breaking news
Kumuram Bheem District News
-
ప్రజావాణికి వినతుల వెల్లువ
పింఛన్ మంజూరు చేయాలి నేను పేదవాడిని. కళ్లు కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. భూమితో పాటు ఎలాంటి ఆస్తులు లేవు. కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – కంది బాపు, బారెగూడ, మం.బెజ్జూర్ ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతులు సమర్పించి సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం బూర్గుడ ఎస్సీ కాలనీకి చెందిన శిల్పారాణి దరఖాస్తు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కళాశాలలో చదువుకున్న తన కుమార్తె ధ్రువపత్రాలు ఇప్పించాలని పైకాజీనగర్కు చెందిన నైతం మోహన్ కోరాడు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ శివారులోని భూమికి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలని పెరుమాండ్ల వెంకటేశ్ అర్జీ అందించాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం గోవింద్పూర్కు చెందిన విలా స్, జన్కాపూర్కు చెందిన సమీనాబాగం దరఖాస్తు చేసుకున్నారు. కౌటాల మండలం కన్నెపల్లికి చెందిన మోర్ల పాండుమేర తన తండ్రి పేరుతో ఉన్న పట్టా భూమిని విరాసత్ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.వట్టివాగు కాలువకు మరమ్మతు చేయాలి వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువ డీ 4కు పది రోజుల క్రితం గండి పడింది. కాలువ కింద రెబ్బెన మండలంలో 8 వేల మంది వరి సాగు చేసుకున్నారు. మరికొంత మంది వేయాల్సి ఉంది. కాలువకు వెంటనే మరమ్మతు చేయాలి. – కార్నాథం సంజీవ్కుమార్, సింగిల్విండో చైర్మన్, రెబ్బెన సొంతిల్లు లేదు నేను నిరుపేదరాలిని. సొంతిల్లు లేదు. వర్షాకాలంలో ఇబ్బందులకు గురవుతున్నాను. గ్రామంలో ఇంటిస్థలం ఉంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – సింగరి పుల్లక్క, నంబాల, మం.రెబ్బెనఅక్రమంగా పట్టా మార్చిండ్రు వంశపారపర్యంగా నాకు సంక్రమించిన రెండుకరాల వ్యవసాయ భూమి ఉంది. తండ్రి పేరు నుంచి నా పేరుతో విరాసత్ చేయిస్తానని ఓ వ్యక్తి తప్పుడు సంతకాలు చేయించుకుని అక్రమంగా పట్టా మార్చుకున్నాడు. నా భూమి నాకు ఇప్పించాలి. – నంది రజిత, తక్కళ్లపల్లి, మం.రెబ్బెనసూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలి సమాచార హక్కు చట్టం కింద కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, జీతభత్యాలు, ఈఎస్ఐ, పీఎఫ్పై తప్పుడు సమాచారం ఇచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలి. – కార్తీక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
కుమురం భీం
9డ్రైవింగ్లో నో సెల్ డ్రైవర్లకు నో ఫోన్ నిబంధన అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. 11 డిపోల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించగా, ఉట్నూర్ డిపో పరిధిలో అమలు చేస్తున్నారు. 10లోu మంచం పట్టిన ‘తిర్యాణి’ ఏజెన్సీ మండలం తిర్యాణిలో ప్రజలు జ్వరాలతో వణికిపోతున్నారు. వైరల్ ఫీవర్తో పాటు టైఫాయిడ్, డెంగీ కేసులు నమోదవుతుండ డం కలవరపెడుతుంది. 11లోu ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు వివిధ కారణాలతో వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీసులకు ఫోన్లో సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పదోన్నతితో మరింత బాధ్యతపదోన్నతుల ద్వారా ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్నగర్ డీఎస్పీగా పనిచేస్తున్న బి.రామానుజం ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి పొందగా, సోమవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ బ్యాడ్జీ తొడిగి శుభాకాంక్షలు తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ కొనసాగింపుజిల్లాలో శాంతిభద్రతలు, ప్రశాంతతను పెంపొందించేందుకు జిల్లావ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 30 వరకు 30 పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించొద్దన్నారు. లౌడ్ స్పీకర్లు, డీజేలపై నిషేధం ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
టోకెన్లు సరే.. యూరియా ఏది?
కాగజ్నగర్టౌన్: జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు. నిత్యం ఏదో ప్రాంతంలో పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా కాగజ్నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వ్యవసాయాధికారులు, ఫర్టిలైజర్ డీలర్లతో కుమ్మకై ్క కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్లో బ్యాగుకు రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. టోకెన్లకే పరిమితంఆగస్టు 12, 16వ తేదీల్లో పలు గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఇప్పటివరకు వారికి యూరియా బస్తాలు మాత్రం పంపిణీ చేయలేదు. పీఏసీఎస్లో వారం రోజులుగా స్టాక్ లేదని, కార్యాలయానికి రావద్దని చెబుతున్నారు. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం నిల్వలు ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు, నాయకులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, పక్కదారి పడుతున్న ఎరువులపై నిఘా పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు. -
సమృద్ధిగా వాన
దహెగాం(సిర్పూర్): జిల్లావ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వర్షాకాలం సీజన్ ఆరంభంలో వరుణుడు జాడ లేక సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జూన్లో సరైన వర్షాలు కురువలేదు. ఇక జూలైలో మోస్తరు వానలే పడటంతో సాగు పనులకు ఆటంకం కలిగింది. ఆగస్టులో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు 1 వరకు జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 859.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,016.5 మిలీమీటర్లుగా నమోదైంది. సిర్పూర్(యూ), లింగాపూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, కాగజ్నగర్ మండలాల్లో కురువాల్సిన దానికంటే అధిక వర్షం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం దహెగాం మండలంలో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైంది. జలాశయాలు పూర్తిగా నిండటం, భూగర్భజలాలు పెరుగుతుండడంతో వానాకాలం, యాసంగి సాగుకు ఎలాంటి ఢోకా లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. నిండిన జలాశయాలుజిల్లావ్యాప్తంగా గడిచిన పదిహేను రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరద వస్తుంది. ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులు నిండుకుండలా మారాయి. జూలై వరకు భారీ వర్షాలు లేక వెలవెలబోయిన నీటి వనరులు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. సాగు నీటితోపాటు తాగునీటికి కీలకమైన కుమురంభీం(అడ), వట్టివాగు, చెలిమెల, బొక్కివాగు, పీపీరావు ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్నాయి. కుమురంభీం ప్రాజెక్టులో పూర్తిస్థాయి 10.393 టీఎంసీలు కాగా, ఆనకట్ట సక్రమంగా లేకపోవడంతో 5.688 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. జగన్నాథ్పూర్ ప్రాజెక్టులో నూ నీటిని నిల్వ చేసే అవకాశం లేదు. భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అలాగే జిల్లాలో 563 చెరువులు కూడా పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. పెద్దవాగు, ఎర్రవాగుతోపాటు ఇతర వాగులు, ప్రాణహిత, పెన్గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరినాట్లు పూర్తి..సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక వరిసాగుకు రైతులు సందిగ్ధంలో పడ్డారు. బోర్లు, బావులు ఉన్నవారు మాత్రమే ఆగస్టు మొదటి వారంలోగానే నాట్లు పూర్తిచేశారు. జూలై చివరివారం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో గతవారం వరకు వరినాట్లు పూర్తయ్యాయి. సుమారు 50 వేల ఎకరాల్లో వరి సాగు అవుతున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వర్షాలతో పత్తికి తెగుళ్లు సోకకుండా రైతులు క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. పూత, కాత దశలో పంట ఆశాజనకంగా ఉందని అన్నదాతలు చెబుతున్నారు. అయితే 15 రోజుల క్రితం భారీ వరదలతో పెద్దవాగు, ఎర్రవాగు ఉప్పొంగి పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే మొక్కలు వరద నుంచి కోలుకుంటున్నాయి.పీపీరావు ప్రాజెక్టు మత్తడి దూకుతున్న వరదజూన్ నుంచి సెప్టెంబర్ 1 వరకు వర్షపాతం(మి.మీ.లలో)మండలం కురువాల్సింది కురిసింది జైనూర్ 906.3 1012.8 సిర్పూర్(యూ) 892.9 868.6 లింగాపూర్ 855.7 1028.3 తిర్యాణి 747.6 939.3 రెబ్బెన 743.9 1218.7 ఆసిఫాబాద్ 764.5 1036.6 కెరమెరి 766.4 1079.6 వాంకిడి 820.4 1070.7 కాగజ్నగర్ 784.5 1121.2 సిర్పూర్(టి) 898.6 915.6 కౌటాల 939.2 1023.1 చింతలమానెపల్లి 937.6 1030.9 బెజ్జూర్ 993.9 1104.3 పెంచికల్పేట్ 915.0 915.0 దహెగాం 930.6 880.5 ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి నిల్వప్రాజెక్టు మొత్తం సామర్థ్యం ప్రస్తుత నీటినిల్వ ఇన్ఫ్లో ఔట్ఫ్లో కుమురంభీం 10.393 5.688 6,600 5,900వట్టివాగు 2.890 2.442 1,300 1,113ఎన్టీఆర్ సాగర్ 0.37 0.376 150 160పీపీరావు 0.848 0.848 750 750జగన్నాథ్పూర్ 0.135 0.010 8,830 8,830 -
68శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఆగస్టులో వర్షాల కారణంగా బెల్లంపల్లి ఏరియాలో 68 శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించగలిగామని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆగస్టులో ఏరియాకు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 1.36 లక్షల టన్నులు మాత్రమే సాధించి 68 శాతం నమోదు చేసినట్లు తెలిపారు. గత నెలలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ఖైరిగూర ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోందని, వర్షాలతో ఓసీపీలో ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయామని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే కోల్పోయిన ఉత్పత్తిని సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియా 11.76 లక్షల ఉత్పాదకతతో 90శాతంతో ముందుకు సాగుతోందన్నారు. -
నష్టాలపై నివేదిక సమర్పించాలి
ఆసిఫాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో జరిగిన నష్టాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ ఆగస్టులో భారీ వర్షాలతో జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టాలపై పూర్తి నివేదికలతో స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ రంగం, విద్యుత్, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, మున్సిపల్, జాతీయ రహదారుల శాఖల పరిధిలో జరిగిన నష్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో జిల్లాలో 3 మరణాలు, 46 నివాస గృహాలు దెబ్బతిన్నాయని, 50 మేకలు మృతి చెందడంతోపాటు 15,003 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. 20 పాఠశాలలు, 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, కల్వర్టులు, రహదారులకు నష్టం జరిగిందన్నారు. వరద నష్టాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక సమర్పిస్తామన్నారు. జీవో 91 ప్రకారం పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు
ఆసిఫాబాద్అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం లభించే పెన్షన్ భిక్ష కాదని, అది వారి హక్కు అని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు లింగాల రాజశేఖర్ అన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును విస్మరించి కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించకుండా సీపీఎస్కు మొగ్గుచూపిందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారుగా 1,40,000 మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు సామాజిక భద్రతపై ఆందోళన చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఇప్పటికీ పాతన పెన్షన్ విధానమే అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి డీఎంహెచ్వో సీతారాం మద్దతు ప్రకటించారు. నిరసనలో జేఏసీ నాయకులు శాంతికుమారి, పెండ్యాల సదాశివ్, హేమంత్ షిండే, ఊశన్న, ఉమర్ హుస్సేన్, శ్రీనివాస్రావు, తుకారాం, ఖమర్ హుస్సేన్, భాగ్యలక్ష్మి, కలెక్టరేట్ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పీఆర్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక
కాగజ్నగర్టౌన్: పీఆర్టీయూ జిల్లా కార్యవర్గాన్ని కాగజ్నగర్ పట్టణంలోని క్విన్స్ గార్డెన్లో రాష్ట్ర కార్యదర్శి మామిడాల తిరుపతయ్య, సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్సుందర్, జి ల్లా ప్రధాన కార్యదర్శిగా మడిమడుగుల తిరుపతి, జిల్లా గౌరవ అధ్యక్షులుగా పార్వతి రాజేశ్వర్రావు, జిల్లా ఉపాధ్యక్షులుగా వేణు, షబ్బీ ర్, సత్యనారాయణ రాజు, రాజేశ్, పూర్ణిమ, రజియా సుల్తానా, జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా చిలుకూరి రవీందర్, శ్రీనివాస్, శారద, చంద్రకళ, జిల్లా సెక్రెటరీలుగా సురేశ్, సుమిత్ర, ఉమారాణి, సుప్రియ అరుణకుమారిని ఎన్నుకున్నారు. ఎన్నికల్లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కటకం మధుకర్, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు. -
సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
ఆసిఫాబాద్రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూ నియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. కార్మిక చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి రద్దు చేసి కార్మికుల హక్కుల నాశనం చేసిందని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు సురేశ్, చిరంజీవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కొట్లాడితేనే కొత్త గనులు
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికవర్గం కొట్లాడితేనే కొత్త గనులు వస్తాయని.. అప్పుడే సంస్థకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హెచ్ఎంఎస్ నేత, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి తెలిపారు. రెండు రోజులుగా నస్పూర్ పట్టణంలోని గోదావరి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ 26వ ద్వైపాక్షిక మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల పక్షాన పోరాడి సొంతింటి పథకం సాధించాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన వార్షిక లాభాలు నుంచి 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఈసారి 10 శాతం వాటా చెల్లించాలన్నారు. బొగ్గు గనుల వేలంతో సింగరేణి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలం నిలిపివేసి తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పెర్క్స్పై ఆదాయ పన్ను సింగరేణి యాజమాన్యమే చెల్లించాలన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని దీనిని రూపుమాపాలన్నారు. మారుపేర్ల సమస్య పరిష్కరించాలన్నారు. యూనియన్ పేరు మార్పు.. ఇప్పటివరకు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్గా ఉన్న పేరును ఇక నుంచి అఖిల భారత మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్గా మార్చుతున్నట్లు ఆ యూనియన్ మాతృ సంఘం హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. యూనియన్ను మరింత బలోపేతం చేయడానికి ఈ మార్పు దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. గౌరవ అధ్యక్షురాలుగా కవిత.. మహాసభల్లో భాగంగా యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇకపై ఆమె యూనియన్ గౌరవ ప్రదమైన స్థానంలో కొనసాగుతారన్నారు. అంత కుముందు ఇందారం చౌరస్తా నుంచి మహాసభల వేదిక వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ జెండా ఆవిష్కరించిన అనంతరం మహాసభలు కొనసాగించారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, నా యకులు జమీల్, యూనియన్ కేంద్ర అధ్యక్షుడు సారయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి, మందమర్రి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బెల్లంపల్లి ఉపాధ్యక్షుడు రాజబాబు, శ్రీరాంపూర్ డివిజన్ నాయకులు అశోక్, సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్, సందీప్ పాల్గొన్నారు. -
పాన్ ఇండియా సంస్థగా సింగరేణి
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు కేటాయించకుంటే సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సంస్థ సీఅండ్ఎండీ బలరాంనాయక్ అన్నారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న సింగరేణి ప్రస్తుతం పాన్ ఇండియా సంస్థగా మారిందని తెలిపారు. సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవాల బ హుమతి ప్రదానోత్సవం కార్యక్రమం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో ఆది వారం నిర్వహించారు. కార్యక్రమానికి డీజీఎంఎస్ ఉజ్వల్థాతో కలిసి సీఎండీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణాతోపాటు ఒడిశా, రాజస్తాన్ తది తర రాష్ట్రాలకు సింగరేణి విస్తరించిందని తెలిపారు. విదేశాల్లోనూ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థ స మగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే గని కార్మి కుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్ సకాలంలో అందేలా చూస్తామన్నారు. ఉత్పత్తి కన్నా సంస్థకు కార్మికుల ప్రాణాలు ముఖ్యమని తెలిపారు. రక్షణ విషయంలో రాజీపడకుండా ఉండాలని సూచించారు. కొన్ని కారణాలతో బొగ్గు గనుల వేలంలో ఇప్పటివరకు పాల్గొనలేకపోయామని, ఇకపై వేలంలో పాల్గొంటామని చెప్పారు. ప్రమాద రహిత సంస్థగా తీర్చిదిద్దాలి..సింగరేణిని పూర్తిగా ప్రమాదరహిత సంస్థగా తీర్చి దిద్దాలని డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా అన్నారు. సేఫ్టీ విషయంలో నూతన సాంకేతికత అందిపుచ్చుకోవాలన్నారు. మైనింగ్ రంగంలోకి మ హిళా ఉద్యోగులు రావడం శుభసూచకమని పేర్కొన్నారు. ఎక్కువ శాతం ప్రమాదాలు పనిలో అప్రమత్తంగా లేని కారణంగానే జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రక్షణ త్రైపాక్షిక సమావేశం..సింగరేణిస్థాయి 49వ రక్షణ త్రైపాక్షిక సమావేశం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఇందులో సింగరేణిలోని అన్ని ఏరియాల జీఎంలు, డైరెక్టర్లు, సేప్టీ అధికారులు పాల్గొన్నారు. రక్షణ విషయంలో రాజీ పడొద్దని డీజీఎంఎస్ సూచించారు. మరోవైపు మారుపేర్లు క్రమబద్ధీకరించాలని ఎంఎన్ఆర్ గార్డెన్ వద్ద బాధితులు నిరసన తెలిపారు. సీఎండీ బలరాంనాయక్ స్పందిస్తూ ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేప్టీ కన్నణ్, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతం, గుర్తింపు సంఘం అధ్యక్షుడు సీతారా మయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ప్రసాద్, జీఎం సేఫ్టీ కార్పొరేట్ చింతల శ్రీనివాస్, సీఎంవోఏఐ అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కుంటుపడుతున్న మున్సిపాలిటీల అభివృద్ధి
కాగజ్నగర్టౌన్: నిధులు మంజూరు కాకపోవడంతో మున్సిపాలిటీల అభివృద్ధి కుంటుపడుతుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం మున్సిపాలిటీ బిల్లుపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా కాగజ్నగర్ మున్సిపాలిటీకి రూ.22 కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నిధులు లేమితో బల్దియాలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, కనీసం డ్రెయినేజీలు, సీసీ రోడ్లకు మరమ్మతులు చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే శానిటేషన్ వర్కర్లకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ఆసిఫాబాద్రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిని కించపరిచేలా మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ఆదివారం బీజేపీ నాయకులు దహనం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ బీజేపీని నేరుగా ఎదుర్కొనలేక రాహుల్గాంధీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధానికి వెంటనే క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, మల్లికార్జున్, పెంటు, విజయ్, ప్రహ్లాద్, మురళీగౌడ్, రేణుక, రాము, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో అల్పాహారం
తిర్యాణి: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒకపూట సంపూర్ణ పోషకాహారం అందిస్తోంది. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తోంది. కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. కేంద్రాల్లో మరో కొత్త పథకం అమలుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఒకపూట (మధ్యాహ్నం) మాత్రమే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుండగా అదనంగా ఉదయం పూట అల్పాహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వా రం క్రితం మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్లో సంబంధిత శాఖ అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగ ర పరిధిలోని 139 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. అక్కడ మెరుగైన ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏజెన్సీల్లో ఎంతో ఉపయోగంజిల్లాలోని ఐదు ఐసీడీఎస్ సెక్టార్ల పరిధిలో 973 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 3–6 ఏళ్ల లోపు 22,817 మంది చిన్నారులు ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. కాగా, చిన్నారుల హాజ రు పూర్తి స్థాయిలో నమోదు కావడం లేదు. హాజరుశాతం సగటున 72 శాతం నమోదవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. నూ తనంగా అందించనున్న అల్పాహారం ద్వారా చిన్నారులు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపే అవకాశముంది. తద్వారా హాజరు శాతం పెరగడంతో పా టుగా వారి శారీరక పెరుగుదల (ఆరోగ్యం) కూడా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ పథకం జిల్లాలోని వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులకు ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. జిల్లాలో 973 కేంద్రాలుండగా 352 కేంద్రాలకే సొంత భవనాలున్నాయి. 296 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా 325 కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ఒక్కోదానికి రూ.12లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు. ఇంకా ఉత్తర్వులు అందలేదు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించే విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ప్రస్తుతం హైదరాబాద్లోని కొన్ని కేంద్రాల్లో ప్రభుత్వం ప్ర యోగాత్మకంగా పథకం నిర్వహిస్తోంది. జిల్లాలో నూ అమలైతే ఎంతో బాగుంటుంది. – భాస్కర్, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి -
సత్ప్రవర్తనతో మెలగాలి
ఆసిఫాబాద్అర్బన్: వివిధ కారణాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్జైలులో న్యాయ విజ్ఞాన సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. క్షణికావేశంలో అనాలోచితంగా చే సిన తప్పులకు జీవితాంతం బాధపడాల్సి వ స్తుందని, అందుకే ఆవేశపూరితంగా తప్పులు చేయకూడదని సూచించారు. అనంతరం జైలులోని వంట గదిని పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. సబ్ జైలు సూపరింటెండెంట్ ప్రేమ్కుమార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
పెంచికల్పేట్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శనివారం పెంచికల్పేట్ గ్రామంలో పర్యటించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తంజేశా రు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంత రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయించి లబ్ధిదారుల కు సకాలంలో బిల్లులు అందించేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ భవనం, పాఠశాలలో మూత్రశాలలు, కిచె న్ షెడ్, డ్రైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చే యాలని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ను ఈ సందర్భంగా కోరారు. త్వరగా కూలి చెల్లించేలా చూడాలని ఉపాధిహామీ కూలీలు ఆయనకు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంపీడీవో అల్బర్ట్, ఏఈ సందీప్, హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయురాలు ప్రియాంక తదితరులున్నారు. విద్యార్థుల హాజరుశాతం పెంచాలిదహెగాం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజ రుశాతం పెంచాలని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. హాజరు రిజిష్టర్లు పరిశీలించి పలువురు పదో తరగతి విద్యార్థులు దీర్ఘకాలికంగా ఎందుకు గైర్హాజరవుతున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతిరో జూ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి డిజిటల్ తరగతులను వీక్షించారు. బోధన తీరును విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. వంట గదుల కోసం ప్రతిపాదనలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేందర్, ఎంఈవో శ్రీనివాస్ ఉన్నారు. -
నిషేధిత గడ్డి మందు పట్టివేత
వాంకిడి: మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గడ్డి మందును పోలీసులు శ నివారం రాత్రి పట్టుకున్నారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో మండలంలోని ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద వ్యవసాయాధికారులతో కలిసి వాహనాల త నిఖీ చేపట్టారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చి న కారు తనిఖీ చేయగా హైజాక్, రౌండప్, క్లింటన్ పేర్లతోగల 243 లీటర్ల నిషేధిత ద్రావణపు గడ్డి మందు, టాపర్ పేరిట గల 120కి లోల పొడి గడ్డిమందు లభ్యం కాగా, విలువ రూ.1,48,390 ఉంటుంది. గడ్డిమందు తరలి స్తున్న ఇద్దరిరిని, కారును అదుపులోకి తీసుకు ని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్
కాగజ్నగర్ టౌన్: సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃరుద్ధరించాలని టీజీ ఈజేఏసీ జిల్లా చైర్మన్ జయదేవ్ అబ్రహం డిమాండ్ చేశారు. శనివా రం కాగజ్నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ వి ద్రోహ దినం, పాత పెన్షన్ సాధన పోరాట సభ పో స్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక పిలుపు మేరకు సెప్టెంబర్ 1న కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో పెన్షన్ సాధన పో రాట సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరా రు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునఃరుద్ధరణ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రావు, శాంతికుమారి, శివప్రసాద్, న ర్సయ్య, లింగమ్మ, నర్సయ్య, మురళీధర్రావు, పు రుషోత్తం, రాజ్కమలాకర్రెడ్డి, మహిపాల్, మహే శ్, ఉదయ్కుమార్, విస్తారు పాల్గొన్నారు. ‘రద్దు చేసేదాకా పోరాడుతాం’రెబ్బెన: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుకు వి ఘాతంగా మారిన సీపీఎస్ను రద్దు చేసే వరకు పోరాడుతామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజ శేఖర్ తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహించాలని తెలిపా రు. కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు జి ల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్య లో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సంఘం నాయకులు మేడి చరణ్దాస్, దూడ రాజనర్సుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వందేభారత్కు హాల్టింగ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సికింద్రాబాద్–నాగ్పూ ర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఎట్టకేలకు మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లలో నిలుపుదలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. ఏడాదిగా మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్తోపాటు బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలోనూ హాల్టింగ్ ఇవ్వాలని కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వాసులు వినతిపత్రాలు ఇస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి, ఆదిలాబా ద్ ఎంపీలు, సిర్పూర్ ఎమ్మెల్యేతో సహా బీజేపీ నా యకులు, స్థానిక నాయకులు, ఉత్తర తెలంగాణ రై ల్వే ఫోరం ప్రతినిధులు అనేకసార్లు ఉన్నతాధికారులను కలిసి హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. ఇక్కడి ప్ర యాణికుల డిమాండ్లపై ‘సాక్షి’లోనూ పలుసార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో మంచిర్యాల, కాగజ్నగర్లో నిలుపుదలకు రైల్వే బోర్డు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ప్రయోగాత్మకంగా హాల్టింగ్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండు స్టేషన్లలోని టికెట్ల ఆదాయం పరి గణనలోకి తీసుకుని పొడిగింపు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇంకా ఏ రోజు నుంచి రైలును ని లుపుదల చేస్తారనే తేదీని ప్రకటించలేదు. కొద్ది రో జుల్లోనే రైలును నిలిపే అవకాశాలున్నాయి. రైలు ఆగక, ఆదాయం లేక..భారత రైల్వేలో ఆధునిక వసతులు, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న వందేభారత్ రైళ్లు ఎంపిక చేసిన మార్గాల్లో నడుస్తున్నాయి. గతేడాది సె ప్టెంబర్ 16న సికింద్రాబాద్–నాగ్పూర్ మధ్య అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్, కాజిపేట, రామగుండం స్టాప్లు ఇచ్చి తర్వాత నేరుగా మహా రాష్ట్రలో బల్లార్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్పూర్కు చేరుకుంటుంది. మొదట ఆరెంజ్ రంగులో 20కోచ్లతో నడిచింది. ఈ మార్గంలో ప్రయాణికు ల ఆదరణ లేక ఆదాయం తగ్గిపోయింది. ఈ రైలు మొత్తం సీట్లలో 40శాతంలోపే ప్రయాణికులతో న డుస్తోంది. దీంతో 8కోచ్లకు కుదించి రైలును తెల్ల రంగులోకి మార్చారు. మరోవైపు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 8 స్టేషన్ల పరిధిలో ఎక్కడా స్టాప్లు ఇవ్వకపోవడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర నిరాశ కు గురయ్యారు. తాజా ఉత్తర్వులతో ఈ రెండు జి ల్లాల నుంచి ఉదయం పూట వెళ్లే మార్గంలో కాజి పేట, సికింద్రాబాద్ వరకు వెళ్లొచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో సాయంత్రం నాగ్పూర్ వైపు సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, కాగజ్నగర్తోపాటు బల్లార్షా, చంద్రాపూర్, నాగ్పూర్ వరకు ఈ రెండు జిల్లాల ప్రయాణికులకు వీలు కలుగుతుంది. సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు వేగంగా వెళ్లే అవకాశం ఉండడంతో వందేభారత్ రైలును ఈ రెండు స్టేషన్లలో ఆపాలనే డిమాండ్లు వచ్చాయి. ఫలించిన వినతులుసికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ మధ్య నడిచే గోరఖ్పూర్, తెలంగాణ, హజ్రత్ నిజాముద్దీన్, జమ్ముతావి, దానాపూర్, సూపర్ ఫాస్ట్తోపాటు పలు రైళ్లు అరగంట అటు ఇటుగా అన్నీ 7గంటల నుంచి 8గంటల మధ్య ప్రయాణ సమయం పడుతోంది. ఇదే త రహాలో వందేభారత్ ఏడున్నర గంటలు పడుతోంది. అయితే మంచిర్యాల, బెల్లంపల్లి తదితర చోట్ల స్టాప్లు లేకపోగా, ప్రయాణికులతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రెళ్లు కిక్కిరిసి ఉంటున్నా యి. రిజర్వేషన్లు కూడా దొరకని పరిస్థితి. వందేభారత్కు టికెట్ ధర అధికం కావడం, సౌకర్యాలు అధికంగా ఉండడం, స్టాప్లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు సుఖవంతంగా ప్రయాణం ఉంటుంది. దీంతో వందేభారత్ రైలు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ప్రయాణికుల వినతుల మేరకు రైల్వే శాఖ ఆమోదం లభించింది. సాక్షిలో ప్రచురించిన కథనం -
పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నిర్మల్చైన్గేట్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ వి.ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్ను శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1న ఐడీవోసీ కా ర్యాలయంలో ని ర్వహించే సభను విజయవంతం చేయాలని కో రారు. 2004 సెప్టెంబర్1 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్న భోజన విరామంలో ప్రభుత్వ ఉ ద్యోగులు కలెక్టరేట్లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, గెజిటెడ్ ఉ ద్యోగుల సంఘం కార్యదర్శి రమేశ్, ఉ పాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు మురళీమనోహర్రెడ్డి, జుట్టు గజేందర్, రవికాంత్, భూమన్న యాదవ్, లక్ష్మణ్, అశోక్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు రవి, గణేశ్ పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలి
జైపూర్: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రి య నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి సంస్థ సిబ్బంది, పరిపాలన, సంక్షేమ విభాగ డైరెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ ప్రాణహిత అతిథి గృహంలో శనివారం మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్లు, ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ భూయాజమానులు, సింగరేణి సంస్థ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూసేకరణ ప్రకియ నిర్వహించాలన్నారు. నీటమునిగిన శ్మశానవాటికఖానాపూర్: పట్టణంలోని గోదావరితీరంలో మున్సిపల్ నూతన కార్యవర్గం ఏర్పటయ్యాక రూ.50 లక్షలతో నిర్మించిన శ్మశనవాటిక ఏటా వర్షాకాలంలో నీట మునుగుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఏటా వరదలు తగ్గాక మరమ్మతు చేయడం పరిపాటిగా మారింది. శనివారం పట్టణంలోని 5వ వార్డులో ద్యావతి గంగాధర్(55) అనారో గ్యంతో మృతి చెందాడు. గోదావరి తీరంలో గల శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి ఉండగా ఉండగా కుటుంబ సభ్యులు అత్యంత దూరభారమైనప్పటికీ గాంధీనగర్ శివారులోని తర్లపాడ్ వెళ్లే రహదారి వరకు తీసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పటికై నా శ్మశానవాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. మరమ్మతుల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు ఆదిలాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు పట్టాలను సరిచేస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ డివిజన్ పరిధిలోని భిక్కనూరు–తల్మాడ సెక్షన్, అక్కన్నపేట–మెదక్ సెక్షన్లో రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహించడంతో అక్కడ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తిరుపతి–ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ను శనివారం చర్లపల్లి–ఆదిలాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. పర్లి–ఆదిలాబాద్ మధ్య నడిచే 77615 రైలు సర్వీస్, ఆదిలాబాద్–పూర్ణ మధ్య నడిచే 77616 రైల్ సర్వీసులు సెప్టెంబర్ 1న రద్దు చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గమనించాలని సూచించారు. -
‘నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలి’
మంచిర్యాలఅర్బన్: నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం మార్క్స్భవన్లో పీడీఎస్యూ రాష్ట్ర విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన పురాణాలపై ఆధారపడి నూతన జాతీయ విద్యావిధానాన్ని రాసినట్లు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం వర్ణ వ్యవస్థ ఆధారిత విద్యను అమలు పరిచేందుకు ఉవ్విళ్లూరుతోందని ఆరోపించారు. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశ జీడీపీలో 2.5 శాతం మాత్రమే విద్యకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి మాటమార్చిందన్నారు. అంతకుముందు పీడీఎస్యూ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్ ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగరాజు, తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత, ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లాల్కుమార్, పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మధు, రాజేశ్వర్, కిరణ్, సహాయ కార్యదర్శులు గౌతమ్కుమార్, మస్తాన్, నవీన్, అజయ్, తిరుపతి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి చరణ్, డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు
జైనూర్: సద్గురు పూలాజీబాబా తన హితబోధనలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం మండలంలోని పట్నాపూర్లోని సిద్ధేశ్వర సంస్థాన్లో పూలాజీబాబా 101వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఆధ్మాత్మిక మార్గం వైపు నడిపించిన ఘనత బాబాకే దక్కుతుందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాలు బాబా చూపిన మార్గంలో నడుస్తున్నాయన్నారు. అనంతరం మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే రచించిన బాబా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిన్వట్ ఎమ్మెల్యే భీంరావ్ కేరామ్, మహారాష్ట్ర మాజీమంత్రి శివాజీరావు, మాజీ ఎమ్మెల్యే ఉత్తంరావు ఇంగ్లే, మహారాష్ట్ర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాందాస్, ఆసిఫాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్, ఆదిలాబాద్ గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ఆదిలాబాద్ డీఎస్పీ రఘునాథ్, రెవెన్యూ జిల్లా అధికారి లోకేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్సీ ఆడే శేషేరావు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల హ్యాండ్బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. బాలికల జట్టులో గంగుబాయి, మౌనిక, వైష్ణవి, పార్వతి, జయశ్రీ, సహస్ర మోక్షిత, బాలుర జట్టులో సాత్విక్, రుత్విక్వర్మ, జాషువా, ప్రణయ్, వంశీ, పార్థు ఎంపికై నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పీఈటీ రాధారాణి, సీనియర్ క్రీడాకారులు ప్రణయ్, సంజయ్, రఘు, వర్మ, అమూల్య, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు శనివారం ముగిసాయి. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ సైతం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాల నుంచి 513 అభ్యంతరాలు వచ్చాయి. ఓటరు పోలింగ్ కేంద్రాలు, వార్డు మార్పు, తప్పిపోయిన ఓటరుకు సంబంధించి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. జన్నారం మండలంలో 23, దండేపల్లిలో 104, లక్సెట్టిపేటలో 30, హాజీపూర్లో 12, జైపూర్లో 88, భీమారంలో 58, చెన్నూర్లో 2, కోటపల్లిలో 3, వేమనపల్లిలో 1, మందమర్రిలో 18, కాసిపేటలో 93, బెల్లంపల్లిలో 27, తాండూర్లో 42, భీమినిలో 5, నెన్నెలలో 7, కన్నెపల్లిలో 2 అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. కాగా, శనివారం హాజీపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్రావు దేశ్పాండే సమావేశం అయ్యారు. -
జ్వరంతో బాలుడు మృతి
తిర్యాణి: జ్వరంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గిన్నెదరి గ్రామానికి చెందిన ఆడ రాము కుమారుడు సీతారాం(15) పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సీహెచ్సీలో చికిత్స అందించినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే మండలంలోని ఇద్దరు పిల్లలు జ్వరంతో చనిపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. -
మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కైలాస్నగర్: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమాయక ప్రజలను అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదయ్యేందుకు రూ.1,21,000 చెల్లించాలని ఇద్దరికి ఆశచూపి మోసం చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇంకా ఈ అప్లికేషన్ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చన్నారు. -
ఆలోచన.. ఆవిష్కరణ
కాగజ్నగర్టౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు జ్ఞాన విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని శ్రీ సరస్వతి శిశుమందిర్ మంచిర్యాల జిల్లా విభాగ్ కార్యదర్శి దహెగాం గోవింద్రావు అన్నారు. శనివారం కాగజ్నగర్లోని ఆదర్శనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి గణిత జ్ఞాన విజ్ఞాన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు కొత్త ప్ర యోగాలు, ఆవిష్కరణలకు ఊతమిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర సాంకేతిక ప్రతిభను వెలికితీయడంలో గణిత జ్ఞాన విజ్ఞాన మేళాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం, విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను తిలకించి పలువురిని ఆలోచింపజేసేలా ఉన్నాయని ప్రశంసించారు. మేళాలో మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, పెద్దపల్లి నుంచి శిశువర్గ, బాలవర్గ, కిశోరవర్గల నుంచి విద్యార్థులు 236 మంది హాజరై ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని సరస్వ తీ శిశు మందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి విజ్ఞాన మేళాకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్రావు తెలిపా రు. శనివారం కాగజ్నగర్లో నిర్వహించిన జి ల్లా స్థాయి విజ్ఞాన మేళాలో శార్వాణి, వెంకట రత్న, చరణ్, సాకేత్, హరిచరణ్, దివ్య, జ శ్వంత్, నిహారిక, విక్రమ్, శ్రీనిధి ఉత్తమ ప్రతి భ కనబరిచి బహుమతులు అందుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యా ర్థులు సెప్టెంబర్ 3నుంచి 5వ తేదీ వరకు కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాలో పాల్గొంటారని వివరించారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికా రులు చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం సబ్ కలెక్టర్ శ్రద్ధాశు క్లా ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. అయినప్పటికీ అనుమతి లేకుండా ట్రాక్టర్ల యజమానులు యథావిధిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులకు బడా నాయకుల అండదండలు ఉండడంతో యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతోందనే ఆరోపణలు న్నా యి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసు క అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. -
ధ్యాన్చంద్ సేవలు వెలకట్టలేనివి
ఆసిఫాబాద్రూరల్/ఆసిఫాబాద్అర్బన్: క్రీడారంగంలో హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా క్రీడా యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధ్యాన్చంద్ క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లాలో గిరిజన క్రీడాపాఠశాల ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా యువజన సేవల శాఖ ఇన్చార్జి అధికారి రమాదేవి, డీడబ్ల్యూవో భాస్కర్, ఏసీఎంవో ఉద్దవ్, జిల్లా క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్లు విద్యాసాగర్, అరవింద్, రవి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. నష్టాలపై నివేదికలు రూపొందించాలిఆసిఫాబాద్: జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టాలపై పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూలై, ఆగస్టులో భారీ వర్షాలతో పంచాయతీరాజ్ రోడ్డు భవనాల శాఖల పరిధిలోని రహదారులు కోతకు గురయ్యాయని, కల్వర్టులు తెగిపోయాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువలకు గండ్లు పడ్డాయని, ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పశువులు, మేకలు, గొర్రెల ఫొటోలతో కూడిన వివరాల ను అందించాలని ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. -
పనిభారం తగ్గించాలని వీవోఏల ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: పనిభారం తగ్గించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవా రం ఐకేపీ వీవోఏలు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ ఐకేపీ వెలుగులో క్షేత్రస్థాయిలో గ్రామ సమైఖ్య సంఘం అసిస్టెంట్లతో 67 రకాల పనులు చేయించుకుంటున్నారని తెలి పారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేదన్నారు. విద్య భోదన, ట్రైనింగ్ పేరుతో ఇబ్బంది పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని కోరారు. అనంతరం డీఆర్డీఏ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షులు రోజా, కార్యదర్శి ధనరాజ్, నాయకులు అన్నపూర్ణ, అంకన్న, వనిత, సుమలత, వెంకటేశ్, సంతోష్, భరత్, హనుమంత్రావు, తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
బోనస్కు ఎదురుచూపులే!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు వడాయి శివరాం. రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన ఆయన గత యాసంగిలో 4.5 ఎకరాల్లో సన్నరకం వరిసాగు చేశాడు. అంతకు ముందు వానాకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ వచ్చింది. దీంతో యాసంగిలో పండిన 60 క్వింటాళ్ల ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాడు. అయితే ధాన్యానికి మాత్రమే మద్దతు ధర ప్రకారం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాగా, బోనస్ మాత్రం ఇప్పటికీ అందలేదు. జిల్లాలో ఇది ఒక్క శివరాం పరిస్థితే కాదు. యాసంగిలో సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన వారందరూ బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. రెబ్బెన(ఆసిఫాబాద్): సన్నరకం వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన జిల్లా రైతులు బోనస్ నగదు కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో వారిలో ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు గత వానాకాలం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించింది. యాసంగిలో పండించిన ధాన్యానికి మాత్రం ఇప్పటివరకు చెల్లించలేదు. ధాన్యం అమ్మి నెలలు గడుస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. 5,800 మెట్రిక్ టన్నులు సేకరణజిల్లాలోలోని రైతులు యాసంగి సీజన్లో 24వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు 5,800 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం సేకరించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. సర్కారుపై నమ్మకంతో చాలామంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సన్నరకం ధాన్యాన్ని విక్రయించారు. విక్రయ సమయంలో అకాల వర్షాలు పడ్డాయి. తూకం చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతోనూ రైతులకు ఇబ్బందులు ఎదురయ్యా యి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన పంటకు సంబంధించిన డబ్బులను మాత్రమే ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం బోనస్ను విస్మరించింది. ఒక్కో రైతుకు వేలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసి దాదాపు రెండున్నర నెలలు గడిచింది. చెల్లింపులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. రూ.2.9 కోట్ల బకాయిలుయాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన జిల్లా రైతులకు ప్రభుత్వం నుంచి బోనస్ రూపంలో రూ.2.9 కోట్లు రావాల్సి ఉంది. అకాల వర్షాలు, ధాన్యం కొనుగోలులో అధికారుల జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ప్రైవేటుకే అమ్ముకున్నారు. అయితే ప్రైవేటులో రోజురోజుకూ ధర తగ్గించడం, ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ వస్తుందనే ఆశతో మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై మొగ్గు చూపారు. జిల్లావ్యాప్తంగా 12,090 మంది రైతులు సుమారు 5,800 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అధికారులు యాసంగిలో బోనస్ చెల్లింపునకు 12,090 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. కేవలం కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే డబ్బులను జమ చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడతాయని రైతులు ఆశగా ఎదురుచూశారు. మరో రెండున్నర నెలల్లో వానాకాలం పంటల దిగుబడి సైతం చేతికి అందనుంది. ప్రభుత్వంపై ఆశతో వానాకాలంలోనూ అధికంగా సన్నరకాలనే సాగు చేశారు. ధాన్యం చేతికందేలోగా బోనస్ రాకపోతే రైతులు మళ్లీ ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం విక్రయించాలని భావిస్తున్నారు.ప్రైవేటుకు వద్దనుకుని.. గత యాసంగిలో ఐదెకరాల్లో మొత్తం సన్నరకం ధాన్యాన్నే పండించిన. తేమతో సంబంధం లేకుండా వడ్లు కొనేందుకు ప్రైవేటు వ్యక్తులు కల్లం వద్దకే రావడంతో 20 క్వింటాళ్ల వరకు ప్రైవేటుకే అమ్మిన. ప్రభుత్వం సన్నరకానికి బోనస్ కూడా ఇస్తుండటంతో ప్రైవేటుకు వద్దనుకుని మిగిలిన 50 క్వింటాళ్లను కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. ధాన్యం డబ్బులు పడ్డయి.. కానీ బోనస్ మాత్రం అందలేదు. – వడాయి కాంతారావు సాగుకు ఉపయోగపడేవి రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి ఇస్తామన్న బోనస్ డబ్బులు అందిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడేవి. ధాన్యం విక్రయించి దాదాపు మూడు నెలలు అయితంది. ఇప్పటివరకు డబ్బులు మాత్రం పడలేదు. పైసల కోసం వారానికి ఒకసారి బ్యాంకుకు వెళ్లి ఖాతా చూసుకోవాల్సి వస్తోంది. కనీసం ఎప్పుడు పడతాయో కూడా చెప్పడం లేదు. – కొట్రంగి హన్మంతు -
ఘనంగా మాజీ మంత్రి భీంరావు వర్ధంతి
ఆసిఫాబాద్అర్బన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి దివంగత కోట్నాక భీంరావు 23వ వర్ధంతిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్లో ఘనంగా నిర్వహించారు. భీంరావు విగ్రహానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, అధికారులు, గిరిజన సంఘా ల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా భీంరావు అందించిన సే వలు చిరస్మరణీయమన్నారు. గిరిజన యువ త ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, వివిధ రాజకీయ పార్టీలు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
ఆసిఫాబాద్రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అలింకో సంస్థ ద్వారా జిల్లాలో కృత్రిమ అవయవాలు, సహాయ ఉపకరణాలు అందించేందుకు 108 బాలబాలికలను ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధిపై దృష్టిజిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కౌటాల, రెబ్బెన, కెరమెరి మండల్లోని కేంద్రాలు శిథిలావస్థకు చేరాయని, వాటిని ఇతర భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి సరిత తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలిఆసిఫాబాద్: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు, ఏపీవోలు, ఏపీఎంలు, హౌజింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలతో పాఠశాలలు, పీహెచ్సీలు, ఉప కేంద్రాలు దెబ్బతిన్నాయని, వాటి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌజింగ్ పీడీ వేణుగోపాల్, డీటీడీవో రమాదేవి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఫోన్ చేసినా స్పందించరా..?
ఆసిఫాబాద్అర్బన్: ‘అత్యవసరంలో రోగులు ఆస్పత్రికి వస్తే అందుబాటులో ఉండరు. కనీసం ఎమ్మె ల్యే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరా’ అంటూ ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఓ గిరిజన గర్భిణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు అదేరాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహిళకు వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎంహెచ్వోకు ఫోన్ చేశారు. ఇద్దరూ స్పందించకపోవడంతో హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రజాప్రతినిధి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. మీ నంబర్ తనవద్ద లేదని సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. అనంతరం బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అయితే 108 వాహనంలో డీజిల్ లేకపోవడంతో ఎమ్మెల్యే సొంత డబ్బులతో డీజిల్ పో యించి గర్భిణిని మంచిర్యాలకు తరలించారు. ప్ర స్తుతం గర్భిణి ఆరోగ్యం నిలకడగా ఉంది. రాష్ట్ర ప్ర భుత్వం అంబులెన్స్ల్లో ఇంధనం పోయించే స్థితిలో కూడా లేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. నాయకులు రవీందర్, కోవ సాయినాథ్ పాల్గొన్నారు. -
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: మల్టీపర్పస్ విధానాన్ని తక్షణ మే రద్దు చేయాలని, కార్మికులకు గ్రీన్ చానల్ ద్వా రా వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కా ర్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్, కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు నిత్యం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఇతర ప్ర భుత్వ పథకాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. 2019 లో వచ్చిన మల్టీపర్పస్ విధానంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా వేతనాలు కూడా అందడం లేదన్నారు. సీఎం హామీ ఇచ్చినా కనీస వేతనాలు అమలు కావ డం లేదన్నారు. జీవో 51 సవరించాలని డిమాండ్ చేశారు. డీపీవో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. నాయకులు, కార్మికులు అనిల్, వసంత్, నగేష్, విలాస్, సంతోష్, రాజు పాల్గొన్నారు. -
పడిగాపులకు స్వస్తి..!
కౌటాల(సిర్పూర్): పశువులపై వన్యప్రాణుల దాడులు పెరిగిన నేపథ్యంలో బాధిత రైతులకు సాయం వేగంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పరిహారం చెక్కుల రూపంలో అందించగా, ఇక నుంచి పశుపోషకుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాలు దట్టమైన అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. అక్కడి ప్రజలు వన్యప్రాణులతోనే సహవాసం చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా–అంధారీ అభయారణ్యాల నుంచి పెన్గంగ, ప్రాణహిత నదులు దాటి పెద్దపులులు కాగజ్నగర్ డివిజన్ పరిధిలోకి ప్రవేశిస్తున్నాయి. పెద్దపులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు రైతులపై దాడులు చేస్తున్నాయి. వన్యప్రాణుల దాడుల్లో పశువులు, మేకలు కూడా మృత్యువాత పడుతున్నాయి.వన్యప్రాణులకు ఆవాసం..జిల్లాలో 1,78,939.73 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉండగా, 1100 గ్రామాలు అడవుల మధ్యే ఉన్నాయి. బెజ్జూర్, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, కౌటాల, దహెగాం, కాగజ్నగర్, సిర్పూర్(టి), తిర్యాణి, కెరమెరి, సిర్పూర్(యూ), లింగాపూర్ ప్రాంతాల్లో అన్నిరకాల వన్యప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. ప్రాణహిత, వార్దా నదులతోపాటు పెద్దవాగు పరీవాహక ప్రాంతాలను జింకలు, మెకాలు, దుప్పులు, కుందెలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, సాంబార్లతోపాటు అనేక రకాల పక్షులు ఆవాసంగా మార్చుకున్నాయి.పెరిగిన దాడులుమహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్గంగ, వార్దా, ప్రాణహిత నదుల తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. పదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడ పులి కాగజ్నగర్లోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రస్తుతం వాటి సంతతి పెరిగింది. బఫర్ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న పులులు రైతులు, పశువులపై దాడులకు దిగుతున్నాయి. అటవీ ప్రాంతంలో నీటివనరులు తగ్గినప్పుడు ఇతర వన్యప్రాణులు కూడా గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పశువులతో పాటు కాపరులపై కూడా అటవీ ప్రాంతంలో దాడి చేస్తున్నాయి. మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగింది. దీంతో జిల్లాలో పెద్దపులులను కొందరు హతమార్చారు. పంటలు కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలు అమర్చడంతో విష ప్రయోగం చేస్తున్నారు. ఈ చర్యలను తగ్గించేందుకు ప్రభుత్వం వన్యప్రాణుల దాడుల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు బాధితులకు వేగంగా పరిహారం అందిస్తుంది.దరఖాస్తు చేస్తే వెంటనే..వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన చర్యలు తప్పవు. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల దాడిలో పశువులు మృత్యువాత పడితే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పరిహారం పెంచింది. దీనిపై జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. పశువులు మృతి చెందితే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే విచారణ చేసి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తాం. పరిహారం కోసం దరఖాస్తు చేసిన వారికి జాప్యం లేకుండా నేరుగా పశుపోషకుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తాం.– సుశాంత్ బొగాడే, ఎఫ్డీవో, కాగజ్నగర్ఖాతాల్లోకి పరిహారం..వన్యప్రాణుల బారినపడి మృత్యువాత పడిన పశువుల యజమానులకు పరిహారం చెల్లించే ప్రక్రియను అటవీ శాఖ వేగవంతం చేసింది. ఇకపై నేరుగా పోషకుల బ్యాంకు ఖాతాల్లోనే పరిహారం జమ చేస్తుంది. గతంలో బాధితులకు పరిహారాన్ని చెక్కుల రూపంలో ఇచ్చేవారు. దానికి రెండు వారాల సమయం పడుతుండగా ప్రస్తుత విధానంతో వారం రోజుల్లోనే నగదు అందుతుంది. రైతుల సమయం ఆదా కావడంతోపాటు అవినీతికి ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ముందుగా వన్యప్రాణులు పశువును చంపిన విషయాన్ని బాధితులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. వారు ఘటనాస్థలికి వెళ్లి పంచనామా నిర్వహించి నివేదిక రూపొందిస్తారు. అలాగే రైతు వివరాలు, పశువైద్యుడి ధ్రువపత్రం, బ్యాంకు ఖాతా, తదితర సమాచారాన్ని మీ సేవ కేంద్రం ద్వారా నమోదు చేయించాలి. జిల్లా అధికారులు పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే డబ్బులు యజమాని ఖాతాలో జమవుతాయి. జిల్లాలో గత రెండేళ్లలో 114 పశువులు వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందాయి. అటవీశాఖ బాధితులకు రూ.50,35,434 పరిహారం అందించింది. వన్యప్రాణుల దాడుల్లో రెండేళ్లలో ముగ్గురు మృతి చెందగా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేశారు. వన్యప్రాణుల దాడుల్లో ఎలాంటి నష్టం జరిగినా ఫిర్యాదు చేయాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.పరిహారం ఇలా..వ్యక్తి మృతి చెందితే రూ. 10 లక్షలుతీవ్ర గాయాలైతే రూ. లక్ష వరకు..పంటలకు నష్టం జరిగితే రూ.7,500 వరకు..పశువులు చనిపోతే రూ.50 వేల వరకు..పశువులు గాయపడితే పరిహారం ఉండదు. -
‘రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం’
కాగజ్నగర్టౌన్/బెజ్జూర్: రాష్ట్రంలో యూరియా కోసం అవస్థలు పడుతుంటే, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. బుధవారం సిర్పూర్(టి) మండలంలోని ప లు గ్రామాల్లో పర్యటించారు. గురువారం బెజ్జూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎంకు రైతుల కంటే బిహార్ ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ల బ్లాక్ దందాలే యూరియా కొరతకు కారణమన్నారు. రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్ ఉండటంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫి కెట్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించా రు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ కన్వీనర్ శ్యాంరావు, నాయకులు విశ్వనాథ్, అర్షద్ హుస్సేన్, సారయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. -
వరదలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి
కెరమెరి(ఆసిఫాబాద్): వరదలు తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని మెట్టపిప్రి, సాంగ్వి గ్రామాలను గురువారం సందర్శించి వరద పరిస్థితులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల రక్షణకు చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. వరదల నేపథ్యంలో కల్వర్టులను పరిశీలించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అంజద్పాషా తదితరులు పాల్గొన్నారు. -
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం ఓటరు ముసాయిదా తుది జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, 2,874 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,76,610 మంది పురుషులు, 1,77,274 మంది మహిళలు, ఇతరులు 20 మంది ఉన్నారు. గతేడాది జాబితాతో పోలిస్తే జిల్లాలో 5,575 మంది ఓటర్లు పెరిగారు. గత పంచాయతీ ఎన్నికల ముందు జిల్లాలో 3,48,329 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,74,179 మంది పురుషులు, 1,74,034 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ముసాయిదాలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారు. నేడు, రేపు రాజకీయ ప్రజాప్రతినిధులతో సమావేశం జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. శుక్రవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సమావేశం కానున్నారు. శనివారం మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీవోల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 వరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు తెలిపే అవకాశం కల్పించారు. ఆదివారం ఈ అభ్యంతరాలపై డీపీవో ఆధ్వర్యంలో పరిష్కారం చూపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో తుది జాబితా ప్రచురిస్తామని డీపీవో భిక్షపతి గౌడ్ వెల్లడించారు. -
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ నాయకులు గురువారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్వో సీతారాంకు వినతిపత్రం అందించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ జిల్లాలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాగజ్నగర్ పట్టణంలో రెండు ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేశారన్నారు. -
లంబోదరాయ నమః
జిల్లా కేంద్రంలోని వాసవీ గణేశ్ మండలి వద్ద భక్తులు మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మిద్వారకానగర్ కాలనీలో లడ్డూ వినాయకుడువినాయకుడిని దర్శించుకుంటున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్/రెబ్బెన/కాగజ్నగర్టౌన్: వినాయక చవితి సందర్భంగా జిల్లావ్యాప్తంగా బుధవారం గణనాథుడు కొలువుదీరాడు. వివిధ రకాల పూలు, పత్రితో భక్తులు వినాయకుడికి పూజలు నిర్వహించి, పాయసం నైవేద్యంగా సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయాలు, మండపాలను భారీ సెట్టింగులు, కలర్ఫుల్ లైటింగ్తో అలంకరించారు. వివిధ రకాల రూపాలతో లంబోదరుడు ఆకట్టుకున్నాడు. పలువురు భక్తులు మట్టితో చేసిన బొజ్జ గణపయ్యను ఇళ్లలోనే ప్రతిష్టించుకున్నారు. జిల్లాకేంద్రంలోని వాసవీ మందిరంలో అర్చకులు ఇందారపు మధూకర శర్మ శమంతకమనోపాఖ్యాణం చేశారు. వివేకానందచౌక్లో వాసవీక్లబ్, పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో ప్రతిష్టించిన వినాయకుడిని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, తహసీల్దార్ సూర్యప్రకాశ్ తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. ‘లడ్డూ’ లంబోదరుడు కాగజ్నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో దశాబ్దాలుగా ఏకో ఫ్రెండ్లీ గణేశుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది యువజన గణేశ్ మండలి ఆధ్వర్యంలో 15 రోజుల కష్టపడి 14 అడుగుల లడ్డూ వినాయకుడిని ప్రతిష్టించారు. కాలనీలో 50 ఏళ్లుగా గణనాథుడికి ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తుండగా, 1999 నుంచి పర్యావరణ హితంగా ఏకో ఫ్రెండ్లీ విగ్రహం తయారు చేస్తున్నారు. కొబ్బరికాయలతోపాటు స్టీల్ సామగ్రి, కూల్డ్రింక్స్ బాటిళ్లు, కూరగాయలు, వరి పేలాలు, పూలు, శివలింగాలు, రుద్రాక్ష, కొబ్బరి కుడుకలు, వెదురు గంపలు, మట్టి దీపం చిప్పలు, పత్తి, మోసంబి, రాగి వస్తువులు, పేపర్ గ్లాసులు, మక్కలు, కొబ్బరి మట్టలు తదితర వస్తువులను వినియోగిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది బుందీ లడ్డూతో ఏర్పాటు చేసిన పార్వతి తనయుడు చూపరులను ఆకట్టుకుంటోంది. మూడు వేల బూంది లడ్డూలు వినియోగించి గణనాథుడిని ఏర్పాటు చేశామని యువజన గణేష్ మండలి అధ్యక్షుడు ములుగూరి నరసింహ తెలిపారు. కాగజ్నగర్లోని ఇందిరా మార్కెట్ ఏరియాలో కొలువుదీరిన గణనాథుడు -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: టీచర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారికి పీఆర్టీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు సరిచేయాలని, కుటుంబ సర్వేలో పనిచేసిన వారికి రెమ్యూనరేషన్, సమ్మర్ క్యాంపులు నిర్వహించిన స్కూళ్లకు నిధులు విడుదల చేయాలని, సప్లిమెంటరీ పరీక్షల విధులు నిర్వహించిన వారికి ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, నాయకులు రాకేశ్, శ్రావణ్కుమార్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన వాస్తవ లాభాల్లో నుంచి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. లాభాల్లో వాటా, ఇతర హక్కుల సాధనలో భాగంగా గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. ఆయన మా ట్లాడుతూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రభు త్వ సంఘం ఐఎన్టీయూసీ హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నాయని అన్నారు. డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 2న కొత్తగూడెంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, ఫిట్ కార్యదర్శులు రమేశ్, వెంకటేశ్, శ్రీని వాస్, రవీందర్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి సురేశ్, నాయకులు సాగర్, సమ్మయ్య, కరీముల్లాఖాన్, భిక్షపతి, సత్యనారాయణ, వరలక్ష్మి పాల్గొన్నారు. -
ముంపు సమస్య సత్వరమే పరిష్కరించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన ఎన్టీఆర్ కాలనీ ముంపు సమస్యకు సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో గురువారం పర్యటించారు. వరదనీరు వచ్చే ఏరియాను పరిశీలించారు. ఎగువన ఉన్న వట్టివాగు కాలువలో పూడిక కారణంగా వరద కాలనీలోకి వస్తుందని స్థానికులు తెలిపారు. వట్టివాగు ప్రాజెక్టు డీ10 వద్ద కాలువలో పూడిక తీయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన నిధులు సైతం మంజూరు చేస్తామన్నారు. డ్రెయినేజీల్లో పూడిక సైతం ఎప్పటికప్పుడు తొలగించాలని, తద్వారా వర్షపు నీరు సులువుగా బయటకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, సీఐ సంజయ్, ఎస్సై చంద్రశేఖర్, ఆర్ఐలు సౌమ్య, ఉదయ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, గోపి, రాజేశ్, చిరంజీవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పంటల నష్టం వివరాలు నమోదు చేయాలి ఆసిఫాబాద్: భారీ వర్షాలతో జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి గురువారం అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజులుగా భారీ వర్షం కురవడంతో జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని, అర్హులైన ప్రతీ రైతు పేరు జాబితాలో ఉండాలని సూచించారు. అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా నివేదిక రూపొందించాలన్నారు. టెలికాన్ఫరెన్స్లో డీఏవో శ్రీనివాసరావు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. -
సింగరేణి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డబ్బులను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ య్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన శ్రీ రాంపూర్లోని ఎస్ఆర్పీ–3 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.27వేల కోట్ల బకాయిలుంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.42 వే ల కోట్లకు పెరిగిందని తెలిపారు. సమయానికి బకా యిలు చెల్లించకపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. సింగరేణిలో రాజకీ య జోక్యంతో సంస్థ పాలన గాడి తప్పుతోందని తె లిపారు. గుర్తింపు సంఘంగా తాము గెలిచిన తర్వా త కార్మికుల ప్రధాన డిమాండ్లను ఒక్కొక్కటిగా పరి ష్కరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. గతంలో జరగని స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్మి కుల ప్రధాన డిమాండ్ల సాధనకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంపెనీ వార్షిక లాభాలను ప్రకటించి అందులో నుంచి 35శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డి మాండ్ చేశారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కా ర్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం చర్చల కమిటీ ప్రతినిధులు ప్రసాద్రెడ్డి, సంపత్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజి యన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, పిట్ సెక్రటరీ మురళీచౌదరి, ఆకుల లచ్చన్న, జాడి రాజకుమార్, కారుకూరి నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గణపయ్యకు 32 రూపాలు
హిందూ పురాణాల ప్రకారం గణపతి సకల దేవతలకు అధిపతి. పూజ ఏదైనా ముందుగా గణపతినే పూజిస్తారు. ప్రతీ శుభకార్యాన్ని వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అనాధిగా వస్తున్న సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. హిందూ సంప్రదాయాల్లో ఇంటిని నిర్మిస్తే ప్రధాన ద్వారానికి గణపతిని ప్రతిష్ఠిస్తారు. ఉదయం లేవగానే నీటితో కడిగి పూజించి వెళ్తారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలోనూ ప్రధాన ద్వారంలో ఉన్న గణపతికి నమస్కరిస్తారు. తిరిగి వస్తూ మళ్లీ గణపతికి నమస్కరించాకే ఇంటిలోకి వెళ్తారు. ఏ ఆలయం నిర్మించినా ముందుగా గణపతి పూజలు చేస్తారు. గణపతి హోమాలు నిర్వహిస్తారు. ఇలా అందరికీ గణాధిపతి అయిన స్వామివారికి ముద్గల పురాణంలో 32 స్వరూపాలను వర్ణించారు. ఈ 32 స్వరూపాల్లో 16 రూపాలు అత్యంత ప్రాశస్థ్యమైనవి. పురాణాల్లో పేర్కొన్న రూపాలు పురాణాల్లో వినాయకుడికి 32 స్వరూపాలుగా పేర్కొన్నారు. ఇందులో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనమని తెలిపారు. నేటి రోజుల్లో కళాకారులు గణపయ్యను అనేక రూపాల్లో మలుస్తున్నారు. ఈ 16 రూపాల్లో ఉన్న గణనాథులకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో పేర్కొన్నట్లు బాలగణపతి, తరుణగణపతి, ఉచ్చిష్టగణపతి, విఘ్నగణపతి, మహాగణపతి, క్షిప్రగణపతి, హేరంబగణప తి, లక్ష్మీగణపతి, భక్తిగణపతి, వీరగణపతి, శక్తిగణపతి, ద్విజగణపతి, సిద్ధగణపతి, నృత్యగణపతి, ఊర్ధ్వగణపతి, విజయగణపతి.. ఇలా 16 ప్రధానమైన రూపాలున్నాయి. -
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన: జాప్యం లేకుండా సింగరేణి ఉద్యోగులకు సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ట్లు సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్–2 గోవర్ధన్ కంటెపుడి తెలిపారు. మంగళవారం గోలేటి టౌన్షిప్ లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ప్రయాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్ లావాదేవీలు అ న్ని సీకేర్స్ పోర్టర్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని, సేవలన్నీ పారదర్శకంగా ఉంటాయని పే ర్కొన్నారు. ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా సీ ఎంపీఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని సూచించారు. సీఎంపీఎఫ్ బెనిఫిట్స్కు అర్హులు, పె న్షన్, రివైస్డ్ పెన్షన్పై ఎలాంటి పెండింగ్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలకు సమాధానం ఇచ్చా రు. పెన్షన్, సీఎంపీఎఫ్ దరఖాస్తులు జీరో పెండింగ్ స్థాయికి తీసుకువచ్చేందకు ప్రతీ ఉద్యోగి కృషి చే యాలని సూచించారు. ఎస్వోటూ జీఎం రాజమ ల్లు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత, అన్ని విభాగాల సంక్షేమ శాఖ క్లరికల్ సిబ్బంది ఉన్నారు. -
ఆర్జీయూకేటీలో ముగిసిన స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్లో అడుగుపెడుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్య, వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలు, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి వంటి విభిన్న అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్, స్టూడెంట్ కోఆర్డినేటర్ మహబూబ్, అసోసియేట్ డీన్లు చంద్రశేఖర్, మహేశ్, విఠల్, ఇంజినీరింగ్ విభాగాధిపతులు ఉపేందర్, భావ్సింగ్ వినయ్, కోఆర్డినేటర్ తేజస్వి, సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు. సొసైటీ సీఈవోల బదిలీకైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలకు స్థానచలనం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 66మంది సీఈవోలు ఉండగా, 49 మందిని వివిధ మండలాలకు బదిలీ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 17 సొసైటీల్లో రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో వారికి ఎలాంటి బదిలీ జరగలేదు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేసినట్లు జిల్లా సహకారశాఖ అధికారి మోహన్ తెలిపారు. -
డెంగీతో విద్యార్థి మృతి
తిర్యాణి: డెంగీతో ఓ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు, ఆర్బీఎస్కే వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిమాదర పంచాయతీ పరిధి రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం–దివ్యజ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆత్రం అనురాగ్ (12) స్థానిక ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఈనెల 14న అతడికి జర్వం రావడంతో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం తల్లిదండ్రులు మండల కేంద్రంలోని సీహెచ్సీలో చేర్పించారు. 15న వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిరార్ధణ కాలేదు. అయినప్పటికీ జర్వం తగ్గకపోవడంతో 18న రక్త పరీక్షలు నిర్వహించి తెల్లరక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. 19న మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్ధారించారు. ఈనెల 21న బాలుడి పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీవో లోకేశ్వర్రావు, డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్ పరామర్శించారు. కాగా, తిర్యాణి సీహెచ్సీలో వైద్య సిబ్బంది వ్యాధి నిర్ధారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మూడు, నాలుగు రోజులు మామూలు వైద్యం అందించారని తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించగా మంచిర్యాల ఆస్పత్రికి రిఫర్ చేశారని వాపోయారు. వైద్య సిబ్బంది సరైన చికిత్స అందించి ఉంటే తమ కొడుకు బతికేవాడని ఆవేదన వ్యక్తంజేశారు. కాగా, విద్యార్థికి జర్వం వస్తున్నా ఉన్నతాధికారులకు తెలుపకుండా నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సాగర్ను సస్పెండ్ చేసినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. అలాగే విధులను నిర్లక్ష్యం చేసిన ఏఎన్ఎం సువార్తను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాల హెచ్ఎంగా సీనియర్ ఉపాధ్యాయుడు తిరుపతికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. -
‘సరిహద్దు’లో కర్ర గణేశులే..
భైంసా/తానూరు: గణేశ్ నవరాత్రోవాలను నిర్మల్ జిల్లాలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గ్రామా ల ప్రజలు వినూత్న రీతిలో జరుపుకొంటారు. పీవో పీ, మట్టి విగ్రహాలు ఇక్కడ మచ్చుకై నా కనిపించవు. రంగులు, రసాయనాల వినియోగం అస్సలే ఉండదు. హంగులు, ఆర్భాటాలు లేకుండా సమాజహితమే తమ అభిమతమని ఇక్కడి ప్రజలు పూర్వీకులు చూపిన బాటనే నేటికీ అనుసరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా దోహదం చేస్తున్నారు. కర్రతో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. పాలజ్ గణేశ్ ఫేమస్ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ చిన్న మరాఠీ గ్రామం పాలజ్. కుభీర్కు పక్కనే మహా రాష్ట్రలోని బోకర్ తాలూకాలో ఈ ఊరు ఉంది. స్వా తంత్య్రానికి పూర్వం ఈ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి జనమంతా మంచం పట్టారు. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఓ వైపు కలరా, ప్లేగు వ్యాధులు, మరోవైపు కరువు పరిస్థితులతో జనం సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కర్ర గణపతిని చేయించి ప్రతిష్ఠించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. నిర్మల్ కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీ వర్మను కలిశారు. నిష్టతో గుండాజీ వర్మ చేసిన సుందరమైన కర్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊ రంతా మొక్కితేనే వ్యాధులు దూరమయ్యాయని, కరువు కాటకాలు తొలగిపోయాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా 1948 నుంచి కర్ర గణేశుడిని వినా యక ఉత్సవాల్లో కొలవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఊరి ఆడబిడ్డల ద్వారానే కర్రగణేశుడి గురించి ఇతర గ్రామాలకు తెలిసింది. పూజల అనంతరం నిమజ్జనం రోజున స్థానిక వాగు వద్దకు తీసుకెళ్లి కర్ర గణేశుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడే నీళ్లు చల్లి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. దీనినే నిమజ్జ నోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహా న్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కలిసికట్టుగా.. లక్షలాదిగా.. తిరుపతి, షిర్డీలో ఉన్నట్లు పాలజ్లోనూ భక్తులకు క్యూలైన్లు ఉన్నాయంటే.. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేయొచ్చు. ప్రతీ ఏడాది వినాయక ఉత్సవాల్లో దాదాపు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారని అంచనా. లక్షల్లో తరలివచ్చే భక్తులకు గ్రామస్తులే సేవలందిస్తున్నారు. ఆ ఊరంతా కలిసికట్టుగా కర్రగణేశుషుడి సేవలో పాల్గొంటుండడం ఇక్కడి విశేషం. మరికొన్ని గ్రామాల్లోనూ.. తానూరు మండలం బోసిలో వరసిద్ధి కర్ర వినాయకుడు, కుభీర్ మండలం కుభీర్, పార్డి, మాలేగాం చిక్లీ, భైంసా మండలం మాటేగాం, లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామాల్లోనూ కర్ర గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో కరువు నేపథ్యంలో గ్రామస్తుల మొక్కులతో ఇలా ఈ ప్రాంతంలో ఊరంతా కలిసి కర్ర గణపతులను ప్రతిష్ఠించడం మొదలైంది. పాలజ్కు ఎలా వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసర మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్ వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్ ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా ఈ గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
నవోదయకు 6,091 దరఖాస్తులు
కాగజ్నగర్ టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయం అన్ని వసతులతో పాటు క్రమ శిక్షణతో కూడిన నాణ్యమై న విద్యకు మారుపేరుగా నిలుస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు గాను విద్యార్థుల నుంచి ఈ నెల 27 వరకు www. navodaya. gov. in వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 6,091 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3,003 మంది బాలికలు, 3,088 మంది బాలుర దరఖాస్తులున్నాయి. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుల వివరాలు చెన్నూరు నుంచి 274 దరఖాస్తులు వచ్చినట్లు అధి కారులు తెలిపారు. ఖానాపూర్ నుంచి 287, మంచి ర్యాల నుంచి 510, కాగజ్నగర్ నుంచి 631, సిర్పూ ర్ నుంచి 378, ఆదిలాబాద్ నుంచి 571, బెల్లంపల్లి నుంచి 270, బోథ్ నుంచి 319, నిర్మల్ నుంచి 590, భైంసా నుంచి 664, లక్సెట్టిపేట్ నుంచి 350,మందమర్రి నుంచి 279, ఉట్నూర్ నుంచి 377, ఆసిఫాబాద్ నుంచి 591 వచ్చినట్లు పేర్కొన్నారు. త్రిభాషా విధానం అమలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థులు ఐదో తరగతి చదివి ఉండాలి. వరుసగా 3, 4, 5 తరగతులు ఒకే పాఠశాలలో చదివినవారే అర్హులు. విద్యార్థులు మే 1, 2014 నుంచి జూలై 31, 2016 మధ్యలో జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో త్రిభాషా విధానం ప్రాతిపదికన జాతీయ సమైక్యతకు బాటలు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు సోపానంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు బాలబాలికలకు వేర్వేరుగా డార్మెటరీలు, టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్కు క్వార్టర్లు వంటి వసతులున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ఆరోగ్యాన్ని పంచే హరిత సంపద, సుశిక్షితులైన అధ్యాపకులు, స్మార్ట్ క్లాసులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు, గ్రంథాలయం, ఆటలకు బాసటగా విశాలమైన స్టేడియం, బాస్కెట్బాల్ తదితర మైదానా లు జిమ్, హెల్త్సెంటర్లతో నవోదయ ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ పుస్తకాలు, దుస్తులు సహా విద్యార్థులకు అన్నీ ఉచితమే. 6, 7 తరగతులకు మాతృబాషలో బోధిస్తారు. 8వ తరగతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన చేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి 2026–27 విద్యాసంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఆన్లైన్లో ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రేపాల కృష్ణ, ప్రిన్సిపాల్, కాగజ్నగర్ నవోదయ విద్యాలయం -
ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ఏడాది పత్తి పంట మంచిగనే ఉండే. వానలకు వరద వచ్చింది. నాకున్న మూడెకరాల్లో పత్తి పంట కొట్టుకుపోయింది. పెట్టిన పెట్టుబడంతా వరద పాలైంది. ఏం చేయాలో అర్థమైతలేదు. అప్పులు ఎట్ల తీర్చుడో..? ఏటా వరదలకు నష్టపోతున్నం. ప్రభుత్వం మాకు ఎకరానికి రూ.20 వేలు ఇచ్చి ఆదుకోవాలి. – జునుగరి సత్తన్న, రైతు సర్వే కొనసాగుతోంది ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 6,453 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రస్తుతం మండలాల్లో పంట నష్టం సర్వే కొనసాగుతోంది. సర్వే పూర్తయిన తర్వాత పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాం. క్షేత్రస్థాయికి వెళ్లి సమగ్రంగా సర్వే చేపట్టాలని మండల వ్యవసాయాధికారులకు సూచించాం. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి -
రావయ్యా.. గణపయ్యా
ఆసిఫాబాద్/కౌటాల: మరికొన్ని గంటల్లో వాడవాడలా గణపయ్య కొలువుదీరనున్నాడు. పార్వతి తనయుడి ఆగమనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బుధవారం వినాయక చవితి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అందమైన సెట్టింగ్లు, లైటింగ్తో మండపాలు ఆకర్షనీయంగా ముస్తాబవుతున్నాయి. నవరాత్రులకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కల్పించనున్నారు. 800 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1200లకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుఈ ఏడాది సుమారు 1000లకు పైగా గణపతి విగ్రహాలు ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలు, కాలనీలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వా డవాడలా నవరాత్రోత్సవాలు వైభవంగా సాగనున్నాయి. వారం రోజులుగా నిర్వాహకులు విగ్రహాల బుకింగ్, విద్యుత్ పనులు, లైటింగ్ ఏర్పాట్లు, పోలీ సుల నుంచి అనుమతులు పొందడం తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లోనూ విగ్రహాల తయారీదారులు దుకా ణాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారు ముందస్తుగానే ప్రత్యేక వాహనాల్లో విగ్రహాలను తరలిస్తున్నారు. మరికొందరు కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణాల్లో వినాయకుడి ప్రతిమలు కొనుగోలు చేశారు. పీవోపీ విగ్రహ తయారీ ముడిసరుకు, కెమికల్, రంగుల ధరలు భారీగా పెరగడంతో ప్రతిమల ధరలు కూడా పెంచారు. ఆరు ఫీట్ల ఎత్తు విగ్రహానికి రూ.15 నుంచి 20 వేల వరకు విక్రయిస్తుండగా, 10 ఫీట్ల విగ్రహానికి రూ.30 నుంచి రూ. 40 వేల వరకు ధర ఉంది. మంటపాల వద్ద తొమ్మిది రోజులపాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్లోని ప్రధాన మార్కెట్లు సందడిగా మారాయి. భక్తులు పూజా సామగ్రి కొనుగోలు చేశారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ జిల్లా కేంద్రంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు. మండల కేంద్రాల్లోనూ పోలీసులు వేడుకల నిర్వహణపై పీస్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ.. కమిటీ సభ్యులకు సూచనలు చేస్తున్నారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు నిమజ్జనం వరకు నిబంధనలపై దిశానిర్దేశం చేశారు. పత్రాలు, ఫలాలతో పూజలువినాయక చవితి పండగ రోజున విఘ్నేశ్వరుడికి 21 రకాల పువ్వులతో పూజిస్తారు. ఔషధ గుణాలు కలిగి ఉండే ఈ ఆకులతో పూజించడం, ఆ తర్వాత వాటిని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేయడం ద్వారా జలాలు శుభ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మాచి, పత్రి, గరిక, ఉత్తరేణి, ములక, ఉమ్మెత్త, తులసి, మారెడు, రేగు, మామిడి, గన్నేరు, ధవనం, జాజిమల్లె, తెల్లమద్ది, దేవదారు పత్రం, దానిమ్మతో పాటు పలురకాల పత్రాలతో వినాయకుడికి పూజలు చేస్తారు. ఉండ్రాళ్లు, లడ్డూలు, పాయసం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మట్టి విగ్రహాలకు పెరిగిన ప్రాధాన్యంప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన గణపతులతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. నిమజ్జనం తర్వాత కూడా నీటిలో కరగకుండా ఎక్కువ కాలం ఉండటంతో నీటి వనరుల్లో కాలుష్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మట్టి గణపతులు ప్రతిష్టించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గతంలో 335 గ్రామ పంచాయతీలకు ప్రతీ పంచాయతీకి పది చొప్పున అధికారులే మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. సోమవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో వాసవీక్లబ్, పద్మశాలి సంఘం, వివిధ స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పూలాజీబాబా జయంతి ఘనంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: జైనూర్ మండలం పాట్నాపూర్లో ఈ నెల 30న పూలాజీ బాబా జయంతి ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పాట్నాపూర్లోని పూలాజీ బాబా సంస్థాన్లో జయంతి వేడుకల నిర్వహణపై అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంస్థాన్ వద్ద వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ శాఖ అధికారులు రూట్మ్యాప్ తయారు చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. తాగునీటికోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూర్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. జాతరలో వైద్య శిబిరాలు ఏర్పా టు చేసి అందుబాటులో ఉండాలన్నారు. భోజన వసతి వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ప్రముఖుల కోసం బారికేడ్లు ఏర్పాటు చే యాలని సూచించారు. అనంతరం జయంతి పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జైనూర్ ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, సంస్థాన్ అధ్యక్షుడు ఇంగ్లే కేశవరావు, ట్రాన్స్కో ఎస్ఈ రాథోడ్ శేషారావు, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్వో సీతా రాం, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖి, సీఐ బాలాజీ వరప్రసాద్ పాల్గొన్నారు. పారదర్శకంగా పింఛన్లు పంపిణీపారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ దీపక్తివారితో కలిసి బ్రాంచ్పోస్టల్ ఆఫీసర్ల(బీపీఎం)లకు మొబై ల్స్ అందించారు. మొబైల్లో ప్రత్యేక యాప్లో పెన్షన్దారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని తెలిపారు. ప్రతినెలా ఐరిష్, వేలిముద్రల ద్వారా పెన్షన్ అందించనున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
కాగజ్నగర్టౌన్: జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తు న్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం జూని యర్ అసిస్టెంట్ కార్తీక్కు సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ సిర్పూర్(టి), తిర్యాణి, కాగజ్నగర్, వాంకిడి మండలాల్లోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. 2022 నుంచి ఈపీఎఫ్ పూర్తి వివరాలను అందించాలని, ఈఎస్ఐ, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 1 తర్వాత సమ్మెలోకి వెళ్తామని తెలిపారు. అనంతరం కాగజ్నగర్ ఏరియా ఆస్పత్రి ఆవరణలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, కార్మికులు తుకారం, తిరుపతి, మారుతి, దేవిరావు, పరమేశ్వర్, సిబ్బంది ఉన్నారు. -
క్రీడాకారులకు ఆర్థికసాయం
ఆసిఫాబాద్అర్బన్: జాతీయస్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికైన జిల్లాకు చెందిన విద్యార్థి నులు శాలిని, నిహారికకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆర్థికసాయం అందించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు హర్యానా రాష్ట్రంలోని సుభాష్ చంద్రబోస్ స్టేడియంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, సభ్యులు తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
చీఫ్ రెఫరీగా వెంకట రామకృష్ణ
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణ స్టేట్ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ రెఫరీగా రెబ్బెన మండలం గో లేటికి చెందిన రిక్కల వెంకట రామకృష్ణ ని యమితులయ్యారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో జరి గిన అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో రామకృష్ణను చీఫ్ రెఫరీగా ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బంగారు స్వామి, వీవీ రమణ మంగళవారం తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్బ్యాడ్మింటన్ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆర్వీ రామకృష్ణను ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్రెడ్డి, బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు భాస్కర్, సెపక్ తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి తదితరులు అభినందించారు. -
డెంగీ కలవరం!
కౌటాల(ఆసిఫాబాద్): జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లె జనం మంచం పడుతున్నారు. జ్వరం, కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు జ్వరాల బారినపడి ఇంటిబాట పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తిర్యాణి మండలం పంగిడిమాదర పంచాయతీ పరిధిలోని రాజాగూడ గ్రామానికి చెందిన ఆత్రం సీతారాం– దివ్యజ దంపతుల కుమారుడు ఆత్రం అనురాగ్(12) డెంగీతో సోమవారం రాత్రి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ నెల 19న అతడికి డెంగీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తుండగానే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సీజన్లో 11 కేసులుజిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, ఐదు సీహెచ్సీలు, రెండు యూపీహెచ్సీలతోపాటు 15 పీహెచ్సీల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. లింగాపూర్, బాబాపూర్ పీహెచ్సీల్లో ఆయుష్ వైద్యులు కూడా ఉన్నారు. పీహెచ్సీకి కనీసం ఇద్దరు, ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తుండడంతో మెరుగైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు ఉండగా, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న గ్రామ పంచాయతీలు 60కిపైగా ఉన్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో డెంగీ జ్వరం పేరు అంటేనే ఆందోళన మొదలైంది. ఆర్బో వైరస్తో ఈ జ్వరం సోకుతుంది. పగటిపూట కుట్టే ఎడిస్ ఈజిప్టి (టైగర్ దోమ) దోమతో వ్యాప్తి చెందుతుంది. పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వృద్ధి చెందుతాయి. అనుమానం ఉంటే రోగికి వెంటనే రక్త పరీక్షలు చేయించాలి. తెల్ల రక్త కణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ తగ్గడం, ఎర్ర రక్తకణాల పరిమాణం పెరగడం తదితర వివరాలు ఎలిసా పరీక్షతో నిర్ధారించవచ్చు. పెరుగుతున్న వైరల్ జ్వరాలుకాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో రెండు నెలల్లో 600 మందికి పైగా వైరల్ జ్వరాల బారిన ప డ్డారు. అలాగే 30 మలేరియా కేసులు, 50కి పైగా డ యేరియా, 30కి పైగా టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. అనాధికారికంగా జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. సాధారణ ఫ్లూ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వాటితో బాధపడుతున్నారు. మండల కేంద్రాల్లోని పీహెచ్సీల్లో సాధారణ రోజుల్లో 70– 80 వరకు ఓపీ ఉంటే ఆగస్టులో 160 వరకు పెరిగింది. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 500 ఓపీ ఉండగా ప్రస్తుతం 700లకు పైగా వస్తున్నారు. నిత్యం సుమారు 80 వరకు ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలో సరై న సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. డెంగీకి ప్రధాన ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తుండటంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలే జ్వరం నిర్ధారించి చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దోమల విజృంభణగ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పింది. వై ద్యారోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపల్ శాఖల స మన్వయంతో చేపట్టాల్సి పనులు ఆగిపోయాయి. డ్రెయినేజీల్లో పూడిక తీయడం లేదు. మురుగునీరు నిలిచి ఉంటుంది. దోమలు వృద్ధి చెందాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జ్వరాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి
కాగజ్నగర్టౌన్: విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లోనవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఖాన్ అకాడమీ తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం, వంట సామగ్రిని పరిశీలించారు. అనంతరం లోనవెల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల వివరాలు పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో వేణుగోపాల్, లోనవెల్లి పీహెచ్సీ వైద్యురాలు నవత, సిబ్బంది ఉన్నారు. -
మట్టి వినాయకుడిని పూజించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): పర్యావరణ పరిరక్షణ కు ప్రతిఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాల ను పూజించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి డిస్పెన్సరీ వద్ద మంగళవా రం ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. జీఎం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో ఏటా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పీవోపీతో తయారు చేసే విగ్రహాల వినియోగం తగ్గించాలని సూచించారు. రసాయనాలతో నీటిలోని జీవజాతులకు హాని కలుగుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్కుమార్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ఏరియా పర్యావరణ అధికారి హరీశ్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మూగ వేదన..!
ఈ నెల 2వ తేదీన చింతలమానెపల్లి మండలం గూడెం సరిహద్దు వద్ద ఒక బొలెరో వాహనంలో ఆరు పశువులను తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అప్పటికే ఊపిరాడ క అందులో మూడు చనిపోయాయి. మరో రెండు పశువులు కొన ఊపిరితో ఉండగా వాటికి మహారాష్ట్రకు చెందిన పశువైద్య సిబ్బంది వైద్యం అందించారు. ఈ ఘటనపై అహేరి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. చింతలమానెపల్లి(సిర్పూర్): మూగజీవాలపై అక్రమార్కులు కనికరం చూపడం లేదు. దురాశతో ఇరు కు వాహనాల్లో కుక్కి పరిమితికి మించి తరలిస్తున్నా రు. నదుల ప్రవాహంలో నాటు పడవలకు కట్టి సరి హద్దు దాటిస్తున్నారు. ఊపిరాడక పశువులు మృత్యువాత పడుతున్నా పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు కేవలం ఆదాయంపైనే దృష్టి సారిస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ నెల 23న దహెగాం మండలం లగ్గాం వద్ద ఆరు పశువులను అక్రమంగా తరలిస్తున్న నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీ సులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనుమతి తప్పనిసరిజిల్లావ్యాప్తంగా 2023 నాటి లెక్కల ప్రకారం 2లక్ష ల 64వేలకు పైగా పశువులు ఉన్నాయి. కౌటాల, జైనూర్, వాంకిడి మండలం సోనాపూర్లో పశువుల సంతలు ఉన్నాయి. రైతులు వారసంతలో పశువుల క్రయవిక్రయాలు జరపడానికి నిబంధనలను అనుసరించి అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పశువులు కొనుగోలు చేసే గ్రామంలో సంబంధి త యజమాని అనుమతి పొందాలి. పశువును ధ్రు వీకరిస్తూ గ్రామ పంచాయితీ, పశువైద్యశాల నుంచి అనుమతులను పొందాలి. ఆవులను కబేళాలకు తరలించడానికి అనుమతి లేదు. కబేళాకు తరలించే ఎద్దు వయస్సు 14 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. మూగజీవాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి వాహనంలో గాలి వెలుతురు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇబ్బంది కలగకుండా ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలి. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల చెక్పోస్ట్లో సిబ్బంది, అధికారులకు అనుమతి పత్రాలు చూపించి సహకరించాలి.చెక్పోస్ట్ల ఏర్పాటుపశువుల అక్రమ రవాణా పెరిగిపోవడంతో పోలీసులు చింతలమానెపల్లి మండలం గూడెం, డబ్బా, కౌటాల మండలం తాటిపల్లి చౌరాస్తాతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం పశువుల సంతలకు తరలించి విక్రయాలు చేసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే పశువుల వ్యాపారులు చెక్పోస్ట్ల నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. చింతలమానెపల్లి, కౌటాల మండలాల సరిహద్దులలోని వార్దా, ప్రాణహిత నదుల నుంచి ప్రమాదకరంగా మూగజీవాలను దాటిస్తున్నారు. ఇటీవల కౌటాల మండలం తాటిపల్లి వద్ద పశువులను పడవలకు కట్టి వరద నీటిలో తరలించారు. వరద నీటిలో ప్రవాహానికి ఈదలేక ఊపిరాడక పోవడంతో పశువులు కొన్ని చనిపోయాయి. చనిపోయిన వాటిని నదిలోనే వదిలేశారు. చింతలమానెపల్లి మండలం దిందా, చిత్తామ గ్రామాల వద్ద ప్రాణహిత నది నీటి వరదలో మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్నారు. కొన్నిసార్లు సంతకు తరలించకుండానే నేరుగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. పోలీసు శాఖ నిఘా పెట్టినా ఆగడాలకు అడ్టుకట్ట పడడం లేదు. తరలింపు ఇలా..కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర కు సరిహద్దుగా ఉంది. ఈ క్రమంలో ఇక్కడి పశువుల సంతలకు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి పశువులను తరలిస్తున్నా రు. కౌటాల పశువుల సంతకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి, ఆళ్లపల్లి, చంద్రపూర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పశువులు తీసుకొచ్చి అమ్ముతుంటారు. వాంకిడి మండలం సోనాపూర్కు చంద్రాపూర్ జిల్లా నుంచి ఎక్కువగా పశువులు తరలించి విక్రయిస్తున్నారు. పశువుల వ్యాపారం చేస్తున్న కొందరు ఆదాయం కోసం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చిన్న వాహనాల్లో పదికి పైగా పశువులను బలవంతంగా ఎక్కిస్తున్నారు. పశువుల మూతులు, కాళ్లను తాళ్లతో బంధిస్తున్నారు. ఊపిరాడక పశువులు మార్గమధ్యలోనే మృత్యువాత పడుతున్నాయి. కేసులు నమోదు చేస్తున్నాం పశువుల అక్రమ రవాణా నిరోధించేందుకు పోలీసుశాఖ నిఘా పెట్టింది. చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముందస్తు సమాచారంతో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇలాంటి అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు. ప్రజలు సహకరించి పోలీసులకు సమాచారం అందించాలి. – రాణాప్రతాప్, సీఐ, టాస్క్ఫోర్స్ -
మట్టి గణపతులను పూజిద్దాం
ఆసిఫాబాద్అర్బన్: మట్టి గణపతులు పూజించి, పర్యావరణాన్ని కాపాడుకుందామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి కాలుష్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి సజీవన్ తదితరులు పాల్గొన్నారు. ‘భూభారతి’ దరఖాస్తులు పరిష్కరించాలిభూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా సర్వే ల్యాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సోమేశ్వర్లతో కలిసి తహసీల్దార్లు, డీటీలు, మండల సర్వేయర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్షించారు. దరఖాస్తులను రికార్డులతో సరిచూసి, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలన్నారు. పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. -
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణం’
కాగజ్నగర్రూరల్: తెలంగాణలో యూరియా కొరతకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాగజ్నగర్ మండలం కోసినిలోని ప్రాణహిత భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు సంఘాలు, వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించకుండా.. సినీ దర్శకులు, నిర్మాతలతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సిర్పూర్ నియోజకవర్గంలో 50 శాతం యూరియా పంపిణీ పెండింగ్లో ఉందని, తెలిపారు. సానుభూతి కోసం ఎమ్మెల్యే హరీశ్బాబు ధర్నా డ్రామా చేపట్టారని ఆరోపించారు. అనంతరం పట్టణంలోని నౌగాంబస్తీ కాలనీకి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ శ్యామ్రావు, నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్, మినాజ్, అంజన్న, పార్వతి, వరలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరి తగతిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి జిల్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇటీవల వర్షాలకు తన ఇల్లు కూలిపోయిందని, పరిహారం చెల్లించాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన సమీన బేగం దరఖాస్తు చేసుకుంది. రెబ్బెన మండలం గంగాపూర్ శివారులో కొనుగోలు చేసిన భూమికి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలని గ్రామానికి చెందిన ఇగురపు తార అర్జీ సమర్పించింది. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ శివారులోని మైనార్టీ గురుకులంలో తన కుమార్తెకు సీటు ఇప్పించాలని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్కు చెందిన సమిత్దాస్ విన్నవించాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట నీట మునిగిందని, పరిహారం చెల్లించాలని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్కు చెందిన సుమతి మండల్ కోరింది. తనకు జారీ చేసిన పట్టా పాస్పుస్తకంలో పేరు తప్పుగా నమోదైందని, దానిని సవరించాలని నజ్రూల్నగర్కు చెందిన చంద్రకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. కాగజ్నగర్ ఎస్పీఎం ఓల్డ్ కాలనీలో పందుల సంచారం అరికట్టాలని కాలనీ ప్రజలు కలెక్టర్ను వేడుకున్నారు. అక్షర చిట్ఫండ్లో దాచుకున్న డబ్బులు ఇప్పించాలని జిల్లా కేంద్రానికి చెందిన పలువురు వ్యాపారులు విన్నవించారు.నిషేధిత జాబితా నుంచి తొలగించాలి ఆసిఫాబాద్ మండలం బూర్గుడ శివారులోని సర్వే నం.91/ఈలో మూడెకరాల పట్టా భూమి ఉంది. సదరు భూమిని విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా నిషేధిత జాబితాలో ఉందని తెలిసింది. గత జూన్లో దరఖాస్తు చేసుకున్నాను. పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలి. – సైదం తిరుపతి, బూర్గుడ, మం.ఆసిఫాబాద్ -
స్టేట్ సెలక్షన్ కమిటీలో చోటు
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీలో జిల్లా సీనియర్ క్రీడాకారులకు చోటు దక్కింది. సబ్ జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా రెబ్బెన మండలం గోలేటికి చెందిన మారిన వెంకటేశ్వర్లు, జూనియర్స్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా గోలేటి విలేజ్కు చెందిన లావుడ్య హరిలాల్, టోర్నమెంట్ కమిటీ చైర్మన్గా సింగరేణి ఉన్నత పాఠశాల పీఈటీ భాస్కర్ ఎంపికయ్యారు. గోలేటి టౌన్షిప్లో ఆదివారం జరిగిన తెలంగాణ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో జిల్లావాసులకు సెలక్షన్ కమిటీ, టోర్నమెంట్ కమిటీలో ప్రాధాన్యత కల్పించారు. ఎంపికై న వారు జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, కార్యదర్శి ఎస్.తిరుపతి, చీఫ్ ప్యాట్రన్ ఆర్.నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కె.భాస్కర్మారిన వెంకటేశ్వర్లు -
ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు చెల్లించి, ఇతర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆశవర్కర్లు సోమవా రం ధర్నా చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆశవర్కర్లు సమస్యలతో సతమతం అవుతున్నారన్నా రు. 20 ఏళ్లుగా ఎన్హెచ్ఎం స్కీమ్లో అహర్నిశలు శ్రమిస్తున్నా పారితోషకం తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచించడం అన్యాయమన్నారు. యథావిధిగా ప్రతినెలా వేతనం ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఆరోగ్యశాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఇన్సూరెన్స్ కింద రూ.50 లక్షలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, రిటైర్మెంట్ బెన్ఫిట్గా రూ.5లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, నాయకులు స్వరూప, భారతి, లక్ష్మి, పంచశీల, వని త, నవీన, శ్రీలత, అనిత, కవిత, నిర్మల, ముంజం శ్రీనివాస్, త్రివేణి, కృష్ణమాచారి, సమ్మయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ నవరాత్రోత్సవాలకు పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్అర్బన్: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామ ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం పోలీసు అధికా రులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడేలా చూ డాలని, విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల కు నిబంధనలు తెలియజేయాలన్నారు. శోభాయా త్ర సమయంలో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చే యాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ టీముల్లో మహిళా పోలీసుల పోలీసులను భాగస్వాముల ను చేయాలన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ రామానుజం, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ డివైస్లతో నేర విచారణ వేగవంతంఫింగర్ ప్రింట్ డివైస్లతో నేర విచారణ, నిందితుల గుర్తింపు వేగవంతమవుతుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్హెచ్వోలకు ఫింగర్ ప్రింట్ డివైస్లు అందించారు. నూతన సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. -
ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత ఏర్పడుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రైతులకు సరి పడా యూరియా అందించడం లేదని జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కా ర్యాలయం ఎదుట సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్రెడ్డికి వారికి బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిల్వలు లే వని చేతులెత్తేసిందన్నారు. యూరియా కొరతకు బా ధ్యత వహిస్తూ సీఎంతోపాటు ఇతర మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు సరస్వతి, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, నాయకులు రవీందర్, అహ్మద్, బలరాం, నిస్సార్, లక్ష్మణ్, భీమేష్, రాజ్కుమార్, శ్రీకాంత్, శ్రీను, రవి, కిష్టయ్య, పెంటు, పోచన్న పాల్గొన్నారు. రైతులు, నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కాగజ్నగర్టౌన్: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. కాగజ్నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాగజ్నగర్– పెంచికల్పేట్ ప్రధాన రహదారిపై రైతులతో కలిసి గంట పాటు రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఉదయం 5గంటల నుంచి ఎదురుచూస్తుండగా ఎరువులు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీఎస్ డైరెక్టర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నారు. వ్యవసాయాధికారి రామకృష్ణ యూరియా పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని చెప్పినప్పటికీ రాస్తారోకో కొనసాగించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేయగా కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు రైతులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. -
నిబంధనలు పాటించాల్సిందే.!
చింతలమానెపల్లి/కౌటాల: మరో రెండు రోజుల్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా గణేశ్ ప్రతిమల ను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీ సుశాఖ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించా లని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని, ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఆన్లైన్లో దరఖాస్తుఉత్సవాలు నిర్వహించే కమిటీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http:// police portel. tspolice.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని వివరాలు తెలపాల్సి ఉంటుంది. డీజేలు, లక్కీడ్రాలు నిషేధంగతేడాది గణేశ్ మండపాల వద్ద నిర్వహించిన పలు లక్కీడ్రా, లక్కీ లాటరీలు విమర్శలకు దారి తీశా యి. నిధుల సమీకరణలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినా పలుచోట్ల దుర్వినియోగం జరిగింది. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా ఉండాల్సిన గణేశ్ ఉత్సవాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. వీటి ద్వారా వసూలైన నగదు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో పోలీసు శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏరకమైన లక్కీ లా టరీలు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలి యజేస్తున్నారు. గణేశ్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజేలకు అనుమతిలేదని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఇవే..1. మండపం ఏర్పాటుకు స్థల యజమాని నుంచి అనుమతి తీసుకోవాలి. 2. విద్యుత్ వినియోగానికి ఆశాఖ అనుమతి తప్పనిసరి. 3. ఎలక్ట్రిసిటీ పనులకు నాణ్యతగల వస్తువులనే వినియోగించాలి. షార్ట్ సర్క్యూట్ జ రగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలి. 4. కమిటీలు, కమిటీ బాధ్యత తీసుకునే వారి వివరాలు, ఫోన్ నంబర్లను పోలీసుస్టేషన్లలో అందజేయాలి. 5. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా మండపాలను ఏర్పాటు చేయాలి. రహదారులకు అడ్డంగా ఏర్పాటు చేయకూడదు. 6. గణేశ్ ప్రతిమలు ఏర్పాటు చేసే స్టేజ్, వేదికలు సరైన నాణ్యతతో, పటిష్ఠంగా ఉండాలి. వర్షం నుండి రక్షణ కల్పించేలా షెడ్ ఏర్పాటు చేయాలి. 7. మండపం వద్ద 24 గంటలపాటు ఇద్దరు వ్యక్తులు పర్యవేక్షణలో ఉండాలి. రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను ఏర్పాటు చే యడంతో పాటు వాలంటీర్లను ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 8. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకా ట ఆడటం, అసభ్య నృత్యాలు చేయకూడదు. 9. విధిగా పాయింట్ పుస్తకాన్ని ఏర్పాటు చేయా లి. పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినపుడు వారికి సహకరించాలి. 10. మండపాలకు సమీపంలో అనుమానా స్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి. -
మరిన్ని సంఘాలు
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాలు 60 ఏళ్లు దాటిన మహిళలకు సంఘంలో చోటు కల్పించలేదు. కానీ ఈ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేస్తోంది. కిశోర బాలికలకు, దివ్యాంగులకు సైతం సంఘంలో చోటు కల్పించి వారిని కూడా ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం జిల్లాలోని అన్ని మండలాల్లో సర్వేలు నిర్వహిస్తోంది. కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలో కొత్తగా మరిన్ని మహిళా సంఘాలు ఏర్పాటు కానున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి కిశోర బాలికలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను గ్రూపుల్లో చేర్చనున్నారు. దివ్యాంగులకు సైతం నూతనంగా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో డీఆర్డీఏ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కోటి మందిని సంఘాల్లో చేర్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సంఘాల ఏర్పాటు కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి వృద్ధులు, కిశోర బాలికలు, దివ్వాంగులను కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి ఆసరాగా నిలవాలని భావిస్తోంది. సదరు కేటగిరీకి చెందిన వారిని ఈ నెలాఖరులోగా గుర్తించి ఖాతాలు తెరిపించే పనిలో సెర్ప్ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. పొదుపు నిర్ణయం వారిదే..పొదుపు ఎంత చేయాలనే నిర్ణయం ఆ సంఘంలో ఉన్న సభ్యులదే. సంఘాలుగా ఏర్పడిన వారు ఇంత మొత్తంలో పొదుపు చేయాలనే షరతు ఏమీ లేదు. వారి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నెలనెలా కావాల్సినంత పొదుపు చేసుకోవచ్చు. ఇప్పుడున్న పొదుపు సంఘాల మాదిరిగానే ఈ సంఘాలు కూడా నెలకోసారి సమావేశాలు నిర్వహించి పొదుపు డబ్బులు కట్టడం, బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం, మ్యాచింగ్ గ్రాంటు పొందడం, రికార్డులు నిర్వహణ వంటివి చేసుకోవచ్చు. వీవోఏలు కూడా వీరికి సహకరించనున్నారు. సంఘం ఏర్పాటు ఇలా..60 సంవత్సరాలు పైబడిన మహిళలంతా వృద్దుల సంఘంలో చేరవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైన మహిళా సంఘంలో కొనసాగుతున్న వారుంటే చేరనవసరం లేదు. కిశోర బాలికల్లో మాత్రం రెండు గ్రూపులుగా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. 11 నుంచి 14 సంవత్సరాల వరకు ఒక గ్రూపు, 14 నుంచి 18 సంవత్సరాల వరకు మరోగ్రూపు తయారు చేస్తున్నారు. ఈ సంఘాల్లో కనీసం పదిమంది సభ్యులు ఉండాలి. కానీ దివ్యాంగుల సంఘాల ఏర్పాటుకు 5 నుంచి 10 మంది ఉండే అవకాశం కల్పించాలి. అయితే దివ్యాంగుల సంఘంలో మహిళలతో పాటు పురుషులు కూడా ఒక సంఘంగా ఏర్పడే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది, అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలోని అన్ని మండలాల్లో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికల కోసం నూతనంగా సంఘాల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని మండలాల్లో ఐకేపీ ఏపీఎం, సీసీలు సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సంఘాలను గుర్తించి ఖాతాలు తెరిపించి వెబ్సైట్లో నమోదు చేయాలని ఆదేశించాం. ఈ నెలాఖరు వరకు సంఘాల ప్రకియ పూర్తి చేయాలి. – దత్తారాం, డీఆర్డీవోసంఘాలు ఎందుకంటే..సంఘాల్లో ఉన్న ఎంతోమంది మహిళలు పొదుపు డబ్బులు, రుణం ద్వారా కుటీర, ఉపాధి వనరులు, చిన్నచిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటూ కుటుంబ పోషణలో భాగస్వామ్యం అవుతున్నారు. వయస్సు పైబడిన వారు ఇంటికే పరిమితమై తాము ఒంటరిగా ఉన్నామనే ధ్యాసలోపడి మానసిక వ్యథకు గురికాకుండా సంఘంగా ఏర్పడితే వారిలో తన కోసం నలుగురు ఉన్నారనే మానసిక స్థైర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. కిశోర బాలికలను కూడా సంఘాల్లో చేర్పించి సమాజంలో మంచి, చెడులను తెలుసుకునే అవకాశం కల్పించింది. దివ్యాంగులు కూడా తాము ఎవరికీ తీసిపోమనే విధంగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి అండగా నిలవాలని ప్రభుత్వం భావించింది. -
ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఆదివారం ఎస్సారెస్పీ నుంచి 50 వేల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల వరద, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మరో 36 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 90 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లోఉండడంతో అధికారులు ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి 71 వేల క్యూసెక్కుల నీటిని గోదా వరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 147.95 మీటర్లు ఉంది. మొత్తం 20.175 టీఎంసీలకు 19.950ల టీఎంసీల నీరు ఉన్న ట్లు అధికారులు పేర్కొన్నారు. -
సదాస్మరణీయం పుస్తక పరిచయం
మంచిర్యాలఅర్బన్: జిల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక సరస్వతీ శిశుమందిర్లో కవ యిత్రి సుబ్బాయమ్మ రచించిన సదాస్మరణీయులు పుస్తక పరిచయం ఆదివారం నిర్వహించారు. సీనియర్ అభియంత సాధుల నందమయ్య, అధ్యాపకులు నోముల చంద్రశేఖర్ రచియిత్రి చిత్రించిన సంఘ సేవకులను, కవులను వారు చేసిన త్యాగనిరతిని కొనియాడాయిని రితీని ఎంతో అద్భుతంగా సమీక్షించారు. రచయిత్రీ సుబ్బాయమ్మ ఎంతో ఓర్పుతో దేశ స్వాతంత్య్రం కోసం నిస్వార్థ నాయకుల సేవలను కొనియాడుతూ రాసి పుస్తకం చదవటం ద్వారా సేవాగుణం అలవర్చుకోవాలని సూచి ంచారు. అంతకుముందు నిర్వహించిన కవిసమ్మేళనం అలరించింది. సా హితీ సంస్థ జిల్లా అధ్యక్షు డు వామన్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అల్లాడి శ్రీనివాస్, కవులు అడ్డగూరి శ్రీలక్ష్మి, సంతోష్, సుగుణాకర్, శ్రీనాథ్గౌడ్, సుదాంశ్, పద్మజ, సుజాత కవితాగానం చేశారు. -
బోధించేవారేరి?
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో మెడికల్ కళాశాల ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయినప్పటికీ నేటికీ కళాశాలలో పూర్తిస్థాయిలో బోధన సిబ్బందిని నియమించలేదు. ఉన్నవారితోనే ప్రస్తుతం తరగతులు కొనసాగిస్తున్నారు. ఖాళీల భర్తీ కోసం పలుమార్లు నోటిఫికేషన్ ఇచ్చినా జిల్లాలో అనుకున్న సౌకర్యాలు లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. అంతేకాకుండా కళాశాల నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఉండేందుకు పాత కలెక్టరేట్లో వసతి కల్పిస్తున్నారు. ఆసక్తి చూపడం లేదుజిల్లాలోని మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు పలుమార్లు దరఖాస్తులు ఆహ్వానించినా ఇక్కడ పనిచేసేందుకు బోధన సిబ్బంది ముందుకు రావడంలేదు. దీంతో ఉన్న వారితోనే చదువులు కొనసాగిస్తుండడంతో అప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రొఫెసర్లను నియమించి కళాశాలలో సౌకర్యాలు కల్పించాలని జనవరి 2న విద్యార్థులు రెండు రోజుల పాటు ధర్నాలు సైతం నిర్వహించారు. సంబంధిత అధికారుల జోక్యం చేసుకుని విద్యార్థులకు నచ్చచెప్పి ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కానీ ఇప్పటికీ ఖాళీలు భర్తీ చేయలేదు. ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఆ ప్రభావం విద్యార్థుల భవిష్యత్పై పడుతోంది. దీంతో ఇతర జిల్లా విద్యార్థులతో పోటీపడలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భర్తీ కాని ఖాళీలు...గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించకుండానే మెడికల్ కళాశాల ప్రారంభించారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం త రగతులు కూడా కొనసాగుతున్నాయి. కళాశాలలో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు 200 మంది వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. వారికి విద్యాబోధన చేసేందు కు కళాశాలలో మొత్తం 106 మంది సి బ్బంది ఉండాల్సి ఉంది. కానీ కేవలం 9 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తుండగా 97 పోస్టులు ఖాళీగానే ఉన్నా యి. వీటిలో ప్రొఫెసర్లు 27 మందికిగానూ నలుగురు ఉండగా 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 30 మందికిగానే ఒక్కరే ఉండగా 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 58 మందికిగానూ నలుగురు మాత్రమే ఉండగా 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
జూనియర్లకు ‘ఎఫ్ఆర్ఎస్’
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి అమలులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)ను ఇప్పుడు విద్యార్థులకు కూడా విస్తరించారు. ఈ నెల 23 నుంచి విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు జరిగేది. ఈ కొత్త వ్యవస్థ విద్యార్థుల హాజరును కచ్చితంగా ట్రాక్ చేయడంతోపాటు అవకతవకలను నిరోధించడానికి ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వ యుడాయి సంస్థతో సాంకేతిక ఒప్పందం ముగిసినప్పటికీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సహకారంతో ఈ విధానం కొనసాగుతోంది. హాజరు నమోదు ప్రక్రియ.. మంచిర్యాల జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 165 మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 4,320 మంది విద్యార్థులు చదువుతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 11 జూనియర్ కళాశాలల్లో 4,360 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 231 మంది అధ్యాపకులు బోధిస్తున్నారు. హాజరు నమోదు కోసం సీజీజీ సాంకేతిక సహకారంతో టీజీబీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఉపయోగిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కళాశాల సిబ్బంది తమ మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. ఒకవేళ విద్యార్థి కళాశాలకు హాజరు కాకపోతే, వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. రోజువారీ హాజరు డేటాను రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. తరగతులకు సక్రమంగా హాజరు కాకపోవడమే ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు విఫలమవడానికి ప్రధాన కారణమని గుర్తించిన అధికారులు, ఈ విధానం ద్వారా పారదర్శకతను పెంచాలని భావిస్తున్నారు. వసతిగృహాల్లో హాజరు సమస్యలు.. వసతిగృహాల్లో పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఈ గృహాల్లో మాన్యువల్ రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు జరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో 17 ఎస్సీ పోస్ట్మెట్రిక్, 8 ప్రీమెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. ప్రీమెట్రిక్ గృహాల్లో 1,208 మంది, పోస్ట్మెట్రిక్ గృహాల్లో ఒక్కో హాస్టల్లో 120–150 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. పోస్ట్మెట్రిక్ గృహాల్లో ఉంటూ కళాశాలల్లో చదివే విద్యార్థులు స్కాలర్షిప్లు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో చేరిన తర్వాత ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో మాన్యువల్ పద్ధతిలోనే భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. బీసీ, ఎస్టీ వసతిగృహాల్లో సవాళ్లు.. జిల్లాలో 18 బీసీ వసతిగృహాల్లో 1,520 మ?ంది విద్యార్థులకు వసతి కల్పించారు. బీసీ గృహాల్లో ప్రవేశం పొందిన వెంటనే ఆన్లైన్లో పేరు నమోదవుతున్నప్పటికీ, హాజరు నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. 16 ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో 2,600 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతేడాది ఎస్టీ పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో ఎఫ్ఆర్ఎస్ ప్రారంభించినప్పటికీ, స్కాలర్షిప్ ప్రక్రియ ఆలస్యం కారణంగా ఈ విధానం సజావుగా అమలు కావడం లేదు. దీంతో అన్ని వసతిగృహాల్లో హాజరు నమోదు మాన్యువల్గానే కొనసాగుతోంది.జిల్లాల వారీగా కళాశాలలు, విద్యార్థులు, అధ్యాపకుల వివరాలు..జిల్లా కళాశాలలు విద్యార్థులు సిబ్బంది (బోధన, బోధనేతర) మంచిర్యాల 10 4,320 165 కుమురంభీం ఆసిఫాబాద్ 11 4360 231 -
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
కెరమెరి: శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, జీడీ, చార్జీషీట్లు, కేస్ డైరీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డయల్ 100కు ప్రజల నుంచి వచ్చిన కాల్స్కు తక్షణమే స్పందించాలని సూచించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా ఉండాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా నిష్టతో పని చేయాలన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా వ్యవహరించాలన్నారు. గణేశ్ ఉత్సవాల్లో అవసరమైన ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి
కాగజ్నగర్టౌన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అందరూ కలిసి కట్టుగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాగజ్నగర్ డీఎస్పీ రామానుజన్ అన్నారు. శనివారం సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవా ల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండపాల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. నిబంధన ల మేరకు అన్ని అనుమతులు తీసుకోవాలన్నారు. అనంతరం ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కౌటాల సీఐ సంతోష్కుమార్, ఎస్సై కమలాకర్, వినాయక మండపాల నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు. -
జ్వరమొచ్చింది
ఆసిఫాబాద్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా యి. వారం రోజులుగా జిల్లాలోని పలు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రతీరోజు 450 వరకు ఓపీ నమోదవుతుండగా వందకు పైగా ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు వాంకిడి, రెబ్బెన, తిర్యాణి మండలాలకు చెందిన రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని శనివారం‘సాక్షి’ విజిట్ చేయగా వార్డులు రోగులతో కిటకిటలాడుతూ కనిపించా యి. జిల్లా కేంద్రానికి చెందిన శంకరమ్మ, భూమ య్య, లింగమ్మ, రామయ్య, ఈదులవాడకు చెందిన మారయ్య, మొండక్క, రహపల్లికి చెందిన పెంటయ్యతో పాటు 255 మంది జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజు ల్లోనే జిల్లా ఆసుపత్రిలో 189 వైరల్ కేసులు, 9 టై ఫాయిడ్, ఒక మలేరియా, ఒక డెంగీ కేసు నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆస్పత్రులకు రోగుల తాకిడిజిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో సాధారణ సమయంలో రోజుకు 300 వరకు ఓపీ నమోదవుతుండగా వారం రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. దీంతో శనివారం ఔట్పేషెంట్ల సంఖ్య 426కు చే రుకుంది. గతంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి 50 పడకలు ఉండగా ప్రస్తుతం జిల్లా మెడికల్ కళాశాల పరిధిలోకి వెళ్లడంతో ఆ సంఖ్య 330కి చేరుకుంది. ఆస్పత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్తో పాటు పక్క వార్డును వృద్ధులకు కేటాయించగా, రెండోఫ్లోర్ను జనరల్ వార్డుకు మార్చారు. దీంతో గతం కంటే అధికంగా రోగులు చికిత్స పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలు వైరల్ జ్వరాలతో బాధపడుతూ ఆర్ఎంపీ వైద్యులవద్ద చికిత్స పొందుతున్నారు. పేదలపై ఆర్థిక భారం జ్వర తీవ్రతతో బాధపడతుఉన్న మరి కొంతమంది జిల్లా కేంద్రంతో పాటు కాగజ్నగర్, మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పరీక్షల పేరుతో వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ, టైఫాయిడ్, మలేరియా, ఇతర పరీక్షలతో పాటు బెడ్ చార్జీలు, మందుల బిల్లులు పేదలకు భారంగా మారడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు అందుబాటులో ఉండాలి. గ్రామాల్లో వైద్య సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన వారికి చికిత్స అందిస్తున్నాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. – డాక్టర్ సీతారాం, డీఎంహెచ్వో, ఆసిఫాబాద్ -
తల్లిదండ్రులదే బాధ్యత
పిల్లలను మంచి పౌరులుగా పెంచడంలో తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. పిల్లలు ఏడుస్తున్నారని వారికి స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వారు ఏది చూస్తున్నారో అలానే బయట ప్రవర్తిసున్నారు. స్మార్ట్ఫోన్కు బానిసైతే కంటి, నిద్రలేమి, ఒత్తిడి, కోపం, తలనొప్పి, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. బుక్స్ చదవడం, డ్రాయింగ్, ఇన్డోర్, అవుట్డోర్ గెమ్స్ ఆడించాలి. పార్కులకు తీసుకెళ్తూ వారితో సమయం కేటాయించాలి. పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి ఉంచాలి. పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నా యూట్యూబ్ ఛానల్లో చూసి పలు జాగ్రత్తలు పాటించవచ్చు. – డాక్టర్ ఆర్.కవిత అజయ్, మానసిక వైద్యురాలు, మంచిర్యాల -
పనుల జాతరపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కాగజ్నగర్టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ ం పను ల జాతర పేరుతో కొత్త పథ కం తీసుకువచ్చిందని, ఇందులో ఏ యే పనులు చేపట్ట నున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. శనివా రం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,200 కోట్లతో పనుల జాతర అని చెబుతున్నారని, 18 నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోడంతో పారిశుద్ధ్య కార్మికులకు జీతా లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రా మాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. పనుల జాతర పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోందని ఆరోపించారు. -
లాభాల్లో 40 శాతం వాటా చెల్లించాలి
రెబ్బెన: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 40 శాతం వాటా చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షు డు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు రక్తాన్నే చెమట చుక్కలుగా మార్చి సంస్థను అభివృద్ధిబాటలో నడిపిస్తున్నారని, అలాంటి కార్మికులకు సంస్థ ఆర్జించిన లాభాల్లో నుంచి 40 శాతం వాటా చెల్లించాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలు గు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడం సరికాదన్నారు. ఓసీపీలు, గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును కోల్ ట్రాన్స్పోర్టు కార్మికులు సీహెచ్పీలకు తరలించి సంస్థ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. డ్రైవర్లు, క్లీనర్లు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ట్రాన్స్పోర్టు కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం క ల్పించాలని, ప్రతీనెల 10వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తిరుపతి, అశోక్, రవి, లచ్చన్న, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
ఆశవర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కాగజ్నగర్టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వ ర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డి మాండ్ చేశారు. శనివారం పట్టణంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ కనీస వేతనం రూ.18 వేలు ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా నెరవేర్చలేదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫి ట్స్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, ఆదివారం, పండగ రోజుల్లో సెలవులు అమలు చేయాల ని కోరారు. సమావేశంలో ఆశ వర్కర్స్ యూ నియన్ జిల్లా కార్యదర్శి పద్మ, కాగజ్నగర్ పట్టణ అధ్యక్షురాలు భాగ్య, ప్రధాన కార్యదర్శి పంచశీల జరీన, రామజ్యోతి, శకుంతల, వాణి, సురేఖ, తదితరులు పాల్గొన్నారు. -
‘సురవరం’ మృతి ఉద్యమాలకు తీరనిలోటు
ఆసిఫాబాద్అర్బన్: కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మృతి వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ సీనియర్ నాయకులు బద్రి సత్యనారాయణ అన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, నాయకులు రాకేష్, తిరుపతి, రంజిత్, శ్రావణ్, ధనుంజయ్, వినీష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
దారితప్పుతున్న బాల్యం!
కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదివే ఓ బాలుడు (5) క్లాస్రూంలో తోటి బాలిక (5)కు ఐలవ్యూ చెప్పాడు. బాలిక విషయాన్ని క్లాస్ టీచర్కు చెప్పడంతో అవాకై ్కంది. ఐదేళ్ల బాలుడి ప్రవర్తనఫై పాఠశాల యాజమాన్యం ఆరా తీయగా సెల్ఫోన్లో యూట్యూబ్ రీల్స్ ప్రభావంతోనే అలా మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి స్మార్ట్ఫోన్కు దూరంగా ఉంచాలని సూచించారు.కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని ఓప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు (6) తన తోటి విద్యార్థిని (6)ను క్లాస్ రూంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థినితో పాటు ఉపాధ్యాయురాలు బెంబేలెత్తిపోయారు. ఉపాధ్యాయులు పూర్వాపరాలు ఆరా తీస్తే.. ఫోన్లో వీడియో షార్ట్ చూస్తూ ఆ బాలుడు క్రమంగా అలా ప్రవర్తించడం మొదలెట్టినట్లు గుర్తించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను పిల్లలు ఎదిరించి మాట్లాడుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. పిల్ల లు చిన్న వయసు నుంచి పెడదారి పడుతుండడం ఆందోళన కలిగించే అంశం.కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో గత జనవరిలో ఇంటర్ చదివే నలుగురు యువకులు గొడవపడ్డారు. డయల్ 100కు సమాచారం రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి వెళ్లారు. గొడవను ఆపేందుకు ప్రయత్నం చేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను ఇద్దరు యువకులు తోసేసి వారి విధులకు ఆటంకం కలిగించారు. సదరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో గాడితప్పుతున్న బాల్యానికి ఈ ఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 1–5 ఏళ్ల చిన్నారులు 35,5566–17 ఏళ్ల పాఠశాల, కళాశాల విద్యార్థులు 1,11,757కౌటాల(సిర్పూర్): ప్రస్తుత ఆధునిక కాలంలో పిల్ల లు, మైనర్ విద్యార్థులు పెడదారి పడుతున్నారు. బాల్యంలోనే నేరాల బాట పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం తల్లిదండ్రులనే కాదు పోలీసులనూ ఆందోళనకు గురిచేస్తోంది. పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు దారి తప్పుతున్న సంఘటనలూ ఉన్నాయి. సామాజిక పరిణామాలు, కుటుంబ పరి స్థితులు, అందుబాటులోకి వచ్చిన అవసరానికి మి ంచిన సాంకేతిక పరిజ్ఞానం వంటివి బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గంజాయి మత్తులో తూగుతున్న వారిలో నూ చాలా మంది టీనేజీ, అంతకంటే తక్కువ వయ సు వారు ఉంటున్నారు. పోలీసులు వారిని పట్టుకు ని కేసులు పెట్టకుండా కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. ఇక రోడ్లపై ద్విచక్ర వాహనా లతో రాత్రివేళ రయ్యిమంటూ దూసుకెళ్తున్న వారి లోనూ పలువు రు మైనర్లే. ఎవరైనా వీరిని ప్రశ్నిస్తే ఎదురు తిరుగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో యువతులను వేధి స్తున్న వారిలో మైనర్లే ఎక్కువ మంది ఉంటున్నారు. నిఘా కరువు..తల్లిదండ్రుల నుంచే పిల్లలు సంస్కారం నేర్చుకోవా లి. దురదృష్టవశాత్తు ఇప్పటి పిల్లలు చాలామంది సెల్ఫోన్లకు బందీలై వాటి ద్వారానే అలవాట్లు నేర్చుకుంటున్నారు. పలువురు తల్లిదండ్రులకు కూడా పిల్లలకు మంచీచెడు చెప్పే సమయం ఉండటం లేదు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల డిమాండ్లను రెండో ఆలోచన లేకుండా అంగీకరిస్తుండడంతో వారిని అదుపు చేయడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న పిల్లలు దారి తప్పుతున్నారు. పేరెంట్స్ బలహీనతలను గుర్తించడంలో పిల్లలకు ప్రావీణ్యం ఎక్కువ. వారి అభ్యర్థనను అతి గారాబంతో అంగీకరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించాలి. పిల్లల ప్రవర్తను చిన్నప్పటి నుంచే గుర్తించి వారిని దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని పలువురు పేర్కొంటున్నారు. నేటి పిల్ల లే రేపటి పౌరులనే విషయాన్ని తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. పిల్లలు, యువతలో హింసాత్మక ధోరణి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వారిపై నిఘా పెట్టి చెడు అలవాట్లు ఉన్నవారికి మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలి. పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ప్రభుత్వం నియంత్రణ తీసుకురావాలని పలువు రు కోరుతున్నారు.6–17 ఏళ్ల బడి బయట విద్యార్థులు: 3,150 చిన్ననాటి నుంచే...అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. పిల్లల అల్లరి ఆపడం కోసం చాలా మంది తల్లిదండ్రులు వారిచేతికి స్మార్ట్ఫోన్ ఇస్తుంటారు. ప్రారంభంలో ఇది సరదాగా అనిపించినా.. క్రమేపీ అదొక వ్యసనంలా మారుతోంది. పిల్లలు సైతం పెద్దల ప్రమేయం లేకుండానే స్మార్ట్ఫోన్లో గేమ్లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మంచితో పాటు చెడు మిళితమై ఉండడంతో పాటు అతి వినియోగంతో అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పుస్తక పఠనం, క్రీడలకు బదులు స్మార్ట్ఫోన్లతో కాలం గడపటం ఎక్కువైంది. చాలా మంది వారికి తెలియకుండానే మానసిక రోగుల్లా మారారు. బాల్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి, పేలవమైన పర్యవేక్షణ యుక్తవయసులో వారు పక్కదారి పట్టడానికి కారణమవుతున్నాయి. పాఠశాలల్లో నిర్వహించే పేరెంట్స్ మీటింగ్కు తల్లిదండ్రులు హాజరు కావాలి. తమ పిల్లల ప్రతిభపై వ్యక్తిగతంగా చర్చించడంతో పాటు వారి అలవాట్లు, వారిలో తీసుకురావాల్సిన మార్పులు, గుణగణాలపై చర్చిస్తారు. జిల్లా వివరాలుమొత్తం 1,50,907 మంది పిల్లలు1–5 ఏళ్లు అంగన్వాడీ బయట విద్యార్థులు 444 -
‘పొలాల’ సంబరాలు
ఆసిఫాబాద్: పొలాల అమావాస్యను శనివారం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని రైతులు తమ ఎడ్లను వివిధ రంగులతో అలంకరించి నైవేద్యం సమర్పించారు. ఉదయం ఇళ్లల్లో మట్టితో చేసిన ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, బెస్తవాడ, బనార్వాడ, తేలివాడతో పాటు పలు కాలనీలకు చెందిన రైతులు మేళతాళాలు, డప్పు చప్పుళ్ల మధ్యన నృత్యాలు చేస్తూ ఎడ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బీజేపీ జిల్లా నాయకుడు అరిగెల నాగేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ మర్సోకోల సరస్వతి, సింగిల్విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, ఏఎంసీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో రైతులు ‘హహరహర మహాదేవ్’ అంటూ నినాదాలు చేశారు. దస్నాపూర్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు రహదారిపై ఎడ్లతో సందడిగా మారింది. పట్టణంలోని పలు ఆలయాల చుట్టూ ఎడ్లతో ప్రదక్షణలు చేశారు. కాగజ్నగర్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు నివాసంలో ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. కాగజ్నగర్టౌన్: ఎద్దుకు పూజ చేస్తున్న ఎమ్మెల్యేఎద్దులకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
అందుబాటులో ఉండి వైద్యం అందించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ గిరిజనులు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. తిర్యాణి మండలం గిన్నెధరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పర్మినెంట్ 108 అంబులెన్స్ అందుబాటులో లేదని, సిబ్బందికి సరిపడా భవనాలు లేవని, తదితర సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఐటీడీఏ పీవోతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్చార్జి మంత్రితో మాట్లాడి సిబ్బందికి నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా సార్మెడి కుర్సెంగ మోతీరాం, గిన్నెధరి సార్మెడి అడ తాను, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మర్సుకోల కమల తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలకు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన 30 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో మహబూబ్గనగర్లో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ కోచ్లు విద్యాసాగర్, అరవింద్, పీఈటీలు యాదగిరి, లక్ష్మి, సరోజ, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సరుకులు సైతం అందించాలి
ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరి రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతోపాటు పప్పు, నూనె, చక్కెర, ఉప్పు, కారం వంటి నిత్యావసర సరుకులు అందించాలి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పెరగడంతో కొనలేని పరిస్థితి ఉంది. – వొజ్జల శిరీష్శర్మ, ఆసిఫాబాద్ ఐదేళ్లుగా ఎదురుచూశాంఐదేళ్ల క్రితం నాకు వివాహం జరిగింది. అప్పటి నుంచి రేషన్కార్డు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు సర్వే నిర్వహించి మంజూరు చేశారు. కొన్నేళ్లపాటు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాం. ప్రస్తుతం ఆ సమస్య తీరింది. – గుర్నులె జ్యోత్స్న, వాంకిడి -
తిర్యాణి బ్లాక్ పురోగతి సాధించాలి
ఆసిఫాబాద్అర్బన్: సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో తిర్యాణి బ్లాక్ పురోగతి సాధించి ముందు వరుసలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. తిర్యాణి మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం విద్య, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమ, ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమం, వ్యవసాయం, మిషన్ భగీరథ, గ్రా మీణాభివృద్ధి శాఖల అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులకు హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్స అందించాలన్నారు. ప్రతినెలా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సరైన పోషకాహారం అందించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ఎంపీడీవో మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వాంకిడి(ఆసిఫాబాద్): రోడ్డు, రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. వాంకిడి మండలంలోని టోల్ప్లాజా వద్ద అధిక శబ్దానిచ్చే 50 మాడిఫైడ్ సైలెన్సర్లను శుక్రవారం రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం పెరుగుతుందన్నారు. నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మాడిఫైడ్ సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీ ద్వారా వచ్చిన సైలెన్సర్లు మాత్రమే వాడాలని సూచించారు. అలాగే డీజేల ఏర్పాటుకు అనుమతి లేవని, రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత ధ్వని కాలుష్యం కలిగించేలా స్పీకర్లు పెట్టొద్దన్నారు. కార్యక్రమంలో సీఐలు బాలాజీ వరప్రసాద్, సత్యనారాయణ, రమేశ్, సంజయ్, ఎస్సైలు మధుకర్, చంద్రశేఖర్, ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నియంత్రణ కేంద్రం.. నిరుపయోగం
కాగజ్నగర్టౌన్: జిల్లాలో కుక్కల జనాభాను నియంత్రణకు కాగజ్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన డాగ్స్ రిహాబిటేషన్ కేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఓ వైపు కుక్కలు మనుషులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీధికుక్కల విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శునకాలకు తప్పనిసరిగా స్టెరిలైజేషన్ చేసిన తర్వాతే బయటికి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ కాగజ్నగర్లో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన కేంద్రం నిరుపయోగంగా మారింది. రూ.20లక్షలతో నిర్మాణం కుక్కల నియంత్రణలో భాగంగా కాగజ్నగర్లోని సీబాబుకాలనీలో గల ప్రభుత్వ స్థలంలో రూ.20 లక్షలతో డాగ్స్ రిహాబిటేషన్ సెంటర్ భవనాన్ని నిర్మించారు. కుక్కల జనాభాను అరికట్టేందుకు శస్త్ర చికిత్సలు, స్టెరిలైజేషన్, యాంటీ రెబీస్ వ్యాక్సిన్లు తదితర చర్యలు ఇక్కడ చేపట్టాల్సి ఉంది. ఈ సెంటర్లో కుక్కలకు చికిత్స చేసేందుకు కావాల్సిన సర్జికల్ థియేటర్లు, రికవరీ యూనిట్లు, ఇతర మౌలి క సదుపాయాలు సమకూర్చాలి. భవన నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు సిబ్బందిని నియమించలేదు. ఈ కారణాలతోనే కేంద్రం ప్రారంభంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ప్రారంభిస్తాంపట్టణంలో కుక్కల నియంత్రణకు సీబాపుకాలనీలో రిహాబిటేషన్ సెంటర్ నిర్మాణం పూర్తయ్యింది. ప్రారంభంలో జరుగుతున్న జాప్యం విషయాన్ని అడిషనల్ కలెక్టర్ దృష్టికి ఇటీవల తీసుకెళ్లాం. శస్త్ర చికిత్సకు కావాల్సిన పరికరాలు సమకూర్చి, సిబ్బందిని నియమిస్తాం. త్వరలోనే కేంద్రం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ పెరుగుతున్న కుక్కల సంఖ్యకాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. సుమారు 70 వేల మంది నివస్తున్నా రు. రెండేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ వార్డులోని ఖాళీ ప్రదేశాలు, ఖాళీ క్వార్టర్లలో తలదాచుకుంటూ సంతానం పెంచుకుంటున్నాయి. కుక్కల నియంత్రణ కు పటిష్టమైన ఎనిమల్ బర్త్ కంట్రోల్ (స్టెరిలైజేషన్) లేకపోవడంతో వాటి సంతతి పెరుగుదలపై అడ్డూఅదుపు లేకుండా పోయింది. రాత్రిపూట రోడ్లపై తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడులకు దిగుతున్నాయి. ఇ టీవల పట్టణంలోని కాపువాడకు చెందిన మహిళపై శునకాలు దాడి చేసి గాయపర్చాయి. అధి కారులు స్పందించి మున్సిపాలిటీలోని డాగ్స్ రిహాబిటేషన్ సెంటర్ను ప్రారంభించి కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించి వాటి జనాభాను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎరువుల కోసం రైతుల ఆందోళన
కాగజ్నగర్టౌన్: సరిపడా డీఏపీ, యూరియా బస్తాలు ఇవ్వడం లేదని శుక్రవారం కాగజ్నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగినా పీఏసీఎస్ సిబ్బంది పట్టించుకోవడం లేదని, చిట్టీలు ఉన్న వారికే ఇస్తున్నారని ఆరోపించారు. విడతల వారీగా ఎకరానికి రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. పీఏసీఎస్ సిబ్బంది ముక్తార్, సతీశ్తో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని రైతులను సముదాయించారు. చిట్టీలు ఉన్నవారికే ఎరువులు ఇస్తారని చెప్పడంతో రైతులు వరుసలో నిలబడి రాత్రి 8 గంటలు దాటే వరకు బస్తాలు తీసుకున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి రామకృష్ణను వివరణ కోరగా.. కాగజ్నగర్ మండలంలో ఖరీఫ్ సాగుకు 85 వేల బస్తాలు అవసరం కాగా ఇప్పటికే రైతులకు పీఏసీఎస్ ద్వారా 27 వేల బస్తాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా 14వేల బస్తాలు, ఇతర ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా డీఏపీ బస్తాలు అందించామని తెలిపారు. ఈ నెల 9న డీఏపీ, యూరియా బస్తాల పంపిణీ కూపన్లను పీఏసీఎస్లకు ఇవ్వాలని పాలకవర్గ సభ్యులు కోరడంతో అప్పగించామన్నారు. రైతులు నానో యూరియా వాడాలని సూచించారు. సరిపడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉందని రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. -
పనులు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దో త్రే అన్నారు. మండలంలోని అంకుసాపూర్లో శుక్రవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అంతకుముందు వందరోజులు పనిచేసిన ఉపాధి కూలీలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీ ఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో బుచ్చయ్య, డీఎల్పీవో హుస్సేన్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం అందరి బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: రక్తదానం అందరి బాధ్యతని, ప్రతిఒక్కరూ ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్, డీఎంహెచ్వో సీతారాం, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ హాజరయ్యారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతీ మూడు నిమిషాలకు ఒకరికి రక్తం అవసరం పడుతుందని, మనిషి మాత్రమే రక్తదానం చేయగలడన్నారు. నాలుగురోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రంలో రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్ష యూనిట్ల రక్తం సేకరించాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో సీతారాం రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ కాగజ్నగర్, ఆసిఫాబాద్లో రెండు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని, జైనూర్లో మరొకటి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, వైద్యశాఖ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
బాలుడిపై మూడుసార్లు కాటువేసిన కట్లపాము
పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన కొడప నవదీప్(11) అనే బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నేలపై నిద్రించాడు. సుమారు 9గంటల ప్రాంతంలో కట్లపాము నవదీప్ చేతిపై మూడుసార్లు కాటువేసింది. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లైటు వేశారు. పక్కనే ఉన్న కట్లపామును గమనించి కొట్టి చంపారు. బాలుడిని చికిత్స కోసం కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సిర్పూర్(టి)లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న నవదీప్ ఇటీవలే ఇంటికి వచ్చాడు. పాముకాటుతో కన్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు సులోచన, జగదీష్ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబానికి పలువురు దాతలు ఆర్థికసాయం అందించారు. -
‘ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తాం’
బెజ్జూర్(సిర్పూర్): భారీ వర్షాలతో ప్రాణహి త నది ఉప్పొంగి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహా రం అందిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. మండలంలో ప్రాణహిత వరదతో మునిగిన పంటలను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూర్ మండలంలో తప్ప అన్ని మండలాల్లో గతంలో పరిహారం అందించారని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధికారులు సక్రమంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని సూచించారు. సమస్యలు ఉంటే తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఏవో రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పంద్రం పుష్పలత, జగ్గాగౌడ్, విశ్వేశ్వర్, టాకిరే శ్రీనివాస్, రాచకొండ శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి సాగు చేస్తే రాయితీలు రద్దు
ఆసిఫాబాద్: గంజాయి సాగు చేస్తే రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు రద్దు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం మాదకద్రవ్యాల నివారణపై ‘నషా ముక్త్ భారత్ అభియాన్’పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని, అధికారులు భూయజమానులపై చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు 200 మీటర్ల దూరం వరకు ఎలాంటి పాన్టేలాలు ఉండొద్దని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలిజిల్లాలో పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ వెంకటేశ్దోత్రే అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్నబీ ఉత్సవాల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో ఉత్సవాల నిర్వాహకులు, మసీదు కమిటీ ప్రతినిధులతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గణేశ్ మంట పాల పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ట్రాఫిక్ సమ స్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా సమావేశాల్లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీటీవో రాంచంందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, డీఎస్పీ రామానుజం, ట్రాన్స్కో ఎస్ఈ శేషారావు, డీపీవో భిక్షపతి, శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
3న జాతీయ లోక్అదాలత్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎంవీ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో గురువారం సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి ఉల్లం అజయ్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అమృత్పౌల్ కౌర్, ఏఎస్పీ చిత్తరంజన్తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్అదాలత్లో రాజీ మార్గం ద్వారా కేసులు పరి ష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రాజీ చేయడానికి అనుకూలంగా ఉన్న కక్షిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, సీఐలు, ఎస్సైలు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
క్షీణిస్తున్న ‘పాల్వాయి’ ఆరోగ్యం
కాగజ్నగర్టౌన్: ఎమ్మెల్యే పాల్వయి హరీశ్బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. రాత్రి ప్రభు త్వ ఆస్పత్రి వైద్యుడు శ్రీధర్బాబు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం కాగజ్నగర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురైతే జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించా రు. సమావేశంలో ఈర్ల విశ్వేశ్వర్రావు, శ్రీని వాస్, మోతీరాం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతుసత్యాగ్రహ దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతు పలికారు. కాగజ్నగర్ మండలంలోని బెంగాళీలు, విశ్వబ్రహ్మణ సంఘం, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎమ్మాజీ, నాయకులు ముకేశ్గౌడ్, తిరుపతి, ఆంజనేయులు, గోవర్ధన్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
‘పింఛన్లు పెంచకుంటే ఊరుకోం’
కౌటాల(సిర్పూర్): హామీ మేరకు కాంగ్రెస్ ప్ర భుత్వం పింఛన్లు పెంచకుంటే ఊరుకోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. కౌటాలలో గురువారం ఏర్పాటు చేసిన మహాగర్జన స న్నాహక సదస్సులో మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా పెన్షన్లు పెంచకుంటే హైదరాబాద్లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎ స్ మండల అధ్యక్షుడు ఇగురపు విఠల్, నాయకులు పిట్టల సత్యనారాయణ, థామస్, అని ల్, రాజేశ్, హీరమన్, శంకర్ పాల్గొన్నారు. -
మద్యం పాలసీ వచ్చేసింది..
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ప్రస్తుత పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుండగా, పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేలా 2025– 27 నూతన ఎకై ్సజ్ పాలసీ ఖరారు చేసింది. రెండేళ్లపాటు ఈ విధానం అమల్లో ఉండనుంది. తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుం గతంలో రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలకు పెంచింది. అయితే టెండర్ షెడ్యూల్ను మాత్రం ప్రకటించలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరించే అవకాశాలు ఉన్నా యి. రెండేళ్లపాటు దుకాణాల నిర్వహణకు ఒకరు ఎన్నైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలుడిసెంబర్ నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి రానుంది. రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 1,020 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.20.40 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో మాదిరిగానే జిల్లాలోని 15 మండలాల్లో 32 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రాతిపదికన షాపులు కేటాయించనుంది. గౌడ కులస్తులకు 2, ఎస్సీ 4, ఎస్టీలకు 6 దుకాణాలు కేటాయించగా, జనరల్ కేటగిరీలో మరో 20 దుకాణాలకు లక్కీ డ్రా పద్ధతిన టెండర్లు నిర్వహించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రుసుం రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డుతోపాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. జనరల్ కేటగిరీ అయితే ఆధార్, పాన్ కార్డు, మూడు పాస్ఫొటోలు జత చేయాలి. ఈ విషయమై జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్ను సంప్రదించగా.. జిల్లాలో పాత విధానం మాదిరిగానే మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ తేదీ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. -
కార్మికుడి వారసులకు చెక్కులు అందజేత
రెబ్బెన: సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుడి వారసులకు బుధవారం ఏకమొత్తం చెక్కును గోలేటి లోని జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి అందజేశారు. గోలేటి 1ఏ గనిలో కోల్కట్టర్గా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో గులాం మృతి చెందాడు. అతని వారసులైన యూసుఫ్ అలీ, మాసుం అలీ వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారు మెడికల్ ఫిట్ సాధించలేకపోవడంతో ఏకమొత్తం చెల్లింపు కోసం యాజమాన్యానికి దరఖాస్తు చేసుకోవడంతో ఆదాయపు పన్నును మినహాయింపు కాగా ఒక్కొక్కరికి రూ. 6.25 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం రాజేశ్వర్రావు, ఏఐటీయూసీ నాయకులు కిరణ్, జూనియర్ అసిస్టెంట్ బాబా, తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో పనుల జాతర
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 22న పనుల జాతర – 2025 కార్యక్రమం చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఏ ర్పాట్లు సిద్ధం చేశాయి. ఆ రోజున ఉపాధిహామీ పథకంతోపాటు వాటర్షెడ్ పథకం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛ భారత్ వంటి విభాగాల్లో చేపట్టిన, చేపట్టనున్న పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు నిర్వహించనున్నారు. జిల్లాలో 951 పనులుజిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పనుల జాతర –2025 నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి దత్తారావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 951 పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేయనునున్నారు. ప్రారంభోత్సవాలకు స్థానిక ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. పనుల జాతరలో భాగంగా నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణ) ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళా శక్తి– ఉపాధి భరోసా కింద వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులైన పశువుల కొట్టం, కోళ్లు, గొర్రెల షెడ్లు, పండ్ల తోటలు, వానపాముల ఎరువుల తయారీ, అజోల్లా పిట్ నిర్మాణం, జలనిధి పథకం కింద వాన నీటి సంరక్షణ, భూగర్బ జలాలు పెంచే ఫారం పాండ్స్, ఊట కుంటలు వంటి పనులు ప్రారంభించనున్నారు. రైతులు, లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభల్లో మంజూరు ఉత్తర్వులు అందించనున్నారు. అలాగే ఉపాధిహామీ పథకంలో ఎక్కువ రోజులు పని చేసిన కూలీలతోపాటు దివ్యాంగులు, పారిశుద్ధ్య కార్మికులు, హరిత సంరక్షకులను సన్మానిస్తామని అధికారులు వెల్లడించారు. -
మట్టి వినాయకుడు.. పర్యావరణ పరిరక్షకుడు
చింతలమానెపల్లి: వినాయక చవితి ఉత్సవా లకు భక్తులు సిద్ధమవుతున్నారు. గణనాథు డి విగ్రహాలకు తుది మెరుగులు దిద్దే పనిలో కళాకారులు నిమగ్నమయ్యారు. గతంలో ఇళ్లలో ప్రతిష్టించే విగ్రహాలను కుమ్మరి కళాకారులు తయారు చేసే మట్టి విగ్రహాలకు కాల క్రమేణా ఆదరణ తగ్గింది. రంగులతో మురిపించే విగ్రహాలు పర్యావరణానికి హానికరంగా మారుతుండటం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై స్పృహ పెరగడంతో మళ్లీ మట్టి విగ్రహాలకు ఆదరణ వస్తోంది. చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్ గ్రామంలో కుమ్మరి కళాకారులు మట్టి విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇళ్లలో ప్రతిష్టించేందుకు వీలుగా మంచిర్యాల, కాగజ్నగర్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఆర్డర్పై తీసుకెళ్తున్నారు. కూలి మాత్రమే గిట్టుబాటు కుమ్మరి కళాకారులకు మట్టి పని మాత్రమే ఉపాధి. వినాయక విగ్రహాల తయారీకి సిర్పూర్(టి) మండలం లోనవెల్లి నుంచి మట్టి తీసుకొస్తాం. మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. కానీ రోజుల తరబడి పని చేసినా కూలి మాత్ర మే గిట్టుబాటవుతుంది. ఎక్కువగా ఆర్డర్లు వస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు మట్టి వినాయకుల వినియోగానికి ప్రచారం చేసి, కులవృత్తిగా ఉన్న విగ్రహాల తయారీని ప్రోత్సహించాలి. – శంకర్, రుద్రాపూర్ – మరిన్ని కథనాలు 8లోu -
అప్రమత్తతే రక్ష!
చింతలమానెపల్లి(సిర్పూర్): రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్ నేరగాళ్లు వినియోగించుకుంటున్నారు. కొత్తపోకడలు అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీస్స్టేషన్లకు ఫిర్యాదులు పెరిగాయి. బాధితులకు న్యాయం చేయడంతోపాటు మోసాల బారిన పడకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2024లో 401 సైబర్ క్రైం ఫిర్యాదులు రాగా వీటిలో 31 ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2025లో ఇప్పటివరకు 195 ఫిర్యాదులు రాగా 15 ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు. పలు రకాలుగా మోసం‘బ్యాంకుల్లో నగదు తమకు తెలియకుండానే మా యమవుతుంది... బ్యాంకు అధికారులమని చెప్పి ఫోన్పే ద్వారా నగదు తీసుకున్నారు.. ఖాతాల్లోని నగదు వినియోగించుకోలేక పోతున్నాం..’ అంటూ ఇటీవల తరచూ పోలీస్స్టేషన్లకు, బ్యాంకులకు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆన్లైన్లో ఆటలు ఆడి నగదు కోల్పోతున్న వారి సంఖ్య కూడా వందల సంఖ్యలో ఉంటోంది. చిన్నారులు సైతం లక్షలాది రూపాయలను ఆన్లైన్లో కోల్పోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్, షాపింగ్ ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఇటీవల కస్టమ్స్ అధికారులమని, నగ్న వీడియో కాల్స్తో బెదిరింపులు సైతం కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీ డియాను నేరగాళ్లు మోసాలకు అనువుగా మార్చుకుంటున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి ఈ సమాచార వేదికల ద్వారా నెట్వర్క్ పెంచుకుంటున్నారు. నిమిషాల్లో రూ.లక్షల ఆదాయం, కార్లు, విలువైన బహుమతుల పేర్లతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నారు. రకరకాల కరెన్సీల పేరుతో పెట్టుబడి పెట్టించి రెట్టింపు లాభాలు ఆశ చూపి బుట్టలో వేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో గుర్తు తెలియని లింక్లు తెరిచినా వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలను తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.చింతలమానెపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు వివాదాలకు దూరంగా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉండే అతను లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు. ఇల్లు, భూములు అమ్ముకుని చెల్లించినా పూర్తిస్థాయిలో తీరలేదు. సాధారణ జీవితం గడిపే అతడు ఎలా అప్పుల పాలయ్యాడనేది గ్రామంలో చర్చనీయంగా మారింది. ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది. రకరకాలుగా బెదిరింపులు..రాత్రి సమయంలో గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఎవరో అనుకుని కాల్ లిఫ్ట్ చేస్తే.. అవతలి వైపు ఒక నగ్నంగా ఉన్న వ్యక్తి.. ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని ఆపై బెదిరింపులకు పాల్పడతారు. భయపడినా, అమాయకంగా కనిపించినా బెదిరింపులకు దిగుతారు. అందిన కాడికి డబ్బులు వసూలు చేసేందుకు ఎంతకై నా తెగిస్తారు. అలాగే కొరియర్ పంపించి, అందులో వివాదాస్పద వస్తువులు ఉన్నాయని పోలీసు అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడతారు. బ్యాంకు అధికారులమని చెప్పి వ్యక్తిగత వివరాలతోపాటు పాస్బుక్, ఆధార్, ఓటీపీ ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఇలా ఖాతాల్లోని సొమ్ము మాయం చేస్తున్నారు. సమయంలో అప్రమత్తంగా ఉంటే సమస్య నుంచి బయటపడొచ్చని అధికారులు సూచనలు చేస్తున్నారు. బెజ్జూర్ మండలంలోని సలుగుపల్లికి చెందిన ఆత్రం సాయి ఆన్లైన్లో రూ.28వేలు మోసపోయినట్లుగా ఫిర్యాదు పోలీసులకు చేశాడు. హర్షసాయి అనే యూట్యూబర్ పేరుతో హర్యానాలోని మేవాట్ ప్రాంతానికి చెందిన తౌఫిక్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. అనుచరులతో కలిసి నకిలీ నంబర్లు, వాట్సాప్ ద్వారా ప్రలోభాలు గురిచేసి ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.‘జన్నారం’ ఘటనతో అలర్ట్మంచిర్యాల జిల్లా జన్నారంలో సిమ్కార్డుల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్ పోలీసులు చేధించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులతోపాటు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. మారుమూల ప్రాంతాలను సైబర్ నేరగాళ్లు అడ్డాలుగా మార్చుకుంటుండటంతో జిల్లా పోలీసు అల ర్ట్ అయ్యారు. సైబర్ క్రైం నియంత్రణలో భాగంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాజాత బృందాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎస్పీ కాంతిలాల్, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు సైతం వేదికలపై డిజిటల్ మోసాల గురించి ప్రస్తావిస్తున్నా రు. యువత అవగాహన పెంచుకుని తల్లి దండ్రులకు వివరించాలని సూచిస్తున్నారు. స్టేషన్లలో సీఐ, ఎస్సై, సిబ్బందితో టీంను ఏర్పాటు చేసి కేసులను విచారిస్తున్నారు. సైబర్ క్రైం కేసుల్లో ఆర్థిక, ఆర్థికేతర ఘటనలుగా వేర్వేరుగా విభజించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
బీజేపీకి నాయకుల రాజీనామా
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, సీనియర్ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారా యణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా కోఆర్డినేటర్ వెంకటేశ్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, కాగజ్నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు రవికాంత్తోపాటు సుమారు 500 మంది కార్యకర్తలు రాజీనామా చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో పార్టీలో త్వరలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. -
23న రాష్ట్రస్థాయి ధర్నా
కాగజ్నగర్టౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 23న రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తున్నట్లు యూఎస్పీసీ రాష్ట్ర నాయకులు చరణ్దాస్, వైద్య శాంతికుమారి పిలుపునిచ్చారు. పట్ట ణంలో బుధవారం మహాధర్నా పోస్టర్ ఆవి ష్కరించారు. వారు మాట్లాడుతూ పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలన్నారు. ప్రతీ రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈవో, నూతన మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జాడికేశవ్, రాజ్కమలాకర్, మహిపాల్, మహేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్ట్రంలోని అంశాలపై ఖాన్ అకాడమీ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఖాన్ అకా డమీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, విద్యార్థులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకా రం కృత్యాలు సాధన చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిసోర్స్పర్సన్లు భరత్రావు, సమ్మయ్య, అహ్మద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వరద నష్టాల నివారణకు చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరిగిన వరద నష్టాల నివారణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలి పారు. రహదారులు, కల్వర్టులు, వంతెనలు, లోలెవల్ వంతెనలు కొట్టుకుపోయాయన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 4,503 ఎకరాల పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని, సుమారు 3,100 మంది రైతులు పంటలను నష్టపోయారని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, రైతుల వివరాలు నమోదు చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పశు సంపద నష్టం వివరాలతో నివేదికలు రూపొందిస్తే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్, రోడ్డు భవనాలు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో రహదారులు కొంతమేర ధ్వంసమయ్యాయని, తెగిన అప్రోచ్ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడి విద్యార్థుల ను ఇతర గురుకులాలకు తరలించారని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అడ్డుపడుతుందని ఆరోపించా రు. అంతకు ముందు మంత్రి జిల్లా కేంద్రంలోని కుమురం భీం విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి పూలమాలలు వేశారు. ఆసిఫాబాద్ మండలం మాలన్గొందికి చెందిన సిడాం గంగుకు చెందిన మేకలు వ ర్షాలతో మృత్యువాత పడగా, బాధితుడికి రూ.1.50 లక్షల పరిహారం ప్రొసీడింగ్ అందించారు. సమావేశంలో కాగజ్నగర్ అటవీ డివిజన్ అధికారి సుశాంత్, జీసీవో తిరుపతి, ఆర్డీవో లోకేశ్వర్రావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, రోడ్డు భవనాల శాఖ ఈఈ సురేశ్, డీఏవో శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలుకలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ భారీ వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట నష్టం, రహదారులు, వంతెనలు, కల్వర్టుల మరమ్మతుల కోసం అంచనాలు రూపొందించి మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. తక్షణ సాయం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూపం ఏర్పాటు చేశామన్నారు. రైతులను ఆదుకోవాలివట్టివాగు ప్రాజెక్టు కాలువకు గండి పడటంతో రైతులు పత్తి పంట నష్టపోయారని బాధితులను ఆదుకో వాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. జిల్లాలో కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు రై తులకు పూర్తిస్థాయిలో సాగు నీరందించాలన్నారు. ఎన్టీఆర్ కాలనీవాసులకు శాశ్వత పరిష్కారం చూపుతాంరెబ్బెన: ఎన్టీఆర్ కాలనీ వాసుల వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతమైన ఎన్టీఆర్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మంత్రికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విఠల్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్, మాజీ జెడ్పీటీసీ సోమయ్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్గౌడ్ పాల్గొన్నారు. కుమురంభీం విగ్రహానికి నివాళికెరమెరి: మండల కేంద్రంలోని సాకడ చౌరస్తా వద్ద ఉన్న కుమురంభీం విగ్రహానికి మంత్రి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, పూలే విగ్రహాలకు నివాళులర్పించారు. కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలిఆసిఫాబాద్రూరల్: వరదలతో దెబ్బతిన్న కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆసిఫా బాద్ మండలం రాజురకు వెళ్లే రహదారిపై కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు. రాజుర గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని, బూర్గుడ నుంచి రాజుర వరకు రోడ్డు వేయాలని, పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పని నిరీక్షణ
విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. ఓ వైపు అధికారులు కొరత లేదని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎరువులు సరిపడా అందడం లేదు. పెంచికల్పేట్ మండల కేంద్రంలోని గోదాం వద్దకు మంగళవారం పెంచికల్పేట్, ఎల్లూర్, ఎల్కపల్లి, కొండపల్లి, కమ్మర్గాం గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించారు. అలాగే సిర్పూర్(టి) మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కూపన్ల కోసం క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాశారు. సరిపడా యూరియా బస్తాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. – పెంచికల్పేట్/సిర్పూర్(టి) -
రెండోరోజూ నిరవధిక నిరాహారదీక్ష
కాగజ్నగర్టౌన్: పోడు భూముల సమస్యకు పరిష్కారం, జీవో 49 రద్దు కోసం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు సోమవారం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజూ మంగళవారం కూడా కొనసాగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మే 30న తడోబా రిజర్వ్ ఫారెస్ట్ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్లో కలుపుతూ కుమురం భీం జిల్లాలోని 334 గ్రామాలను రిజర్వు ఫారెస్ట్గా పేర్కొంటూ అక్రమంగా తీసుకువచ్చిన జీవో నం.49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దిందా పోడు రైతులను రవీంద్రనగర్లోని కర్జెల్లి ఫారెస్ట్ కార్యాలయానికి పిలిపించి బెదిరింపులకు పాల్పడడం దారుణమని, దీనిని బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లో పోడు భూముల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి, ప్రభుత్వం నుంచి జీవో 49 రద్దు చేస్తామనే ప్రకటన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా, రెండోరోజు వైద్యులు ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేశారు. దీక్షకు సంఘీభావంగా సిర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, దహెగాం, కాగజ్నగర్, చింతలమానెపల్లి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శాసనసభ స్పీకర్కు లేఖ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జీవో 49 శాశ్వతంగా రద్దు చేయాలని, పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఎమ్మెల్యే హరీశ్బాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 49 కుమురం భీం జిల్లాలో చిచ్చురేపుతుందన్నారు. పోడు రైతులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు హైదరాబాద్కు కాలినడకన వెళ్తుండగా వారిని అరెస్టు చేసి సొంత గ్రామాలకు తరలించారని తెలిపారు. కాగజ్నగర్ అటవీ కార్యాలయం ముట్టడికి శాంతియుతంగా పిలుపునిస్తే ప్రభుత్వం అనుమతివ్వకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారని ఆరోపించారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో గల శ్రీనివాస ఫ ల్టిలైజర్ షాపును మంగళవారం ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, ఈ పాస్ యంత్రం, ధరల పట్టిక, స్టాక్ వివరాలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనల ప్ర కారం యూరియా, ఇతర మందులు వినియోగించాలని సూచించారు. ఎరువులు, మందులు అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ మిలింద్కుమార్ పాల్గొన్నారు. అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు అందాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం దర్తీ అభ జన్ జాతీయ గ్రామ్ ఉత్పక్ష అభియాన్, ఆది ఖర్మ యోగి అభియాన్ అమలులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడతూ ఆది కర్మ యోగి కార్యక్రమాల ద్వారా 12 మండలాల్లోని 102 గ్రామాల్లో ఉన్న గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా బ్లాక్ స్థాయి(మండల) మాస్టర్ ట్రైనర్లు గ్రామస్థాయి శిక్షకులకు శిక్షణ ఇవ్వాలన్నారు. వివిధ శాఖల నుంచి పంచాయతీ స్థాయి సిబ్బందిని ఎంపిక చేయాలని సూచించారు. శిక్షణ పూర్తయిన తర్వాత 102 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, విద్యుత్శాఖ ఎస్ఈ శేషారావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, డీఎంహెచ్వో సీతారాం, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, పర్యాటకశాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు. -
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట
● రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జైనూర్(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యౖ మెన విద్యనందించడంతోపాటు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉ మ్మడి జిల్లా ఇన్చార్జి, ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. జైనూర్ మండలం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం గురుకుల నిద్ర కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డార్ఫ్ స్మారక భవనంలో ఏర్పాటు చేసిన చిత్రాల వివరాలు తెలు సుకున్నారు. చరిత్ర పుస్తకాలు ప్రింట్ చేయించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను ఆదేశించారు. అనంతరం విద్యార్థుల వసతిగృహానికి చేరుకున్నారు. భోజన వివరాలు అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖిద్, మార్లవాయి మాజీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్ పాల్గొన్నారు. ‘ఉపాధ్యాయులదే బాధ్యత’ఆసిఫాబాద్రూరల్: పాఠశాలలు, వసతిగృహా ల్లో విద్యార్థుల హాజరు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కావాలని, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ప్రకారం హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. సెలవుపై వెళ్లే ఒకరోజు ముందు అనుమతి తీసుకోవాలన్నారు. ఎస్వోలు శ్రీనివాస్, అబిద్ అలీ, ఉదయ్బాబు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ను మంగళవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. విద్యార్థుల హాజరుశాతం, వంటశా ల, ప్రయోగశాలను పరిశీలించారు. అనంత రం జన్కాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎంఈవో సుభాష్, ఎస్వో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ ఉన్నారు. -
‘మినరల్’ దందా
బెజ్జూర్(సిర్పూర్): ప్రభుత్వం నుంచి సరైన అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ.. మినరల్ వాటర్ పేరిట కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్యూరిఫైడ్ నీళ్ల పేరిట నిర్వాహకులు ఏటా రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలకు కలుషిత నీటిని అందిస్తున్నారు. కేవలం ఒక ట్యాంక్, మరో రెండు బా యిలర్ మాదిరి ట్యాంకులు.. అన్నింటినీ అనుసంధానిస్తూ పైప్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో పట్టణాలకు పరిమితమైన మినరల్ వాటర్ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. క్యాన్కు రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్లను శుద్ధి చేయడానికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. 500లకు పైగా ప్లాంట్లు జిల్లాలో ప్రస్తుతం 500 పైగా ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసి కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాలు శుద్ధి చేయకపోవడం, జలాన్ని శుద్ధి చేయకుండా సాధారణ నీటినే క్యాన్లలో సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలువురు ఇళ్లతోపాటు దుకాణాలు, పాత గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. కనీసం నీటి నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో నిబంధనలు పాటించని 30 వాటర్ ప్లాంట్లకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ సర్టిఫికెట్లు కొన్నింటికి ఉన్నా ఏటా రెన్యువల్ చేసుకోవడం లేదు. నిబంధనలపై పట్టింపేది..? వాటర్ ప్లాంట్లో మైక్రోబయాలజిస్ట్, కెమిస్ట్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉంటూ పీహెచ్ విలువ 7 కంటే తగ్గకుండా చూసుకోవాలి. పీహెచ్ స్థాయిలో హెచ్చుతగ్గులు కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. ప్రతీ క్యాన్పై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ నంబర్ కూడా వేయాలి. ప్లాంట్ నిర్వహణకు బీఎస్ఐ అనుమతి తీసుకోవడంతో పాటు ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. ప్రతీ మూడు నెలలకోసారి రా వాటర్ టెస్టింగ్ జరపాలి. కానీ పై నిబంధనలేవీ జిల్లాలోని ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. ఈ విషయంపై ‘సాక్షి’ భూగర్భజల శాఖ ఇన్చార్జి జిల్లా అధికారి కె.సుహాసినిని వివరణ కోరగా.. ఇప్పటివరకు జిల్లాలోని 30 వాటర్ ప్లాంట్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, లింగాపూర్ తదితర ప్రాంతాల్లో ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు అందించామని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలి మినరల్ వాటర్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. క్యాన్లు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వర్షాకాలంలో వాగు, చెలిమె నీళ్లు తాగొద్దు. – సీతారాంనాయక్, డీఎంహెచ్వో -
మహనీయుల ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, గౌడసంఘాల నాయకులతో కలిసి సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బహుజనుల కోసం పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సజీవన్, డీపీవో భిక్షపతిగౌడ్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, నాయకులు సుదర్శన్గౌడ్, రమేశ్, ప్రణయ్ పాల్గొన్నారు. విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలిఆసిఫాబాద్రూరల్: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. మండలంలోని ఎల్లారం ప్రభుత్వ పాఠశాలను సోమవారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. -
వీడని వాన
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/సిర్పూర్(టి)/కౌటాల: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాన పడటంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. జిల్లాలో 62.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా వాంకిడిలో 94.3, జంబుగ 67, రెబ్బెన 62, ధనోరా 61.3, కెరమెరి 57.5, సిర్పూర్– టి 39.5, సిర్పూర్– యూ 38, జైనూర్ 36.0, గిన్నెధరి 33.0, వంకులం 31.5, కాగజ్నగర్ 27.5, ఆసిఫాబాద్ 25.8, లింగాపూర్ 23.0, బెజ్జూర్ 21.0, లోనవెల్లి 20.8, దహగాం 10.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మున్సిపల్ సిబ్బందికి రెయిన్ కోట్లుభారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మున్సి పల్ రెస్క్యూ టీం కార్మికులకు మున్సిపల్ కమిషనర్ గజానంద్ రెయిన్కోట్లు పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 96664 68821, 97057 80116, 73862 82002 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఉప్పొంగిన ‘పెన్గంగ’మహారాష్ట్రలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో సిర్పూర్(టి) మండలం మీదుగా ప్రవహిస్తున్న పెన్గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతాల్లోని మాకిడి, జక్కాపూర్, హుడ్కిలి, వెంకట్రావ్పేట్, టోంకిని, పారిగాం, లోనవెల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సిర్పూర్(టి)– మాకిడి అంతర్రాష్ట్ర రహదారిలోని హుడ్కిలి సమీపంలోని లోలెవల్ వంతెన పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ రహీముద్దీన్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, ఎంపీడీవో సత్యనారాయణ వరద ప్రవహాన్ని పరిశీలించారు. హుడ్కిలి వంతెన మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు. వెంకట్రావ్పేట్ సమీపంలోని వెంకట్రావ్పేట్– పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని వంతెన వద్ద నది ఉధృతిని పరిశీలించారు. సిర్పూర్(టి)– కౌటాల ప్రధాన రహదారిలోని పారిగాం సమీపంలో ఉన్న వాగు ఉప్పొంగడంతో రాకపోకలపై ఆరా తీశారు. -
ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. కుమురంభీం(అడ) ప్రాజెక్టుకు సోమవారం 52,220 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆరు గేట్లు 4 మీటర్లు పైకెత్తి 52,220 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.872 టీఎంసీల నిల్వ ఉంది. అలాగే వట్టివాగు ప్రాజెక్టుకు 3,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, రెండు గేట్లు 0.9 మీటర్లు పైకెత్తి 3,250 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దిగువన ఉన్న గుండి, రాజుర, రహపల్లి, చోర్పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలు వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్కు చెందిన మీరారాణి మండల్ తన పేరుతో గల లావుణి పట్టా భూమిని తమ్ముడు పట్టా చేసుకున్నాడని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరింది. జిల్లాలో ఔట్సోర్సింగ్ పోస్టులను సమానంగా కేటాయించాలని మిత్ర సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ కొండగొర్ల చంద్రశేఖర్ దరఖాస్తు సమర్పించాడు. బూర్గుడ సమీపంలోని ఫోర్లేన్ రహదారి పక్కన ఖాళీ స్థలాలను కొంతమంది రైతులు ఆక్రమించుకోవడంతో వరదతో పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బూర్గుడ రైతులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తూ తన తండ్రి మృతి చెందాడని, వారసత్వ ఉద్యోగం ఇప్పించాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన ఒడ్డే పెంటన్న దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం సాలెగూడ శివారులో తన భూమిని అక్రమంగా మార్చిన పట్టా రద్దు చేయాలని ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్కు చెందిన జాడి పుల్లయ్య విన్నవించాడు. ఆసిఫాబాద్ మండలం జెండగూడకు చెందిన కామెడె నర్సింగ్రావు తనకు వారసత్వంగా సంక్రమించిన భూమికి పట్టా పాస్బుక్ జారీ చేయాలని కోరాడు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్కు చెందిన పొన్నం పురుషోత్తం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించాడు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమన్వయంతో దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండొద్దు
దహెగాం(సిర్పూర్): వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండొద్దని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. మండల కేంద్రంతోపాటు హత్తిని, ఐనం, పెసరికుంట గ్రా మాల్లో సోమవారం పర్యటించారు. వర్షానికి కూలిన హత్తినికి చెందిన లింగయ్య ఇంటితోపాటు మండల కేంద్రానికి చెందిన చిన్నక్కల ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఐనం సమీపంలోని లోలెవల్ వంతెనల వద్ద వరదతో దెబ్బతిన్న పంటల వివరాలను త హసీల్దార్ మునవార్ షరీఫ్ను అడిగి తెలుసుకున్నారు. పెసరికుంటలో పది కుటుంబాలకు చర్చిలో పునరావసం ఏర్పాటు చేశామని, వారిని అక్కడికి తరలించాలన్నారు. ఎంపీడీవో రాజేందర్, కార్యదర్శులు ఉన్నారు. -
గృహయోగానికి ‘అటవీ’ అడ్డంకి
సిర్పూర్(టి) మండలం మేడిపల్లికి చెందిన సుమన్బాయి భర్త పిల్లలతో కలిసి గుడిసెలో ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ బతుకు వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో ఎంతో సంతోషపడ్డారు. అయితే అటవీశాఖ అధికారులు ఇంటి పనులు అడ్డుకున్నారు. సిడాం లచ్చు ఏళ్లుగా మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అతడి భూములకు ప్రభుత్వం పట్టాలు కూడా మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పైలట్ గ్రామంగా ఎంపిక కావడంతో లచ్చుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అటవీశాఖ అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతం నిర్మాణ పనులు ఆగిపోయాయి.సిర్పూర్(టి): దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా బతుకుతున్న గిరిజనుల చెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడం లేదు. ఓ వైపు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, అటవీశాఖ అధికారులు మాత్రం అనుమతుల పేరిట అభ్యంతరం తెలుపుతున్నారు. ఫలితంగా ఏడు నెలులు గడిచినా ఆ పంచాయతీ పరిధిలో ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీని అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరి 26న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఎంతో ఆశతో ఇళ్లు నిర్మించుకునేందుకు సన్నద్ధమవుతుండగా అటవీశాఖ అధికారులు పనులు అడ్డుకుని నిలిపివేశారు. దశాబ్దాలుగా నివాసం..మేడిపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అటవీశాఖ అనుమతులు లేకపోడంతోనే అర్ధంతరంగా నిలిచిపోయాయి. అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అటవీశాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే చేపట్టినా ఇప్పటికీ సర్వే రిపోర్టు రాలేదు. అయితే మేడిపల్లిలో దశాబ్దాలుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. భూములకు 50 ఏళ్ల నుంచి పట్టా పాసుపుస్తకాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సీసీరోడ్లు, మిషన్ భగీరథ ట్యాంక్, విద్యుత్ కనెక్షన్లు, పాఠశాల భవనాలు నిర్మించగా, ఇప్పుడు అధికారులు అటవీశాఖ పరిధిలో గ్రామం ఉందంటూ అడ్డు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ కారిడార్ నేపథ్యమే కారణమా..?మహారాష్ట్ర నుంచి కవ్వాల్ అభయారణ్యానికి పెద్దపులులు సంచరించే మార్గంలో సిర్పూర్(టి) రేంజ్ కీలకం. దీనిని అటవీశాఖ టైగర్ కారిడార్గా గుర్తించింది. పులుల రాకపోకలను నిత్యం ట్రాకింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేంజ్ పరిధిలోని అటవీ భూముల్లో తిరిగి ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం, పోడు సాగు అడ్డుకోవడంతోపాటు టైగర్ ట్రాకింగ్కు ప్రత్యేక ప్రణాళికలతో చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న మేడిపల్లి పంచాయతీ అటవీశాఖ తమ పరిధిలో ఉందంటూ ఇళ్ల నిర్మాణాలు నిలిపివేసిందనే చర్చ సాగుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా.. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో మేడిపల్లి పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాం. అయితే అడవి పరిధిలో గ్రామం ఉందంటూ అటవీశాఖ పనులు నిలిపివేసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. సబ్ కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. – సత్యనారాయణ, ఎంపీడీవో, సిర్పూర్(టి)అనుమతులు రాలేదు సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని మేడిపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటివరకు అటవీశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాలేదు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – ప్రవీణ్కమార్, ఇన్చార్జి ఎఫ్ఆర్వో 154 ఇళ్లు మంజూరు..సిర్పూర్(టి) మండలం మేడిపల్లి పంచా యతీ పరిధిలోని మేడిపల్లి, రావన్పల్లి, లింబుగూడ గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలకు కలిపి మొత్తం 154 ఇళ్లను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసింది. మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 750 మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న గ్రామస్తులకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఇళ్లు మంజూరై ఏడు నెలలు గడుస్తున్నా నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రావన్పల్లి గ్రామంలో కేవలం ఏడు ఇళ్లు బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించారు. -
‘దిందా’ రైతులతో
ఎమ్మెల్సీ, అధికారుల చర్చలుచింతలమానెపల్లి(సిర్పూర్): చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు భూముల రైతులతో సోమవారం ఎమ్మెల్సీ దండె విఠల్, కాగజ్నగర్ ఎఫ్డీవో సుశాంత్ బొగాడే చర్చలు జరిపారు. ఖర్జెల్లి అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో పోడు రైతులతో సమావేశమయ్యారు. దిందా రైతులకు ఎఫ్డీవో అటవీ చట్టాల గురించి వివరించారు. ఒక్కో రైతుకు ఎంత భూమి ఇవ్వాలనే విషయంపై అంగీకారానికి రావాలని సూచించారు. రైతులు మాట్లాడుతూ తమకు గతంలో ఇస్తానని ప్రకటించిన భూమికి తోడు అదనంగా మరో 250 ఎకరాలు ఇవ్వాలని కోరారు. గ్రామంలో 330 రేషన్ కార్డులు ఉండగా, మరో 20 కుటుంబాలకు లేవని తెలిపారు. మొత్తం 350 కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరారు. ఐదెకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు యథాస్థితిని కొనసాగించాలని, ఎక్కువ ఉన్న రైతులకు మాత్రం ఐదెకరాలు ఇచ్చి మిగతా భూమిని తీసుకునేందుకు అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఎఫ్డీవో మాట్లాడుతూ రైతులకు నిబంధనల మేరకు మూడెకరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులు తెలిపిన వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని అటవీ అధికారులకు సూచించారు. నాలుగెకరాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఎఫ్ఆర్వో సుభాష్, కౌటాల సీఐ సంతోష్, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్, విజయ్కుమార్, ధనుంజయ్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేందర్గౌడ్, మారుతి, రాణి, సుదర్శన్గౌడ్, వెంకట్నాయక్, జిల్లా కార్యదర్శులుగా సోమేశ్వర్, నవీన్గౌడ్, ఇందిర, సుభోద్, రోజా, గుప్తా, జిల్లా కోశాధికారిగా కిరణ్కుమార్, కార్యాల యం కార్యదర్శిగా సూర్య ప్రకాశ్, సోషల్ మీడియా ఇన్చార్జిగా సంతోష్, మీడియా కన్వీనర్గా సత్యనారాయణ, ఐటీ ఇన్చార్జిగా అమిత్ బిశ్వాస్ను ఎన్నుకున్నారు. -
ఆయకట్టు అగమ్యగోచరం!
మరమ్మతు చేపట్టాలి భారీ వర్షంతో గండి పడిన వట్టివాగు కాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ప్రాజెక్టు అధికారులకు సరై న అవగాహన లేకపోవడంతో అవసరమైన ఆయకట్టుకు నీరివ్వడం లేదు. సా గు లేని ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. – మెకర్తి గోపాల్, బూర్గుడ, మం.ఆసిఫాబాద్ ప్రతిపాదనలు పంపించాం భారీ వర్షంతో ప్రాజెక్టు కుడి కాల్వకు గండి పడింది. రూ.14 లక్షలతో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదలైతే రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తాం. – అన్నాజీరావు, డీఈఈఆసిఫాబాద్: భారీ వర్షానికి ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కుడి కాల్వకు గండి పడటంతో ఆయకట్టు సాగు అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు సాగు పనులు ముమ్మరంగా సాగుతుండగా, అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. మరమ్మతులకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద రావడంతో వట్టివాగు కాల్వల్లోకి భారీగా వరద చేరింది. దీంతో కొమ్ముగూడ సమీపంలోని వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కాల్వ 8 కిలోమీటర్ల వద్ద గండి పడింది. బూర్గుడ సమీపంలోని ఎల్– 2 వద్ద సుమారు 200 ఎకరాల్లో పంట పొలాలు వరదనీటిలో మునిగాయి. పంట పొలాలు నీటితో చెరువుల ను తలపించాయి. సాగునీరంతా వృథాగా పోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాజెక్టు అధి కారులు కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం వరినాట్లు వేస్తున్న తరుణంలో కాల్వకు గండి పడడంతో సాగు పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. లక్ష్యం చేరని ప్రాజెక్టుఆసిఫాబాద్ మండలం పహడిబండ వద్ద రూ.120 కోట్లతో వట్టివాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో నిర్మించిన వట్టివాగు ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజె క్టు కింద 24,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. కుడికాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడ మ కాలువ ద్వారా 2,700 ఎకరాలకు సాగు నీరు అందాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 16 వేల ఎకరాలకు సాగు నీరంది స్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నా వాస్తవంగా మూడు వేల ఎకరాలకు కూడా మించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టు కాల్వలు మొత్తం దెబ్బతిన్నాయి. ఆది నుంచి ఆధునికీకరణ కు నోచుకోకపోవడంతో లైనింగ్ కోల్పోయి పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చాలాచోట్ల నామరూపాలు లేకుండా పోయాయి. ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల పరిధిలోని పూర్తిస్థాయి ఆయకట్టు రైతులకు సాగునీరందించే పరిస్థితి లేదు. రెండు, మూడేళ్లు నిరీక్షించిన చాలామంది రైతులు పంట పొలాలకు సాగునీరందక.. కట్టలు తెంచేసి ఆరుతడి పంటలే సాగు చేసుకుంటున్నారు.నీరున్నా నిష్ఫలంవట్టివాగు ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నప్పటికీ ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులో వరద నీరు పెరగడంతో ప్రాజెక్టు అధికా రులు రెండు గేట్లు ఎత్తివేశారు. గరిష్ట నీటిమట్టం 239.5 మీట ర్లు కాగా, ప్రస్తుతం 238.30 మీటర్లకు చేరింది. ఇన్ఫ్లో 2700 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 1000 క్యూసెక్కులు ఉంది. భారీ వర్షాలకు ప్రాజెక్టు కాల్వ కు గండి పడటంతో రూ.14 లక్షలతో మరమ్మతుల కు ప్రతిపాదనలు పంపించారు. అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
ఆయిల్పామ్కు పందుల బెడద
ఈచిత్రంలో కనిపిస్తున్న పెంచికల్పేట్ గ్రామానికి చెందిన రైతు పేరు శ్రీనివాస్రెడ్డి. గన్నారం శివారులో సుమారు 13 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశాడు. ప్రస్తుతం పంట కాత దశలో ఉంది. నెల రోజుల క్రితం పెద్దఎత్తున అడవి పందుల గుంపు తోటలో ప్రవేశించి ఆయిల్పామ్ గెలలను నాశనం చేశాయి. పంట రక్షణ కోసం సుమారు రూ.3లక్షలతో తోట చుట్టూ మెష్ ఫెన్సింగ్ వేశాడు. ఆయినా అడవి పందులు తోటలోకి చొరబడుతున్నాయని వాపోతున్నాడు. పెంచికల్పేట్: ప్రభుత్వం సబ్సిడీ, ప్రోత్సాహకాలు అందించడంతో జిల్లాలో అన్నదాతలు అధికారుల సూచనలతో పెద్దఎత్తున ఆయిల్పామ్ పంట సాగుచేశారు. నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం కాపుకు వచ్చాయి. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఆయిల్పామ్ గెలలను అడవి పందులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పందులతో పరేషాన్..జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారులు పెద్దఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం ఎకరానికి 90శాతం సబ్సిడీ, ఉచితంగా డ్రిప్, అంతర పంటల సాగుకు సైతం ప్రోత్సాహకం అందజేసింది. దీంతో పెంచికల్పేట్, దహెగాం, కాగజ్నగర్ మండలాల్లోని రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేశారు. కాగా ప్రస్తుతం మొక్కలు తక్కువ ఎత్తులో ఉండటంతో అడవి పందుల గుంపులు తోటలను ధ్వంసం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా తోటల్లో సంచరిస్తున్నాయి. ఆయిల్పామ్ గెలలను నాశనం చేస్తున్నాయి. పంటల రక్షణకు తోటల చుట్టూ కంచె వేసినా అడవి పందుల బెడద తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. గెలలను రక్షించుకోవడానికి పగలు, రాత్రి తేడా లేకుండా తోటల్లో కాపలా కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల దాడులతో నష్టపోయిన పంటలకు సంబంధిత శాఖ అధికారులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పంటల రక్షణకు సూచనలు ఆయిల్పామ్ సాగు చేసిన రైతుల తోటలను సందర్శించి పంటల రక్షణకు సూచనలు చేస్తున్నాం. ప్రస్తుతం తక్కువ ఎత్తులో ఉన్న చెట్లకు కాత రావడంతో అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటల రక్షణకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సలహాలు అందజేస్తున్నాం. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తా. – సుప్రజ, హార్టికల్చర్ అధికారి, కాగజ్నగర్ డివిజన్ -
వేతన వెతలు
తిర్యాణి: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు రిసోర్స్ టీచర్ (సీఆర్టీ)లకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత ఉపాధ్యాయులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తున్నా నెలనెల జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రైమరీ పాఠశాలల్లో 460 మంది సీఆర్టీలుగా విధులు నిర్వహిస్తుండగా వారికి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంఽధించిన జీతాలు రాకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. కాగా జీతాలకు సంబంధించిన బడ్జెట్ పంపినప్పటికీ ఆర్థికశాఖ నుంచి వేతనాలు విడుదల కాలేదంటూ ట్రెజరీ అధికారులు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని, దిక్కు తోచని పరిస్థితుల్లో సీఆర్టీలు ఉన్నారు. సీఆర్టీలదే కీలకపాత్ర..ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే సీఆర్టీలు విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు పాఠశాల సమయంలో విద్యా బోధన చేస్తూనే మరోవైపు రాత్రి పూట స్టడీఅవర్లను సైతం నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారి ఉన్నతికి దోహద పడుతున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడి విధులు నిర్వహిస్తున్నా తమకి నెలల వారీగా జీతాలు పెండింగ్ ఉంచడంపై మనస్తాపానికి గురవుతున్నారు. కుటుంబ షోషణ కోసం తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని, అప్పులు ఇచ్చిన వారికి ఎప్పుడు తిరిగి ఇస్తామో కూడా చెప్పలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట..!నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో ఉండటంతో సీఆర్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత (ఆగస్టు) నెలలో తమ సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా సీఆర్టీలకు ప్రతీనెల గ్రీన్ చానెల్ పద్ధతిలో వేతనాలు అందించాలని, మహిళా సీఆర్టీలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎంటీఎస్ (మినిమమ్ టైం స్కేల్) ను అమలు పర్చాలని, దశల వారీగా సర్వీసును రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.విద్యాబోధన చేస్తున్న సీఆర్టీ -
నిండుకుండలా పీపీరావు ప్రాజెక్టు
దహెగాం: ఇరవై రోజుల క్రితం నీరు లేక వెలవెల బోయిన ప్రాజెక్టులు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరి కళకళలాడుతున్నాయి. మండలంలోని కల్వాడ సమీపంలో ఉన్న పీపీరావు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత మంగళవారం, శనివారం భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీరు నిండి మత్తడి పైనుంచి నీరు పారింది. దీంతో ఎర్రవాగు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించింది. ఆదివారం ప్రాజెక్టు నీటి మట్టం 147.5 మీటర్లు కాగా పూర్తి నీటి మట్టానికి చేరుకుని మత్తడిపై నుంచి నీరు పారుతోంది. ఇన్ఫ్లో 750 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 750 క్యూసెక్కుల వరద ఎర్రవాగులోకి చేరుతుంది. దీంతో ఆయకట్టు సాగుకు ఢోకా లేదని రైతులు పేర్కొంటున్నారు. -
‘టీఎల్ఎం’ మేళాకు వేళాయె
కెరమెరి: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చి ఆశించిన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు కనీస అభ్యసనస్థాయి సాధించేలా కృత్యాధార బోధనకు బోధనాభ్యాసన సామగ్రి (టీఎల్ఎం – టీచర్ లెర్నింగ్ మెటీరియల్) దోహద పడుతోంది. ఈ సామగ్రిని సృజనాత్మకంగా రూపొందించి పాఠశాలల్లో అమలు పర్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికోసం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఎల్ఎం మేళాల నిర్వహణకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం మండల స్థాయిలో, ఈనెల 20న జిల్లాస్థాయిలో మేళాలు నిర్వహించనున్నారు. జిల్లాకు ఎంపిక..ప్రతీ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన టీఎల్ఎంలను మండలస్థాయిలో నేడు ప్రదర్శించనున్నారు. ఎన్సీఆర్టీ సూచించిన మార్గదర్శకాల ఆధారంగా మండలస్థాయిలోని పది ఉత్తమ టీఎల్ఎంలను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. వీటిలో తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాలలో రెండేసి, అన్నింటిలో కలిపి ఉత్తమంగా ఉన్న మరో రెండేసి చొప్పున ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మండల స్థాయిలో ముగ్గురు స్థానిక విద్యానిపుణులతో కూడిన జ్యూరీని నియమిస్తారు. జిల్లాస్థాయిలో ఆరుగురు నిపుణుల జ్యూరీ ఎనిమిది ఉత్తమ టీఎల్ఎంలను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తుంది. సులువుగా అర్థమయ్యేలా..విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యే వి ధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నా రు. ప్రత్యేకంగా టీఎల్ఎం ద్వారా విద్యా బోధన చే స్తున్నారు. తమ మేథస్సుతో ఎన్నో ఉపకరణాలు త యారుచేసి, పాఠ్య పుస్తకంలో ఉన్న పాఠ్యాంశం ఆ ధారంగా టీఎల్ఎం తయారు చేసి బోధన చేస్తున్నా రు. దీంతో విద్యార్థి సులువుగా పాఠాలను అర్థం చేసుకునే వీలు ఉంటుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీఎల్ఎం విని యోగించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ప్ర స్తుతం పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వి ద్యార్థులు తయారు చేసిన టీఎల్ఎం గోడలకు అతి కించి కనిపిస్తున్నాయి. ఇందుకోసం గతంలో ఏటా ప్ర భుత్వం ప్రతీ పాఠశాలకు రూ.500 విడుదల చేసే ది. కానీ ప్రస్తుతం పాఠశాల నిధుల నుంచి టీఎల్ఎ ంకు వెచ్చించాలని అధికారులు పేర్కొంటున్నారు. అభ్యసన సామర్థ్యాలు పెంపు టీఎల్ఎం ఉపకరణాల ద్వారా విద్యార్థుల కనీస అ భ్యసన సామర్థ్యాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. వినూత్న బోధనలతో విద్యార్థులను ఆకట్టుకోవచ్చు. నేడు మండల కేంద్రాల్లో నిర్వహించే టీఎల్ఎం మేళాకు ప్రాథమి క, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి. టీఎల్ఎంలను ప్రదర్శించాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్జిల్లాలోని పాఠశాలల వివరాలు.. -
కై రిగూడలో తీజ్ సంబరాలు
రెబ్బెన: మండలంలోని కై రిగూడలో బంజారా, లంబాడా ప్రజలు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని పెళ్లి కాని యువతులు గత 9 రోజులుగా అత్యంత నియమనిష్టతలతో తీజ్ బుట్టలకు నీళ్లు పోస్తూ పూజలు చేయగా ఆదివారం తీజ్ ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సేవాలాల్, జగదాంబ ఆలయంలో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. తీజ్ బుట్టలను ఆలయం వద్ద నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీజ్బుట్టలను వాగుల్లో నిమజ్జనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్తో పాటు గ్రామ నాయక్ సుబ్బారావు, చౌహాన్ ఇందల్, కున్సోత్ రమేశ్, జరుపుల గణపతి, శంకర్, దారావత్ రవీందర్, గుడి పూజారి వసంత్రావు, వెంకట్రావ్, యువకులు వేడుకల్లో పాల్గొన్నారు. -
సమస్య పరిష్కారంలో అధికారులు విఫలం
కాగజ్నగర్టౌన్: పోడు భూముల సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు అత్యుత్సాహంతో పోడు రగడ జఠిలమైందన్నారు. పోడు రైతులను అడ్డుగా పెట్టుకొని ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంత ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చింతలమానెపల్లి మండలం దిందా రైతులు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి శామీర్పేట్కు చేరుకోగానే పోలీసులు అడ్డుకొని దొంగలు గా చిత్రీకరించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నా రు. దిందా, ఇటుకపహాడ్, డబ్బా, కొండపల్లి గ్రామాల్లో అధికారుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారులకు వత్తాసు పలుకుతూ బీసీలకు పోడు భూములపై హక్కు లేదనడం అన్యాయమని పేర్కొన్నారు. బాధిత రైతుల పక్షాన సోమవారం అటవీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈకార్యక్రమాని కి పోడు రైతులు, వివిధ సంఘాల నాయకులు తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షు డు దోని శ్రీశైలం, రాష్ట కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి అరుణ్లోయ, ఓబీసీ మోర్చ రాష్ట కార్యవర్గ సభ్యుడు గొలెం వెంకటేశ్, జిల్లా కార్యదర్శి రాజేందర్గౌడ్, మండల అధ్యక్షుడు విజయ్, మాజీ కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్రావు, రాపర్తి ధనుంజయ్, సుధాకర్, వెంకన్న, భుజంగరావు, తిరుపతి, సదానందం, సత్యనారాయణ, సంతోష్, బావూజీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీనెల ఒకటిన వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతీనెల గ్రీన్ చానల్ ద్వారా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో మా ట్లాడారు. పంచాయతీ కార్మికులకు ఇన్సూరె న్స్ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని చట్టపరంగా రావాల్సిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఏటా రెండు జతల యూనిఫామ్స్, సబ్బులు, ష్యూస్ అందజేయాలని తెలిపారు. సమస్యల ను పలుమార్లు డీపీవో దృష్టికి తెచ్చినా స్పంద న లేదని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షులు నాగేశ్, విలాస్, పుష్పలత, సహాయ కార్యదర్శులు సోనేరావు, శంకర్, వసంత్, అనిల్ పాల్గొన్నారు. -
కాగజ్నగర్ పోలీస్స్టేషన్ తనిఖీ
కాగజ్నగర్ టౌన్: కాగజ్నగర్ పట్టణ పోలీస్స్టేషన్ను ఎస్పీ కాంతిలాల్పాటిల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికా ర్డులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఆయుధాల భద్ర త, కేసుల వివరాలు పరిశీలించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. మ హిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామానుజం, సీఐ ప్రేంకుమార్, సిబ్బంది ఉన్నారు. -
వాన.. వరదగా..
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/దహెగాం/పెంచికల్పేట్/తిర్యాణి/కాగజ్నగర్ టౌన్/కాగజ్నగర్ రూరల్/రెబ్బెన/కెరమెరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవా రం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుమురంభీం (అడ), వ ట్టివాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి, తుంపెల్లి, అప్పపల్లి వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయమై పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఆయా మండలాల్లో..దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఐనం గ్రామ సమీపంలోని కాగజ్నగర్ ప్రధాన రహదారిలో రెండు లోలెవల్ వంతెనల పైనుంచి వరదనీరు వెళ్తుండగా రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రం నుంచి కల్వాడ వైపు వెళ్లే మార్గంలో లోలెవల్ వంతెనపై వరద పారడంతో అటువైపు వెళ్లేవారు హత్తిని మీదుగా ప్రయాణించారు. మల్లన్న ఒర్రె ఉప్పొంగడంతో సమ్మక్క గద్దెల వద్ద నుంచి వరద పారింది. సబ్కలెక్టర్ శ్రద్దాశుక్లా దహెగాంతోపాటు ఐనం, పెసరికుంట గ్రామాలను సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. ఈమె వెంట తహసీల్దార్ మునవా ర్ షరీఫ్, ఎంపీడీవో రాజేందర్, పంచాయతీ కార్యదర్శులు రాజేశ్, ప్రణీత్బాబు ఉన్నారు. పెంచికల్పేట్ మండలంలోని పెద్దవాగు, ఉష్కమల్లవాగు, ఒర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడ, పెంచికల్పేట్ గ్రామాల్లో పలువురి ఇళ్లలోకి వరద నీరు చేరింది. పెంచికల్పేట్–సలుగుపల్లి, గుండెపల్లి–కమ్మర్గాం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. లింగాపూర్ మండలంలోని వాగులు, ఒర్రెలు ఉప్పొంగాయి. వంతెనలపై వరదనీరు ప్రవహించడంతో పిట్టగూడా, మోతీపటార్, గుమ్నూర్, కంచ న్పల్లి, ఫూల్సింగ్తండా, చోర్పల్లి, నాగుగూడా, కీ మానాయక్తండా, పట్కల్మంగి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. తిర్యాణి మండలంలోని మాణిక్యపూర్ నుంచి మంగి గ్రామానికి వెళ్లే దారిలోగల బ్రిడ్జిపై వాగునీరు ప్రవహించడంతో రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెలి మల ప్రాజెక్ట్ అలుగు పారి జలపాతాన్ని తలపించగా స్థానికులు ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. కాగజ్నగర్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ద్వారకానగర్, సంజీవయ్య కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, తొమ్మిదోవార్డు, కాపువాడ తదితర ప్రాంతా లను వరదనీరు ముంచెత్తింది. ఆర్ఆర్వో కాలనీలో ని కేజీబీవీ, ఎస్సీ హాస్టల్ ఆవరణలో వరదనీరు చేరగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వెనుకబడి న తరగతుల సంక్షేమాధికారి సజీవన్ హాస్టల్కు చే రుకుని పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ స్పందించి వరద నీటిని బయటకు పంపించారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో పలువురు ఇళ్లలోకి వరదనీరు చేరింది. కాలనీని ఆర్ఐ సౌమ్య, పంచా యతీ అధికారులు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కాలనీకి ఎగువ నుంచి వరదనీరు వస్తున్న ప్రదేశాన్ని తహసీల్దార్ సూర్యప్రకాశ్ పరిశీలించి మ ళ్లింపు చర్యలు చేపట్టారు. గంగాపూర్, పులికుంట, పెద్దవాగులు ఉప్పొంగి ప్రవహించాయి. నంబాల బ్రిడ్జి పైనుంచి వరదనీరు ప్రవహించడంతో నంబా ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ఎస్సై చంద్రశేఖర్ నంబాల బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపివేశా రు. ఖైరిగూర ఓసీపీలో ఉత్పత్తి నిలిచిపోయింది. కా గజ్నగర్ మండలంలోని రాస్పెల్లి, మెట్పల్లి, గజ్జి గూడ, మోసం, కోయవాగు తదితర వాగులు ఉ ప్పొంగాయి. పెంచికల్పేట్–కాగజ్నగర్ ప్రధాన ర హదారిలో ఈజ్గాం వద్ద రోడ్డుపై నీరు ప్రవహించగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ జ్గాం చౌరస్తా, ఎస్సీ కాలనీలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. మెట్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సందర్శించి వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామానుజం, రూరల్ ఎస్సై కుమారస్వామి ఉన్నారు. కెరమెరి మండలంలోని కర్పెతగూడ వంతెన పూర్తిగా నీటి మునిగింది. లక్మాపూర్, అనా ర్పల్లి, వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. వాగు అవతలి గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 15 గ్రామాల ప్రజలు వాగు దాటి రాలేకపోతున్నారు. చాలాకాలం తర్వా త కెరమెరి, సాంగ్వి, గోయగాం వాగులు పొంగిపొర్లాయి. సాంగ్వి, రాంపూర్, ఇంద్రానగర్, కెలికే కల్వ ర్టు పైనుంచి వరదనీరు ప్రవహించడంతో అనేక గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వాగు పరీవాహక ప్రాంతంలో 50 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. తిర్యాణి మండలం మాణిక్యపూర్ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వాగునీటి నుంచి దాటుతున్న ప్రజలుమండలాలవారీగా వర్షపాతం నమోదు ఇలా.. జిల్లాలో అత్యధికంగా కౌటాల మండలంలో 65.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కాగజ్నగర్లో 7.8 మి.మీ వ ర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 25.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. తిర్యాణిలో 27.8 మి.మీ, ఆసిఫాబాద్లో 30.8, రెబ్బెనలో 8, జైనూర్లో 16.4, సిర్పూర్ (యూ)లో 15.6, లింగపూర్లో 30.8, కెరమెరి 16.2, వాంకిడిలో 10.8, సిర్పూర్ (టీ)లో 16.8, చింతలమానెపల్లిలో 29.2, పెంచికల్పేట్లో 40.4, బెజ్జూర్ 47.2, దహెగాం మండ లంలో 25.2 మి.మీ వర్షం కురిసింది. ప్రాజెక్ట్లకు భారీగా వరదనీరుఎగువ నుంచి వరదనీరు భారీగా చేరుతుండగా కుమురంభీం (అడ) ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తి 52,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 10.393 టీఎంసీలు (234 మీటర్లు) కాగా, ప్రస్తుతం 5.968 టీఎంసీ లుగా ఉంది. 52,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఆరు గేట్లు ఎత్తి దిగువకు అంతే మొత్తంలో వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 10,830 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.890 టీఎంసీలు (238.75 మీటర్లు) కాగా, ప్రస్తుతం 2.579 టీఎంసీలుగా ఉంది. 9,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా నాలుగు గేట్లు ఎత్తి 10,830 క్యూసెక్కుల ను దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆ సిఫాబాద్ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దిగువన గల గుండి, రాజుర, రహపల్లి, చోర్పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు పోవద్దని అధికారులు సూచించారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: రాష్ట్రస్థాయి అండర్–15 వాలీబాల్ పోటీలకు 16మంది విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి వెంకటేశం, కోచ్ రాకేశ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర పోస్ట్మెట్రిక్ వసతిగృహం మైదానంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్కూల్ గేమ్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఉత్త మ ప్రతిభ కనబర్చిన ఎనిమిది మంది బాలికలు, ఎనిమిది మంది బాలురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వీరు ఈ నెల 18, 19తేదీల్లో రంగారెడ్డిలోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. రోడ్డు వేయాలని ఆందోళన కాగజ్నగర్ రూరల్: మండలంలోని అందవెల్లి–భట్టుపల్లి గ్రామాల మధ్య రోడ్డు వేయాల ని శనివారం గ్రామస్తులు ఆందోళన చేశారు. రహదారికి అడ్డంగా ముళ్లకంచెలు ఉంచి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు బురదమయమై నడిచి వెళ్లలేని పరిస్థితి ఉందని తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నా నామమాత్రపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. కాగా, వీరి ఆందోళనతో దహెగాం–కాగజ్నగర్ మార్గంలో వాహనాలు ఎ క్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలు సుకున్న కాగజ్నగర్ రూరల్, పట్టణ సీఐలు కుమారస్వామి, ప్రేంకుమార్, ఎంపీడీవో ప్ర సాద్ ఆందోళన వద్దకు చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. శాశ్వత పరిష్కారం కల్పించేదాకా నిరసన కొనసాగిస్తామని, అధికారులు స్పందించి పేరుకుపోయిన బురద తొలగించాలని, తాత్కాలిక రోడ్డు వేయాలని కోరారు. -
ద్విచక్రవాహనాలు స్వాధీనం
రెబ్బెన: సింగరేణి ఆస్తులున్న ప్రదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు ఎస్అండ్పీసీ సిబ్బందిని చూసి పరారవడంతో వారి ద్విచక్రవాహనాలను బె ల్లంపల్లి ఏరియా ఎస్అండ్పీసీ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. ఎస్అండ్పీసీ ఇన్చార్జి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 13న మధ్యాహ్నం ఏరియాలోని గోలేటి–1ఏ ఇంక్లైన్ ఆవరణలో కి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మూడు ద్విచ క్ర వాహనాలపై అక్రమంగా ప్రవేశించారు. మద్యం తాగుతూ చోరీకి పాల్పడే అవకాశమున్నట్లు అనుమానించిన ఎస్అండ్పీసీ సిబ్బంది వెంటనే మొబై ల్ టాస్క్ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించా రు. వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లడాన్ని చూసిన అనుమానితులు వారి వెంట తీసుకువచ్చిన ద్విచక్రవాహనాలు అక్కడే వదిలేసి పారిపోయారు. అనుమానితుల ద్విచక్రవాహనాలను సిబ్బంది స్వాధీ నం చేసుకున్నారు. విఽధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్అండ్పీసీ ఇన్చార్జి అభినందించారు. -
‘ఇంటర్’కూ పీటీఎం
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం పెంపున కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లు (పీటీఎం) నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం పక్కా ప్రణాళికలు రూపొందించింది. తరగతి గదిలో తమ పిల్లలు చదువుతున్న తీ రు, ప్రవర్తన, హాజరు గురించి తల్లితండ్రులు తెలు సుకునే అవకాశముంది. అలాగే ఇంటి వద్ద విద్యార్థులు చదువుతున్నారా.. లేదా.? గైర్హాజరుకు కారణాల గురించి అధ్యాపకులు తల్లిదండ్రులను ఆరా తీసే అవకాశమేర్పడింది. ఇది విద్యార్థులు తమ సా మర్థ్యాలను మెరుగుపరుచుకుని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడనుంది. అంతిమంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బలోపేతం కానున్నాయి. ప్రతీనెల నాలుగో శనివారం కళాశాలలో వి ద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లకు ఆదేశాలు అందాయి. జిల్లాలో 11 కళాశాలల్లో అమలుజిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నా యి. ఇందులో జనరల్ విద్యార్థులు 1,784 మంది, ఒకేషనల్ విద్యార్థులు 568 మంది విద్యనభ్యసిస్తు న్నారు. చాలా కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉంది. ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థులు కొందరు కాలేజీ వరకు వెళ్లడం లేదు. ఇంటి వద్ద చదవకపోవడంతో వెనుకబడిపోతున్నా రు. గతేడాది కొంత మెరుగ్గా ఉన్న ఫలితాలు అంతకుముందు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించ డం ద్వారా ఈ సమస్య అధిగమించే అవకాశం ఉంటుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు కళాశాలల్లో పీటీఎంలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సమావేశంలో ఏం చర్చిస్తారంటే..పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురించి ఆయా కళాశాలల అధ్యాపకులు ముందుగా ఫోన్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. సమావేశం నిర్వహించే తేదీ, సమయాన్ని తెలుపాలి. సమావేశంలో వారి పిల్లల సామర్థ్యాల గురించి అ ధ్యాపకులు వివరించాలి. వారు ఏ దశలో ఉన్నారో తెలుపాలి. ఏయే పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నారో చెప్పాలి. మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఇంటి వద్ద కూడా చదివించాలని దిశానిర్దేశం చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా కళాశాల నిర్వహణ గురించి సమావేశంలో తెలుసుకోవాలి. అధ్యాపకు ల పనితీరును గమనించాలి. తద్వారా ఇరువైపులా విద్యార్థులపై శ్రద్ధ పెరిగి వారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది. హాజరు తగ్గుదలకు కారణాలుజిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీలోని పలు మండలాల్లోగల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హా జరుశాతం చాలా తక్కువగా ఉంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం, ఆర్టీసీ బస్సులు వేళకు రాకపోవడం లాంటి సమస్యలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థులు చాలావరకు పేదకుటుంబా లవారే కావడంతో ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే స్తోమత లేక తరచూ గైర్హాజరవుతుండడం గమనార్హం. -
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వాతావరణశాఖ సూచన మేరకు భారీ వర్షా ల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి, రాజురా గ్రామాల్లోని లోలెవల్ వంతెనలను అదనపు కలెక్టర్ డేవిడ్, డీపీవో భిక్షపతిగౌడ్తో కలిసి పరిశీలించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. రాజురా లోలెవల్ వంతెన ఇరువైపులా కోతకు గురి కాగా మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం కోసం 8500844365 లేదా 100 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
పింఛన్లు పెంచాలని డిమాండ్
కౌటాల: వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి గుండ థామస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శని వారం కౌటాల జగదాంబ గార్డెన్ పింఛన్దారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్దారుల సమస్యలు ప రిష్కరించడంతో పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు. ఈ నెల 21న కౌటాలలో తలపెట్టిన పింఛన్దారుల సభలో అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు పిట్టల సత్యనారాయణ, విఠల్, రాజేశ్, హీరమాన్, తిరుపతి, శంకర్, బాలయ్య, ప్రకాశ్, విజయ్ పాల్గొన్నారు. -
భార్యతో గొడవపడ్డందుకు చితకబాదిన ఎస్సై!
వేమనపల్లి: భార్యతో గొడవపడ్డందుకు తనను ఎస్సై చితకబాదాడని మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య ఆరోపించాడు. ఈ మేరకు ఎస్సైపై ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశంతో కలిసి సీపీ, డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య నాలుగేళ్ల క్రితం నీల్వాయి కొత్త కాలనీకి చెందిన భారత ప్రమీలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రమీల పుట్టింటికి వెళ్లడం, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తిరిగి కాపురానికి రావడం జరుగుతుండేది. 20 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రమీల పుట్టింటికి వెళ్లింది. దీంతో కిష్టయ్య గత ఆదివారం ఆమె వద్దకు వెళ్లి కాపురానికి రావాలని గొడవ పడ్డాడు. దీంతో ప్రమీలతోపాటు ఆమె తల్లిదండ్రులు నీల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేశ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేశాడు. అయితే గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశ్ ద్వారా రూ.10వేలు ఇవ్వాలని ఎస్సై తనను డిమాండ్ చేసినట్లు కిష్టయ్య ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన భార్య, అత్తమామలు, మరికొందరి ముందే ఎస్సై తనను రోకలిబండతో తీవ్రంగా కొట్టాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయమై మూడురోజుల క్రితం రూరల్ సీఐ బన్సీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. శుక్రవారం రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీకి పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించినట్లు పేర్కొన్నాడు. ఎస్సై సురేశ్తో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండా
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు. -
గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ముందుగా పీవో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 934 ప్రాథమిక పాఠశాలల్లో 12,017 మంది విద్యార్థులు చదువుతుండగా 1,449 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. 133 ఆశ్రమ పాఠశాలల్లో 31,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పెంచిన చార్జీల ప్రకారం నూతన ఆహార మెనూ అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పా రు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మినీ బాలికల గురుకులాలు, నాలుగు ఏకలవ్య పాఠశాలలు (కో–ఎడ్యుకేషన్), ఎనిమిది అప్గ్రేటెడ్ బాలికల జూని యర్ కళాశాలలు, నాలుగు అప్గ్రేటెడ్ జూనియర్ కళాశాలలు, ఒక బాలుర జూనియర్ కళాశాల, ఒక బాలికల జూనియర్ కళాశాల, రెండు మహిళా డిగ్రీ కళాశాలలు, ఒక పురుషుల డిగ్రీ కళాశాల ఉన్నట్లు తెలిపారు. గురుకులాల్లో 11,114 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 32 పీహెచ్సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటి ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 42 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. భూ బదలాయింపు చట్టం కింద ఈ సంవత్సరం 25 కేసులు నమోదు చేసి 12 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా 13 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జీసీసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ పంపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, మంజూరైన 11 పెట్రోల్ పంపులను ప్రారంభించి నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మగతా ఆరు పంపులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏవో దామోదరస్వామి, ఏడీఎంహెచ్వో మనోహర్, పీహెచ్వో సందీప్, పీవీటీజీ ఏపీవో మనోహర్, డీపీవో ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, ఆశ్రమ, గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రతిభకు ప్రశంస
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ బండ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన 125 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, అధికారులతో కలిసి ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతోపాటు డీటీడీవో రమాదేవి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సజీవన్, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు, కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం తదితరులు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. -
అభినవ పోతన.. వరదన్న
చెన్నూర్: తెలుగు రాష్ట్రాల్లో సాహితీ రంగంలో వానమామలై వరదాచార్యులు కీర్తి గడించారు. ఓ వైపు సాహిత్యంలో, మరోవైపు రాజకీయంలో రాణించా రు. వరదన్న చేతి నుంచి జాలు వారిన రచనలు ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి, ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. వరదాచార్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పని చేశారు. నేడు వరదా చార్యుల జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. జననం.. విద్యాభ్యాసంవరదాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో 16 ఆగస్టు 1912లో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు జన్మించారు. తండ్రి బక్కయ్యశాస్త్రి చెన్నూర్లో ఉపాధ్యాయునిగా పని చేశారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వరదాచార్యులకు చదువు అబ్బలేదు. ఆయన సహజ కవి. 13వ ఏటా పద్యాలు, కవితలు, రచనలు ప్రారంభించారు. డిగ్రీలు లేని పండితుడు కావడంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్లోని దోమకొండ జనతా కళాశాలకు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. అనంతరం వానమామలై ఆంధ్ర సారస్వత పరిషత్లో విశారద రాసి ఉత్తీర్ణులయ్యారు. వరదాచార్యులు రాసిన ‘మణిమాల’ విశారద పరీక్షలో పాఠ్యాంశంగా ఉంది. అది చదివే పరీక్ష రాశారు. బాలల కోసం అనే బుర్రకథలు, నాటికలు రచించారు. దోమకొండ నుంచి చెన్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేయించుకుని 1961 నుంచి 1972 వరకు విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. కవి ప్రస్థానంలో..చెన్నూర్ పట్టణానికి చెందిన వానమామలై వరదాచార్యుల 50 ఏళ్ల కవి ప్రస్థానంలో ఎన్నో రచనలు చేశారు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, ఆంధ్రకవి, వసంత, మధుకవి, కవికోయిల, ఉత్ప్రేక్షా చక్రవర్తి, మహాకవి శిరోమణి, కవిశిరోవసంత లాంటి బిరుదులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. షష్టిపూర్తి సందర్భంగా భారతీ సాహిత్య సమితి కరీంనగర్ జిల్లా కోరుట్లలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గండపెండేరం, స్వర్ణకంకణం, రత్నాభిషేకం చేశారు. పూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారణాసి వారు విద్యావాచస్పతి (డిలిట్) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇలా అనేక రాష్ట్రాల్లో మరెన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆయన అనేక రచనలు ముద్రితం కాగా, కొన్ని ముద్రణకు నోచుకోలేదు. రాజకీయ ప్రస్థానంలో..18 ఏళ్ల పాటు అధ్యాపకునిగా పని చేసిన వరదాచార్యులును అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం పీవీ నరసింహారావు 1972లో ఎమ్మెల్సీగా అవకాశమివ్వగా 1978 వరకు పని చేశారు. చెన్నూర్లో వేదపాఠశాల ఏర్పాటు చేసి అధ్యక్షునిగా పని చేశారు. 31 అక్టోబర్ 1984లో ఆయన తుదిశ్వాస విడిచారు. -
‘హమాలీల సమస్యలు పరిష్కరిస్తా’
బెల్లంపల్లి: హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీ సంఘం నాయకులను సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత కార్మికుల మాదిరిగానే ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం హమాలీలు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతకుముందు బజారు ఏరియా ప్రాంతం నుంచి పుర వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షులు, హమాలీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం
రెబ్బెన(ఆసిఫాబాద్): కొత్త గనుల ఏర్పాటుతో బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం రానుందని ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన వేదిక శిలాఫలకం ఆవిష్కరించారు. ఏరియాలో ఉత్తమ కార్మికులుగా ఎంపికైన వారిని సన్మానించి బహుమతులు ప్ర దానం చేశారు. జీఎం మాట్లాడుతూ గోలేటి, మాదారం ఉపరితల గనుల ఏర్పాటు ద్వారా ఏరియాకు పూర్వవైభవం రానుందన్నారు. ఉద్యోగుల కుటుంబాల కోసం ఐదు కొత్త బో రుబావుల ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్న ట్లు తెలిపారు. ఏరియాకు నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 95 శాతం ఉత్పత్తి సాధించా మన్నారు. కార్యక్రమాల్లో సేవా అధ్యక్షురాలు పద్మ విజయ భాస్కర్రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారుల సంఘం అధ్యక్షుడు నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
ఆసిఫాబాద్రూరల్: విధి నిర్వహణతోపాటు ప్రజల కు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఆసిఫాబాద్ ఎఫ్డీవో దేవిదాస్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కాగజ్నగర్ ఎఫ్డీవో సుశాంత్తో కలిసి రక్తదానం చేశారు. అటవీశాఖలో విధులు ఎన్నో సవాళ్లతో కూడుకుందన్నారు. వాటిని అధిగమిస్తూనే ప్రజలకు సేవ చేయాలని సూచించారు. రక్తదాన శిబిరంలో 62 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు అజ్మత్, రేంజ్ అధికారులు గోవింద్చంద్ సర్దార్, అనిల్కుమార్, శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ఝాన్సీరాణి, చంద్రమోహన్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ కా ర్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా గ్రంథా లయంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా న్యాయస్థానంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్వో నీరజ్కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రియాజ్ అహ్మద్, ఎమ్మెల్యే క్యాంపు, బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, చైతన్య కళాశాలలో నాగేశ్వర్రావు, ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి అశ్వక్ అహ్మద్, వివేకానందచౌక్లో దివ్యాంగుడు వెంకటేశ్వర్లు, పొట్టి శ్రీరాములు చౌక్లో వాసవీక్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సి పల్ కార్యాలయం, గాంధీ చౌక్లో మున్సిపల్ కమి షనర్ గజానంద్, శిశుమందిర్లో మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకన్న, ఆర్ఎంపీ వైద్యుల సంఘం, బీసీ సంఘం కార్యాలయాల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్ జెండా ఎగురవేశారు. -
గోల్కొండ పరేడ్లో ఏఎస్పీ చిత్తరంజన్
ఆసిఫాబాద్: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన పరేడ్కు ఆసిఫాబాద్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చిత్తరంజన్ నేతృత్వం వహించారు. తెలంగాణ కేడర్ 2022 బ్యాచ్కు చెందిన చిత్తరంజన్ గతేడాది సెప్టెంబర్ 17న జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్కు కూడా కమాండర్గా వ్యవహరించి.. నాయకత్వం, డ్రిల్ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ ఏఎస్పీగా పనిచేస్తూ ప్రజా కేంద్రిత పోలీసింగ్ విధానం, జిల్లా ఉప విభాగంలోని గిరిజన యువతతో సన్నిహిత సంబంధాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నారు. తిర్యాణి పాత పోలీస్ స్టేషన్ను ప్రజా గ్రంథాలయంగా, పాత వాంకిడి పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఆటస్థలంగా మార్చారు. పశువుల అక్రమ రవాణా, అక్రమ వడ్డీ వ్యాపారం, నిషేధిత గంజాయి సాగు రవాణా, వ్యాపారం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అటవీ పరిసర గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించేందుకు దీర్ఘకాలిక ప్రచారాలు చేపట్టారు. -
అమరుల త్యాగాలను స్మరిద్దాం
ఆసిఫాబాద్అర్బన్: స్వాతంత్య్ర పోరాటంతో ఎందరో మహానుభావులు జీవితాలు, ప్రాణాలను త్యా గం చేశారని, అలాంటి అమరులను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను భావితరా లకు తెలియజేయాలన్నారు. సమాజంలో శాంతిభద్రతలు లేకుండా నిజమైన స్వేచ్ఛను అనుభవించలేమని తెలిపారు. ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధత చూపాలని సూచించా రు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన తొ మ్మిది మంది పోలీసు అధికారులకు సేవా పతకాలు అందించి అభినందించారు. కాగజ్నగర్ సీఐ రాజేంద్రప్రసాద్, ఆసిఫాబాద్ ఎస్సై శ్రీనివాస్, భరోసా సెంటర్ మహిళా ఎస్సై తిరుమల, కాగజ్నగర్ ఏఎస్సై బాలాజీ, హెడ్ క్వార్టర్ ఏఎస్సై శ్రీనివాస్, హెడ్ క్వార్టర్ హెడ్ కానిస్టేబుల్ ఇమామా, బిశ్వజిత్ మాగి, సిర్పూర్ హెడ్ కానిస్టేబుల్ అజీమొద్దీన్, ఏఆర్ హెడ్క్వార్టర్ నాందేవ్ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం తదితరులు పాల్గొన్నారు.