వాంకిడి: ఆస్పత్రి ఆవరణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో సీతారాం సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆ స్పత్రిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళి క కార్యక్రమంలో పాల్గొని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఆస్పత్రికి వచ్చేవారికి ఆహ్లాదక ర వాతావరణాన్ని అందించాలని పేర్కొన్నారు. వై ద్యసిబ్బంది విధులను నిర్లక్ష్యం చేయకుండా సమయపాలన పాటించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ మెరుగైన సేవలు అందించా లని సూచించారు. అంతకుముందు ఆస్పత్రిలోని వ్యాక్సిన్ రూమ్, మందుల నిల్వ గది, వార్డులు, ప రిసరాలు పరిశీలించారు. ఇన్ పేషెంట్, అవుట్ పే షెంట్ రికార్డులు, సిబ్బంది రిజిష్టర్లు తనిఖీ చేశారు. ఆయన వెంట మండల వైద్యాధికారి వినయ్ ఉప్రే, ఆరోగ్య విస్తరణాధికారి రవిదాస్, ఎంఎల్హెచ్పీ రియాజ్, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


