breaking news
Kumuram Bheem District News
-
ఏరియాస్థాయి ఇండోర్ గేమ్స్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ ఆవరణలో ఆదివారం డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో ఏరియా స్థాయి ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. ఈ పోటీలను ఏరియా సీనియర్ పీవో కార్తీక్ ప్రారంభించా రు. ఇందులో భాగంగా క్యారమ్స్, చెస్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటేశ్వర్లు, క్లబ్ సెక్రెట రీ బానయ్య, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కేప్టెన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో పందేల జోరు..!
కౌటాల: వరుస పండుగల నేపథ్యంలో జిల్లాలో కోడి పందేలు జోరందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా నిర్వహిస్తున్నారు. పక్కా ప్లానింగ్తో పోలీసులు, జన సంచారం లేని స్థలాల్లో ఈ స్థావరాలు కొనసాగడం విశేషం. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో రెండు మండలాల్లో పోలీసులు దాడులు చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామ శివారులో ఆదివారం కోడి పందేల స్థావరంపై దాడి చేసి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు పందెం కోళ్లు, మూడు కత్తులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామ శివారులోనూ కోడి పందేలు నిర్వహిస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు. ఐదు కోళ్లతోపాటు రూ.1560 నగదు, రెండు కత్తులు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెల 12న సైతం బెజ్జూర్ మండలం కొత్తగూడెం శివారులో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. మూడు పందెం కోళ్లు, రెండు కత్తులు, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు. దాడులు చేస్తున్నా..పొలాల పండుగ నుంచి కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ఈ కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం ఆడేవారు కోళ్లను బైక్లపై స్థావరాలకు తరలిస్తున్నారు. వారంతపు సెలవుల్లో నిర్వహిస్తున్న కోడి పందేలపై పోలీసులు దాడులు చేస్తున్నా.. నిందితుల్లో మార్పు రావడం లేదు. పోలీసుల నిఘాకు దొరకకుండా నిత్యం స్థావరాలు మారుస్తున్నారు. ఈ ఆటపై నిషేధం ఉండగా, జంతు హింస నిరోధక చట్టం– 1960 ప్రకారం సెక్షన్– 11 కింద కేసులు నమోదు చేస్తారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని జంగుబాయి జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఆదివారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ అరుణ శ్రీ, వైస్ ప్రిన్సిపాల్ అనిత, పీడీ లక్షితో కలిసి అభినందించారు. వారు మాట్లాడుతూ ఆగస్టు 26 నుంచి 27 వరకు హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్– 16 బాలికల జావెలిన్ త్రో పోటీల్లో మడా వి జంగుబాయి ప్రతిభ చూపిందన్నారు. ఈ నెల 14 నుంచి 18 వరకు పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాపియన్ షిప్కు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. జాతీయ స్థాయిలోనూ విజయం సాధించాలని కోచ్ విద్యాసాగర్ ఆకాంక్షించారు. -
మూల్యాంకనం చిచ్చు..!
ఆసిఫాబాద్రూరల్: ఇప్పటివరకు సొంత పాఠశాలల్లోనే జరుగుతున్న ఎస్ఏ– 1, ఎస్ఏ– 2 జ వాబు పత్రాల మూల్యాంకనం ఇక కుదరదు. మండల విద్యా వనరుల కేంద్రాల్లో ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ పద్ధతిలో జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే బాహ్య మూ ల్యంకన విధానంపై ఉపాధ్యాయ వర్గాలు అ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బోధన చేయాల్సి న సమయాన్ని ఎమ్మార్సీ కేంద్రాల్లో మూల్యాంకనానికి కేటాయించడం ద్వారా టీచర్పై ఒత్తిడి పెంచుతుందని చెబుతున్నారు. అలాగే తరగతి గది బోధన దెబ్బతిని, విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, మండల కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో సమయం వృథా అవ్వడమే కాక, రవాణా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మూల్యాంకన విధానంపై తుది నిర్ణయం ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆన్లైన్లో మార్కులుప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ఉ న్నత పాఠశాలకు ఒకరు చొప్పున ఎవాల్యుయేషన్ ఇన్చార్జీలను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 నుంచి ఐదు రోజుల్లో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఆన్లైన్లో మార్కులు నమో దు చేయనున్నారు. తరగతులు, సబ్జెక్టుల వారీగా ఆ న్లైన్లో మార్కులు అందుబాటులో ఉంచుతారు. అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు రూ.2లు, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.3 చొప్పున ఉపాధ్యాయులకు ఎన్యూమరేషన్ చెల్లిస్తారు.ఎమ్మార్సీకి జవాబు పత్రాలుజిల్లాలో 733 ప్రభుత్వ పాఠశాలల్లో 45,273 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2,447 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఎస్ఏ– 1, 2 పరీక్షలకు సంబంధించిన జవాబు ప త్రాలను అయా పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల దిద్దేవారు. కొత్త విధానం అమల్లో కి వస్తే ఈ పరిస్థితి ఉండదు. అన్ని ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలను మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేరుస్తారు. అక్కడ ఒక పాఠశాలకు చెందిన పరీక్ష పత్రాలను వేరే పాఠశాల ఉపాధ్యాయులతో దిద్దిస్తా రు. విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేయడం, మూల్యాంకనంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా నూతనం విధానం తీసుకొచ్చినట్లు అధి కారులు చెబుతున్నారు. త్వరలోనే అమలు పాఠశాలల్లో నిర్వహించే ఎస్ఏ– 1, 2 పరీక్షలకు సంబంధించి మూల్యాంకనా న్ని ఎమ్మార్సీల్లో చేసేలా ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలోనే కొత్త ఎ క్స్టర్నల్ ఎవాల్యుయేషన్ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – సచ్చిదానంద చారి, డీఈవో -
రావయ్యా.. గణపయ్యా..
ఆసిఫాబాద్: సర్వ విఘ్నాలను తొలగించి.. సకల శుభాలను ప్రసాదించే ఆ బొజ్జ గణపయ్యను ప్రతిష్టించుకోవడానికి జిల్లా అంతా భక్తిపారవశ్యంతో ఎదురుచూస్తోంది. విఘ్నేశ్వరుడిని కొలిచేందుకు వాడవాడలా మండపాలు ముస్తాబవుతున్నాయి. ఆదిదేవుడి ఆగమనం కోసం నిర్వాహకులు విద్యుత్ కాంతులు, డెకరేషన్లు, పందిళ్లు, షామియానాలతో అలంకరించారు. కొందరు పర్యావరణ స్పృహతో మట్టి గణపతులను పూజించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు 800 నుంచి 1000 వరకు విగ్రహాలను ప్రతిష్టించే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలోనే సుమారు 50కి పైగా మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలకు చేరుతున్న విగ్రహాలువినాయక చవితి సందర్భంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో భారీ విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నిర్వాహకులు వారం ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నం కాగా, విగ్రహాలను ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. కొందరు శని, ఆదివారం నుంచే ప్రత్యేక వాహనాల్లో గ్రామాలకు తరలించారు. మంచిర్యాల, కోరుట్ల వంటి ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలను తెప్పించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని బజార్వాడి సంఘసేవా గణేశ్ మండలి వద్ద 18 అడుగుల భారీ గణనాథుడిని ప్రతిష్టించనున్నారు. ఆదివారం మార్కెట్లు విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో కళకళలాడాయి. భక్తులు పూజకు అవసరమైన పువ్వులు, పత్రి, పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో పోలీసులు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అనుసరించాల్సిన నిబంధనలపై దిశానిర్దేశం చేశారు. -
నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి
వాంకిడి: వినాయక మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడె అన్నారు. మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆదివారం తనిఖీ చేశారు. విద్యుత్ సిబ్బందితోపాటు గణేష్ మండపాల నిర్వాహకులకు సూచనలు చేశారు. మండపాలు, రహదారులు, నిమజ్జన ప్రాంతాల వద్ద తెగిపోయిన తీగలు, లూజ్ వైర్లు, ప్రమాదకర స్తంభాలను గుర్తించి సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తడిసిన తీగలు, స్విచ్లు, విద్యుత్ పరికరాలు తాకొద్దన్నారు. స్విచ్ బోర్డులు పిల్లలకు అందకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా భద్రత నియమాలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మండల ఇంజినీర్లు దినేష్, శ్రీనివాస్, ప్రేమ్సాగర్, సిబ్బంది పాల్గొన్నారు. -
సింగరేణిలో ‘గుర్తింపు’ వార్!
శ్రీరాంపూర్: సింగరేణిలో ఎన్నికల వార్ మొదలైంది. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితిపై కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి రెండేళ్లే అని ప్రతిపక్ష సంఘాలు.. కాదు నాలుగేళ్లని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ వాదిస్తోంది. ఇంతటితో ఆగకుండా టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ లాంటి కార్మిక సంఘాలు ఎన్నికల కాలపరిమితిపై కోర్టులో రిట్ పిటిషిన్ దాఖలు చేశాయి. సింగరేణిలో ఏడో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు డిసెంబర్ 27, 2023న నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐదు ఏరియాల్లో గెలిచి కంపెనీ వ్యాప్తంగా అత్యధిక ఓట్లు రావడంతో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ, ఆరు ఏరియాల్లో గెలిచినా తరువాత స్థానంలో ఓట్లు రావడంతో ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా నిలిచింది. ఎన్నికలు జరిగిన తొమ్మిది నెలల తర్వాత అక్టోబర్ 9, 2024న ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం, ఐఎన్టీయూసీకి ఆయా ఏరియాల్లో ప్రాతినిధ్య హోదా కల్పిస్తూ కంపెనీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో రెండేళ్ల కాలపరిమితిని పెట్టింది. దీని ప్రకారం కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ మినహా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ సీఎల్సీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్లోనూ ఈ నిబంధన ఉందని వాదిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు ఏడుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా మొదటిసారి 1998లో మాత్రమే రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరిగాయి. తరువాత గెలిచిన అన్ని సంఘాలు నాలుగేళ్లు అఽధికారంలో కొనసాగాయి. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎల్సీ నుంచి, కంపెనీ నుంచి కాలపరిమితిపై స్పష్టత ఇవ్వకపోవడం, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు తమ అనుకూలత కోసం ఉన్న కార్మిక సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రావడంతో నాలుగేళ్ల అధికారాన్ని అనుభవించాయి. 15న కోర్టులో వాదనలుగుర్తింపఎన్నికలు వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు డిప్యూటీ సీఎల్సీ, సింగరేణి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. టీబీజీకేఎస్ వేసిన పిటిషన్పై ఈ నెల 15న వాదనలు జరగనున్నాయి. కాగా, మళ్లీ ఎన్నికలు జరిగేవరకు అన్ని సంఘాలను సమానంగా గౌరవించాలని ఆయా సంఘాలు లేఖలు రాసి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఏడో దఫా ఎన్నికల ముందు సమాన హోదా కల్పిస్తూ కంపెనీ ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని ఏఐటీయూసీ నేతలు తోసిపుచ్చుతున్నారు. తెరపైకి లేబర్ కోడ్లుఎన్నికలు ఎప్పుడు జరిగినా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లు అమలు చేయాలని సీఎల్సీ నిశ్చయంతో ఉంది. ఈ మేరకు డిప్యూటీ సీఎల్సీ కొత్త లేబర్ కోడ్లకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఇకముందు గుర్తింపు సంఘం కాలపరిమితి మూడేళ్లు ఉంటుందని, గుర్తింపు సంఘం, యాజమాన్యం ఒకే అభిప్రాయంతో ఉంటే దీన్ని గరిష్టంగా ఐదేళ్లు కొనసాగించుకునేలా కొత్త చట్టంలో అవకాశముంది. ఈ లేబర్కోడ్ల ప్రకారం ఎన్నికలు జరిగితే 51శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు హోదా దక్కుతుంది. అంతకంటే తక్కువ వస్తే, అది కూడా 20శాతం మించి ఓట్లు వస్తేనే వారికి ప్రాతినిధ్య హోదా ఇస్తారు. ఎన్ని సంఘాలకు 20శాతం మించి ఓట్లు వస్తే అన్ని సంఘాల నుంచి ప్రతినిధులను కంపెనీ కార్మికుల ప్రతినిధులుగా (నెగోసేషన్ కౌన్సిల్ మెంబర్గా)గా గుర్తిస్తుంది. ఇదే జరిగితే కార్మిక సంఘాలన్నీ నిర్వీర్యం కావడం ఖాయమని, కార్మికుల డిమాండ్లకు బలం ఉండదనే వాదన వినిపిస్తోంది. -
మార్కెట్లకు ఊతం..
వేలాది మందికి ఉపాధి వినాయక ఉత్సవాల కోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటాం. జిల్లాలో సుమారుగా ఎనిమిది వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఉత్సవాల నిర్వాహకులు సైతం స్థానికంగా కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. – మిథున్ మండల్, రవీంద్రనగర్, మం.చింతలమానెపల్లి అమ్మకాలు పెరుగుతాయి పండగ వేళల్లో దుకాణాల్లో అమ్మకాలు పెరుగుతాయి. తద్వారా మాకు ఆదాయం లభిస్తుంది. గ్రామీణ షాపులతోపాటు సూపర్ మార్కెట్లలోనూ రద్దీ పెరిగి గణనీయంగా విక్రయాలు జరుగుతాయి. – బొద్దున శ్రీనివాస్, వ్యాపారి, కౌటాలచింతలమానెపల్లి: పండగలంటే కేవలం నోములు, వ్రతాలు, పూజలు మాత్రమే కాదు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా.. రాఖీ పౌర్ణమి, పొలాల అమావాస్య, వినాయక చవితి, దసరా, దీపావళి తదితర పండుగలు మారెట్లకు ఊతం ఇస్తున్నాయి. జిల్లాలో పర్వదినాలను పురస్కరించుకుని నిత్యావసరాలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, కూరగాయల కొనుగోళ్లతో మార్కెట్లు కళను సంతరించుకున్నాయి. పొలాల అమావాస్యకు మట్టి ఎద్దుల తయారీ, వినాయక చవితికి మట్టి విగ్రహాలు, దీపావళికి ప్రమిదల తయారీతో మట్టి కళాకారులకు ఉపాధి లభిస్తోంది. దసరాకు తయారు చేసే అమ్మవారి విగ్రహాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మట్టి రూపాల తయారీతో వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల, జైనూర్, కెరమెరి, వాంకిడి వంటి గ్రామీణ మండలాల్లో తయారు చేసిన మట్టి ఆకృతులను కాగజ్నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. అలాగే పండుగ సమయాల్లో కిరాణా దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల వరకు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా శనివారం నుంచే మండల కేంద్రాలు సందడిగా మారగా కాగజ్నగర్, ఆసిఫాబాద్ల్లో రద్దీగా మారాయి. వినాయక చవితికి విద్యుత్ అలంకరణ వస్తువులు, వెదురు బొంగులకు డిమాండ్ పెరిగింది. కాగజ్నగర్, ఆసిఫాబాద్తోపాటు మంచిర్యాల, చంద్రపూర్, హైదరాబాద్ వరకు నిర్వాహకులు వెళ్లి అలంకరణ వస్తువులు కొంటున్నారు. అలంకరణలు, సౌండ్, లైటింగ్పై సుమారుగా ఎనిమిది వేల మంది వరకు ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. -
అడవి అందాలు చూస్తూ.. ఆహ్లాదం పొందుతూ..
జన్నారం: హైదరాబాద్లోని దూలపెల్లి అకాడమీకి చెందిన 57 మంది శిక్షణ రేంజ్ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ మంజుల ఆధ్వర్యంలో ఆదివారం కవ్వాల్ టైగర్జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్లో పర్యటించారు. జన్నారం అటవీ డివిజన్లోని బైసన్కుంట, గొండుగూడ బేస్క్యాంపు, వాచ్టవర్, తదితర ప్రాంతాల్లో కాలినడకన కలియతిరిగారు. అడవి అందాలను చూస్తూ, ఆహ్లాదం పొందారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు డివిజన్లో తీసుకుంటున్న చర్యల గురించి ఎఫ్డీవో రామ్మోహన్ వారికి వివరించారు. అడవులు, గడ్డి క్షేత్రాల అభివృద్ధి, వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కుంటలు, గడ్డి మైదానాలు, ఆవాసాలు, కలప స్మగ్లింగ్ నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తలు వివరించారు. డాగ్స్క్వాడ్ వల్ల ఉపయోగం, స్మగ్లర్లను పట్టుకునే విధానం గురించి డాగ్స్క్వాడ్ బీట్ అధికారి అనిల్ వివరించారు. వారి వెంట రేంజ్ అధికారి ఖాదర్వలీ, సెక్షన్ అధికారులు మమత, శంకర్, బీట్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని పలుకరించిన ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు వెల్లడించారు. వారి మాటల్లోనే..గేట్ నంబర్1 వద్ద శిక్షణ రేంజ్ అధికారులు -
అభాగ్యులకూ కుటుంబం
ఉమ్మడి జిల్లాలో 47 మందిబెల్లంపల్లి: అనాథగా మిగిలిపోయిన చిన్నారులకు అమ్మానాన్నల ప్రేమ లభిస్తోంది. అర్హులైన దంపతులకు పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం ద్వారా వారికీ ఓ కుటుంబం ఏర్పడుతోంది. అనాథ పిల్లలను కుటుంబం చెంతకు చేర్చడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉంది. దత్తత పొందిన దంపతులు చిన్నారులను అక్కున చేర్చుకుని మమతానురాగాలు పంచుతున్నారు. పేగుబంధాని కన్నా మిన్నగా అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారు. దత్తత ద్వారా చిన్నారులు కొత్త కుటుంబాల్లోకి అడుగు పెడుతుండడం వారికి ఆనందాన్ని పంచుతోంది. మరో 123 మంది ఎదురుచూపుసంతానం లేని దంపతులు పిల్లల దత్తత కోసం తీవ్రంగా ఆరాట పడుతున్నారు. 2021 నుంచి 2026 ఆగస్టు 31 వరకు ఏకంగా 123 మంది దత్తత కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. తమవంతు ఎప్పుడెప్పుడా అని పడిగాపులు కాస్తున్నారు. కాగా 2000 సంవత్సరానికి ముందు దాదాపు 5 వరకు దరఖాస్తులు తిరస్కరించారు. దరఖాస్తు దారు ఆర్థిక స్థితిగతులు, గుణ గణాలు ఇతర అంశాలు ప్రతికూలంగా ఉన్నట్లు నిర్ధారించుకుని దత్తతకు నిరాకరించారు. కాగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులనూ ఆదరించడానికి ఎవరైనా ముందుకు రావల్సిన అవసరం ఉంది. చిన్నారులను దత్తత తీసుకోవాలనే ఆసక్తి కలిగిన దంపతులు వివరాల కోసం ఆదిలాబాద్లోని శిశుగృహ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మిని ఫోన్ నంబరు 70958 21533లో సంప్రదించవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిశుగృహ 57 మంది అనాథ చిన్నారులకు ఆశ్రయం కల్పించింది. వీరిలో ఇప్పటి వరకు 47 మంది బాలబాలికలు దత్తతకు వెళ్లగా ప్రస్తుతం ఆరుగురు మా త్రమే ఉన్నారు. ఇందులో ముగ్గురు దివ్యాంగులు ఉన్నారు. మరో నలు గురు చిన్నారులు తా త్కాలిక వసతి పొంది వెళ్లిపోయారు. దత్తత వె ళ్లిన చిన్నారుల్లో 26 మంది బాలికలు, 21 మంది బాలురు ఉన్నారు. ఇందులో 2000 సంవత్సరా నికి పూర్వం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు 32 మంది చిన్నారులను దత్తత ఇవ్వగా ఆ తర్వాత ఏడాది 2021 నుంచి 2026 ఆగస్టు 31 వరకు ద రఖాస్తు చేసుకున్న దంపతుల్లో అర్హతల ప్రాతిపదికన 15 మంది చిన్నారులను దత్తతఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి.. ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారులను ఇతర రాష్ట్రాల తల్లిదండ్రులు దత్తత తీసుకుంటున్న మాదిరిగానే ఇతర జిల్లాలు, పరాయి రాష్ట్రాలకు చెందిన బాలబాలికలను మన ఉమ్మడి జిల్లా దంపతులు దత్తత తీసుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2000 నుంచి 2026 ఆగస్టు నెలాఖరు వరకు 42 మంది చిన్నారులను దత్తత తెచ్చుకున్నారు. అందరూ వంచితులే.. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తర్వాత పిల్లలు ఏదో రకంగా వంచితులు అవుతున్నారు. కారణమేదైనా కొందరు శిశువులు పసిప్రాయంలోనే అనాథలుగా మారుతున్నారు. ఆడపిల్లలు అనే వివక్షతో వదిలి వెళ్తుండగా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పోషణ భారం తదితర అంశాలతో శిశుగృహకు చేరుతున్నారు. -
గోమాతకు జాతీయ మాత హోదా కల్పించాలి
ఆసిఫాబాద్: గోమాతకు జాతీయ మాత హో దా కల్పించాలని గో సమ్మాన్ రాష్ట్ర ఇన్చార్జి సంకాదిక్ దాస్ కోరారు. గో సమ్మాన్ అభియాన్ మూడో దశలో భాగంగా శనివారం జి ల్లా కేంద్రానికి చేరుకుని విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 17న భాగ్యనగరంలో ‘శ్రీ రాం జయ జయ రాం’ మహామంత్ర జ పం నిర్వహించిన అనంతరం ఆసిఫాబాద్ ము న్సిపాలిటీ స్థాయిలో సేకరించిన గోప్రేమికు ల సంతకాలను ముఖ్య కార్యదర్శికి అందించనున్నట్లు తెలిపారు. గోమాతకు జాతీయ మా త హోదా కల్పించాలనే ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రస్తుతం సంతకాల సేకరణ కొ నసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లాలోని గో భక్తులు, ప్రేమికులు అధికసంఖ్యలో హాజ రై విజయవంతం చేయాలని కోరారు. హిందూ సమాజ్ అధ్యక్షుడు రాజేశ్వర్ మసాదే, ప్రతినిధులు ఖాండ్రే విశాల్, ప్రవీణ్ దేశ్ముఖ్, గంగిశెట్టి వేణుగోపాల్, ఒరగంటి శ్రవణ్, వెంకన్న, గణేశ్, గో ప్రేమికులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 1,264 కేసులు పరిష్కారం
ఆసిఫాబాద్: లోక్ అదాలత్ ద్వారా 1,264 కేసులు పరిష్కరించి రూ.2,68,770 జరిమానా విధించినట్లు జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ వి.శారదాదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయ భవనంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాదేవి మాట్లాడారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపా రు. కక్షిదారులు దీర్ఘకాలిక వివాదాలకు స్వస్తి పలకాలని సూచించారు. సాధారణ కేసుల్లో ఒకరి గెలుపు, ఒకరి ఓటమి ఉంటుండడంతో ఇరువర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయ ని, లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కే సుల్లో ఇరుపక్షాలు విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. పైగా, స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలు సమసిపోతాయని తెలిపా రు. సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర, డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.అనూష, ప్రిన్సిపల్ జూని యర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగిరి సతీశ్బాబు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కిరణ్కుమార్, డీఎస్పీ అశోక్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
సమగ్ర ఆవేదన!
● సమ్మెకు దిగినా స్పందించని ప్రభుత్వం ఆసిఫాబాద్అర్బన్: ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇదేరోజు అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, నేటికి మూడేళ్లయినా పట్టించుకోవడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. డిమాండ్ల సాధనకు నెలపాటు సమ్మెబాట కూడా పట్టారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనలో కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫాంలు, మధ్యా హ్న భోజనం బియ్యం సరఫరా, ఉపాధ్యాయుల హాజరు నమోదు, ఆన్లైన్లో విద్యార్థుల నమోదు, బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం లాంటి విధులు నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో సీ ఆర్టీలు, పీజీ సీఆర్టీలు బోధన విధులు నిర్వహిస్తుండగా, బోధనేతర సిబ్బంది తమకు కేటాయించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకాధికారులు కేజీబీ వీల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. అ కౌంటెంట్లు, ఏఎన్ఎంలు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, మండల స్థాయిలో సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, వ్యా యామ, ఒకేషనల్ ఉపాధ్యాయులు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, డే అండ్ నైట్ వాచ్మెన్లు, స్వీపర్లు, స్కా వెంజర్లు, జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టం ఎనలిసిస్ట్లు, టెక్నికల్ పర్సన్లు, డీఎల్ఎంటీ మెస్సెంజర్లు, మోడల్ స్కూళ్లల్లో పనిచేసే వార్డెన్లు, ఆపరేటర్లు, కేర్ టేకర్లు కూడా సమగ్ర శిక్ష పరిధిలోకి వస్తారు. జిల్లాలో 440 మంది.. జిల్లా వ్యాప్తంగా 440 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పని చేస్తున్నారు. కస్తూరిబా విద్యాలయాల్లో 347 మంది పని చేస్తుండగా 54 మంది సీఆర్పీ లుగా, 10 మంది సీసీవోలుగా, 11మంది ఎంఐఎస్సీవోలుగా, 18 మంది ఐఈఆర్పీలుగా విధులు నిర్వరిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు కలెక్టర్ పంపించే యూడైస్, మధ్యాహ్న భోజన పథకం నివేదికల తయారీలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రాప్ట్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులు సమగ్ర శిక్ష పరిధిలోకి వస్తారు. వీరు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక కుటుంబాన్ని పోషించుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వచ్చే వేతనాలతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతూ మానసికంగా కుంగిపోతున్నారు. ఉద్యోగుల డిమాండ్లు ఇవే.. తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్నారు. పార్ట్టైం ఉద్యోగులను ఫుల్టైం ఉద్యోగులుగా గుర్తించి వేతనం పెంచాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ.20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని, ప్రతీ ఉద్యోగికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు (ఫైల్) -
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి
రెబ్బెన: గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా మట్టి విగ్రహాలను నెలకొల్పి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరమేశ్ సూచించారు. గోలేటి టౌన్షిప్లో సింగరేణి ఆధ్వర్యంలో శనివారం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. ప్రకృతిలో మమేకమై జీవిస్తేనే అన్ని రకాల జీవరాసులకు ఆరోగ్యకరమైన మనుగడ ఉంటుందని తెలిపారు. పీవోపీ, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేస్తే జలవనరులు కలుషితమవుతాయని పేర్కొన్నారు. దేవుడిని భక్తితో పూజించడంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ఏఐటీయూసీ నాయకుడు మారం శ్రీనివాస్, సీఎంవోఏఐ అధ్యక్షుడు నరేందర్, ఎస్వోటూ జీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీర్ వీరన్న, ఏరియా సేఫ్టీ అధికారి స్వామి రాజు, డీజీఎం ఉజ్వల్కుమార్ బెహరా, సీనియర్ పీవో శ్రీనివాస్, ప్రశాంత్, ఇన్చార్జి ఎన్విరాన్మెంట్ అధికారి రమేశ్ తదితరులున్నారు. -
గణపయ్యలకు ఘన చరిత్ర
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలోగల గణేశ్ మందిర్లో వందేళ్లకు పైబడి గణేశ్ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో వినాయకుడిని గరిక ప్రియుడిగా భక్తులు కొలుస్తారు. జిల్లాలోని ఏకై క అతి పురాతన ఆలయం కావడంతో గణనాథుడిని దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతినెలా నిర్వహించే సంకష్టహర చతుర్థి పూజలు, కోజాగిరి, ఎక్కాహంతోపాటు పర్వదినాల్లోనూ భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. గణేశ్ నవరాత్రుల్లో భాగంగా ఇప్పటివరకు దాతల సహాయంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. వినాయకుడి విగ్రహ దాతగా నిలిచేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం మరో పదేళ్ల వరకు దాతల పేర్లు ఇదివరకే నమోదై ఉన్నాయి. భక్తుల సహకారంతో ఆలయంలో ఉత్సవాలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శోభాయాత్రగా వెళ్లి పెద్దవాగులో గణనాథుడిని నిమజ్జనం చేస్తారు. కేశవనాథస్వామి ఆలయంలో 106 ఏళ్లుగా.. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో కొలువున్న కేశవనాథుడు భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నాడు. చోళుల కాలంలో సిర్పూర్ గ్రామంలో చెత్తకుప్పలో దొరికి బ్రాహ్మణవాడ పెద్దలతో ఆసిఫాబాద్ బ్రాహ్మణవాడలో వెలిసిన శ్రీకేశవనాథస్వామిని 300 ఏళ్ల క్రితం ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయంలో 106 ఏళ్లుగా నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆలయంలో శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో నిత్యం భజన, ప్రసాద వితరణ, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడతారు. పూర్వం పట్టణంలో నాలుగు ప్రాంతాల్లోనే గణేశ్ నవరాత్రులు నిర్వహించేవారు. ఆలయంలో గణేశ్ నవరాత్రులతోపాటు శారదాదేవి ఉత్సవాలు, కార్తీక మాసం కాకడహారతి నెలరోజులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయం దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. నిత్య పూజలతో ఈ ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శివకేశవ మందిర్లో 103 ఏళ్లుగా.. జిల్లా కేంద్రంలోని శివకేశవ మందిర్ (వాసవీ) గణే శ్ మండలికి 103 ఏళ్ల చరిత్ర ఉంది. పట్టణానికి చెందిన శిర్ప వంశీయుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మా ణం చేపట్టారు. ఆలయంలో శివకేశవుల విగ్రహాలు ఏర్పాటు చేయగా, 26 ఏళ్లక్రితం వాసవీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో 1923లో తొలిసారి గణేశ్ నవరాత్రి వేడుకలు ప్రారంభించారు. వందేళ్ల క్రితం ప్రారంభించిన ఉ త్సవాలు నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. గతంలో ఆలయంలోపలి గదిలో గణనాఽఽథుడిని ప్రతి ష్ఠించగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ఆలయం పక్కన ఏర్పాటు చేసిన వరండాలో నెలకొల్పుతున్నారు. గతంలో శివకేశవ మందిర్ పేరిట ఏర్పాటు చేసిన గణేశ్ మండలి ప్రస్తుతం వా సవీ గణేశ్ మండలిగా మార్పు చెందింది. మూడు దశాబ్దాల క్రితం వరకు గణేశ్ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కు చెందిన భాగవతార్లతో హరికథ చెప్పించేవా రు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అంతటా గణపతి నవరాత్రోత్సవాలను తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తుండగా, ఇక్కడ మాత్రం 11రాత్రుల అనంతరం 12వ రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేయడం అనవాయితీగా వస్తోంది. -
వర్షం.. అన్నదాతల్లో హర్షం
● వాడుతున్న పంటలకు జీవం ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ రూరల్: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు వర్షం కురిసింది. వానలు లేక పక్షం రోజులుగా వివిధ పంటలు వాడిపోతుండగా తాజాగా కురిసిన వర్షం జీవం పోసినట్లయింది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తంజేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే 15నుంచి 20శాతం తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే లోటు వర్షపాతమే నమోదైంది. పంటలకు జీవం పోసిన వాన జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వీటిలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47వేల ఎకరాల్లో వరి, 21వేల ఎకరాల్లో కంది, 7.5 వేల ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నట్లు అధికారుల అంచనా. కాగా, ఇప్పటివరకు 1,40,760 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, వీటిలో 1,32,150 ఎకరాల్లో పత్తి, 8,250 ఎకరాల్లో కంది, 35 ఎకరాల్లో పెసర సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పత్తి విత్తినప్పటి నుంచి దశలవారీగా రైతులు కలుపు తీస్తూ, ఎరువులు వేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మొక్కలు ఏవుగా పెరిగి పూత, కాత దశలో ఉండగా, వర్షాలు లేక వాడిపోతున్నాయి. చేలల్లో చెట్ల మధ్య కలుపు తొలగించి, దౌర కొట్టి ఎరువు వేశారు. ఏపుగా పెరిగిన పత్తి, సోయా పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేసింది. జిల్లాలో వరి నాట్లు కూడా కొనసాగుతున్నాయి. 26మిల్లీ మీటర్ల వర్షపాతం శనివారం జిల్లాలో 47.24 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా రెబ్బెన మండలంలో 93.5 మిల్లీ మీటర్లు కురిసింది. కాగజ్నగర్లో 78.8, కెరమెరిలో 64.3, వాంకిడిలో 48.8, ఆసిఫాబాద్లో 38.5, పెంచికల్పేట్లో 38.0, దహెగాంలో 33.0, సిర్పూర్(టీ)లో 28.5, బెజ్జూర్లో 24.5, తిర్యాణిలో 14.5, జైనూర్లో 10.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీమ్ ప్రాజెక్ట్లో ఎగువనుంచి వరదనీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 10.393 క్యూసెక్కులు కాగా, 6.137 క్యూసెక్కులకు చేరింది. ఇన్ఫ్లో 2,172 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1,378 కూసెక్కులున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. పత్తి పంటకు మేలు పక్షం రోజులుగా రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా కురిసిన వర్షాలు పత్తి పంటకు మేలు చేశాయి. జిల్లాలో పంటల సర్వే కొనసాగుతోంది. సర్వేయర్లు పొలాల వద్దకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి, సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేసుకోవాలి. వివరాలు ఆన్లైన్లో నమోదైతేనే పండించిన పంటను విక్రయించే వీలుంటుంది. – మిలింద్, ఏడీఏ కుమురంభీం ప్రాజెక్ట్ రెండు గేట్ల నుంచి దిగువకు వెళ్తున్న నీరు నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఏరియాలోని ఖైరిగూ ర ఓసీపీ రోజువారీ ఉత్పత్తి లక్ష్యం సుమా రు 8వేల టన్నులు కాగా, క్వారీ లోపలి బొగ్గు ఉత్పత్తి ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియ నిలిపివేశారు. రెండో షిఫ్టు సమయానికి వర్షం తగ్గకపోవడంతో అధికారులు ఉత్పత్తి చేపట్టలేకపోయారు. సాయంత్రం కాస్త విరా మం ఇచ్చినా రాత్రి నుంచి ముసురు మొ దలైంది. దీంతో నైట్షిఫ్టులోనూ ఉత్పత్తి కొనసాగించే అవకాశాలు కనిపించలేదు. క్వారీలోని హాల్రోడ్లు బురదమయంగా మారడంతో డంపర్లను ఉపరితలంలో నిలిపివేశారు. వర్షం కారణంగా క్వారీ లోపలికి చేరుతున్న నీటిని ప్రత్యేక మోటర్ల ద్వారా తోడి బయటకు పంపిస్తున్నారు. మొదటి, రెండో షిఫ్టులో సుమారు 5వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. నష్టపోయిన బొగ్గు ఉత్పత్తి విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.కుమురంభీం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీమ్ ప్రాజెక్ట్ సామర్థ్యం 10.393 టీఎంసీలు (238 మీటర్లు) కాగా, ప్రస్తుతం 6.137 టీఎంసీలుగా ఉంది. 2,172 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా రెండు గేట్లు ఎత్తి 1,378 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ దిగువనున్న రాజుర, గుండి, రహపల్లి గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు. -
బెజ్జూరు ఎస్సై అటాచ్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రేషన్ బియ్యం కేసులో అక్రమాలకు పాల్పడుతూ ఆధారాలతో దొరికిన బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషాపై వేటు పడింది. బెజ్జూరు పీఎస్ బాధ్యతల నుంచి తప్పించి జిల్లా కేంద్రానికి అటాచ్ చేస్తూ ఈ నెల 11న ఉత్తర్వులు వెలువడ్డాయి. గత నెల 30న ‘సాక్షి’లో ‘ఆ ఎస్సైపై వేటు?’ శీర్షికన కథనం ప్రచురితమైంది తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఎస్పీ నితికాపంత్ సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించి శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తాజాగా అటాచ్ చేశారు. ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేస్తారా?.. లేదా? అనేది తేలాల్సి ఉంది. తొలినాళ్లలోనే వసూళ్ల పర్వం! శిక్షణ పూర్తయిన తొలినాళ్లలోనే సదరు ఎస్సై వసూళ్లకు పాల్పడడం విస్మయానికి గురి చేసింది. బెజ్జూరు పోలీస్స్టేషన్లో పని చేస్తున్న సమయంలో పీడీఎస్ బియ్యం వ్యాపారుల నుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడ్డారు. అక్రమ దందా చేసే వర్గాల మధ్య ఉన్న విభేదాలను క్యాష్ చేసుకోవాలని యత్నించారు. గత నెలలో మహారాష్ట్రకు రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడిన ఆటోలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. అయితే, మరోచోట డంప్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయకుండా నిందితుడికి తెలియకుండానే మరో వ్యక్తితో అమ్మించారు. ఆ డబ్బులు తనకు తెలిసిన మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి ఫోన్ పే చేయించారు. ఈ విషయం డీసీసీ మైనార్టీ చైర్మన్ అర్షద్ హుస్సేన్కు బాధితులు తెలియజేయడంతో ఆధారాలతో ఎస్పీకి అందజేశారు. దీనిపై విచారణ చేపట్టగా, ఎస్సై డబ్బులు తీసుకున్న విషయం నిజమేనని తేలింది. దీంతో చర్యలు తీసుకోక తప్పలేదు. చర్యలు ఖాయమని తెలిసిన తర్వాత కూడా.. బెజ్జూర్ ఎస్సై వ్యవహారం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. తనపై చర్యలు తీసుకోవడం ఖాయమని తెలిసి కూడా సదరు ఎస్సై వసూళ్లకు పాల్పడడం మరింత ఆఽశ్చర్యానికి గురి చేస్తోంది. ‘‘సర్ ట్రాన్స్ఫరై పోతున్నాడు.. నెలనెలా ఇచ్చే మామూళ్లు ఇప్పుడే ఇవ్వాలి’’ అంటూ స్టేషన్లో పని చేస్తున్న ఓ ప్రైవేట్ వ్యక్తితో ఎస్సై ఫోన్ చేయించారు. దీనిపై ఫోన్ సంభాషణ ఆడియో కూడా బయటపడింది. గతంలో ఇదే పోలీస్స్టేషన్లో పని చేస్తున్న ఓ వ్యక్తికి పలుసా ర్లు చెల్లించిన డబ్బుల వివరాలూ బయటకు రావడంతో మరింత లోతుగా విచారణ సాగుతోంది. మరోవైపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్లో ఏళ్లపాటు పాతుకుపోయి, అనేక అక్రమ దందాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో హెడ్ కానిస్టేబుల్నూ ములుగు జిల్లాకు బదిలీ చేశారు. అయితే, డీపీవోలో పని చేస్తున్న మరో కానిస్టేబుల్పై ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ డిపార్ట్మెంట్లో నడుస్తోంది. -
హామీలు అమలు చేయాలి
సమ్మె సమయంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సమగ్ర శిక్షను పూర్తి స్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. పేస్కేల్ అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించాలి. ఉద్యోగులకు అప్పటి పీసీసీ హోదాలో ఇచ్చిన హామీని ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలి. సమ్మెకాలపు వేతనాలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. – సంతోష్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధికార ప్రతినిధి -
జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి
ఆసిఫాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని, ప్రతీ కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్ అన్నారు. బీసీల ధర్మపోరాట దీక్షలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు జ నాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, ఎమ్మార్పీఎస్ నాయకులు రేగుంట కేశవరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అవిడపు ప్రణయ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వైరాగడే మారుతి పటేల్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లవ్కుమార్, ప్రధాన కార్యదర్శి గాజుల జక్కయ్య, ఉపాధ్యక్షుడు పురుషోత్తం బాలేశ్, మాలి సంఘం నాయకులు శంకర్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి
ఆసిఫాబాద్అర్బన్: అటవీశాఖలో విధులు నిర్వహిస్తూ అమరులైన వారి త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీ అధికారి బాలమణి అన్నారు. అటవీ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఏటా సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటవీ సంరక్షణలో అమరులైన 26 మంది త్యాగాలు వెలకట్టలేనివన్నారు. రాత్రిపూట వచ్చే సమాచారాలకు జట్టుగా వెళ్లాలని సూచించారు. అనంతరం జెండా ఊపి బైక్ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు మహేందర్, రమాదేవి, గోవింద్ చంద్ సర్దార్, రమేశ్, మజారుద్దీన్, జానియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, సభ్యులు సద్దాం హుస్సేన్, సాయి, డిప్యూటి రేంజ్ అధికారులు విజయ్ ప్రకాష్, ఝాన్సీరాణి, ఇక్బాల్, జమీల్, శాబాజ్, తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన విద్యుత్ అందించాలి
ఆసిఫాబాద్అర్బన్: వినియోగదారులకు మె రుగైన విద్యుత్ అందించాలని విద్యుత్శాఖ ఎస్ఈ ఉత్తం జాడె అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ 132/33 కేవీ సబ్స్టేషన్ను సందర్శించారు. ఫీడర్ల వారీగా విద్యుత్ లోడ్, పీక్ అవర్స్లో డిమాండ్, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యంపై అధికారులతో సమీక్షించారు. ఏడీఈ (ఆపరేషన్) దుస్సా శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలువిద్యుత్ ప్రమాదాల నివారణకు ‘జీరో యా క్సిడెంట్’ లక్ష్యంతో సమగ్ర భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఈ ఉత్తమ్ జాడె ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వర కు 467 మిడిల్ పోల్స్, 173 స్తంభాలు, 8 వేల మీటర్ల నూతన విద్యుత్లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి
కాగజ్నగర్టౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీఎం క్లబ్లో వినాయక మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. విద్యుత్ శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందాలన్నారు. పట్టణంలోని గుంతల మయమైన రోడ్లకు మరమ్మతు చేయించాలని మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులకు సూచించా రు. సమావేశంలో తహసీల్దార్ మధుకర్, మున్సిప ల్ కమిషనర్ తిరుపతి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో సీతారాం, తదితరులు పాల్గొన్నారు. మోడల్ గ్రామసభకాగజ్నగర్టౌన్: పట్టణంలోని సిర్పూర్(టి) ఏకల వ్వ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మోడల్ గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నా రు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి.రమేశ్, వైస్ ప్రిన్సిపాల్ కనికవర్మ, ఉపాధ్యాయులు మనీషా, రవిశంకర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీ సుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించా రు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఒక సంవత్సర కాల పరిమితికి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య, శిక్షణ అందించడంతో పాటు అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్యబోధనా సిబ్బంది ని సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డయల్ 112కు త్వరగా స్పందించాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేయరాదని, పోలీసు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, వాటి పురోగతికి కృషి చేయాలని ఆదేశించారు. కేసుల నమోదు, దర్యాప్తు, నేరస్తుల వివరాల నిర్వహణ, డేటా సమన్వయంలో సీసీటీఎన్ఎస్ను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో నాకాబంది, కమ్యునిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
విచారణ హైరానా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలన(ఎస్ఐఆర్)లో అన్మ్యాపింగ్, అనామలీస్ ఓటర్ల పరిశీలనతో బీఎల్వోలు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఓటర్లకు నోటీసుల జారీ నుంచి విచారణ(హియరింగ్) చేపట్టడం వరకు ప్రయాసగా మారింది. ఓటర్లకు తగిన రుజువులు లేకపోతే మరోసారి రావడం, ఓటర్లు నిర్ణీత సమయంలో బీఎల్వోల ముందు హాజరు కావడం లేదు. ఆ తేదీలు రద్దు(ల్యాప్స్) అవుతున్నాయి. బీఎల్వోలు ప్రతీ ఓటరు ఫొటో తీసుకుని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో చాలా చోట్ల వేలాది మంది ఓటర్ల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఒక్కో రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగటున కనీసం వెయ్యికి పైనే ఓటర్ల పరిశీలన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొందరు తగిన రుజువులు తీసుకురాకపోవడంతో మళ్లీ మళ్లీ హియరింగ్ ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలకు చాలామంది పదో తరగతి మార్కుల మెమో, బ్యాంకు పాస్బుక్, లేదా కుల ధ్రువీకరణలు అడుగుతున్నారు. ఆధార్, పాన్, రేషన్ కార్డులు ధ్రువీకరణకు ఆమోదించకపోవడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. గడువులోపు పూర్తయ్యేనా?ప్రస్తుతం ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. అదే సమయంలో ఓటర్ల తప్పుల ను సరిచేస్తున్నారు. చాలావరకు చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ తప్పనిసరిగా రుజువు చూపించాలి. వేలాది ఓటర్లకు నోటీసుల జారీ, హియరింగ్, తేదీ లు, బీఎల్వోలు ధ్రువపత్రాల పరిశీలన నుంచి ఆ ర్వోలు, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికా రుల వరకు పరిశీలన చేయాలి. దీంతో గడువులోపు సర్ ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలు వ స్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ తుది జాబి తా ప్రచురణకు అక్టోబర్ 15నుంచి నవంబర్ 9వరకు గడువు పొడగించింది. నవంబర్ 5వరకు అభ్య ంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. ఈ క్రమంలో అనేక మంది ఓటర్లు సకాలంలో స్పందించకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.నియోజకవర్గాల వారీగా నోటీసుల వివరాలు ని.వర్గం నోటీసులు జారీ చేసింది పెండింగ్ హియరింగ్ హియరింగ్ ల్యాప్స్ సిర్పూర్ 53,245 37,474 15,771 7,564 17,081 ఆసిఫాబాద్ 52,647 30,990 21,657 6,608 14,398 చెన్నూరు 57,380 43,445 13,935 1,586 39,674 బెల్లంపల్లి 45370 39,629 5,741 1,828 21,344 ఆదిలాబాద్ 85525 23,596 61,929 3,339 56,722 బోథ్ 64,900 54,386 10,514 10,671 32,762 ఖానాపూర్ 68,052 62,436 5,616 13,964 25,462 నిర్మల్ 83,370 65,818 17,552 14,377 57,800 ముథోల్ 70,581 65,348 5,233 20,019 28,582 మంచిర్యాల 68,218 43,481 24,737 10,019 16,407 -
పనుల ప్రణాళికలకు గ్రామసభలు
తిర్యాణి: వలసలు నివారించడంతో పాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఉపాధి హామీ పథకం పేరు ఇటీవల వీబీజీ రాంజీగా మార్చారు. దీంతో పాటు గతంలో జాబ్కార్డులో కలిగిన కుటుంబాలకు గరిష్టంగా వందరోజుల పనిదినాలే కల్పించగా ప్రస్తుతం వాటిని 125 రోజులకు పెంచారు. పథకంలో భాగంగా 2027–28, 2028–29, 2029–30 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనుల ప్రణాళికలను సిద్ధం చేయడానికి రెండు దఫాలుగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనుల ప్రణాళికక్షేత్రస్థాయిలో పనుల ప్రణాళిక సిద్ధం చేయడానికి రెండు దఫాలుగా గ్రామసభలు నిర్వహిస్తున్నా రు. మొదటి గ్రామసభలో వీబీ జీ రాంజీ చట్టం ఉద్దేశాలతో పాటు గ్రామానికి సంబంధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించడం, గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు, ఖర్చు వివరాలు తెలియజేయడం, పురోగతిలో ఉన్న పనుల వివరాలను వెల్లడించడం, వీజీ జీ రాంజీలో అనుమతించిన 318 పనుల జాబితాను రైతులకు అర్థమయ్యేలా వివరించడం వంటివి చేపడుతారు. రెండో గ్రామసభలో ప్రతిపాదిత పనిపేరు, లబ్ధి దారుల వివరాలు, అంచనా వ్యయం, గుర్తించిన పనులు, ప్రాధాన్యత సంఖ్య, ఆశించిన ఫలితం వంటి వివరాలను సంబంధిత అధికారులు నమో దు చేసుకుంటారు. పనుల ప్రణాళికలను గ్రామసభలో రూపొందించేందుకు ఇప్పటికే అధికారులతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో లేదా ప్రోగాం అధికారి టీం లీడర్ ఒక బృందం, అడిషనల్ ప్రోగాం ఆఫీసర్ అధ్యక్షతన మరో టీం, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ టీం లీడర్గా మరో బృందం పని చేయనున్నారు. ఆయా బృందాల్లో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అయితే మూడేళ్లకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలో మొదటి ప్రాధాన్యత ఉన్న పనులను 2027–28 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించనున్నారు.జిల్లా వివరాలుప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంఽధించి వీబీ జీ రాంజీ ద్వారా చేపట్టే పనులకు సంబంధించి గ్రామసభల ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం మొదటి విడత గ్రామసభలు జరుగుతున్నాయి. త్వరలోనే రెండో విడత గ్రామసభలు నిర్వహిస్తాం. – షాకీర్ ఉస్మాని, అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి -
ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి
కాగజ్నగర్టౌన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ల సాధనకు పట్టణంలోని ఏడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెండి ంగ్లో సమస్యలు పరిష్కరించాలని, ఐదు రో జుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ వైస్ప్రెసిడెంట్ ఆజ్మీరా రాజేందర్, డైరెక్టర్లు గోగర్ల శ్రీనివాస్, సాయిచరణ్, శ్రీనివాస్, అనిల్కుమార్, తిరుపతి, గణపతి, హేమంత్, అజయ్ కుమార్, శ్రీవాణి, రవితేజ పాల్గొన్నారు. -
● ప్రతీనెల మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ ● ఆటపాటలు, సృజనాత్మకతకు పెద్దపీట ● పక్కాగా అమలుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ
కెరమెరి: ప్రతీరోజు పుస్తకాలు, నోటు బుక్కులతో నిండిన బ్యాగును భుజాని వేసుకుని బడిబాట పట్టే విద్యార్థులకు ఇక నెలలో ఒకరోజు బ్యాగు భారం ఉండదు. పాఠ్య పుస్తకాలకు పరిమితమైన విద్యకు భిన్నంగా ఆటలు, పాటలు, కళలు, ప్రయోగాలు, సృజనాత్మకత, తదితర కార్యక్రమాలతో ఆహ్లాదకర అభ్యసన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ‘నో బ్యాగ్ డే’కు శ్రీకారం చుట్టింది. గతంలో ప్రతీ శనివారం ‘నో బ్యాగ్ డే’ పాటించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఇక నుంచి ప్రతీనెల మూడో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డేను కచ్ఛితంగా అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కళలకు పెద్దపీట..చిత్రలేఖనం, కథలు, పాటలు, నృత్యం, హస్తకళలు, వ్యాసరచన, వృక్తృత్వం, క్విజ్ వంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించనున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇది మంచి వేదికగా మారనుంది. తరగతి గదిలో పె ద్దగా మాట్లాడని విద్యార్థులు సైతం తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందనున్నారు. విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు చిన్నచిన్న ప్రయోగాలు, నమూనాల తయారీ, పరిశీలన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పుస్తకంలో చదివిన అంశాలను ఆచరణలో చూపించడం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, పరిశీలన శక్తి, తార్కిక ఆలోచన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధ్యాయులకు సవాల్..విద్యార్థులు కేవలం ఆటలు, వినోదాలకే పరిమితం కాకుండా ప్రతీ కార్యక్రమం ద్వారా ఏదో ఒక విషయాన్ని నేర్చుకునేలా ఉపాధ్యాయులు కార్యాచరణ రూపొందించాలి. తరగతుల వారీగా విద్యార్థుల వయస్సు, ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయాలి. ప్రతీ విద్యార్థి ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. బడి అంటే చదువొక్కటే కాదు..విద్యార్థి సమగ్ర అభివృద్ధికి పాఠ్య పుస్తక జ్ఞానంతో పాటు సృజనాత్మకత, సామాజిక అవగాహన, క్రీడానైపుణ్యం, కళా ప్రతిభ కూడా అవసరం. ఈ నేపథ్యంలో ‘నో బ్యాగ్ డే’ ద్వారా విద్యార్థులకు విభిన్న అనుభవం అందించేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. నెలలో ఒక్కరోజైనా పుస్తకాల ప్రపంచం నుంచి బయటికి వచ్చి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తూ నేర్చుకునే అవకాశం విద్యార్థులకు లభించనుంది. కార్యక్రమం విజయవంతానికి తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం. ఆరోజు పుస్తకాలు, నోట్ బుక్కులతో కూడిన బ్యాగ్ను పంపకుండా పాఠశాల సూచించిన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. పక్కాగా అమలు చేయాలి ఇక నుంచీ ప్రతీనెల మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ను ప్రతీ పాఠశాలలో పక్కాగా అమలు చేయాలి. కేటాయించిన తేదీల్లో పుస్తకాలతో రావద్దని విద్యార్థులకు చెప్పాలి. ఆటలు, పాటలు, సృజనాత్మకతకు పెద్దపీట వేయాలి. పాఠశాలల్లో పుస్తకేతర కార్యక్రమాలు అమలు చేయాలి. విద్యార్థులు ఒక్కరోజు స్వేచ్ఛగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. – సచ్చిదానందచారి, జిల్లా విద్యాధికారి బరువుకు బ్రేక్విద్యార్థులకు చదువుపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు విద్యను మరింత ఆసక్తికరంగా మార్చడమే ‘నో బ్యాగ్ డే’ ముఖ్య ఉద్దేశం. సాధారణ రోజుల్లో పాఠ్యాంశాల బోధనకు ప్రాధాన్యం ఇస్తే మూడో శనివారం మాత్రం ఆచరణాత్మక అభ్యసనకు పెద్దపీట వేయనున్నారు. విద్యార్థులు స్వయంగా పాల్గొని అనుభవం ద్వారా నేర్చుకునేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల ఆటల ద్వారా క్రమశిక్షణ, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సమన్వయం వంటి అంశాలను నేర్పించనున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలిగేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. -
కాగజ్నగర్లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి
కాగజ్నగర్టౌన్: జిల్లాలో ఆర్టీసీకి అధిక ఆదాయం సమకూరుస్తున్న కాగజ్నగర్లో ప్రత్యేక బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బా బు డిమాండ్ చేశారు. దివంగత ఎమ్మెల్యే పాల్వా యి పురుషోత్తం హయాంలోనే డిపో ఏర్పాటుకు నాలుగెరాలు కేటాయించినా, 20 ఏళ్లుగా డిపో ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైందన్నారు. శా సన సభ సమావేశాల్లో భాగంగా గురువారం ఆయ న పలు అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. 114 రోజులుగా ఎస్పీఎం కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, మిల్లులో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రమాదా లు జరుగుతున్నా యాజమాన్యం కనీస ప్రమాణా లు పాటించడం లేదని ఆరోపించారు. ఉద్యోగ భద్ర త లేక ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా 118 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో పత్తిసాగు ఎక్కువగా ఉందని, కౌటాలలో రీసెర్చ్ సెంటర్ కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలి పారు. -
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
ఆసిఫాబాద్అర్బన్: అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతికి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగతో కలిసి హాజరయ్యారు. ఐల మ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ అణగారిన వర్గాల ప్రజల భూమి హక్కులు, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నదీం మజీద్, బీసీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
హిందీ అధ్యాపకుడికి డాక్టరేట్
రెబ్బెన: రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ జూనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కిర్మరే సుధాకర్ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్లా, ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగారం సమక్షంలో సుధాకర్ పట్టా స్వీకరించారు. తన పరిశోధన ప్రస్థానంలో సహకరించిన కుటుంబ సభ్యులు, గురువులు, పరిశోధన మార్గదర్శకులు, కళాశాల ప్రిన్సిపాల్, సహచర అధ్యాపకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
కౌటాల: పత్తి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంక ట్ అన్నారు. కౌటాల మండలం నాగేపల్లి గ్రా మ శివారులోని పంట చేలను గురువారం ప రిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పురు గు, తెగులు, పోషక, పోషక తదితర మందులను ఎంత మోతాదులో వినియోగించాలో వి వరించారు. పలు తెగుళ్లు సోకుతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారుల సూచన మే రకు మందులు పిచికారీ చేయాలన్నారు. వ లంటీర్ ద్వారా పంటల వివరాలను ఈ నెల 30లోగా నమోదు చేయించుకోవాలని సూచించారు. సర్పంచ్ కావుడే బిక్కు, ఏఈవో అంజన్న, రైతులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా నెట్బాల్ ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ గురువారం జిల్లాస్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల నె ట్బాల్ ఎంపిక పోటీలు రసవత్తరంగా సాగా యి. జిల్లా నలుమూలల నుంచి 100 బాలికలు, 40 మంది బాలురు హాజరయ్యారు. సబ్ జూనియర్ విభాగంలో 24 మంది, జూనియ ర్ విభాగంలో 24 మంది బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్, ప్రధాన కార్యదర్శి తిరుపతి తెలిపారు. కాగా, ఈ పో టీలను మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, యంగ్ ఇండియా జిల్లా అధికారి మీనారెడ్డి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మహేశ్వర్, కోచ్లు విద్యాసాగర్, అరవింద్, ఏడుకొండలు, రాకేశ్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
నిషేధిత గుబులు!
చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్లో 1,123 మంది రైతులకు చెందిన సుమారు మూడు వేల ఎకరాలకు పైగా భూములు 22ఏ జాబితాలో ఉన్నాయి. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు నిషేధిత జాబితాలోకి చేరడంతో బ్యాంకు అధికారులు లోన్లు ఇవ్వడం లేదని, అత్యవసర సమయాల్లో అమ్ముకోలేకపోతున్నామని బాధిత రైతులు వాపోతున్నారు. ఆసిఫాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత కోసం అమలు చేస్తున్న 22ఏ జాబితా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. జిల్లాలోని వేలాది ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చడంతో క్రయవిక్రయాలకు ఆటంకం ఏర్పడుతోంది. రూ.లక్షలు పెట్టి వ్యవసాయ భూములు, ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివాహాలు, ఇతర అత్యవసర అవసరాలకు సొంత భూమిని అమ్ముకోలేక, బ్యాంకులో తాకట్టు పెట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో చాలామందికి అవగాహన లేక 22ఏ జాబితా గురించి తెలియడం లేదు. క్రయవిక్రయాలు, బ్యాంకు లోన్లు, ఇతర అవసరాల సమయంలోనే తమ భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు. పాస్ పుస్తకాలు ఉన్నా..జిల్లాలో 2023లో 1,97,869 ఎకరాల అసైన్డ్ భూ ములు ఉండగా, ప్రస్తుతం 1,85,286 ఎకరాలు ఉ న్నాయి. 2023లో 5,26,945 ఎకరాల ప్రభుత్వ భూ మి ఉండగా, 2026లో 5,32,725 ఎకరాలు, 2023 లో 19,000 ఇతర ప్రభుత్వ భూములు ఉండగా, 2026లో 17,00 ఎకరాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా దేవాదాయ, వక్ఫ్ భూములు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భూములు, సీలింగ్, అసైన్డ్ భూములు, కోర్టు వివా దాలు/విజిలెన్స్ ఆస్తులు, ప్రభుత్వం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ నిషేధించిన భూములను 22ఏ జాబి తాలోకి చేర్చుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం రెండు లక్షల ఎకరాలను ఈ నిషేధిత జాబితాలో చేర్చినట్లు సమాచారం. కానీ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ పట్టా పాసుపుస్తకాలు ఉన్నా కూడా 22ఏ జాబితాలో చూపించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి తప్పిదాలు సరిచేస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తొలగడం లేదు. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల పట్టా భూములను ఈ జాబితాలో చేర్చారంటూ ఇటీవల మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నేతృత్వంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు బాధితులతో కలిసి కౌటాలలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అధికారుల తప్పిదం.. ఆన్లైన్ చిక్కులుకబ్జాలను అడ్డుకునే లక్ష్యంతో ప్రభుత్వ భూముల రక్షణ కోసం వాటి వివరాలను సేకరిస్తున్నారు. కానీ అధికారుల తప్పిదం, ఆన్లైన్ చిక్కులతో పట్టా భూములు కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేరా యి. రైతులు, భూయజమానులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తేగానీ భూములు నంబర్ 22ఏ లో ఉన్నట్లు తెలియడం లేదు. రెవెన్యూ శాఖ అధికారులు అన్లైన్ సర్వేలో జరిగిన పొరపాటే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్ భూములతోపాటు పట్టా భూములను క్షేత్రస్థాయిలో విచారణ లేకుండా గుడ్డిగా జాబితా తయారు చేశారని రైతులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి ప్రైవేటు భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ సమస్యగ్రామీణ ప్రాంతాలతోపాటు ఏకంగా జిల్లా కేంద్రంలోనూ పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లిపోయాయి. ఆసిఫాబాద్ పట్టణంలో 66 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా మరిన్ని భూములు ఈ జాబితాలో చేర్చారు. సర్వే నంబర్ 61, 62లో పైకాజీనగర్ కాలనీ ఉంది. ఈ కాలనీల్లో వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. 61 సర్వే నంబర్ వక్ఫ్ బోర్డు జాబితాలో ఉండగా, తాజాగా 62 సర్వే నంబర్ను 22ఏ జాబితాలో చేర్చారు. సర్వే నం.62లో సుమారు 16 ఎకరాలు ప్రైవేటు భూమి, మూడెకరాల బీడీపీపీ భూమి ఉంది. రెవెన్యూ అధికారులు ఈ సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితా కింద చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. భూములు కొనుగోలు చేసిన యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్కు చెందిన అనార్థం తిరుపతి సర్వే నం.62లో 25 ఏళ్ల క్రితం ఓ ప్లాట్ కొనుగోలు చేశాడు. ఇటీవల సొంత అవసరాల కోసం ప్లాట్ను మరొకరికి విక్రయించాడు. మూడు రోజుల క్రితం రూ.1.30 లక్షల చలాన్ డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే మీ భూమి 22ఏ నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెప్పారు. గతంలో ఈ సర్వే నంబర్లో క్రయవిక్రయాలు జరిగాయి. కానీ ఇప్పుడు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారని బాధితుడు చెబుతున్నాడు.పరిష్కార మార్గాలు ఇవే..నిషేధిత జాబితాలో పట్టా భూములు ఉంటే ఆందోళన చెందకుండా వివిధ మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. bhubharati.telengana.gov.in లేదా dharani.telangana. gov. in పోర్టల్లో లాగిన్ అయ్యి ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రతీ సోమవారం 22ఏ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తుంది. దరఖాస్తులను మూడు రోజుల్లో పరిశీలించి పరిష్కారానికి అర్హమైనవా.. కాదా.. అని నిర్ణయిస్తారు. వక్ఫ్, ఎండోమెంట్ భూములకు సంబంధించిన ఫిర్యాదులకు వక్ఫ్ సీఈవో లేదా ఎండోమెంట్ కమిషనర్ను సంప్రదించాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే నిషేధిత జాబితా నుంచి భూమి వివరాలు తొలగిస్తారు. -
పొలిటికల్ వార్..!
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఎలాంటి ఎన్నికలు లేకపోయినా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ప్రధాన నాయకులతోపాటు మండల నాయకులు, సర్పంచ్లు నిత్యం ప్రెస్మీట్లు ఏర్పాటు చేస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గీయులు సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. బీజేపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు వర్గీయులు మాత్రం ఈ వివాదాలకు దూరం ఉంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. హరీశ్రావు బహిరంగ సభ తర్వాత.. కౌటాల మండలంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఈ నెల 4న ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరయ్యారు. 22ఏ భూముల సమస్యలను ప్రస్తావించారు. అలాగే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. కింది స్థాయి నాయకులు కూడా తమ నాయకులపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ మండలాల్లో సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో రచ్చ సిర్పూర్ నియోజకవర్గంలో పొలిటికల్ వార్ ఇప్పుడు చాయ్ దుకాణాల నుంచి సోషల్ మీడియాకు చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ రీల్స్తో రచ్చ చేస్తున్నారు. మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో సైతం ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతుండగా, స్థానిక ఎమ్మెల్యే, మరో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. మౌనంగా ఉండడంతో భారతీయ జనతా పార్టీ ఏ వ్యూహం పాటిస్తుందోనని జనం చర్చించుకుంటున్నారు. -
సంఘాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి
రెబ్బెన: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘా ల కాలపరిమితి ముగిసినందున యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి ఓరం కిరణ్ కోరారు. బుధవారం ఖైరిగూర ఓసీపీలో ఇన్చార్జి మేనేజర్ విజయ్కుమార్ సాహూకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగి సిందని తెలిపారు. ఇక నుంచి కార్మిక సమస్యల, హక్కుల పరిష్కారంలో అన్ని సంఘాలకు ప్రాతి నిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు సంపతి తిరుపతి, ఏరి యా నాయకులు కాయిత స్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సంఘీ ప్రశాంత్, ఫిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్, సీనియర్ నాయకులు సంపత్రావు, షిఫ్ట్ ఇన్చార్జీలు రవి, అబ్దుల్ అజీమ్ పాల్గొన్నారు. -
విద్యుత్ ఫీల్డ్ ఆపరేషన్లలో భద్రత ముఖ్యం
ఆసిఫాబాద్అర్బన్: విద్యుత్ శాఖకు చెందిన సిబ్బంది ఫీల్డ్ ఆపరేషన్ల సమయంలో ప్రతిఒక్కరూ భద్రత ప్రమాణాలు పాటించడం ముఖ్యమని ఆ శాఖ డీఈ సుధాకర్, ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్ఈ ఉత్తమ్ జాడె అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం అధికారులతో భద్రతా నియమాలు, జాగ్రత్తలపై సమీక్ష ని ర్వహించారు. ఫీల్డ్ ఆపరేషన్ల సమయంలో ప ని విధానం, సేఫ్టీ నిబంధనల గురించి వివరించారు. సమావేశంలో ఏఈలు, ఎస్బీఈ లు, ఆర్టిజన్లు, కాంట్రాక్ట్ కార్మికులు, అన్మ్యా న్డ్ సిబ్బంది, ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు. -
17 నుంచి ‘సేవా సంకల్ప్ అభియాన్’
ఆసిఫాబాద్: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లాస్థాయి వర్క్షా పు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నెల రో జుల పాటు వివిధ సేవ, సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలు బూత్స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 17న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవకు, వికసిత్ భారత్ 2047 సంకల్పానికి కృతజ్ఞతగా ప్రతీ బూత్లోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లలో దీపం వెలిగించేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ కోట్నాక విజయ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్, రాపర్తి ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గొంతుక కాళోజీ
ఆసిఫాబాద్అర్బన్: కాళోజీ నారాయణరావు కేవలం కవి మాత్రమే కాదని, సామాన్యుల సమస్యలను రచనలతో బలంగా వినిపించిన ప్రజాగొంతుక అని పోలీసు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఐ అడ్మిన్ వామనమూర్తి అన్నారు. తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు 112వ జయంతిని బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ తెలంగాణ యాస, భాషలో సామాజిక అంశాలను రచనలతో ప్రజలకు చేరువ చేసి చైతన్యం కల్పించిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాసేవలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. నివాళులర్పిస్తున్న పోలీసు అధికారులు -
వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
ఆసిఫాబాద్: వానాకాలం సీజన్ వరిధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, ఇతర అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం నిల్వలకు అవసరమైన గోదాములు సిద్ధంగా ఉండాలన్నారు. సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ, ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని అక్టోబర్ 1 నాటికి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. గత సీజన్కు సంబంధించిన వరిధాన్యం, గన్నీ సంచుల లెక్కలు సరిచూడాలన్నారు. వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఘనంగా కాళోజీ జయంతి ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కాళోజీ నారాయణ రావు 112వ జయంతి, తెలుగు భాషా దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్టే అనిల్కుమార్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి భాస్కర్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ సేవలను కలెక్టర్ కొనియాడారు. ప్రజల్లో సామాజిక చైతన్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారయ్యే విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి గణపతులను ప్రతిష్టించాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి అహ్మద్, బాలల సంరక్షణ అధికారి మహేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు
జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు ఆకట్టుకున్నాయి. అండర్ –14, 17 విభాగాల్లో బాలబాలికలకు అథ్లెటిక్స్, ఖోఖో, హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించగా 800 మంది హాజరయ్యారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ హాజరై క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం మెరుగుపడుతుందన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఎస్జీఎఫ్ కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. కార్యక్రమంలో డీఈవో సచ్చిదానందచారి, గ్రంథాయ చైర్మన్ అనిల్, డీవైఎస్వో అశ్వక్, డీఎస్వో షేకు, పీడీ మీనారెడ్డి, కోచ్లు విద్యాసాగర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. – ఆసిఫాబాద్రూరల్ -
అటవీ సంపద రక్షణకు చర్యలు
కాగజ్నగర్టౌన్: అటవీ సంపద, వన్యప్రాణులు, సహజ పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో రక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఎఫ్డీవో భార్గవ్కుమార్ తెలిపారు. కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో బుధవారం డివిజన్ పరిధిలోని అటవీ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎఫ్డీవో మాట్లాడుతూ అటవీ భూముల ఆక్రమణ, వన్యప్రాణుల వేట, చెట్ల నరికివేత, ఇతర అక్రమ కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అడవుల్లో పెట్రోలింగ్, రక్షణ, గస్తీ, వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానస్పద కార్యకలాపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కెమెరా ట్రాప్స్, మొబైల్ పెట్రోలింగ్, సాంకేతిక పర్యవేక్షణ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. నీటి వనరులను పర్యవేక్షించాలని, వన్యప్రాణుల కదలికల పరిశీలనకు డ్రోన్లను వినియోగించాలని సూచించారు. సమావేశంలో కాగజ్నగర్, సిర్పూర్(టి), కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ రేంజ్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాలుగో రైల్వే లైన్పై సర్వే
బెల్లంపల్లి: ప్రయాణికుల సౌలభ్యం, సరుకుల రవాణా రద్దీని అధిగమించడానికి బల్లార్షా–కాజీపేట మార్గంలో నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ తుది దశ సర్వే, తనిఖీకి సిద్ధమైంది. గురు, శుక్రవారాల్లో దక్షిణ మధ్య రైల్వే జోన్, సికింద్రాబాద్ డివిజన్ అధికారులు ఉమ్మడిగా తనిఖీ చేపట్టనున్నారు. నాలుగో లైన్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై రైల్వే ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు. ఈ నెల 15లోగా సర్వే, తనిఖీ నివేదిక సమర్పించాలని రైల్వే అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బొగ్గు, సరుకుల రవాణా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నిత్యం బొగ్గు, సరుకుల రవాణా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రైళ్ల రద్దీ కారణంగా సరిపడా లైన్లు లేక గూడ్స్ రైళ్లు నెమ్మదిగా ప్రయాణం సాగించాల్సి వస్తోంది. అనివార్యంగా వేగాన్ని నియంత్రించాల్సిన ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. దీని నివారణ కోసం రైల్వేశాఖ నాలుగో లైన్ సర్వే, తనిఖీకి సిద్ధపడింది. బొగ్గు, సరుకుల రవాణాతోపాటు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల రైళ్లను మరిన్ని ప్రవేశ పెట్టడానికి నాలుగో లైన్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎగువ, దిగువ మార్గాల్లో ఒకేసారి సమాంతరంగా రెండు రైళ్ల చొప్పున నడిచే అవకాశాలు ఉన్నట్లు సూత్రప్రాయంగా అంచనా వేశారు. మూడో లైన్పై రైళ్ల పరుగులు కాజీపేట నుంచి బల్లార్షా మధ్య 235 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాష్ట్రంలోని హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాల మీదుగా నాలుగో రైల్వే మార్గం వెళ్తుంది. ఢిల్లీ–చెన్నయ్ గ్రాండ్ ట్రంక్ రైల్వేలో ఈ మార్గం భాగంగా కాగా ఇటీవలే రెండు నెలల క్రితం కాజీపేట–బల్లార్షా మార్గంలో నిర్మించిన మూడో మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి అంతరాయం లేకుండా మూడో మార్గంలో రైల్వే పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో బొగ్గు, సరుకు రవాణా రైళ్ల రద్దీ అధికంగా ఉంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, రవీంద్రఖని, బెల్లంపల్లి, రామగుండం నుంచి బొ గ్గు రవాణా రైళ్లు ఎక్కువగా నడుస్తున్నాయి. మహా రాష్ట్రలోని పర్భనీ, కర్ణాటకలో యాదగిరి దగ్గరకి రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. మూడో మార్గం మొత్తం పూర్తిగా ఒకే మార్గం(దిగువ మార్గంలో)లో లేదు, కొన్ని చోట్ల ఎగువ మార్గంలో, మరికొన్ని చోట్ల దిగువ మార్గంలో ఉండడం గమనార్హం. నాలుగో లైన్ నిర్మాణంతో.. ప్రస్తుతం సర్వే, తనిఖీ కోసం ప్రతిపాదించిన నాలుగో లైన్ నిర్మాణం పూర్తయితే బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయి. అప్, డౌన్ మార్గాల్లో ఒకే పర్యాయం రెండు రైళ్లు చొప్పున ఏమాత్రం అవాంతరాలు లేకుండా, సిగ్నల్ సమస్య ఏర్పడకుండా పట్టాలపై పరుగులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. రైళ్ల రాకపోకలకు సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సరుకు రవాణా రైళ్ల వేగం కూడా పెరగనుంది. -
వ్యవసాయ క్షేత్రాలు పరిశీలన
కాగజ్నగర్టౌన్: ఐదు రోజుల శిక్షణలో భాగంగా కాగజ్నగర్ మండలం కోసిని గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను క్లస్టర్ రిసోర్స్పర్సన్లు(సీఆర్పీలు) బుధవారం డీఏవో వెంకట్, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఏడాదిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామానికి చెందిన రైతులు వెంకటేశ్వర్లు, సురేశ్ జీవామృతం, బీజామృతం వంటి సహజ ఎరువుల గురించి వివరించారు. అనంతరం హెచ్పీడీఎస్ పత్తి చేలు, ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు మనోహర్, ఏవో రామకృష్ణ, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ మధు, టెక్నికల్ అధికారి దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీ అండ
కలల కొలువుకు ఆసిఫాబాద్అర్బన్: ఆర్థిక ఇబ్బందులు, ప్రైవేటు కోచింగ్ సెంటర్ల భారీ ఫీజులు భరించలేక ఉద్యోగ కలలకు దూరమవుతున్న పేద నిరుద్యోగులకు జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. ఇటీవల కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, ఎస్పీ నితిక పంత్ ప్రత్యేక చొరవతో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 160 మంది అభ్యర్థులను ఎంపిక చేసి 90 రోజుల పాటు ఉచిత భోజనం, వసతితో కూడిన నాణ్యమైన శిక్షణ అందిస్తూ వారి కలల కొలువుకు ఊపిరి పోస్తున్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రిలిమ్స్, మెయిన్స్తో పాటు ఉదయం పూట ఫిజికల్ ఈవెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 139 పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు నియామక నోటిఫికేషన్లో వివిధ విభాగాల్లో జిల్లాలో 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించి సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలన్నది చాలామంది ఆకాంక్ష. ముఖ్యంగా యువత ఖాకీ కొలువుపై ఆశలు పెంచుకుంటారు. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఒడిదొడుకులు వారిని వెనక్కి నెడుతుంటాయి. ముఖ్యంగా అన్నిరంగాల్లో వెనుకబడిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్థిక స్థోమత లేక ప్రైవేటు కోచింగ్కు నిరుద్యోగులు దూరమవుతున్నారు. అలాంటి పేద నిరుద్యోగుల కలలకు ఊపిరి పోస్తూ జిల్లా పోలీసు శాఖ వారికి అండగా నిలుస్తోంది. 15 మండలాల పరిధిలో నిరుద్యోగులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి 160 మందిని ఎంపిక చేశారు. వీరికి 90 రోజుల పాటు భోజనం, వసతి కల్పిస్తూ ఉచిత శిక్షణ అందిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్లో తరగతులు ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలోనే ఏర్పాటు చేయడంతో పాటు ఎస్పీ నితిక పంత్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అభ్యర్థులకు అందుతున్న వసతులతో పాటు శిక్షణను గమనిస్తూ పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. శిక్షణలో పాల్గొన్న వారిలో అత్యధిక మంది ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తున్నారు. పోలీసు ఉద్యోగం సాధించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యం. ఉచిత శిక్షణకు ఎంపికై న నిరుద్యోగులకు ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఫిజికల్ శిక్షణ ఇస్తున్నారు. దాంతో పాటు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించేందుకు తెలుగు, ఇంగ్లీష్ మా ధ్యమాల్లో శిక్షణను అందిస్తున్నారు. ఇందుకోసం నిష్ణాతులైన అధ్యాపకులను నియమించారు. -
అర్హులు ఓటు కోల్పోకుండా చర్యలు
దహెగాం: ఎన్నిక సంఘం నిబంధనల మేరకు సర్ ప్రక్రియలో అర్హులు ఓటు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసి సిబ్బందితో సమావేశమయ్యారు. దహెగాం మండలంలో 6,432 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, 2,390 మందికి మాత్రమే అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకున్న వ్యక్తులు ధ్రువపత్రాలు అందించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. బీఎల్వోలు సక్రమంగా పని చేయడం లేదన్నారు. పనితీరు మార్చుకుని సర్ ప్రక్రియ గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ మునవార్ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘చింతలమాదర’ సందర్శన
తిర్యాణి: మండలంలోని చింతలమాదర జలపాత సందర్శనకు బుధవారం నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు ఎఫ్డీవో అప్పయ్య తెలిపారు. మందగూడలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జలపాతానికి వచ్చే పర్యాటకుల నుంచి వసూలు చేసే మొత్తంలో 20 శాతం నిధులు గ్రామాభివృద్ధికి ఖర్చు చేయడానికి అటవీ అధికారులు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. ఎఫ్డీవో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అటవీ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. అటవీ శాఖతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ తుంరం గోపాల్, గిన్నెధరి ఇన్చార్జి రేంజ్ అధికారి సరోజని రాణి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నాలుగింటి వరకే వైద్యం
చింతలమానెపల్లి: మండలంలో ఒకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రవీంద్రనగర్లో ఉంది. ఇక్కడ ఉదయం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే వైద్య సేవలందుతున్నాయి. కీలక వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండగా ప్రస్తుతం కమ్యూనిటీ వైద్యాధికారి అజ్మీర రాజ్కుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. బెజ్జూర్ స్టాఫ్నర్స్ దుర్గ ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్గా స్వప్నను బెజ్జూర్కు కేటాయించగా బుధవారం నుంచి తిరిగి ఇదే పీహెచ్సీకి కేటాయించారు. ప్రతిరోజూ సుమారుగా 60 నుంచి 70 మంది వరకు రోగులు వస్తుంటారు. మంగళవారం ఇన్చార్జి వైద్యాధికారి రాజ్కుమార్ అధికారికంగా జిల్లా కేంద్రానికి వెళ్లగా స్టాఫ్నర్స్ దుర్గ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరో వైద్యాధికారి పోస్టు, స్టాఫ్నర్స్, ఏఎన్ఎంలను అదనంగా కేటాయించాలని మండల వాసులు కోరుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత
ఆసిఫాబాద్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని వైద్య కళా శాలకు అనుబంధంగా బోధనాస్పత్రిగా అప్గ్రేడ్ చేసి మూడేళ్లయినా పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు లేరు. ఇన్చార్జి సూపరింటెండెంట్తో నెట్టుకొస్తున్నారు. 305 మంది వైద్యులకు కేవలం 38 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 210 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 22 మంది ఉండగా, 188 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు ఒక్కరే ఉన్నారు. 95 మంది కాంట్రాక్టు వైద్యులకు 11 మంది ఉండగా, ఏడుగురు ఆర్ఎంవోలు, ఆరుగురు క్యాజు వాలిటీ మెడికల్ అధికారులు, 11 మంది స్పెషలైజేషన్ వైద్యులకు ఒక్కరూ లేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్లే అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. రౌండ్ది క్లాక్ 18 మంది మత్తు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. ఐసీయూ సెటప్ వైద్యులు లేక సర్జరీలు జరగడం లేదు. ఈఎన్టీ, ఫోరెన్సిక్, మైక్రో బ యాలజీ నిపుణులు లేరు. ఆర్థో మిషన్, సర్జరీ ఎక్విప్మెంట్, సిటి స్కాన్, ఎమ్మారై స్కానింగ్ యంత్రాలు లేవు. బ్లడ్ బ్యాంకులో టెక్నీషియన్లు, యంత్రాలు లేకపోవడంతో నిల్వకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల కాగజ్నగర్కు చెందిన ఓ గైనకాలజిస్టు రావడంతో ఐదు సిజేరియ న్లు చేసినట్లు డీసీహెచ్ డాక్టర్ కిరణ్ తెలిపారు. మందుల కొరతజిల్లా ఆస్పత్రిలో బీపీ, షుగర్, ఇన్ఫెక్షన్లతో పాటు హృద్రోగులకు అవసరమైన అప్గ్రేడ్ మందులు అందుబాటులో ఉండడం లేదు. 10, 15 ఏళ్ల క్రితం నుంచి వాడుతున్నవే ఉన్నాయి. ఆస్పత్రి ప్రొఫెసర్లు అధునాతన మందులు రాస్తుండగా అవి దొరక్కక కొంతమంది బయట కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలలుగా ప్యాన్టాప్ ఇంజెక్షన్లు, ఎవిల్స్, సిరంజీలు, హైడ్రో కార్టిసన్ ఇంజెక్షన్లు అవసరానికి సరిపడా సరఫరా చేయడం లేదు. ప్యాన్టాప్ ఇంజెక్షన్లకు బదులు ట్యాబ్లెట్లు వాడుతున్నారు. పీహెచ్సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్వో నాగేంద్ర తెలిపారు. నెల రోజులుగా లిఫ్ట్ పని చేయకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. 17 పీహెచ్సీల్లో 44 మంది వైద్యులకు కేవలం 14 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యుల కొరతతో ఒక్కో డాక్టర్ రెండు, మూడు పీహెచ్సీలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సీజనల్, విష జ్వరాలతో ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. చాలా పీహెచ్సీలు సాయంత్రం 4 గంటల వరకే పనిచేస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పాముకాటు, పురుగుల మందు ప్రభావానికి గురైన సందర్భాల్లో అత్యవసర చికిత్స అందేలా 24గంటలు ఆస్పత్రి కొనసాగించాలని జిల్లా ప్రజలు విన్నవిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను ‘సాక్షి’ మంగళవారం విజిట్ చేయగా, పలు సమస్యలు వెలుగు చూశాయి.కౌటాల: కౌటాల పీహెచ్సీ రౌండ్ ది క్లాక్ ఆస్పత్రి కావడంతో కౌటాల, చింతలమానెపల్లి మండలాల రోగులకు ఇదే ప్రధాన దిక్కు. ప్రతిరోజూ సుమారు 80 మందికి పైగా ఓపీ వస్తున్నారు. ఇద్దరు వైద్యులకు ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. ప్రసవాలు, ఓపీల కారణంగా ప్రస్తుత డాక్టర్ కార్తీక్పై పనిభారం పడుతుండగా, స్థాని కుడు కావడంతో ఆయన నిత్యం అందుబాటులో ఉంటున్నారు. నలుగురు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ప్రతీ సోమవారం, గురువారం రోగులకు రక్త, మూత్ర పరీక్షలు చేసి నమూనాలను ఆసిఫాబాద్కు పంపిస్తున్నారు. పాము, కుక్క కాటు వ్యాక్సిన్లు, ఇతర మందులు అందుబాటులో ఉన్నా యి. ప్రతినెలా 20కి పైగా సాధారణ కాన్పులు చేస్తున్నారు. కౌటాల పీహెచ్సీకి మరో వైద్యుడిని నియమించడంతోపాటు 50 పడకలకు అప్గ్రేడ్ చేయాలని, డయాలసిస్ కేంద్రం వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో 38 మందే..గర్భిణులకు అందని సేవలు లింగాపూర్: లింగాపూర్ పీహెచ్సీలో ఎంబీబీఎస్ వైద్యులు లేకపోవడంతో ఆయుష్ వైద్యులే సేవలందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు సిర్పూర్(యూ), జైనూర్కు వెళ్లాల్సి వస్తుంది. హెల్త్ అసిస్టెంట్లు లేరు. నిత్యం సుమారు 80 మంది వరకు ఓపీ నమోదవుతుంది. రాత్రిపూట అత్యవసరమైతే వైద్యం అందడం లేదు. ఆస్పత్రిని 24 గంటలపాటు నిర్వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.ప్రతిరోజూ 80 మందికి పరీక్షలుపెంచికల్పేట్: పెంచికల్పేట్ పీహెచ్సీలో ఇద్దరు వైద్యులకు మంగళవారం ఒకరు సెలవులో ఉండగా మరొకరు విధులకు హాజరయ్యారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 80 మంది రోగులను పరీక్షించి మందులు అందిస్తున్నారు. పీహెచ్సీ పరిధిలోని ఐదు సబ్ సెంటర్లలో ఐదు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
పుస్తక పఠనంతో నైపుణ్యాలు మెరుగు
ఆసిఫాబాద్రూరల్: పుస్తక పఠనంతో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, పదజాలం, ఆలోచన శక్తి, సృజనాత్మక మెరుగుపడుతుందని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. ‘నా మాటలు– నా కథ పఠనోత్సవం’లో భాగంగా మంగళవారం మండలంలోని తుంపెల్లి పాఠశాలలో రీడ్ ఏ థాన్ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో పఠన సంస్కృతిని పెంపొందించాలన్నారు. డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ రీడ్ ఏ బుక్ అనే కాన్సెప్ట్తో ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు కథల పుస్తకాలు, ఇతర పఠన సామగ్రిని చదవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వో శ్రీనివాస్, హెచ్ఎం నాగేశ్వర్ పాల్గొన్నారు. విద్యార్థినితో చదివిస్తున్న డీఈవో సచ్చిదానంద చారి -
నిమజ్జన ప్రాంతాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
ఆసిఫాబాద్అర్బన్/కాగజ్నగర్టౌన్: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎస్పీ నితిక పంత్ ఆదేశించారు. ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ సన్నద్ధమవుతుందని తెలిపారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్లోని పెద్దవాగు ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలైన అంబేడ్కర్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌరస్తా తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వినాయక విగ్రహాలను తీసుకెళ్లే రూట్లలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు. బారికేడింగ్, రోప్ బ్యారియర్స్, తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. విగ్రహాలతో వచ్చే వాహనాల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ రూపొందించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్పై నిరంతర పోలీసు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. వైద్య, అగ్నిమాపక, రక్షణ బృందాల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్ల లు, వృద్ధుల భద్రతపై శ్రద్ధ వహించాలని, తప్పిపోయిన వారికి సాయం అందించేందుకు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. డీఎస్పీ వహీదుద్దీన్, కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, టౌన్ సీఐ ప్రేమ్కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
ప్రకృతి సాగుపై అవగాహన కల్పించాలి
ఆసిఫాబాద్అర్బన్: రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పించాలని డీఏవో వెంకట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో మంగళవారం రెండోరోజూ వ్యవసాయశాఖ, రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రసాయన మందుల వాడకం పెరిగిన నేపథ్యంలో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. విత్తన శుద్ధి, జీవామృతం, కంపోస్టు ఎరువుల వాడకంతో దిగుబడి పెరుగుతుందని తెలిపా రు. కార్యక్రమంలో టెక్నికల్ వ్యవసాయ అధికారి దీప్తి, వ్యవసాయ విస్తరణ అధికారి తాండవ కృష్ణ, శిక్షకులు రోహిణి ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. -
చైన్నె వరదలతోనే సివిల్స్ వైపు..
సివిల్ సర్వీస్లోకి రావడానికి తనకు ఒక విషాద అనుభవమే ప్రేరణ అని, చైన్నె వరదల సమయంలో ఐఏఎస్, ఐ పీఎస్ అధికారులు అందించిన సేవలు నన్ను ప్రభావితం చేశాయని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి తెలిపారు. ఆ తర్వాత సివిల్ సర్వీస్లో చేరాలనే తపన మినహా రెండో ఆలోచనే రాలేదని, సివిల్స్ సాధనకు నిద్రలేని రాత్రులు గడిపానని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 8లోu ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఉక్కపోత అధికంగా ఉంటుంది. ఒకటి, రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. -
తాతా మధు దిష్ట్టిబొమ్మ దహనం
ఆసిఫాబాద్అర్బన్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దహనం చేసి నిరసన తెలిపాయి. ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, కౌన్సిలర్ వినోద్ మాట్లాడుతూ శాసనసభ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే శాసన మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శాసన సభ గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు తారీఖ్, భీంరావు, నాయకులు రవీందర్, జక్కన్న, రాంచందర్, మారుతి పటేల్, విశ్వనాథ్, ఇమ్రాన్ హష్మి, అసద్, నారాయణ, మొండి, నాగోరావ్, సంతోష్, రాము, భానుచందర్, ప్రవీణ్చారి తదితరులు పాల్గొన్నారు. -
అరకొరగా అత్యవసర మాత్రలు
కెరమెరి: మండల కేంద్రంలోని పీహెచ్సీలో అరకొర మందులతో కాలం వెల్లదీస్తున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతిరోజూ 80 నుంచి 100 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. ప్యాన్టాప్, మెట్రోజిల్, జెల్లోప్రొమైడ్ తదితర అత్యవసర మాత్రలు అందుబాటులో లేవు. ‘సాక్షి’ ఉదయం 9 గంటలకు ఆస్పత్రిని విజిట్ చేయగా, ఎల్టీ ఉద్దవ్, సీహెచ్వో నాందేవ్ విధుల్లో ఉన్నారు. పీఎంజన్మన్ సిబ్బంది ఆలస్యంగా వచ్చి తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లారు. అప్పటికే బీసీ హాస్టల్ విద్యార్థులు, సాధారణ రోగులు వైద్యం కోసం వచ్చారు. ఉదయం 10 గంటల తర్వాత వైద్యుడు, సీహెచ్వో, స్టాఫ్నర్సులు వచ్చారు. రెండు డాక్టర్, ఫార్మసిస్ట్, వాచ్మెన్, నర్సుల పోస్టులు ఖాళీగా ఉండగా, ఇన్చార్జీలతో నెట్టుకువస్తున్నారు. ఎనిమిది సబ్సెంటర్లలో 16 మంది ఏఎన్ఎంలకు 11 మంది పనిచేస్తున్నారు. -
పీహెచ్సీల్లో మల్టీపారామెట్రిక్ డయాగ్నోస్టిక్ సిస్టం
ఆసిఫాబాద్: జిల్లాలోని పీహెచ్సీల్లో మల్టీ పారామెట్రిక్ డయాగ్నోస్టిక్ సిస్టం ద్వారా 75 రకాల వైద్య పరీక్షలు నిర్వహించన్నుట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్ హైదరాబాద్, ఓమిని యాక్టివ్ ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ కార్యక్రమం కింద సమకూర్చిన మల్టీ పారామెట్రిక్ డయాగ్నోస్టిక్ సిస్టంను అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఓమిని యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భాటియాతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధునాతన వైద్య పరికరాలతో పీహెచ్సీల్లోనే రోగుల వైటల్స్ మానిటరింగ్, రక్త పరీక్షలు నిర్వహిచి, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. డీఎంహెచ్వో నాగేంద్ర, ఆకాంక్షిత జిల్లా సమన్వయ కర్త బాలరాజు పాల్గొన్నారు. ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధిఆసిఫాబాద్: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. కలెక్టరేట్లో 2025– 26 షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక పురోగతిపై మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి హాజరయ్యారు. స్వయం ఉపాధి పథకం కింద మంజూరైన యూనిట్లను అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎస్సీ సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు సురేశ్కుమార్, ఎస్సీ అభివృద్ధి అధికారి ఎం.అశోక్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జనార్దన్, ఎంవీఐ మసూద్ అలీ పాల్గొన్నారు.వినాయక మండపాలకు పటిష్ట భద్రతఆసిఫాబాద్: వినాయక మండపాలు, నిమజ్జన కార్యక్రమాలకు పటిష్ట భద్రత కల్పించాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాట్లపై ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ జోస్తిన్ జోల్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, అగ్నిమాపక, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల పరిధిలో నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్తమ్ జాడె, మున్సిపల్ కమిషనర్లు అంజయ్య, తిరుపతి, తహసీల్దార్లు మధుకర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రింగన్ఘాట్ పాఠశాల తనిఖీ
కెరమెరి: మండలంలోని రింగన్ఘాట్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం డీపీవో భిక్షపతిగౌడ్ తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కిచెన్ గార్డెన్ను పరిశీలించారు. పాఠశాల వాతావరణం, బడి నిర్వహణపై హెచ్ఎం అజయ్కుమార్ను అభినందించారు. ఇంకుడు గుంత మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డుల నమోదుపై ఆరా తీశారు. చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. నూతన పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. సర్పంచ్ మండాడి అనసూయ, పంచాయతీ కార్యదర్శి ప్రేంసాగర్ ఉన్నారు. -
‘ఆశ్రమ’ విద్యార్థులకు యూనిఫాం పంపిణీ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని గిరిజన ఆశ్ర మ పాఠశాల విద్యార్థులకు డీఆర్డీవో దత్తారావు సోమవారం డీటీడీవో అంబాజీతో కలిసి యూనిఫాం పంపిణీ చేశారు. డీఆర్డీవో మాట్లాడుతూ జిల్లాలోని 14 ఆశ్రమ పాఠశాలల్లో 2,751 మంది విద్యార్థులు ఉండగా, అందరికీ యూనిఫాం క్లాత్ వచ్చిందని తెలిపా రు. ప్రస్తుతం 80 జతలు మాత్రమే పంపిణీ చేశామన్నారు. త్వరలోనే ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూ భాస్కర్, వార్డెన్ రామకృష్ణ, హెచ్ఎం రాజేంద్ర ప్రసాద్, మెప్మా అధికారులు మోతీరాం, ఏపీఎం ఇందారపు వెంకటరమణ పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గణేశ్ మండపాల నిర్వాహకులతో సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా సౌండ్ సిస్టం వినియోగించాలని, రాత్రి పది గంటలు దాటి తే వాడొద్దన్నారు. ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వలంటీర్లను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ భద్రతపై దృష్టి సారించాలని, ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. అత్యవసర సమయంలో 112 కు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే ప్రజావాణిఆసిఫాబాద్అర్బన్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టపరమైన పరిష్కరించేందుకే ప్రతీ సోమవారం పోలీసు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వా రా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా
ఆసిఫాబాద్: అసెంబ్లీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ము న్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అ హ్మద్, కౌన్సిలర్ సాలం, నాయకులు మర్సోకోల సరస్వతి, గంధం శ్రీనివాస్, జాబరే రవీందర్, అహ్మద్ బిన్ అబ్దుల్లా, నిసార్ పాల్గొన్నారు. -
మందు గోలీలు కొనుక్కోవాల్సిందే..!
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలలోని ఆర్టీసీ ఆస్పత్రిలో మందుగోలీల కొరత నెలకొంది. దీంతో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతోపాటు విశ్రాంత సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. షుగర్, ఇతరత్రా జబ్బుల బారిన పడిన కార్మికులు, వారి కుటుంబాలు మందులు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతీ నెల 8నుంచి 12వ తేదీ మధ్య మందుల కోసం ఇండెంట్ పంపిస్తున్నా అవసరమైన మేరకు రాకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. రెండు జిల్లాలకు చెందిన 820మంది ఉద్యోగులతోపాటు రిటైర్డు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందుతుంటారు. ఏ చిన్న అనారోగ్యమైనా ఇక్కడికి వచ్చి చికిత్స పొంది మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆర్టీసీ డిస్పెన్సరీలో శాశ్వత వైద్యుడిని నియమించాల్సి ఉన్నా కాంట్రాక్టు పద్ధతిన వైద్యుడు, ఔట్సోర్సింగ్ స్టాఫ్నర్స్, ఫార్మాసిస్టు, ల్యాబ్, వార్డుబాయ్లు సేవలందిస్తున్నారు. దీంతో ఆస్పత్రి కాస్త కాంట్రాక్టు మయంగా మారింది. నాలుగు నెలలుగా నిరాశే..అనారోగ్యం పాలైన కార్మికులు మందుల కోసం వస్తే లేవనే సమాధానం నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యమైన మందులు, రోగులు నిత్యం వాడే షుగర్ గోలీలు నాలుగు నెలలుగా అందుబాటులో లేవు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు శారీరక నొప్పులు సహజం. నొప్పి నివారణ మాత్రల కొరత ఏర్పడుతోంది. కీళ్లు, శరీర నొప్పుల కోసం వాడే గోలీలు రెండు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరం గోలీలూ లేవు. ప్రతీ నెల 10నుంచి 20వ తేదీ వరకు వంద మందికి పైగా మందులు తీసుకెళ్తుంటారు. మిగతా రోజుల్లో 20 నుంచి 30మంది వస్తుండగా.. మందులు లేక సోమవారం ఒకరిద్దరు కూడా కనిపించలేదు. నెలకోసారి మందుల ఇండెంట్ పంపినా సరిపడా రావడం లేదని తెలుస్తోంది. కడుపులో మంట, ఎసిడిటీ నివారణ మాత్రలు స్వల్ప మొత్తంలోనే సరఫరా అవుతున్నాయని తెలిసింది. షుగర్, బీపీ గోలీలు రిటైర్డు కార్మికులకు రెండు నెలలు, ఆర్టీసీ ఉద్యోగులకు నెలకు సరిపడా ఇవ్వాల్సి ఉన్నా కొసరి కొసరి ఇస్తుండడంపై పెదవి విరుస్తున్నారు. నిరంతరం ప్రజారవాణాకు శ్రమించే ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది వైద్యం కోసం ప్రైవేట్ మందుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు అత్యవసరమైన మందులు సరఫరా చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో మందుల విషయమై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని, ప్రస్తుతం ఇండెంట్లో సరఫరాయ్యే మందులను రోగులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తామని ఆర్టీసీ వైద్యుడు తెలిపారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్
ఆసిఫాబాద్: ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్, హరీశ్రావును లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తోపులాటలో పలువురు నాయకులకు గాయాలయ్యాయని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇష్టారాజ్యంగా ప్రవర్తించ డం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. -
వినతులిచ్చి.. పరిష్కారం కోరి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ఎన్ఐసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి అర్జీలు అందించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జైనూర్ మండలం ఉషేగాం గ్రామానికి చెందిన జయ కళాబాయి, కోవ కమలాబాయి, రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్కు చెందిన గుండేటి స్వరూప ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఒంటరి మహిళా పింఛన్ ఇప్పించాలని కాగజ్నగర్ మండలం కోయవాగు గ్రామానికి చెందిన కాంపెల్లి అరుణ అర్జీ అందించారు. తన పట్టా భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని రెబ్బెన మండలం వంకులం జూపాక పోచం దరఖాస్తు చేసుకున్నాడు. చింతలమానెపల్లి బూరెపల్లి గ్రామానికి చెందిన జాడి భగవాన్ తన పట్టా భూమి ఇతరుల పేరిట నమోదైందని, వెంటనే సవరించి తన పేరిట పాసుపుస్తకం ఇప్పించాలని అధికారులకు విన్నవించాడు. కార్యక్రమంలో డీఆర్వో దాసరి వేణు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు కోసం కలెక్టరేట్కు పాదయాత్ర
తిర్యాణి: రోడ్డు నిర్మించాలని తిర్యాణి మండలం గుండాల గ్రామస్తులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు సుమారు 40కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేపట్టారు. కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. సరైన రోడ్డు లేక దాదాపు ఆరు కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతం గుండా కాలినడకన వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు దౌలత్రావు, రాందాస్, ఓనిరావు తదితరులు ఉన్నారు. -
హియరింగ్ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సర్ పరిశీలకురాలు డాక్టర్ యోగితా రాణా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్తో కలిసి తహసీల్దార్లతో హియరింగ్ ప్రక్రియ, నోటీసుల జారీ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. యోగితా రాణా మాట్లాడుతూ మ్యాపింగ్ కాని, అనామలిస్ జాబితాలోని ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అనామలిస్ జాబితాలోని చిన్న చిన్న సవరణలను వెంటనే పూర్తి చేయాన్ని ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం నుంచి ఓటర్లు వందశాతం ధ్రువపత్రాలు అందించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ నోటీసుల జారీపై ఇప్పటికే తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో హియరింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలిఆసిఫాబాద్: సర్ ప్రక్రియలో భాగంగా హియరింగ్ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బీఎల్వోల ద్వారా నోటీసులు అందించి రశీదు తీసుకోవాలన్నారు. ప్రతీ వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, హియరింగ్లో భాగస్వాములను చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ కె.హరిత, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్రావు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 1,05,692 నోటీసులు ఓటర్లకు అందించినట్లు తెలిపారు. ప్రతీ గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు. -
విద్యాప్రమాణాలు పెంచేందుకు చర్యలు
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మరింత మెరుగుపర్చేందుకు చ ర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలను సో మవారం సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ విద్యాప్లస్ గురించి విద్యాశాఖ కార్యదర్శి, కలెక్టర్ హరితకు వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సాంకేతికత ఆధారిత, రియల్టైం పర్యవేక్షణతో కూడిన బోధనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే విద్యాప్లస్ లక్ష్యమని తెలిపా రు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు గుర్తించి బోధనా విధానాల్లో మార్పులు తీసుకువచ్చి మెరుగైన ఫలితాలు సాధించేందుకు దో హదపడుతుందన్నారు. యోగితా రాణా మా ట్లాడుతూ జిల్లాలో వినూత్న ఆలోచనలతో నూతన విద్యాప్లస్ కార్యక్రమం అభినందనీ యమని కొనియాడారు. ఏఐ ఆధారిత బోధ న సహయక వ్యవస్థను వినియోగించడం ఆనందంగా ఉందన్నారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్రావు, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత గడ్డి మందు స్వాధీనం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్2లో అక్రమంగా తరలిస్తు న్న నిషేధిత గడ్డిమందును సోమవారం పట్టుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ శ్రీరామ్మీనా తెలిపా రు. తమకు అందిన సమాచారం మేరకు బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న రామగిరి ఎక్స్ప్రెస్ రైలులో సోదాలు నిర్వహించగా 81 గడ్డి మందు ప్యాకెట్లు, 5 లీటర్ల 5 క్యాన్లు, 5 లీటర్ క్యాన్లు పట్టుకున్నట్లు పే ర్కొన్నారు. గడ్డి మందును కాగజ్నగర్ మండల వ్యవసాయాధికారి రామకృష్ణకు అప్పగించినట్లు తెలిపారు. తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్.దాసు, సిబ్బంది కమలేశ్కుమార్ సింగ్, ప్రేమానంద్ పాల్గొన్నారు. -
హక్కుల కోసం ఢిల్లీలో గర్జించిన గిరిజనులు
ఆదిలాబాద్టౌన్: ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో వేలాది మంది గిరిజనులు గళమెత్తారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని సాయి పార్క్లో సోమవారం ధర్నా, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు, ఆరో షెడ్యూళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టం–2023తో ఆదివాసీ గ్రామసభల హక్కులకు భంగం కలిగే పరి స్థితి ఏర్పడిందన్నారు. మైనింగ్ పేరుతో ఆదివాసీ లను భూముల నుంచి తరలించడం నిలిపివేయాలని, అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీ య మంచ్ జాతీయ చైర్మన్ జితిన్ చౌదరి, జాతీయ కన్వీనర్, మాజీ ఎంపీ ఫు లీన్ బిహారి బస్కే, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకర్, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, టీజేజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, ఉపాధ్యక్షులు సక్కు, పెందూర్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి కేసులో యువకుడి అరెస్టు
బెల్లంపల్లి: గంజాయి కేసులో యువకుడిని అరెస్టు చేసినట్లు వన్టౌన్ ఎస్హెచ్వో కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై రామకృష్ణ ఆదివారం జాతీయ రహదా రి పక్కన వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సల్గుపల్లికి చెందిన గోమాస ప్రకాష్ వద్ద 200 గ్రాముల గంజాయి లభించింది. మహా రాష్ట్రలోని బల్లార్షాలో తక్కువ ధరకు కొనుగో లు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బైక్, గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
కుప్టి పాత బ్రిడ్జికి బుంగ..
ఇచ్చోడ: నేషనల్ హైవే అఽథారిటీ అధికారుల తప్పిదం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. 44వ జాతీయ రహదారి కుప్టి పాత బ్రిడ్జికి బుంగ పడటంతో వాహనాల రాకపోకాలను పూర్తిగా నిలిపివేశారు. పాత బ్రిడ్జికి రెండు వందల మీటర్ల దూరంలో డ్రైవర్షన్ ఏర్పాటు చేసి వాహనాలను నూతన బ్రిడ్జి వైపు మళ్లిస్తుండడంతో ఒక్కో వాహనం అక్కడి నుంచి పాస్ కావడానికి కనీసం గంట సమయం పడుతోంది. పూర్తిగా డౌన్ ఉన్న చోట డైవర్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు డైవర్షన్ నుంచి వన్వేలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై మూడు, నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. ప్రారంభంకాని మరమ్మతులు..నెల రోజుల క్రితం కుప్టి పాత బ్రిడ్జి మధ్యలో బుంగ ఏర్పడింది. అధికారులు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకూ మరమ్మతులు చేయకపోవడంతో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాకుండా బ్రిడ్జిపై 320 మీటర్ల పొడవున 12 జాయింట్ల వద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉందని స్థానిక ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో రెండు వైపులా రక్షణగా రెయిలింగ్ నిర్మించారు. అది అక్కడక్కడ కూలిపోవడంతో దాని స్థానంలో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో కూడా బ్రిడ్జిపై భారం పడినట్లు, రక్షణ గోడ నిర్మించే సమయంలో బ్రిడ్జిపై నెల రోజుల నుంచి వన్వే చేయడంతో ఒకే వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగించడం కూడా బ్రిడ్జిపై బుంగ పడేందుకు కారణం కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితమే నిపుణుల నివేదిక..బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలపై మూడేళ్ల క్రితమే నిపుణులు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నివేదిక అందజేశారు. పాత బ్రిడ్జి పక్కన నూతనంగా బ్రిడ్జి నిర్మించాలని నివేదికలో పేర్కొనట్లు సమాచారం. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు మాత్రం నివేదికను బుట్టదాఖలు చేసి నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోక పోవడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుప్టి బ్రిడ్జి విషయమై నేషనల్ హైవే అథారిటీ పీడీ వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
కాసిపేట–2 గనిలో పేలుడు
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిలో సోమవారం రెండో షిప్ట్లో మిస్ఫై ర్ జరిగి నలుగురు కా ర్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... గనిలోని నార్త్ డిస్ట్రిక్ 22 లెవల్ 18 ఎక్స్ డీప్లో విధులు నిర్వహిస్తుండగా మ్యాన్హోల్ చేసే క్రమంలో డిటోనేటర్ పేలి సపోర్ట్మెన్న్ కార్మికులు క్రాంతికుమార్, పుప్పాల శ్రీనివాస్, కోల్ కట్టర్ కార్మికులు రమేశ్, రాజ్కుమార్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా మందమర్రి డిస్పెన్సరీకి అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో అమర్చిన డిటోనేటర్ 1 పేలకుండా ఉండటంతో కార్మికులు దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో పేలినట్లు తెలిసింది.చికిత్స పొందుతున్న క్రాంతికుమార్చికిత్స పొందుతున్న రమేశ్ -
బౌన్సర్లు కేరాఫ్ జైపూర్
జైపూర్: బౌన్సర్ అంటే కేవలం కండలు తిరిగిన శరీ రం కాదు.. క్రమశిక్షణ, అప్రమత్తత, బాధ్యతకు ప్రతిరూపం. షాపింగ్ మాల్స్ నుంచి ఫంక్షన్ హాళ్ల వరకు.. ప్రముఖుల కార్యక్రమాల నుంచి భారీ ఈవెంట్ల వరకు ఎక్కడ జన సందోహం ఉంటే అక్కడ వీరి విధులు కనిపిస్తాయి. అలాంటి బౌన్సర్ల ను తీర్చిదిద్దుతూ గ్రామీణ యువతకు ఉపాధి బాట చూపుతోంది జైపూర్ మండలం రసూల్పల్లిలోని ఒలంపియా జిమ్. వ్యాయామంతో శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు..అదే ఫిటెనెస్ను ఉపాధిగా మలుచుకుంటున్న యువతకు ఈజిమ్ అడ్డాగా మారుతోంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది యువకులు నేడు పట్టణ ప్రాంతాల్లో బౌన్సర్లుగా విధులు నిర్వహిస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగం చేస్తూనే..ఒలంపియా జిమ్లో శిక్షణ పొందుతున్న వారంతా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూనే బౌన్సర్గా విధులు నిర్వహిస్తున్నారు. తమకు లభించే ఖాళీ సమయాన్ని జిమ్లో వ్యాయామానికి కేటాయిస్తూ ఫిట్నెస్ను కొనసాగిస్తున్నారు. యువతలో శారీరకధారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. వ్యసనాలకు దూరంగా.. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలన్నదే లక్ష్యం. జిమ్ ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభ, శారీరక సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం లేక అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తాం. – ప్రవీణ్, ఒలంపియా జిమ్ నిర్వాహకుడు 15 ఏళ్ల క్రితం మొదలై..రసూల్పల్లికి చెందిన కుమ్మరి ప్రవీణ్ 15 ఏళ్ల క్రితం ఒలంపియా జిమ్ను ఏర్పాటు చేశాడు. మొదట చిన్నస్థాయిలో ప్రారంభమైన ఆయన ప్రయత్నం క్రమంగా విస్తరించి ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలో రెండు, చెన్నూర్లో రెండు, రసూల్పల్లిలో ఒకటి మొత్తంగా ఐదు బ్రాంచ్ల వరకు చేరింది. జిమ్లో వ్యాయామంతో పాటు శారీరకధారుఢ్యం, క్రమశిక్షణ, ఫిట్నెస్పై యువతకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం సుమారు 40 మంది యువకులు, 10 మంది యువతులు ఇక్కడ శిక్షణ పొందుతూ హైదరాబాద్, సూర్యాపేట, సిద్దపేట, వరంగల్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, బెంగళూర్ వంటి పట్టణాల్లో సేవలందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే కార్యక్రమాల్లో రద్దీని నియంత్రించడం, ప్రవేశ మార్గాలను క్రమబద్ధీకరించడం, ప్రముఖులు, నిర్వాహకులకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలు చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ ఈవెంట్లలో అవసరాన్ని బట్టి భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. -
సమన్వయంతో పులుల సంరక్షణ
నిర్మల్టౌన్: పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, బాసర సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత భవనంలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్స్కేప్’ అంశంపై అంతర్ జిల్లా సమన్వయ వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబ్డే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ప్రస్తుతం తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ల నుంచి పులులు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయన్నారు. పులుల సంరక్షణతో పాటు వాటి ఆవాస ప్రాంతాలను కాపాడడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓలు ప్రశాంత్ పాటిల్ (నిజామాబాద్), రాహుల్ జాదవ్ (మంచిర్యాల), నీరజ్ టెబ్రివాల్ (కామారెడ్డి), రవిప్రసాద్ (జగిత్యాల), డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పత్తి పంటను ఆశిస్తున్న పిండినల్లి
చెన్నూర్రూరల్: పత్తి పంటను ఆశించి రసం పీల్చే వాటిలో పిండినల్లి పురుగులు ప్రధానమైనవి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ పురుగులు పత్తి పంటను ఆశిస్తాయి. ఇవి చిన్నవిగా, మెత్తగా, లేత గులాబీరంగులో ఉంటాయి. కొమ్మలు, కాండం, మొగ్గలు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా మొక్కల్లో సాధారణంగా జరిగే ఆవశ్యక మూలకాలు, పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడి గిడసబారి పోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా చిన్నదిగా కనిపిస్తుంది. దీని నివారణకు చర్యలు చేపట్టాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ సూచించారు. నివారణచర్యలుపురుగు ఆశించిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. ఇలా చేయడం ద్వారా దాని విస్తరణను అదుపులో ఉంచవచ్చు. పొలం గట్లపైన ఉండే కలుపు మొక్కలు మఖ్యంగా వయ్యారిభామ, తుత్తురబెండ, గడ్డిచామంతి, వంటి కలుపు మొక్కలను పీకి కాల్చి వేయాలి. జైగోగ్రామ బైకోలరేట్ మిత్ర పురుగులను హెక్టారుకు 500 నుంచి 1000 వరకు విడుదల చేయాలి. తద్వారా వయ్యారిభామ, కలుపు మొక్కలను నివారించవచ్చు. దీని ద్వారా పిండినల్లి ఉధృతి తగ్గించవచ్చు. పత్తి ఏరిన తర్వాత ఎండు కర్రలను పీకి కాల్చి వేయాలి. వేసవి దుక్కుల ద్వారా నేలలో దాగి ఉండే పిల్ల పురుగులను నియంత్రించవచ్చు. అంతర పంటగా అలసంద, బబ్బెర, సోయాబీన్, మినుము వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగుల సంఖ్యను వృద్ధి చేయవచ్చు. కంచె పంటగా లేదా రక్షక పంటగా రెండు వరుసల సజ్జ లేదా కందులను దట్టంగా పెంచాలి. దీని ద్వారా ప్రధాన పంట అయిన పత్తిలో పిండినల్లి ఉధృతి తగ్గించుకోవచ్చు. మొక్కలను పురుగు ఆశిస్తే లీటరు నీటిలో 10 మిల్లీలీటర్ల వేపనూనెతో పాటు ఒక గ్రాము సబ్బు పొడిని కలిపి 10 నుంచి 12 రోజుల తేడాతో మొక్కలపై పిచికారీ చేయాలి. దీంతో చీడ, పీడలు తగ్గుతాయి, తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు. ఏవిధంగా ఆశిస్తుందిపిండినల్లి పురుగులు ముఖ్యంగా పొలంగట్లపై, పనికి రాని భూముల్లో పెరిగే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తాయి. బెండ, టమాటా, వంగ, క్యాబేజీ, బొప్పాయి, నిమ్మ, జామ, మందార, గోగు, చామంతి, గడ్డి చామంతి, రామబాణం, వయ్యారిభామ, తుత్తర బెండ, సీతాఫలం, సుబాబుల్, గ్లైరిసిడియా వంటివి పిండినల్లికి అతిథి మొక్కలు. పురుగుపై తెల్లని మైనపు పొర ఉండటం చేత, అది పురుగు మందుల ప్రభావం నుంచి ఇతర సహజ మరణం నుంచి రక్షణ పొందుతుంది. ఈ పురుగు సాధారణంగా సంవత్సర కాలంలో 15 తరాలకు అభివృద్ధి చెందగలదు. అలాగే ఆడ పురుగు పెట్టే ఒక గుడ్ల సంచిలో దాదాపు 600 వరకు గుడ్లు ఉంటాయి. పంట పొలంలో సహజంగా పెరిగే మిత్ర పురుగులు అంతరించి పోవడం వలన పురుగు విసర్జించే తేనె వంటి ద్రవం కొరకు వచ్చే చీమల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పిండినల్లి వ్యాపిస్తుంది. అంతే కాకుండా పురుగు సహజంగా పంట ఉత్పత్తుల ద్వారా, పత్తి కర్రల ద్వారా గాలి, నీటి కాలువలు, వర్షం, పక్షులు, పశువుల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగులు ఆశించిన ప్రాంతం నుంచి ఆశించని ప్రాంతానికి తిరగడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. -
విద్యకు మరింత ఊతం
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు మెరుగై న విద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ ప బ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ఏర్పాటుకు ప్రాధాన్యమి స్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎని మిది పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ మేరకు నిఽ దులు కేటాయిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూ.83.19 కోట్లు కేటాయించారు. ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన ఫలి తాలను మెరుగుపరిచేలా నాణ్యమైన, సమగ్ర విద్యా వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి చేస్తా రు. ప్రస్తుతం ఉన్న జెడ్పీహెచ్ఎస్లు, మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ విద్యకు కొత్త రూపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల ను మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశం. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, సురక్షితమైన పాఠశాల వాతావరణం అందించడంపై దృష్టి సారించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంపాఠ్యపుస్తకాల బోధనకే పరి మితం కాకుండా విద్యార్థుల మేధో, శారీరక, మానసిక, సా మాజిక, సాంస్కృతిక వికాసానికి వేదికగా నిలువనున్నా యి. క్రీడలు, కళలు, సైన్స్, సాంకేతికత, తదితర రంగా ల్లో విద్యార్థుల ప్రతిభ ను వెలి కితీసేలా అవకాశాలు కల్పించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు ప్ర త్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. నాణ్యమై న విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు ప్రభు త్వ పాఠశాలల్లోనే అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారం తగ్గనుంది.జిల్లా పాఠశాల నిధులు (రూ.కోట్లలో) కుమురంభీం ఆసిఫాబాద్ జెడ్పీహెచ్ఎస్ 8.40 కాగజ్నగర్ జెడ్పీహెచ్ఎస్ 10.09 మందమర్రి మోడల్ స్కూల్ 10.70 మంచిర్యాల కాసిపేట మోడల్ స్కూల్ 10.30 సీతారాంపల్లి జెడ్పీహెచ్ఎస్ 12 నిర్మల్ కుంటాల మోడల్ స్కూల్ 9 నర్సాపూర్(జీ) జెడ్పీహెచ్ఎస్ 12.50 ఆదిలాబాద్ యాపల్గూడ జెడ్పీహెచ్ఎస్ 10.20 ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు, కేటాయించిన నిధులు -
గంజాయి మొక్కలు స్వాధీనం
చింతలమానెపల్లి: మండలంలోని గూడెం గ్రామంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఒకరిని పట్టుకుని మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు కౌటాల సీఐ సంతోష్కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. గూడెం గ్రామానికి చెందిన కుంబారి శంకర్ తన పెరట్లో అక్రమంగా సాగు చేసిన తొమ్మిది గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.9వేలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కెరమెరి: మండలంలోని శివగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీంరావు వ్యవసాయ పొలంలో రెండు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. పక్కా సమాచారం మేరకు వ్యవసాయాధికారి, గ్రామస్తుల సమక్షంలో పొలంలో తనిఖీ చేయగా రెండు గంజాయి మొక్కలను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలి
కౌటాల: ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టా లని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి సూచించారు. ఆదివారం మండలంలోని బోదంపల్లి, కౌటా ల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సూపర్వైజర్లు, బీఎల్వోలు ఫారం నింపే సమయంలో ఎలాంటి తప్పులకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివరాలను తహసీల్దార్ ప్రమోద్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వచ్చిన ధ్రువీకరణ పత్రాలను క్షుణంగా పరిశీలించి తప్పులకు తావులేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రమోద్కుమార్, ఆర్ఐ దేవేందర్, బీఎల్వోలున్నారు. -
పైపులైన్ లీకేజీ.. నీరు ఎలా అందేది?
కాగజ్నగర్: కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ పంపు ప్రధాన రహదారికి ఒక వైపున్న మెయిన్ పైపులైన్కు లీకేజీలేర్పడినందున ఐదు రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. దీంతో రోడ్డు ఒక వైపు బురదమయమైంది. గతంలోనూ ఇదే స్థలంలో లీకేజీ ఏర్పడగా స్థానికులు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మరమ్మతులు సరిగా చేయనందునే ఇలా తరచూ లీకేజీలు ఏర్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా సమీపంలోని వివిధ షాపులు, హోటళ్లు, ఆస్పత్రులకు వచ్చిపోయే పేషెంట్లు, వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారులకు పలుసార్లు సమస్య తెలిపినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. కాగా, ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్ తిరుపతిని సంప్రదించగా ప్రధాన పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతున్న మాట వాస్తవమేనని తెలిపారు. వివిధ కారణాలతో మరమ్మతు చేయించడంలో జాప్యం జరిగినట్లు పేర్కొన్నారు. వెంటనే మరమ్మతు చేయించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. -
సాహితీవేత్తకు సన్మానం
ఆసిఫాబాద్రూరల్: ఆదివాసీ సాహితీవేత్త మనోహర్ను ఆదివారం జిల్లా కేంద్రంలో పర్ధాన్ సేవా సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆదివాసీ పర్థాన్ సేవా సమాజం ప్రముఖుడు ఉద్దవ్ మాట్లాడారు. ఆదివాసీ పర్థాన్ జీవన విధా నం, సంస్కృతి, ఆచారాలకు డాక్టర్ మనోహ ర్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలో ఆదివాసీ పర్ధాన్ల జీవిత విశేషాలపై బననోహర్ రాసిన పాఠ్యాంశాన్ని ప్రచురించడం ఆదివాసీ పర్ధాన్ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. పర్ధాన్ సేవా సమాజం ప్రముఖులు ప్రేమ్, జనార్దన్, పెంటయ్య, రాంచందర్, తిరుపతి తదితరులున్నారు. -
‘కాంగ్రెస్ పాలనలో కార్మికులకు అన్యాయం’
రెబ్బెన: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మర్సుకోల సరస్వతి ఆరోపించారు. బీఆర్ఎస్ వారం రోజుల నిరసనలో భాగంగా ఆదివారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో సింగరేణి కార్మికులకు స్వర్ణయుగంగా ఉండేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. తగిన సమయంలో సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏరియా సీనియర్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు, సర్పంచులు అజ్మీర బాబురావు, ఽభరద్వాజ్, రాజేశ్, సాగర్గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ కుందారపు శంకరమ్మ, నాయకులు శంకరమ్మ, అన్నపూర్ణ అరుణ తదితరులున్నారు. -
‘కాంగ్రెస్తోనే అభివృద్ధి’
కౌటాల: ప్రజాప్రభుత్వంతోనే ప్రజల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడా రు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్ట్ ను కాళేశ్వరానికి తరలించిన బీఆర్ఎస్కు ఇ క్కడి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ఇటీవల సభలో సీఎం రే వంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మా జీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డ ఎమ్మెల్సీ దండె విఠల్ జోలికి వస్తే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మండలాధ్యక్షులు నికాడే గంగారాం, డుబ్బుల నానయ్య, సర్పంచులు భీ మ్రావు, సత్తయ్య, చందు, నాయకులు ఉ మామహేశ్, నాహీం, గట్టయ్య, ఖాళీం, కిశోర్, విజయ్, బండు, వెంకన్న పాల్గొన్నారు. -
అపార్ ఆలస్యం
కాగజ్నగర్టౌన్: జిల్లాలో విద్యార్థుల ఆటోమెటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీల జనరేట్ 54శాతమే పూర్తయింది. జిల్లాలో 1,208 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1,01,011 మంది విద్యార్థులుండగా ఇప్పటివరకు 55,159 మంది విద్యార్థులకు అపార్ ఐడీలు జనరేట్ అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 54.6శాతం పూర్తయినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థుల డేటాలో లోపాలుండడంతో నమోదు ఆలస్యమైంది. ఈ ఏడాదిలోపు ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. వివరాల్లో లోపాలతో జాప్యంఅపార్ ప్రక్రియలో విద్యార్థుల పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పక్కాగా నమోదు చేయాలి. అనేకమంది వివరాలు సక్రమంగా లేకపోవంతో నమోదులో ఆలస్యమవుతోంది. పాఠశాల రిజిష్టర్లోని పుట్టిన తేదీ ఆధార్లోని తేదీతో సరిపోలడంలేదు. ఇంటి పేర్లు అసంపూర్తిగా ఉండటం, తల్లిదండ్రులు పూర్తి వివరాలు అందించకపోవడమే ఆలస్యానికి కారణమంటున్నారు. అపార్ నమోదు పక్రియ పూర్తయిన తర్వాత ప్రతీ విద్యార్థికి జీవితాంతం ఒకే అకడమిక్ నంబర్ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థి ఉన్నత చదువులు, ఉద్యోగాల విషయంలో ఊరట కలుగుతుంది. నమోదు నిరంతర ప్రక్రియ అపార్ నమోదును వేగవంతం చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. ముఖ్యంగా కొందరు విద్యార్థుల ఆధార్లో పుట్టిన తేదీ వివరాల్లో తప్పులున్నాయి. పాఠశాల రికార్డులు, ఆధార్కార్డులో పుట్టిన తేదీ ఒకేలా ఉండడంలేదు. దీంతో నమోదులో జాప్యం జరుగుతోంది. పుట్టిన తేదీ మార్పు చేసుకున్న వారి వివరాలు వెంటనే నమోదు చేయిస్తున్నాం. – అబిద్అలీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కో ఆర్డినేటర్ జిల్లాలో అపార్ నమోదు ఇలా..మండలం స్కూళ్లు విద్యార్థులు నమోదు ఆసిఫాబాద్ 135 16,268 9,399 బెజ్జూరు 79 4,617 1,916 చింతలమానెపల్లి 54 4,603 2,031 దహెగాం 59 4,246 2,321 జైనూర్ 87 8,103 4,528 కాగజ్నగర్ 167 23,674 14,655 కెరమెరి 96 5,424 3,148 కౌటాల 59 6,237 2,766 లింగాపూర్ 48 1,584 745 పెంచికల్పేట్ 35 2,362 1,293 రెబ్బెన 71 5,637 3,172 సిర్పూర్(టి) 65 6,469 3,636 సిర్పూర్(యు) 63 2,823 1,300 తిర్యాణి 95 3,202 1,436 వాంకిడి 95 5,762 2,807 మొత్తం 1,208 1,01,011 55,159 -
రోడ్డు ఆక్రమణ.. నరకయాతన
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు ఆక్రమించడం, ఇష్టారాజ్యంగా ఆటోలు, ద్విచక్రవాహనాలను నిలపడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు రోడ్డును ఆక్రమించుకుని దుకాణాల ఎదుట రోడ్డుపైనే సరుకులు పెట్టడం, తోపుడు బండ్లతో రోడ్డును ఆక్రమించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. అంబేడ్కర్ చౌరస్తాలో ఆటోలు ఎక్కడపడితే అక్కడ నిలుపుతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. రానున్న వినాయక చవితి, దసరా పండుగల నేపథ్యంలో జనం రద్దీ మరింత పెరిగి పరిస్థితి దారుణంగా మారే అవకాశముంది. ఇప్పటికై నా మున్సిపల్, పోలీస్ అధికారులు స్పందించి రోడ్డు ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కుమురం భీం
7‘ఆసరా’ కోసం ఆశగా! ఆసరా పింఛన్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం వరకు కెరమెరి మండలంలో 435 దరఖాస్తులు రాగా, వితంతువులే అత్యధికంగా ఉండడం గమనార్హం.సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది. ‘వసతి’కి చిక్కులు ఎస్సీ హాస్టళ్లలో ఇంటర్ ప్రవేశాలకు ‘ఆధార్’లోని తప్పులతో ఆటంకాలేర్పడుతున్నాయి. ఈ–పాస్ వెబ్సైట్లో స్కాలర్షిప్, ప్రవేశాల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
ఆర్థికసాయం అందజేత
కెరమెరి: మండలంలోని బొగడగూడ గ్రామానికి చెందిన ఇస్లావత్ గోపాల్ (ఏహెచ్ఎస్ రాంజీగూడ సీఆర్టీ) ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా బాధిత కుటుంబానికి ఆదివా రం పీఆర్టీయూ టీఎస్ పక్షాన రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాశ్ మాట్లాడా రు. గోపాల్ మరణం తీరని లోటని, ఆయన గిరిజన విద్యార్థులకు 15ఏళ్లుగా అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. భవి ష్యత్లో వారి కుటుంబానికి యూనియన్ ఎల్ల ప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చునార్కర్ అనిల్, నాయకులు శ్రవణ్కుమార్, శివప్రసాద్, తు ల్సిరాం, గోర్సింగ్, మోహన్, వసంత్రావు, సురేశ్, విజేశ్, అనిల్, సంతోష్ ఉన్నారు. -
పుష్కరాల నాటికి బాసర ముస్తాబు
భైంసా/బాసర: తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతి క వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వచ్చే ఏడాది జూన్ 27నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏడాది ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ స మగ్ర అభివృద్ధికి రూ.354 కోట్లు, పుష్కర ఘాట్ల ని ర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనుల కు రూ.20కోట్లతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ఎకై ్స జ్, పర్యాటకశాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన సరస్వతి అ మ్మవారిని దర్శించుకున్నారు. బాసరను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు భ విష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌ లిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులుపుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకా శం ఉన్నందున ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల ని ర్మా ణం, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూంలు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏ ర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన పుష్కర ప్రాంతా ల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని, అ వసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని సూ చించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లతో పనులుగోదావరి పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. బాసరతోపాటు గోదా వరి నదీ తీర జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో భక్తు ల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రజాభవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత, పురోగతిని ప ర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర పుష్కర ఘాట్ల అభివృద్ధి, ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించి న మ్యాపులు, ప్రతిపాదనలు, పనుల పురోగతిని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీఎం కార్మికుల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి
కాగజ్నగర్టౌన్: తమ సమస్యలపై అసెంబ్లీ గళమెత్తి పరిష్కారానికి కృషి చేయాలని సీపీఐ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరా వుకు ఎస్పీఎం కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆదివారం వినతిపత్రం అందజేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో త మ సమస్యలు ప్రస్తావించి వెరిఫికేషన్ ఎ న్నికలు త్వరగా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ నాయకులు కోరా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెరిఫికేషన్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 110 రోజులుగా ఎస్పీఎం గేటు ఎదుట సామూహిక నిరాహార దీక్ష చే స్తున్నా కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బా ధాకరమని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చే యాలని కోరారు. కూనంనేనిని కలిసినవారి లో సీపీఐ రాష్ట్ర నాయకుడు కలవేణి శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి దాసు, జేఏసీ నాయకులు కూశన రాజన్న, షబ్బీర్ హుస్సేన్, ఏకే సింగ్, కార్మికులున్నారు. -
‘కోనప్పపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి’
కౌటాల: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై ఎ మ్మెల్సీ దండె విఠల్ అనుచిత వ్యాఖ్యలు చే యడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకు డు కొంగ సత్యనారాయణ సూచించారు. ఆది వారం మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసంలో మాట్లాడారు. సి ర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కోనప్ప ఎనలేని కృషి చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. కోనప్ప జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సర్పంచ్ కావుడే బిక్కు, నాయకులు మధుకర్, వసంత్రావు, బాపు, తిరుపతి, ప్రశాంత్, ఆనంద్, సందీప్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ఆరుగ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు
ఆసిఫాబాద్: ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. వెయ్యిరోజుల ప్రజాపాలనపై కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో శనివారం సంబరాలు జరుపుకొన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్, కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో బైక్ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు గాంధీచౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, డైరెక్టర్ రాంచందర్, మురళి, ఇమ్రాన్, తారిక్, భీమ్రావు, శోభన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సర్టిఫికెట్లు క్షుణ్ణంగా పరిశీలించాలి
కాగజ్నగర్రూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన ఓటర్ల నుంచి వచ్చిన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులకు తావులేకుండా చూడాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి సూచించారు. శనివారం కాగజ్నగర్ మండలంలో ని నజ్రుల్నగర్ గ్రామంలో నిర్వహించిన హియరింగ్ కేంద్రాలను పరిశీలించారు. మండలంలోని 14, 17, 111 పోలింగ్ కేంద్రాల్లో హియరింగ్ ప్రక్రియలో ధ్రువపత్రాలను ఎలా పరిశీలిస్తున్నారో తె లుసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూ చించారు. హియరింగ్ సందర్భంగా ఓటర్లకు చెందిన సరైన ధ్రువపత్రాలు, ఫొటోలు మాత్రమే సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ మధూకర్, సూపర్వైజర్లు, బీఎల్వోలున్నారు. -
శుద్ధజలం అందించడమే లక్ష్యం
రెబ్బెన: ప్రజలకు శుద్ధజలం అందించేందుకు గ్రా మాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషన ల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ పేర్కొన్నారు. శని వారం వంకులం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలించారు. అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీశారు. తాగునీటి సదుపాయం అంతంత మాత్రంగా ఉన్న, మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడ్డ గ్రామాల్లో ప్రభుత్వం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అతి తక్కువ ధరకే ప్రజలకు ప్లాంట్ల ద్వారా శుద్ధజలం అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీర మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
హియరింగ్ ప్రక్రియలో వేగం పెంచాలి
ఆసిఫాబాద్అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత సూ చించారు. కలెక్టరేట్ నుంచి కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆసిఫాబాద్ ఆర్డీవో లో కేశ్వర్రావ్తో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మ్యాపింగ్ కాని, అనామలిస్ జాబితాలో పేర్లున్న ఓటర్లకు హియరింగ్ ప్ర క్రియను వేగవంతం చేసి అవసరమైన ధ్రు వపత్రాలను స్వీకరించాలని సూచించారు. కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. సదరం శిబిరంలో ఏర్పాట్ల పరిశీలనసదరం శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న సద రం శిబిరాన్ని సందర్శించి సౌకర్యాలు పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలాల నుంచి శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వైద్యులు, సిబ్బంది, దివ్యాంగులున్నారు. -
ముగిసిన తీజ్
లింగాపూర్, కెరమెరి మండలాల్లోని ఆయా గ్రామాల్లో తీజ్ ముగింపు ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. జాగో బంజారా.. బోరావ్ తీజ్.. అంటూ బంజారా మహిళలు, యువతులు, చిన్నారులు పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తీజ్ బుట్టలు నెత్తినెత్తుకుని యువతులు, చిన్నారులు ఆటాపాటలతో అలరించారు. ఆలయాల్లో పూజలు చేసి తీజ్ బుట్టలను నిమజ్జనం చేశారు. – లింగాపూర్/కెరమెరి లింగాపూర్: సంప్రదాయ దుస్తుల్లో మహిళలులింగాపూర్: పూజలు చేస్తున్న పెద్దలుకెరమెరి: చందుగూడలో బుట్టలతో యువతులు -
బాల్య వివాహాలను అరికట్టాలి
వాంకిడి: బాల్య వివాహాలను అరికట్టాలని, ఇందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా బాలల సంక్షేమాధికారి బూర్ల మహేశ్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని కేజీబీవీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి హాజరై మాట్లాడారు. బాలికల విద్య, భద్రత విషయంలో మరింత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006పై అవగాహన కలిగి ఉండాలని, బాలికలు తమ సమస్యలను స్వేచ్ఛగా పంచుకునేలా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఎంఈవో శివచరణ్కుమార్, ఎస్వో రైజా ఖాటుమ్, డీసీపీయూ ప్రొటెక్షన్ అధికారి శ్రావణ్కుమార్, సూపర్వైజర్ పితాంబర్, సంతోష్ తదితరులున్నారు. -
మంచి పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. శని వారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ యువరా జ్ మర్మాట్, డీఈవో సచ్చిదానంద చారితో కలి సి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జి ల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 38 మందిని శాలువాలతో సత్కరించి ప్ర శంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువు దైవంతో సమానమని పేర్కొన్నారు. విద్యార్థులు 100 శాతం బ డికి వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాల ని సూచించారు. జిల్లాలో విద్యారంగం బలోపేతా నికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలి పా రు. అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హరితం.. నిర్లక్ష్యం!
కెరమెరి: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు ‘ఏక్ పేడ్ మా కే నామ్ 3.0’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థి మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ‘ఎకో క్లబ్ మిషన్ లైఫ్’ పేరిట ప్రత్యేక క్లబ్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అన్ని పాఠశాలల్లో తల్లి పేరిట ఒక మొక్క నాటేలా ఆదేశాలు జారీ చేసింది. మొక్కలను నాటి పర్యవరణాన్ని కాపాడాలని పిలుపునిస్తోంది. మొక్క నాటి ఫొటో తీసి ‘మిషన్ లైఫ్’ పోర్టల్ అప్లోడ్ చేసినవారికి ఆన్లైన్లోనే ప్రశంసాపత్రం అందిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుప్రస్తుతం చెట్లను విరివిగా నరికి వేస్తుండడంతో కాలుష్య ప్రభావం పెరుగుతోంది. దీంతో వాతావరణంలో సమతుల్యత తగ్గుతోంది. ఈ ప్రభావం భవిష్యత్ తరాలపై తీవ్రంగా చూపే అవకాశముంది. వృక్షాలు అనేక చోట్ల నేలకొరగడంతో వానలు తగ్గి, ఎండలు పెరుగుతున్నాయి. నాటడమే తమవంతు అనుకుంటున్న అధికారులు ఆ తర్వాత మొక్కల సంరక్షణను విస్మరిస్తున్నారు. దీంతో అవి ఎండిపోతున్నాయి. పరిస్థితిలో మార్పు రాకుంటే రానున్న రోజుల్లో గాలిని కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడనుందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించగా అదే కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వనమహోత్సం పేరిట నిర్వహిస్తోంది. గతంలో ప్రభుత్వం జిల్లాలోని పాఠశాలలతోపాటు ఖాళీ స్థలాలు, గ్రామపంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట మొక్కలు నాటడంతో కొంతవరకు అటవీ విస్తీర్ణం పెరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని మోదీ సూచించడంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు నడుం బిగించారు. తల్లులు తమ పిల్లలను ఎంత ప్రేమగా కాపాడుకుంటారో.. అదే రీతిన నాటిన మొక్కను సంరక్షిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ప్రతీ విద్యార్థి పాఠశాల ఆవరణలో తప్పనిసరిగా ఒక మొక్కను నాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత ఉత్సాహం కనిపించదేమి?రెండేళ్లుగా వనమహోత్సవం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. రెండేళ్లుగా చూపిన ఉత్సాహం ఈసారి కనిపించడం లేదు. అవగాహన రాహిత్యమో? లేదా.. మనకెందుకులే.. అన్న నిర్లక్ష్యమో? తెలియదు గాని జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఇటీవల ప్రారంభమైన ఎస్వీహెచ్ఆర్ యాప్లో మొక్కలు నాటే కార్కక్రమాన్ని ప్రత్యేక అంశంగా పరిగణించారు. దీనికి 21 మార్కులు కేటాయించారు. -
కుమురం భీం
7కొత్త రోడ్డుకు పగుళ్లు రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రోడ్లు పగుళ్లు తేలి అధ్వానంగా మారుతున్నాయి. నిర్మాణా ల్లో నాణ్యత పాటించకపోవడంతోనే ఈ దుస్థి తి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది. భవ్యక్షేత్రంగా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం కొత్తరూపు సంతరించుకోనుంది. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బాసరను భవ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది.ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
చివరి మజిలీకి చిక్కులే!
ఆసిఫాబాద్అర్బన్: వసతులు లేక జిల్లాలో పలుచోట్ల వైకుంఠధామాలు నిరుపయోగమయ్యాయి. దీంతో దహనక్రియలు నిర్వహించేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామపంచాయతీలుండగా అన్నిచోట్ల గత ప్రభుత్వం వైకుంఠధామాలు నిర్మించింది. రూ.12లక్షలతో ఒక్కో వైకుంఠధామం నిర్మించినా ప్రస్తుతం చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా వీటిని నిర్మించడంతో అవి వినియోగంలో లేకుండాపోయాయి. దీంతో ఒర్రెలు, వాగులు, వంతెనలు, రహదారులపైనే దహన క్రియలు నిర్వహించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలో సుమారు 40వేలకు పైగా జనాభా ఉండగా రెండు వైకుంఠధామాల అవసరముంది. పెద్దవాగు సమీపంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. కనీస వసతులు కూడా కరువయ్యాయి. కనీస సదుపాయాలు కల్పించి దీన్ని అందుబాటులోకి తేవాలని జిల్లాకేంద్రం వాసులు కోరుతున్నారు. వాగులు, ఒర్రెల్లోనే దహన సంస్కారాలుజిల్లా కేంద్రంలో ఎవరైనా మరణిస్తే శ్మశాన ఘాట్కు చేరాలంటే ఇబ్బందులేర్పడుతున్నాయి. అక్కడి వరకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ముఖ్యంగా రాత్రివేళ విద్యుత్ సౌకర్యం లేక చీకట్లోనే ఇబ్బందులు పడుతూ కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి వస్తోందని జిల్లా కేంద్రం వాసులు వాపోతున్నారు. వర్షాకాలంలోనైతే మరీ దారుణం. జిల్లా కేంద్రంలో కనీసం రెండు వైకుంఠధామాలు నిర్మించాలని అనేకసార్లు ఆందోళనలు చేసినా, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండాపోయిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అన్ని సౌకర్యాలతో రెండు వైకుంఠధామాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మండలంలోని రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలో వైకుంఠధామం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వైద్యవిద్యకు సాయమందించరూ..
లింగాపూర్: మండలంలోని మోతీపటార్ గ్రామానికి చెందిన రాథోడ్ కల్యాణి గురువారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఎస్టీ కేటగిరి నుంచి 329 ర్యాంక్ సాధించినా పైచదువులకు ఆమెకు పేదరికం అడ్డొస్తోంది. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన కల్యాణి తండ్రి శ్యాంరావ్ మూడేళ్ల క్రితమే చనిపోయాడు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆమె ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. పైగా వ్యవసాయ పనులకు వెళ్తూనే యూట్యూబ్లో క్లాసులు వింటూ నీట్ రాసి ఉత్తమ ర్యాంక్ సాంధించింది. నర్సంపేట్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకుంది. కానీ, పేదరికం ఆమె పైచదువులకు అడ్డొస్తోంది. దాతలెవరైనా సహకరిస్తే కాలేజీలో చేరేందుకు ఎదురుచూస్తోంది. సాయమందించే దాతలు 9391580752 నంబర్కు ఫోన్ పే చేయాలని వేడుకుంటోంది. రాథోడ్ కల్యాణి -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
ఆసిఫాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ‘వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి’ పేరిట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ హామీలతో ప్లకార్డులు ప్రదర్శించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మ న్ ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, విండో చైర్మన్ అలిబిన్అహ్మద్, కౌన్సిలర్లు వెంకన్న, సాలం, భాలకృష్ణ, రాజంపేట సర్పంచ్ పోచన్న, నాయకులు మర్సోకోల సరస్వతి, అహ్మద్బి న్ అబ్దుల్లా, గంధం శ్రీనివాస్, సాయి శ్రావణ్, నిసార్, అన్సార్, శ్యామ్ పాల్గొన్నారు. -
అటవీ అధికారులే ఖర్చులు భరించాలి
తిర్యాణి: ఎలుగుబంటి దాడిలో గాయపడిన శంకర్ వైద్యఖర్చులు అటవీశాఖ అధికారులే భరించాలని మండల జేఏసీ నాయకులు శుక్రవారం మండల కేంద్రంలోని ఫారెస్టు కార్యాలయం ఎదుట రహదారిపై నాలుగు గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. జేఏసీ చైర్మన్ మడావి గుణవంత్రావు మాట్లాడుతూ అటవీ అధికారులు బాధితుడిని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తామని చెప్పి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం సరికాదన్నారు. వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా అంబులెన్స్ యా క్సిడెంట్ అయ్యిందని, బాధిత కుటుంబంలో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిపారు. బాధితులందరికీ నాణ్యమైన వైద్యం అందించాల ని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్సై సుబ్బారావు ఘటనాస్థలికి చేరుకుని నచ్చజెప్పారు. మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళ న విరమించారు. తాళ్ల శ్రీనివాస్గౌడ్, వెడ్మ భగవంత్రావు, శంకర్ గౌడ్, సార రమేశ్గౌడ్, పవన్, జైనేని చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
బస్ షెల్టర్లు నిర్మించాలని మంత్రికి వినతి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని మండల కేంద్రాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ షెల్టర్లు నిర్మించాలని శుక్రవారం హైదరా బాద్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ వినతిపత్రం అందించారు. పలు మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉన్నా ప్రయాణికులు వేచి చూసేందుకు షెల్ట ర్లు లేవన్నారు. ఎండలు, వర్షంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అలాగే బస్సు షెల్టర్లు ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సదుపాయం, కనీస వసతులు కల్పించాలని కోరారు. -
నిలిచిన పనులు.. తీరని వెతలు
వాంకిడి: అటవీశాఖ అనుమతులు లేక ఏళ్లుగా గిరిజన గ్రామాలకు రహదారి పనులు పూర్తికావడం లేదు. అత్యవసర సమయంలో రోగులు, గర్భిణులు ఆస్పత్రులకు చేరాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. వాంకిడి మండలం సర్కేపల్లికి చెందిన నిండు గర్భిణి దుర్వ కరీష్మకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అయితే రోడ్డు బురదమయంగా ఉండటంతో రెండు కిలోమీటర్ల దూరంలోని మారెపల్లి గ్రామం వద్దే అంబులెన్స్ను నిలిపివేశారు. దీంతో సర్కేపల్లి నుంచి బురద రోడ్డుపై గర్భిణిని ఎడ్లబండిపై 108 వాహనం వరకు తరలించారు. వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రికి చేరిన పది నిమిషాల్లో సాధారణ ప్రసవం కాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆలస్యమైతే ఇబ్బందులు తలెత్తేవని, ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, ఖమాన నుంచి సర్కేపల్లి వరకు 9 కిలోమీటర్ల బీటీ రోడ్డు మంజూరైనా అటవీ అనుమతులు అడ్డురావడంతో 2 కి.మీ.ల మేర పనులు నిలిచిపోయాయి. -
‘కాంగ్రెస్పై నిందలేస్తే ఊరుకోం’
కాగజ్నగర్టౌన్: కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తే ఊరుకోమని ఎమ్మెల్సీ దండె విఠల్ హెచ్చరించారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంకు తరలిస్తే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్నాథ్పూర్, బోడపల్లి గ్రామాల్లోని భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టారని గుర్తు చేశారు. సర్పంచులు ప్రలోభాలకు లొంగి చేరుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, కౌన్సిలర్ జ్యోతి పాల్గొన్నారు. -
అన్నదాతల అరిగోస
హక్కులు కోల్పోయి కౌటాల: సిర్పూర్ నియోజకవర్గంలో 42,867 ఎకరాల పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని, ఎరువుల బస్తాలు అందడం లేదని.. భూములపై హక్కులు కోల్పోయి అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భూములకు పట్టాలిస్తే.. సీఎం రేవంత్రెడ్డి వాటిని లాక్కుంటున్నారని మండిపడ్డారు. కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన సమర శంఖం సభలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన, 22ఏ నిషేధిత భూముల జాబితా పై మాట్లాడారు. జిల్లాలోని రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించకుంటే కలెక్టరేట్ ఎదుట రైతులతో వంటావార్పు చేపడతామని హె చ్చరించారు. సిర్పూర్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్సీ ఇద్దరూ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వ స్తుందని, అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. అంతకు ముందు పలు వురు రైతులు తమ పట్టా పాసుపుస్తకాలతో హరీశ్రావుతో మాట్లాడారు. తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో బ్యాంకు అధికారులు లోన్లు ఇవ్వడం లేదని రైతులు భీంబాయి, విజయలక్ష్మి, మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ వివిధ గ్రామాలకు చెందిన రైతులు వినతిపత్రాలు అందించారు. రైతులకు లోన్లు ఇవ్వారా..?రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాఘన కంపెనీకి బ్యాంకులు రూ.వేల కోట్ల లోన్లు ఇస్తున్నాయ ని, రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్ర శించారు. ప్రభుత్వ హెల్ప్లైన్ సెంటర్కు బాధితులు ఫోన్లు చేస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆ రోపించారు. మంత్రి కుమారుడు హైదరాబాద్ ప్రాంతంలో వందల ఎకరాలను కబ్జా చేస్తుంటే ప ట్టించుకోకుండా.. అన్నదాతల భూములను నిషేధి త జాబితాలో చేర్చుతున్నారని మండిపడ్డారు. పో డు భూముల కోసం దిందా రైతులు హైదరాబాద్కు పాదయాత్రగా వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించిందని పేర్కొన్నారు. నా భూమి నిషేధిత జాబితాలోనే..: కోనప్ప50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నా పట్టా భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితా లో చేర్చిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. సిర్పూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దేవుడు కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎ క్కడా లేని విధంగా మూతపడిన పేపర్ మిల్లును పునఃప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించారని తెలిపారు. గతంలో ఈ ప్రాంతం నుంచి ఖమ్మం, వరంగల్ ప్రాంతానికి ప్రజలు వలస వెళ్లే వారని, ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి పనుల కోసం వస్తున్నారని చెప్పారు. సిర్పూర్ ప్రాంతానికి చెందిన రైతుల 42 వేల ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచే తొలగించేలా కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్, దుర్గం చిన్నయ్య, నాయకులు ఎర్రొల్ల శ్రీనివాస్, రామ్మోహన్రావు, కొంగ సత్యనారాయణ, కౌటాల సర్పంచ్ నక్క శంకర్, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు భూమిపూజ
కాగజ్నగర్టౌన్: మున్సిపాలిటీ పరిధిలో రూ.5.70 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబులు భూమిపూజ నిర్వహించారు. వార్డు 24లోని బాలాజీనగర్ నుంచి ఖలీద్ కిరాణం వరకు సీసీరోడ్డు రూ.1.50 కోట్లు, వార్డు 11 ఆదర్శనగర్ నుంచి స్విమ్మింగ్ పూల్ వరకు సీసీ రోడ్డు రూ.కోటి, వార్డు 12లో హనుమంత్రావు ఇంటి నుంచి ఫకీర్ మొహ్మద్ ఇంటి వరకు సీసీరోడ్డు రూ.1.50 కోట్లు, వార్డు 6లో తాహెర్ ఇంటి నుంచి మసాలా ఒర్రె వరకు సీసీ రోడ్డు రూ.1.70 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీయూఎఫ్ఐడీసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. మున్సి పల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి పాల్గొన్నారు. -
ఫలితాల్లో ‘ఆదర్శం’
ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన కొనసాగుతోంది. ఈ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్గా మహేశ్వర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. ఏటా పది, ఇంటర్ ఫలితాల్లో పాఠశాలను జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నారు. హాజరు శాతం పెంచడంతోపాటు క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి పాటు పడుతున్నారు. ఆటపాటలు, సంస్కృతికి కార్యక్రమాలు, విద్యాశాఖ నిర్వహించే పోటీల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. మహేశ్వర్, ప్రిన్సిపాల్, ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ అజ్ఞానపు చీకట్లు తొలగించి, జ్ఞాన జ్యోతులు వెలిగించి ప్రతీఅడుగులో మార్గదర్శకులుగా నిలుస్తారు. స్వార్థం లేని త్యాగం, పరిపూర్ణమైన అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం వారే.. తరగతి గదిలో కేవలం బోధనకే పరిమితం కాకుండా చిన్నారులను సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎలా జీవించాలో నేర్పించే దిశానిర్దేశకులు ఉపాధ్యాయులు. తమ శ్రమను ఇంధనంగా మార్చి వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. అలాంటి ఎందరో గురువుల సేవలను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ నేపథ్యంలో జిల్లాలో కొందరు ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.ఆసిఫాబాద్రూరల్: గిరిజన బాలికలను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో మేటిగా నిలుస్తున్నారు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఖోఖో కోచ్ తిరుమల్. చిన్నతనం నుంచే క్రీడారంగంపై మక్కువ పెంచుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఖోఖో క్రీడాకారుడిగా సీనియర్ నేషనల్ మెడలిస్టుగా నిలిచి 36 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న ఘన చరిత్ర ఆయనది. ఆ తర్వాత కోచ్గానూ 20 సార్లు తెలంగాణ రాష్ట్ర ఖోఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐదు పతకాలు సాధించి పెట్టి సత్తా చాటారు. ఎన్ఐఎస్ డిప్లొమా లెవెల్ మూడు కోర్సు పూర్తి చేశారు. 2022 నుంచి గిరిజన క్రీడాపాఠశాలలో కోచ్గా పనిచేస్తున్నారు. ఆయన శిక్షణలో గిరిజన బాలికలు అద్భుత ప్రతిభ చూపుతున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో 121 మంది విద్యార్థినులు పాల్గొనగా.. 90 బంగారు, 8 వెండి పతకాలు సాధించారు. జాతీయస్థాయి పోటీల్లో 45 మంది పాల్గొనగా 10 మంది జాతీయ మెడలిస్టులుగా నిలవడం గమనార్హం. ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి ప్రాథమికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు(ఎస్ఏ) నాగేశ్వర్ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధనోపకరణాలు ఉపయోగిస్తున్నారు. పేరుకు తెలుగు టీచరైనా ఆయనకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గోండి, లంబాడీ, కొలంజీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. పాఠశాలలో మరాఠీ, తెలుగు, గోండి మాతృభాష మాట్లాడే విద్యార్థులు మొత్తం 162 మంది ఉన్నారు. తెలుగు పదాల అర్థాలను వారి మాతృభాషలోనే వివరిస్తూ భయం పోగొడుతున్నారు. బోధనలో ఆటపాటలు, ఏఐని జోడిస్తూ చిన్నారులతో మమేకమవుతున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులతో ప్రత్యేక గ్రూపులు తయారు చేసి, వారి స్థాయిలకు అనుగుణంగా బోధన చేస్తున్నారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై ప్రశంసలు అందుకుంటున్నారు. కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మండలంలోని జీడిచేను ఎంపీపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న లావణ్య మూతబడిన పాఠశాలకు ప్రాణం పోసి ప్రవేశాలు పెంచారు. కోవిడ్– 19 క్లిష్ట సమయంలో రాష్ట్రస్థాయి క్యూర్ కోడ్ టీమ్లో సభ్యురాలిగా సేవలందించారు. ఒకటో తరగతి తెలుగు విద్యా వీడియోలను రూపొందించి దీక్షా యాప్లో అప్లోడ్ చేయడంలో భాగస్వాములయ్యా రు. పాఠశాలలు మూసివేసిన సమయంలో డిజిటల్ విద్యకు తన వంతు సహకారం అందించారు. 2018లో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో మూసివేశారు. బడిబాట ద్వారా ఇంటింటి ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకాన్ని పెంపొందించారు. అదే విద్యాసంవత్సరంలో 23 మంది విద్యార్థులతో ప్రవేశాలు చేయించారు. 2025– 26 విద్యాసంవత్సరంలో మరో 30 మంది విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశాలు ఇప్పించారు. యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్, చైల్డ్ సెంటర్డ్, జాయ్ఫుల్ లర్నింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యార్థులకు క్విజ్, వ్యక్తిగత శ్రద్ధ, అభ్యాస మెరుగుదల వంటి కార్యక్రమాలు అమలు చేస్తూ తాము కూడాసాధించగలమనే ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. రెబ్బెన: అంకిత భావంతో విధులు, వినూత్న బోధనలతో తనదైన ముద్ర వేసున్నారు ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య. భాషా నైపుణ్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధి, సామాజిక భాగస్వామ్యం వంటి అనేక విభాగాల్లో ఆమె చేస్తున్న సేవలు గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. ఒకరిద్దరు హాజరయ్యే ఆ పాఠశాలలో నేడు 53 మంది చదువుకుంటున్నారు. లావణ్య 2010లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన ఎస్సీ కాలనీ ఎంపీపీఎస్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గతంలో ఆమె చేరక ముందు ఇక్కడ విద్యార్థుల సంఖ్య 21 ఉండగా ప్రస్తుతం 53కి చేరింది. అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, గ్రామ యువత, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రవేశాలు పెంచారు. ఆమె మార్గదర్శకత్వంలో ఇద్దరు విద్యార్థులు గురుకుల పాఠశాలకు సైతం ఎంపికయ్యా రు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. 3, 4, 5 తరగతుల్లోని తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల బోధనకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. 2025– 26 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నారు.వినూత్న సేవలకు విశిష్ట గుర్తింపుసొంత ఖర్చులతో బడి అభివృద్ధిపాఠశాల సమగ్ర అభివృద్ధికి సొంత డబ్బులు వెచ్చించి సౌకర్యాలు కల్పించారు. సుమారు రూ.లక్షతో ఫర్నీచర్ సమకూర్చడంతోపాటు ప్రహరీ, స్కూల్లోకి పశువులు రాకుండా గేట్ ఏర్పాటు చేయించారు. వరండాలకు గ్రిల్స్ అమర్చడం, భవనానికి రంగులు వేయించారు. విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, మధ్యాహ్న భోజన పాత్రలు, స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్, పెన్నులు, డైరీలు, స్టేషనరీ, గ్రంథాలయ పుస్తకాలను సమకూర్చారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తరుచూ పాఠశాలకు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను వివరిస్తున్నారు. గైర్హాజరు తగ్గించేందుకు కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.శిక్షణలో మేటి తిరుమల్బహుభాషా కోవిదుడుమూత‘బడి’కి ప్రాణం పోసి.. -
ప్రక్షాళన.. పరిపూర్ణం!
సాక్షి, ఆదిలాబాద్: ఎక్సైజ్ శాఖలో సమూల ప్రక్షాళన చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రక్రియ, సాధారణ బదిలీలు అని ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేయలేదని, ఆప్షన్లు కూడా తీసుకోలేదని శాఖలో ప్రచారం సాగుతోంది. ఆ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు అన్ని ఎక్సైజ్ స్టేషన్లు, ఇతర విభాగాల నుంచి ఇన్స్పెక్టర్లు, ఎస్సైలకు ట్రాన్స్ఫర్లు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఆదిలాబాద్ డివిజన్ నుంచి కరీంనగర్, నిజామాబాద్ డివిజన్లకు బదిలీలు చోటుచేసుకోగా, అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాకు పలువురు వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. గతేడాదే పలువురికి ప్రమోషన్ వచ్చినా పోస్టింగ్లు కేటాయించలేదు. తాజాగా పోస్టింగ్లు కేటాయించడంతో పాటు బదిలీలు చేపట్టారు. దీంట్లో ఏకంగా ఎక్సైజ్ డివిజన్ నుంచే బదిలీ చేసి ఇతర డివిజన్లకు పంపించారు. ముందుగా ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేయకుండా, ఆప్షన్ ఇవ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారని శాఖలో ప్రచారం జరుగుతున్నా.. జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న కొందరు అధికారులకు ఇతర డివిజన్లలో పలుకుబడి ఉన్నచోట పోస్టింగ్ లభించిందనే చర్చ సాగుతోంది. ఒకరోజు ముందు రాత్రి కొంత మంది తమ పరిచయాలు, పైరవీలతో అనువైన చోటకు బదిలీపై వెళ్లారని చెప్పుకొంటున్నారు. నేరాలను అరికట్టేనా..?ఉమ్మడి జిల్లాకు సరిహద్దున మూడు దిక్కులా మహారాష్ట్ర ఉంది. ఇక్కడికి అక్కడి నుంచి దేశీ దారు రవాణా విస్తృతంగా సాగుతోంది. జిల్లా నుంచే పలువురు స్మగ్లర్లు దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో చీప్ లిక్కర్ అమ్మకాల విషయంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గుతోంది. అంతే కాకుండా గంజాయి సాగు ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అడపాదడపా పోలీసులు దాడులు చేసి అరికట్టేందుకు కృషి చేస్తున్నా ఎకై ్సజ్ శాఖ నామమాత్రంగానే దాడులు నిర్వహిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. గుడుంబా కేసులు కూడా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రైమ్ను అరికట్టేందుకు సమూల ప్రక్షాళన ద్వారా శాఖలో ప్రయత్నాలు చేపట్టారనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా..ఎక్సైజ్ ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు, 11 ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట స్టేషన్లున్నాయి. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో డివిజన్ పరిధిలో పనిచేసే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు నా లుగు జిల్లాల్లో డీటీఎఫ్ విభాగాలున్నాయి. వీటి పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. వారిని కరీంనగర్, నిజామాబాద్ డివిజన్లకు బదిలీపై పంపించారు. అక్కడి నుంచి ఈ జిల్లాలకు అధికారులు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా బదిలీ వివరాలుపోస్టు పేరు బదిలీ అయిన వచ్చేవారి ఇన్స్పెక్టర్లు 16 18 ఎస్సైలు 15 18 -
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. గౌడ జన హ క్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువా రం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కె.హరిత, ఎకై ్సజ్ ఈఎస్ లక్ష్మానాయక్, ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గీత కార్మికుల లైసెన్స్లు పునరుద్ధరించాలని, అర్హులకు నూతన లైసెన్స్లు మంజూరు చేయాలన్నా రు. జిల్లాలో గీత వృత్తిపై ఆధారపడిన కా ర్మికుల వివరాలు నమోదు చేసి అధికారిక గు ర్తింపు కార్డులు మంజూరు చేయాలని కో రారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్ సౌకర్యం, చెట్ల పైనుంచి పడి మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకై ్సజ్శాఖ అధికారులు గీత కార్మికుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో శంకర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, మనోహర్గౌడ్, నీరజగౌడ్, మహేష్గౌడ్, గిరిగౌడ్, తిరుపతిగౌడ్, వైకుంఠంగౌడ్, అశోక్గౌడ్, వెంకటేష్గౌడ్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాల సేవలు అత్యంత కీలకం
కాగజ్నగర్టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని చి న్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల సేవలు అత్యంత కీలకమని ఎ మ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. కా గజ్నగర్ మండలం బారెగూడ పంచాయతీ లో ఎన్ఆర్ఈజీఎస్, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనాన్ని గురువా రం పీడీ స్వరూపారాణి, సీడీపీవో సురేఖ, స ర్పంచ్ కోట వేణుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అ మలు చేస్తున్న పోషణ్ అభియాన్ను గ్రామాలకు చేరవేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ మణిరాజ్, ఉప సర్పంచ్ నేరేళ్ల వెంకటేశ్, పంచాయతీ సెక్రెటరీ నరేష్, వార్డు సభ్యులు వడాయి శ్యామల, ముక్తార్, రుబినా, చిప్పకుర్తి హరీశ్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
ప్రజల కోసం నిరంతర పోరాటం
ఆసిఫాబాద్: ‘ప్రభుత్వం పార్టీల ఆధారంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలపై వివక్ష చూపకూడదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టాలి. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉందనే నెపంతో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారు. అయినా నియోజకవర్గంలో ని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరా టం సాగిస్తా..’ అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఎమ్మెల్యే మాటల్లోనే.. ఆరు గ్యారంటీల హామీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ వందశాతం అమలు చేయలేదు. రుణమాఫీ ఇప్పటికీ సగం మంది రైతులకు కూడా కాలేదు. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇప్పటివరకు ఇవ్వలేదు. నిలిచిన వంతెనలుగుండి, లక్మాపూర్లతో పాటు నిర్మాణంలో ఉన్న ప లు వంతెనల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయా యి. నాణ్యతా లోపంతో ‘అడ’ ప్రాజెక్టు కట్టకు బీట లు వారాయి. అక్కడ ప్లాస్టిక్ కవర్లు కప్పి ఎన్ని రోజు లు నెట్టుకొస్తారు..? నాలుగు నియోజకవర్గాలకు తాగునీరందించే ఈ ప్రాజెక్టుకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. ఆదివాసీలకు ఒక్క పో డు పట్టా కూడా ఇవ్వలేదు. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని వాంకిడి మండలం బెండార నుంచి ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి రహదారి వద్ద నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాఠశాల భవనాన్ని జిల్లా కేంద్రానికి వచ్చే హైవే పక్కన అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉద్యమిస్తాంజిల్లా కేంద్రంలో కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్లాట్లుగా వి క్రయిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కలెక్టర్ తక్షణమే దీనిపై దృష్టి సారించాలి. ఈ అక్రమాలపై మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా బిల్లులు రాకపోవడంతో ఇప్పటివరకు సగం కూడా పూర్తికాలే దు. ప్రైవేటు భూములను ప్రభుత్వ భూముల పేరుతో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో సామా న్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.ప్రభుత్వాన్ని నిలదీస్తానాపై ఉన్న నమ్మకం, అభిమానంతో ప్రజలు నన్ను గెలిపించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తాను. ప్రస్తుత ప్రభుత్వ వివక్షతో పనులు అనుకున్నంత వేగంగా చేయలేకపోతున్నాం. త్వరలోనే మా ప్రభుత్వం వస్తుంది.. అప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాను. నిధులు ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాను. బీఆర్ఎస్ హయాంలోనే..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆసిఫాబాద్కు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ తదితర కార్యాలయాలు సాధించుకున్నాం. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 150 మంది ప్రొఫెసర్లకు కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. బోధన సిబ్బంది, వైద్యులను ప్రభుత్వం నియమించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపుతూ మూడేళ్లుగా ఎమ్మెల్యేలకు కేటాయించే రూ.5 కోట్ల సీడీపీ నిధులను ఇవ్వడం లేదు. ఎస్డీఎఫ్ నిధులు కూడా కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇస్తున్నారు. గత బడ్జెట్లో రూ.5 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసింది. అభివృద్ధి పనులుకెరమెరిలో రూ.30 కోట్లతో ఇన్టెక్ వెల్ ని ర్మించాం. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి ఏటా రూ.30 కోట్లతో సీసీ రోడ్లు వేస్తున్నాం. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. జిల్లా కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద ఆర్చ్, డ్రెయినేజీలు, కల్వర్టులు, మున్సిపల్ కాంప్లెక్స్, కార్యాలయ భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. -
గోయగాంకు ఆర్వో ప్లాంట్ మంజూరు
కెరమెరి: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కెరమెరి మండలంలోని గోయగాం పంచాయతీకి ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ప్రకటించారు. గురువారం గోయగాం పంచాయతీని సందర్శించి, ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని ఖరారు చేశారు. తాగునీరు సక్రమంగా లేక కిడ్నీ బాధితులు పెరుగుతున్నారని గ్రామస్తులు కలెక్టర్ కె.హరిత దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్వో ప్లాంటు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పల్లె దవాఖానాను సందర్శించగా, వైద్యులు లేక వైద్యం అందడం లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ఎంఎల్హెచ్పీని పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి లబ్ధిదారుడితో మాట్లాడారు. ఆయన వెంట సర్పంచ్ ఆనంద్రావు, ఉప సర్పంచ్ రాందాస్, పంచాయతీ కార్యదర్శి మురళి తదితరులు ఉన్నారు. నాణ్యమైన విద్యనందించాలిఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నా రు. బూర్గుడ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, తరగతి గదులు, విద్యాబోధన తీరును పరిశీలించారు. ప్రతీ విద్యార్థి ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి అవసరమైన అదనపు బోధన చేస్తూ అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. -
తక్షణం జాయిన్ కావాల్సిందే..
ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా నుంచి పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైల బది లీలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖ కమి షనర్, వరంగల్ డిప్యూటీ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రా న్స్ఫరైన వారు తక్షణం వారికి కేటాయించిన పోస్టింగ్లో జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు జరిగాయి. – జనార్దన్రెడ్డి, డిప్యూటీ కమిషనర్, ఆదిలాబాద్ డివిజన్ -
చేపల పెంపకంతో ఉపాధి అవకాశాలు
ఆసిఫాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి కూలీలు చేపల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీబీ జీరామ్జీ పథకం కింద చేపట్టిన పంట కుంట, నీటి కుంట, ఊట కుంటల్లో ప్రధానమంత్రి కేఏఎస్వై ద్వారా జల్ జీవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డీఆర్డీవో దత్తారావుతో కలిసి చేపపిల్లలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ భూముల్లో ఊట కుంటలు, నీటి కుంటలు, పంట కుంటల నిర్మాణాలు చేపట్టి వాటిలో చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందాలని సూచించారు. చేపపిల్లల పంపిణీకి జల్ జీవిక స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ఆంజనేయులు, జల్ జీవిక స్వచ్ఛంద సంస్థ సంచాలకులు పద్మాకర్, సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి సర్వేతో వివాదాలు పరిష్కరించాలిఆసిఫాబాద్అర్బన్: భూముల రీ సర్వేలో భాగంగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదాలను ఉమ్మడి సర్వే నిర్వహించి పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు, డీఎఫ్వో బాలామణి, ఎఫ్డీవోలు భార్గవ్, అప్పయ్యతో కలిసి వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పనులు, అటవీశాఖ అనుమతుల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు, పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. టీడబ్ల్యూడీసీ ఆధ్వర్యంలో లింగాపూర్ కేజీబీవీ ప్రహరీ పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన బీటీ రోడ్లు, వంతెనలు, కల్వర్టుల పనులకు అటవీ అనుమతులు పొందాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో రహదారులు, జీపీ భవనాలు, మండల సమాఖ్య భవనాలు, పనులు త్వరగా చేపట్టాలన్నారు. బీఎస్ఎన్ఎల్, జియో సంస్థల సెల్ టవర్ల ఏర్పాటు పూర్తి చేసి, మారుమూల గ్రామాలకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ పీడీ ప్రకాశ్రావు, పంచాయతీరాజ్ ఈఈ ధర్మేందర్, డీపీవో భిక్షపతిగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
TG: ఓ వ్యక్తిపై మూడు ఎలుగుబంట్ల దాడి
రోంపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిపై మూడు ఎలుగుబంట్ల దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిర్యాణి మండలం రోంపల్లిలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన మోడితే శంకర్ (54)పై మూడు ఎలుగుబంట్లు ఒకేసారి దాడి చేశాయి. మేకలు మేపుతుండగా ఎలుగుబంట్లు దాడి చేయడంతో శంకర్ పెద్దగా కేకల వేస్తూ భయాందోళనకు గురయ్యాడు. ఆ కేకలతో అప్రమత్తమైన సమీప గ్రామస్థులు.. ఎలుగుబంట్లును తరిమికొట్టారు. అయితే ఈ దాడిలో శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని నుతిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి డీఈవో సచ్చిదానంద చారితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాకార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలన్నారు. మానసిక, సామాజిక, శారీరక, సృజనాత్మక, నైతిక విలువలు పెంపొందించడంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో ఎస్వోలు శ్రీనివాస్, అబిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. గడువులోగా సిలబస్ పూర్తి చేయాలి రెబ్బెన: ఇంటర్ విద్యార్థుల సిలబస్ను గడువులోగా పూర్తి చేసి, వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు, తరగతి గదులు, విద్యాబోధన తీరుతోపాటు కళాశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు కంప్యూటర్పై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని సందర్శించారు. రోగులతో మాట్లాడి సేవల గురించి తెలుసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో రోగులను ఇతర ప్రాంతాలకు సిఫార్సు చేయవద్దని సూచించారు. గర్భిణులపై దృష్టి సారించి, సుఖప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రోబోటిక్స్, ఏఐపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికత రంగాలపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోహం అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్, ఏఐ వర్క్షాప్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. పాఠ్య పుస్తకాలకే పరి మితం కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో సచ్చిదానంద చారి, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎస్వో శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతో సైబర్ మోసాలకు అడ్డుకట్ట
ఆసిఫాబాద్రూరల్: అప్రమత్తతతో సైబర్ మోసాలతో అడ్డుకట్ట వేయొచ్చని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కళాశాలలో బుధవారం సైబర్ జాగృత దివస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. పెట్టుబడి మోసాలు, ఆన్లైన్, సోషల్ మీడియా మోసాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, సైబర్ క్రైం సీఐ రవీందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగంలోకి ఆర్ఎంపీలు..
పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల చిన్నారి రక్త పరీక్ష రిపోర్టు ఇది. పెంచికల్పేట్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి డెంగీ జ్వరంగా ఆర్ఎంపీ నిర్ధారించాడు. అంతేకాకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చిన్నారికి యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ ఇస్తున్నాడు. క్లినిక్లో బహిరంగంగానే వైద్యం చేస్తున్నాడు. జిల్లాలోని పలు గ్రామాల్లో డెంగీ అనుమానిత కేసులు పెరుగుతుండగా, ఇదే అదునుగా ఆర్ఎంపీలు అర్హత లేని వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆర్ఎంపీలు రంగంలోకి దిగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్స్ ఏర్పాటు చేసి టైఫాయిడ్, మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్లినిక్లు, మెడికల్ దుకాణాల్లో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు ప్రమాదకరమైన యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు, సైలెన్లు ఎక్కిస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద గంపగుత్తగా సుమారు రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాల్సి ఉండగా, అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఆర్ఎంపీలకు అడ్డూలేకుండా పోయింది. అధికారులు స్పందించి ఇప్పటికై నా స్పందించి అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెంచికల్పేట్: ఇటీవల కురిసిన వర్షాలకు పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, ఎక్కడికక్కడా మురుగు నీరు నిలుస్తుండటంతో జిల్లాలో డెంగీ డెంజర్ బెల్స్ మోగిస్తోంది. పగటి పూట మాత్రమే కుట్టే టైగర్ దోమకాటుతో వ్యాపించే తీవ్రమైన వైరల్ జ్వరమే డెంగీ. సాధారణంగా బాధితులకు తీవ్రమైన జ్వరంతోపాటు నొప్పులు, ఆలసట, బ్లడ్ ప్లేట్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే సరైన నిర్ధారణ లేకుండా చికిత్స తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదకరం. కానీ పల్లెల్లో మాత్రం కొందరు ఆర్ఎంపీలు అర్హతకు మించి డెంగీ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. డెంగీకి నిర్ధిష్టమైన యాంటీ వైరల్ ఔషధం లేదు. ఆర్ఎంపీలు మాత్రం స్టెరాయిడ్లు, అధిక డోస్ ఉన్న యాంటీ బయాటిక్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. నిర్ధారణ లేని కేసులే అధికం.. గ్రామీణ ప్రాంతాల్లో జ్వర పీడితులు పెరుగుతున్నారు. కానీ ఎక్కువ మంది స్థానిక వైద్యుల వద్దే చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు నిర్ధారణ కావడం లేదు. గతేడాది జిల్లాలో 73 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 27 కేసులు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. కానీ అధికారికంగా ధ్రువీకరించని కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సంబంధిత శాఖ అధికారులే చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఒక్క పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలోనే ఈ నెల 1న ఎనిమిది డెంగీ కేసులు వెలుగులోకి రావడం తీవ్రతకు అద్దం పడుతోంది. చట్ట ప్రకారం చర్యలు తప్పవు జిల్లాలో అర్హతకు మించి వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలపై చర్యలు తప్పవు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రజలు అర్హత లేని వైద్యుల వద్దకు వెళ్లవద్దు. నిబంధనలు ఉల్లఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. – డా.నాగేంద్ర, జిల్లా వైద్యారోగ్య అధికారి జిల్లాలో డెంగీ కేసుల వివరాలు సంవత్సరం కేసులు 2025 73 2026(ఇప్పటివరకు) 27 -
కాంగ్రెస్ 1000 రోజుల పాలన అట్టర్ఫ్లాప్
ఆసిఫాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే నివాసం నుంచి గాంధీచౌక్, వివేకానంద చౌక్, అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలతో రూపొందించిన 420 అడుగుల ఫ్లెక్సీతో అంబేడ్కర్ చౌక్కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు నీటముటలుగా మిగిలిపోయాయన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులతో పాటు అన్నివర్గాల ప్రజలు మోసపోయారన్నారు. కల్యాణలక్ష్మి నిలిచిపోయిందని, నిరుద్యోగ భృతి రూ.4వేలు, తులం బంగారం, స్కూటీ హామీలు గాలికొదిలేశారని ఆరోపించారు. 22ఏ పేరుతో ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. జిల్లా వైద్య కళాశాలలో వైద్యులు లేరని, ఆసిఫాబాద్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. 1000 రోజుల పాలనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నాయకురాలు మర్సోకోల సరస్వతి, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం, బాలకృష్ణ, దూడల అశోక్, నాగుబాయి, రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, పార్టీ నాయకులు అబుల్ కలాం, గంధం శ్రీనివాస్, సాయి శ్రావణ్, జాబరి రవీందర్, నిసార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రశస్త్ 2.0’ షురూ
కెరమెరి: పాఠశాలల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్), ప్రశస్త్ 2.0 కార్యక్రమాలు బుధవారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 11లోగా కార్యక్రమాలు వందశాతం పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఉదయమే సీఆర్పీలు, ఐసీటీ బోధకులు పాఠశాలల బాట పడుతున్నారు. ఉపాధ్యాయులతో ప్రశస్త్ యాప్ ఇన్స్టాల్ చేయించి 10 వీడియోలను చూసేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక యాప్ రూపకల్పన చిన్నతనం నుంచి పిల్లల్లో భౌతిక, మానసిక ఎదుగుదల, మార్పులను గుర్తించడం కష్టంగా మారుతుంది. అయితే ఇలాంటి ప్రత్యేక లక్షణాలను గుర్తించడానికి ఎన్సీఈఆర్టీ(న్యూఢిల్లీ) ప్రత్యేకంగా ప్రశస్త్ యాప్ రూపొందించింది. విద్యార్థుల మానసిక ప్రవర్తన, భౌతికంగా వచ్చిన మార్పులను దీని ద్వారా గుర్తించవచ్చు. యూడైస్తో దేశంలోని అన్ని పాఠశాలల విద్యార్థుల వివరాలు ఒకే వేదికపై ఉంటాయి. యాప్ ద్వారా పిల్లల స్క్రీనింగ్ చేయడం సులభం. ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని ముందుగానే గుర్తించడానికి దోహదపడుతుంది. ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ –2016 ప్రకారం 21 రకాల అసమానతలను గుర్తించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. పాఠశాలలకు సీఆర్పీలు జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద 1267 పాఠశాలలు ఉన్నాయి. స్కూల్ కాంప్లెక్స్లు 67 ఉండగా, సీఆర్పీలు 52 మంది పనిచేస్తున్నారు. క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో రిజిస్ట్రేషన్, స్వీయ మూల్యాంకనం గడువులోగా పూర్తయ్యేలా చూసే బాధ్యతలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. సాంకేతిక సహకా రం అందించేందుకు సీఆర్పీలు(కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లు), ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో అన్ని పాఠశాలలను నేరుగా సందర్శిస్తారు. ఇందుకోసం వారికి ప్రయాణ భత్యం కూడా మంజూరు చేయనున్నారు. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రశస్త్ 2.0 పోర్టల్ను తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు తమ యూడైస్ కోడ్, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్తో లాగిన్ అయి శిక్షణ వీడియోలు వీక్షించాలి. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించి సమస్యలు గుర్తించాలి. ‘హరిత్ పాఠశాల’ రేటింగ్ ఇలా.. స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్లో పాఠశాల నిర్వహణ, పచ్చదనం, పారిశుద్ధ్యం కలిపి మొత్తం 125 మార్కులకు స్టార్ రేటింగ్ కేటాయిస్తారు. తాగునీటి సౌకర్యం 22 మరుగుదొడ్ల నిర్వహణ 27 సబ్బుతో చేతులు కడుక్కోవడం 14 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 21 ప్రవర్తన సామర్థ్య పెంపు 20 మిషన్ లైఫ్ కార్యక్రమాలు 21 -
‘సరిహద్దు’ దొంగలు!
● మహారాష్ట్రకు చెందిన ముఠాలపైనే అనుమానాలు చింతలమానెపల్లి: జిల్లాలో వరుస చోరీ ఘటనలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దు మండలాలను టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి. సరిహద్దు దాటి వస్తున్న కొందరు చోరీలకు పాల్పడి రైలు, రోడ్డు మార్గాల్లో దర్జాగా వెళ్తున్నారని తెలుస్తోంది. జిల్లా నుంచి మహారాష్ట్రకు రైలు, రోడ్డు రవాణా మార్గాలు ఉండటం, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాల నుంచి రహదారులు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్నాయి. గతేడాది కౌటాల మండల కేంద్రం, చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలో దొంగతనాలకు పాల్పడినవారు మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం. మూడేళ్ల క్రితం చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన దోపిడీకి చంద్రాపూర్ జిల్లాలో జరిగిన పలు బ్యాంకుల దొంగతనాలకు సంబంధం ఉందని సమాచారం. వర్షాకాలంలోనే అధికం.. మూడేళ్ల క్రితం సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ధనలక్ష్మి నగల దుకాణంలో సుమారుగా రూ.40లక్షల విలువైన బంగారం చోరీకి గురైంది. జూలైలో భారీ వర్షం కురుస్తుండగా దుకాణం షెట్టర్ తొలగించిన బంగారాన్ని దొంగిలించారు. భారీ వర్షం కారణంగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించలేకపోయారని ఓ పోలీసు అధికారి చెప్పడం విశేషం. ముఖాలకు మాస్కులు వేసుకోవడంతో దొంగలు నేటికీ చిక్కలేదు. కాగజ్నగర్, సిర్పూర్(టి)లతోపాటు మహారాష్ట్రలో సరిహద్దున రాజురా, బల్లార్షా, చంద్రపూర్ పట్టణాలు సమీపంలోనూ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. వర్షాకాలం రాత్రిపూట జరిగే చోరీలు ఎక్కువగా రైలు ఆగే ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. చోరీలకు పాల్పడే వారు ఎక్కువగా బంగారం, నగదు లక్ష్యంగా చేసుకుంటున్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలో జరిగిన దొంగతనాల్లో బాధితులు ఎక్కువగా బంగారం నష్టపోయారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ చర్యలు తీసుకునే నగల దుకాణాల్లో ఈ చోరీలు జరగడం గమనార్హం. సిర్పూర్ నియోజకవర్గంలో జరిగే చాలావరకు చోరీల్లో ముఠాలు పోలీసులకు చిక్కడం లేదు. సొమ్ము రికవరీలో పోలీసులు విఫలమవుతున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ప్రధాన ముఠాలు, పెద్ద దొంగతనాలు పరిష్కారం కాకపోవడంతోపాటు గ్రామాల్లో చిల్లర దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. సీసీ కెమెరాలకు చిక్కినా ప్రయోజనం ఉండటం లేదు. నేరాలు అరికట్టేందుకు చర్యలు నేరాలు అరికట్టడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. దొంగతనాలు జరిగిన సందర్భాల్లో నిందితులు నగదు ఖర్చు చేస్తే రికవరీ చేయడం కష్టంగా మారుతుంది. బంగారం, నగలు మాత్రం పూర్తిస్థాయిలో రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిందితులను పట్టుకునేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నాం. – వహీదుద్దీన్, కాగజ్నగర్ డీఎస్పీ చింతలమానెపల్లి మండలం డబ్బాలో గతేడాది జూన్లో ఓ ఫర్టిలైజర్ దుకాణంలో చోరీ జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తులు రూ.85వేల నగదు అపహరించారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన నిందితులను పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే బెజ్జూర్ మండలంలోని ఒక ఫర్టిలైజర్ దుకాణం, కౌటాల మండలంలోని ఒక ఉపాధ్యాయుడి ఇంట్లోనూ చోరీలు జరిగాయి. ఇదే తీరుగా ఇటీవల జరుగుతున్న పలు చోరీల్లోనూ మహారాష్ట్రకు చెందిన వారి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సెపక్ తక్రా పోటీలకు గోలేటి క్రీడాకారులు
రెబ్బెన: జాతీయస్థాయి సెపక్ తక్రా పోటీలకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ కుమ్మరి మల్లేశ్, పీఈటీ భాస్కర్ తెలిపారు. వరంగల్ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో గంగాధరి శివచరణ్(9వ తరగతి), చీదురాల హరీశ్(8వ తరగతి) ప్రతిభ చూపారన్నారు. వీరు జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్, షేర్ కశ్మీర్ ఇండోర్ స్టేడియంలో జరిగే 29వ జాతీయస్థాయి సెపక్తక్రా పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులను అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, సెపక్తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, సభ్యులు రామకృష్ణ తదితరులు అభినందించారు. శివచరణ్ హరీశ్ -
ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
దహెగాం: మండలంలోని చినరాస్పెల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థా యి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం సునీత తెలిపారు. బుధవారం పాఠశాల ఆవరణలో విద్యార్థినులను అభినందించారు. ఆసిఫాబాద్లో మంగళవారం జరిగిన జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీల్లో పదో తరగతి విద్యార్థిని పాలె అంజలి, తొమ్మిదో తరగతి విద్యార్థిని పాలె శ్రావణి సత్తా చాటారని తెలిపారు. వీరు ఈ నెల 4 నుంచి 6 వరకు నిజామాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డలకు చెల్లని చెక్కులు
కెరమెరి: పేదింట ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చె క్కుల పంపిణీలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గడువు ముగిసిన చెక్కులు పంపిణీ చేయడంతో పలు కుటుంబాలు బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కెరమెరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కులు విడుదలయ్యాయి. నిబంధనల ప్రకారం ట్రెజరీ నుంచి జారీ అయిన చెక్కులకు 90 రోజుల కాల పరిమితి ఉంటుంది. ఈ చెక్కుల గడువు జూలై 20తో ముగిసింది. కనీసం చెక్కులపై ఉన్న తేదీలను కూడా పరిశీలించకుండా సంబంధిత అధికారులు జూలై 22న స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. చెక్కులను నగదుగా మార్చుకునేందుకు వారు బ్యాంకులకు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్డీవో కార్యాలయానికి..లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో మేల్కొన్న రెవెన్యూ యంత్రాంగం చెక్కుల రీ వ్యాలిడేషన్ మార్పిడి మొదలు పెట్టింది. గడువు ముగిసిన 41 చెక్కులను తిరిగి సేకరించారు. వాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని తహసీల్దార్ అధికారిక లేఖతో ఆసిఫాబాద్లోని ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. ఆ చెక్కులు ఆర్డీవో కార్యాలయానికి చేరి వారానికి పైగా గడుస్తున్నా నేటికీ పురోగతి లేదు. కల్యాణలక్ష్మి సాయం అందుతుంద నే ఆశతో చాలామంది పేదలు పెళ్లిళ్ల కోసం వడ్డీలకు అప్పులు తెచ్చారు. వారి ఆశలు ప్రస్తుతం ఆడియాశలయ్యాయి. వడ్డీలు కట్టాల్సి రావడంతో వారిపై ఆర్థికభారం పడుతోంది. ఇప్పటికై నా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి కొత్త చెక్కులు త్వరగా పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
కాంగ్రెస్ అబద్ధపు హామీలపై ఉద్యమిస్తాం
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలపై ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై జిల్లావ్యాప్తంగా వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 8 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రులు కేవలం కొబ్బరికాయలు కొడుతున్నారే తప్ప పనులు ముందుకు సాగడం లేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్లు అలీబిన్ అహ్మద్, శ్రీనివాస్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, నాయకులు రవీందర్, మర్సుకోల సరస్వతి, కలాం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కలిసొచ్చిన ఎల్నినో..!
రెబ్బెన: ఎల్నినో కొన్ని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించగా సింగరేణికి మాత్రం అనుకూలంగా మారింది. వర్షాభావ పరిస్థితులు బొగ్గు ఉత్పత్తికి కలిసొచ్చాయి. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల్లో మిగిలిన సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలో బొగ్గు ఉ త్పత్తికి తరుచూ ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముసురుకు ఎక్కడిక్కడ పనులు నిలిచిపోతాయి. క్వారీలు నీటితో నిండటంతోపాటు డంపర్లు ఉపరి తలానికి వచ్చే రోడ్లు బురదమయంగా మారుతా యి. వర్షం తగ్గిన తర్వాతే ఉత్పత్తి తిరిగి ప్రారంభి స్తారు. ఈ కారణాలతో నాలుగు నెలలపాటు లక్ష్యం సాధించడం కష్టంగా మారుతుంది. కానీ ఈసారి వర్షాలు తక్కువగా కురవడంతో బొగ్గు ఉత్పత్తి పెరిగింది. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ గతేడాదితో పోలిస్తే అధిక ఉత్పత్తి సాధించి లక్ష్య సాధన వైపు దూసుకుపోతుంది. ఈ నెల నుంచి ఉత్పత్తి ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. తగ్గిన వర్షం.. పెరిగిన ఉత్పత్తిబెల్లంపల్లి ఏరియాలో ఒక్క ఖైరిగూర ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది. గోలేటి ఓసీపీ ఏర్పాటు కోసం అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నా అనుమతులు రాలేదు. ఏరియాకు ఈ ఓసీపీనే పెద్దదిక్కుగా ఉంది. ఎల్ని నోతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సింగరేణికి అనుకూలంగా మారాయి. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో బొగ్గు ఉత్పత్తిపై అంతగా ప్రభావం చూపలేదు. గత మూడు, నాలుగు సంవత్సరాల్లో వర్షాకాలం సీజన్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి కాస్త పెరిగింది. గతేడాది వర్షాకాలంలో ఒక నెలలో ఏకంగా 20రోజులకు పైగా ఉత్పత్తి నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. జూన్లో వర్షాకాల సీజన్ మొదలు కాగా ఆగస్టులో వర్షాలు అధికంగా కురుస్తాయి. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. అయితే 2025 ఆగస్టులో ఏరియాలో 742 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఈసారి మాత్రం కేవలం 274 మి.మీ.లు మాత్రమే వర్షం కురిసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు బెల్లంపల్లి ఏరియాలో 11,75,504 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపడితే ఈసారి మాత్రం 14,06,446 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమైంది. ఖైరిగూర ఓసీపీ మూడేళ్లలో ఉత్పత్తి ఇలా (ఏప్రిల్ నుంచి ఆగస్టు)సంవత్సరం లక్ష్యం ఉత్పత్తి 2024 15,50,000 13,32,584 2025 13,00,005 11,75,504 2026 11,92,000 14,06,446 బెల్లంపల్లి ఏరియాలో నమోదైన వర్షపాతం(మి.మీ.)నిరాటంకంగా పనులువర్షాకాలం నాలుగు నెలల పాటు సింగరేణిలో ప్రధానంగా ఓసీపీల్లో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. వర్షాలతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో డంపర్లు, షావెల్స్ వంటి ఖరీదైన భారీ యంత్రాలు పనులు లేక నిరుపయోగంగా ఉంటాయి. ఎడతెరిపి లేకుండా ముసురు వానలు కురిస్తే కొన్నిసార్లు వారం రోజుల పాటు బొగ్గుపెల్ల కూడా బయటికి రాదు. కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతగా అంతరాయం కలగలేదు. వర్షం కురిసిన రోజులు తక్కువగా ఉండటంతో పనులు నిరాటంకంగా కొనసాగాయి. ఏకధాటిగా వర్షాలు పడితే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగుల జీతాలు, యంత్రాల పనిగంటలను సింగరేణి భరించుకోవాల్సి వస్తుంది. వర్షాలతో బొగ్గు ఉత్పత్తి తగ్గి సాధించిన కొద్దిపాటి ఉత్పత్తిపైనే వ్యయం అంతా పడుతుంది. దీంతో వర్షాకాలంలో నాలుగు నెలల పాటు బొగ్గు ఉత్పత్తి వ్యయం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. దానిని నివారించేందుకు అధికారులు వర్షాలు తగ్గుముఖం పట్టాక ఉత్పత్తి ప్రక్రియలో వేగం పెంచుతారు. ఏటా అక్టోబర్ నుంచి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పుంజుకుంటుంది. వర్షాలతో కోల్పోయిన ఉత్పత్తిని సాధించేందుకు శ్రమిస్తుంటారు. అయితే ఈ సారి ఉత్పత్తి పెరిగిన కారణంగా ఏరియా వార్షిక లక్ష్యాన్ని సులువుగా సాధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
వెయ్యి రోజుల్లో ఏం చేశారో చెప్పాలి
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కొన్ని బీటెక్ కళాశాలలు, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉన్నా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వివాదాలకు కారణమవుతుందన్నారు. భూభారతి పేరుతో ప్రైవేట్ భూములను సైతం ప్రభుత్వ జాబితాలో చేర్చి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, నాయకులు ఖాండ్రె విశాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ పార్టీలు సహకరించాలి
ఆసిఫాబాద్: ఎస్ఐఆర్లో భాగంగా నిర్వహించే హియరింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ నోటీసుల జారీ, హియరింగ్ ప్రక్రియకు సంబంధిత ఓటర్లు హాజరై ధ్రువపత్రాలు సమర్పించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లను భాగస్వాములు చేయాలని సూచించారు. -
ఉత్పత్తి పెరిగింది
ఈసారి వర్షాలు కాస్త తక్కువగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి పె రిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు బెల్లంపల్లి ఏరియా 118 శాతం ఉత్పాదకతతో కొనసాగుతోంది. ఈ మూడు నెలలు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి చేపట్టగలిగాం. అధిక వర్షాలతో కోల్పోయే బొగ్గు ఉత్పత్తి ప్రభావం వార్షిక ఉత్పత్తి లక్ష్యంపై పడేది. తక్కువ వర్షపాతంతో ఉత్పత్తి పెరగడంతో నిర్ణీత సమయం కంటే ముందే వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశం ఏర్పడింది. – శ్రీ రమేశ్, జీఎం, బెల్లంపల్లి ఏరియా -
వడ్డీ కడుతున్నా..
మా అమ్మాయి పెళ్లి కోసం వడ్డీకి డబ్బు తెచ్చాం. కల్యాణలక్ష్మి డబ్బులు వస్తే చెల్లిద్దామనుకున్నాను. కానీ చెల్లని చెక్కు రావడం ఇబ్బందిగా మారింది. అప్పులకు ఇప్పటికీ వడ్డీ కడుతున్నా. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఓ లెటర్తో ఆర్డీవో కార్యాలయంలో చెక్కు ఇచ్చా. కానీ నేటికి కొత్త చెక్కు రాలేదు. – పల్మటే అంబాబాయి, లేండిగూడ వారంలో వచ్చే అవకాశం చెక్కులను లబ్ధిదారులు ఆర్డీవో కార్యాలయంలో అందించా రు. వారంలో కొత్త చెక్కులు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సైతం లబ్ధిదారుల ఇబ్బందులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లా అధికారుల వద్ద ఆరా తీస్తున్నారు. – నాగార్జున, తహసీల్దార్, కెరమెరి -
1,05,800 మందికి నోటీసులు
ఆసిఫాబాద్: జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా 1,05,800 మందికి నోటీసుల జారీ చేయనున్నట్లు ఆర్డీవో లోకేశ్వర్రావు తెలిపారు. జిల్లాలో నోటీసుల జారీ, హియరింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లి నవారు, నకిలీ, డబుల్ ఓట్లను ఏరివేసేందుకు ఎస్ఐఆర్– 2026 ప్రక్రియ చేపట్టాం. తొలిదశలో గడపగడపకూ సర్వే చేపట్టి ఎన్యూమరేషన్ ఫారాలు అందించాం. గ్రామ సభలు నిర్వహించి ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాం. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని 684 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 4,07,457 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 84,930 మందిని అనామలిస్ ఓటర్లుగా గుర్తించాం. మొత్తం 1,05,800 మందికి నోటీసుల జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 14,960 మందికి నోటీసులు అందించాం. నోటీసులు జారీ చేసిన వారికి హియరింగ్ కండక్ట్ చేస్తున్నాం. బీఎల్వోల సమక్షంలో తహసీల్దార్లు హియరింగ్ చేస్తున్నారు. కొన్నిసారు గ్రామాలు, మరికొన్ని సార్లు తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వారికి ఒకేచోట ఓటుసరిహద్దు గ్రామాల్లోని ప్రజలు మహారాష్ట్రలోనూ ఓటుహక్కు కలిగి ఉన్నారు. ఇందులో దాదాపు 70 శాతం మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. వీరు మహారాష్ట్రలో కూడా నమోదైతే ఎన్నికల నిబంధనల ప్రకారం చివరగా ఏదో ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ధ్రువపత్రాలు అందించాలి2022కి ముందు ఓటరుగా ఉన్నవారు ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2002 తర్వాత ఓటరుగా నమోదై మ్యాపింగ్ కాని వారు ప్రభుత్వం నుంచి పొందిన భూమి, ఇల్లు ధ్రువపత్రాలు సమర్పిస్తే చాలు. అనామలిస్, అన్మ్యాప్డ్ ఓటర్లు మాత్రం తహసీల్దార్ నుంచి జారీ చేసిన కులం, నివాసంతోపాటు 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి అందించవచ్చు. విదేశాల్లో ఉన్న ఓటర్లను ఓవర్సీస్ సెక్టార్లు అంటారు. వారు వాళ్లకు సంబంధించిన వ్యక్తుల నుంచి ధ్రువీకరణ పత్రాలు సమర్పించవచ్చు. నోటీసులు పొందిన వారు ఏదైనా అనివార్య కారణాలు ఉంటే నోటీసు ఇచ్చిన ఐదు రోజులలోపు ఎవరైనా వచ్చి రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్కు ముందు రోజు కూడా ధ్రువపత్రాలు అందించవచ్చు. అందుబాటులో లేనివారు ఆన్లైన్లో కూడా డాక్యుమెంట్లు సమర్పించవచ్చు. ముసాయిదాలో పేరు లేకుంటే ఫామ్ 6తో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు తప్పుగా ఉన్నవారు ఫామ్ 8తో సవరించుకోవాలి. అక్టోబర్ 19న తప్పులు లేని తుదిఓటరు జాబితా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ఓటుహక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -
సీపీఎస్ రద్దు చేయాలని నిరసన
ఆసిఫాబాద్రూరల్: పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపా రు. టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశా రు. ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక భద్రతతో గౌరవప్రదమైన జీవితం గడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమర్ హుస్సేన్, నా యకులు కుమార్, భిక్షపతి, సంపత్, గురువయ్య, శ్రీనివాస్, కర్ణగౌడ్, సిరాజుల్ హక్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, పంటల కొనుగోళ్ల ద్వారా అండగా నిలిచిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఆర్థిక భారం తగ్గించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు కొత్త రేషన్ కార్డులు, రూ.500లకే గ్యాస్ కనెక్షన్ సిలిండర్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు జిల్లాలో కాకుండా, కేసీఆర్ ఫామ్హౌస్ ఎదుట నిరసనలు చేపట్టాలని హితవు పలికారు. సమావేశంలో ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, పార్టీ నాయకులు హర్షద్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. -
● ఉమ్మడి జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో జాప్యం ● పెద్దపల్లిలో 11శాతం, ఆదిలాబాద్లో 24.3శాతం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే అన్నింటా వెనుకబడినట్లే నిధులు వినియోగంలోనూ వెనుకబడింది. లోక్సభ సభ్యులకు ఎంపీ ల్యాడ్స్(లోకల్ ఏరియా డెవలప్మెంటు స్కీం) కింద ఏడాదికి రూ.5కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇందులో నూ ప్రతీ ఆరు నెలలకోసారి రెండు వాయిదాల్లో రూ.2.5 కోట్ల చొప్పున మంజూరు చేస్తారు. వీటిని తమ నియోజకవర్గాల్లో ఎంపీలు మౌలిక వసతులు విద్య, వైద్యారోగ్యం, రోడ్డు, రవాణా, ఆస్తుల కల్ప న తదితర అభివృద్ధి పనులకు ప్రతిపాదించవచ్చు. ఈ నిధులను నేరుగా ఎంపీలకే ఇవ్వకుండా జిల్లా అధికారులు, అందులోనూ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పూర్తి చేసే బాధ్యత సంబంధిత శాఖలకు అప్పగిస్తుంది. ఎంపీలు ప్రతిపాదించిన చోట్ల కనీసం రూ.25లక్షల పనులకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ జనాభా ఉన్న చోట్ల కనీసం 15శాతం, ఎస్టీలు ఉన్న చోట్ల 7.5శాతం చొప్పున మొత్తం నిధుల్లో ఖర్చు చేయాలి. గత రెండేళ్లలో విడుదలైన ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో రెండు లోక్సభ స్థానాలు ఆదిలాబాద్, పెద్దపల్లి పరిధిలో తక్కువ శాతం ఖర్చు చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ 11శాతమే ఖర్చు చేయగా, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 24.3శాతం ఖర్చు చేశారు. ఇద్దరు ప్రజాప్రతినిధులూ నిధుల ఖర్చులో వెనుకబడిపోయారు. ప్రతిపాదిత పనులు సకాలంలో పూర్తి కాక ఖర్చు పూర్తి స్థాయిలో జరగలేదు. పెండింగ్లోనే పనులు ఎంపీలు తమ లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనులు ప్రతిపాదించినప్పటికీ సకాలంలో పూర్తి కావడం లేదు. అధికంగా పెండింగ్లోనే ఉంటున్నాయి. పనుల పురోగతిని బట్టి నిధుల చెల్లింపులు జరుగుతాయి. క్షేత్రస్థాయిలో ఆశించిన మేర పనులు జరగకపోవడంతో చెల్లింపులు జరగడం లేదు. కొన్నిసార్లు సంబంధిత కాంట్రాక్టర్లు పను ల పూర్తిలో జాప్యం చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ పరిధిలో ఇప్పటి వరకు తొమ్మిది పనులే పూర్తి కాగా, మరో 62పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో మొత్తం 277పనులు ప్రతిపాదనలో ఉండగా, 197 వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 80పనులే పూర్తయ్యాయి. ఎంపీ నిధుల ఖర్చులో అధికంగా కుల, సామాజిక భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీరు(బోర్ వెల్స్), రోడ్లు, తదితర పనులకు కేటాయిస్తున్నారు.అంశం పెద్దపల్లి ఆదిలాబాద్ కేటాయింపు రూ.14.8కోట్లు రూ.14.7కోట్లు మొత్తం పనులు 71 277 పనులు పూర్తయినవి 9 80 ఖర్చు చేసింది రూ.1.6కోట్లు రూ.3.57కోట్లు ఖర్చు చేయాల్సింది రూ.13.2కోట్లు రూ.11.12కోట్లు పురోగతిలో ఉన్న పనులు 62 197 నిధుల ఖర్చు 11శాతం 24.3శాతం -
విషాద యాత్ర
భైంసా/కుభీర్: శ్రావణ సోమవారం సందర్భంగా నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(బి) గ్రామానికి చెందిన పది మంది తీర్థయాత్ర విషాదాంతమైంది. పుణ్యక్షేత్రంలో దైవదర్శనం చేసుకుని, పూజలు చేసి.. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న జీపు మహారాష్ట్రలో తోటంబా ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పార్డి(బి) గ్రామానికి చెందిన తూము సాయిలు(60), ఆవుల గంగన్న(63), తూము గౌరాబాయి(70)తోపాటు ఆవుల ప్రేమలబాయి, తూము ముత్తుబాయి, తూముల కిషన్, బ్యారపు మోనాజీ, దొర్లా శంకర్, పుష్ప భాయ్, దనగర్ మల్లయ్య, శంకర్ గ్రామానికే చెందిన తులసీరాం(27)జీపులో సోమవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్రలోని కై లాస్టెకిడి శివాలయ దర్శనానికి బయల్దేరారు. మధ్యాహ్నం వరకు అక్కడకు చేరుకుని పూజలు చేశారు. తిరుగు ప్రయాణంలో సాసర్ కుండ్ జలపాతం వద్దకు వెళ్లారు. తర్వాత స్వగ్రామానికి బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు కుభీర్, భైంసా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చెల్లాచెదురైన క్షతగాత్రులు.. ఘాట్ దిగుతుండగా జీపు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఎగిరి రో డ్డు పై పడ్డారు. జీపు టైరు ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు కొందరు చెబుతున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం భీతావాహంగా మా రింది. క్షతగాత్రుల రోదనలు విన్న సమీప గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం చేశారు. అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. కుటుంబాలకు సమాచారం అందించారు. చివరి ప్రయాణం..తూము సాయిలు(60)–భార్య ముత్తుబాయితో కలి సి యాత్రకు వెళ్లాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్లు జరిపించారు. మలి వయసులో కుటుంబంతో ప్రశాంతంగా జీవించాల్సిన దశలో ఆయన పుణ్య క్షేత్ర యాత్రలోనే మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో భార్య ముత్తుబాయి ప్రాణాలతో బయటపడింది. భర్తను కోల్పోయిన ఆమె ఏడుపు అక్కడున్న వా రిని కలచివేసింది. ఇక ఆవుల గంగన్న(63)–ప్రేమలబాయి దంపతులు కూడా యాత్రకు వెళ్లారు. ప్ర మాదంలో గంగన్న మృతి చెందాడు. ప్రేమలబా యి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరికి ము గ్గురు పిల్లలు. అందరికీ వివాహం చేశారు. వ్యవసా యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ప్ర మాదంలో మృతిచెందిన తూము గౌరాబాయి(70) భర్త మూడేళ్ల క్రితమే మరణించాడు. ఇద్దరు కుమారుల పెళ్లిళ్లు చేసి కుటుంబంతో కలిసి మలిదశ జీవనం సాగిస్తోంది. గ్రామస్తులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఆమెకు ఈ యాత్రే ఆఖరి ప్రయాణమైంది. తోటంబా ఘాట్ వద్ద క్షతగాత్రులుప్రమాదం జరిగిన ప్రాంతంఊరంతా విషాదంజీపులో ప్రయాణించిన వారంతా గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు తమ ప్రియమైన వారిని కోల్పోయి, మరికొందరు మంచానికే పరిమితమయ్యా రు. ప్రమాద వార్త అందుకున్న వెంటనే గ్రా మస్తులు, బంధువులు మహారాష్ట్రకు చేరుకుని మృతదేహాలను భైంసా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రిలో క్షతగాత్రులను ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ సాయికిరణ్, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరి స్టేటస్..గ్రామానికి చెందిన దాగాం సావిత్రిబాయి, గంగాధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహం జరిపించారు. కొడుకు తులసీరాంకు భైంసాకు చెందిన యువతితో గత వేసవిలో వివాహం చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే తులసీరాం డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో సాసర్ కుండ్కు వెళ్లాడు. భార్యతో కలిసి అక్కడ దిగిన ఫొటోను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. ఆ ఆనంద దృశ్యాలు చెరిగిపోకముందే విధి వెక్కిరించింది. సోమవారం గ్రామస్తులను జీపులో యాత్రకు తీసుకెళ్లిన తులసీరాంతిరుగు ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్టేటస్ పెట్టి 24 గంటలు కూడా గడవకముందే అతను లేడన్న విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భైంసా ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. -
పత్తికే ప్రాధాన్యం!
దహెగాం: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించారు. వరితో పోలిస్తే అత్యల్ప నీటితో పండించే పంటలను సాగు చేయాలని సలహాలు, సూచనలు అందించారు. దీంతో రైతులు ఆరుతడి పంటలైన ఆహారధాన్యాల సాగు వైపు మొగ్గు చూపారు. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు తగ్గి పత్తి సాగు పెరిగింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందువల్ల రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలవైపు దృష్టి సారించాలని సూచించడంతో రైతులు వరి సాగును తగ్గించారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 4,52,317 ఎకరాలుజిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో 4,52,317 ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉన్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అందులో ప్రధానంగా పత్తి, వరి సాగు అధికంగా ఉంది. సీజన్ ఆరంభంలో వర్షాలు కురియక పోవడంతో రైతులు ఆందోళన చెందారు. అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తి విత్తుకున్నారు. ప్రారంభంలో పత్తిలో ఎదుగుదల లోపించినా ఆగస్టులో కురిసిన వర్షాలు పంటలకు ప్రాణం పోసినట్లయింది. జూన్, జూలై మాసాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులు, చెరువుల్లోకి వరదనీరు చేరలేదు. దీంతో ఆయకట్టు కింద వరి సాగు ఆలస్యమైంది. ఆగస్టులో భారీ వర్షాలు కురువడంతో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో వరి సాగు పనులు ముమ్మరం చేశారు. తగ్గిన వరి సాగు..జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది 56 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేయగా ఈసారి 35,452 ఎకరాల్లో మాత్రమే సాగైనట్లు వ్యవసాయాధికారుల గణంకాలు చెబుతున్నాయి. గతేడాది పత్తి 3.35 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 3.77 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈ ఏడాది కంది, జొన్న సాగు సైతం తగ్గగా సోయాబీన్, పెసర, మినుముల సాగు పెరిగింది. ప్రధానంగా జిల్లాలో పత్తి సాగు అధికంగా పెరిగింది. వర్షపాతం సాధారణమే..ఇప్పటి వరకు జిల్లాలో 849.7 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉండగా 836.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వ్యత్సాసం – 2.0 సాధారణంగా ఉంది. కాగజ్నగర్లో –10.0, చింతలమానెపల్లిలో 20 లోటు, దహెగాంలో –10.0, కౌటాలలో – 14.0 వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గతేడాది ఆగస్టు 31 నాటికి 849.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 987.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.వరికి బదులు జొన్న.. వరి సాగు సమయం మించిపోయింది. రైతులు జొన్న సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఎకరాకు 20 క్వింటా ళ్ల దిగుబడి వస్తుంది. జొన్నకు గిట్టుబాటు ధర రూ.3,700 ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంతో వరి సాగు తగ్గి పత్తి సాగు పెరిగింది. – వెంకట్, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో ప్రాజెక్టులు నీటి నిల్వ (టీఎంసీల్లో)జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)మండలం సాధారణం కురిసింది వ్యత్యాసం జైనూర్ 897.9 873.7 –3.0 సిర్పూర్(యు) 884.2 844.6 –4.0 లింగాపూర్ 847.1 889.1 5.0 తిర్యాణి 738.7 832.3 13 రెబ్బెన 730.4 728.6 0.0 ఆసిఫాబాద్ 756.6 729.9 5.0 కెరమెరి 756.5 879.4 16.0 వాంకిడి 807.9 795.1 –2.0 కాగజ్నగర్ 773.0 694.0 –10.0 సిర్పూర్(టి) 885.3 813.4 –8.0 కౌటాల 928.2 801.4 –14.0 చింతలమానెపల్లి 926.7 745.4 –20.0 బెజ్జూర్ 985.0 1024.9 4.0 పెంచికల్పేట్ 905.5 999.6 10.0 దహెగాం 922.1 829.4 –10.0ప్రాజెక్టు నిల్వ ప్రస్తుతం సామర్థ్యం నీటి నిల్వ వట్టివాగు 2.89 2.721 కుమురంభీం 10.39 6.001 ఎన్టీఆర్ సాగర్ 0.37 0.37 జగన్నాథ్పూర్ 0.135 0.107 పీపీరావు 0.848 0.860 -
ముందస్తు అనుమతులు తప్పనిసరి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకొని విద్యుత్ శాఖ, అటవీ శాఖ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ ఆవరణలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడె, కాగజ్నగర్ ఎఫ్డీవో భార్గవ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వేరువేరు అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేని విద్యుత్ వైర్లు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. వీటికి సంబంధించి అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడె మాట్లాడుతూ జిల్లాలో అటవీ ప్రాంతం నుండి వెళ్లే విద్యుత్ వైర్లకు ప్రత్యేక తొడుగులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రెండు శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లేలా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. సమావేశంలో జిల్లాలోని 11 రేంజ్ కార్యాలయాల అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఈ ఏడాది 3 గంజాయి కేసులు నమోదు, గంజాయి సాగు చేసిన 36 మంది రైతులకు రైతుబంధు నిలిపివేసినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు లోకేశ్వర్ రావు, కిష్టయ్య, డీఎస్పీ అశోక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలిఆసిఫాబాద్: జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ వినయ్ కుమార్, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలిఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల హాజరుశాతం పెంచాలని కలెక్టర్ కె.హరిత అ న్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారితో కలిసి జిల్లాలోని ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, సీఆర్పీలకు జూమ్ మీటింగ్ నిర్వహించారు. విముక్తి జాతుల అభివృద్ధికి చర్యలుఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని విముక్తి జాతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయడంతో పాటు పిల్ల లకు విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నదీమ్, గిరిజన సంక్షేమాధికారి అంబాజి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా పరిధిలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతి లో నిర్వహించాలని పలువురు రైతులు, స భ్యులు సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార చట్టం ప్రకారం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉండగా, నామినేషన్ల పద్ధతి లో పాలకవర్గాలను ఏర్పాటు చేసే ప్ర యత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్య క్తం చే శారు. సహకార చట్టం 1964లోని నిబంధన ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, రై తులు, పాక్స్ సభ్యులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అలీబి న్ అహ్మద్, పెంటయ్య, శివాజీ, శ్రీనివాస్, తిరుపతి, శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
‘హస్త’వ్యస్తం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న పా ర్టీలో అంతర్గత కుమ్ములాటలు బయట పడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి జిల్లా నాయకుల వరకు వారి మధ్య ఐక్యత కొరవడుతోంది. నియోజకవర్గా ల్లో ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా గ్రూపు త గాదాలు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకు గానూ ఖానాపూర్, మంచి ర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్లో మాత్రమే అధికా ర పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా.. మిగతా చోట్ల ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరిన్ని శాసనసభ స్థానాలు గెలుచుకునేలా పనిచేయాల్సి ఉండగా .. గ్రూపు రాజకీయాలతో కేడర్లో అయోమయం నెలకొంది. గాంధీభవన్కు పంచాయితీలుజిల్లా నుంచి పార్టీ పంచాయితీలు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసేలా గాంధీభవన్ వరకు వె ళ్తున్నాయి. ఇటీవల ఉట్నూర్లో పార్టీ రాజకీ య వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ ముందే ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల ఆదిలాబా ద్ డీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించా లంటూ నరేశ్జాదవ్పై బోఽథ్ నియోజకవర్గ ఇన్చార్జి అడె గజేందర్ తన అనుచరులతో గాంధీ భవన్కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్ర ం సుగుణకు వ్యతిరేకంగా మాజీ డీసీసీ అఽధ్యక్షుడు విశ్వప్రసాద్ అనుచరులు గాంధీ భవన్ ముందే ధర్నా చేశారు. ఇక ఆసిఫాబాద్ ని యోజకవర్గ ఇన్చార్జి శ్యామ్నాయక్, మాజీ డీసీ సీ అధ్యక్షుడి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఖా నాపూర్లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మధ్య సఖ్యత లేదు.మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేమంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, చె న్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్ర ధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి వర్గాలుగా ఉన్నాయి. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గ పరి ధిలోనే మంతెన జగన్మోహన్రావు ఎ మ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ గ్రూపు కడుతున్నారు. అసంతృప్త కార్పొరేటర్లు, కౌన్సిల ర్లు, గ్రామ, మండల స్థాయి నాయకుల ను కూడగడుతున్నారు. ప్రేమ్సాగర్రా వు, మంత్రి వివేక్ వర్గాల మధ్య వైరం ముదురుతోంది. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన ను నిరసిస్తూ దండేపల్లి మండలం గూడె ంలో ఎమ్మెల్యే వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.సరిదిద్దేవారేరి?ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నా రు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. ఇక పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం తక్కువగానే ఉంటోంది. దీంతో ఎవరికి వారే అన్నట్లు సాగుతోంది. ఓ వైపు ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా వారికి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కడం లేదు. జిల్లా స్థాయిలో భర్తీ కావడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. పదేళ్ల తర్వాత అ ధికారంలోకి వచ్చినా జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు ఏం ఒరగడం లేదనే వి మర్శలు వస్తున్నాయి. వీటన్నింటిని చక్కబె ట్టి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే అధిష్టానం ఆశలకు క్షేత్రస్థాయి నాయకుల మధ్య అనైక్యత అడ్డంకిగా మారాయి. -
ఫాగింగ్ ఊసేది!
కాగజ్నగర్టౌన్: ఇటీవల కురిసిన వర్షాలతో దోమలు తీవ్ర వృద్ధి చెంది పట్టణాలపై దండయాత్ర చేస్తున్నాయి. అధికారులు, సిబ్బంది అలసత్వంతో నివారణ చర్యలు అటకెక్కాయి. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లోని మురుగు కాలువలు, ఖాళీ స్థలాలు, పాతటైర్లు, ఇతర నీటి నిల్వ కేంద్రాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ఏటా వానాకాలం సీజన్లో పారిశుద్ధ్య చర్యలతోపాటు దోమల నివారణకు రెండు, మూడు సార్లు ఫాగింగ్ చేయించేవారు. కానీ ఈసారి వానాకాలం ముగింపునకు వచ్చినా ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో దోమల సంతతి విపరీతంగా పెరిగింది. ఖాళీ స్థలాలే అడ్డాలురెండు మున్సిపాలిటీల్లోని ఆర్టీసీ డిపో, బస్టాండ్, మార్కెట్ ఏరియాల్లో పారిశుద్ధ్యం అంతంతే ఉంది. కాగజ్నగర్లోని ప్రధాన మురుగు కాలువకు ఆనుకుని ఉన్న కాలనీలు నౌగాం బస్తి, మార్కెట్ ఏరియా, ద్వారకానగర్, కౌసర్నగర్, కాపువాడ, సంజీవయ్య కాలనీ, సర్సిల్క్ కాలనీలోని డ్రెయినేజీల్లో మురుగు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. రోజుల తరబడి డ్రెయినేజీల్లో మురుగు నీరు నిల్వ ఉండటం, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగడంతో ఈగలు, దోమల బెడద తప్పడం లేదు. అలాగే ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్, ఈఎస్ఐ కాలనీ, గాంధీనగర్, బాలాజీనగర్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో ఖాళీ ఇళ్ల స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి నీటి కుంటలు ఏర్పడ్డాయి. ఇవి దోమలకు ఆవాసాలు మారుతున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. నివారణ చర్యలు చేపట్టాలి మురుగు కాలవల్లో దోమలు వృద్ధి చెంది ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టలేదు. సాయంత్రం 6 గంటలైతే చాలు విపరీతంగా దోమల బెడద ఉంది. కాలువల్లో ఆయిల్బాల్స్ వేయాలి. కాలనీల్లో ఫాగింగ్ చర్యలు చేపట్టాలి. – సత్యనారాయణ, ద్వారకానగర్, కాగజ్నగర్ యంత్రాలు కొనుగోలు చేశాం కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో గతేడాది ఫాగింగ్ యంత్రాల ద్వారా కాలనీల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాం. మరమ్మతుల కారణంగా యంత్రాలు మూలన పడ్డాయి. ప్రస్తుతం రెండు కొత్త ఫాగింగ్ యంత్రాలను కొనుగోలు చేశాం. త్వరలోనే ఫాగింగ్ చర్యలు చేపడుతాం. – శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్, కాగజ్నగర్పల్లెలోనూ అధ్వానంజిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో పాలకవర్గం కొలువుదీరినా పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ కార్యక్రమాలు అంతంతే సాగుతున్నాయి. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. అంతర్గత రోడ్లపై బురద, డ్రెయినేజీ మురుగునీటితో అధ్వానంగా మారాయి. కనీసం ఇళ్లవద్ద ఉన్న చెత్తను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లు, కూడా రావడం లేదని పల్లె జనం ఆరోపిస్తున్నారు. -
చేయూతకు నేడే ఆఖరు..!
కాగజ్నగర్టౌన్: చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించడంతో జిల్లావ్యాప్తంగా అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,455 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా వితంతువులు 4,682 మంది దరఖాస్తు చేసుకోగా, ఒంటరి మహిళలు 264 మంది, దివ్యాంగులు 1,415 మంది, చేనేత కార్మికులు 38 మంది, గీత కార్మికులు 55 మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధులు, బీడీ కార్మికులకు మాత్రం దరఖాస్తు అవకాశం కల్పించలేదు. ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు(కిడ్నీ ఫెయిల్యూర్), దివ్యాంగులు, (తలసేమియా, సికిల్సెల్, హీమో ఫీలియా బాధితులు) సరైన ధ్రుపత్రాలు సమర్పించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ఆఫీస్ల్లో.. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని అర్హులు వార్డు అధికారుల ద్వారా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. థర్డ్ పార్టీతో విచారణ..!చేయూత పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులపై థర్డ్ పార్టీ విచారణ చేయనున్నట్లు సమాచారం. ఆగస్టు 31లోగా వచ్చిన దరఖాస్తులను గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. అర్హత, కుటుంబ ఆర్థిక పరిస్థితి, భూమి వాహనాల ఏ మేరకు కలిగి ఉన్నారనే అంశాలను పరిశీలించనున్నారు. ఐదెకరాల లోపు భూమి ఉంటే అర్హతను పరిశీలించే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ద్వారా మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది. వృద్ధాప్య పింఛన్లు మాత్రం భర్త మరణిస్తే భార్యకు, భార్య మరణిస్తే భర్తకు పేర్లను ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్లో నమోదు చేస్తున్నారు. కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్డెస్క్లు జిల్లాలో చేయూత పింఛన్లకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలి. మున్సిపాలిటీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వైకల్య నిర్ధారణకు ప్రత్యేక సదరం శిబిరాలను ఏర్పాటు చేయించాం. నిబంధనల మేరకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. – రామకృష్ణ, డీపీఎంఇప్పటివరకు వచ్చిన కొత్త దరఖాస్తులు -
పులకించిన పట్నాపూర్
కెరమెరి: జైనూర్ మండలంలోని పట్నాపూర్ పులకించింది. స్థానిక సిద్ధేశ్వర సంస్థాన్ సద్గురు పూలాజీ బాబా కేంద్రం ఆదివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బాబా 102వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆయన లీలా గానంతో భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వేడుకలకు వేలాది మంది భక్తులతోపాటు ప్రముఖులు హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ కె.హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే సంభాజీ సర్కుండే తదితరులు హాజరై బాబాకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన సమాధిపై పూజలు చల్లి నైవేద్యం సమర్పించారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. అనేక కుటుంబాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఆయన ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆలయ నిర్మాణానికి రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బాబా ఆశీస్సులతో ఎదిగా.. పూలాజీబాబా ఆశీస్సులతో తాను ఎదిగానని, ఆయన చూపిన మార్గంలో నడిస్తే మంచే జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఆయన సేవలు ప్రశంసనీయమన్నారు. దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి ఆలయ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు అధికారులను, నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలతో సన్మా నం చేశారు. ఈ సందర్భంగా పూలాజీ బాబాపై రూపొందించిన సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇంగ్డె కేశవ్, సర్పంచ్ ఖందారే లక్ష్మి, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చా ర్జి అజ్మీరా శ్యాంనాయక్, నిర్మల్ బీజేపీ అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, ఏపీవో ఆత్రం భాస్కర్, డీడీ అంబాజీ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజల్లో మార్పు తెచ్చిన మహనీయుడు తన ప్రవచనాలతో ప్రజల్లో మార్పు తెచ్చిన మహనీయుడు సద్గురు పూలాజీబాబా అని కలెక్టర్ హరిత, ఐటీడీఏ పీవో మకరందు అన్నారు. వాంకిడి మండలాన్ని సందర్శించినప్పుడు ఆయన సేవలను తెలుసుకున్నామని చెప్పారు. ఆయన ఆధ్యాత్మిక సేవలు ఎంతో గొప్పవని, మద్యానికి బానిసైన కుటుంబాలను బాగుచేసి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. సిద్ధేశ్వర సంస్థానాలయానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. -
బాలికల క్రికెట్ ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ అపరేషన్ కమిటీ సెలక్టర్లు జి.రవికుమార్రెడ్డి, చీఫ్ కోఆర్డినేటర్ ఎం.రేవతి హాజరై పోటీలను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వివిధ వయసుల వారీగా ఆడించి, అందులో ప్రతిభను కనబర్చినవారిని ఎంపిక చేశారు. వీరికి హైదరాబాద్లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ కార్యదర్శి కోదాటి ప్రదీప్, సీనియర్ కోచ్ పోరండ్ల ప్రదీప్, మేనేజర్ కోలి వేణుమాధవ్, సీనియర్ క్రీడాకారుడు చందు తిరుపతి పాల్గొన్నారు. -
ముగిసిన అత్యపత్య పోటీలు
నిర్మల్టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలబాలికల అత్యపత్య–2026 పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నెల భూమన్న నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 44 జట్లు పాల్గొన్నాయి. సుమారు 600 మంది క్రీడాకారులు పోటీల్లో తలపడ్డారు. బాలుర విభాగం ఫైనల్లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు తలపడగా హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో నిర్మల్, నాగర్కర్నూల్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా నాగర్కర్నూల్ జట్టు విజేతగా నిలిచింది. నిర్మల్ జట్టు రన్నరప్గా నిలిచింది. విజేతలకు ఎన్ఆర్ఐ తడక చంద్రశేఖర్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ల క్ష్మణ్, నాయకులు పోశెట్టి, బ్రహ్మయ్య ట్రోఫీలు అందజేశారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నిర్మల్ వేదిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్, సాఫ్ట్బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు రవీందర్, శ్రీనివాస్, గంగాధర్, సురేష్, భూమేష్, కోచ్లు సాయిరాజు, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7పల్లెకు చేరని ‘108’ పెంచికల్పేట్ మండలంలోని మారుమూల గ్రామాలకు 108 అంబులెన్స్ సేవలు అందడం లేదు. అత్యవసర సమయాల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 8లోu ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అల్పపీడనం ప్రభావంలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. గూడులేని ‘గిరిజనులు’ కెరమెరి మండలం కెలిబి పంచాయతీలోని పీవీటీజీలు దుర్భర జీవనం గడుపుతున్నారు. పక్కా ఇళ్లు మంజూరు కాకపోవడంతో గుడిసెల్లో కాలం వెల్లదీస్తున్నారు. 8లోu సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
రేపు ‘చలో హైదరాబాద్’
కెరమెరి: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాశ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివా రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. ఉద్యోగులకు ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, 2003 డీఎస్సీ టీచర్లకు కూడా ఓపీఎస్ వర్తింపజేయాలన్నారు. మూ డేళ్లు గడుస్తున్న పీఆర్సీ ప్రకటించకపోవడం సరికాదన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, కేజీ బీవీ, ఎంఆర్సీ, సీఆర్సీల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఐటీడీఏ పరిధిలోని భాషా పండి ట్లు, పీడీల పోస్టులను అప్గ్రేడ్ చేయాలని కోరారు. జీవో నంబర్ 317 బాధిత ఉపాధ్యాయులకు ఉమ్మడి జిల్లాల వారీగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు నవీన్కుమార్, ప్రదీప్ మహార్షి, తిరుమల, రంజిత, శుభాంగి తదితరులు పాల్గొన్నారు. -
భీంరావు సేవలు చిరస్మరణీయం
ఆసిఫాబాద్అర్బన్: ఉమ్మడి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా కోట్నాక భీంరావు సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. దివంగత మంత్రి వ ర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పిల్లల పార్క్లో గల ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు. సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. భీంరావు విగ్రహానికి ఎమ్మెల్సీ దండె విఠల్, అదన పు కలెక్టర్ డేవిడ్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్, ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతి, అభివృద్ధికి కృషి చేసిన కోట్నాక భీంరావు ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సలాం, కార్తీక్, బాలకృష్ణ, ఆదివాసీ సంఘం నాయకులు అర్జు మాస్టర్, మడావి శ్రీనివాస్, బుర్స పోచయ్య తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన డ్రామా ఫెస్టివల్
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని డివిజనల్ సైన్స్ సెంటర్లో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ అలరించింది. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన వందమంది విద్యార్థులు హాజరై కృత్రిమ మేథస్సు– స్నేహితుడా సాధనమా, ముప్పా..?, ఎలక్ట్రిక్ వాహనాలు– భవిష్యత్తు వైపు ముందడుగు, అంతరిక్ష నివాసాలు, సముద్రాల పునరుద్ధరణ– భవిష్యత్ తరాల పరిరక్షణ అంశాల్లో ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నటన ప్రతిభను మాత్రమే కాకుండా శాసీ్త్రయ ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామాజిక బాధ్యత వంటి సామర్థ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. జెడ్పీహెచ్ఎస్ జన్కాపూర్ విద్యార్థులు సహస్ర, నైనిత, ప్రియాంక, అపీన్ సమీర్, వర్షిని, అంజలి, సంజన ప్రథమ బహుమతి పొందగా, స్మైల్ కిడ్స్ స్కూల్ విద్యార్థులు నిశాంత్, యసిక, భారతి, శఫియా, అద్వైత్, రెహమాన్, అఖిల్, ఆసిన్ ద్వితీయ బహుమతి, ఈడెన్ గార్డెన్ స్కూల్ విద్యార్థులు వెంకటేశ్, శ్రీవాస్తవ్, దీక్ష, రాంచరణ్, తన్వీర్, సాయిచరణ్, రాజేశ్, జగన్ తృతీయస్థానం సాధించారు. వ్యక్తిగత ప్రతిభా పురస్కారాల్లో వి.రాజేశ్(జెడ్పీహెచ్ఎస్ జన్కాపూర్), బెస్ట్ యాక్టర్ ఈ.మీనాక్షి(కేజీబీవీ, కౌటాల) బహుమతులు సాధించారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, జనార్దన్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, సైన్స్ టీచర్ మామిడాల తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్, లక్ష్మి ప్రసన్న, దేవాజీ తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ మేథస్సుపై డ్రామా ప్రదర్శిస్తున్న విద్యార్థులుభవిష్యత్ తరాల పరిరక్షణ అనే అంశంపై..అంతరిక్ష నివాసాలు అనే అంశంపై..


