిఫాబాద్అర్బన్: దహెగాం మండలం గెర్రె గ్రామంలో అక్టోబర్ 18న హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్రావు, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్తో కలిసి శ్రావణి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు, ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్య నుంచి రూ.లక్ష రుణం చెక్కు, అట్రాసిటీ కేసు పరి హారం ఉత్తర్వులు, మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించే ఉత్తర్వులను అందజేశా రు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రావణి తండ్రి చెన్నయ్య పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, ఇంటి నిర్మాణానికి మండల సమాఖ్య నుంచి రూ.లక్ష రుణం చెక్కు అందిస్తున్నామని తెలిపారు. అట్రాసిటీ కేసు కింద మొదటి విడత పరిహారంగా రూ.4,12,500 మంజూరు ఉత్తర్వులు అందించామని పేర్కొన్నారు. శ్రావణి తల్లిదండ్రులకు ఉపాధి కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దుకాణం పెట్టుకునేందుకు, సోదరుడిని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రావణిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గృహ నిర్మాణశాఖ పీడీ ప్రకాశ్రావు, డీఆర్డీవో దత్తారావు, దహెగాం తహసీల్దార్ షరీఫ్, ఎంపీడీవో నస్రుల్లా, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు. -
కుమురం భీం
7ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే.. గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ మందకొడిగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ అనేక కారణాలతో ఈ ప్రక్రియ ఊపందుకోలేదు. 9లోuవాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. చల్లగాలులు వీస్తాయి. రాత్రి మంచు కురుస్తుంది. చలి తీవ్రత పెరుగుతుంది. చిచ్చర పిడుగులు.. నేటి తరం పిల్లలు క్రీడామైదానాల నుంచి తరగతి గదుల వరకు సత్తా చాటుతున్నారు. నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 8లోuశుక్రవారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
బతుకుదెరువుకు.. బండెక్కి వచ్చి
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కుమార్.. రాజస్తాన్ నుంచి కూలీలు వస్తున్నారని తెలియగానే ఈయనతోపాటు మంచిర్యాల జిల్లా దేవాపూర్ నుంచి నలుగురు రైతులు కాగజ్నగర్ రైల్వేస్టేషన్కు వచ్చారు. కూలీలతో మాట్లాడి పత్తి చేలలో పనిచేసేందుకు ప్రత్యే క వాహనాల్లో దేవాపూర్కు తీసుకెళ్లారు. కాగజ్నగర్టౌన్: ఉపాధి కరువై సుదూర ప్రాంతాల నుంచి కూలీలు జిల్లాకు తరలివస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి పంట అధికంగా ఉండగా, కూలీల కొరత వేధిస్తోంది. దీంతో రైతులు వలస కూలీలపై ఆధారపడుతున్నారు. ఇతర రాష్ట్రాల వారిని పిలిపించుకుంటున్నారు. సుమా రు 1,327 కిలోమీటర్ల దూరంలోని రాజస్తాన్లోని బోద్పూర్ నుంచి ఇటీవల పలువురు కూలీలు ఇక్కడికి పత్తి ఏరేందుకు జిల్లాకు చేరుకున్నారు. ఈ సీజన్లో అక్కడ కూలీ దొరకకపోవడంతో పొట్టచేతిన పట్టుకుని కుటుంబంతో వలస వచ్చారు. సుమారు నాలుగు నెలలపాటు పత్తితీత పనుల్లో నిమగ్నం కానున్నారు.రైలు మార్గాన జిల్లాకు..రాజస్తాన్ నుంచి కాగజ్నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్కు కూలీలు రైలు మార్గాన చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన, దహెగాం, బెజ్జూర్, కౌటాల, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, పెంచికల్పేట్తోపాటు మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. వీరి రవాణా ఖర్చులను స్థానిక రైతులే భరిస్తున్నారు. -
‘బీసీ ఉద్యమ సెగ ఢిల్లీకి తగలాలి’
ఆసిఫాబాద్అర్బన్: బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమ సెగ ఢిల్లీకి తగలాలని బీసీ జేఏసీ చైర్మన్ రూప్నార్ రమేశ్ అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గురువారం ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. జేఏసీ చైర్మన్ రమేశ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సీఎం రేవంత్రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్గాంధీ ఇండియా కూటమి నేతలతో కలిసి బీసీల తరఫున పోరాటం సాగించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ నెల 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, 18న ఎంపీలతో ములాఖత్, డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ ముట్టడి, మూడో వారంలో బస్సుయాత్ర, జనవరి 4న వేలవృత్తులు– కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, నాయకులు రేగుంట కేశవ్రావు, జక్కన్న, రమేశ్, మేరాజ్, మారుతి, అశోక్, మోరేశ్వర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ లిటరసీపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులకు డిజిటల్ లిటరసీపై అవగాహన అవసరమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు గురువారం ఆధునిక బోధన పద్ధతులు, డిజిటల్ టూల్స్పై శిక్షణను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గణితంతో కోడింగ్, డాటా సైన్స్, భౌతిక శాస్త్రంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఫిజికల్ కంప్యూటింగ్ వంటి అంశాలను బోధించాలన్నారు. మూడు రోజు లపాటు కొనసాగే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిసోర్స్పర్సన్లు శ్యాంసుందర్, శ్రీనాథ్, రవికుమార్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన బొగ్గు అందిస్తేనే లాభాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): వినియోగదారుల నమ్మకాని కి అనుగుణంగా నాణ్యమైన బొగ్గును అందించినప్పుడే సింగరేణికి లాభాలు చేకూరుతాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహించారు. జీఎం కార్యాలయ ఆవరణలో నా ణ్యత పతాకాన్ని ఆవిష్కరించారు. జీఎం మాట్లాడు తూ సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తితోపాటు నా ణ్యత ఎంతో కీలకమన్నారు. బొగ్గులో రాళ్లు, సేల్ బొగ్గు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం ఉద్యోగులు, అధికారులతో కలిసి నాణ్యత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ నాయకులు బయ్య మొగిళి, అధికారుల సంఘం నాయకుడు ఉజ్వల్కుమార్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ హెచ్వోడీ శ్రీనివాస్, సీనియర్ పీవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కోతలు భారం..!
పెంచికల్పేట్(సిర్పూర్): అకాల వర్షాల దెబ్బకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తెగుళ్లు, ఎడతెరిపి లేని వర్షాలతో దిగుబడి అంతంత మాత్రంగా ఉండగా, వరికోతలకు అన్నదాతలపై అదనపు భారం పడుతోంది. రూ.వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంట అకాల వర్షాలకు దెబ్బతినగా, కోతకు వచ్చిన పంట నేలవాలింది. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో కోతలకు పడరాని పాట్లు పడుతున్నారు. నేలవాలిన వరి, నీట మునిగిన పైరును కోసేందుకు చైన్ మిషన్లు వినియోగిస్తున్నారు. ఇదీ పరిస్థితి..జిల్లాలో 55 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2025– 26 వానాకాలం సీజన్లో 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల మోంథా తుపాను ప్రభావంతో పెంచికల్పేట్, దహెగాం, కౌటాల తదితర మండలాల్లో అకాల వర్షాలకు వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరి పైరు నేలవాలింది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ నీరు నిలిచి ఉండగా, కొన్నిచోట్ల పొలాల్లో తడి ఆరడం లేదు. బురదతో హార్వెస్టర్లు నడవడం కష్టంగా మారింది. దీంతో వరి పంట కోయడానికి అన్నదా తలు రెట్టింపు ఖర్చు చేస్తున్నారు. టైర్ల హార్వెస్టర్ల యజమానులు గంటకు రూ.1800 నుంచి రూ.2వేలు, చైన్ మిషన్ యజమానులు గంటకు రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. బురద, నీటి నిల్వ కారణంగా ట్రాక్టర్లు కూడా పొలాల్లోకి వెళ్లడం సాధ్యం కావడం లేదు. హార్వెస్టర్ ట్యాంకు నిండిన ప్రతీ సారి పొలం దాటి గెట్టుకు రావాల్సి వస్తోంది. దీంతో కోత సమయం పెరుగుతుండటంతో అదనంగా చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రూ.12వేలు ఖర్చు మూడెకరాల్లో వరి పంట సాగు చేశాను. పంట కోతకు వచ్చిన సమయంలో కురిసిన భారీ వర్షాలకు పైరు నేలవాలింది. కోత కోయడానికి పొలంలో టైర్ల హార్వెస్టరు పని చేయలేదు. చైన్ మిషన్ హార్వెస్టరుకు రూ.12వేలు చెల్లించి కోత పూర్తి చేశా. వర్షాలతో గతంలో కంటే సుమారు రూ.6వేలు అధికంగా ఖర్చయ్యింది. – సుంపుటం బక్కయ్య, పెంచికల్పేట్ చైన్ మిషన్తో వరి కోయిస్తున్న రైతుకూలీలతోనూ ఇబ్బందే..హార్వెస్టర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో రైతులు కూలీల సాయంతో వరికోతలు చేపడుతున్నారు. పొలాలు బురదమయంగా ఉండటంతో కోసిన వరిని గెట్లపై కుప్పలుగా పెడుతున్నా రు. దీనికి సమయం వృథా అవుతోంది. వరి కో త, కుప్పలు ఎత్తడం, నూర్పిడి అన్ని కలిపి రూ. 5వేల నుంచి రూ.7వేల వరకు ఖర్చు పెరిగిందని చెబుతున్నారు. అకాల వర్షాలు నిండా ముంచాయని, ప్రభుత్వం నిబంధనలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. -
ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్రూరల్: ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలోని తేలిగూడ, అంకుసాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, ఏఐ బోధన తీరు, రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించా రు. ఆయన వెంట విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల నుంచి వివిధ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన 20 మంది క్రీడారులను గురువారం డీఎస్వో షేకు, పీడీ మీనారెడ్డి, కోచ్లతో కలిసి పాఠశాల ఆవరణలో అభినందించారు. డీఎస్వో మాట్లాడుతూ ఇటీవల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్– 14, 15, 16 అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాపాఠశాల నుంచి 20 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, ఏసీఎంవో ఉద్దవ్, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, హ్యాండ్బాల్ కోచ్లు అరవింద్, తిరుమల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రెబ్బెనలో సిబ్బంది కొరత
రెబ్బెన: మండల కేంద్రంలోని పీహెచ్సీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. రోజువారీగా ఓపీ 70 నుంచి 80 వరకు ఉండగా.. సీజనల్ వ్యాధుల సమయంలో 150 వరకు ఉంటుంది. ఒకే డాక్టర్ అందుబాటులో ఉన్నారు. ఆయన లేని సమయంలో స్టాఫ్ నర్సులే దిక్కవుతున్నారు. స్టాఫ్నర్స్ పోస్టు సైతం ఒక్కటే ఉంది. డిప్యూటేషన్పై అదనపు స్టాఫ్నర్సుతో నెట్టుకొస్తున్నారు. పగలు ఒకరు, రాత్రి మరొకరు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు, ఇతర సలహాలు, సూచనలు అందించేందుకు 12 మంది ఏఎన్ఎంలు ఉండాల్సి ఉండగా కేవలం 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు త్వరలో డిప్యూటేషన్పై వేరే ప్రాంతానికి వెళ్లనున్నారు. ఆర్వో ప్లాంటు మాత్రం మరమ్మతులు లేక నిరుపయోగంగా ఉంది. ఆస్పత్రి ప్రథమ చికిత్స సేవలకే మాత్రమే పరిమితం కావడంతో.. సీరియస్ కేసులను బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు అందించాల్సిన ఇంజక్షన్లు సరిపడా లేవు. తిర్యాణి మండలం రొంపల్లి పీహెచ్సీ నుంచి తెప్పిస్తున్నారు. -
పెద్దదిక్కు.. కాగజ్నగర్ సీహెచ్సీ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రి డివిజన్ పరిధిలోని రోగులకు పెద్దదిక్కుగా మారింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ పెషెంట్లను పరీక్షించి మందులు అందించారు. జనరల్ ఫిజిషియన్ అరుణ్, చిల్ట్రన్స్ డాక్టర్ మహేశ్, ఎంబీబీఎస్ జనరల్ వైద్యులు శ్రీధర్, సాత్విక్, విజయ్ కుమార్లు ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి చేరుకుని రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు సాధారణ వైరల్ ఫీవర్, వాతావరణ మార్పులతో దగ్గు, తదితర సమస్యలతో వచ్చారు. దహెగాం ఆస్పత్రి నుంచి వచ్చిన గర్భిణులు స్కానింగ్ పరీక్షలు చేయించుకున్నారు. వంద పడకలుగా అప్గ్రేడ్ చేస్తున్నాం కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని పీహెచ్సీల నుంచి రెఫర్పై వచ్చిన గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తున్నాం. 30 పడకల ఆస్పత్రి నుంచి వంద పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు అనుమతులు వచ్చాయి. పురాతన భవనం కూల్చి వంద పడకలకు వసతులు కల్పించేందుకు పనులు కొనసాగుతున్నాయి. – అవినాష్, సూపరింటెండెంట్, కాగజ్నగర్ సీహెచ్సీ -
ఆర్థిక వనరులు సృష్టించుకోవాలి
కై లాస్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సొంతంగా ఆర్థిక వనరులు సృష్టించుకోవడంతోనే స్థానిక సంస్థల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యుడు రమేశ్, కార్యదర్శి కాత్యాయినిదేవిలతో కలిసి బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన ఐదేళ్ల ఆదాయ, వ్యయాలపై సమగ్రంగా సమీక్షించారు. జనరల్ ఫండ్, ట్యాక్స్లు, వారసంతలు, తైబజార్ల ద్వారా సమకూరుతున్న ఆదాయం, వాటి ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతంతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ప్రతీ పంచాయతీ, మున్సిపాలిటీ సొంత ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి సారించాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నిధుల వినియోగం పారదర్శకంగా, సమర్థవంతంగా జరగాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర నిధుల ద్వారా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్నారు. ప్రతీ రూపాయి ప్రజా ప్రయోజనానికి వినియోగించాలని తెలిపారు. ఆయా శాఖలు సమన్వయంతో పాటు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయా జిల్లాల్లో నిధుల వినియోగం, పేదరిక నిర్మూలన, గ్రామీణ గృహనిర్మాణం, విద్యుత్, తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై కలెక్టర్లు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలు వెల్లడించారు. ఇందులో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కుమార్ దీపక్, వెంకటేశ్ దోత్రే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సోమ రాజేశ్వర్, ఫైజాన్ అహ్మద్, దీపక్ తివారి, ఆర్డీవో స్రవంతి, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ అంటే ఎంతో ఇష్టం.. ఆదిలాబాద్ జిల్లా అంటే తనకెంతో ఇష్టమని రాజ య్య అన్నారు. తనకు ఈ జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఖమ్మం జిల్లాకు పోస్టింగ్ వస్తే దాన్ని మార్చుకుని నాలుగున్నరేళ్ల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీ సీఈవోగా పనిచేశానని చెప్పారు. ఇక్కడ ప్రజల అభిమానం మరువలేనిదని పేర్కొన్నారు. కరీంనగర్ తాను పుట్టిన జిల్లా అయితే రెండో జన్మభూమి ఆదిలాబాద్ అని ఈ జిల్లాతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. -
జిల్లాకు కొత్త అతిథి
రెబ్బెన(ఆసిఫాబాద్): మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి అడుగుపెట్టిన కొత్త పెద్దపులి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆరాటపడుతోంది. మూడు నెలల క్రితం జిల్లాలోకి ప్రవేశించగా, ప్రస్తుతం రెబ్బెన, తిర్యాణి రేంజ్ పరిధిలో సంచరిస్తూ ఆహారం కోసం పశువులపై పంజా విసురుతోంది. రెబ్బెన, తిర్యాణి, దేవాపూర్, బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం కొత్త పులి నివాసానికి అనుకూలంగా ఉంది. దట్టమైన అడవుల్లో పుష్కలంగా నీటి వనరులు, ఆకలిని తీర్చుకునేందుకు వన్యప్రాణులు ఉన్నాయి. ప్రస్తుతం పులుల మేటింగ్ సమయం కావడంతో జత దొరికితే ఈ ప్రాంతాల్లోనే బెబ్బులి ఆవాసం ఏర్పాటు చేసుకుని సంతతిని వృద్ధి చేసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. పశువులపై పంజా.. రెండు రోజుల క్రితం కై రిగూడకు సమీపంలో రెండు పశువులపై పంజా విసిరిన పులి ఆడదా.. మగదా అనేది తేలలేదు. సోమవారం రాత్రి ఆవుతోపాటు లేగదూడలను చంపిన తర్వాత లేగదూడ కాలు మాంసాన్ని తినగా, ఆపై కళేబరాలను అక్కడే వదిలివెళ్లిపోయింది. ఆహారం కోసం మళ్లీ వస్తే జా డ తెలుసుకునేందుకు అటవీ అధికారులు పశువుల కళేబరాల ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా అందులో ఎలాంటి రికార్డు లేదు. కైరిగూడ సమీపంలో పశువులపై దాడికి ముందే తిర్యాణి రేంజ్ పరిధిలోని తోయగూడలో సైతం రెండు పశువులను చంపింది. కై రిగూడ సమీపంలోని పశువుల కళేబరాలకు వద్దకు రాకుండా పెద్దపులి తోయగూడ వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే తిర్యాణి రేంజ్ పరిధిలోనూ ఎక్కడా జాడ దొరకలేదు. దీంతో సిబ్బంది పులి సంచరించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మైనింగ్ కార్యకలాపాలతో కాస్త ఇబ్బంది మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి పులుల రాకపోకలు ఈ మధ్య పెరిగాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ నుంచి ప్రాణహిత దాటి జిల్లాలోకి అడుగుపెడుతున్న పులులు కాగజ్నగర్, రెబ్బెన, తిర్యాణి రేంజ్ల్లో సంచరిస్తూ ఆహారం కోసం పశువులపై దాడులు చేస్తున్నాయి. స్థిర నివాస అన్వేషణలో భాగంగా పులి రోజుకు 25 కిలోమీటర్లు తిరుగుతుంది. కాగజ్నగర్ అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ వైపు వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టినా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ వైపు వెళ్లే మార్గంలో సింగరేణి బొగ్గు గని మైనింగ్ కార్యకలాపాలు ప్రతిబంధకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. వాహనాల శబ్దాలు, బ్లాస్టింగ్ పనులతో పులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ వైపు వెళ్లకుండా మంచిర్యాల వైపు లేదా వచ్చిన దారిలోనే తిరుగు పయనం అవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. రెబ్బెన, ఆసిఫాబాద్ మండలాల మీదుగా ఏర్పాటు చేసిన జాతీయ రహదారిని పులులు, ఇతర వన్యప్రాణులు సులువుగా దాటేందుకు రెబ్బెన మండలం తక్కళ్లపల్లి వద్ద సుమారు 200 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించారు. పైనుంచి వాహనాలు, కింది నుంచి వన్యప్రాణులు సురక్షితంగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అలాగే వాంకిడి మండలంలో ఏకో బ్రిడ్జి నిర్మించారు. ఆ ప్రాంతంలో వాహనాలు కింది నుంచి, వన్యప్రాణులు పైనుంచి వెళ్లేలా వంతెన నిర్మించారు. గతంలో గోలేటి– 1 ఇంకై ్లన్ వద్ద.. దాదాపు ఐదేళ్ల క్రితం గోలేటి– 1 ఇంక్లైన్ వద్ద ఓ పెద్దపులి సంచరించింది. గోలేటి– 1 వద్ద నివాస గృహాలకు అతి సమీపంలోనే ఎద్దుపై దాడిచేసి చంపింది. కళేబరం వద్ద ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా అందులో పులి కదలికలు రికార్డయ్యాయి. జనసంచారం, వాహనాల శబ్దాలకు పులి అక్కడి నుంచి బెల్లంపల్లి ఓసీపీ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిపోయింది. కొన్ని రోజులపాటు అదే ప్రాంతంలో తిరగగా సింగరేణి కార్మికులు కొందరు ప్రత్యక్షంగా చూశారు. అక్కడి నుంచి ఖైరిగూర ఓసీపీ పరిసరాలకు వెళ్లిపోయి.. వట్టివాగు డైవెర్షన్ కెనాల్లో కనిపించిది. అక్కడి నుంచి తిరిగి గోలేటి– 1 మీదుగా పులికుంట వైపు వెళ్లి రెబ్బెన, బెల్లంపల్లి రేంజ్ల సరిహద్దు ప్రాంతమైన తక్కళ్లపల్లి బస్టాండ్ సమీపం గుండా మంచిర్యాల జిల్లా వైపు అడుగులు వేసింది. వేమనపల్లి, నీల్వాయి అటవీప్రాంతంలో చాలా రోజులు సంచరించింది. -
విద్యార్థులను ప్రాక్టికల్స్కు సన్నద్ధం చేయాలి
● డీఐఈవో రాందాస్వాంకిడి(ఆసిఫాబాద్): ప్రాక్టికల్స్ పరీక్షల కోసం ఇంటర్మీడియెట్ విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి(డీఐ ఈవో) రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీని బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, కళాశాల రికార్డులు పరిశీలించారు. రా నున్న ప్రాక్టికల్స్ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. సకా లంలో సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులు క్ర మం తప్పకుండా కళాశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి కేజీబీవీలో మొక్కలు నాటారు. -
కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వం ఏర్పాటు చేసే వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, కొమురవెళ్లి, ఎడవెల్లి, ఇందిరానగర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు బుధవారం స్థలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రతీ కేంద్రంలో గోనె సంచులు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ట్యాబ్లు, టార్పాలిన్లు సమకూర్చామని, రైతు లకు సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏ ర్పాటు చేసి తనిఖీలు చేపడుతామన్నారు. కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని సకాలంలో తరలించాలన్నారు. డీఆర్డీవో దత్తారావు, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, ఏపీఎం దుర్గయ్య, ఆర్ఐ ఉదయ్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా జోనల్స్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో బుధవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్స్థాయి అండర్– 19 నెట్బాల్ బాలబాలికల ఎంపిక పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. డీఐఈవో రాందాస్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఒత్తిడికి దూరంగా ఉండవచ్చన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపారు. అనంతరం నెట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా సెక్రెటరీ బాబురావు మాట్లాడుతూ జోనల్స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది బాలురు, 30 బాలికలు హాజరయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామన్నారు. ఈ నెల 15 నుంచి 17వరకు వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్, పీడీ, పీఈటీలు తిరుపతి, సందీప్, మహేందర్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. చలితీవ్రత పెరుగుతుంది. పొగమంచు కురుస్తుంది. సమయపాలనపై పట్టింపేది? దహెగాం: మండల కేంద్రంలోని పీహెచ్సీని బుధవారం ‘సాక్షి’ విజిట్ చేయగా, ఉదయం పది గంటలకు కేవలం స్టాఫ్ నర్సు, అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగతా సిబ్బంది రాలేదు. మందులు అందుబాటులో ఉన్నాయి. 24 గంటల పీహెచ్సీలో ఇద్దరు వైద్యులకు కేవలం ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. ఆ వైద్యాధికారి కూడా ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే విధులకు హాజరవుతుందని రోగులు చెబుతున్నారు. 2018 నుంచి రెగ్యులర్ వైద్యులు లేక ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. అలాగే నలుగురు స్టాఫ్ నర్సులకు ఒక్కరే ఉన్నారు. మిగిలిన సిబ్బంది దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సమయపాలన పాటించడం లేదు. ప్యూరిఫైడ్ పనిచేయకపోవడంతో రోగులకు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. బెజ్జూర్: స్థానిక పీహెచ్సీలో ముగ్గురు స్టాఫ్ నర్సులకు ప్రస్తుతం ఒక్కరు కూడా రెగ్యుల ర్ లేరు. ఇన్చార్జీలతో నెట్టుకువస్తున్నారు. ఇద్దరు వైద్యులు సమయపాలన పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు. వైద్యాధికారులు పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వాష్రూమ్స్ సక్రమంగా లేవు. కిటికీలన్నీ ఊడిపోతున్నాయి. -
ఇళ్లు మంజూరు చేయాలి
కేంద్ర ప్రభుత్వ జన్మన్ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని జైనూర్ మండలం పానపటార్ గ్రామానికి చెందిన ఆత్రం జానబాయి, సిడాం రంబుబాయి, ఆత్రం సోనుబాయి కోరారు. పక్కా గృహాలు లేకపోవడంతో పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నామని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనులైన తమను ఆదుకోవాలని విన్నవించారు. అధికారులు అడ్డుకుంటున్నారు ‘కాగజ్నగర్ మండలం సార్సాల గ్రామంలో పలువురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మేము వంశపారపర్యంగా సాగు చేసుకుంటున్న భూమిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే అటవీ భూమి అని ఆశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి..’ అని సార్సాల గ్రామానికి చెందిన రత్నం గణపతి, దేవదాస్, సౌజన్య, మీన కోరారు. -
భరించలేని భారం!
చింతలమానెపల్లి మండలం లంబాడిహేటి గ్రామానికి చెందిన అజ్మీర గోదానిబాయి ఏడాది క్రితం అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు కాగజ్నగర్, కరీంనగర్లోని ఆస్పత్రుల్లో చూయించారు. వైద్య పరీక్షల అనంతరం రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వెల్లడైంది. గోదానిబాయి, భర్త మంగీరాంకు నలుగురు ఆడపిల్లలు ఉండగా అందరికీ వివాహాలయ్యాయి. ఏడాది క్రితం కరీంనగర్లో వైద్యులు డయాలసిస్ నిర్వహించాలని సూచించారు. కొద్దిరోజులపాటు కరీంనగర్కు వెళ్లి డయాలసిస్ చేయించారు. పేదరికంలో ఉన్న వీరికి కరీంనగర్ వెళ్లి డయాలసిస్ నిర్వహించడం భారంగా మారింది. భర్త మంగీరాం మూడు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోగా.. ప్రస్తుతం ఆమె బంధువుల వద్ద ఉంటోంది. సుమారుగా ఆరు నెలలుగా డయాలసిస్ చేయించుకోకపోవడంతో గోదానిబాయి పరిస్థితి విషమంగా మారింది. చింతలమానెపల్లి(సిర్పూర్): మూత్రపిండాల వైఫ ల్యంతో బాధపడుతున్న వారు డయాలసిస్ చేయించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. స్థానికంగా కేంద్రాలు లేకపోవడం వారికి భారంగా మారింది. ముఖ్యంగా కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాలలకు చెందిన బాధితులు కరీంనగర్, మంచిర్యాలలో అద్దెకు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక భారం, అనారోగ్యంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. వీరిని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. భూములు, ఇళ్లను అమ్ముకుని అప్పులపాలవుతున్నారు. దుర్భర జీవితంమూత్రపిండాలు సరిగా పనిచేయని వారికి రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలు, శరీరంలో అవసరం లేని ద్రవాలను తొలగించడానికి చేసే చికిత్స డయాలసిస్. మూత్రపిండాలు చివరిదశలో ఉన్నప్పుడు.. పూర్తిగా వైఫల్యం చెందినప్పుడు యంత్రాల సాయంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల డయాలసిస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే ఏటా కిడ్నీల వైఫల్యంతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), బెజ్జూర్ మండలాల్లో అనధికార లెక్కల ప్రకారం 40 మందికి పైగా డయాలసిస్ బాధితులు ఉన్నారు. చింతలమానెపల్లి మండలంలోని బాబాపూర్కు చెందిన చదువుల రాజేశ్ గతేడాది డయాలసిస్ భారమై మృతి చెందాడు. అదే మండలం రవీంద్రనగర్– 1 గ్రామానికి చెందిన అశోక్ మండల్కు కరీంనగర్ వైద్యులు డయాలసిస్ చేయించుకోవాలని సూచించారు. అంతదూరం వెళ్లిరావడం భారంగా మారడంతో చికిత్స అందక మూడు నెలల క్రితం మృతి చెందాడు. అలాగే కాగజ్నగర్ కేంద్రంలో డయాలసిస్ కోసం వెయిటింగ్లో ఇంకా 20 మంది వరకు ఉన్నారు. బాధితుల్లో ఒకరు మరణిస్తే కానీ మరొకరికి యూనిట్ కేటాయించలేని పరిస్థితి నెలకొంది. కొత్త కేంద్రం ప్రారంభం ఊసేది..?ఆసిఫాబాద్లోని జిల్లా ఆస్పత్రితోపాటు కాగజ్నగర్ సామాజిక ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. కాగజ్నగర్లో నాలుగు యూనిట్లు, ఆసిఫాబాద్లో నాలుగు యూనిట్లు ఉండగా.. ఒక్కో కేంద్రంలో నెలలో 20 నుంచి 25 మంది బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. ఏడాది క్రితం కొత్త కేంద్రాల ఏర్పాటు కోసం జైనూర్, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రులను అధికారులు పరిశీలించారు. జైనూర్లో ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నా.. సిర్పూర్(టి)లో మాత్రం పురోగతి లేదు. సిర్పూర్(టి) సీహెచ్సీలో వసతులు లేవని సిబ్బంది తెలపడంతో కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు వివరాలు సేకరించారు. కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్నిరకాల వసతులు ఉన్నట్లు డీడీవో నవత నివేదిక అందించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కౌటాల పీహెచ్సీ పరిధిలోని సుమారు 20మంది డయాలసిస్ బాధితుల వివరాలను సైతం అందించారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన డయాలసిస్ నూతన కేంద్రాలు ప్రారంభించాలని బాధితులు కోరుతున్నారు.లంబాడిహేటి గ్రామానికి చెందిన జాటోత్ గిరిధర్ కుటుంబానికి ఎకరం భూమి ఉండగా, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం అనారోగ్యానికి గురి కాగా హైదరాబాద్లోని నిమ్స్కు వెళ్లారు. కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ నిర్వహించాలని వైద్యులు సూచించారు. మొదట మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో, ఆ తర్వాత ఏడాది నుంచి ఆసిఫాబాద్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రెండు రోజులకు ఒకసారి లంబడిహేటి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని ఆసిఫాబాద్కు వెళ్లిరావాల్సి వస్తోంది. ప్రయాణ భారంతోపాటు ఆర్థికభారంతో రూ.లక్షల్లో అప్పుల పాలయ్యాడు.నివేదిక అందించాం కౌటాలలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు గురించి సంబంధిత అధికారులు వివరాలు కోరారు. దీనిపై పీహెచ్సీలో అందుబాటులో ఉన్న సౌకర్యాల నివేదిక అందించాం. కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల పరిధిలో ఉన్న బాధితుల వివరాలను సైతం సమర్పించాం. – నవత, డీడీవో -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉంచొద్దని, త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన తొడసం బాలు కోరాడు. కంది, మొక్కజొన్న పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని కెరమెరి మండలం పిప్రి గ్రామానికి చెందిన నాయుడి ఎల్లక్క వేడుకుంది. తన పేరిట పట్టా ఉన్న భూమిని నిషేధిత జాబి తా నుంచి తొలగించాలని కాగజ్నగర్ పట్టణానికి చెందిన అన్వరుల్లా హుక్ దరఖాస్తు చేసుకున్నాడు. దహెగాం మండలం పీకలగుండం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు అర్జీలు అందించారు. సాగు భూమికి పట్టా మంజూరు చే యాలని కాగజ్నగర్కు చెందిన తెలంగె లింబారా బు దరఖాస్తు చేసుకున్నాడు. కౌటాల మండల కేంద్రంలోని వారసంతలో స్వచ్ఛ భారత్ కింద నిర్మించి న మూత్రశాలలకు బిల్లులు మంజూరు చేయాలని మండల కేంద్రానికి చెందిన డి.మత్తయ్య దరఖాస్తు చేసుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన షెడ్యూల్డ్ కులా లు, తెగలు, బీసీలకు పట్టాలు మంజూరు చేయాల ని వాంకిడి మండల కేంద్రానికి చెందిన దుర్గం శ్యాంరావు కోరాడు. దహెగాం మండలం గెర్రె గ్రామాని కి చెందిన రైతులు 25 ఏళ్లు సాగు చేసుకుంటున్న అ టవీ భూముల్లో పండించిన పత్తిని అధికారులు ధ్వంసం చేస్తున్నారని, రెవెన్యూ, అటవీశాఖ జాయింట్ సర్వే చేయాలని గ్రామానికి చెందిన దుగుట నానయ్య వేడుకున్నాడు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. పింఛన్ ఆగింది పదేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. కుడి కాలు, కుడి చేయి పని చేయవు. సదరం సర్టికెట్ తీసుకుని దివ్యాంగుల పింఛన్ పొందుతుండగా, గత జూలై నుంచి సర్టిఫికెట్ రెన్యువల్ చేయలేదని పింఛన్ ఆగింది. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. త్వరగా పింఛన్ పునరుద్ధరించాలి. – నైతం భీమ్రావు, జన్కాపూర్, ఆసిఫాబాద్ పాస్పుస్తకం జారీ చేయాలి మా తాతల నుంచి టోంకిని గ్రామ శివారులోని ఐదెకరాల పరంపోగు భూమిని సాగు చేసుకుంటున్నాం. అయినా పట్టా పాస్పుస్తకం లేకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. సర్వే చేపట్టి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలి. – చౌదరి గణపతి, టోంకిని, సిర్పూర్(టి) -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గ్రీన్ చాంపియన్ షిప్ నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఇంధనం ఆదా, పర్యావరణ పరిరక్షణ అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. జన్కాపూర్ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించగా, రాస్పెల్లి ఉన్నత పాఠశాల ద్వితీయ బహుమతి, గంగాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతి పొందారు. ఎంఈవో సుభాష్, మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ ట్రోఫీలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సృజనాత్మకతను వెలికి తీసి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేందుకు విజ్ఞాన మేళాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు షిప్ స్వచ్ఛంద సంస్థ రూ.4.7లక్షల విలువైన సామగ్రిని అందించడం అభినందనీయమన్నారు. ఎఫ్ఏవో దేవాజీ, హెచ్ఎం ఉమాబాల, షిప్ సంస్థ కోఆర్డినేటర్ ప్రేమ్చంద్, గైడ్ టీచర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఎంతో ఆనందంగా ఉంది
ఇప్పపువ్వు లడ్డూను తొలుత స్వయం ఉపాధి కోసం తయారు చేశాం. తొలి నాళ్లలో అంతగా అమ్ముడుపోయేవి కావు. ఐటీడీఏ చేయూతతో విక్రయాలు పెరిగాయి. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలతో పాటు బయట మార్కెట్లోనూ అమ్ముతున్నాం. ప్రతి నెలా రూ.6లక్షల నుంచి రూ.8లక్షల వరకు లడ్డూల అమ్మకాలు జరుగుతున్నాయి. ఖర్చులన్నీ పోనూ సభ్యులకు తలా రూ.20వేల వరకు మిగులుతుంది. మేం చేసే లడ్డూలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి మోదీ అభినందించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈ లడ్డూ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో మా లాంటి మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం చేయూతనందిస్తే మరింతగా ముందుకు సాగుతాం. – బాగుబాయి భీంబాయి, ఆదివాసీ మహిళా సహకార సంఘం అధ్యక్షురాలు -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. సరిహద్దుల నుంచి అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోళ్లకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, డీఏవో వెంకటి, డీఆర్డీవో దత్తారావు, ఆర్టీవో రాంచందర్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్ప లడ్డూకు జై
కై లాస్నగర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్రోడ్ కేంద్రంగా తయారవుతున్న ఇప్పపువ్వు లడ్డూకు మరోసారి గుర్తింపు దక్కినట్లయింది. ఇటీవల నిర్వహించిన మన్కీ బాత్లో ప్రధాని మోదీ ప్రశంసలతో జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మా రిన ఈ లడ్డూ ఇక రాష్ట్రమంతా అందుబాటులోకి రానుంది. భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో తయారీ యూని ట్లను ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సెర్ప్ సీఈవోను ఆదేశించింది. రక్తహీనతను అధిగమించేలా... అటవీప్రాంతంలో సహజసిద్ధంగా దొరికే ఇప్పపువ్వు ఆదివాసీల జీవనంలో ఒక భాగమైంది. తొలినాళ్లలో దీంతో సారా తయారు చేసేవారు. కాల క్రమేణ వంటకాలకు ఉపయోగించారు. అయితే వారసంతలు, గిరిజన వేడుకల్లో కనిపించే ఇప్పపువ్వు వంటకాలను అందరికి అందించేలా చూడటంతో పాటు ఆదివాసీలకు మేలు చేయాలని గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన దివ్యదేవరాజన్ సంకల్పించారు. ఏజెన్సీ ప్రాంతంలోని మహిళలు, యువతులు ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతుండడాన్ని గుర్తించారు. దానికి చెక్పెట్టేలా ఇప్ప లడ్డూ తయారీకి నిర్ణయించారు. ఐటీడీఏ ద్వారా రూ.14లక్షల వ్యయంతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో 2019 మే లో ఉట్నూర్లో ప్రారంభించారు. నాటి నుంచి ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు. 12 మంది సంఘ సభ్యులు ఉపాధి పొందుతున్నారు. రూ.కోటికి పైగా విక్రయాలు...అటవీ ప్రాంతం నుంచి సేకరించిన ఇప్పపువ్వులో నెయ్యి, పల్లీలు, బెల్లం, బాదం, జీడీ పప్పు నువ్వులు, పల్లీలను మిశ్రమంగా చేసి లడ్డూలను తయారు చేస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 కిలోల చొప్పున సిద్ధం చేస్తున్నారు. ముడి సరుకును సంఘ సభ్యులు సొంతంగానే సమకూర్చుకుంటున్నారు. కేంద్రంలో తయారు చేసిన లడ్డూలను ఆరోగ్య పోషణమిత్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక్కో విద్యార్థికి తలా రెండు లడ్డూలను అందిస్తున్నారు. ఒక్కో లడ్డూను రూ.7 చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక చేయూతను ఐటీడీఏ అందజేస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఆశ్రమ పాఠశాలలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళాశక్తి క్యాంటిన్లలోనూ విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్లోని శిల్పారామంలో కేటాయించిన స్టాల్లో మహువా లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే ఈ లడ్డూ అవశ్యకతను తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాలా మందితో పాటు ఉట్నూర్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు స్వయంగా ఆ కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు చేస్తున్నారు. కేజీకి సాధారణ లడ్డూలు రూ.400 విక్రయిస్తుండగా డ్రైప్రూట్స్తో చేసినవి రూ.600 నుంచి రూ.800వరకు విక్రయిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు వీటి విక్రయాల ద్వారా రూ.1.27 కోట్ల వార్షిక ఆదాయం గడించి ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘం స్ఫూర్తితోనే ప్రభుత్వం ఇతర జిల్లాల్లోనూ ఈ లడ్డూ విక్రయాలను చేపట్టాలని భావిస్తోంది. -
అందెశ్రీకి నివాళి
కాగజ్నగర్టౌన్:ప్రముఖ రచయిత అందెశ్రీ కి నివాళులర్పిస్తూ సోమవారం రాత్రి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్గాంధీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వర కు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ అందె శ్రీ మరణం తీరని లోట ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా, రచయితగా రాణించి ఎన్నో అవార్డులను అందుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ముంజం ఆనంద్కుమార్, రాజ్కమలాకర్రెడ్డి, ఈర్ల సునీల్ కుమార్, విస్తారు, డోంగ్రి సంతోష్ తదితరులు పాల్గొన్నా రు. -
‘గుర్తింపు’ ఎన్నికలపై నీలినీడలు
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మిల్లు పునఃప్రారంభమైన తర్వాత ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతాయని ఆశించిన కార్మి కులకు నిరాశే మిగులుతోంది. ఎస్పీఎంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు మిల్లు యాజమాన్యం మొదటి నుంచి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందనే క్రమంలో మరోసారి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మళ్లీ ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. అక్టోబర్ 28న సమావేశంగుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం అక్టోబర్ 28న ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తొమ్మిది సంఘాలు హాజరయ్యాయి. కానీ ఎస్పీఎం యాజమాన్యం నుంచి ప్రతినిధులె వ్వరూ హాజరు కాలేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికా రి ఎస్పీఎం ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి ఈ నెల 3లోగా కార్మికుల ఓటరు జాబితాను పంపించాలని చెప్పడంతో అంగీకరించారు. కానీ యాజ మాన్యం కార్మిక శాఖకు ఓటరు జాబితా అందించకుండానే గత నెల 27 తేదీనే కోర్టుకు వెళ్లింది. మిల్లు లీగల్ ఛీప్ మేనేజర్ కేఎన్ శేషగోపాల్ ఎన్నికల నిర్వహణకు ముందుగానే అర్హత కలిగిన సంఘాలను గుర్తించాలని, ఆ తర్వాతే ఎన్నికల ప్రక్రియకు ముందుకెళ్లాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిల్లులోని 15 కార్మిక సంఘాలతోపాటు జాయింట్ కమిషనర్ లేబర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ను కూడా ప్రతివాదులుగా చేర్చారు. సకాలంలో అందని నోటీసులుమిల్లు యాజమాన్యం వేసిన పిటిషన్పై అభ్యంతరాలు ఉన్న కార్మిక సంఘాలు ఈ నెల 3న వ్యక్తిగతంగా గానీ, వారి తరఫు న్యాయవాది హైకోర్టులో హాజరుకావాలని నోటీసులను పంపించారు. కానీ ఈ నోటీసులు తెలుగునాడు సిర్పూరు పేపర్మిల్స్ కార్మిక పరిషత్(ఈ–734)సంఘానికి మాత్రమే సకాలంలో అందాయి. మిలిగిన సంఘాలకు అందలేదు. విషయం తెలుసుకున్న సీఐటీయూ అనుబంధ సిర్పూర్ పేపరు మిల్స్ మజ్దూర్ యూనియన్(ఈ 3510) హైకోర్టులో వకాలత్ వేసింది. దీంతో కోర్టు ఈ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది. ఆ రోజు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలను అడ్డుకునేందుకు యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎన్నికలను అడ్డుకోవడం అప్రజాస్వామి కం. మిల్లు యాజమాన్యం వెంటనే పిటిషన్ను విత్డ్రా చేసుకోవాలి. – అంబాల ఓదెలు, ఉపాధ్యక్షుడు, ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్(ఈ–966) నోటీసులు అందకుండా.. యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలను అడ్డుకునేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేస్తోంది. ఇటీవల ఆదిలాబాద్లో జరిగిన కార్మిక శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఒక్క యూనియన్కు కూడా నోటీసులు అందకుండా చేసింది. ఈ నెల 3న హైకోర్టులో హాజరుకాకపోతే యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. దీంతో తమ యూనియన్ నాయకులు కోర్టులో వకాలత్ వేశారు. – కూశన రాజన్న, ప్రధాన కార్యదర్శి, మజ్దూర్ యూనియన్(ఈ–2510) -
ఆరోగ్య యోగం!
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం జిల్లాలో ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలల్లో యోగా తరగతులు నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో శిక్షకులను నియమించి.. ప్రతిరోజూ గంటపాటు బాలికలతో సాధన చేయిస్తున్నారు. విద్యార్థినుల్లో జ్ఞాపక శక్తి పెరిగి చదువుతోపాటు ఇతర అంశాల్లో చురుగ్గా రాణిస్తారని శిక్షకులు చెబుతున్నారు. బాలికలకు యోగావిద్యార్థులను ఒత్తిడిని నుంచి దూరం చేసేందుకు ప్రస్తుతం జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో యోగా శిక్షకులను నియమించారు. ప్రతిరోజూ సాయంత్రం వీరు యోగా సాధన చేయిస్తున్నారు. చదువుతోపాటు బాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆయా స్కూళ్లకు సంగీత వాయిద్య పరికరాలు కూడా అందించారు. నిత్య జీవనంలో యోగాతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని శిక్షకులు పేర్కొంటున్నారు. గంటపాటు బాలికలు ఉత్సాహంగా ఆసనాలు వేస్తున్నారని చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా యోగా, క్రీడాశిక్షకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందిస్తున్నారు. సంబంధిత నిధులు మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఖాతాల్లో జమ అవుతుండగా, వారు శిక్షకులకు అందిస్తున్నారు. ఎంపికై న పాఠశాలలు ఇవే..పీఎంశ్రీ పథకానికి జిల్లాలో 18 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆసిఫాబాద్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, బెజ్జూర్లోని ఎంపీపీఎస్ సలుగుపల్లి, చింతలమానెపల్లిలోని ఉన్నత పాఠశాల బాబాసాగర్, దహెగాంలో చిన్న రాస్పెల్లి, జైనూర్లోని ఆశ్రమ పాఠశాల, కాగజ్నగర్లోని ప్రభుత్వ జీహెచ్ఎస్ ఓల్డ్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గన్నారం మైనార్టీ గురుకులం, కెరమెరిలోని సావర్ఖేడా, కౌటాలలోని యూపీఎస్ బండలెట్టి, పెంచికల్పేట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రెబ్బెనలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిర్పూర్(టి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిర్పూర్(యూ) తెలంగాణ మోడల్ స్కూల్, తిర్యాణిలోని యూపీఎస్ గంభీరావుపేట్, వాంకిడిలో కస్తూరిబా గాంధీ విద్యాలయం, వాంకిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో 16 చోట్ల యోగా తరగతులు నిర్వహిస్తుండగా, రెండుచోట్ల మాత్రం అమలు కావడం లేదు.18 పీఎంశ్రీ పాఠశాలలుప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) అమలు చేస్తోంది. పీఎంశ్రీ పథకానికి జిల్లాలోని 18 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో 16 బడుల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయా స్కూళ్లలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అధునాతన బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. పీఎంశ్రీ కింద ఎంపికై న స్కూళ్లకు రానున్న ఐదేళ్లలో ఒక్కో పాఠశాలకు రూ.3 కోట్ల చొప్పున మంజూరు చేయనున్నారు. విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పన కోసం వీటిని ఖర్చు చేయనున్నారు. -
అబ్జర్వర్గా విద్యాసాగర్
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా పోటీలకు టాలెంట్ ఐడెంటిఫికేషన్ అబ్జర్వర్గా జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడాపాఠశాలలో అథ్లెటిక్స్ శిక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్న విద్యాసాగర్ నామినేటెడ్ అయినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సారంగపాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖేల్ ఇండియా ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబ్నగర్లో పోటీలకు అబ్జర్వర్గా పనిచేస్తారని పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ లెవల్ 2 కోర్స్ పూర్తి చేసినందుకు ఈ అవకాశం లభించిందన్నారు. గిరిజనశాఖ డీడీ రమాదేవి, క్రీడల అధికారి షేకు, హెచ్ఎం జంగు తదితరులు విద్యాసాగర్ను అభినందించారు. -
ఆయిల్పామ్కు ‘సహకారం’
లక్ష్మణచాంద: అన్నదాతలకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటల సాగుపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఒకసారి నాటితే 30 ఏళ్లు ఆదాయం వచ్చే ఈ పంటపై రైతుల్లో ఇంకా సరైన అవగాహన లేకపోవడంతో సాగు ఆశించిన స్థాయిలో జరగలేదు. వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్) భాగస్వామ్యంతో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల పీఏసీఎస్ సీఈవోలతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో సొసైటీకి 100 ఎకరాలు..ఒక్కో పీఏసీఎస్ పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల్ జిల్లా సహకార అధికారి నర్సయ్య తెలిపారు. సొసైటీలో సభ్యులైన రైతులతో సమావేశాలు నిర్వహించి పంట లాభాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 17 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 40 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సంఘం తమ పరిధిలో లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ప్రగతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 8,786 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 3,092 ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 2,505 ఎకరాలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,187 ఎకరాల్లో సాగవుతోంది. ఉమ్మడి జిల్లాలో 15,570 ఎకరాలు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం వివిధ రకాలు రాయితీలు అందిస్తోంది. ఒక ఆయిల్పామ్ మొక్క ధర రూ.193 ఉండగా, సబ్సిడీపై కేవలం రూ.20కే అందిస్తుంది. ఎకరంలో సగటుగా 50–55 మొక్కలు నాటేందుకు అవసరమైన రూ.10,615 విలువైన మొక్కలను కేవలం రూ.1,100లకే రైతులకు అందిస్తోంది. అలాగే బిందు సేద్యం పరికరాలను రాయితీతో అందిస్తూ, ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు నగదు ప్రోత్సాహకం ఇస్తోంది. అదనంగా పవర్ టిల్లర్లు, బ్రష్ కట్టర్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, బీసీ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. లక్ష్యం పూర్తికి చర్యలు ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒక్కో పీఏసీఎస్కు నిరేశించిన లక్ష్యం 100 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును చేరేందుకు త్వరలో రైతులతో సమావేశాలు నిర్వహిస్తాం. ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించి, లక్ష్యం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం. – నర్సయ్య, జిల్లా సహకార అధికారి, నిర్మల్ జిల్లా సాగు విస్తీర్ణం పెంపునకు కృషి ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రాథమిక సహకార సంఘాల సమన్వయంతో సాగు విస్తీర్ణం పెంచడానికి చర్యలు చేపడతాం. రైతులను ప్రోత్సహిస్తాం. – బీవీ రమణ, జిల్లా హార్టికల్చర్ అధికారి, నిర్మల్ -
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
బెజ్జూర్(సిర్పూర్): రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటి అన్నారు. బెజ్జూర్, బారేగూడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను ఆదివారం పరిశీలించారు. రైతులు సులభంగా ధాన్యం విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా.. లేదా.. అని ఆరా తీశారు. మార్కెటింగ్ స్థలాన్ని పరిశీలించారు. వర్షం, రద్దీ, ఇతర వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు. డీఏవో మాట్లాడుతూ రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రం ఇన్చార్జి జె.రంగయ్య, వీవోఏ పి.సంతోష్, ఏపీఎం ఆర్.మోహన్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థినుల ప్రతిభ
ఆసిఫాబాద్అర్బన్: మండలంలోని బాబాపూర్ మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి అండర్– 17 విభాగం పోటీల్లో క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించారు. వాలీబాల్లో స్మృతి, ఖోఖోలో కావ్య, కబడ్డీలో వైష్ణవి, చెస్లో సహస్ర, డిస్క్త్రోలో హిమబిందు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని పీఈటీ ఫౌసియా తెలిపారు. అలాగే రన్నింగ్లో బిక్కుబాయి, షార్ట్పుట్లో సుజాత ద్వితీయస్థానంలో నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ సుకన్య, అధ్యాపకులు అభినందించారు. -
రద్దీకి అనుగుణంగా పటిష్ట బందోబస్తు
కౌటాల(సిర్పూర్): కౌటాల కంకలమ్మ జాతరకు రద్దీకి అనుగుణంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. కౌటాల కంకలమ్మ ఆలయం వద్ద జాతర ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న నిర్వహించే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, రద్దీ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. ఆయన వెంట సీఐ సంతోష్కుమార్, ఎస్సై చంద్రశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య, పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7మామిడిలో జాగ్రత్తలు తప్పనిసరి మామిడిలో పూతకు ముందు, కాయదశలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని హెచ్వో కళ్యాణి సూచించారు. సస్యసంరక్షణ చర్యలను వివరించారు.వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి ఉష్ణోత్రలు సాధారణం కన్నా తగ్గుతాయి. సాయంత్రం నుంచే చలి ప్రభావం మొదలవుతుంది. చల్లగాలి వీస్తుంది. ఒత్తిడి తట్టుకోలేక..! ఇటీవల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేక, పరిష్కా ర మార్గం కనుగొనే ఆలోచన రాక కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
ఎస్టీపీపీలో మరో ప్లాంట్
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలో 800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి కొత్త విద్యుత్ ప్లాంటు నిర్మిస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంనాయక్ తెలిపారు. ఇందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎస్టీపీపీ(సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్)ను ప్లాంట్ ఈఅండ్ఎం తిరుమల్రావుతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈడీ చిరంజీవి, జీఎంలు నరసింహారావు, మదన్మోహన్ సీఎండీకి స్వాగతం పలికారు. అనంతరం బలరాం నూతనంగా నిర్మించే ప్లాంట్ ప్రదేశంతోపాటు ప్లాంట్లో నూతనంగా చేపట్టిన మిథనాల్ ప్లాంట్ ట్రయల్ రన్ను పరిశీలించారు. ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇందారం ఓపెన్కాస్ట్ గనిని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున బొగ్గు, ఓబీ వార్షిక లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎండీ వెంట ఎస్ఓటూ జీఎం సత్యనారాయణ, పీవో వెంకటేశ్వర్రెడ్డి, అధికారులు హరినారాయణ, రాజన్న, జక్కారెడ్డి ఉన్నారు. -
కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలని, ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుల వద్ద ఉన్న పత్తిని పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో రైతు హక్కు ల పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ.. దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, 12 శా తం తేమ నుంచి 20శాతం వరకు సడలింపు ఇవ్వాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు ఈనెల 10న మధ్యాహ్నం 12 గంటలకు రైతు జేఏసీ ఏర్పాటుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో రైతు జేఏసీ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. సమావేశానికి జిల్లాలోని ము ఖ్య రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరా రు. నాయకులు రూప్నార్ రమేశ్, కేశవ్రావ్, నాగో సె శంకర్, జయరాం, తిరుపతి, అంజన్న, మారు తి, మెంగాజీ, దత్తు తదితరులు పాల్గొన్నా రు. -
పంట విక్రయానికీ తిప్పలే..
పత్తి సాగులోనే కాకుండా రైతులకు చేతికి వచ్చిన దిగుబడి విక్రయంలోనూ తిప్పలు తప్పడం లే దు. అష్టకష్టాలు పడి సాగు చేసిన పత్తిని మద్దతు ధరకు అమ్మలేక రైతులు ఇబ్బంది పడుతున్నా రు. జిల్లాలో పత్తి సేకరణ వేగవంతమైనా సీసీఐ ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. సాధారణంగా రైతులు సీజన్ ప్రారంభంలో పంటల సాగు కోసం వ్యాపారుల వద్ద కొంత మొత్తాన్ని పెట్టుబడి కోసం అప్పుగా తీసుకుంటారు. అయితే ది గుబడి వచ్చాక సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి ని విక్రయించి అప్పు తీర్చుకుందామనుకుంటే వారికి నిరాశే మిగులుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులిచ్చిన వ్యాపారులకే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో వారు పత్తిలో తేమ పేరుతో రైతులను నిలువుదోపిడీ చేస్తున్నా రు. పత్తి పంటకు ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో 56వేల ఎకరాల్లో వ రి సాగు చేశారు. పలు మండలాల్లో ధాన్యం చేతి కి రావడంతో రైతులు అమ్మేందుకు అవస్థలు ప డుతున్నారు. అధికారులు స్పందించి వడ్ల కొనుగోలు కేంద్రాలతోపాటు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వేడుకుంటున్నారు. కా గా, వారంలోపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. -
మహిళలకు రక్షణ కల్పించాలి
కాగజ్నగర్ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కాగజ్నగర్ మండలంలోని బసంత్నగర్ విలేజ్ నంబర్–12లో సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు మమతా రానా మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై లైంగికదాడులు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలకు రక్షణ లేకుండా పోతోందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఐద్వా సంఘం కార్యదర్శి కాజల్ మండల్, మినోతి మండల్, వినతి బరుమన్, మినూ మండల్, మహిళలు పాల్గొన్నారు. -
ప్లాంట్ సరే.. ఆక్సిజన్ ఏది?
సిర్పూర్(టీ): మండల కేంద్రంలోని ప్రభుత్వ సా మాజిక ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగమైంది. 2020లో కోవిడ్ బాధితుల కోసం సుమా రు రూ.60లక్షలతో ఏర్పాటు చేసి ప్లాంట్ నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. రెండేళ్ల తర్వాత ఆక్సిజన్ ప్లాంట్ నుంచి రోగుల బెడ్ల వరకు పైపులైన్ వేసినా కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో అది నిరుపయోగంగానే దర్శనమిస్తోంది. అత్యవసర వేళల్లో ఇబ్బందులునియోజకవర్గ కేంద్రమైన సిర్పూర్(టీ)లోని ప్రభు త్వ సామాజిక ఆస్పత్రికి నిత్యం సిర్పూర్(టీ), కౌ టాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల రోగులతో పాటు సమీప మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు వచ్చి వైద్యసేవలు పొందుతుంటారు. ఆస్పత్రి లో ఆక్సిజన్ సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో వైద్యులు రోగులను 108 అంబులెన్స్ల్లో కాగజ్నగర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి లేదా ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలున్నా ఆక్సిజన్ లేక రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ను వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని పేద రోగులు కోరుతున్నారు. -
కుమురం భీం
7హోరాహోరీగా ఎంపిక పోటీలు ఆసిఫాబాద్లో జోనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మంది పాల్గొనగా విజేతలు బహుమతులు అందుకున్నారు. 9లోu అడెల్లి.. సమస్యలు తీర్చాలి తల్లి అడెల్లి నూతన ఆలయం, విగ్రహ పునఃప్రతి ష్ఠాపనోత్సవాలు అంగరంగ వైభవంగా ముగి శాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. 8లోu ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది. వాతావరణం చల్ల బడుతుంది. చలి పెరుగుతుంది. ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రెబ్బెన: సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వీడి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలపై యాజ మాన్యం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ గోలేటి శనివారం టౌన్షిప్లోని జీఎం కార్యాలయం ఎదు ట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించా రు. అనంతరం జీఎం విజయభాస్కర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి గతంలో మాదిరిగా అనారోగ్యంతో బాధపడే కార్మికులను ఇన్వ్వాలిడేట్ చేయాలని సూచించారు. మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు అందజేసి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మారుపేర్లతో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టి పెండింగ్లో ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించాలని, డిస్మిసల్ ఉద్యోగులకు ఒకసారి ఉద్యోగావకాశం కల్పించాల ని కోరారు. డిసిప్లీనరీ చర్యల కోసం 150 మస్టర్లు చేయాలనే సర్క్యులర్ను యాజమాన్యం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను తక్షణమే నిర్వహించాలని కోరారు. ఓవర్మెన్ పాస్ అయిన సీనియర్ మైనింగ్ సర్దార్లకు, డిప్లొమా హో ల్డర్లకు ఓవర్మెన్ ప్రమోషన్ కల్పించాలని కోరారు. గోలేటి ఓసీపీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ఇతర పనులు త్వరగా పూర్తి చేసి ఓసీపీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, జీఎం కమిటీ సభ్యులు శేషశయనరావు, రాజేశ్, ఆనంద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్బాబు, నాయకులు ఓదెలు, అంజయ్య, ఆఫ్రిద్, షకీల్, రారాజు, గోపాల్, రవికుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్పీ వెంటనే చెల్లించాలి
రెబ్బెన: పీఆర్పీని వెంటనే చెల్లించాలని బెల్లంపల్లి ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్ కోరారు. శనివారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరి ష్కారంలో యాజమాన్యం చొరవ చూపాలని కోరారు. నిబద్ధతతో పనిచేస్తున్న అధికారుల కు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్పీ చెల్లించాలని ఈనెల 24నుంచి నిరాహా ర దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఉజ్వల్కుమార్, ఎం.రమేశ్, కార్యదర్శి వీరన్న, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
కర్షకుడికి ఎంత కష్టం!
కౌటాల: జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పేరొందిన పత్తి సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈసారి ఖరీఫ్లో రెండు నెలలు కురిసిన అకాల వర్షాలతో చాలాచోట్ల పత్తి పంట దెబ్బతింది. చేన్లలో నీరు నిలిచి దిగుబడిపై ప్రభావం పడింది. దీనికి తోడు ఇటీవలి మోంథా తుపాన్ మరింత నష్టం కలిగించింది. గతేడాది పూత, కాత దశలో వ ర్షాలు కురవక పత్తి దిగుబడి రాలేదు. ఈసారి పూ త, కాత సమయంలో వర్షాలు పడడంతో ఆశించిన స్థాయిలో పూత, కాత రాలేదు. పత్తి మొదటి విడత సేకరణ సమయంలో తుపాన్తో కాయలు నల్లబడ్డా యి. పత్తి నేల రాలింది. వరి పంటకూ నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు పత్తితీత ప్రారంభించారు. ఆందోళనలో రైతాంగంజిల్లాలోని రైతులకు పత్తి పంట ప్రధానమైంది. జి ల్లా వ్యాప్తంగా 3.40 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. తక్కువకాలంలో రైతులను శ్రీమంతులను చేయడం లేదా భారీ నష్టాలు కలిగించి అప్పులపాలు చేయడం ఈ పంట ప్రత్యేకతగా చెప్పుకొంటారు. ప్రస్తుతం పత్తి సేకరణ దశలో ఉంది. దీంతో రైతులు మొదటిసారి పత్తి తీత ప్రారంభించడానికి కూలీల ఇళ్ల ఎదుట క్యూ కడుతున్నారు. కూలీల కొ రతతో పత్తి తీత ఆశించిన స్థాయిలో సాగడం లేదు. మరో వైపు వరి రైతులు కోతలు ప్రారంభించారు. అకాల వర్షాలు కురిస్తే అప్పులే మిగులుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అతివృష్టి లేదా అనావృష్టితో ఏటా పంట నష్టపోవడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు. ఇటీవలి వర్షాలకు వరి పంట కూడా నేలవాలిందని, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంజేస్తున్నారు. -
నిధులు పీవీటీజీలకే చెందాలి
ఆసిఫాబాద్అర్బన్: పీఎం జన్మన్ నిధులు 100శాతం పీవీటీజీలకు చెందాలని సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మాన్కు కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పీవీ టీజీలకు విడతలవారీగా కాకుండా ఒకేసారి ఇళ్లు మంజూరు చేసి వాటి నిర్మాణ బాధ్యతల ను ఐటీడీఏకు అప్పగించాలని కోరారు. కొ లాం, తోటి తెగలకు చెందిన పీవీటీజీల కో సం మొదటి విడతలో మంజూరైన 2,150 ఇళ్లలో కొన్నింటిని ఇతరులకు అధికారులు కేటా యించారని ఆరోపించారు. వాటిని తక్షణమే రద్దు చేసి అర్హులకు మంజూరు చేయాలని డి మాండ్ చేశారు. నాయకులు గోవింద్రావ్, అ న్నిగా, జలపతి, రాజు, సోనేరావ్, తిరుపతి, భీంరావ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్ట్లకు నిధులు కేటాయించాలి
కాగజ్నగర్ టౌన్: సిర్పూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్ట్లకు నిధులు కేటాయించాలని రా ష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఎ మ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు శనివారం వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని అతడి నివా సంలో మంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలి శారు. సిర్పూరు నియోజకవర్గంలో పెండింగ్లో ఉ న్న జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, పీపీరా వు ప్రాజెక్ట్, ఖర్జి పెద్దచెరువులను పునరుద్ధరించాల ని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల నిర్వహణ పనులకు నిధు లు కేటాయించాలని మంత్రికి విన్నవించారు. కౌటా ల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ డీపీఆర్పై కూడా చర్చించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో పెండింగ్ ప్రాజెక్ట్లపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ ఈఈ ప్రభాకర్, డీఈ భద్రయ్య, వెంకటరమణ తదితరులున్నారు. -
కరపత్రం ఆవిష్కరణ
కాగజ్నగర్ టౌన్: ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్లో నిర్వహించనున్న సీఐటీయూ ద్వితీయ మహాసభల ప్రచార కరపత్రాన్ని కాగజ్నగర్ పట్టణంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీ నివాస్ మాట్లాడారు. మహాసభలకు రాష్ట్ర న లుమూలల నుంచి అధికసంఖ్యలో కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు శంకర్, నాయకులు సంజీవ్, అరుణ, మల్లేశ్వరి, రాణి, వినోద, తిరుపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిడే వరల్డ్ చెస్ కప్ ఆర్బిటర్గా అరుణ్ కుమార్
నర్సాపూర్(జి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) గ్రామ వాసి గాడి అరుణ్ కుమార్ ఫిడే వరల్డ్ చెస్ కప్ –2025కి ఆర్బిటర్ (నిర్ణేత)గా ఎంపికయ్యారు. నవంబర్ 27 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్కు గోవాలో భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 83 దేశాల నుంచి 206 మంది ఆటగాళ్లు పాల్గొనే మెగా ఈవెంట్కు తెలంగాణ నుంచి ఆర్బిటర్గా అరుణ్ కుమార్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నాగ్పూర్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సార్జెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో అంతర్జాతీయ కామన్వెల్త్ చెస్ చాంపియన్ షిప్ ఆర్బిటర్గా చేశారు. -
విద్యార్థి ఆత్మహత్యపై పాఠశాలలో ఉద్రిక్తత
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల పాఠశాలలో జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం విద్యార్థి కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాలలో ఆందోళనలు చేపట్టి, ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పలువురు గ్రామ వీడీసీ సభ్యులు ఆందోళన చేసే వారిని సముదాయించే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే స్థాయికి గొడవ చేరడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎస్సై రాహుల్ గైక్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని, ఆందోళన సరికాదని హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది. మృతి చెందిన విద్యార్థి తల్లి గంగమణి మాట్లాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులు, వసతి గృహం అధికారుల అత్యుత్సాహంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తమ కుమారుడు చేసిన తప్పేంటో తమకు చెప్పకుండానే తెల్లకాగితంపై సంతకం చేయించుకుని టీసీ ఇచ్చి పంపించారన్నారు. ఈ ఘటనలో పోలీసులు సైతం కేసు నమోదు చేశారని, వీటన్నింటితో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. అడగడానికి పాఠశాలకు వచ్చిన తమకు సమాధానం చెప్పకుండా దూషించి దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘సంతానం’ నిబంధన ఎత్తివేత!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంచాయతీ, పరి షత్ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉండొద్దనే నిబంధన ఎత్తివేతకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆపై గవర్నర్ కూడా ఆ నిర్ణయానికి ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరింత మంది ఆశావాహుల్లో ఉత్సాహం పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు కన్న ఎక్కువ ఉంటే పోటీ చేయరాదనే నిబంధన ఎత్తివేయగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ, పరిషత్ ఎన్నికలకు ఉన్న నిబంధన కూడా ఎత్తివేసింది. గత స్థానిక ఎన్నికల్లో ఈ నిబంధన అమలులో ఉండగా చాలా మంది ఔత్సాహికులు పోటీకి దూరమయ్యారు. 1995 నుంచి నిబంధన అమలు.. 1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదనే నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. జనాభా నియంత్రణలో భాగంగా 1995 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చట్టం చేసింది. దీంతో 1995 జూన్ తర్వాత జరిగిన ప్రతీ స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పోటీకి దూరమయ్యారు. తాజాగా ఈ నిబంధన ఎత్తివేయడంతో ఎంతో మంది ఆశావాహులకు ఊరట లభించింది. పోటీ పెరిగే అవకాశం.. సంతానం నిబంధన తొలగడంతో స్థానిక ఎన్నికల్లో పోటీ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల జరిగితే పోటీ అభ్యర్థుల సంఖ్య చాలా వరకు పెరగనుంది. మంచిర్యాల జిల్లాలో 306 సర్పంచ్ స్థానాలు, 2,680 వార్డు సభ్యుల స్థానాలు, 129 ఎంపీటీసీ స్థానాలు, 18 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తానికి సంతానం ఎక్కువగా ఉన్నవారు ఎంతో కాలంగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి నిబంధన ఎత్తివేయడంతో వారికి కలిసి రానుంది. -
చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు మంద భీమయ్య(70) ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కాసిపేట ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. భీమయ్య భార్య 13 సంవత్సరాల క్రితం చనిపోగా అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఈనెల 4న సాయంత్రం 7గంటలకు తాగిన మత్తులో గడ్డి మందు తాగటంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ 6న సాయంత్రం మృతి చెందాడు. శుక్రవారం భీమయ్య అన్న మంద పోషం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది
బాసర: భక్తులు పోగొట్టుకున్న గోల్డ్ రింగ్, మొబైల్, నగదు, హ్యాండ్ బ్యాగ్ను గుర్తించి భక్తులకు అప్పగించి ఆలయ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. శుక్రవారం హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఇద్దరు వేర్వేరు భక్తులు కుటుంబ సమేతంగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఆలయం వద్ద మహారాష్ట్రకు చెందిన భక్తురాలు సావిత్రి బాయి మొబైల్ తో పాటు రూ.1000 నగదు, హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోయింది. హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ అనే మరో భక్తుడు అక్షరాభ్యాస మండపంలో విలువైన తన గోల్డ్ రింగ్ను పోగొట్టుకున్నాడు. విధులు నిర్వహిస్తున్న ఆలయ వాగ్దేవి సొసైటీ సిబ్బంది రాజు, హోంగార్డు ఇందల్ నారాయణ పోగొట్టుకున్న వాటిని గుర్తించి నిజాయితీతో ఆలయ ఇన్స్స్పెక్టర్ సురేశ్కు అందజేశారు. ఆయన భక్తులను పిలిపించి తిరిగి వారికి అప్పగించారు. -
గంజాయి మొక్కలు స్వాధీనం
కెరమెరి: మండలంలోని పరంధోళి గ్రామ పంచాయతీ కోటా గ్రామంలో గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎన్. మధుకర్ తెలిపారు. నిషేధిత గంజాయి సాగు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు శుక్రవారం కోటాలో తనిఖీలు చేపట్టగా గాయక్వాడ్ శివా జీ తన పొలంలో సాగు చేస్తున్న 28 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి ఖరీదు రూ.2.80 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి సాగు, విక్రయం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. గంజాయి మొక్క పెంచుతున్న మహిళపై కేసు.. నస్పూర్: పట్టణ పరిధిలోని ఆర్కే 5 కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో నిషేధిత గంజాయి మొక్క పెంచుతున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై ఉపేందర్రావు తెలిపారు. శుక్రవారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సీసీసీలోని ఆర్కే 5 కాలనీ క్వార్టర్ నంబర్ డి –216లో నివాసం ఉండే సల్లూరి శంకరమ్మ తన బంధువైన ఎండీ ఖయ్యూమ్ సోను సహకారంతో ఇంటి ఆవరణలో నిషేధిత గంజాయి మొక్క పెంచుతోంది. అందిన సమాచారం మేరకు మొక్కను స్వాధీనం చేసుకుని శంకరమ్మపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మొక్క విలువ సుమారు రూ.10,000 ఉంటుందన్నారు. రెండో ఎస్సై జితేందర్, ఏఎస్సై శకుంతల, కానిస్టేబుళ్లు బ్రహ్మచారి, ఉషారాణి, మల్లేశ్, శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వివాహిత మృతిపై ఫిర్యాదుమందమర్రిరూరల్: వివాహిత మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ మృతురాలి అన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంగడిబజారుకు చెందిన పద్మ(35)కు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేటకు చెందిన గుడికందుల రాజుతో 2018లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వారు మందమర్రిలోని అంగడిబజార్లోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఐదు నెలల క్రితం పద్మ, రాజు తమ కుమారుడితో కలిసి సాయిపేటకు వెళ్లారు. ఈనెల 1న భార్య పద్మ, కుమారుడితో మందమర్రికి వచ్చిన రాజు భార్య ఆరోగ్యం బాగాలేదని చెప్పి వారిని ఇక్కడే వదిలి వెళ్లాడు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న పద్మను కుటుంబసభ్యులు మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి గురువారం ఉదయం తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందింది. అయితే పద్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని, మృతిపై దర్యాప్తు జరపాలని మృతురాలి అన్న సదానందం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉత్సాహంగా ఫుట్బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్టలోని హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన అండర్ –17 జోనల్స్థాయి బాలబాలికల ఫుట్బాల్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో క్రీడాకారులు పెద్దసంఖ్యలో పాల్గొనగా ప్రతిభ చాటిన పలువురిని ఎంపిక చేశారు. ఎంపికై న బాలబాలికల జట్లు త్వరలో నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ సెక్రెటరీ యాకూబ్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పాల్విగ్, వెంకటేశ్, రేని రాజయ్య, దుబ్బ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో వందేమాతరం ఆలాపన
బాసర: ఆర్జీయూకేటీ, బాసరలో 150వ వందేమాతర ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వీసీ, ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ వందేమాతరం కేవలం గేయం కాదని అదొక మహా సంకల్పమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం కాలంలో వందేమాతరం ప్రతీ భారతీయుడిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని రగిలించిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పా ల్గొని వందేమాతరం గేయాన్ని ఆలపించారు. దేశాన్ని ఏకం చేసిన గేయం ‘వందేమాతరం‘ ఉట్నూర్రూరల్: స్వాతంత్ర ఉద్యమంలో దేశాన్ని ఏకం చేసిన గేయం వందేమాతరం అని ఉట్నూర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై గీతాలాపన చేశారు. బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. -
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
సోన్: మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 2025 –26 సంవత్సరానికి గాను 11వ జోనల్ స్థాయి పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి, మండల బీజేపీ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, జమాల్, ఉదయ్, సాయిలు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బంగారం.. బీకేర్ఫుల్
బెల్లంపల్లి: కార్తికమాసంతో పెళ్లిళ్ల సీజన్ పునఃప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని యువతీ యువకులు వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సంబంధాలు కుదిరిన వారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనివార్యం. నెల రోజుల క్రితం 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1.33 లక్షలకు ఎగబాకి దడపుట్టించగా ప్రస్తుతం ఆ ధర రూ.1.24 లక్షలకు పడిపోయి కాస్త ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ షురూ కావడంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లకు గిరాకీ పెరుగుతోంది. ఈక్రమంలో కొనుగోలుదారులు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం ఎమరుపాటుగా వ్యవహరించినా నష్టపోక తప్పదు. నిశిత పరిశీలన, నిర్ధారణ, అప్రమత్తంగా ఉండటం అనివార్యమైన అంశాలుగా వినియోగదారులు గుర్తించాలని మంచిర్యాల జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి విజయ్కుమార్ సూచిస్తున్నారు. పాటించాల్సిన అంశాలను ‘సాక్షి’కి వివరించారు. ఇవి పరిశీలించాలి ● బంగారం తూకం వేసేందుకు జ్యూవెల్లరీ షాపుల్లో వేయింగ్ మిషన్ వినియోగిస్తారు. దానిని ప్రతీ సంవత్సరం లీగల్ మెట్రాలజీ అధికారులు పరిశీలించి సీలు వేస్తారు. ఆ మిషన్పై సీలు ఉందా.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ షాపు యజమానులు కలిగి ఉన్నారా? తెలుసుకోవాలి. అనుమానం వస్తే షాపు యాజమానిని అడిగి నిర్ధారణ చేసుకోవాలి. ● వేయింగ్ మిషన్తో తూకంలో అనుమానం కలిగితే వెయిట్స్తో తూకం వేయించాలి. ● ఏదేనీ ఆర్నమెంట్ కొనుగోలు చేసినపుడు బంగా రంతో పాటు రాగి, వెండి, పచ్చలు, రాళ్లు, వజ్రం ఉ ండవచ్చు. బిల్లు ఇచ్చేటప్పుడు ఆ ఆర్నమెంట్లో ఏ మేం ఉన్నాయి.. ఎంత శాతం ఉన్నాయో వివరా లు తప్పనిసరిగా బిల్లు రశీదులో నగల వ్యాపారి పొందుపర్చాలి. అలా వివరాలు లేకపోతే నమోదు చే యించుకోవాలి. జీఎస్టీ నంబర్ ఉన్న రశీదు తీసుకోవాలి. ● కొనుగోలు చేసిన ఆభరణం వెనకాల హగ్ మార్క్ గుర్తు ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. షాపు ముందు ధరల పట్టిక ప్రదర్శించాలి ● జ్యువెల్లరీ షాపులో అమ్మకానికి పెట్టిన బంగారం, వెండి ధరలు ఏరోజుకారోజు తప్పనిసరిగా దుకాణం ముందు ప్రదర్శించాలి. ● రెడీమేడ్ బంగారు ఆభరణాలలో వినియోగించే స్టోన్స్, సిల్వర్, కాపర్ ధర కూడా పట్టికలో విధిగా పొందుపర్చాలి. ● మేకింగ్ చార్జీ ఆర్నమెంట్ రకాల ప్రకారంగా తేడా ఉంటుంది. చార్జీల అంశం లీగల్ మెట్రాలజీ నిబంధనల పరిఽధిలోకి రావు. అందువల్ల జ్యువెల్లరీ షాపుల నిర్వాహకులు కొనుగోలు దారుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొనుగోలుదారు సొంత నిర్ణయం తీసుకోవాలి. ● వేస్టేజీ చార్జీ ఎంత అనేది తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, ఖానాపూర్, కాగజ్నగర్, చెన్నూర్, బెల్లంపల్లి ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 100 వరకు జ్యువెల్లరీ సేల్స్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా ఏటా రూ.కోట్లలో బంగారం, వెండి ఆభరణాల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. నమ్మకంతోనే కొనుగోళ్లు జ్యువెల్లరీ షాపుల్లో బంగారం, వెండి కొనుగోళ్లు చా లామట్టుకు నమ్మకంతోనే జరుగుతున్నా యి. స దరు షాపు యజమానుల నిజాయతీపై ఆ ధారపడి అమ్మకాలు సాగుతున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో ఈతరం యువతీ యువకులు మాల్స్ ను ఆశ్రయిస్తుండగా తల్లిదండ్రులు మాత్రం వంశపారం పర్యంగా వస్తున్న జ్యువెల్లరీ షాపుకు వెళ్లి కొ నుగోలు చేయడానికి ఇష్టపడుతుండటం గమనార్హం. శుభ ముహూర్తాలు ఇవే... వివాహాలకు శుభ గడియలు వచ్చేశాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 17 వరకు, తిరిగి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 11వ తేదీ వరకు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. ఆతర్వాత ఉగాదికి కొత్త పంచాంగం వచ్చాక కానీ శుభముహూర్తాలు ఉండనున్నాయి. బంగారం మార్పిడిలో మోసాలకు అవకాశం వివాహాది శుభకార్యాలకు చాలా మట్టుకు పాత బంగారం అప్పజెప్పి కొత్త బంగారం తీసుకునే క్రమంలో మోసం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాత బంగారం, వెండి ఆభరణాలకు తరుగు అధికంగా తీసి వినియోగదారులను మోసం చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొలతల్లో, తరుగు విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా మరోషాపునకు వెళ్లి తూకం వేయించి నిర్ధారించుకోవాలి. -
హోరాహోరీగా నెట్బాల్ ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల/కళాశాలలో శుక్రవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 సబ్ జూనియర్ బాలబాలికల జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. డీవైఎస్వో అశ్వక్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 80 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఇందులో ప్రతిభ చూపి న 12 మంది బాలురు, 12 మంది బాలికల ను జోనల్స్థాయికి ఎంపిక చేశామని తెలిపా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, ఉపాధ్యాయులు మల్లేశ్, శ్రీవర్ధన్, నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, వ్యాయామ ఉపాధ్యాయులు తిరుప తి, యోగి, రాకేశ్, ప్రణీత్, సౌందర్య, వాణి తదితరులు పాల్గొన్నారు. -
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
వాంకిడి(ఆసిఫాబాద్): ఎకో వంతెనపై పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎఫ్డీపీటీ శాంతారాం అన్నారు. వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో నా లుగు వరుసల జాతీయ రహదారిపై వన్యప్రాణుల సౌకర్యార్థం నిర్మించిన ఎకో బ్రిడ్జిని శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కు మార్, కాగజ్నగర్ ఎఫ్డీవో సుశాంత్తో కలిసి పరిశీలించారు. మట్టి నింపే పనులను వెంటనే పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ అధికా రులను ఆదేశించారు. చలికాలంలో ఈ అడవుల గుండా పులులు సంచరించే అవకాశం ఉందన్నారు. మట్టి నింపితే పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా నేరుగా అడవుల్లోకి వెళ్తాయని పేర్కొన్నారు. ఎఫ్ఆర్వో గోవింద్చంద్ సర్దార్, ఎఫ్ఎస్వో సతీశ్కుమార్, ఎఫ్బీవోలు షాహిద్, ఉమారాణి, ఎన్హెచ్ఏఐ అధికారులు ఉన్నారు. -
చెరువుకు చేప..!
ఆసిఫాబాద్: ఎట్టకేలకు చేపపిల్లల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏటా జూన్లో నిర్వహించాల్సి న టెండర్లు ఈసారి నాలుగు నెలలు ఆలస్యంగా చేపట్టారు. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి చేప పిల్లల పంపిణీపై ఇటీవల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని కుమురంభీం, వట్టివాగు, ఎన్టీఆర్ ప్రాజెక్టులు, మత్తడివాగుతోపాటు 261 చెరువులు ఉన్నాయి. వీటిలో 1.44 కోట్ల చేప పిల్లల విడుదలకు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. గత నెల 27న కాగజ్నగర్లో చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం మేరకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం మత్స్యశాఖ, రెవెన్యూ శాఖతో పాటు పశు సంవర్ధక శాఖకు చెందిన ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఒక జిల్లాకు చెందిన కమిటీ మరో జిల్లాలో పరిశీలన చేపట్టనుంది. మత్స్యకారులకు ఉపాధిమత్స్యకారులకు ఉపాధి కల్పించి చేయూతనివ్వాలనే ఉద్దేశంలో 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో 74 మత్స్యకారుల సంఘాలు ఉండగా, వీటి పరిధిలో 3,100 మంది మత్సకారులు ఉన్నారు. మత్స్యశాఖ ద్వారా వీరికి చేపల పెంపకానికి అవసరమైన వస్తువులు రాయితీపై అందిస్తున్నారు. అలాగే జలాశయాల్లో పెంచుకునేందుకు వీలుగా ఉచితంగా చేప పిల్లలు అందిస్తున్నారు. కుమురంభీం(అడ), వట్టివాగు, పీపీరావు, ఎన్టీఆర్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. 11 పెద్ద చెరువులు, 250 చిన్న చెరువులు ఉన్నాయి. ఆయా జలాశయాల్లో ఈ ఏడాది 1.44 కోట్ల చేప పిల్లలు విడుదల చేయనున్నారు. చిన్న చెరువుల్లో 66 లక్షలు, పెద్ద చెరువుల్లో 78 లక్షల చేప పిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగజ్నగర్లో ఇప్పటికే ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు చేతుల మీదుగా పంపిణీని ప్రారంభించారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతిజిల్లాలోని జలాశయాల్లో పెంచిన చేపలను స్థానికంగా విక్రయించడంతోపాటు మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. 2022లో 1,35,81,000 చేప పిల్లలు విడుదల చేయగా, 2023లో 1,38,51,000 చేప పిల్లలు, 2024లో 1.45 కోట్ల చేపపిల్లలు విడుదల చేశారు. ఈ ఏడాది 1.44 కోట్ల చేప పిల్లలు వదలనున్నారు. జలాశయాల్లో వదిలిన చేప పిల్లలు 8 నెలల్లో అర కిలోకు పైగా బరువు పెరుగుతాయి. మత్స్యకారులు వాటిని జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్, మంచిర్యాల, మహారాష్ట్రలోని చంద్రపూర్, బల్లార్షా ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. నెలాఖరులోగా పూర్తి ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్ల వివరాలు కమిటీల ద్వారా పరిశీలించి, తక్కువ రేటు వేసిన వారిని ఎంపిక చేశాం. గత నెల 27న కాగజ్నగర్లో చేపపిల్లల పంపిణీ ప్రారంభించాం. ఈ నెలాఖరులోగా పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తాం. – సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అధికారిరెండేళ్లుగా జాప్యం..ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చేప పిల్లల ను జలాశయాల్లోకి వదలనున్నారు. అయితే గత రెండేళ్లుగా టెండర్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పంపిణీ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. ఈ ఏడా ది కూడా జాప్యం జరగడంతో కొన్నిచోట్ల మత్స్యకారులే సొంతంగా చేపపిల్లలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో ఉచిత చేప పిల్లల పంపిణీలో వేగం పెరగనుంది. -
‘సర్సిల్క్’ స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఆసిపాబాద్అర్బన్: కాగజ్నగర్ పట్టణంలోని మూతపడిన సర్సిల్క్ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, కొత్త పరిశ్రమలు స్థాపించాలని సీపీఎం నియోజకవర్గ కన్వీనర్ ఆనంద్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సర్సిల్క్ మిల్లు మూతపడి ఉండటంతో సుమారు నాలుగు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రస్తుతం మిల్లు స్థలాన్ని ఈ– వేలం వేయనున్నట్లు అఫిషియల్ లిక్విడేటర్ ప్రతినిధులు పట్టణంలోని పలుచోట్ల బ్యానర్లు కట్టారని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నూతన పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్, టీకానంద్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు ముక్కలాట!
తిర్యాణి(ఆసిఫాబాద్): సులువుగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో కొందరు పేకాట వంటి జూదాలకు బానిసలుగా మారుతున్నారు. సరదాగా కోసం ప్రారంభించి.. క్రమంగా తమ కుటుంబాల ను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. స్థిరచరాస్తులు అమ్ముకుని ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తూ కొంతమందిని అరెస్టు చేస్తున్నా.. నిందితులు మళ్లీ అదే ఆట వైపు వెళ్తున్నారు. గతంలో జూదరులు ఎక్కువగా ఆన్లైన్లో రమ్మీ కల్చర్ యాప్ల ద్వారా పేకాట ఆడేవారు. తెలంగాణ కొన్నేళ్లుగా గేమింగ్ యాక్ట్ అమలు ఉండటంతో ఆన్లైన్ జూదం అనుమతి ఉన్న ఇతర రాష్ట్రాల లొకేషన్ను ఫేక్ జీపీఎస్ ద్వారా ఎంపిక చేసుకునేవారు. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆన్లైన్ జూదం, బెట్టింగ్ యాప్లను నిషేధించింది. దీంతో జిల్లాలోని జూదరులు మళ్లీ పాత పద్ధతిలో ఆఫ్లైన్ ద్వారా పేకాట ప్రారంభించారు. గ్రూపులుగా.. రహస్య ప్రాంతాల్లోపేకాట ఆడేందుకు ఐదు మంది నుంచి పదిమంది వరకు గ్రూపుగా ఏర్పడి రహస్య ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్నగర్, కౌటాల, గోలేటి, రెబ్బన, తిర్యాణి, దహెగాం, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) ప్రాంతాల్లో ఈ దాందా ఎక్కువగా ఉంది. నిర్వాహకులు కొన్నిచోట్ల జూదరుల నుంచి కనిష్టంగా రూ.10 వేల నుంచి మరికొన్ని ప్రాంతాల్లో రూ.25 వేల వరకు డిపాజిట్గా తీసుకుంటున్నారు. చెప్పిన మొత్తం చెల్లిస్తేనే ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో పేకాట స్థావరంలో రోజుకు రూ.లక్షల నగదు చేతులు మారుతోంది. జూదరులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో నిర్వాహకులు పంట పొలాలు, మామిడి తోటలు, అటవీ సమీప ప్రాంతాలను స్థావరాలుగా ఎంచుకుంటున్నారు. ఒక్కో ఆట దాదాపు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇందుకు నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.500 నుంచి రూ.2000 వరకు కమీషన్ వసూలు చేస్తున్నారు. మందు, విందు వంటి వసతులు సమకూరుస్తున్నారు. పోలీసుల దాడులు లేకుండా మామూళ్ల ద్వారా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. పేకాడే వారిలో నాయకులతోపాటు సమాజంలో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉండటంతో ఫిర్యాదు వస్తేనే దాడులు చేస్తున్నారని, లేదంటే చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని వారు కోరుతున్నారు.ఇటీవలి ఘటనలు -
అడెల్లికి ప్రణమిల్లి..
నిర్మల్/సారంగపూర్: తొలిపొద్దు వేళ జిల్లా ప్రజల ఇలవేల్పు.. అడెల్లి మహా పోచమ్మ తల్లి తన కొత్తగుడిలోకి అడుగుపెట్టింది. తనను కొలిచే భక్తులను చల్లంగ చూసేందుకు గద్దైపె కొలువుదీరింది. పచ్చని సహ్యాద్రి సానువుల్లో నుంచి పక్షుల కిలకిలారావాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శుక్రవారం వేకువజామున మహాపోచమ్మ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. కాశీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పీఠాధిపతి సుదర్శన దండి, తాధిక ప్రతిష్ఠాపనాచా ర్యుడు గురుమంచి చంద్రశేఖరశర్మ, వేదపండితుల బృందం ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ, యంత్రప్రతిష్ఠ, నిత్యనిధి, మహానివేదన, పూ ర్ణాహుతి, కుంభాభిషేకం, సహస్ర కలశాభిషేకం, ప్రథమపూజ, హారతి, తదితర పూజా కార్యక్రమాల ను వేడుకగా నిర్వహించారు. గర్భాలయంలో మహాపోచమ్మతోపాటు తన ఏడుగురు అక్కాచెల్లెళ్లు అయిన బ్రహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్టవి, వారాహి, ఇంద్రాణి, చాముండిల విగ్రహాలనూ ప్రతిష్ఠించారు. ఇక ‘చల్లంగ చూడు తల్లీ..’ అంటూ కొత్తగుడిలో, కొత్తరూపులో కొలువుదీరిన తల్లిని కనులారా వీక్షిస్తూ.. మనసారా వేడుకుంటూ భక్తజనం ప్రణమిల్లారు. శుక్రవారం వేకువజామున 3 గంటల నుంచే ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రతిష్ఠాపన పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కాశీ పీఠాధిపతి సుదర్శన దండి భక్తులకు కాసేపు ప్రవచనాలు వినిపించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆయనకు అమ్మవారి జ్ఞాపికను అందజేసి ఆశీర్వచనాలు పొందారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు...అడెల్లి మహాపోచమ్మ అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఆయన సతీమ ణి కవిత పట్టువస్త్రాలు సమర్పించారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, మాజీ మంత్రి అల్లోల ఇందక్రకరణ్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, రాష్ట్ర డెయిరీ కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ లోకభూమారెడ్డి, తదితర ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి దంపతులు మహా అన్నప్రసాద వితరణ చేశారు.నూతన ఆలయంలో కొలువుదీరిన పోచమ్మతల్లిఉదయం 4గంటలకు అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్న భక్తులుదారులన్నీ అడెల్లికే..‘చలో అడెల్లి..’అంటూ దారులన్నీ అమ్మవారి వైపే సాగాయి. నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, నిజామాబాద్ నలువైపుల నుంచి కార్లు, జీపులు, బస్సుల్లో భక్తులు భారీగా తరలివచ్చారు. సారంగపూర్ మండలంలోని ఊళ్లకు ఊళ్లు డప్పుచప్పుళ్లు, డీజేపాటలతో నెత్తిన బోనం కుండలు ఎత్తుకుని అమ్మవారి సన్నిధికి వచ్చాయి. సారంగపూర్ నుంచి అడెల్లి వరకు వందలాది వాహనాలతో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సారంగపూర్తోపాటు ప్రత్యేకంగా వచ్చిన పోలీ సు అధికారులు, సిబ్బంది క్లియర్ చేశారు. అడెల్లితోపాటు మండలంలోని పలు గ్రామాల భక్తులు, మాలధారణ చేసిన స్వాములు వేకువజా మునుంచే అమ్మవారి సేవలో భాగమయ్యారు. ఆలయ ఈవో భూమయ్యతోపాటు దేవాదాయశాఖ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది, వైద్యసిబ్బంది తదితర శాఖలన్నీ అమ్మవారి వేడుకలో సేవలందించాయి. -
క్రీడాపోటీల్లో ప్రతిభ చూపాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ క్రీడాపోటీల్లో ప్రతిభ చూపాలని బెల్లంపల్లి ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీధర్ అన్నారు. గోలేటి టౌన్షిప్లోని భీమన్న స్టేడియంలో శుక్రవారం డిపార్టుమెంటల్ ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. నిత్య సాధనతో క్రీడాకారులు ఆరోగ్యంతోపాటు ఆనందం ఉంటారన్నారు. సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు పోటీల్లో రాణించేందుకు యాజమాన్యం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. కోల్ ఇండియా పోటీల్లో పతకాల సాధనే లక్ష్యంగా శ్రమించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మాతాశిశు సంక్షేమానికి కృషి
ఆసిఫాబాద్: మాతాశిశు సంక్షేమం దిశగా కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శుక్రవారం మహిళాశిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఐసీడీఎస్, వైద్య సిబ్బందికి ఎస్ఎస్ఎఫ్పీఆర్ రీ ఓరియెంటేషన్ నిర్వహించారు. డీఎంహెచ్వో సీతారాం, యునిసెఫ్ హైదరాబాద్ బృందం జిల్లా కన్సల్టెంట్ బాలాజీతో కలిసి హాజరయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ మాతాశిశు, మాతృ పోషణ, ఈవైసీఎఫ్ మార్గదర్శకాలు, పోషకాహార లోప నివారణ చర్యలు, పిల్లల పోషకాభివృద్ధి అంశాలపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత, వయస్సుకు అనుగుణంగా ఆహారం, సూక్ష్మ పోషకాలు, పిల్లల వృద్ధి పర్యవేక్షణ గురించి నిపుణుల ద్వారా వివరించామని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సాంకేతిక సహాయకులు ప్రవీణ్, నరేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7‘సాక్షి’ స్పెల్బీ అభినందనీయం సాక్షి మీడియా ఆధ్వర్యంలో శుక్రవారం కౌటాల నజరేత్ మిషన్ స్కూల్లో విద్యార్థులకు స్పెల్బీ పరీక్ష నిర్వహించారు. 18 మంది విద్యార్థులు హాజరయ్యారు. 9లోu ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వాతావరణం పొడిగా ఉంటుంది.ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రాత్రి మంచు కురుస్తుంది. చలి ప్రభావం పెరుగుతుంది. బంగారం.. బీకేర్ఫుల్ కార్తికమాసంతో పెళ్లిళ్ల సీజన్ పునఃప్రారంభమైంది. ఆభరణాల కొనుగోళ్లకు గిరాకీ పెరుగుతోంది. కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. 8లోu శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తి వందేమాతరం
ఆసిఫాబాద్: స్వాతంత్య్ర ఉద్యమానికి వందేమాతరం గీతం స్ఫూర్తిగా నిలిచిందని, వందేమాతరం దేశభక్తికి నిర్వచనమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. బంకించంద్ర చటర్జీ వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామూహిక వందేమాతర గీతాలాపన చేశారు. ఆర్డీవో లోకేశ్వర్రావు, అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి వందేమాతరం ఆలపించారు. కలెక్టర్ మాట్లాడుతూ వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పోరాటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. పోరాట స్ఫూర్తిని రగిలించిందిఆసిఫాబాద్అర్బన్: స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో జాతీయ గేయం వందేమాతరం పోరాట స్ఫూర్తిని రగిలించిందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవా రం సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఎస్పీ మాట్లాడుతూ వందేమాతరం గేయం దేశభక్తి, ఐక్యత, త్యాగం వంటి విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతీ భారతీయుడు వందేమాతరం గేయాన్ని గర్వంగా ఆలపించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ(అడ్మిన్) పెద్దన్న, ఆర్ఐ(ఎంటీఓ) అంజన్న, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, కార్యాలయ, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. ఆలపిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అధికారులు గీతాలాపన చేస్తున్న ఎస్పీ కాంతిలాల్ పాటిల్ -
పత్తి కొనుగోళ్లు షురూ
వాంకిడి(ఆసిఫాబాద్): జిల్లాలోని గురువారం సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు జన్కాపూర్, బూర్గుడలో రెండు, వాంకిడిలోని కేంద్రాల్లో ప్రారంభించారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ సమీపంలోని జిన్నింగ్ మిల్లులో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కొబ్బరికాయ కొట్టి కొనుగోళ్లను ప్రారంభించారు. మొదటి రైతుకు చెందిన పత్తిలో 12 శాతం తేమ ఉండడంతో క్వింటాల్కు రూ.7,785 చొప్పున చెల్లించారు. వాంకిడిలో తేమశాతం ఎక్కువగా ఉందని సీసీఐ అధికారులు కొనుగోలుకు నిరాకరించారు. దీంతో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. చివరికి పలువురు పత్తి పంటను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. తేమశాతం ఎక్కువగా ఉందని..వాంకిడి మండల కేంద్రంలోని ఓ మిల్లులో గురువారం సీసీఐ కేంద్రం ప్రారంభించగా, రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమశాతం ఎక్కువ ఉందని అధికారులు కొనుగోలుకు తిరస్కరించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు సుమారు 30 వాహనాల్లో పత్తిని విక్రయించేందుకు తీసుకువచ్చారు. పరిశీలించిన అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన 12 శాతం కంటే తేమ అధికంగా ఉందని కొనుగోలు చేయలేదు. ఆవేదన చెందిన రైతులు ఎన్హెచ్– 363పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వారు మాట్లాడుతూ ఆరుగలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిబంధనల పేరుతో మోసం చేస్తుందని ఆరోపించారు. పత్తితీత సమయంలో కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు తడిసిన పత్తిలో తేమ ఉండదా అని ప్రశ్నించారు. ఈ ఒక్కసారి కొనండి సార్ అంటూ వేడుకున్నారు. స్లాట్ బుక్ చేసుకుని కిరాయికి వాహనాలు మాట్లాడుకుని వస్తే ఇలా కొర్రీలు పెట్టడం అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో హైవేకు ఇరువైపులా కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో రైతులు, సీసీఐ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం రాస్తారోకో విరమించారు. -
సంచులు మార్చి.. మళ్లీ అప్పగించి
ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ క్రాస్రోడ్డు వద్ద ఓ రైస్ మిల్లులో సర్కారు పంపిణీ చేసిన బియ్యం బస్తాలనే నేరుగా మిల్లులోకి తరలిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం పంపిణీ చేసిన గన్నీ సంచి నుంచి తమ వద్ద ఉన్న గన్నీ సంచుల్లోకి నింపేస్తున్నారు. వందల క్వింటాళ్ల కొద్దీ రేషన్ షాపుల నుంచే నేరుగా మిల్లులకు రావడం గమనార్హం. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద అప్పగించాల్సిన బియ్యాన్ని, సర్కారుకు బకా యి ఉన్న మిల్లర్లు వడ్లను గతంలోనే అమ్మేసుకున్నారు. చాలాచోట్ల సర్కారు అప్పగించిన వడ్లు లేకపోవడంతో జరిమానాలు, కేసులకు భయప డి రీసైక్లింగ్ను ఎంచుకున్నారు. మిల్లులో ధా న్యం మరాడించకుండానే నేరుగా రేషన్ బియ్య మే కొనుగోలు చేసి సీఎంఆర్ కింద బియ్యం పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తున్నారు. గోదాంల వద్ద తనిఖీలు చేసే అధికారులను మేనేజ్ చేసుకుంటూ బియ్యం పాస్ చేయించుకుంటున్నారు. కాగజ్నగర్ పరిధిలో రేషన్ బియ్యం మిల్లులోనే దొరికిన ఘటనలు ఉన్నాయి. -
‘తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలి’
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటా లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్నార్ రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూ లే విగ్రహం వద్ద గురువారం మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ.. పార్లమెంట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. జనవరి నాలు గో వారంలో లక్షమందితో వేల వృత్తులు.. కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మౌన దీక్షకు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు కేశవ్రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ప్రణయ్, నాయకులు, సభ్యులు పురుషోత్తం, బాలేశ్, జక్కన్న, విశాల్, రమేశ్, శ్రీనివాస్, మీరాజ్, రవీందర్, నారాయణ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి 2025– 26 వానాకాలం సీజన్ వరిధాన్యం కొనుగోళ్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ కేంద్రానికి మండల స్థాయి అధి కారిని పర్యవేక్షకులుగా నియమిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీఆర్డీవో దత్తారావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నేడు వందేమాతరం సామూహిక గీతాలాపనకలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఉదయం 11 గంటలకు వందేమాతరం సామూహిక గీతాలాపన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే బంకించంద్ర చటర్జీ వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గీతాలాపన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభు త్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. -
మళ్లీ మిల్లులకే రేషన్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రేషన్ బియ్యం అటు, ఇటు తిరిగి చాటుగా మళ్లీ మిల్లులకే చేరుతోంది. మధ్యవర్తుల నుంచి దళారుల వరకు ఓ ముఠాగా మారి వ్యవస్థీకృతంగా ఈ దందా సాగుతోంది. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీల్లో ఇదంతా బట్టబయలవుతున్నా.. పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నా రు. మంచిర్యాల జిల్లాల్లోని మిల్లులతోపాటు కు మురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మిల్లులకు సన్నబియ్యం తరలిపోతోంది. గతంలో మహారాష్ట్ర సిరొంచ, వీరూర్ వరకు రోడ్డు, రైల్వే మార్గాల్లో అధికంగా సరఫరా జరిగింది. కొద్ది నెలలుగా అధి కంగా రైస్ మిల్లర్లే కొనుగోలు చేస్తూ సర్కారుకే అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ మొదలైన రెండు, మూడు నెలలపాటు లబ్ధిదారులే తీసుకున్నారు. దీంతో నిల్వల కొరత ఏర్పడింది. రెండు నెలల క్రితం ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడంతో భారీ ఎత్తున నిల్వలు ఏర్పడ్డాయి. మళ్లీ లబ్ధిదారులతో పాటు కొందరు డీలర్లుసైతం నేరుగా దళారులకే అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెబ్బెనలో ‘రేషన్ కింగ్’ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో కొన్నేళ్లుగా రేషన్ దందాలో ఆరితేరిన ఓ వ్యాపారి తన జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల క్వింటాళ్ల కొద్దీ బియ్యం కొంటున్నాడు. ప్ర స్తుతం సన్నబియ్యం కావడంతో ధర పెంచి కిలోకు రూ.24 చెల్లిస్తున్నాడు. అంతేకాక బియ్యం పంపే వారికి వాహనం సైతం సమకూర్చుతున్నాడు. దీంతో దళారులు గ్రామాలు, రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి రెబ్బెన వ్యాపారికి అమ్మేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రం ఎన్టీఆర్ నగర్లో పట్టుబడిన సుమారు 90 క్వింటాళ్ల వరకు బియ్యం ఆసిఫాబాద్కు తరలిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. గతంలోనూ దొడ్డు బియ్యం సమయంలోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి. అవేమీ లెక్క చేయకుండా సన్నబియ్యంలో దందా కొనసాగిస్తుండగా, తెర వెనక అధికారుల సహాయం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. నాణ్యత కోల్పోతున్న బియ్యంమొదట పంపిణీ మొదలైనప్పుడు సన్నబియ్యం నాణ్యతతో ఉండగా, ప్రస్తుతం చాలా షాపుల్లో నా ణ్యత లేకుండా వస్తున్నట్లుగా లబ్ధిదారులు చెబుతున్నారు. సన్నరకంలో మార్పుతోపాటు బియ్యంలోనూ మార్పులు వస్తున్నట్లు చెబుతున్నారు. బియ్యం రీసైక్లింగ్లో రసాయన పరీక్ష చేసి మిల్లింగ్ చేసినవా? లేక రేషన్ బియ్యం తిరిగి అప్పగిస్తున్నారా? అని పరీక్ష చేసి రంగు మారితే రిటర్న్ పంపాలి. అయితే గోదాముల్లో తనిఖీలు నామమాత్రంగా మారడంతో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రేషన్ బియ్యం దుర్వినియోగమవుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులను తరుచూ తనిఖీ చేస్తూ.. మిల్లింగ్ చేసే సమయంలో రోజువారీగా కరెంట్ బిల్లు, అలాగే రీసైక్లింగ్ అరికట్టేందుకు ఆ బియ్యం పాసింగ్ను పకడ్బందీగా పర్యవేక్షిస్తే ఈ దందాను ఆపే అవకాశం ఉంది. -
చివరికి ప్రైవేటుకే..
సీసీఐకి విక్రయిస్తే మద్దతు వస్తుందని ఆశపడిన రైతులకు నిరాశే మిగిలింది. మిల్లుకు వచ్చిన సుమారు 30 వాహనాలను సీసీఐ అధికారులు పరిశీలించగా 5 నుంచి 7 వాహనాల్లోని పత్తిలో మాత్రమే 12 శాతం కంటే తక్కువ తేమను చూపించింది. మిగిలిన వాహనాల్లో 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నట్లు గుర్తించారు. దీంతో తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేయలేదు. సాయంత్రం వరకైనా కొనుగోలు చేస్తారని రైతులు ఎదురుచూశారు. చివరికి ప్రైవేటు వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి తక్కువ రేటుకు అమ్ముకున్నారు.సాయంత్రం వరకు వేచి చూశా.. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిసి స్లాట్ బుకింగ్ చేసుకున్నా. ఓ ప్రైవేటు వాహనం కిరాయికి మాట్లాడుకుని సుమారు 12 క్వింటాళ్ల పత్తిని విక్రయించేందుకు తీసుకువచ్చా. అధికారులు పత్తిలో 16 శాతం తేమ వస్తుందని కొనలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రైవేటుకు విక్రయించా. పత్తితీత సమయంలో వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలి. – మస్నే విమల, ఖమాన, మం.వాంకిడి -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారని డీఎస్వో షేకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల ఆవరణలో గురువారం పీడీ మీనారెడ్డి, కోచ్లు విద్యాసాగర్, అరవింద్, హెచ్ఎం జంగుతో కలిసి క్రీడాకారులను అభినందించారు. డీఎస్వో మాట్లాడుతూ ఆదిలా బాద్లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అండర్– 17 జోనల్స్థాయి బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో ముత్తుబాయి, అనిత, పల్లవి, అమూల్య ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 7 నుంచి 9 వరకు నారాయణపేటలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. -
సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పత్తి క్వింటాల్కు రూ.8110 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. దళారులు, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోవద్దన్నారు. జిల్లాలో 24 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. ప్రతీ రైతు కపాస్ కిసాన్ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మద్దతు ధర, తేమశాతం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు సడలించాలిపత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు సడలించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. తేమ శాతం 12 నుంచి 27 వరకు ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధనను సైతం సడలించి 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, ఏవో మిలింద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు రఫీక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
ఆసిఫాబాద్రూరల్: బాల్య వివాహాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామ ని డీసీపీవో మహేశ్ తెలిపారు. మండలంలో ని నంబాలలో గురువారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహం చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సామాజిక సమస్య అని అన్నారు. మైనర్లకు పెళ్లి చేస్తే చట్టప్రకారం చ ర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే వెంటనే 112, 1098 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మౌనిక, ప్రత్యేక అధికారి వెంకటేశ్, హెచ్ఎం వసంతరావు, కౌన్సిలర్లు చంద్రశేఖర్, రాణి పాల్గొన్నారు. -
ఏసీబీ అధికారుల దాడి
ఆసిఫాబాద్అర్బన్: రైస్ మిల్లు యజమాని నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటూ పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ఏసీబీకి చిక్కారు. జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద గురువారం ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు వివరాలు వెల్లడించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ జీవీ నర్సింహారావు దహెగాంకు చెందిన ఓ రైస్మిల్లు యజమాని నుంచి సీఎంఆర్ నాణ్యత పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఒక్కో లారీకి రూ.25 వేల చొప్పున మూడు లారీలకు రూ.75 వేలు డిమాండ్ చేశాడు. అప్పటికే 16 లారీలకు లంచం ఇవ్వడంతో బాధితుడు మంచిర్యాలలోని ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం అధికారి నుంచి డబ్బులు ఇవ్వాలని ఫోన్ వచ్చింది. రెబ్బెన మండలం కై రిగాం ఫ్లైఓవర్ వద్ద కారులో రూ.75 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నర్సింగరావుతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మణికాంత్ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడినా, లంచం కోసం వేధించినా 1064, ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మొబైల్ నం.91543 88963కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. వేధింపులు భరించలేకనే..పౌరసరఫరాల శాఖ అధికారుల వేధింపులు భరించలేకనే ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు. దహెగాంలోని తన రైస్ మిల్లులో రబీ సీజన్ వడ్లు పట్టకుండా ట్రాక్షీట్ ఇవ్వాలని అధికారులు కోరగా నిరాకరించానని పేర్కొన్నాడు. దీంతో అధికారులు కక్ష కట్టి సెప్టెంబర్ 9న బియ్యం సీజ్ చేసి తనపై 6ఏ కేసు పెట్టారని ఆరోపించాడు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు బియ్యం విడుదల చేయలేదని పేర్కొన్నాడు. -
ట్ర(డ)బుల్ ప్రయాణం..!
మంచిర్యాలఅర్బన్: ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్న రహదారి ప్రమాదాలు కలవర పరుస్తున్నాయి. కర్నూల్, చేవేళ్ల బస్సు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఇంకా కళ్లముందే కదలాడుతూనే ఉన్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నిల్చునేందుకు వీల్లేకుండా.. అత్యవసర పరిస్థితుల్లోనూ కదల్లేకుండా కిక్కిరిసిపోతున్నారు. ఏళ్ల తరబడి ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, సిబ్బంది కొరత, వరుస డ్యూటీలు, నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సెలవుల్లో ఉన్నవారితోపాటు అనారోగ్యం నుంచి కోలుకోని వారికీ డ్యూటీలు, డ్యూటీ దిగిన వారికి డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. విశ్రాంతి లేకపోవడంతోపాటు ప్రమాదాలకు ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ‘మహాలక్ష్మి’లే అధికం..ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపుగా ఉంటోంది. ఇక పండుగ వేళల్లో రద్దీ ఉంటుంది. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా, బతుకమ్మ పండుగల వేళ 17 రోజుల్లో 599 ప్రత్యేక బస్సులు నడిపించగా మహిళలే అధికంగా ప్రయాణించారు. మొత్తం 49,31,476 మందిలో మహిళలు 32,60,025 మంది ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పల్లె వెలుగు బస్సులో 55మంది, ఎక్స్ప్రెస్ల్లో 39, రాజధానిలో 39, లగ్జరీలో 36, లహరీలో 48 మంది ప్రయాణికు ల సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం ఏ బస్సు చూసినా రద్దీతో కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి పథ కం అమలు తర్వాత బస్సుల్లో నిల్చుని, సామర్థ్యాని కి మించి ప్రయాణం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, భైంసా డిపోల్లో ఆర్టీసీ, అద్దె బస్సులు 630 ఉన్నాయి. 2023–24లో ప్రమాదాల సంఖ్య తగ్గినా 2024–25లో భారీగా పెరిగాయి. బీమా రాదు..ఏదైనా వాహనం కొనుగోలు చేస్తే బీమా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆర్టీసీ బస్సులకు బీమా మినహాయింపు ఇవ్వగా.. అద్దె బస్సులకు ఆర్టీసీ బీమా చేయిస్తోంది. బాధిత కుటుంబాలు కోర్టుల్లో పోరాడి ఆర్టీసీ నుంచి పరిహారం పొందడం మినహా చేసేదేమీ లేదు. బస్సుకు బీమా ఉంటే కంపెనీ పరిహారం చెల్లించే వీలుంటుంది. అద్దె బస్సుల్లో పరిమితికి తగ్గట్టుగా 55మందికి మాత్రమే బీమా వర్తిస్తుంది. 80 నుంచి వంద మంది వరకు బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో ప్రమాదం జరిగితే బీమా కంపెనీ చేతులేత్తేసే అవకాశాలు లేకపోలేదు. అద్దె బస్సుల యజమానులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ప్రథమ చికిత్స లేదు..బస్సు ప్రమాదాలతో ఆర్టీసీ అప్రమత్తమైంది. మంటలార్పే పరికరాలపై దృష్టి సారించింది. అద్దె బస్సుల్లో పరికరాల ఏర్పాటుకు కొంత సమయం ఇచ్చిన ట్లు తెలుస్తోంది. కొన్ని బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్స్లు లేకపోగా.. మరికొన్నింటిలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్(పౌచ్) అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కండక్టర్ టిమ్ మిషన్తోపాటు పౌచ్ తీసుకెళ్లడం, అప్పగించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జాగ్రత్తలు ఇలా..సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. నిండిన తర్వాత మరో దాంట్లో ఎక్కేలా అవగాహన కల్పించాలి. గరిష్ట ప్రయాణికుల సంఖ్య సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలి. రద్దీ రూట్లలో సర్వీసులు పెంచడం, పాఠశాల సమయం, సాయంత్రం వేళల్లో బస్సులు ఎక్కువగా తిప్పేలా చూడాలి.డ్రైవర్లకు విశ్రాంతి కరువు?మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సు డ్రైవర్లకు గంట తర్వాత 15నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఇలా ఎన్ని గంటలు నడిపితే అన్ని 15 నిమిషాలు గమ్యం చేరాక విశ్రాంతి ఉండాలి. ఒక రోజు విధులు నిర్వర్తిస్తే మరుసటి రోజు సెలవు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆర్టీసీ అధికారులు ఇష్టానుసారంగా విధులకు పంపిస్తున్నారు. అద్దె బస్సు డ్రైవర్లకు రోజు విడిచి రోజు విధులకు రావాలని చెబుతూ సంస్థ డ్రైవర్లకు ఓటీ డ్యూటీ చేయాలని చెప్పడం గమనార్హం. రోజుకు ఎనిమిది గంటలకు మించి విధులు కేటాయించకూడదు. గంటల తరబడి స్టీరింగ్పై ఉండి వాహనం నడుపుతున్నారు. మరుసటి రోజు సెలవు ఇవ్వకుండా డ్యూటీలకు పంపించడంతో ఒత్తిడి, ఆరోగ్యంపై ప్రభావం తప్పడం లేదని కొందరు పేర్కొంటున్నారు. డ్రైవర్ల సీట్లు అనువుగా లేకపోవడంతో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణం వల్ల స్టీరింగ్ అదుపు తప్పే వీలుంటుంది. రద్దీ వల్ల గాలి ఆడకపోవడం, బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు విధులు కష్టతరంగా మారుతోంది. ప్రమాదాలు ఇలా.. -
ఘనంగా గురునానక్ జయంతి
వాంకిడి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో బుధవారం సిక్కు మ త స్థాపకుడు గురునానక్ జయంతి ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గు రునానక్ సిక్కు మతాన్ని స్థాపించి ప్రజలను ఏ కం చేశారని తెలిపారు. సిక్కులు కార్తిక పౌర్ణమి రోజును పవిత్రమైందిగా భావిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమ త సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు సందీప్ దుర్గే, నాయకులు దుర్గాజీ, శ్యామ్రావు, రాజేశ్వర్, చంద్రమణి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘వర్క్షాప్ మూసివేత ఆలోచన సరికాదు’
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా వర్క్షాప్ను మూసివేసే ఆలోచన సరికాదని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు అన్నారు. బుధవారం గోలేటి టౌన్షిప్లో జీఎం విజయ భాస్కర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏరియాలో దాదాపు వందేళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, దానిని దృష్టిలో ఉంచుకుని వర్క్షాప్నకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్వైజర్, టెక్నీషియన్లను డిప్యూటేషన్పై ఖైరిగూర ఓసీపీకి బదిలీ చేయడంతో వర్క్షాప్ను మూసివేస్తారనే అనుమానం కలుగుతోందన్నారు. ఖైరిగూర ఓసీపీలో మ్యాన్పవర్ను పెంచాల్సిన గుర్తింపు సంఘం నాయకులు.. వర్క్షాప్లో పనిచేసే టెక్నీషియన్లను డిప్యూటేషన్పై పంపించి వర్క్షాప్ను మూసివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బ్రాంచి కార్యదర్శి శివారెడ్డి, ఏరియా ఆర్గనైజర్ ఎస్కే ఇనూస్, నాయకులు రాజశేఖర్, సంతోష్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు కొర్రీలు..!
ఆసిఫాబాద్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. గురువారం నుంచి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఇప్పటికే జిల్లా మార్కెటింగ్, వ్యవసాయ, తూనికలు, కొలతల శాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలని ఆదేశించారు. అయితే సీసీఐ నిబంధనలపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 8 శాతం తేమ ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తామని పేర్కొనగా, తాజాగా ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంపై మండిపడుతున్నారు. 3.30 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో 1.48 లక్షల మంది రైతులు ఉండగా, ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 38 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శా ఖ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. ప్రభుత్వం పత్తికి క్వింటాల్కు రూ.8,100 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది సైతం బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వ మద్దతు ధర అధికంగా ఉండడంతో రైతులు సీసీఐ వైపే మొగ్గు చూపారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్, జైనూర్ మార్కెట్ కమిటీల పరిధిలో 24 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇబ్బందికరంగా నిబంధనలు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే తేమశాతంతో నష్టపోతుండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పత్తిలో తేమశాతం పెరిగింది. కానీ సీసీఐ కేంద్రాల్లో తేమశాతం 8 నుంచి 12 ఉంటేనే కొనుగోలు చేస్తారు. నిర్దేశించిన దానికంటే అధికంగా ఉంటే క్వింటాల్కు ఒక పాయింట్ చొప్పున కోత విధిస్తారు. అలాగే గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు పరిమితి ఉండగా, తాజాగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి విధించింది. ఎకరా నికి 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వస్తే ప్రైవేటులో అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు క్వింటాల్కు రూ.6,500 నుంచి రూ.7,000 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన అధిక దిగుబడి వచ్చిన రైతు ఎకరాకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్టపోనున్నారు.జిల్లాలో పత్తి కొనుగోళ్ల వివరాలు సంవత్సరం కొనుగోళ్లు ఆదాయం 2020– 21 11,50,641 5.81 2021– 22 9,00,247 7.20 2022– 23 10,16,640 6.95 2023– 24 10,16,400 6.92 2024– 25 18,28,900 11.50 ‘కిసాన్ కపాస్’లో స్లాట్ బుకింగ్ పత్తి కొనుగోళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్ను ప్రవేశపెట్టింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రైతులు పట్టా పాస్పుస్తకం, సాగు చేసిన భూమి సర్వే నంబర్, ఆధార్, ఇతర వివరాలు నమోదు చేసి పత్తిని విక్రయించేందుకు స్లాట్బుక్ చేసుకోవాలి. రెవెన్యూ అధికారుల నుంచి పత్తి పంట ధ్రువీకరణ పత్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేయాలి. మొబైల్ లేనివారు మీసేవ కేంద్రాల్లోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చు. సీసీఐకి రైతు వివరాలు చేరుతాయి. దళారీ వ్యవస్థను నిర్మూలించి, కొనుగోళ్లలో పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. పంట విక్రయించిన వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. -
‘యూడైస్ ప్లస్’పై వర్క్షాపులు
కెరమెరి(ఆసిఫాబాద్): యూడైస్ ప్లస్.. విద్యావ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట అందుబాటులో ఉంచే వెబ్సైట్. ఇందులో నమోదైన వివరాలను ప్రామాణికంగా చేసుకుని పాఠశాలల నిర్వహణ చేపడతారు. వెబ్సైట్లో నిత్యం చేస్తున్న మార్పులు చేర్పులు, నూతన మాడ్యూల్స్పై విద్యాశాఖ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీవోలకు జిల్లా కేంద్రంలో వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టరేట్లో గురువారం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎస్ఈఆర్పీ(గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు), సీఆర్పీ లకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఆన్లైన్లో పూర్తి సమాచారం జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు 1,268 ఉండగా.. 48 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 1,02,847 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. యూడైస్ ప్లస్(యునైటేడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్)లో పాఠశాల, కళాశాలలు, విద్యార్థుల పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగానే విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించి బడ్జెట్ కేటాయించి అమలు చేస్తుంటారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ఇతర నిధులను ఈ వివరాల ఆధారంగానే కేటాయిస్తారు. 2021– 22 విద్యా సంవత్సరం వరకు యూడైస్గా కొనసాగగా.. 2023 నుంచి యూడైస్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. వెబ్సైట్ సమాచారాన్ని సాంకేతికత ఆధారంగా నిత్యం అప్డేట్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్ను మూడు భాగాలుగా విభజించారు. ఇందులో పాఠశాల భౌతిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యూల్స్ ఉన్నాయి. ఎంఈవో, హెచ్ఎంల నేతృత్వంలో నిర్వహణ కొనసాగుతుంది. ఇందులో నమోదైన ప్రతీ విద్యార్థికి పెన్(పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) ఉంటుంది. పాఠశాలలో ప్రవేశం పొందిన తర్వాతి నుంచి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ఈ నంబర్ వారికి ఎంతో కీలకం. నూతన అంశాలపై శిక్షణ వర్క్షాప్లో భాగంగా యూడైస్ ప్లస్లో అందుబాటులోకి తెచ్చిన నూతన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 1న ఎంఈవో, ఎంఐఎస్ కోఆ ర్డినేటర్లు, సీసీవో, ప్రతీ మండలం నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు వర్క్షాపు నిర్వహించారు. ఈ నెల 6న జిల్లా కేంద్రంలో కాంప్లెక్స్ హెచ్ఎం, సీఆర్పీ, ఎస్ఈఆర్పీలకు శిక్షణ అందిస్తుండగా, మండల కేంద్రాల్లో ఈ నెల 7న హెచ్ఎంలకు వర్క్షాప్ ఉంటుంది. ఈ నెల 11న వెబ్సైట్లో వివరాలు నమోదు చేయనున్నారు. -
ఏఐ బోధన.. హుషారుగా సాధన
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఏఐ బోధన సత్ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుంటున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకుంటూ హుషారుగా సాధన చేస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా బోధన సాగుతున్న పాఠశాలల్లో హాజరు సైతం మెరుగుపడింది. సత్ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ తరగతులు అమలు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. సులభంగా నేర్చుకునేలా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బోధన కోసం ప్రభుత్వం జిల్లాలో 14 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా, అందులోని 146 మంది విద్యార్థులకు ఏఐ తరగతులు బోధిస్తున్నారు. చదువులో వెనుకబడిన వారిని దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలు సులభంగా నేర్చుకొనేలా క్లాసులు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా గణితం, సైన్స్, తెలుగు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులను ఆకట్టుకునేలా బొమ్మలతో పాఠాలు చెబుతున్నారు. 3, 4, 5వ తరగతులకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుపై 20 నిమిషాలపాటు తరగతులు కొనసాగుతున్నాయి. ఏఐ క్లాసులతో డ్రాపౌట్స్ తగ్గగా, ఇటీవల అధికారులు ‘నో మోర్ డ్రాపౌట్స్’ పేరిట డాక్యుమెంటరీ సైతం తీశారు. ఇంటర్నెట్ ఇబ్బందులు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ఏఐ తరగతుల నిర్వహణకు ఇంటర్నెట్ సమస్యతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కనెక్షన్లు లేకపోవడంతో కొన్నిచోట్ల మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతోపాటు ఎక్స్టెప్ సంస్థ ప్రతినిధులు నిత్యం జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ప్రాథమిక విద్య బోధనను మెరుగుపర్చేందుకు అపెప్, డిపెప్, క్లిప్, క్లాప్, క్యూఐపీ, ఎల్ఈపీ, ట్రిపుల్ ఆర్ వంటి కార్యక్రమాలను అమలు చేశారు. అవి ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదు. ఏఐ తరగతులు సత్ఫలితాలను ఇస్తుండటంతో మరిన్ని స్కూళ్లకు విస్తరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఏఐ తరగతులు అమలవుతున్న పాఠశాలలు మండలం పాఠశాల విద్యార్థులు బెజ్జూర్ ఎంపీపీఎస్ సలుగుపల్లి 10 కెరమెరి ఎంపీపీఎస్ గోయగాం 10 రెబ్బెన ఎంపీపీఎస్ తక్కలపల్లి 11 వాంకిడి ఎంపీపీఎస్ ఖిర్డి 10 పెంచికల్పేట్ ఎంపీపీఎస్ చేడ్వాయి 10 కౌటాల ఎంపీపీఎస్ బోదంపల్లి 15 కాగజ్నగర్ ఎంపీపీఎస్ ఆరెగూడ 10 కాగజ్నగర్ ఎంపీపీఎస్ గన్నారం 10 ఆసిఫాబాద్ ఎంపీయూపీఎస్ చిర్రకుంట 10 ఆసిఫాబాద్ ఎంపీయూపీఎస్ అడ 10 ఆసిఫాబాద్ ఎంపీయూపీఎస్ తేలిగూడ 10 తిర్యాణి పీఎంశ్రీ ఎంపీయూపీఎస్ గంభీరావ్పేట 10 కౌటాల ఎంపీపీఎస్ కౌటాల 10 పెంచికల్పేట్ ఎంపీపీఎస్ సంజీవ్నగర్ 10 -
కుమురం భీం
వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. చలి తీవ్రత పెరుగు తుంది. తెల్లవారుజామున మంచు కురుస్తుంది.7పంటల రక్షణకు సోలార్ కంచె వన్యప్రాణుల నుంచి పంటల రక్షణకు రైతులు సోలార్ కంచె వినియోగిస్తున్నారు. మార్కెట్లో ఇవి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు లభిస్తున్నాయి. ‘జోనల్’ క్రీడలకు సిద్ధం 11వ జోనల్స్థాయి క్రీడాపోటీలకు లక్సెట్టిపేట లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ముస్తాబైంది. కాళేశ్వరం జోన్ పరిధిలోని క్రీడాకారులు హాజరుకానున్నారు. -
కుమురం భీం
7శభాష్ కిష్టయ్య సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కిష్టయ్య 85 ఏళ్ల వయస్సులో వెటరన్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. వివిధ స్థాయి పోటీల్లో బహుమతులు సాధిస్తున్నాడు. 8లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అర్ధరాత్రి తర్వాత చలి పెరుగుతుంది. వేకువజామున మంచు కురుస్తుంది. అడెల్లి పోచమ్మకు ధాన్యాభిషేకం అడెల్లి మహాపోచమ్మ విగ్రహ పునః ప్రతిష్ఠాపనకు మంగళవారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ధాన్యాభిషేకం, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. 8లోu బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
● కంకర టిప్పర్లతో తరచూ ప్రమాదాలు ● తాజాగా దహెగాంలో ఓ ఘటన ● ఓవర్ లోడ్, అతి వేగమే కారణం ● యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన
కౌటాల/చింతలమానెపల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కంకర టిప్పర్, బస్సు ఢీకొని 19 మంది మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డు ప్రమాదాల తీవ్రత, అప్రమత్తతపై ఈ ఘటన ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. జిల్లాలో సైతం కంకర టిప్పర్లు తిరుగుతున్న మార్గాల్లో అలాంటి పరిస్థితులే ఉండడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. టిప్పర్ల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరాన్ని చేవెళ్ల దుర్ఘటన తెలియజేస్తోంది. భారీ వాహనాల రాకపోకలుకాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లుతోపాటు గోలేటి సమీపంలోని సింగిరేణి ప్రాంతాలకు భారీ టిప్పర్లు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లా కేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపైనా పెద్దసంఖ్యలో భారీ వాహనాలు పలు రాష్ట్రాలకు సరుకులు చేరవేస్తున్నాయి. వీటిని జిల్లా స్థాయిలో ఆయా శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కౌటాల మండలం ముత్తంపేట సమీపంలో, వాంకిడి మండలంలో కంకర క్వారీలు ఉన్నాయి. వీటి నుంచి కూడా నిత్యం వందల వాహనాల్లో కంకరను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనుమతులు ఉన్నాయా..?కౌటాల మండలం ముత్తంపేట సమీపంలోని కంకర క్వారీల నుంచి చింతలమానెపల్లి మండలం మీదుగా మహారాష్ట్రకు నిత్యం కంకర తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40 టన్నుల సామర్థ్యంతో రహదారులు, కల్వర్టులు, వంతెనలు నిర్మించారు. కానీ 50 నుంచి 60 టన్నుల పైగా కంకర లోడ్తో భారీ టిప్పర్లు వెళ్తున్నాయి. మహారాష్ట్రకు కంకర తరలించే వాహనాలకు అనుమతులు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా ఈ వాహనాల కారణంగా కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా.. అనేక మంది క్షతగాత్రులయ్యారు. మేకలు, గొర్రెలు, పశువులు చనిపోతున్నాయి. ఈ వాహనాలు నిబంధనలు ఉల్లంఘించి రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు చేస్తున్నాం భారీ వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు జిల్లావ్యాప్తంగా తరచూ తనిఖీలు చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా మరింత నిఘా పెంచుతాం. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కౌటాల మండలం నుంచి కంకర తరలించే టిప్పర్లను తనిఖీ చేస్తాం. గతంలో పట్టుబడిన వాహనాలకు జరిమానా విధించాం. ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం పెరగాలి. – రాంచందర్, జిల్లా రవాణాశాఖ అధికారి కౌటాల మండల కేంద్రంలోని ఎస్బీఐ సమీపంలో కౌటాల– చింతలమానెపల్లి రోడ్డుపై మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లేగదూడ చనిపోయింది. ఉదయం గుర్తించిన గ్రామస్తులు రాత్రిపూట తిరుగుతున్న కంకర టిప్పర్ ఢీకొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండు వారాల క్రితం చింతలపాటి సమీపంలో కంకర టిప్పర్ వేగంగా వచ్చి గొర్రె పిల్లను ఢీకొనడంతో మృతి చెందింది.ఇరుకు రోడ్లు.. ఓవర్లోడ్కౌటాల మండలం నుంచి చింతలమానెపల్లి మీదుగా కంకర టిప్పర్లు మహారాష్ట్రకు వెళ్లే క్రమంలో పలు గ్రామీణ ప్రాంతాల రహదారులను దాటాల్సి ఉంది. ఆదాయాన్ని ఆర్జిచేందుకు అనుమతులు లేని రహదారులపై భారీ టిప్పర్లతో కంకర తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కౌటాల నుంచి రవీంద్రనగర్ మీదుగా చింతలమానెపల్లి రహదారి సింగిల్ రోడ్డు కావడంతో భారీ వాహనాలు ప్రయాణించడానికి అనుకూలంగా లేదు. మరో మార్గంలో డబ్బా మీదుగా బాబాసాగర్, చింతలమానెపల్లి రహదారిది ఇదే పరిస్థితి. చింతలమానెపల్లి నుంచి కర్జెల్లి మీదుగా గూడెం వరకు 20 కిలోమీటర్ల వరకు రహదారి కంకర టిప్పర్ల కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. ఈ మార్గంలో టిప్పర్లు తరచూ అదుపు తప్పి బోల్తా పడుతున్నాయి. పలుమార్లు డ్రైవర్లు మ ద్యం తాగి ఆయా గ్రామాల్లో గొడవలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గూడెం గ్రామస్తులు కంకర టిప్పర్లను నిలిపి వేయాలని ఆందోళన చేపట్టి రహదారిపై ధర్నా నిర్వహించారు. భారీ వాహనాల కారణంగా ఓ వైపు రహదారులు ధ్వంసమవుతుండగా.. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనుమతి లేని కంకర వాహనాలపై నిఘా పెంచి నియంత్రించాలని.. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నాణ్యత పాటించకుంటే చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలి టీ పరిధిలోని హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల యజమానులు నాణ్య త పాటించకుంటే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గజానంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయా దుకాణాల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, సురక్షితమైన నీటిని అందుబా టులో ఉంచాలన్నారు. పట్టణంలోని వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రామయ్య, టీపీబీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఐ ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సీపీఐ వందో ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్ అన్నారు. గోలేటి టౌన్షిప్లోని కేఎల్ మహేంద్రభవన్లో మంగళవా రం వేడుకలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1925లో సీపీఐ ఆవిర్భవించిందన్నారు. 2024 డిసెంబర్లో కాన్పూర్లో ప్రారంభమైన వేడుకలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయని తెలిపారు. బ్రిటీష్ పాలన నుంచి దేశానికి విముక్తి కావాలని సీపీఐ రాజీలేని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. నిజాంను గద్దె దించేందుకు తెలంగాణ సాయుధ పోరాటంతో నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగాలతో మూడు వేల గ్రామాలకు విముక్తి కల్పించిందన్నారు. పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర పార్టీదని పేర్కొన్నారు. ఖమ్మంలో నిర్వహించే ముగింపు కార్యక్రమాలకు 40 దేశాల కమ్యూనిస్టు పార్టీ నాయకులు, అనేక రాష్ట్రాల నాయకులు హాజరవుతారని తెలిపా రు. జిల్లాలోని సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజా, కార్మిక, కర్షక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు బద్రి సత్యనారాయణ, లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి సాయికుమార్, జిల్లా సమితి సభ్యులు చిరంజీవి, ఉపేందర్, నర్సయ్య, సీతారాం, మల్లికార్జున్, అంబారావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు రూ.50వేల రుణం
ఆసిఫాబాద్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు, ఆర్థికంగా వెనుకబడిన సభ్యులకు మండల సమాఖ్య నుంచి రూ.50వేల వరకు రుణం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం సెర్ప్ పీఎం సుధాకర్, డీఆర్డీవో దత్తారావుతో కలిసి సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు, యూడీఈడీ పెన్షన్, నూతన గ్రూపుల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వందశాతం బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తి చేయాలని, సీ్త్రనిధి లక్ష్యాన్ని సాధించాలన్నారు. రుణాల రికవరీ లక్ష్యాన్ని డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిర మహిళా శక్తి పథకం కింద కోళ్ల పెంపకం, డెయిరీ ఫాం ఏర్పాటు, చేపల పెంపకం, సోలార్ విద్యుత్ యూనిట్, క్యాంటీన్ల నిర్వహణతో వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తుందన్నారు. నూతన సంఘాలు ఏర్పాటు చేసే వారికి రుణ సహాయాన్ని కల్పించాలన్నారు. సమావేశంలో ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలివాంకిడి(ఆసిఫాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని జైత్పూర్లో ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ గ్రామంగా ఎంపికై న జైత్పూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారులు ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు తరచూ పనులను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్, ఇంజినీరింగ్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కాలం చెల్లిన మందులు అమ్మొద్దు
తిర్యాణి(ఆసిఫాబాద్): ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులకు కాలం చెల్లిన మందులు అమ్మొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి అన్నారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పురుగుల మందులు, ఎరువులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంత రం గిన్నెధరి రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆయిల్పాం సాగు ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చన్నారు. ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తుందని తెలిపారు. అంతకు ముందు రైతులకు భూసార పరీక్షల కు సంబంధించిన కార్డులను అందించారు. కార్యక్రమంలో ఏవో వినయ్రెడ్డి, ఏఈవోలు శ్రవణ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా మహాపాదయాత్ర
సిర్పూర్(టి): శ్రీసిద్ది టోంకిని హనుమాన్ ఆలయానికి మంగళవారం చేపట్టిన 24వ మహాపాదయాత్ర వైభవంగా సాగింది. భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూకట్టారు. కాగజ్నగర్ పట్టణం నుంచి సిర్పూర్(టి) మండల కేంద్రం మీదుగా కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. సమీప మండలాలకు చెందిన భక్తులతోపాటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మహాపాదయాత్రకు సుమారు 40వేల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనా. భక్తుల సౌకర్యార్థం కాగజ్నగర్ నుంచి సిర్పూర్(టి) వరకు ప్రధాన రహదారిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు పాలు, పండ్లు, అల్పాహారం, తాగునీరు అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కౌటాల సీఐ సంతోష్కుమార్, సిర్పూర్(టి) ఎస్సై సురేశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ ఆలయాన్ని సందర్శించి బందోబస్తును పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సాయంత్రం వరకు సిర్పూర్(టి)– కౌటాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ అజయ్ ఉల్లం ఆలయంలో పూజలు న్విహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికి సన్మానించారు. -
కార్తికం.. మహిమాన్వితం!
కెరమెరి: భారతీయ సంప్రదాయంలో కార్తిక మా సం పరమ పవిత్రమైనది. ఈ నెలరోజులు నిత్యం పూజలు, దానధర్మాలు, దీపారాధనలు, పురాణ శ్ర వణం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ మాసానికి అనుబంధంగా వచ్చే పండుగ కార్తిక పౌర్ణమి. దీనిని కై శిక పౌర్ణమి, వైకుంఠ పౌర్ణమి, జిడికంట పున్నమి అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతీరోజు మహిళలు తులసీ దళానికి పూజలు, రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి తరిస్తారు. నేడు కార్తికపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పురాణ కథలు తమిళనాడులో తిరువణ్నామళైగా ప్రసిద్ధి చెందిన అరుణాచలంలో కొండమీద ఉన్న దీపస్తంభంలో ఈ రోజు వెలిగించే జ్యోతిని దర్శించడానికి అధికసంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తారు. అక్కడ ఈ రోజు వెలిగించే దీపం ఎన్నో రోజుల వరకు వెలుగుతూనే ఉంటుందని ప్రతీతి. అలాగే ఇంటి ఎదుట వందలాది ప్రమిదల్లో నూనెపోసి దీపాలు వెలిగిస్తారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటారు. గొప్ప వ్రతాల్లో ఒకటి.. వ్రతాల్లో కార్తికపౌర్ణమికి ప్రత్యేకత ఉంది. తెలుగు ప్రజలు ఈ రోజు చలిమిడి చేస్తారు. వేపుడు బియ్యం లేదా అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. బలిచక్రవర్తికి ఒకసారి శరీరమంతా మంటలు వ్యాపించాయి. ఆ రోజు ఆయన సంస్థాన వైద్యులు, ప్రత్యేక పురోహితుల సలహా మేరకు కార్తికపౌర్ణమి రోజున శివున్ని పూజించమని చెప్తారు. అలా చేయడంతో బలి చక్రవర్తి శరీరంలో మంటలు పూర్తిగా తగ్గిపోయాయి. అప్పటి నుంచి కార్తికపౌర్ణమి వ్రతం ఆచరణలో ఉందని పూర్వీకులు చెబుతారు. తులసీ కల్యాణం కార్తిక పౌర్ణమి సందర్భంగా తులసీ కల్యాణం చేయడం శుభప్రదమని చెబుతారు. తులసి మొక్క వల్ల వాతావరణం పవిత్రంగా ఉంటుంది. పాపపు ఆలోచనలను తొలగిస్తుంది. ప్రతీ ఇంట్లో తులసి మొక్క పాపపుణ్యాల స్థానం కలిగి ఉంటుంది. తులసి నారాయణునికి అత్యంత ప్రియమైనది. తులసి చెట్టుకు కల్యాణం జరిపిస్తే ఇంటిల్లిపాది సుఖసంతోశాలతో వర్ధిల్లుతారు. తులసి మొక్కకు ఉసిరి చెట్టుతో వివాహం జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. తులసీ మాత మండపం చెరుకు ఆకులతో తయారు చేస్తారు. ఇలా చేస్తే చెరుకులోని తీయదనం మన జీవితంలో కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జన్నారం: కూలీ పనులకు వెళ్తున్న యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపిన వివరాల మేరకు మండలంలోని సింగరాయి పేటకు చెందిన అడాయి మారుతి (25) జన్నారంకు చెందిన చుక్క గంగాధర్ అనే మేసీ్త్ర వద్ద కూలీ పనులకు వెళ్తున్నాడు. మంగళవారం ఉదయం జన్నారం వెళ్లిన మారుతి మేసీ్త్రని బైక్పై ఎక్కించుకుని తాళ్లపేట్ వైపు వెళ్తుండగా చింతగూడ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరూ ఎగిరి కిందపడ్డారు. మారుతి అక్కడికక్కడే మృతి చెందగా గంగాధర్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై అనూష సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఏపీలోని నూజివీడుకు చెందినట్లు గుర్తించారు. మృతుని తండ్రి భీము ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ బలరామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసుతానూరు: ఇద్దరిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హన్మాండ్లు తెలిపారు. మండలంలోని మహాలింగి గ్రామానికి చెందిన ఆనంద్, ఆదికృష్ణతో అదే గ్రామానికి చెందిన గణేశ్, తరుణ్, కిరణ్కు పాత గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని సోమవారం రాత్రి గణేశ్, తరుణ్, కిరణ్ ఫోన్చేసి ఆనంద్, ఆదికృష్ణను గ్రామ శివారులోకి పిలిపించారు. మాటామాట పెరగడంతో ముగ్గురూ కలిసి ఆనంద్, ఆదికృష్ణపై కర్రలతో దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఎస్సై హన్మాండ్లు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. గణేశ్, తరుణ్, కిరణ్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలి
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీల్లోనూ క్రీడాకారులు ప్రతిభ కనబర్చాలని ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరి ఆడే రామేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం కబడ్డీ, రెజ్లింగ్ క్రీడాంశాల్లో జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోనల్ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. జోనల్ స్థాయి అండర్–17 బాలుర కబడ్డీ ఎంపిక పోటీల్లో ఆసిఫాబాద్ జిల్లా ప్రథమస్థానం, నిర్మల్ ద్వితీయ స్థానంలో నిలిచాయన్నారు.అండర్–14 బాలబాలికల రెజ్లింగ్ ఎంపిక పోటీలు నిర్వహించామని, అండర్–17 విభాగంలో బాలబాలికలకు సైతం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, రెజ్లింగ్ శిక్షకుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
కుంటాల: తన ఇంటినిర్మాణానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు కుంటాలకు చెందిన పూర్ణం అడెల్లు (44) ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. తీర్చేమార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఆర్ఎంపీ.. లక్ష్మణచాంద: ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మాలెపు రాజు(39) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని భార్య మూడో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
మందమర్రిలో సింగరేణి స్థాయి పోటీలు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్లో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. జీఎం రాధాకృష్ణ స్పోర్ట్స్ జెండా ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందమర్రి ఏరియాలో సింగరేణి స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించడం హర్షనీయమన్నారు. పోటీల్లో గెలిచిన క్రీడాకారులు కోలిండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి సంస్థకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కీర్తనలు, భజనలు, గజల్స్, సోలో సాంగ్స్, లైట్ సాంగ్స్, బుల్బుల్ సితారా, కీబోర్డ్ సాంగ్స్, తబలా, కూచిపూడి, భరత నాట్యం పోటీలు నిర్వహించగా సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి కార్తీక్, ఏరియా కోఆర్డినేటర్ శివకృష్ణ, క్రీడల సూపర్వైజర్ జాన్వెస్లీ, తదితరులు పాల్గొన్నారు. -
అడెల్లి పోచమ్మకు ధాన్యాభిషేకం
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ విగ్రహ పునః ప్రతిష్ఠాపన వేడుకలకు రెండోరోజు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం వేదపండితులు చంద్రశేఖరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో నిత్యనిధి, చండీహోమం, సహస్ర కలశ స్థాపన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జలాభిషేకం అనంతరం విగ్రహాలను నీటికొలను నుంచి వేరుచేసి ధాన్యాభిషేకం, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులే కాకుండా మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సైతం పూజా కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులు ముందుగా తమ పేర్లు ప్రతిష్ఠాపన కమిటీ వద్ద నమోదు చేయించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఆసిఫాబాద్రూరల్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్నేళ్లుగా డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. నిర్వహణ భారంగా మారడంతో రెండు రోజుల నుంచి ప్రైవేట్ కాలేజీలను మూసివేశారని పేర్కొన్నారు. విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని నిధులు విడుదల చేయాలని కోరారు. కళాశాలల నిరవధిక బంద్కు పీడీఎస్యూ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సహయ కార్యదర్శి నితిన్, నాయకులు వంశీ, షేక్ సమీర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులైన గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందాలి
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలో అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి జన్ మన్, ప్రధానమంత్రి జుగా, ఇతర ఆదివాసీ గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలన్నారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పీవోను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
గంజాయి తరలిస్తున్న ఒకరి రిమాండ్
పెంబి: మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన మేగవత్ వినోద్ ఎండిన గంజాయిని ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా మంగళవారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నిర్మల్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ రంగస్వామి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్కు బైక్పై తీసుకువస్తుండగా కొండాపూర్ వంతెన వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. 1.710 కిలోల ఎండు గంజాయి, ద్విచక్రవాహనం, చరవాణిని స్వాధీనం చేసుకోని నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలోఎకై ్సజ్ ఎస్సై అభిషేకర్, సిబ్బంది వెంకటేష్, హరీష్, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ ఎంపిక పోటీలుదండేపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి అండర్–14 వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. మంచిర్యాల జట్టు ప్రథమ, ఆదిలాబాద్ జట్టు ద్వితీయ, నిర్మల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో ఎంఈవో మంత్రి రాజు, టోర్నమెంట్ పరిశీలకులు ఫణిరాజా, పాఠశాల పీడీ శ్రీనివాస్, వివిధ పాఠశాలల పీఈటీలు, పీడీలు కార్తీక్, సత్యనారాయణ, మనోహర్, కోచ్ కార్తీక్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు. -
టాటామ్యాజిక్ను ఢీకొట్టిన ట్రాక్టర్
నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామ శివారు 61వ జాతీయ రహదారిపై మంగళవారం టాటామ్యాజిక్ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మామడ మండలం కొరటికల్కు చెందిన 11 మంది టాటా మ్యాజిక్లో భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి అంత్యక్రియలకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో రాంపూర్ శివారులో నర్సాపూర్(జి) నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అతివేగంగా వచ్చి టాటా మ్యాజిక్ను ఢీకొట్టింది. ఘటనలో టాటా మ్యాజిక్ వాహనం ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో డ్రైవర్ రాజేశ్వర్ (50), పక్కన కూర్చున్న చిన్నారెడ్డి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ భార్య కిందపడడంతో చేయి విరిగింది. గమనించిన స్థానికులు రాజేశ్వర్, చిన్నారెడ్డిని బయటకు తీసి 108కు సమాచారం అందించగా నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేశ్వర్ మృతి చెందాడు. మృతుని కుమారుడు సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. ఎస్పీ జానకీ షర్మిల సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. -
పిప్రివాసి మాల్టాలో అనుమానాస్పద మృతి
బజార్హత్నూర్: మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన రామగిరి సాయికుమార్(28) మాల్టా దేశంలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్కు చెందిన రాజు పిప్రి గ్రామంలో ఉన్న తన సమీప బంధువులు రామగిరి సాయికుమార్, అనిల్ మాల్టా వస్తే లక్షల్లో జీతాలు ఉన్నాయని చెప్పడంతో రూ.6 లక్షల చొప్పున సెర్భియా జాతి ఏజెంట్కు చెల్లించారు. 3 నెలల టూరిస్ట్ వీసా పంపగా అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి పని చూపించలేదు. అక్టోబర్ 30న సాయికుమార్ అపార్టుమెంట్ పైనుంచి కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అనిల్ మృతుని కుటుంబ సభ్యులకు సమాచా రం అందించాడు. పిప్రి గ్రామానికి చెందిన ప్ర వాసీ మిత్ర లేబర్ యూనియన్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ కొమ్ము శశిమాల తెలంగాణ స్టేట్ ఎన్ఆర్ ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్లకు విషయం చెప్పడంతో మాల్టాలోని భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా బాధితుని వివరాలు పంపించారు. శవ పరీక్షల అనంతరం స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. చికిత్స పొందుతూ మెకానిక్..లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రాకాలనీకి చెందిన బైక్ మెకానిక్ ఎర్రోజుల సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. మృతుడు గతనెల 30న ఇంటివద్ద బాత్రూంకు వెళ్లగా బీపీ పెరగడంతో కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎసై తెలిపారు. అడవిపందుల దాడిలో పంట ధ్వంసంవేమనపల్లి: మండలంలోని మంగనపల్లిలో గంగిరెడ్డి తిరుపతికి చెందిన వరి పొలంలో అడవి పందులు దాడులు చేసి పంటను ధ్వంసం చేశాయి. కోతకు వచ్చిన రెండెకరాల వరిపైరును తొక్కి నేల పాలు చేశాయని బాధితుడు వాపోయాడు. డిప్యూటీ అటవీ రేంజర్ రూపేష్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. పరిహారం అందించాలని కోరుతున్నాడు. -
శభాష్ కిష్టయ్య
రామకృష్ణాపూర్: ఎనిమిది పదుల వయస్సు దాటినా వెటరన్ పోటీల్లో అమీతుమీకి సిద్ధం అంటున్నాడు రామకృష్ణాపూర్కు చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు శఠగోపం కిష్టయ్య. షాట్పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, హ్యామర్త్రో...తదితర అంశాల్లో ప్రావీణ్యం ఉన్న కిష్టయ్య 85 ఏళ్ల వయస్సులోనూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. పట్టణంలోని భగత్సింగ్నగర్కు చెందిన కిష్టయ్య మందమర్రి ఏరియాలోని ఎంకే4 గనిలో హెడ్ ఓవర్మెన్గా విధులు నిర్వర్తించేవాడు. 2005లో మెడికల్ అన్ఫిట్ ఆయ్యాడు. సింగరేణిలో పనిచేసిన సమయంలోనూ ఏరియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించాడు. సాధించిన బహుమతులు... -
‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి’
ఆసిఫాబాద్: ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద జిల్లాలోని పీవీటీజీ కొలాం, తోటి, ఆది వాసీలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని పీవీటీజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీమ్రావు డిమాండ్ చేశారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు మార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు వివరాలను ఆన్లైన్లో నమో దు చేస్తే ఇప్పటి వరకు ఇళ్లు మంజూరయ్యేవన్నారు. కార్యక్రమంలో పీవీటీజీల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మాన్కు, కొలాం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిడాం రాజు, సిడాం ధర్ము పాల్గొన్నా రు. -
ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
ఆసిఫాబాద్: ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సిర్పూర్(టీ) మండలం అహ్మద్నగర్ వాసులు తమకు మూడు నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లే దని, తాగునీటిని పునరుద్ధరించాలని, కెరమెరి మండలం తుమ్ముగూడకు చెందిన చౌహాన్ అశ్విని తన భర్త మరణించడంతో ఇబ్బందులకు గురవుతున్నాననని, ఉపాధి కల్పించాలని, తిర్యాణి మండలం సుంగాపూర్కు చెందిన దుర్గం శంకర్ తాను సాగు చేసుకుంటున్న భూమికి పట్టా ఇప్పించాలని, వాంకిడి మండల కేంద్రానికి చెందిన దుర్గం శ్యాంరావు మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించా లని, రెబ్బెన మండలంలోని రాళ్లపేటకు చెందిన అజ్మెర అమృతబాయి వ్యవసాయ రుణం పునరుద్ధరించాలని, పిప్పిర్గోందికి చెందిన రాథోడ్ గులాబ్ ఉపాధి కల్పించాలని, కాగజ్నగర్ మండలం గన్నారంకు చెందిన నేర్పెల్లి పోశం భూమికి పట్టా ఇప్పించాలని, రెండు కళ్లూ లేని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కెరమెరి మండలం కెలికె గ్రామానికి చెందిన మడా వి రాజు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద జిల్లాలోని పీవీటీజీలకు ఇళ్లు మంజూరు చేయాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. -
బాధితులకు సత్వర న్యాయం జరగాలి
ఆసిఫాబాద్అర్బన్: గ్రీవెన్స్కు వచ్చిన దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత డీఎస్పీ, ఏఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, పైరవీలు లేకుండా పోలీసు సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా, శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తుందన్నారు. మహిళల రక్షణకు తొలి ప్రాధాన్యతఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో మహిళలు, చిన్నపిల్లల రక్షణకే పోలీసు శాఖ తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు తమ సమస్యలపై నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. షీటీంల ద్వారా చిన్న పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత నెలలో 87 ప్రదేశాలను గుర్తించి 22 అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. 16 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. అత్యవసర సమయాల్లో ఆసిఫాబాద్ షీటీం 8712670564, కాగజ్నగర్ షీటీం 8712670565 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా సావర్ఖెడా
కెరమెరి: మండలంలోని సార్ఖేడా ప్రాథమిక పాఠశాల మల్టిజోన్ 1లో ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్లోని కుమురం భీం భవన్లో ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్య, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధా, జాయింట్ డైరెక్టర్ రాజీవ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రంతో పాటు మెమొంటో అందుకున్నారు. డిజిటల్ విద్యాబోధన, విద్యాసామగ్రి వినియోగం, విద్యార్థులను క్షేత్రపర్యటనలకు తీసుకెళ్లడం, తదితర కార్యక్రమాల అమలు చేయడంతో ఎంపికై నట్లు హెచ్ఎం పేర్కొన్నారు. -
అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ తనిఖీ
సిర్పూర్(టి): మండలంలోని వెంకట్రావ్పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలో వెంకట్రావ్పేట్ గ్రామ సమీపంలో ఉన్న చెక్పోస్ట్ను సోమవారం కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్ధాశుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ–మహారాష్ట్రల నుంచి వచ్చి వెళ్లే వాహనాలను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. అనంతరం మినిట్ టూ మినిట్ బుక్ రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలు సుకున్నారు. ఆమె వెంట తహసీల్దార్ రహీమొద్దిన్, సిబ్బంది ఉన్నారు. -
కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో సోమవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–17 బాలబాలికలకు కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించినట్లు సెక్రెటరీ వెంకటేశం తెలిపారు. వివిధ పాఠశాలల నుంచి 200కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఒక్కోజట్టుకు 12 మంది చొప్పున జోనల్స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశ్, శ్రీవర్ధన్, రామ్మోహన్, పీడీలు తిరుపతి, కృష్ణమూర్తి, రాజన్న, శారద, హరికృష్ణ, సత్యనారాయణ, అజయ్, ఖేల్ ఇండియా కోచ్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు. -
భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావ్లతో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదాబైనామాలకు సంబంధించి రికార్డులతో సరిచూసి నోటీసులు జారీ చేయాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, తదితరులు పాల్గొన్నారు. నీటి నిల్వ ప్రాంతాలను సర్వే చేయాలిఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో 2.50 హెక్టర్ల కంటే అధిక నీరు నిలిచిన ప్రాంతాలను సర్వే చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం రెవెన్యూ, నీటిపారుదల, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ అధికారులతో నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లాలో 2.50 హెక్టార్ల విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉన్న నీటి వనరులు దాదాపు 150 వరకు ఉన్నాయని, వాటిని సర్వే చేసి మ్యాప్లు సిద్ధం చేయాలన్నారు. అవి నిండడానికి గల పరిసర ప్రాంతాలు, క్యాచ్మెంట్ ఏరి యాలను సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతిగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి వెంక టి, నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుణవంత్రావ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా చేపపిల్లలు వదలాలి
ఆసిఫాబాద్: నెలాఖరులోగా చెరువుల్లో చేపపిల్లలు వదలాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరి శ్రమ శాఖ, క్రీడాయువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మత్స్యశాఖ అధి కారులు, కమిటీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ చేపపిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండాలన్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో రూట్మ్యాప్ రూపొందించుకుని ప్ర ణాళికాబద్ధంగా పంపిణీ చేయాలన్నారు. చేపల రిటైల్ మార్కెట్కు అనువైన స్థలాలు గుర్తించాలన్నా రు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో 261 చెరువులు, రిజర్వాయర్, పెద్ద చెరువులను గుర్తించామని, ఈ నెలాఖరులోగా అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. చిన్న చెరువుల్లో 66 లక్షల పిల్లలు, 30 నుండి 40 మిల్లీ మీటర్ల సైజు, పెద్ద చెరువులు, రిజర్వాయర్ల్లో 78 లక్షల పిల్లలు, 80 నుండి 100 మిల్లీ మీటర్ల సైజు పిల్లలు వదిలే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, డీపీవో భిక్షపతి, ఇరి గేషన్ ఈఈ గుణవంత్రావు, జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, తదితరులు పాల్గొన్నారు.


