breaking news
Kumuram Bheem District News
-
ఆకట్టుకున్న క్షిప్రావధానం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన క్షిప్రావధానం ఆకట్టుకుంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన తెలుగు పండితులకు ఐదురోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా అష్టావధాని మాడుగుల నారా యణమూర్తి క్షిప్రావధానం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముదు బాల రాజేంద్రప్రసాద్ సంచాలక అధ్యక్షుడిగా వ్యవహరించగా, డీఆ ర్పీ నల్లగొండ సత్యనారాయణ సమన్వయం చేశారు. అవధాన పద్యాలతో సభ ప్రారంభమైంది. తొలుత రాజేంద్రప్రసాద్ అవధానాల విధివిధానాలు, తీరుతెన్నులు, క్షిప్రావధానం ప్రత్యేకత గురించి వివరించారు. తెలుగు పండితురాలు భువనేశ్వరి అప్రస్తుత ప్రసంగం, అర్థవంతమైన ప్రశ్నలతో భావస్పోరక హా స్య, వ్యంగ్య సమాధానాలతో సభను రంజింపజేశారు. పుష్పలత వ్యస్తాక్షరిగా, వెంకటాద్రి న్యస్తాక్షరి పృచ్చకులుగా ప్రశ్నించారు. కార్యక్రమం ఆధ్యంతం రసవత్తరంగా సాగింది. ఏసీఎంవో పుర్క ఉద్దవ్, కోర్సు డైరెక్టర్ కొడం రవీందర్, తెలుగు పండితులు పాల్గొన్నారు. -
అమ్మలకు ఆషాఢ బోనం
చింతలమానెపల్లి: బోనాలతో ఊరేగింపుగా వెళ్తున్న మహిళలుకాగజ్నగర్టౌన్: ఊరేగింపులో మహిళలు, శివసత్తులుచింతలమానెపల్లి: ఆలయంలో పూజలు చేస్తున్న గ్రామస్తులుకాగజ్నగర్టౌన్/చింతలమానెపల్లి: కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్లోని శ్రీమహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లారీ చౌరస్తా నుంచి సర్సిల్క్ దేవాలయం వరకు డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు–శివాణి దంపతులు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త పల్లి అనిత– శ్రీనివాస్ దంపతులు ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, సభ్యులు ఏర్పాట్లు చేయగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే, చింతలమానెపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో పోచమ్మ బోనాల పండగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని ధరంపెల్లి, బారెవాడ, డబ్బా గ్రామాలకు చెందిన మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. పోచమ్మ తల్లికి నూతన వస్త్రాలు, బోనాలు సమర్పించారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. -
కుమురం భీం
7బోనస్కు ‘సన్న’గా మెలిక ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ చెల్లిస్తూనే రోజుకో మెలిక పెడుతోంది. ఏడు రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రకటించగా రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద తాకిడికి దెబ్బతిన్న పత్తి ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల పత్తి చేన్లను వరద ముంచెత్తింది. ప్రభుత్వం సర్వే నిర్వహించి నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురుస్తుంది. సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
‘భగీరథ’ పైపులైన్ లీకేజీ
కాగజ్నగర్టౌన్: వరదల కారణంగా కాగజ్నగర్ మండలంలోని చింతగూడ సమీపంలో గల మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ దెబ్బ తినడంతో కాగజ్నగర్, దహెగాం మండలా ల్లో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలి చిపోయింది. ఈ విషయమై మిషన్ భగీరథ డీఈ పృథ్వీరాజ్ను వివరణ కోరగా.. చింతగూడ వద్ద పైపులైన్ గాస్కెట్ భారీ వరదలకు దెబ్బతినడంతో లీకేజీ అవుతోందని తెలిపా రు. దీంతో కాగజ్నగర్, దహెగాం మండలా ల పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరా యం ఏర్పడుతోందని పేర్కొన్నారు. మరమ్మతులు చేపట్టి సోమవారం నుంచి తాగునీటి స రఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. -
గిరిజన విద్యాభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్రూరల్: ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని డీటీడీవో అంబాజీ పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తానని తెలిపా రు. హాస్టళ్లలోని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారి న పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వెల్లడించారు. సాక్షి: డీటీడీవోగా జిల్లాకు ఎలాంటి సేవలందిస్తారు?డీటీడీవో: ఆదివాసీ జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. 2014లో ఉమ్మడి జిల్లా ఏటీడీవోగా పని చేశాను. ఆదివాసీలకు సేవ చేయడం నా బాధ్యత. ఇందులో భాగంగా గిరిజనుల అభివృద్ధి కోసం సేవలందిస్తాను. ఆశ్రమ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యను బలోపేతం చేస్తా. తరచూ పాఠశాలలను విజిట్ చేసి విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను. సాక్షి: సింగిల్ టీచర్ స్కూళ్లు ఎన్ని ఉన్నాయి? టీచర్ల కొరత ఉందా? ఎక్కడైనా స్కూళ్లు మూతబడ్డాయా?డీటీడీవో: జిల్లాలో 46 ఆశ్రమ వసతిగృహాలు, 334 ప్రాథమిక పాఠశాలున్నాయి. వీటిలో 13,600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 806 మంది టీచర్లలో రెగ్యులర్ ఉపాధ్యాయులు 403 మంది, సీఆర్టీలు 457 మంది పని చేస్తున్నారు. 334 సింగిల్ టీచర్ స్కూళ్లున్నాయి. ఈ సంవత్సరం మూతబడిన ఒక స్కూల్ను తెరి పించాం. సింగిల్ టీచర్ స్కూల్ ఉపాధ్యాయు డు అత్యవసర పరిస్థితిలో హాజరు కాని రోజు ఆ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని హెచ్ఎం, సీఆర్టీకి ఒకరోజు ముందు సమాచారం ఇచ్చి వేరే టీచర్లను పంపిస్తాం. విధులను నిరక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. సాక్షి: పదోతరగతి ఫలితాలపై మీ అంచనా?డీటీడీవో: పదో తరగతి ఫలితాల్లో గతేడాది 98శాతం ఉత్తీర్ణత నమోదైంది. 13 స్కూళ్లు వందశాతం ఫలితాలు సాధించాయి. ఈసారి 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూ పొందించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి చేయిస్తాం. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటాం. నూతన విద్యావిధానంపై అన్ని సబ్జెక్ట్ టీచర్లకు బోధించే విధానంపై ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తాం. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అర్థమయ్యేలా బోధించేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలనున్న నేపథ్యంలో హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డీటీడీవో: వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తుగా అన్ని వసతిగృహల్లో ఆ ర్వో (వాటర్) నీటిని అందిస్తున్నాం. పిల్లలకు రోజువారీగా మెనూ ప్రకారం ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. విద్యావీక్ష యాప్లో రోజువారీగా వండిన ఆహార పదార్థాలను హెచ్ఎం ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. దీంతో మెనూ అమలవుతుందా? లేదా? అన్నది వెంటనే తెలిసిపోతుంది. పాఠశాలలకు అవసరమైన మేజర్, మైనర్ పనులు పూర్తి చేస్తున్నారు. ఆర్బీకే వైద్య బృందం ప్రతీవారం పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధింత వార్డెన్, హెచ్ఎం, ఏఎన్ఎంలకు సూచించాం. అవసరమైతే కార్పొరేట్ వైద్యసేవలూ అందిస్తాం.సాక్షి: గిరిజన విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?డీటీడీవో: జిల్లాలో గిరిజన సంక్షేమ కోసం వసతి గృహాలు, పాఠశాలలను విజిట్ చేస్తూ విద్యను మరింత బలోపేతం చే స్తా. ఉపాధ్యాయులు, విద్యార్థులు రో జూ పాఠశాలలకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందిస్తా. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేక గ్రూప్లుగా విభజించి స్పెషల్ క్లాస్లు నిర్వహించేలా చర్యలు చేపడతాం. వారిలో అభ్యస న సామర్థ్యాలు పెంచుతాం. ప్రతిరోజూ ఏటీడీవో తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా చర్యలు తీసుకుంటాం. -
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి
కాగజ్నగర్టౌన్: ప్రజా ఉద్యమాలను మరింత బ లోపేతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కామ్రెడ్ అబ్బాస్ సూచించారు. పట్టణంలోని కిశోర్ ఫంక్షన్ హాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ఆది వారం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అబ్బాస్ హాజరై మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఆర్థి క విధానాలు కార్మికులు, రైతులు, పేద ప్రజల ప్ర యోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించా రు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు భారత ఆర్థిక వ్య వస్థపై చూపుతున్న ప్రభావాన్ని పార్టీ కార్యకర్తలు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణాన్ని పెంచుతూ సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీపీఎం జెండాను ఆవిష్కరించారు. శిక్షణ తరగతులకు ముంజం ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, కార్యవర్గ సభ్యులు దేవిక, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కార్తిక్ జాదవ్, రాజేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిలిచిన యంత్రలక్ష్మి
కెరమెరి: అన్నదాతలకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. విత్తనాలు, ఎరువుల ధరలు అమాంతం పెంచడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ఏటా యంత్ర పరికరాలు, ఇతర రాయితీలు అందించా ల్సిన సర్కారు ఆ వైపుగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. రాయితీపై వ్య వసాయ యంత్రాలు, పనిముట్లు అందించాలని రై తులు ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలే దు. అబ్కీ బార్ కిసాన్ సర్కారు.. అని చెప్పుకొంటున్న కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరస్థితులకు భి న్నంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. వా నాకాలం సీజన్ ప్రారంభమై రెండునెలలైనా యంత్రపరికరాల పంపిణీపై దృష్టి సారించలేదు. ఆర్థికంగా చితికిపోతున్న రైతులుఅన్నదాతలకు వ్యవసాయం పెనుభారంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు అమాంతం పెరగడంతో ఆర్థికభారం మోస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించడం లేదు. ఏటా పెట్టుబడి సాయంగా రైతుభరోసా ఇస్తున్నా ఏమాత్రం సాగు ఖర్చులకు సరిపోవడంలేదు. దీంతో రైతులు వ్యవసాయాన్ని భారంగా భావిస్తున్నారు. నిధులు లేవని 2018 నుంచి యంత్రలక్ష్మి పథకాన్ని నిలిపివేశారు. నాలుగేళ్లుగా రాయితీ విత్తనాల పంపిణీ నిలిచిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధికధరలకు కొనుగోలు చేసి అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. పరికరాలు పంపిణీ చేయాలి ప్రభుత్వం ఎకరాకు రూ.6వేల పెట్టుబడి సాయం ఇవ్వడం మంచిదే. కానీ, వ్యయసాయ యంత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో వ్యవసాయశాఖ నుంచి వివిధ రకాల పరికరాలు అందేవి. ప్రస్తుతం సాగుకు ఖర్చులు అధికమవుతున్నాయి. – సోనేరావు, రైతు, కెరమెరి రాయితీలిచ్చి ఆదుకోవాలి విత్తనాలు, యూరియా ధరలు పెరిగాయి. వ్యవసాయం చేద్దామంటే ప్రస్తుతం చేతిలో డబ్బులుంటే గాని కుదరని పరిస్థితి ఉంది. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతుభరోసాతోనే చేతులు దులుపుకొంటోంది. ఎప్పటిలాగే రాయితీలిచ్చి ఆదుకోవాలి. – మడావి రఘునాథ్, రైతు మెట్టపిప్రి -
ఎస్టీ హోదా కల్పించాలి
కాగజ్నగర్టౌన్: మాలీ కులస్తులకు ఎస్టీ హో దా కల్పించాలని తెలంగాణ మాలీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురె శ్యామ్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని తిలక్నగర్ బీసీ భవన్లో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించగా ఆయన హా జరై మాట్లాడారు. మాలీలకు ఎస్టీ హోదా కో సం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా, ని రసన కార్యక్రమాలు నిర్వహించేందుకు విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేలా రాష్ట్రంలోని నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. జిల్లా స్థా యి నాయకుల సలహాలు, సూచనలు తీసుకుని రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు, ప్ర జాచైతన్య కార్యక్రమాలపై ప్రణాళికలు రూ పొందించామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి వసంత్రావు, మంచిర్యాల జిల్లా అ ధ్యక్షుడు మొర్ల మొండి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, మాలీ కులస్తులు హాజరయ్యారు. -
అధికార్ల కక్కుర్తి..!
కౌటాల: సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం.. రూ.లక్షల్లో జీతాలు.. అయినా.. ఇది సరిపోదన్నట్లుగా కొందరు జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. జిల్లాలో చాలామంది అధికారులు వాహన వినియోగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు అద్దె కార్లు వినియోగించవచ్చు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధి కారులు, తహసీల్దార్, ఎంపీడీవోలకూ ఈ సదుపా యం ఉంది. కానీ, నెలనెలా అందించే వాహనాల అద్దె కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తమ సొంత వాహనాలు వినియోగిస్తూ ప్రభుత్వం కల్పి స్తున్న సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్ర భుత్వ అధికారులు ట్యాక్సీ రిజిస్ట్రేషన్ (పసుపు రంగు నంబర్ ప్లేట్) ఉన్న వాహనాలు వినియోగించా లి. ఈ వాహనానికి బీమా కోసం ఏటా రూ.30వేల వరకు, ఫిట్నెస్ కోసం రూ.1,500 రవాణా శాఖకు చెల్లించాలి. సొంత వాహనం (తెల్ల నంబర్ ప్లేట్ ఉన్న వాహనం) రూ.3వేల వరకే బీమా చెల్లించాల్సి ఉంది. ఫిట్నెస్ చార్జీలుండవు. జిల్లాలోని అనేక మంది అధికారులు సొంత వాహనాలనే వాడటంతో రవాణాశాఖ ఆదాయానికి గండిపడుతోంది. అద్దె కోసం అడ్డదారులుజిల్లాలో ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని శాఖల్లో అద్దెకార్ల తంతు నడుస్తోంది. ట్యాక్సీ రిజిస్ట్రేషన్లున్న కార్ల నంబర్లు, ఆయా యజమానుల వివరాలు అధికారులు తెచ్చుకుంటున్నారు. వీరి వాహనాలనే వినియోగించుకుంటున్నామని బిల్లులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అనేక చోట్ల అధికారులే సొంతంగా వాహనాలు నడుపుకొంటూ డ్రైవర్కు ఇచ్చే వేతనం కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. తమకు తెలిసిన వారివి లేదా రూ.5వేలు, రూ.10 వేలు కమీషన్లు ఇస్తూ ఎల్లోప్లేట్ కలిగిన ఇతరుల పేరిట ట్రైజరీ నుంచి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ప్రతీ ప్రభుత్వ అధికారి కారులో నెలలో 2,500 కిలో మీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఇందుకు డ్రైవర్ వేతనం, ఇంధన ఖర్చుతో కలిపి మొత్తం రూ.33వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారుగా 100కు పైగా అద్దె వాహనాల దందా నడుస్తోంది. వీటికి ప్రతినెలా రూ.33వేల చొప్పున రూ.33లక్షల వరకు బిల్లులు చెల్లిస్తున్నారు. అధికారులు సొంత వాహనాలు వినియోగిస్తుండడంతో ఒక్కో వాహనానికి చెల్లించాల్సిన బీమా, ఫిట్నెస్ నెలకు రూ.లక్షల్లో రవాణాశాఖ ఆదాయం కోల్పోతోంది. ఉపాధికి కత్తెరప్రభుత్వ అధికారుల అద్దె కార్లకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేసినప్పుడు.. కారు బిల్లులు కాజేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. బ్యాంక్ రుణా లు, సబ్సిడీ, కార్పొరేషన్లతో పాటు ఓనర్ కం డ్రైవర్ వంటి స్కీం, దళిత బంధు పథకాల్లో నిరుద్యోగ యువత ట్యాక్సీ ప్లేట్కార్లు కొనుగోలు చేశారు. కానీ, ప్రస్తుతం గిరాకీలు దొరకడం కష్టంగా మారింది. దీంతో కొందరు కార్లు అమ్ముకుంటున్నారు. బెజ్జూర్ తహసీల్దార్ రామ్మోహన్ విధులకు వినియోగిస్తున్న సొంత కారు కౌటాల తహసీల్దార్ ప్రమోద్కుమార్ విధులకు వచ్చింది ఈ సొంత కారులోనే..కౌటాల తహసీల్దార్ ప్రమోద్కుమార్ కాగజ్నగర్ నుంచి సొంత కారులో తానే డ్రైవ్ చేస్తూ విధులకు హాజరవుతున్నారు. బెజ్జూర్ తహసీల్దార్ రామ్మోహన్ కూడా ప్రభుత్వ విధులకు సొంత కారునే వినియోగిస్తున్నారు. కాగజ్నగర్లో ఉంటూ బెజ్జూర్కు సొంత వాహనంలో వస్తారు. ఇలా జిల్లాలో చాలా మంది అధికారులు సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో ట్యాక్సీప్లేట్ కార్లు నడిపేవారికి ఉపాధి లేకుండా పోతోంది. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా ల, జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థా యి కిడ్స్, జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మారయ్య ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థులు అండర్–8 విభాగంలో గణేశ్, అండర్–10 విభాగంలో రిత్విక్, కార్తిక్, అండర్–12లో సాయిచరణ్, అండర్–16లో యశ్వంత్ ప్రతిభ కనబర్చారు. ఈనెల 7, 8 తేదీల్లో హన్మకొండ జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, పీడీ , ఉపాధ్యాయులు వీరిని అభినందించారు. -
బస్సు కిందపడి ఒకరి ఆత్మహత్య
మంచిర్యాలరూరల్(హాజీపూర్): బస్సు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన హాజీపూర్ మండలం రాపల్లి స్టేజీ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్కు చెందిన ఆసాది లింగయ్య(55) ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఆటోలో మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన లింగయ్య ఒక్కసారిగా బస్సు కిందకు దూకాడు. తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య జయశీల, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కుమారుడు సునీల్, కుమార్తె సుజాత ఉన్నారు. ఈ ఘటనపై పోలీస్స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. లింగయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్థాపానికి గురై బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉరేసుకుని భర్త సిర్పూర్(టి): భార్యతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిర్పూర్(టి) ఎస్సై సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లోనవెల్లి గ్రామానికి చెందిన బెండారి పితాంబర్(53), పవిత్ర దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. గ్రామంలో వారికి 12 ఎకరాల భూమి ఉంది. పదెకరాల భూమి కౌలుకు ఇస్తూ రెండెకరాలు సొంతంగా వ్యవసాయం చేసుకుంటుండేవాడు. ఈసారి 12 ఎకరాల భూమి తామే స్వతహాగా చేసుకుందామని భార్య..భర్త పితాంబర్కు చెప్పింది. తనకు ఆరోగ్యం బాగాలేదని 12ఎకరాల భూమి వ్యవసాయం చేయడం సాధ్యం కాదని చెప్పగా శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పితాంబర్ శనివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్సపొందుతూ వివాహిత మృతి కడెం: పురుగుల మందు తాగిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని కల్లెడకు చెందిన సీపెల్లి గంగామణి (35)ను అదే గ్రామానికి చెందిన రొడ్డ బుచ్చన్న గతనెల 7న తిట్టాడు. మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగింది. కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఫుడ్ ఫాయిజన్ ఘటన ఇంకా మరువకముందే శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. గురిజాలకు వెళ్లేదారిలో ప్రభుత్వ గిరిజన బా లుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఏఎన్ఎం సైతం అస్వస్థత కు గురైన ఘటన కలకలం రేపింది. మధ్యా హ్న భోజనం చేసిన విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకుని కడుపునొప్పితో బాధపడగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి ఏఎన్ఎం భవానీ చికిత్స తీసుకుని డిశ్చార్జీ కాగా విద్యార్థుఽలు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో అకిరానందన్, రుషి , యశ్వంత్ ,నేశ్వంత్, విష్ణు, మణిచరణ్, విక్కీ ఉన్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. -
పోడుసాగుపై ఆంక్షలు ఎత్తివేయాలి
కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామస్తులు పో డుసాగుపై అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన చేపట్టారు. ఉడుంపూర్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. పంటల సాగులో నిబంధనలు ఎత్తివేయాలని నాలుగు గంటల పాటు కడెం–జన్నారం–ఉట్నూర్ ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేపట్టి బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎఫ్డీవో శివకుమార్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. పోడుసాగులో ట్రాక్టర్లు, మిషన్లను ఉపయోగించరాదని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ నిబంధన మేరకు ఎడ్ల నాగలితో సాగు చేపట్టవచ్చని తెలిపారు. సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్, పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఏళ్లుగా చేస్తున్న భూముల సాగులో ఇప్పుడు నిబంధనల పేరిట ట్రాక్టర్లు, మిషన్లను అడ్డుకోవడం సరికాదన్నారు. తమ వ్యవసాయాన్ని అడ్డుకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎఫ్ఆర్వో గంటల శ్రీనివాస్రెడ్డి వారికి చెప్పడంతో ఆందోళన విరమించారు. నాలుగు గంటల రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లు విసిరి దాడి చేశారు ప్రభుత్వం ఇచ్చిన ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో ట్రాక్టర్తో దున్నడం నేరమని కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దాని ప్రకారం ఆపాం. పలువురు గ్రామస్తులు కార్యాలయంపై రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.50 వేల ఆస్తినష్టం వాటిల్లింది. నాతో పాటు, సిబ్బందికి ప్రాణహాని ఉంది. – శ్రీనివాస్రెడ్డి, ఎఫ్ఆర్వో, ఉడుంపూర్ -
ప్రణాళికతో బోధించాలి
శిక్షణ అనంతరం ఉ పాధ్యాయులు ప్రతీ రోజు పాఠశాలలో 3గంటల నుంచి 4గంటల వరకు రెమిడియల్ టీచింగ్ అమలు చేయాలి. ప్రత్యేక ప్రణాళికతో బోధిస్తే తప్పకుండా వెనుకబడిన విద్యార్థులు నిర్దేషించిన సామర్థ్యాలు సాధించగలుగుతారు. ఏ సమయంలో.. ఏమి బోధించాలనే విషయాలను ముందే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసి టీచింగ్ ప్రారంభించాలి. 2నుంచి 5వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం వచ్చేలా, గణితంలో సామర్థ్యాలు సాధించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. – ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్ -
నిందితులకు శిక్షపడేలా చూడాలి
ఆదిలాబాద్టౌన్: దర్యాప్తు పకడ్బందీగా నిర్వహించి బాధితులకు న్యాయం చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బి.సి శశికుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఉ మ్మడి జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన దర్యాప్తు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. ఆలస్యం జరిగితే ప్రజలకు కోర్టులపై విశ్వాసం కోల్పోతారని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే నేరస్థలంలో సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు చేపట్టాలన్నారు. నిర్దిష్ట సమయంలో చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేసి వారికి రావల్సిన నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో పీపీ ముస్కు రమణారెడ్డి, అదనపు ఎస్పీ సురేందర్రావు, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏసీపీ, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, అశోక్, లైజన్ అధికారులు రమేశ్, ఈశ్వర్సింగ్, రాఘవేందర్, ఉమాదేవి, గంగాసింగ్, పరశురాం, పండరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్గంగ వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ
సిర్పూర్(టి): నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలం మీదుగా ప్రవహిస్తున్న పెన్గంగ నది వరద ఉధృతిని శనివారం ఎస్పీ నితిక పంత్ పరిశీలించారు. వెంకట్రావ్పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని హైలెవల్ వంతెన వద్ద వరద ఉధృతి ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వాహనా ల రాకపోకలు నిలిపివేయాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెన్గంగ పరీ వా హక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారులు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి ప్రజ లకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపా రు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టు చేసుకోకుండా రోప్లు, లైఫ్బాయ్లు, లైఫ్ జా కెట్లు తదితర అత్యవసర రక్షణ కిట్లు అందుబా టులో ఉంచామని తెలిపారు. మత్స్యకారులు చేపల వే టకు వెళ్లొద్దని, పడవ ప్రయాణాలు చేయరాదని సూచించారు. అనంతరం పారిగాం గ్రామ సమీపంలోని వంతెన వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వహీదొద్దీన్, ఎస్సై సాగర్ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలికౌటాల: ప్రాణహిత, వార్థా నదుల సరిహద్దు గ్రా మాల ప్రజలు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని పరిశీలించారు. నదుల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోందని, ఎవరూ అటు వైపు వెళ్లవద్దని తెలిపారు. రోప్లు, లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రి అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వహీదొద్దీన్, కౌటాల సీఐ సంతోష్ కుమార్, సర్పంచ్ సూరజ్ తదితరులున్నారు. -
కుమురం భీం
7‘లోలెవల్’తో తిప్పలు లోలెవల్ వంతెనల పైనుంచి వరదనీరు వెళ్తుండగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి. కొందరు వాహనాలు దాటించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రి‘పరేషాన్’! ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ.. కోచింగ్, స్టడీమెటీరియల్ తది తర ఖర్చుతో ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది. ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
కూరగాయల విత్తనాలు పంపిణీ
కాగజ్నగర్టౌన్: కిచెన్ గార్డెన్ ఏర్పాటు కో సం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వి ద్యార్థులకు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జలజీవిక వాటర్ఫర్ లైవ్లీహుడ్ సంస్థ సహకా రంతో శనివారం కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి మా ట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి ఇంటి వద్ద చిన్న కి చెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని రసాయన ర హిత, పోషకాహారంతో కూడిన కూరగాయలు పండించాలని సూచించారు. జలవిక వా టర్ ఫర్ లైవ్లీహుడ్ సంస్థ డైరెక్టర్ పద్మాకర్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు దేవేందర్, శారద, కృష్ణవేణి, రోజ్మేరి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులుగా పేర్లు నమోదు చేసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రతీ కార్మికుడు కార్మిక శా ఖలో పేరు నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ అధికారి దుర్గం క్రాంతి సూచించా రు. శనివారం జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో కార్మికులకు పలు అంశాలపై అవగాహన కల్పించా రు. కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు వ ర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని సూచించారు. జూని యర్ అసిస్టెంట్ విజయ్కన్నా, సిస్టం ఆపరేటర్ ఖలీద్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, జిల్లా కోశాధికారి ఆనంద్రావ్, మండలాధ్యక్షుడు కమలాకర్, ఉపాధ్యక్షుడు రాంచందర్, కార్యదర్శి నర్సయ్య, నాయకులు సదయ్య, శంకర్, ఆప్రోచ్, బాలాజీ తదితరులున్నారు. -
పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన పోస్టర్ను కలెక్టర్ కె.హరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారమని తెలిపారు. పోషణ్ అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 1నుంచి 7వరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, గర్భిణులు, బాలింతలతో సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, పోషణ్ అభియాన్ బృందం సభ్యులు, సీడీపీవోలు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం విక్రయిస్తే చర్యలు
కెరమెరి: రేషన్ బియ్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని, రేషన్ కార్డులను రద్దు చేస్తామని అదనపు కలెక్టర్ డేవిడ్ హెచ్చరించా రు. శనివారం మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులో పేరుండి మరణించిన వారి పేర్లు తక్షణమే తొలగించాలని, ఈకేవైసీ ఈ నెల 31 వరకు పొడిగించారని తెలిపారు. గడువులోపు వందశాతం పూర్తి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ నాగార్జున, డీటీ సంతో ష్కుమార్, డీలర్లు, సేల్స్మెన్లు పాల్గొన్నా రు. -
వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు కాలానుగుణంగా వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల ని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో ఆసిఫా బాద్, మంచిర్యాల ఉపాధ్యాయులకు నిర్వహించిన ఐదురోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై శిక్షణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతిగదిలో సమర్ధవంతంగా అమలు చే యాలని సూచించారు. విద్యార్థుల్లో పఠనం, రచన, గణిత నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత, నాయకత్వ ల క్షణాలు పెంచాలని తెలిపారు. గిరిజన వి ద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, జీసీడీవో శకుంతల, లక్ష్మయ్య, కోర్సు డైరెక్టర్ రవీందర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో మంద మకరందు -
నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురి అరెస్టు
తాండూర్: భీమిని పోలీస్స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తాండూర్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో భీమిని ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి భీమిని మండలం రాంపూర్ శివారులో తనిఖీ నిర్వహించారు. ఇన్నోవా కారులో తరలిస్తున్న గడ్డి మందును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా వెంకటాపూర్ శివారులో తనిఖీ నిర్వహించగా రెండు బైక్లపై గడ్డి మందు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు క్యాన్ల, 10 ప్యాకెట్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 క్యాన్లలో రూ.1.04 లక్షల విలువ కలిగిన 210 లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన కాగజ్నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన గుండ రాజు, బట్టుపల్లికి చెందిన పార్వతి కిరణ్, భీమిని మండలం వెంకటాపూర్కు చెందిన రుకుం వెంకటేశ్, పల్లె రవీందర్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్నోవా కారు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మహా రాష్ట్రలోని రాజురాలో గడ్డి మందును కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలోని రైతులకు అమ్మడానికి ప్రయత్నించగా వారిని చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందును ఎవరైన విక్రయిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, సీఐ దేవయ్య, ఎస్సైలు కోటేశ్వర్, ప్రసాద్రావు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
బాసర: నిర్మల్ జిల్లా బాసర–బిద్రెల్లి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డు దుర్మరణం చెందాడు. స్థానికులు, బాసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముధోల్ గ్రామానికి చెందిన కె.బాబు (50) బాసర ట్రిపుల్ ఐటీ ప్రారంభమైనప్పటి నుంచి సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి ముధోల్ నుంచి బాసరకు రాత్రి డ్యూటీ కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో బాసర–బిద్రెల్లి మధ్య ప్రధాన రహదారిపై పంక్చర్ అయిన లారీ నిలిపి ఉంది. దానిని చీకట్లో గమనించలేకపోయిన బాబు.. వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాబు తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, 108లో క్షతగాత్రుడిని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాబు మృతిచెందాడు. సుదీర్ఘకాలంగా ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న బాబు అకస్మాత్తుగా మరణించడంతో సహచర భద్రతా సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఘటనపై బాసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాసర ఎస్హెచ్వో దీపక్ తెలిపారు. -
స్నేహమేరా శాశ్వతం
స్నేహితురాలి ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులు అభ్యసించా ఆసిఫాబాద్అర్బన్: పేద కుటుంబానికి చెందిన నేను బడికి వెళ్లినపుడు నా స్నేహితురాలు అంజలి పెన్సిళ్లు, నోట్బుక్స్, డ్రెస్సులు ఇస్తూ ప్రోత్సహించేది. తన ప్రోత్సాహంతోనే నేను బీఏ, బీఈడీ చదివాను. 10వ తరగతి వరకు తబలాపూర్లో ఇద్దరం కలిసే చదివాం. బడికి వెళ్లే దారి మధ్యలోని పెద్దవాగును జంటగా దాటే వాళ్లం. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాజకీయాలపై మక్కువతో 2024లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేశాను. ప్రస్తుతం అంజలి తన కుటుంబంతో ఆదర్శ గృహిణిగా జీవిస్తోంది. ఎవరికి సమస్య వచ్చినా ఫోన్లో ఒకరికొకరం భరోసా కల్పించుకుంటాం. నిజమైన స్నేహానికి కులాలు, మతాలు, ధనిక, పేదరికం ఏవీ అడ్డురావు. ఇందుకు మా స్నేహమే నిలువెత్తు నిదర్శనం. – అంజలితో ఆత్రం సుగుణమనల్ని అర్థం చేసుకుని.. కష్టాల్లో ధైర్యం చెప్పి.. సంతోషాన్ని రెట్టింపు చేసేవారే స్నేహితులు. కాలం మారినా, దూరం పెరిగినా.. కష్ట, సుఖాల్లో తోడుగా నిలిచేవారే మిత్రులు. జీవితమనే ప్రయాణంలో ప్రతీ అడుగులో అండగా ఉండేవారు దోస్తులు.. రక్తసంబంధం కాకపోయినా హృదయాలను కలిపే అనుబంధమే స్నేహం.. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్, ఆర్డీవో తదితరులు వారి స్నేహ సంబంధాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
కలిస్తే బాల్య స్మృతులు నెమరువేసుకుంటాం
ఆసిఫాబాద్: తొమ్మిది మంది స్కూల్ మేట్స్తో నా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. చిన్న వయస్సులో ఏర్పడిన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మాలో ఎవరికీ స్వార్థం అనేదే లేదు. మా మధ్య ఎలాంటి దాపరికాలూ ఉండవు. అన్ని విషయాలు కలిసే డిస్కస్ చేస్తాం. ఒకరికొకరం అవసరమైన సలహాలు ఇచ్చుకుంటాం. అంతస్తు, హోదాతో తేడా లేకుండా కొనసాగుతున్న మా మైత్రి బంధం వెలకట్టలేనిది. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎలా ఉన్నామో ఇప్పటికే అందరం కలిస్తే బాల్యంలోకి వెళ్లిపోతాం. చిన్నపిల్లల్లా మారి సిల్లీ పనులు చేస్తాం. నిజంగా మేము చాలా అదృష్టవంతులం. ఇప్పటి పిల్లలకు ముందు తరాలవారితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలోనే మిత్రులంటారు. – కె.హరిత, కలెక్టర్ -
వెనుకబడితే రెమిడియల్
కెరమెరి: విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అయినప్పటికీ కొందరు విద్యార్థులు నిర్దేషిత సామర్థ్యాలను సాధించలేకపోతున్నా రు. దీంతో వెనుకబడిన విద్యార్థులను ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి తీసుకురావడానికి ప్రభుత్వం రెమిడియల్ టీచింగ్ను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 2, 3, 4, 5 తరగతుల విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి చదవడం, రా యడం, గణిత సామర్థ్యాలను బలోపేతం చేయాల నే లక్ష్యంతో విద్యాశాఖ చేపట్టిన ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు రెమిడియల్ టీచింగ్పై అన్ని మండలాల్లో ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు గత నెల 29 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించింది. రెండు దఫాల్లో శిక్షణ ఇవ్వనుండగా ఇప్పటికే మొదటి విడ త శిక్షణ తరగతులు ముగిశాయి. రెండో విడత శిక్షణ తరగతులు ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించనుంది. శిక్షణలో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసే పద్ధతులు, లెర్నింగ్ గ్యాప్ల గుర్తింపు, చిన్న బృందాల బోధన, ఆటలు, కథలు, చిత్రాలు, బోధనోపకరణాల వినియోగం, కార్యాచరణ ఆధారిత అభ్యాసం, నిరంతర మూల్యాంకనం, పురోగతి నమోదు లాంటి అంశాలను మాస్టర్ ట్రైనర్లు వివరిస్తున్నారు. ప్రతీ విద్యార్థి అవసరానికి అనుగుణంగా బోధించడం ద్వారా అభ్యాస ఫలితాలు మెరుగుపడతాయని సూచిస్తున్నారు. ఐదు స్టెప్పుల్లో విద్యార్థులకు బోధించాలని చెబుతున్నారు. రెమిడియల్ టీచింగ్లో..అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించాలి. చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల్లో వారి లోపాలను గుర్తించాలి. విద్యార్థి స్థాయికి అ నుగుణంగా ప్రత్యేక కార్యాచరణ, నిరంతర మూ ల్యాంకనం ద్వారా పురోగతి అంచనా వేయాలి. ఎఫ్ ఎల్ఎన్ లక్ష్యాల సాధనకు కీలకమైన బోధన విధా నం అమలు చేయాలి. విద్యార్థుల అభ్యసన స్థాయి ని పరీక్షల ద్వారా గుర్తించాలి. చిన్న, చిన్న గ్రూపులుగా లేదా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా బోధించాలి. సులభమైన ఉదాహరణలు, ఆటలు, చిత్రాలు, కార్యకలాపాల ద్వారా పాఠ్యాంశాలు నేర్పించాలి. తరచూ మూల్యాంకనం చేసి పురోగతిని పరిశీలించాలి. అభ్యసన సామర్థ్యాలను పెంచాలి. వెనుకబడిన విద్యార్థులపై స్పెషల్ ఫోకస్తరగతి గదిలో కేవలం పాఠ్యపుస్తకానికి పరిమి తం కాకుండా బోధన పద్ధతులను అనుసరించా లని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సా రించాలని, ఉపాధ్యాయులకు మండల రిసోర్స పర్సన్లు శిక్షణలోసూచిస్తున్నారు. ముఖ్యంగా తె లుగు, ఆంగ్లంలో చదవడం, పదాల నిర్మాణం, వాక్యాల రచన, గణితంలో సంఖ్యా పరిజ్ఞానం, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం లాంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం పాఠశాలల్లో రెమి డియల్ తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రతీరోజు బడిలో 3గంటల నుంచి 4వరకు రెమిడియల్ తరగతులు బోధించి వెనుబడి న విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలు సాధించడంలో రెమిడియల్ టీచింగ్ కీలక పాత్ర పోసిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఏడాదికోసారైనా అందరం కలుస్తాం
ఆసిఫాబాద్: నా శ్రీమతి కూడా నా ఫ్రెండే. మేం కలి సే గ్రూప్స్న కు ప్రిపేరయ్యాం. చిన్నప్పటి ఫ్రెండ్స్తోపాటు ఉద్యోగరీత్యా వివిధ చోట్ల పని చేయడంతో నాకు విలువైన స్నేహితులు దొరికారు. ఈ విషయంలో నేను చాలా అదృష్ట వంతుడిని. ఆర్టీసీలో పని చేస్తున్నప్పుడు డ్రైవర్స్ స్నేహితులయ్యారు. ఇప్పటికీ నన్ను ఎరా.. అని పిలుస్తారు. మా స్నేహానికి హోదాలు, కులమతాలు లేవు. నేను ఢిల్లీలో పని చేసినప్పుడు కూడా నాకు మళయాలీలు, నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్సయ్యా రు. వీరిలో క్రిస్టియన్స్, ముస్లింలూ ఉన్నారు. వాట్సప్ పుణ్యమాని రోజూ పలకరించుకుంటాం. ౖఏడాదికి ఒకసారైనా కలిసి పార్టీ చేసుకుంటాం. నా దృష్టిలో స్నేహితులు అంటే జీవితంలో అన్నింటికన్నా విలువైనవారు. – లోకేశ్వర్రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్ -
నాణ్యమైన బోధన అందించాలి
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపు, బోధన అభ్యసన ప్రక్రియ, ప్యా నెల్ ఇన్స్పెక్షన్లను సమర్ధవంతంగా నిర్వహించాల ని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ సూచించా రు. కలెక్టరేట్లో శనివారం హెచ్ఎం, సబ్జెక్టు టీచ ర్లు, ప్యానెల్ టీం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ప్యానెల్ ఇన్స్పెక్షన్లు కేవలం తనిఖీలకే పరిమితం చేయకుండా బోధనను మెరుగుపరిచే మార్గదర్శక ప్రక్రియ అమలయ్యేలా చూడాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల అభ్యస న స్థాయి, బోధన, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు, విద్యార్థుల నోటుబుక్స్, మూల్యాంకన విధా నం, హాజరు, పరిశుభ్రత, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానె ల్ వినియోగం, ప్రయోగశాల వినియోగం, మౌలిక వసతులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరింత పెంచేలా నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువలతో కూడిన బోధన అందించాలని సూచించారు. సమావేశంలో డీఈవో సచ్చిదానంద, ఎస్వో శ్రీనివాస్, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
కిట్టు.. బోధన మెరుగయ్యేట్టు
లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన, గణితం, సైన్స్ పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకం కింద గణితం, సైన్స్ పరికరాల కొనుగోలుకు పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు గణితం కిట్లకు రూ.5 వేలు, సైన్స్ కిట్లకు రూ.5 వేల చొప్పున ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు విద్యాశాఖ మంజూరు చేసింది. పరికరాల కొనుగోలుకు కమిటీప్రతీ పాఠశాలలో గణిత, సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, గణితం, సైన్స్ ఉపాధ్యాయులు, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటారు. పాఠశాలకు మంజూరైన నిధులతో కమిటీ అభిప్రాయం మేరకు గణితానికి రూ.5 వేలు, సైన్స్కు రూ.5 వేలు వెచ్చించి అవసరమైన కిట్లను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రయోజనంగణిత, సైన్స్ పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ప్రయోగాత్మక బోధన జరిగి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. విద్యార్థులలో సృజనాత్మక, శాసీ్త్రయ దృక్పథాలు పెంచడంలో కిట్లు కీలకంగా మారతాయి. ఈ నిధులతో పీఎంశ్రీ పాఠశాలల్లో గణిత, సైన్స్ క్లబ్లను మరింత బలోపేతం చేసి, ప్రాజెక్టు ఆధారిత విద్యను అమలు చేస్తారు. ప్రత్యక్ష బోధనసైన్స్, గణితం పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా తరగతి గదిలో విద్యార్థులకు చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధన చేయడంతో ఆ పాఠ్యాంశాలను విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అయితే పాఠశాలలకు వచ్చిన డిజిటల్ ప్యానెల్ బోర్డులతో ప్రతీ పాఠ్యాంశాన్ని వీడియోలు, చిత్రాలు, పటాలు చూపిస్తూ బోధించడానికే ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యక్షంగా బోధన పరికరాలు, ప్రయోగ పరికరాలు ఉపయోగిస్తూ బోధన చేయడంతో విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుంది. గణిత, సైన్స్ కిట్లను వినియోగిస్తూ ప్రయోగాత్మక, ప్రత్యక్ష బోధనను ఉపాధ్యాయులు చేస్తే ప్రభుత్వం కిట్లను అందించిన లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు, మంజూరైన నిధులు..జిల్లా పాఠశాలలు మంజూరైన నిధులు మంచిర్యాల 22 రూ.2.20 లక్షలు ఆదిలాబాద్ 21 రూ.2.10 లక్షలు నిర్మల్ 19 రూ.1.90 లక్షలు కుమురంభీం 16 రూ.1.60 లక్షలు -
పారదర్శకంగా వైద్యపరీక్షలు నిర్వహించాలి
ఆసిఫాబాద్అర్బన్: సదరం శిబిరాల్లో పారదర్శకంగా వైద్యపరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న సదరం శిబి రాన్ని శుక్రవారం సందర్శించారు. లోకో మోటార్(ఆర్థోపెటిక్) విభాగానికి సంబంధించిన వైకల్య ని ర్ధారణ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అర్హులకు వేగంగా యూడీఐడీ ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. శిబిరానికి హాజరైన ది వ్యాంగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఏపీడీ రామకృష్ణ, ప్రభుత్వ ఆస్పత్రి ఉప పర్యవేక్షకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ మూడు నెలల రేషన్
ఆసిఫాబాద్అర్బన్: వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేకుండా ఆగస్టులో ఒకేసారి మూడు నెలల కోటా సరఫరా చేసేందుకు పౌర సరఫరా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే ఈ కేవైసీ గడువును సైతం ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇప్పటివరకు జిల్లాలో 82శాతం ఈ కేవైసీ పూర్తయ్యింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో తిర్యాణి తదితర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఇబ్బందులు తొలగనున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి దిగుమతి, పంపిణీపై డీలర్లు అభ్యంతరం తెలిపినా.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.. జిల్లాలో ఇలా..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 13,387 అంత్యోదయ కార్డులు, 1,52,135 ఆహార భద్రత కార్డులు, 20 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. 5,45,046 మంది లబ్ధిదారులుగా కొనసాగుతున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి ఆరు కేజీల సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలలకు కలిపి 10,125.407 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాలోని రేషన్ షాపులకు తరలిస్తున్నారు. దీని కోసం పౌరసరఫరాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదాంల నుంచి సన్నబియ్యం తరలింపు ప్రారంభమైంది.పంపిణీకి ఏర్పాట్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆగస్టు 31 వరకు రేషన్ షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రేషన్కార్డుదారులు ఈ నెల 31లోగా ఈ కేవైసీ తప్పని సరిగా చేయించుకోవాలి. రేషన్ షాపుల్లో నిల్వ సామర్థ్యం తనిఖీ చేసి, ఆ మేరకు బి య్యం సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. – మహ్మద్ సాజీద్ హుస్సేన్, డీసీఎస్వో -
గర్భిణులకు ఇబ్బందులు రానీయొద్దు
ఆసిఫాబాద్అర్బన్: భారీ వర్షాల నేపథ్యంలో గిరిజన గ్రామాల్లోని గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లోని పీహెచ్సీలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లో నమోదైన గర్భిణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టులో ప్రసవ తేదీలు ఉన్న గర్భిణులను గుర్తించి, ప్రసవానికి ముందే సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. అనంతరం లింగాపూర్ మండలంలో భారీ వర్షాలతో రవాణా సౌకర్యం దెబ్బతిన్న భీమానాయక్ తండా, లొద్దిగూడ గ్రామాలను సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. లింగాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భీమానాయక్ తండాకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. -
ప్రభుత్వ వైద్యం మరింత బలోపేతం
కాగజ్నగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు డయాలసిస్ బెడ్లను శుక్రవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్లకుండా స్థానికంగా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐదు బెడ్లు అదనంగా రావడంతో కిడ్నీ రోగులు ఎక్కువ సంఖ్యలో చికిత్స పొందే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాలలో 5, సిర్పూర్లో 5, కాగజ్నగర్లో 10 డయాలసిస్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య శ్రీ సిబ్బంది సకాలంలో జీతాలు పొందుతున్నా కో పేమెంట్ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నూతనగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ అవినాష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ప్రజల ఓటుహక్కు కాపాడటమే ధ్యేయం’
ఆసిఫాబాద్అర్బన్: ప్రజల ఓటుహక్కును కాపాడటమే కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి, మాజీ విప్ ఆరెపల్లి మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్లతో కలిసి మాట్లాడారు. జిల్లాలో 4,55,596 మంది ఓటర్లు ఉండగా 4,07,621 మంది డిజిటలైజేషన్ పూర్తయ్యిందని తెలిపారు. కార్యకర్తలను బీఎల్ఏలుగా నియమించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇరుకుల మంగ, విశ్వనాథ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్, మండల అధ్యక్షుడు మురళి, పట్టణ అధ్యక్షుడు హస్మి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్నగర్ ఆర్డీవో కృష్ణయ్యతో కలిసి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి సంస్థ అధికారులు సర్వీస్ రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రాంగ్రూట్, యూ టర్న్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా అడ్డంగా ఉన్న విద్యుత్స్తంభాలు, మూలమలుపుల వద్ద చెట్లపొదలు తొలగించాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పాఠశాలల బస్సులను నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. మాదకద్రవ్యాలను నిర్మూలించాలిసమాజాన్ని నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా మాదకద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థలకు 400 మీటర్ల దూరంలో గుట్కా, సిగరేట్ అమ్మకాలను నిషేధించాలని ఆదేశించారు. డీఎస్పీలు వహీదుద్దీన్, అశోక్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్వో సీతారాం, ఎస్సీ కార్పొరేషన్ అధికారి అశోక్ పాల్గొన్నారు. హెచ్ఐవీ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలిఆసిఫాబాద్: జిల్లాలో హెచ్ఐవీ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశానికి ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1 నాటికి బహుళ రంగాల కార్యాచరణ వ్యూహం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్షలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో స్వీయ ప్రమాద అంచనా, క్యూర్ కోడ్లను ఏర్పాటు చేయాలన్నారు. హెచ్ఐవీ బాధితులు, పాజిటివ్ నెట్వర్క్ సభ్యులకు సంక్షేమ పథకాల ద్వారా సహాయాన్ని అందించాలని ఆదేశించారు. డీఎంహెచ్వో సీతారాం జిల్లాలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న హెచ్ఐవీ, ఎయిడ్స్ సేవలపై నివేదికను సమర్పించారు. క్లినికల్ నిపుణులు డాక్టర్ విజేత వ్యాధి నివారణ, నియంత్రణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
153 శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా జూలైలో 153 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని జీఎం శ్రీరమేశ్ తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. గడిచిన నెలలో బెల్లంపల్లి ఏరియాకు 1.93 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 2.95 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఆశించిన స్థాయికి మించి ఉత్పత్తి చేపట్టామని వివరించారు. నెలాఖరులో మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు ఏరియా సుమారు 25 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి కోల్పోయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 9.93 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా.. 12.34 లక్షల టన్నుల(124 శాతం) ఉత్పాదకతతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, సీనియర్ పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పంట నష్టం అంచనా వేస్తాం
పెంచికల్పేట్: పెద్దవాగు, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో పంట నష్టం వివరాలను ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకట్ అన్నారు. పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామంలో పెద్దవాగు వరదలతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం రైతులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు సాగులో జాగ్రత్తలు వహించాలన్నారు. చేలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వేరు కుళ్లు తెగులు రాకుండా మందులు పిచికారీ చేయాలని సూచించారు. ఇతర సందేహాలు ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయన వెంట సర్పంచ్ రాజేశ్వరి, ఏవో రామకృష్ణ, ఏఈవో వంశీ తదితరులు ఉన్నారు. -
ముంచెత్తిన వరద..!
దహెగాం మండలం దిగిడ శివారులో నీట మునిగిన పంటను చూపుతున్న రైతుఈ ఫొటోలోని రైతు పేరు కుడ్మెత చిన్నన్న. పెంచికల్పేట్ మండలం గుండెపల్లి శివారులో తనకున్న మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు వరద పోటెత్తడంతో మూడెకరాల పంట నీట మునిగింది. సుమారు రూ.60వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. దహెగాం/పెంచికల్పేట్: జిల్లావ్యాప్తంగా బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నా యి. పెద్దవాగు, ఎర్రవాగులతోపాటు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం నాటి కి పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు నీటమునిగా యి. వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పత్తి నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వరద ఇలాగే కొనసాగితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది. చేలలోకి బ్యాక్వాటర్భారీ వర్షాలతో వట్టివాగు, కుమురంభీం(అడ) ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరింది. అధికారులు రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఫలితంగా పెద్దవాగులోకి భారీగా వరద చేరింది. అలాగే ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురువడంతో ప్రాణహిత నది సైతం ఉప్పొంగింది. దహెగాం మండలంలోని పీపీరావు ప్రాజెక్టులోకి వరద చేరి అలుగు పోయడంతో వరద ఎర్రవాగులోకి చేరింది. ఓ వైపు వాగులు ఉప్పొంగడం, ప్రాణహిత నదికి సైతం భారీ వరద రావడంతో బ్యాక్ వాటర్ పత్తి చేలను ముంచెత్తింది. పెద్దవాగు, ఎర్రవాగు పరీవాహక ప్రాంతాల్లోని ఒడ్డుగూడ, మర్రిపల్లి, అమరగొండ, గెర్రె, గిరవెల్లి, కర్జి, దిగిడ, రాంపూర్, మొట్లగూడ ప్రాంతాల్లో పత్తి చేలు నీట మునిగాయి. అలాగే పెంచికల్పేట్ మండల కేంద్రంతోపాటు, మురళీగూడ, జిల్లెడ నందిగామ, కమ్మర్గాం, గుండెపల్లి, అగర్గూడ, ఎల్లూర్ గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ప్రవాహం ఇలాగే కొనసాగినా.. వర్షాలు కురిసినా చేలలో వరద రోజుల తరబడి నిలిచే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా జిల్లా రైతులు వరదలతో పంటలు నష్టపోతున్నారు. ఈ ఏడాది పత్తి ఆశాజనకంగా ఉందని భావిస్తున్న తరుణంలో వరదలు వారి ఆశలను దెబ్బతీశాయి. -
ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
దహెగాం: రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎస్డీ ఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. మండలంలోని లగ్గాం సమీపంలో లోలెవల్ పైనుంచి పారుతున్న వరదతోపాటు మండల కేంద్రం సమీపంలో ని పెద్ద చెరువు వరద పోస్తున్న అలుగు, దహెగాం– కాగజ్నగర్ ప్రధాన రహదారి వద్ద వరద నీటిని పరిశీలించారు. లోలెవల్ వంతెనలు, ప్రమాదకర వంతెనల వద్ద పరిస్థితిపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. భద్రత చర్యల్లో భాగంగా దహెగాంలో 12 మందితో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వాగులు, ఒర్రెలు దాటే ప్రయత్నం చేయొద్దని, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, శిథిల ఇళ్లలో ఉండడం ప్రమాదకరమని తెలిపారు. కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ కుమారస్వామి, తహసీల్దార్ మునావార్ షరీఫ్, ఎస్సై చుంచు రమేశ్ పాల్గొన్నారు. -
‘తిర్యాణి’ బంద్ సంపూర్ణం
తిర్యాణి: మండల సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన తిర్యాణి మండల బంద్ సంపూర్ణమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ ఏళ్లుగా మండలంలో నిర్మాణానికి నోచుకోని రహదారుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని, అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మడావి గుణవంత్రావు, నాయకులు వెడ్మ భగవంత్రావు, తాళ్ల శ్రీనివాస్గౌడ్, తోట లచ్చన్న, శంకర్గౌడ్, జుంగోని లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రగామిగా నిలపాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని పెంచి ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణలో జిల్లాను ఆగ్రగామిగా నిలపాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్స్పైర్ మానక్పై సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో శాసీ్త్రయ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలను నమోదు చేయాలన్నారు. ప్రతీ స్కూల్ నుంచి ఐదు ప్రాజెక్టులను నమోదయ్యేలా సంబంధిత ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో సుభాష్ పాల్గొన్నారు. -
దంచికొట్టిన వర్షం
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/సాక్షి నెట్వర్క్: జిల్లాలో రెండోజూ గురువారం వర్షం దంచికొట్టింది. వర్షానికి జనజీవనం స్తంభించిపోగా, వ్యాపార లావాదేవీలు లేక మార్కెట్లు వెలవెలబోయాయి. వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ప్రాణహిత, పెన్గంగ నదుల్లో ఉధృతి పెరిగింది. వందల ఎకరాల్లో పత్తి పంటలు నీటమునిగాయి. అత్యధికంగా బెజ్జూర్లో 183.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సిర్పూర్(యు)లో 3.2 మి.మీ.ల వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 121.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. వర్షం నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ కె.హరిత గురువారం సెలవు ప్రకటించారు. వర్షానికి జిల్లా కేంద్రంలోని రహదారులు జలమయ్యాయి. పెద్దవాగు రెండువైపులా ఒడ్డు వరకు ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి. కుమురంభీం(అడ) ప్రాజెక్టు ఆరు గేట్లు పైకెత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. అలాగే వట్టివాగు ప్రాజెక్టు నాలుగు గేట్లను పైకెత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగు లు ఉప్పొంగాయి. అధికారుల పర్యవేక్షణభారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హరిత ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగు, తుంపెల్లి వాగు, అడ ప్రాజెక్టును పరిశీలించారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఎస్పీ నితిక పంత్ పోలీసు అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలు, లోలెవల్ వంతెనలను పరిశీలించారు. అడ ప్రాజెక్టులో నీటిమట్టం, గేట్ల నిర్వహణ, వరద ప్రవాహ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగజ్నగర్, దహెగాం, పెంచికల్పేట్ మండలాల్లోని వరద ప్రాంతాలు, ప్రమాదకరమైన వంతెనలు, పొంగిపొర్లుతున్న వాగుల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ రాజురా వాగు, అదనపు డేవిడ్ అడ ప్రాజెక్టుకు పరిశీలించి పరిస్థితిపై ఆరా తీశారు. తక్షణ సహయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాలకు కంటోల్ రూం(85008 44365) ఏర్పాటు చేశారు. వాగులకు వరద.. నిలిచిన రాకపోకలువాంకిడి మండల కేంద్రంలోని కేబీనగర్ కాలనీలో నివాసాలు జలమయమయ్యాయి. కెరమెరి మండలంలో లక్మాపూర్, అనార్పల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 15 గ్రామాలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సాంగ్వి, రాంపూర్, ఇంద్రానగర్, కెలికే కల్వర్టుల పైనుంచి వరద ప్రవహించడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. లింగాపూర్ మండలం ఫూల్సింగ్తండాకు వెళ్లేదారిలోని లోలెవల్ వంతెన కోతకు గురైంది. రెబ్బెన మండలంలో నంబాల వంతెన పైనుంచి వరద ప్రవహించింది. గంగాపూర్, లక్ష్మిపూర్, పులికుంట, గుండాలవాగు, కొండపల్లి, పెద్దవాగుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. తక్కళ్లపల్లిలో పుష్పాల నాగమ్మ ఇంటి గోడ కూలింది. దహెగాం మండలంలోని పీపీరావు ప్రాజెక్టుతోపాటు పెద్ద చెరువులోకి భారీగా వరద చేరింది. ఐనం, లగ్గాం సమీపంలో ఉన్న లోలెవల్ వంతెనల పైనుంచి వరద పారడంతో రాకపోకలు స్తంభించాయి. మొట్లగూడ, దిగిడ గ్రామాలకు చెందిన ఎనగందుల శంకర్, మడే అశోక్ల ఇళ్లు కూలిపోయాయి. సిర్పూర్(టి)లోని నాగమ్మ చెరువు జలకళను సంతరించుకుంది. పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూర్ బొక్కివాగులోకి వరద చేరడంతో మత్తడి దూకింది. కొండపల్లి గొల్లవాడ మధ్య ఉన్న ఒర్రె వరద నీటిలో చిక్కున్న బొలెరో వాహనాన్ని స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. సలుగుపల్లి, అగర్గూడ గుండెపల్లి, కమ్మర్గాం, నందిగామ, మురళీగూడ, జిల్లెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు, ఉచ్చమల్ల వాగు, బొక్కివాగు పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు నీట మునిగాయి. చింతలమానెపల్లి మండలంలో పాల్వాయినగర్, చింతలపాటి వద్ద వాగులు ఉప్పొంగి కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మార్గంలో రవాణా స్తంభించింది. రణవెల్లి, గూడెం వద్ద ప్రాణహిత నిండుగా కనిపిస్తోంది. శివపెల్లి, దిందా, నాయకపుగూడ, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హేటిగూడ నుంచి కుంటలమానెపల్లి మార్గంలో రవాణా నిలిచిపోయింది. బెజ్జూర్ మండలంలో సుశ్మీర్ వాగు ఉప్పొంగి ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవల్ వంతెన పైనుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న తుంపెల్లి వాగుపెంచికల్పేట్: కొండపల్లి, గొల్లవాడకు వెళ్లే రహదారిపై వరదలో చిక్కుకున్న బొలెరోదహెగాం: దిగిడ గ్రామంలో కూలిన ఇంటి గోడలుగుండి వాగును పరిశీలిస్తున్న కలెక్టర్ హరితవర్షపాతం ఇలా(మి.మీ.)బెజ్జూర్ 183.5 పెంచికల్పేట్ 165.4 వాంకిడి 136 కౌటాల 131.4 ఆసిఫాబాద్ 125 దహెగాం 121.7 కాగజ్నగర్ 121.5 సిర్పూర్(టి) 117.3 రెబ్బెన 114.3 చింతలమానెపల్లి 111.7 కెరమెరి 109.4 తిర్యాణి 107.3 లింగాపూర్ 99.6 జైనూర్ 94.3 సిర్పూర్(యు) 3.2 -
పకడ్బందీగా ‘ఎస్ఐఆర్’ నిర్వహించాలి
కాగజ్నగర్టౌన్: ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆర్డీవో సీహెచ్.కృష్ణయ్యతో కలిసి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి పూర్తి పారదర్శకతతో నమోదు చేయాలన్నారు. మరణించిన వారి ఓట్ల తొలగింపు, డబుల్ ఓట్ల గుర్తింపు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల సవరణ వంటి ప్రక్రియలను పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతీ బీఎల్వో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతీ దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించాలన్నారు. గడువులోగా ఎస్ఐఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, సూపర్వైజర్లు, బీఎల్వోలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: భారీ వర్షాలపై జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వర్ష పరిస్థితులు, రక్షణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో 24 గంటల పాటు పని చేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పిస్తున్నామని వివరించారు. -
గేట్లు ఎత్తి.. దిగువకు నీటి విడుదల
మామడ: మండలంలోని పొన్కల్ గోదావరి వద్ద ఉన్న సదర్మాట్ బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది. గురువారం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీ రెండు గేట్లు ఎత్తి గోదావరి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 1.580 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 9300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అడ 6, వట్టివాగు 4 గేట్లు.. ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ప్రాజెక్టుల్లో చేరుతోంది. కుమురం భీం (అడ) ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం సామర్థ్యం 10.393 టీఎంసీలు (238 మీటర్లు) కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 6.001 టీఎంసీలు వాటర్ లెవల్ 237.70 మీటర్లు ఉంది. వరద నీరు రావడంతో ఇన్ఫ్లో 30,423 క్యూసెక్కులు కాగా ఆరు గేట్లు 2 మీటర్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 2.480 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 36,000 క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగులు మరింత ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మత్తడి వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు.. తలమడుగు: తాంసి, తలమడుగు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మత్తడివాగు ప్రాజెక్టు ఐదు గేట్లు ఉండగా అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మత్తడి వాగు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా ఇన్ఫ్లో 38,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు అవుట్ఫ్లో 38,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
ఇంటర్లోనే ఉపాధికి బాట
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్లేస్మెంట్ విభాగాలు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 47 ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు ఉండగా వీటిలో సుమారు 13వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులకు నాణ్యమైన కెరీర్ మార్గదర్శనం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఉపాధి అవకాశాలకు వారధిలా.. విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించి, ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు దక్కేలా కళాశాలలో ఒక అధ్యాపకుడికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న అధ్యాపకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లాస్థాయి కోఆర్డినేటర్లు వారికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్లుగా ఎంపిక చేస్తారు. కోఆర్డినేటర్లు తమ ప్రాంతంలోని పరిశ్రమల ప్రతినిధులతో సంబంధాలు కొనసాగించడం, నైపుణ్యాలను విద్యార్థులకు సమకూర్చడం, విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందేలా చూడటం తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారు ఆయా కళాశాలల్లో విద్యార్థుల వివరాలు, వారి ఆసక్తులు, ఉన్నత విద్య లక్ష్యాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రత్యేక డేటాబేస్ రూపొందిస్తారు. విద్యార్థులకు కెరీర్ ప్రణాళికపై నిరంతర మార్గదర్శనం అందించే బాధ్యత కూడా వారిదే. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన ప్లేస్మెంట్ విభాగాల ద్వారా ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పారామెడికల్, వ్యవసాయం, పాలిటెక్నిక్, స్కిల్ డెవలప్మెంట్ తదితర రంగాలపై నిపుణులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఫార్మా వంటి కంపెనీల సమన్వయంతో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయనున్నారు. విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ పద్ధతులు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వివరాలు..ప్రయోజనం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధికంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. వీరిలో చాలా మందికి ఉన్నత విద్య, స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలపై సరైన సమాచారం అందుబాటులో ఉండదు. ప్లేస్మెంట్ విభాగాలు ఏర్పాటు ద్వారా అలాంటి విద్యార్థులకు సరైన దిశానిర్దేశం లభించడంతో పాటు భవిష్యత్ కెరీర్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం కలగనుంది.గ్రామీణ విద్యార్థులకు -
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
బాసర: విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని, వాటి సాధన కోసం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి, సమయపాలన, నైతిక విలువలతో ముందుకుసాగాలని ప్రొఫెసర్ సాయికుమార్ పేర్కొన్నారు. గురువారం ఆర్జీయూకేటీ, బాసరలో నిర్వహిస్తున్న పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026లో ఆయన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీలోని నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, సాంకేతిక వనరులు, పరిశోధనా అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం అకాడమిక్ మార్కులకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యతను పెంపొందించుకుంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రతిభను ప్రపంచ స్థాయి నైపుణ్యంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఆర్జీయూకేటీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ, అకాడమిక్స్తో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, వారి కలల సాకారానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026 సమన్వయకర్త డా. గుజ్జరి శంకర్ ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యా విధానం, క్యాంపస్ సౌకర్యాలు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, క్లబ్లు, సాంకేతిక, వ్యక్తిత్వ వికాస అవకాశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
వీధి కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
పెంచికల్పేట్: మండలంలోని మురళీగూడ, జిల్లెడ గ్రామాల్లో గురువారం వీధి కుక్కల దాడిలో నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న వారిపై, పనులు చేసుకుంటున్న వారిపై కుక్కలు దాడి చేశాయి. దాడుల్లో గ్రామానికి చెందిన పొర్తెటి గౌరుబాయి, కొడప చాలుబాయి, సిడె రమేశ్, ఆత్రం కమలాబాయిలు గాయపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో ఒర్రెలు పొంగి ప్రవహిస్తుండటంతో గాయపడ్డవారికి వైద్యం అందే పరిస్థితి లేదు. గాయపడ్డ వారిని సర్పంచ్ పొర్తెటి వెంకటేశ్ పరామర్శించారు. కొట్టుకుపోయిన నాటు పడవలుకోటపల్లి/వేమనపల్లి: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించడంతో వేమనపల్లి, కల్మల్పేట గ్రామాలకు చెందిన మత్స్యకారుల 27 పడవలు వరద ప్రవాహానికి తాడు తెంచుకొని కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులు పడవల కోసం ఇంజిన్ పడవ సాయంతో నదిలో గాలింపు చేపట్టారు. మండలంలోని వెంచపల్లి గ్రామ సమీపంలో రెండు కొండల మధ్య పడవలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. -
వైష్ణవ్జీ.. రైలు వేయండి
నిర్మల్: జిల్లావాసుల రైలు కల సాకారమయ్యే దిశగా పట్టాలు పడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇంకెన్ని దశాబ్ధాలు మొర పెట్టుకోవాలంటూ ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ శీర్షికన ఈనెల 13న ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిశారు. ఉత్తర తెలంగాణ ప్రజలు, ప్రధానంగా రైల్వేలైన్ లేని నిర్మల్వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ –నిర్మల్ –ఆదిలాబాద్ రైల్వేలైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కలిసి వెళ్లి.. సుదీర్ఘంగా వివరించి.. జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని ఎంపీ నగేశ్, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావుపటేల్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇలా కలిసిన ప్రతిసారీ రైల్వేమంత్రి ఏదో నామమాత్రంగా సమాధానమిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పక్కాగా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సారథ్యంలో నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్ ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందన్రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్లు బృందంగా కలిసి వెళ్లారు. మంత్రి కార్యాలయంలోనే భేటీ అయ్యారు. ఈ రైల్వేలైన్ నిర్మాణ ఆవశ్యకతపై సుదీర్ఘంగా అశ్వినీవైష్ణవ్కు వివరించారు. ఈ ప్రాంతంలో వరుసగా బీజేపీ ఎంపీని గెలిపించడంతో పాటు ఈ లైన్ నిర్మాణం చేపట్టాల్సిన నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారన్న విషయాన్నీ మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అశ్వినీవైష్ణవ్ గ్రీన్సిగ్నల్..! రైల్వేలైన్ కోసం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా వచ్చి చేసిన ప్రతిపాదనపై కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు పురోగతిపై అనుకూలంగా ఆయన సంకేతాలు ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కదిలించిన ‘సాక్షి’ కథనాలు.. దేశంలోని ఉత్తర –దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న గ్రాండ్ట్రంక్ రైల్వేలైన్కు ప్రత్యామ్నాయంగానూ ఆర్మూర్ –నిర్మల్ –ఆదిలాబాద్ రైల్వేలైన్ ఉపయోగపడుతుందని, దాదాపు 7లక్షల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని చాలా సందర్భాల్లో ‘సాక్షి’ వి భిన్న కథనాలు ప్రచురించింది. కొన్నేళ్లుగా పదేపదే కేంద్రానికి వినతులు ఇవ్వడంపై ఈనెల 13న ప్రచురితమైన ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ కథనం ప్రజా ప్రతినిధులను కదిలించింది. ఈమేరకు కలిసికట్టుగా బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం నేరుగా కేంద్ర రైల్వేమంత్రిని కలిసి ప్రాజెక్టుకు ఆమోదం కోరడంలో కీలకమైంది. సానుకూలంగా స్పందించారు.. రైల్వేలైన్ నిర్మాణం కోసం బీజేపీ ప్రజాప్రతినిధులంతా మంత్రి అశ్వినీవైష్ణవ్ను ఢిల్లీలో కలిశాం. ఈ ప్రాంత ప్రజల కోరికతో పాటు రైల్వేలైన్ ఆవశ్యకత వివరించాం. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
భారీ వర్షాలకు కూలిన పశువుల పాకలు
నేరడిగొండ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని కుంటాల(కె) గ్రామంలో రైతు రాథోడ్ సచిన్ కుమార్కు చెందిన పశువుల పాక కుప్పకూలింది. ఈ ఘటనలో పాకలో ఉన్న ఓ ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పశువైద్యాధికారి రాథోడ్ జీవన్కు సమాచారం అందించగా గురువారం గాయపడిన ఎద్దుకు చికిత్స అందించారు. భారీ వర్షాల సమయంలో పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని రైతులకు సూచించారు. పశువుల కొట్టం కూలి మూగజీవాలు మృతినార్నూర్: గాదిగూడ మండలం పిప్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో గురువారం కురిసిన భారీ వర్షాలకు పశువుల కొట్టం కూలిపోయింది. కొట్టంలో కట్టి ఉంచిన ఆవు, దూడ, మేక శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొడప మారు కుటుంబం జీవనోపాధికి ఆధారంగా ఉన్న పశువులను కొట్టంలో కట్టి ఉంచగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పశువుల కొట్టం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది. -
అభ్యసన సామర్థ్యం మెరుగుపర్చాలి
ఉట్నూర్రూరల్: విద్యాజ్యోతి సమగ్ర ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్లోని స్థానిక బీఈడీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుల సామర్థ్య పెంపు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఆధునిక బోధనా విధానాలు, సృజనాత్మక కార్యకలాపాలు, సమర్థవంతమైన తరగతి నిర్వహణ, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మార్గాలు అనుసరించాలన్నారు. క్యాంప్ అధికారి, స్థానిక బీ.ఎడ్. కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్ రావు, సహాయ క్యాంప్ అధికారి జాదవ్ విఠల్, ఏసీఎంవో జగన్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. భారీ వర్షాలు కురుస్తున్నందున ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. కంట్రోల్ సెంటర్ సిబ్బంది, వైద్య బృందాలు 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని, సర్పంచ్లు, పటేళ్లు, ఎంపీడీవోలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అన్ని సమాచార మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. అలాగే పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5226 లేదా 08731 –275226 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
జలపాతాల పరవళ్లు
బజార్హత్నూర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల కనకాయి జలపాతం, బండ్రేవ్ జలపాతాలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ: మండలంలోని కుంటాల, కొర్టికల్ జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండకోనల మధ్య నుంచి పాలధారల వలే జాలువారుతున్న జలపాతాల అందాలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. నార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పారాఖప్పి జలపాతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. కొండల మధ్య నుంచి తెల్లని నురగలు చిమ్ముకుంటూ ఉధృతంగా కిందికి దూకుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. జలపాతం వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రజలు, యువకులు జలపాతం సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
కౌటాల: జిల్లాతోపాటు మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదనీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. తాటిపెల్లి వద్ద వార్దా, గుండాయిపేట గ్రామానికి సరిహద్దులోని పెన్గంగ నది సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది వరదతో పుష్కర ఘాట్లను తాకుతోంది. వరద పెరగడంతో గంగపుత్రులు చేపల వేట నిలిపివేశారు. వార్దా, పెన్గంగ నదులు ఉప్పొంగడంతో మహారాష్ట్రకు నాటు పడవల రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌటాల సీఐ బి.సంతోష్కుమార్ సూచించారు. -
లక్ష్యానికి చేరువగా ‘సర్’
ఆసిఫాబాద్: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(ఎస్ఐఆర్) తుదిదశకు చేరుకుంది. ఓటరు జాబితా సవరణతోపాటు సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ చివరిదశలో ఉంది. జిల్లాలో 678 పోలింగ్ స్టేషన్లు, 4,55,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 4,07,020 ఓటర్లు డిజిటలైజేషన్ ప్రక్రియ 99.86 శాతం పూర్తయింది. మరో 0.14 శాతమే పూర్తి చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్ డివిజన్లో వందశాతం డిజిటలైజేషన్ పూర్తి కాగా, కాగజ్నగర్లో 99.72 శాతం పూర్తయింది. రెండు డివిజన్లలో పురోగతి సంతృప్తికరంగా ఉంది. ఆగస్టు 10 వరకు గడువు ఉన్నప్పటికీ అధికారులు ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. బూత్లో 1200 మంది ఓటర్లు ఒక్కో పోలింగ్ బూత్లో 1200 ఓటర్లు ఉండేలా రేషనలైజ్ చేయనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటే కొత్త కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ ఆగస్టు 10 వరకు గడువు ఉంది. ఇప్పటికే ఆసిఫాబాద్ డివిజన్లో లక్ష్యం చేరుకోగా, కాగజ్నగర్ డివిజన్లో 0.28 శాతమే పూర్తికావాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ప్రతీ బూత్లోనూ జాబితా అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాల స్వీకరణకు 7 నుంచి 10 రోజుల గడువు ఉంటుంది. కొత్త ఓటు నమోదుకు ఫాం– 6, పేరు తొలగింపునకు ఫాం– 7, పేరు చిరునామా, వయస్సు సవరణకు ఫాం– 8 ఇస్తే బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు. అన్ని రకాల అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 12న తుదిఓటరు జాబితా ప్రదర్శిస్తారు. తుదిజాబితా ప్రకారం కొత్త ఓటర్లకు ఈ ఎపిక్, పాత వారికి అప్డేట్ చేసిన కార్డులు అందజేస్తారు. అభ్యంతరాలు సమర్పించాలి ఆసిఫాబాద్ డివిజన్లో 2,03,532 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసి, 23,148 మంది ఓటర్లను డబుల్ కింద ఆన్లైన్ చేసి, 2,26,680 మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేశాం. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే సమర్పించాలి. ఆగస్టు 10 తర్వాత క్లెయిమ్స్, ఆబ్జెక్షన్లు సమర్పించవచ్చు. అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం. – లోకేశ్వర్రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్ -
సురక్షిత బొగ్గు ఉత్పత్తిలో సరికొత్త ఘనత
రెబ్బెన: సురక్షిత బొగ్గు ఉత్పత్తిలో బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ సరికొత్త ఘనత సాధించిందని జనరల్ మేనేజర్ శ్రీరమేశ్ అన్నారు. భద్రత వారోత్సవాల్లో ఖైరిగూర ఓసీపీ నాలుగు బహుమతులు సాధించడంతో బుధవారం ఓసీపీ వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి చరిత్రలోనే మొదటిసారి ఖైరిగూర ఓసీపీ నాలుగు పురస్కారాలు సాధించి చరిత్ర సృష్టించిందని అన్నారు. సేఫ్టీ విభాగంలో అత్యుత్తమ పనితీరు చూపి నాలుగు బహుమతులు సాధించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏరియా ఇంజినీర్లు వీరన్న, కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, మేనేజర్ శంకర్, రక్షణ అధికారి గౌతమ్ రాజేశ్వర్ రెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు
కైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన సీఈవోగా చండా విశ్వేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన శ్రీధర్రెడ్డి గతేడాది సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలువురు ఇన్చార్జీలతో పాలన సాగింది. రెగ్యులర్ నియామకం కోసం ఇటీవల ప్రక్రియ నిర్వహించగా ఆరుగురు అధికారులు హాజరయ్యారు. వారిలో మెదక్ జిల్లా సహకార బ్యాంక్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వేశ్వర్ను నియమిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్చార్జి సీఈవో రవి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
‘గిరి’ విద్యార్థులకు నాణ్యమైన విద్య
● పీవో మంద మకరందు ఆసిఫాబాద్రూరల్: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం తనిఖీ చేశారు. పీవో మాట్లాడుతూ శిక్షణకు నామమాత్రంగా హాజరు కాకుండా, అవకాశంగా భావించి వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు డిజిటల్ లిటరసీపై అవగాహన ఉండేలా బోధించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో ఉద్దవ్, డీవైఎస్వో శేకు, హెచ్ఎం లింబారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న పీవో మంద మకరందు -
ముంచుకొస్తున్న గడువు
ఆసిఫాబాద్అర్బన్: అర్హులైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు అందించడం, చనిపోయిన వారు, అనర్హులను జాబితా నుంచి తొలగించడం, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలో ఇంకా పూర్తికావడం లేదు. ఓ వైపు అధికారులు ఈకేవైసీ పూర్తి చేసుకోకుంటే సరుకుల పంపిణీ నిలిపివేస్తామని చెబుతున్నా.. అవగాహన లేకపోవడం, వేలిముద్రలు పడకపోవడం, ఆధార్ నంబర్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 2014లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు గడువుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతుందడగా ఇప్పటివరకు 81శాతం ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలిన రెండు రోజుల్లో 20శాతం పూర్తి చేసేందుకు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,65,564 రేషన్ కార్డులు ఉండగా, 5,44,486 మంది లబ్ధిదారులుగా కొనసాగుతున్నారు. ఇందులో 4,42,032 మంది ఈ కేవైసీ పూర్తికాగా, మరో 1,02,454 చేయించుకోవాల్సి ఉంది. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ యజమానితోపాటు ప్రతీ లబ్ధిదారులు సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి ఈ– పాస్ యంత్రం ద్వారా వేలిముద్రలు వేయాలి. రేషన్కార్డు నంబర్, ఆధార్ నంబర్ సరిచూసుకోవాలి. ఆకుపచ్చ రంగు లైట్ వస్తే సభ్యుల కేవైసీ పునరుద్ధరణ పూర్తయినట్లే.. రేషన్ కార్డు, ఆధార్ నంబర్లు సరిపోకపోతే రిజెక్ట్గా ఎరుపు రంగు చూపుతుంది. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తికాని వారి జాబితాను అధికారులు రేషన్ డీలర్లకు పంపించారు. ఈ ప్రక్రియ పూర్తికాకుంటే లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని, గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వివరాలు మండలం లబ్ధిదారులు ఈకేవైసీ పెండింగ్ పూర్తి ఆసిఫాబాద్ 56,884 47,536 9,348 బెజ్జూర్ 31,687 26,639 5,048 చింతలమానెపల్లి 32,719 27,294 5,425 దహెగాం 29,511 24,514 4,797 జైనూర్ 34,152 26,087 8,065 కాగజ్నగర్ 1,11,385 89,287 22,098 కెరమెరి 35,975 27,505 8,470 కౌటాల 36,891 30,438 6,453 లింగాపూర్ 13,402 10,610 2,792 పెంచికల్పేట్ 16,648 13,585 3,063 రెబ్బెన 35,028 29,893 5,135 సిర్పూర్(టి) 29,205 24,364 4,841 సిర్పూర్(యు) 17,367 13,613 3,754 తిర్యాణి 23,850 17,935 5,915 వాంకిడి 39,782 32,632 7,150 వందశాతం పూర్తికి చర్యలు రేషన్కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఇప్పటివరకు జిల్లాలో 81శాతం పూర్తయ్యింది. గడువులోగా వందశాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇంటర్నెట్ లేని గ్రామాలకు సిబ్బంది వెళ్లి ఈ కేవైసీ చేపడుతున్నారు. – మహ్మద్ సాజిద్ హుస్సేన్, డీసీఎస్వో -
జిల్లాలో వర్షపాతం వివరాలు
మండలం వర్షపాతం (మి.మీ.) తిర్యాణి 108.2 లింగాపూర్ 93.4 ఆసిఫాబాద్ 17.8 రెబ్బెన 31.4 జైనూర్ 56.2 సిర్పూర్(యూ) 58.6 కౌటాల 12.8 కెరమెరి 70.4 సిర్పూర్(టి) 16.6 చింతలమానెపల్లి 23.8 పెంచికల్పేట్ 49.0 బెజ్జూర్ 36.4 దహెగాం 35.2 వాంకిడి 3.8 -
జోరువాన..!
ఆసిఫాబాద్రూరల్: ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. పంటలకు జీవం పోస్తూ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జోరువాన కురిసింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని వా వుదాం, తుంపెల్లి, గుండి, అప్పపల్లి వాగులు ఉప్పొంగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వట్టివాగు ప్రాజెక్టులోకి వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటికి వదులుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం 41.7 మిల్లీమీటర్లుగా నమోదు కాగా, తిర్యాణిలో అత్యధికంగా 108.2 మి.మీ.లు, అత్యల్పంగా వాంకిడిలో 3.8 మి.మీల వర్షం కురిసింది. గురు, శుక్రవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగజ్నగర్టౌన్: పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై వరద నిలిచి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం రెబ్బెన: వర్షం కారణంగా బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఖైరిగూర ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్ పడింది. ఓసీపీలోని హాల్రోడ్లు బురదమయంగా మారగా, క్వారీ లోపలి పనిస్థలాలు వరదతో నిండాయి. దీంతో అధికారులు ఉత్పత్తి ప్రక్రియను నిలిపివేశారు. క్వారీ లోపల చేరుతున్న నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి షిఫ్ట్ నుంచి బుధవారం రెండో షిఫ్ట్ వరకు ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోగా.. సుమారు 10వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి నష్టం సంభవించిందని సింగరేణి అధికారులు వెల్లడించారు. ఏరియాకు సుమారు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. వర్షం తగ్గుముఖం పట్టగానే ఉత్పత్తిని చేపట్టేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగాపూర్ వాగు ఉప్పొంగిన వాగులు రెబ్బెన: మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు ఉప్పొంగాయి. గుండాల, పులికుంట, గంగాపూర్, లక్ష్మిపూర్ పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సీజన్లో కురిసిన భారీ వర్షాల్లో ఇది రెండోది కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
తుంపెల్లి వాగును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగు వద్ద వరదను కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్ వేర్వేరుగా పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలన్నారు. లో లెవల్ వంతెనల వద్ద రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం, ఇతర వివరాలకు కంటోల్ రూం నంబర్ 85008 44365, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు, పంచాయితీరాజ్, తాగునీటి సరఫరా, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, వీబీజీ రామ్జీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పంచాయతీల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులు వినియోగించాలన్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల పురోగతిపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
కౌటాల: బెజ్జూర్ మండలం ఉట్ సారంగపల్లిలో నిధుల దుర్వినియోగంపై బుధవారం పంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో హరిప్రసాద్ విచారణ చేపట్టారు. సర్పంచ్ శ్రీహరి, కార్యదర్శి ధర్మయ్యను అభివృద్ధికి వినియోగించి నిధుల వివరాలపై విచారించారు. డీఎల్పీవో మాట్లాడుతూ రికార్డులు, ఎంబీలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రత్యేక అధికారి పాలనలో నిధుల వినియోగంపై పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో
మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. వట్టివాగు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.404 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 239 మీటర్లు కాగా ప్రస్తుతం 238.30 మీటర్లకు చేరింది. 6,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, మూడు గేట్లను ఒక మీటర్ వరకు పైకెత్తి 5,400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. రాజుర, రహపల్లి, చోర్పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అలాగే కుమురంభీం(అడ) ప్రాజెక్టుకు 900 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 10.3 టీఎంసీలకు గాను ప్రాజెక్టులో 4.9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఆసిఫాబాద్: మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యల తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ధర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ద్వారా 2025– 26 సంవత్సరానికి ద్విచక్ర, త్రిచక్ర వాహన లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. 491 మంది గిరిజన మత్స్యకారులు దరఖాస్తు చేసుకోగా 26 మందిని ఎంపిక చేశారు. వీరికి 21 ద్విచక్ర వాహనాలు, మిగిలిన వారికి త్రిచక్ర వాహనాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. గడువులోగా డిజిటలైజేషన్ పూర్తిచేయాలి ఆసిఫాబాద్: నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందించని వారి వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుందన్నారు. ప్రతీ వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. -
ఉప సర్పంచులు, వార్డు సభ్యుల నిరసన
ఆసిఫాబాద్అర్బన్: సమస్యలు పరిష్కరించా లని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఉప సర్పంచులు, వార్డులు సభ్యులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఉప సర్పంచులకు నెలకు రూ.5వేలు, వార్డు సభ్యులకు రూ.3వేల గౌరవ వేతనం చెల్లించా లని, జీవో 38ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో ఉప సర్పంచుల సంతకాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను తప్పనిసరి గా ఆహ్వానించాలని ఉత్వర్వులు జారీ చేయాలన్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచులు, వార్డు స భ్యుల పేర్లు కూడా చేర్చాలని కోరారు. ఉప సర్పంచులు దీపక్ ముండే, చిట్ల నారాయణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఓవర్ టు పైలట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్ఓ (నిర్వహణ), రిపేర్ (మరమ్మతు), ఓవర్హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. – సాక్షి, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతో పాటు ఎంఆర్వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు గాను రూ.2,278 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ఈ నెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు. ప్రైవేట్ అకాడమీల దృష్టి..ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు. అకాడమీలు ఇలా..పైలెట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. -
భారీ వర్షాలపై
అప్రమత్తంగా ఉండాలిఆసిఫాబాద్: భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి మంగళవారం అదనపు కలెక్ట ర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులు, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణహిత నదికి వరద వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల ని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, వాగులు, వంతెనల వద్ద సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. తహసీ ల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షించుకోవాలని సూ చించారు. సహాయక చర్యల్లో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 85008 44365కు సమాచా రం అందించాలని కోరారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు రోజుల్లో పూర్తి చేసుకోవాలని తెలిపారు. మూడు రోజులపాటు భారీ వర్షాలుఆసిఫాబాద్: జిల్లాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు నాగపూర్ ప్రాంతీ య వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లు కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మె రుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవస రం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, వ రద నిలిచే, లోతట్టు ప్రాంతాలు, వాగులు, నదుల సమీపాలకు వెళ్లొద్దన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు స మీపంలో ఉండొద్దని సూచించారు. స్థానిక అధికార యంత్రాంగం, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్ఆసిఫాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. తెలంగాణ జీవనోపాధుల ప్రాజెక్టు కింద తిర్యాణి, లింగాపూర్ మండలాల్లో ఎంపికైన గ్రామాల్లోని అర్హులైన గిరిజనులకు మంజూరైన ఆసరా పింఛన్ పత్రాలను కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ యువరా జ్ మర్మాట్తో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవనోపాధుల ప్రాజెక్టు కింద అర్హులైన గిరిజనులకు వందశాతం పింఛన్లు, జాబ్కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖా తాలు అందిస్తామని తెలిపారు. గిరిజనుల ఆ రోగ్యం, చిన్న పిల్లలకు టీకాలు, ఆహారభద్ర త కార్డులు, నైపుణ్యత శిక్షణ, ఆర్థిక అక్షరాస్య త పెంపుదలకు కృషి చేయాలని ఆదేశించా రు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, డీ పీఎం రామకృష్ణ, సర్పంచులు పాల్గొన్నారు. -
అడవికి రారాజు..!
చింతలమానెపల్లి: పర్యావరణ సమతుల్యతకు పెద్దపులిని నిదర్శనంగా చెబుతున్నారు. ఈ మృగాలు మనుగడ సాగించిన చోట అడవులు, వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్నట్లుగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. అడవికి రారాజుగా వెలుగొందే పులులు ప్రస్తుతం ఆవాసం కోసం పోరాటం సాగిస్తున్నాయి. తాడోబా అభయారణ్యం, కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టుకు కీలక వారధిగా ఉన్న జిల్లా అడవుల్లో మనుషుల సంచారం, పోడు సాగు, ఆవాసాలు విచ్ఛిన్నం కావడం పులుల ఉనికిని దెబ్బతీస్తున్నాయి. ఆసిఫాబాద్ డివిజన్లో పులుల స్థిర నివాసాలు లేకున్నా తాడోబా నుంచి కవ్వాల్ అభయారణ్యానికి రాకపోకలు సాగించడానికి అత్యంత కీలకం. కాగజ్నగర్ డివిజన్లోని సిర్పూర్(టి), పెంచికల్పేట్, కాగజ్నగర్ రేంజ్ల్లో పులులు కొంతకాలంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. పెద్దపులుల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. బెబ్బులి దాడుల్లో పశువుల కోల్పోయిన బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి మొక్కలు నాటడంతో పాటు, పులులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావనను తొలగించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆహార కొరత.. తగ్గిన కదలికలుఅడవులలో శాకాహార జంతువులను విచ్చలవిడిగా వేటాడటంతో పులులకు తీవ్ర ఆహార కొరత ఏర్పడుతోంది. ప్రధాన ఆహారమైన దుప్పులు, జింకలు, అడవి పందులను కొంతమంది వేటగాళ్లు ఉచ్చులు వేసి హతమారుస్తున్నారు. ఎర జంతువుల సంఖ్య తగ్గడంతో పులులు శివారు గ్రామాల్లోకి వచ్చి పశువులపై దాడులు చేస్తున్నాయి. వేటగాళ్లపై ఐదేళ్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆహార కొరత, ఆవాసాలు తగ్గడం, ఇతర కారణాలతో జిల్లాలో పులుల కదలికలు తగ్గినట్లు తెలుస్తోంది. అడవుల్లో నిరంతరం శబ్దాలు, పెరిగిన మానవ సంచారం, సరిహద్దుల వద్ద రక్షణ లోపించడంతో పులులు మహారాష్ట్రలోని తాడోబాకు తిరిగి వెళ్తున్నట్లు సమాచారం. అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలుపులుల ఉనికిలో జిల్లాకు ఉన్న ప్రాధాన్యతను అటవీశాఖ గుర్తించి అడవులు, పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. గడ్డి మైదానాలను పెంచడంతో పాటు సహజ నీటి వనరుల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో శాకాహార జంతువుల సంఖ్య పెరిగింది. ఇటికలపహాడ్, దిందా, గూడెం తదితర ప్రాంతాలలో భారీ ఎత్తున ఆక్రమణకు గురైన అటవీ, పోడు భూములను స్వాధీనం చేసుకుని అడవులను తిరిగి అభివృద్ధి చేస్తోంది. దెబ్బతింటున్న సహజ ఆవాసాలుకాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలోని 10 రేంజ్ల పరిధిలో 2,437 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. అంకుసాపూర్, సిర్పూర్(టి) రేంజ్, కడంబా అడవుల్లో గతంలో పులులు శాశ్వత ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దాదాపు 11 వరకు ఇక్కడే సంచరించేవి. ఒక పెద్దపులి సంచరించడానికి 80 నుంచి 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవసరం. అటవీ సరిహద్దులు, అటవీ ప్రాంతాల్లో విస్తరిస్తున్న పోడు సాగు కారణంగా అడవులు ముక్కలవుతున్నాయి. సహజ వనరులు దెబ్బతినడంతో వాటి మనుగడకు విఘాతం కలుగుతోంది. అలాగే వేటగాళ్లు ఈ జంతువులను హతమారుస్తున్నారు. పెంచికల్పేట్ పరిధిలోని కే8 పులిని వేటగాళ్లు హతమార్చగా, 34 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. వాంకిడి మండల పరిధిలోని షెర్కపల్లి అడవుల్లో రెండు పులులు, రైలు ప్రమాదంలో మరో పులి మృతి చెందగా, మరికొన్ని పులులు మహారాష్ట్రకు వలస వెళ్లాయి. ప్రస్తుతం జిల్లాలో మూడు పులులు మాత్రమే ఉన్నట్లు అనధికారిక అంచనా. -
పట్టాలెక్కిన మూడో లైన్..!
కాగజ్నగర్టౌన్: దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిష్టాత్మకమైన కాజీపేట – బల్లార్షా మధ్య 203 కిలోమీటర్ల మూడో రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.3000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ దేశంలోని ప్రధాన ఉత్తర, దక్షిణ గ్రాండ్ ట్రంక్ రైల్ కారిడార్కు కొత్త ఊపునిచ్చింది. ఈ నెల 22న ఆసిఫాబాద్రోడ్– సిర్పూర్ కాగజ్నగర్ మధ్య 11 కిలోమీటర్ల సెక్షన్తోపాటు విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. దశలవారీగా పనులు2015– 16లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ట్రిప్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మూడు విడతలుగా చేపట్టారు. 2016లో రాఘవాపురం– మందమర్రి మధ్య 33 కిలోమీటర్లు పూర్తి కాగా, 2020 నుంచి మిగిలిన సెక్షన్లు పనులు కొనసాగాయి. తాజాగా ఆసిఫాబాద్ రోడ్– కాగజ్నగర్ మధ్య పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో ట్రాక్ వేగ సామర్థ్యాన్ని పరీక్షించారు. కాగా, నిజాం సర్కార్ 1947 ముందు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం బీబ్రా కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. నిజాం సర్కార్ హయాంలో పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించగా దానికి బీబ్రా వంతెనగా నామకరణం చేశారు. అప్పటి నుంచి దీనిని బీబ్రా బ్రిడ్జిగానే పిలుస్తున్నారు. రైళ్ల ఆలస్యానికి చెక్ఈ నెల 24న దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల కృష్ణన్ ప్రత్యేక రైలులో ట్రిప్లింగ్ లైన్ను బల్లార్షా వరకు పర్యవేక్షించారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే ప్రధాన కారిడార్. ఇక్కడ బొగ్గు, సిమెంట్ వంటి భారీ సరుకు రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు రోజు వేల సంఖ్యలో తిరుగుతాయి. తీవ్ర రద్దీ ఉండేది. మూడో లైన్తో లైన్ సామర్థ్యం పెరిగి రైళ్ల ఆలస్యం తగ్గుతుంది. ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు వేగంగా నడిచే అవకాశం ఏర్పడుతోంది. థర్మల్ పవర్ప్లాంట్, పరిశ్రమలకు బొగ్గు, సిమెంట్ సరఫరా సాఫీగా జరగనుంది. -
పోడు రైతులను అడ్డుకోవద్దు
పెంచికల్పేట్: అటవీ శాఖ అధికారులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అడ్డుకోవద్దని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని పోతపెల్లి శివారులో మంగళవారం పోడు రైతులు చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తరతరాలుగా ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు లాక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఎస్టీ రైతులు సాగు భూములపై ఎలాంటి అభ్యంతరం లేదని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. రైతలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. పోడు భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, సీఐ కుమారస్వామి, ఎఫ్ఆర్వో అనిల్కుమార్, ఎస్సై అనిల్కుమార్, కాంగ్రె్స్ మండల అధ్యక్షుడు సముద్రాల రాజన్న, సర్పంచ్ ఉస్మాన్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
బడుల్లో సమర్థవంతంగా అమలు చేయాలి
ఆసిఫాబాద్రూరల్: శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న అంశాలను బడుల్లో సమర్థవంతంగా అమలు చే యాలని డీటీడీవో అంబాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఉపాధ్యాయులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ టీచర్లు ఆధునిక బోధన పద్ధతులు, విద్యార్థి కేంద్రిత అభ్యాసన విధానాలపై పట్టు పెంచుకోవాలన్నారు. గిరిజన విద్యార్థుల విద్యా సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లల్లో ఆలోచననా శక్తి, పరిశోధన దృక్పథం, శాసీ్త్రయ వైఖరిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, లక్ష్మయ్య, కోర్స్ డైరెక్టర్ రవీందర్, ఏటీడీవో చిరంజీవి, జీసీడీవో శకుంతల, డీఎస్వో షేకు, పీడీ మీనారెడ్డి పాల్గొన్నారు. -
మరిన్ని లోకల్ రైళ్లు అవసరం
2012 నుంచి హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి మధ్య నడిచే ఇంటర్సిటి రైలును కాగజ్నగర్కు పొడిగించారు. అనంతరం ఎ లాంటి ఇంటర్సిటి రైళ్లను ప్రవేశపెట్టలేదు. నూతన ట్రిప్లింగ్ లైన్ అందుబాటులోకి రావడంతో మరిన్ని లోకల్ రైళ్లు అవసరం. సికింద్రాబా ద్, భువనగిరి, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్ స్టాప్లుగా కొత్త రైళ్లు ఏమీలేవు. కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో పిక్ లైన్ను ఏర్పాటు చేయాలి. – ఫణిరాజ్, ఉత్తర తెలంగాణ రైల్వే వినియోగదారుల ఫోరం ప్రతినిధిసౌకర్యాలు మరింత మెరుగు బల్లార్షా, కాగజ్నగర్, ఆసిఫాబాద్ రోడ్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. మూడో లైన్ పూర్తి కావడంతో బల్లార్షా నుంచి కాజీపేట వరకు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. ఇకపై ఈ సెక్షన్లో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. – భాస్కర్, చీఫ్ కమర్షియల్ బుకింగ్ సూపర్వైజర్ -
125 పులులకు ‘కాగజ్నగర్’ ఆవాసయోగ్యం
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధి 125 పెద్దపులులకు ఆవాసయోగ్యంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పులులు శాశ్వతంగా నివాసం ఉండడాన్ని శుభసూచకంగా భావిస్తున్నాం. అటవీశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జీవవైవిధ్యం కలిగిన జిల్లా అడవుల్లో పులుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. గతంలో పులుల దాడుల్లో 48 పశువులు మృతి చెందగా, బాధితుల కుటుంబాలకు రూ.30 వేల చొప్పున పరిహారం అందించాం. నేడు వారితో మొక్కలు నాటించాలని ప్రణాళిక రూపొందించాం. – అప్పయ్య, కాగజ్నగర్ డివిజన్ అటవీ అధికారి -
ఏఐటీయూసీ జిల్లా నూతన కార్యవర్గం
ఆసిఫాబాద్అర్బన్: ఏఐటీయూసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా టి.దివాకర్, ప్రధాన కార్యదర్శిగా బోగే ఉపేందర్, డిప్యూటి ప్రధాన కార్యదర్శి గా ఆత్మకూరి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు గా కె.రాజాగౌడ్, బి.సుధాకర్, కె.మహేశ్, జి ల్లా కార్యదర్శులుగా అశోక్, షకీర్, జిల్లా కోశాధికారిగా సంతోషితోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులు, 33 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు మంజూరుకు కృషి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాకు నూతన 10+2 కోర్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు మంజూరుకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శారదాదేవి అన్నారు. మహబూబ్నగర్ నుంచి పదోన్నతిపై వచ్చిన శారదాదేవి సోమవారం జిల్లా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్ న్యాయస్థాన భవన సముదాయంలో జిల్లా జడ్జిని వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించారు. ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆరు నెలలుగా ఇన్చార్జి జిల్లా జడ్జిగా సేవలందించిన మంచిర్యాల ప్రథమ జిల్లా జడ్జి వీరయ్యకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనంతరం నూతన జడ్జి శారదాదేవి, ఇన్చార్జి జడ్జి వీరయ్యను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాంకేత్ మిత్ర, జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, సీనియర్ న్యాయవాదులు సురేశ్, రవీందర్, నరహరి, వెంకటేశ్వర్లు, జగన్మోహన్రావ్, రవీందర్రెడ్డి, జూనియర్ న్యాయవాదులు, గుమస్తాల సంఘం ప్రతినిధులు శివచందు, మక్రం ఖాన్, సిడాం శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలు మెరుగుపర్చాలి
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్అర్బన్/కాగజ్నగర్టౌన్: ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో వైద్యసేవలు మెరుగుపర్చాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో వైద్యారోగ్యశాఖపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులు తక్షణమే భర్తీ చేయాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ మెడికల్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. పాల్వాయి హరీశ్బాబు మా ట్లాడుతూ బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవ నం శిథిలావస్థకు చేరుకుందని, 2018లో శిలా ఫలకం వేసినా అప్పటి ప్రభుత్వం నిర్మాణం చేపట్ట లేదన్నారు. పాత భవనాన్ని కూల్చివేసి నూతన సా మాజిక ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలని కోరారు. బెజ్జూర్ మండలం సల్గుపల్లి, కాగజ్నగర్ మండలం వంజీరి గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికే పెట్టుబడి!
చింతలమానెపల్లి: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో వానాకాలం సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వర్షాధార పంటల సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అత్యవసర పంటల ప్రణాళికను (కాంటింజెన్సీ క్రాప్ ప్లాన్) అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేనందున సాగు సమయం కీలకంగా మారనుంది. వర్షాలు లేకపోతే భూగర్భ జలాలు సైతం పడిపోతాయి. ఈ నేపథ్యంలో బోర్లు, బావుల్లో నీటి లభ్యత లేక పంటలకు దీర్ఘకాలికంగా నీరందించే అవకాశాలు ఉండవు. ఆగస్టు 20 వరకు పత్తి, కంది, పెసర వంటి పంటల సాగు, ఆ తర్వాత నువ్వులు, జొన్న, సజ్జ వంటి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. లోటు వర్షపాతం.. దిగుబడిపై ప్రభావం జిల్లాలో అధికారికంగా 4.56లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. ప్రధానంగా వరి, పత్తి, కంది సాగు చేస్తుంటారు. ఏటా 3 లక్షలకు పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగు, 60 వేల ఎకరాల్లో వరి, మిగతా భూముల్లో నీటి వనరులు తక్కువగా ఉండే ప్రాంతాల్లో పె సర వంటి పప్పుధాన్యాలు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 3.70 ఎకరాల్లో పత్తి, 23వేల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ ఆరంభం వరకు ఉంటుంది. పంటలకు ఈ నాలుగు నెలల్లో కురిసే వర్షపాతమే కీలకం. జూన్ 1 నుంచి జూలై 27 వరకు జిల్లాలో 503.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 378.9 మి.మీ.లు మాత్రమే కురిసింది. 25శాతం లోటు నమోదైంది. ఈ ఏడాది వరి పంట నారుమడులకే పరిమితం కాగా, నాట్లు అతి తక్కువ విస్తీర్ణంలో పూర్తి చేశారు. సాగు లక్ష్యానికి, క్షేత్రస్థాయి సాగుకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సాగు కాలంలో సగం రోజులు ఇప్పటికే గడిచిపోవడంతో సాగు, దిగుబడులపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో వర్షపాతం (మి.మీ.) నెల సాధారణం కురిసింది లోటు శాతం జూన్ 188.6 155.2 18% జూలై (26 వరకు) 304.5 221.3 27% -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు 40 మంది ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో శేకు జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. అండ ర్ 6 నుంచి అండర్ 20 వరకు అథ్లెటిక్స్ పోటీలకు వందమంది క్రీడాకారులు హాజరు కా గా, 40 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసిన ట్లు వారు తెలిపారు. ఆగస్టు 7న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయిలో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలకు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్ విజయ్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏటీడీవో చిరంజీవి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, పీడీలు మీనారెడ్డి, రాకేశ్, స్వప్న, సునీత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని డీటీడీవో జాదవ్ అంబాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సైన్స్ టీచర్లకు ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి సోమవారం ఏసీఎంవో ఉద్దవ్తో కలిసి హాజరయ్యారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఐసీటీ టూల్స్, ఏఐ వినియోగం గురించి వివరించారు. రానున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి మరింత సవాల్గా మారుతుందని, టీచర్లు నిరంతరం అప్గ్రేడ్ కావాలని సూచించారు. సమగ్ర విద్య అభ్యసన కార్యక్రమాలకు హాజరవుతూ వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేయాలన్నారు. డిజిటల్ లిటరసీ మీద అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్వో షేకు, హెచ్ఎం లింబారావు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్సో ర్సింగ్, డైలీవేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డీటీడీవో అంబాజీకి వినతిపత్రం అందించారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు సదాశివ్, లక్ష్మి, హీరాబాయి, లింగు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
అండర్పాస్ కోసం మహా పాదయాత్ర
వాంకిడి: జాతీయ రహదారి నిర్మాణానంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, అండర్పాస్ నిర్మించాలనే డిమాండ్తో సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం వాంకిడి మండలంలోని బంబార గ్రామస్తులు కలెక్టరేట్కు పాదయాత్రగా బయలుదేరారు. రోడ్డు దాటేందుకు అండర్పాస్ నిర్మాణం, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొయిరె ప్రకాశ్ అన్నారు. హైవే అధికారుల నిర్లక్ష్యపు వైఖరికి నిరసనగా గ్రామస్తులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు మహా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ను కలిసి సమస్యలు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. -
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
కాగజ్నగర్టౌన్: ఈ నెల 29న వరల్డ్ టైగర్ డే సందర్భంగా పట్టణంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సోమవారం అటవీశాఖ అధికారులు ప్రజలు, పెద్దపులి మధ్య సంఘర్షణ అనే అంశంపై వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు సెక్షన్ అధికారి రవికుమార్ అడవులు, పులుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. పులుల పరిరక్షణ, ఆవశ్యకతను తెలియజేయడానికి ఏటా ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, అడవులను సంరక్షించడం, వన్యప్రాణుల వేటకు పాల్పడకుండా ఉండడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీ అధికారులు గిరిబాబు, భీమయ్య, పీడీ రాజేంద్రప్రసాద్, అంజయ్య, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతలు
ఆసిఫాబాద్: భూగర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో డీఆర్డీవో దత్తారావుతో కలిసి సోమవారం ఎల్నినో ప్రభావం, ఫారంపాండ్, సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణాలు, ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు, విద్యార్థులకు ఏకరూపు దుస్తుల పంపిణీ అంశాలపై సెర్ప్ ఏపీఎంలు, సామాజిక సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని, కరువును ఎదుర్కొనేందుకు ప్రతీ నీటి బొట్టును భూమిలో ఇంకిపోయేలా ఇంకుడు గుంతలు, ఫారంపాండ్, సామాజిక ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటల ను వీబీ జీ రామ్జీ పథకం కింద యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి, కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు పండించడం ద్వారా అధిక ఆ దాయం పొందవచ్చని, కూరగాయల సాగు, పప్పు ధాన్యాల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆగస్టు 15లోగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలని, నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ వీవో కింద 15 సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, కొత్త సభ్యులను చేర్పించి, నూతన సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను సందర్శించి విత్తన ప్యాకెట్లు పరిశీ లించారు. ఎంపీడీవో ప్రవీణ్, వ్యవసాయ అధికారి మిలింద్, సెర్ప్ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
త్వరితగతిన ఫిర్యాదులు పరిష్కరించాలి
● ఎస్పీ నితిక పంత్ ఆసిఫాబాద్అర్బన్: పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి స్థితిగతులు తెలు సుకున్నారు. చట్టపరంగా పరిష్కరించాలని సూచనలు చేశారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసుశాఖ దృష్టికి సమస్యలు తీసుకురావాలని సూచించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
గోడు వినండి.. గోస తీర్చండి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు అందించారు. అధికారుల ఎదుట తమ గోడు వెల్లబోసుకుని.. సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎం.డేవిడ్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్నారు. డీఆర్వో వేణుతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెంచికల్పేట్ మండలం ఎల్లూర్కు చెందిన డోంగ్రె విమల తన కుమార్తెకు భూదానం కింద ఇచ్చిన భూమికి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలని కోరింది. జైనూర్కు చెందిన కుటికెల శివాజీ మండల కేంద్రంలో అదనంగా మరో మీసేవ కేంద్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. కాగజ్నగర్ మండలం దుర్గానగర్కు చెందిన సచిన్ మేసీ్త్ర తాను సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి పట్టా పాస్బుక్ మంజూరు చేయాలని విన్నవించాడు. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన నాయిని లక్ష్మయ్య తన పట్టా భూమిని ఇతరులు అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. రెబ్బెన మండలం నారాయణపూర్కు చెందిన కాటిపెల్లి కొండయ్య తన తండ్రి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పని చేస్తూ మృతి చెందాడని, వారసత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. సిర్పూర్–టి మండలం అచ్చెల్లికి చెందిన అలం చిరంజీవి తను సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమికి నక్షా జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. సిర్పూర్– టి మండలం పారిగాంకు చెందిన జుంగరి నిర్మలాబాయి ఆసరా పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంది. వీరితో పాటు పలువురు అధికారులకు సమస్యలు ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వారి రూటే.. సపరేటు!
సాక్షి ప్రతినిధి,మంచిర్యాల: కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహార శైలి పోలీ సు వర్గాల్లో దుమారం రేపుతోంది. పోలీసు ఉన్నతా ధికారికి కీలకంగా వ్యవహరించే ఓ కానిస్టేబుల్ గత కొన్నేళ్లుగా అక్కడే తిష్ట వేసి విధుల్లో ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్లుగా మారింది. పేరుకు కానిస్టేబుల్గానే ఉన్నా పైఆఫీసర్లు ఎస్సై, సీఐలకు ఆదేశాలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. తీవ్ర ఆరోపణలతో క్యాంపు క్లర్క్(సీసీ)ని కాగితాలపైనే మార్చేసి అదే హోదాతో మళ్లీ అధికారం చలాయిస్తున్నారు. మహిళా ఎస్సైతో అసభ్య ప్రవర్తన..ఆ కానిస్టేబుల్ ఓ మహిళా ఎస్సైతో అసభ్య ప్రవర్తనతో 2023 ఫిబ్రవరిలో సస్పెన్షన్ అయ్యాడు. ఆ ఎస్సైకి వాట్సాప్లో వెకిలి చాటింగ్తో వేధింపులపై అప్పట్లో విచారణ జరిగింది. సీరియస్గా తీసుకున్న అప్పటి ఎస్పీ సురేశ్కుమార్ చర్యలకు ఆదేశిలిచ్చారు. అప్పటి ఎస్బీ ఇన్స్పెక్టర్ నివేదిక ఏం ఇచ్చారోగానీ యథాస్థానంలో మళ్లీ ఎస్పీ బదిలీ కాగానే విధుల్లో చేరిపోయారు. మహిళల విషయంలో డిపార్ట్మెంట్లో తీవ్రంగా పరిగణిస్తారు. కానీ ఈ కానిస్టేబుల్ ఎక్కడ సస్పెండ్ అయ్యారో అక్కడే డ్యూటీలో చేరడం గమనార్హం. టాస్క్ఫోర్స్ పేరుతో దందాలెన్నో..?గతంలో జిల్లా టాస్క్ఫోర్స్ దాడుల్లో ప్రతీ దాంట్లో ఎంతో కొంత తెరవెనక వసూళ్ల పర్వం సాగేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చింతలమానెపల్లి పీఎస్లో నమోదైన పత్తి విత్తనాల కేసులో ఆంధ్రా వ్యాపారి, రెబ్బెనలో ఓ కేసులో రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడుల పేరుతో సెటిల్ అయితే ఒకే లేకపోతే కేసులు పెట్టి హింసించే వారు. అంతేకాక పొరుగు జిల్లాలోకి అడుగు పెట్టేందుకు పరిమితులున్నప్పటికీ మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో పత్తి విత్తన దందా చేస్తున్నారంటూ కొందరిపై దాడులు చేయడంతో వారంతా ఉన్నతాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం టాస్క్పోర్స్ స్థానంలో ఎస్బీ కేంద్రంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. రూ.200 వసూలుకు ప్రాణాలే కోల్పోయి..సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్పేట వద్ద చెక్పోస్టు డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ట్రావెల్స్ బస్సు నుంచి రూ.200 వసూలు చేశారు. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి సస్పెన్షన్కు గురయ్యారు. అయితే వీరిలో ఒకరిపై సస్పెన్షన్ ఎత్తేయగా, మరొ కరిని విధుల్లోకి తీసుకోలేదు. ఎస్పీని కలిసి తన గోడు చెప్పుకుందామని అనుమతి అడిగితే అక్కడి కానిస్టేబుల్ కనీస అనుమతి ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన యువ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. దహన సంస్కారాలకు సానుభూతి పరంగా జిల్లా ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం పోలీసు వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.అవినీతిలో ‘మధురం’ఇది మరో కానిస్టేబుల్ కథ. ఇప్పటికే ఈయన రెండుసార్లు సస్పెండయ్యారు. ఎందుకోగానీ పైఅధికారులకు ‘మధు’రంగా మారారు. జిల్లాలో జరిగే అక్రమ దందాల్లో పట్టు పెంచారు. అక్రమంగా రేషన్ బియ్యం, పత్తి విత్తనాలు, గడ్డి మందు రవాణా, కాగజ్నగర్లో మట్కా, సట్టా, పేకాట, నిషేధిత ఆన్లైన్ గేమ్స్, బెల్లం, పటిక, దేశీదారు, జీరో సరుకుల రవాణా, ప్రైవేటు ట్రావెల్స్.. తదితరవన్నీ కాగజ్నగర్ ప్రాంతానికి చెందిన ఈ కానిస్టేబుల్కు పండిపోయిఉన్నారు. మహారాష్ట్ర మీదుగా వాంకిడి, కౌటాలతో సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పశువుల అక్రమ రవాణా నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయి. అవినీతి ఆఫీసర్ల జాబితాలతో వసూల్ రాజాగా అప్పట్లో ఈ కానిస్టేబుల్ చాలా ఫేమస్. అయితే ఎన్ని వచ్చినా, తమను ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో జిల్లా అధికారితో సహా, కిందిస్థాయి ఉన్నతాధికారులు సైతం ఆయన విషయంలో వేలు పెట్టరు. దీంతో ప్రతీ అక్రమ దందాదారు నుంచి పెద్దఎత్తున నెలనెలా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2025 ఆగస్టులో కోడిపందెల్లో కేసులో అక్రమాలకు పాల్పడ్డారనే నేపంతో సస్పెన్షన్ అయ్యారు. అయితే వెంటనే మళ్లీ జిల్లాలో కీలకంగా పని చేసే స్పెషల్ బ్రాంచీలో డిప్యూటేషన్పై పని చేస్తుండడం గమనార్హం. కాగజ్నగర్ ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు, చేసే ఉద్యోగానికి మించి నిర్మించిన భవనం వంటి పరిశీలిస్తే రూ.కోట్లలోనే అవినీతి సంపాదన ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘క్యాంపు’లో కాసుల వసూళ్లుప్రతీ పనికి ఎంతో కొంత వసూళ్లకు తెగబడుతున్నాడు. వీటిలో కొన్ని పరిశీలిస్తే.. ఓ కానిస్టేబుల్ పోక్సో కేసు నిందితుడి ఫోన్లో నుంచి రూ.6లక్షలు కాజేశాడు. దీనిపై సస్పెన్షన్ చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లొచ్చాక మూడు రోజుల్లోనే రెబ్బెనలో పోస్టింగ్ ఇచ్చారు. కాగజ్నగర్ సబ్డివిజన్లో ఎస్సైల పలు ఆరోపణలు రాగా, వీరిలో కొందరికి మేలు చేస్తూ మరికొందరికి మాత్రం మోమోలు చార్జీషీట్లు ఇచ్చారు. ఓ కానిస్టేబుల్ను సోషల్మీడియా విభాగం నుంచి తొలగించాక మళ్లీ అక్కడే అటాచ్ చేసేందుకు రూ.10వేలు వసూలు చేశారు. ఇంటెలిజెన్స్ పరిధిలో చేస్తున్న ఓ కానిస్టేబుల్ తన రిలీవింగ్ ఆర్డర్కు రూ.20వేలు సమర్పించుకున్నాడు. సిక్ సెటిల్మెంట్స్, మ్యూచువల్, పొరుగు జిల్లాలకు వెళ్లేందుకు ఉత్తర్వులు పొందాలంటే ఆ మేరకు రూ.వేలల్లోనే ఇచ్చుకోవాల్సి వస్తోంది. క్యాంపులో తన అక్రమాలు పసిగడుతున్నారని భావిస్తే తోటి వారిని ఏదో కారణం చెప్పి వేరో చోటుకు పంపిస్తున్నారు. క్యాంపులో ‘కలుపు’తీసేదెవరు?ఉన్నతాధికారికి కేవలం క్లర్క్గానే కాక తెరవెనక జరిగే వాటిపై దృష్టి పెట్టకపోవడమే వారికి కలిసివస్తోంది. ఖాకీ వనంలో కలుపు మొక్కలుగా ఉన్న కానిస్టేబుళ్లపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. అయితే స్థానికంగా విచారణ చేయిస్తూ కాపాడుతూ వస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ సీఐ తీరుపై పైస్థాయిలో ఫిర్యాదు వెళ్లగా ఏకంగా బదిలీ చేశారు. ఈ క్రమంలో ఈ కానిస్టేబుళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర డీజీ స్థాయిలోనే జోక్యంతోనే అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయి. -
ఉద్యమకారులను గుర్తించేందుకు చర్యలు
కాగజ్నగర్టౌన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధ న కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతతోందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పట్టణంలోని పటేల్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులతో కమిటీ సభ్యుల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో సమీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీకి స్వాగతం పలికిన ఉద్యమకారులు శాలువాలతో సన్మానించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ కిశోర్బాబు, ఐక్యవేదిక కన్వీనర్ ఈర్ల విశ్వేశ్వర్రావు, నాయకులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, శంకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా అర్హత పరీక్ష
ఆసిఫాబాద్రూరల్: గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, వసతి కల్పించేందుకు ఆదివా రం అర్హత పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామ ని కుమురంభీం స్టడీ సర్కిల్ పాలక మండలి సభ్యులు రాము తెలిపారు. కానిస్టేబుల్, ఫా రెస్టు బీట్ అధికారి, ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు ఈ అర్హత పరీక్ష నిర్వహించగా, 106 మంది హాజరయ్యారని తెలిపారు. ఇందులో 50 మందిని ఎంపిక చేసి ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఇందురావు, రఘు, జుగాదిరావు, నిర్వాహకులు ఊశన్న, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అందినకాడికి స్వాహా..!
దహెగాం మండలం చిన్నరాస్పల్లి గ్రామ పంచాయతీలో శ్రీలక్ష్మీ ఏజెన్సీస్ నుంచి రూ.21,350 విలువ చేసే బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్ కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం సదరు ఏజెన్సీకి బిల్లు చెల్లించాలి. పంచాయతీ కార్యదర్శి అక్రమంగా ఫిబ్రవరిలో శ్రీవేద ఎంటర్ప్రైజెస్కు రూ.18,060 బిల్లు చెల్లించారు.చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్–1 పంచాయతీలో 36 వాట్స్ బల్బులు మార్కెట్లో రూ.1200 లోపే లభిస్తుండగా పంచాయతీ కార్యదర్శి ఒక్కోదానికి రూ.1750 చెల్లించి కొనుగోలు చేసినట్లు రికార్డులో నమోదు చేశారు. గురువారం పంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సదరు పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచికల్పేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాల నిర్వహణకు ప్రతినెలా నిధులను విడుదల చేస్తుంది. పంచాయతీలకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాల్సిన పాలకవర్గ సభ్యులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో రూ.లక్షలాది నిధులు పక్కదారి పడుతున్నాయి. మార్కెట్లో తక్కువ ధరకు లభించే విద్యుత్ దీపాలు, బ్లీచింగ్ పౌడర్ను కొనుగోలు చేసి రికార్డుల్లో రెండింతలు చెల్లింపు చేసి జేబులు నింపుకొంటున్నారు. పలు ఆరోపణల నేపథ్యంలో రవీంద్రనగర్, బెజ్జూర్ పంచాయతీ కార్యదర్శులకు అదనపు కలెక్టర్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే పంచాయతీల్లో జరిగే పనులు, నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం క్షేత్రస్థాయిలో వరంగా మారింది. ఫిర్యాదులు అంది నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని బహిరంగగానే విమర్శిస్తున్నారు. పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులుజిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. ప్రభుత్వం ఆయా పంచాయతీలకు 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు విడుదల చే సింది. ఈ నిధులను పారిశుద్ధ్య నిర్వహణ, వీధిదీ పాల ఏర్పాటు, తాగునీటికి వినియోగించాలి. రెండేళ్లుపాటు ప్రత్యేకాధికారుల పాలన పంచాయతీ కా ర్యదర్శులకు వరంగా మారింది. నూతన పాలక వ ర్గాలతో కుమ్మకై పెద్దఎత్తున నిధులను దారి మళ్లించారు. నిధుల వినియోగంలో నిబంధనలను పా టించకుండా ఇష్టారీతిన బిల్లులను తయారు చేసి నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది నిధుల వినియోగంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.ఖర్చు చేసిన నిధులు రూ.31.29 కోట్లు (ఇప్పటివరకు)విడుదలైన నిధులు రూ.57.78 కోట్లు పంచాయతీలు 335కార్యదర్శులపై ఫిర్యాదులుకౌటాల మండలంలోని వీర్ధండి, తాటినగర్, లింగపూర్ మండలంలోని లింగాపూర్, పిట్టగూడ, చింతలమానెపల్లి మండలంలోని రణవెల్లి, రవీంద్రనగర్– 1, బెజ్జూర్ మండలంలోని బెజ్జూర్, మర్థిడి, ఊట్సారంగపల్లి, దహెగాం మండలంలోని బీబ్రా, ఐనం, కెరమెరి మండలంలోని పరందోలి పంచాయతీల్లో నిధులను ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్రమంగా కాజేశారని గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు బీబ్రా పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ సైతం చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పంచాయతీల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తూ రికార్డులను పరిశీలిస్తుండటంతో పంచాయతీ కార్యదర్శులతో పాటు క్షేత్రస్థాయి అధికారుల్లో భయం పట్టుకుంది. జిల్లా వివరాలువిచారణ చేస్తున్నాం గ్రామ పంచాయతీల్లో నిధులు పక్కదారి పడుతున్నాయని పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేస్తున్నాం. నిధుల వినియోగంపై పారదర్శకతను తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నాం. విద్యుత్ బల్బుల కొనుగోలుకు ప్రత్యేకంగా నిర్ణీత ధర నిర్ణయిస్తాం. అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారి -
సీహెచ్పీని సందర్శించిన కేంద్ర రైల్వేశాఖ ఈడీ
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సీహెచ్పీ రైల్వే కోల్ సైడింగ్ను కేంద్ర రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ట్రాఫిక్, ట్రాన్స్పోర్టేషన్, కోల్) సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఆది వారం సందర్శించారు. బెల్లంపల్లి రీజియన్ పర్యటనలో భాగంగా ఇక్కడి రైల్వే సైడింగ్ను తనిఖీ చేశారు. బొగ్గు రేకుల లోడింగ్ వేగవంతం చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీనివాస్ బొగ్గు రవాణా, రేకుల లోడింగ్కు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీ, రక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం కృష్ణ ప్రసాద్, ఏరి యా ఇంజినీర్ సురేష్, సీహెచ్పీ ఇన్చార్జి చంద్రలింగం, డీజీఎం(సివిల్) ఆనంద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో సమస్యలపై సర్వే
వాంకిడి: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యాయన సర్వే చేపడుతున్న ట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దిన్కర్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహాన్ని ఆదివారం సందర్శించా రు. విద్యార్థులు సమస్యలు తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో ఎస్సీ, బీసీ వి ద్యార్థులకు వసతి కల్పిస్తున్నారని తెలిపారు. ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. సరిపడా మరుగుదొడ్లు కూడా లేవని, ఆర్వో ప్లాంట్ లేక విద్యార్థులు బోర్ నీళ్లే తాగుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు నూతన భవనం నిర్మించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్రావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీ ద్వారా వివాదాలు పరిష్కారం
కెరమెరి(జైనూర్): ఇరువర్గాల మధ్య రాజీ ద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చని డీఎల్ఎస్ఏ (డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) సెక్రటరీ బీ. సంకేత్ మిత్ర పేర్కొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మితో కలిసి శనివారం జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గృహ హింస చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ తీర్పే అంతిమ తీర్పని పేర్కొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి మాట్లాడుతూ గృహ హింస చట్టం మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు తెచ్చిన చట్ట మన్నారు. బాధితులకు రక్షణ, నివాసం హక్కు, ఆర్థిక సహాయం అందించడానికి వీలు కల్పిస్తుంద ని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, సర్పంచ్ కొడొప ప్రకాశ్, మోతుబాయి తదితరులున్నారు. -
వంటకు సరుకులు భారం
కాగజ్నగర్టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, కిరాణా సరుకులు, గుడ్డు ధరలు పెరిగినా పాత రేట్తోనే బిల్లులు చెల్లిస్తుండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వారానికి ఒక రోజు ఇచ్చే గుడ్డును ఇప్పుడు మూడు రోజులకు పెంచారు. కానీ ప్రభుత్వం గుడ్డుకు రూ.6 మాత్రమే ఇస్తుండగా మార్కెట్లో రూ.9.10గా ఉంది. మిగిలిన రూ.3.10లు నిర్వాహకులే భరించాల్సి వస్తోంది. పైగా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీలకు అప్పులు చేసి భోజనం పెడుతున్నామని మధ్యాహ్న భోజన నిర్వాహకులు వాపోతున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 540, ప్రాథమికోన్నత పాఠశాలలు 102, ఉన్నత పాఠశాలలు 58 ఉన్నారు. ఈ పాఠశాలల్లో 39వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకులు అందిస్తున్నారు. గుడ్డు, ఇతర సరుకుల ధరలు పెరిగినా వారికి చెల్లించే బిల్లులు మాత్రం పెరగడం లేదని, అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్నట్లు ప్రభుత్వమే గుడ్డు, సరుకులు పంపిణీ చేయాలని లేదంటే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని వారు కోరుతున్నారు. మధ్యాహ్న భోజనం ధరలు ఇలా (ఒక్కొక్కరికి ఒక్కరోజుకు)..ప్రభుత్వం దృష్టికి.. మెనూ ప్రకారం గుడ్డు వారానికి మూడు సార్లు అందించాలి. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నారు. బిల్లులు పెంచే విషయం ప్రభుత్వం పరిధిలోని అంశం. ప్రభుత్వం దృష్టికి నిర్వాహకుల సమస్యను తీసుకెళ్తాం. – సచ్చిదానంద చారి, డీఈవో -
మానవ మనుగడకు అడవులు కీలకం
సిర్పూర్(టి): మానవ మనుగడకు అడవులు ఎంతో కీలకమని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అన్నారు. శనివారం సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని దుబ్బగూడ ప్లాంటేషన్ను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ పోడు వ్యవసాయం పేరుతో ధ్వంసం చేసిన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని మొక్కలు పెంచడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్లాంటేషన్లో మొక్కల పెంపకాన్ని పరిశీలించి పలు సలహాలు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్డీవో అప్పయ్య, ఎఫ్ఆర్వో శ్రీనివాస్, సెక్షన్ అధికారి మోహన్రావ్, సిబ్బంది పాల్గొన్నారు. ప్లాంటేషన్లో రక్షణ చర్యలు తీసుకోవాలిచింతలమానెపల్లి: ఎల్నినో నేపథ్యంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ప్లాంటేషన్లలో మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని డీఎఫ్వో సీహెచ్.బాలమణి అన్నారు. శనివారం ఖర్జెల్లి అటవీ రేంజ్ పరిధిలోని బాబాపూర్ బీట్లోని ప్లాంటేషన్ను ఎఫ్డీవో అప్పయ్యతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా అటవీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎఫ్ఎస్వో లాలాజీ, ఎఫ్బీవో ప్రభాకర్ పాల్గొన్నారు. -
జనగణన పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: జనగణన హ్యాండ్ బుక్ తయారీ ప్రక్రి య పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. భారత జనగణన 2027లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ, పట్టణ, డైరెక్టరీల వి వరాల సేకరణపై ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత జనగణన –2027 జనగణన హ్యాండ్బుక్ తయారీ ప్రక్రియలో సేకరించే సమాచారం అత్యంత కచ్చితత్వంతో, నాణ్యతతో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. డేటా సేకరణలో ఎటువంటి పొ రపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ 1951 జనగణన నుంచి నిరంతరం ప్రచురితమవుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల జనాభా, సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించే ప్రభుత్వ ప్రామాణిక గ్రంథంగా నిలుస్తోందన్నారు. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్, అవసరమైతే భౌతిక షెడ్యూల్ ద్వారా సమాచార సేకరణ జరుగుతుందని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం సహాయ వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి గురువయ్య, జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణయ్య, శిక్షకుడు అభిషేక్ పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు భరోసా
కాగజ్నగర్టౌన్: విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు, పశువుల యజమానులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. బాధిత కుటుంబాలకు 2024 నుంచి 2025 డిసెంబర్ వరకు రూ.16 లక్షల 60 వేల నష్టపరిహారాన్ని అందించారు. ఇటీవల బాధితులకు అందించిన నష్టపరిహారం వివరాలు..మృతుల కుటుంబాలకు నష్టపరిహారం విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు, పశువుల యజమానులకు విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేస్తున్నాం. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహార చెక్కులు అందజేశాం. – ఇమ్రాన్ అహ్మద్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, కాగజ్నగర్ -
యువత పోరాటంతోనే కేంద్ర మంత్రి రాజీనామా
ఆసిఫాబాద్: విద్యార్థులు, యువత సాగించిన పోరాటం వల్లనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులతో పెద్ద సంఖ్యలో హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్రం సుగుణ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ ఫ్లోర్లీడర్ అబ్దుల్లా, డీసీసీ కార్యవర్గ సభ్యు లు మల్లేష్, భీమ్రావు, తారిక్, శంకర్, రాపర్తి మురళీ, మీర్ కాసిఫ్, ఇమ్రాన్, తిరుపతి, షఫి, శైలజ పాల్గొన్నారు. -
భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో తొలి ఏకాదశి పర్వది నాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజున పట్టణంలోని వైష్ణవాలయాలతోపాటు ఇత ర ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఉద యం నుంచి సాయంత్రం వరకు భక్తులు ఆలయాలను దర్శించుకున్నారు. పాండురంగ నామస్మరణ తో ఆలయాలు మారుమోగాయి. జిల్లా కేంద్రంలో ని పండరినాథ ఆలయంలో తెల్లవారుజామునుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు అనంత్ ఆచార్య ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, అభిషేకం, సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం భజనలు చేస్తూ భక్తి పారవశ్యంతో నిండిపోయారు. బాలేశ్వర, శివకేశవ, కేశవనాథ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేశవనాథ ఆలయంలో భక్తులు సామూహిక హరేరామ పారాయణం చేశారు. ఆలయ ప్రాంగణంలో భజనలు చేశారు. సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం చేశారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో 24 గంటల పాటు ఎక్కాహం నిర్వహించారు. -
వైద్య సిబ్బంది కొరత వెంటనే తీర్చాలి
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, వైద్య సిబ్బంది కొరత వెంటనే తీర్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ అవినాష్తో జిల్లా కమిటీ సభ్యులు ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతులు, రోగులకు కల్పిస్తున్న వైద్య సేవలపై చర్చించారు. భూపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చెందినా ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేవన్నారు. ఆసుపత్రిలో 20 మంది వైద్యులు ఉండాల్సిన స్థానంలో నలుగురు మాత్రమే ఉన్నారని, ఆపరేషన్ థియేటర్ కూడా పని చేయకపోవడంతో సాధారణ వైద్య సేవలకు మాత్రమే పరిమితమైందన్నారు. ఆసుపత్రిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ముంజం శ్రీనివాస్, ఆనంద్ కుమార్, రాజేందర్, పి.రాజేశ్, మిట్టపల్లి సుదర్శన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ పోగొట్టుకున్న వారు పోర్టల్లో బ్లాక్ చేయాలి
ఆసిఫాబాద్: మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో బ్లాక్ చేయాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన మొబైల్ రికవరీ మేళాలో రూ.23,40,000 విలువైన 117 మొబైల్ ఫోన్ల ను బాధితులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్లు, పాస్వర్డ్లతో పాటు విలువైన సమాచారాన్ని ఫోన్లలో భద్రపరచుకుంటున్నారని గ్రహించే నేరగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీక్ పాస్వర్డ్లను హ్యాక్ చేసి, ఫోన్పే, గూగుల్పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. దొంగిలించిన ఫోన్లను తెలిసి కూడా కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. సెకెండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసేవారు విధిగా షాపు యజమాని నుంచి రశీదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
స్టేషన్ల పనితీరు మరింత మెరుగుపడాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు మరింత మెరుగుపడాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, క్రైం రికార్డులు, ఇన్ఫర్మేషన్ బుక్, రిజిస్టర్లు పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల్లో సీడీ ఫైల్స్, పెండింగ్ ట్రయల్లో ఉన్న సీడీ ఫైళ్లు పరిశీలించారు. గ్రేవ్ కేసులు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని డీఎస్పీ అశోక్కు సూచించారు. ఎస్వోపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని, 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ పరిశీలించి ఫైలు సక్రమ పద్ధతిలో ఉండాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు, అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. గంజాయి రవాణా, విక్రయించే వారిపై నిఘా ఉండాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్ నేరాలు, సామాజిక అంశాలు, ట్రాఫిక్ నియామాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో సీఐలు సంజయ్, వేణుగోపాల్, బాలాజీ వరప్రసాద్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
కళాశాలల బంద్ ప్రశాంతం
ఆసిఫాబాద్రూరల్: నీట్ పేపర్ లీకేజీ ఘటన కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా శు క్రవారం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘా ల నాయకులు చేపట్టిన ఇంటర్, డిగ్రీ కళాశాలల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. వివిధ సంఘాల నాయకులు టీకానంద్, రాజ్కుమార్, సమీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దాడిని ఖండించిన తెలంగాణ జన సమితినీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసుల దాడిని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మధుకర్ బాధ్యుతలపై కఠిన చర్యలు తీ సుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
మూణ్నాళ్ల ముచ్చటే..!
నిరుపయోగంగా లేక్ వ్యూ రెస్టారెంట్ భవనంఅడ ప్రాజెక్టు ఒడ్డున వృథాగా బోట్ నిరుపయోగంగా మారి..ఆసిఫాబాద్ మండలం అడ గ్రామం వద్ద గల కుమురం భీం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో బోటింగ్ కోసం 2023 ఏప్రిల్లో అప్పటి కలెక్టర్ రాహుల్రాజ్ రూ.25 లక్షల వరకు వెచ్చించి పెద్ద పడవ, చిన్న పడవలను కొనుగోలు చేశారు. వీటితోపాటు పర్యాటకుల కోసం ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రూ.40 లక్షల టూరిజం నిధులతో గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా లేక్ వ్యూ రెస్టారెంట్ నిర్మించారు. కానీ కుమురంభీం ప్రాజెక్టు వద్ద పర్యాటక అభివృద్ధి కలగానే మిగులుతోంది. 2023లో పర్యాటకులను ఆకర్షించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బోటింగ్కు మొదట్లో గిరాకీ ఉండేది. ఒక్కొక్కరికి రూ.50 టికెట్ ధర నిర్ణయించారు. మొదటి నాలుగు నెలలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, జిల్లా కేంద్రం ప్రజలు ప్రాజెక్టులో బోటింగ్ను ఆస్వాదించడానికి వచ్చేవారు. ఆ తర్వాత నిర్వహణ గాడి తప్పింది. బోటింగ్కు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. పర్యాటకులను ఆకర్షించే ఇతర సౌకర్యాలేవీ కల్పించకపోవడంతో ఆదరణ కరువైంది. బోటింగ్ పడవ, రెస్టారెంట్ నిరుపయోగంగా మారాయి. -
బెల్లంపల్లి– గడ్చిరోలి హైవే పనులు చేపట్టాలి
కాగజ్నగర్రూరల్: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న బెల్లంపల్లి – గడ్చిరోలి జాతీయ ర హదారి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. అలాగే హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ యాక్సిస్ కంట్రోల్డ్ హైవే నిర్మించాలన్నారు. గడ్చరోలి జిల్లాలో ఐరన్ ఓర్ గనులు పెద్దఎత్తున మొదలయ్యాయని, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు ముడి ఇనుమును తరలించడంలో ఈ జాతీయ రహదారులు ఉపయోగపడతాయని తెలిపారు. -
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
కాగజ్నగర్టౌన్/ఆసిఫాబాద్అర్బన్: వినియోగదా రులకు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు. పట్టణంలో శుక్రవారం జిల్లా విద్యుత్ శా ఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. డైరెక్టర్ మాట్లాడుతూ దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లను తక్షణమే మార్చాలని ఆదేశించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ వినియోగదారులను ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. అనంతరం కాగజ్నగర్ డివిజన్ కార్యాలయంలోని ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ను తనిఖీ చేశారు. స్థానిక 132 కేవీ సబ్ స్టేషన్ను సందర్శించి సరఫరాపై ఆరాతీశారు. అనంతరం ఆసిఫాబాద్లో నూతనంగా నిర్మించిన 5 కిలోమీటర్ల 33 కేవీ లైన్ పనులను ప్రారంభించారు. ఈ లైన్తో వాంకిడి మండలానికి విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అటవీ ప్రాంతం గుండా తిర్యాణికి వెళ్లే 33 కేవీ లైన్పై చేపట్టిన కవర్డ్ కండక్టర్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్(ఆపరేషన్స్) అశోక్, ఎస్ఈ ఉత్తమ్కుమార్ జాడే, ఆసిఫాబాద్ డీఈ వీరేశ్, ఏడీఈ శ్రీనివాస్, ఏడీఈ ట్రాన్స్కో గోపాల్, ఎస్ఏఈ దేవిదాస్, ఏఈలు రవీందర్, ఫిరోజ్ఖాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 33 కేవీ లైన్ను ప్రారంభిస్తున్న అధికారులు -
విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలుర మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశా రు. మౌలిక వసతులు, విద్య బోధన, వంట తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సా మర్థ్యాలు తెలుసుకున్నారు. డీఆర్డీవో దత్తారావుతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణతోనే కాలుష్య నివారణ సాధ్యమవుతుందన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఎం బుచ్చయ్య, ప్రిన్సిపాల్ శ్వేత పాల్గొన్నారు. ఆగస్టు 25లోగా యూనిఫాం అందించాలిఆసిఫాబాద్రూరల్: ఆగస్టు 25లోగా పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సచి వాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానంద చారి, డీఆర్డీవో దత్తారావుతో కలిసి హాజరయ్యారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి ఒక యూని ఫాం పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వ్యాధుల నివారణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
లక్ష్యాల సాధనలో ‘నీతి తారా’ కీలకపాత్ర
ఆసిఫాబాద్అర్బన్: నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం, ఆకాంక్షిత బ్లాక్ లక్ష్యా ల సాధనలో నీతి తారా పోర్టల్ కీలకపాత్ర పోషి స్తుందని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం నీతి తారా పోర్టల్ వినియోగం, డాటా ఎంట్రీ, పర్యవేక్షణ, విశ్లేషణలపై జిల్లా అధికారులు, సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల పనితీరు సూచికలను నిరంతరం పోర్టల్లో నమోదు చేసి, విశ్లేషించడం ద్వారా అభివృద్ధి సూచీల పురోగతిని నిరంతరం పర్యవేక్షించవచ్చన్నారు. డేటా ఆధారిత ప్రణాళికలు రూపొందించడం, లోపాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టడం, ప్రభుత్వ పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో పోర్టల్ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈడీఎం గౌతమ్రాజ్, ఏబీఎఫ్ బాలరాజు రాజారాం, ఈడీ సీఈఎల్ మాస్టర్ ట్రైనర్ నర్సింగ్దాస్, ఏఎల్ టెక్నికల్ అసిస్టెంట్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా అమలు చేయాలిఆసిఫాబాద్రూరల్: శిక్షణలో నేర్చుకున్న అంశాలను సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్ట ర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలో హెచ్ఎంలు, ఎస్వోలకు అందిస్తున్న మూడు రోజు ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి శుక్రవారం హాజ రయ్యారు. త్వరలో ఉద్యోగ విరమణ పొందనున్న ప్రధానోపాధ్యాయులు రవీందర్, పురుషోత్తంను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సచ్చిదానంద చారి, క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ప్లానింగ్ కోఆర్డినేటర్ లతీఫ్, రిసోర్స్పర్సన్లు హనుమంతు, ప్రభోద్, నటరాజ్, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
కాగజ్నగర్ రైల్వేస్టేషన్ తనిఖీ
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల కృష్ణన్ శుక్రవారం తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో చేరుకుని ప్లాట్ఫాం– 1, స్టేషన్ ఎదుట పార్కింగ్ పరిసరాలను పరిశీలించారు. అమృత్ భారత్ స్కీంలో రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేసేందుకు అనుకూలమైన పరిస్థితులపై ఆరా తీశారు. మూడో ప్లాట్ఫాంలో బుకింగ్ కౌంటర్ ఏర్పాటు, పార్కింగ్, లిఫ్ట్, తదితర అంశాలను అధికారులతో చర్చించారు. డీసీ ఎం చరణ్దాస్, సీనియర్ డీవోఎం నరేందర్, అభిరాం, స్టేషన్ మేనేజర్ వివేకానంద, చీఫ్ క మర్షియల్ బుకింగ్ సూపరింటెండెంట్ భాస్కర్, ఆర్పీఎస్ ఎస్సై ప్రాచీదేవి పాల్గొన్నారు. సిర్పూర్(టి): సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ను శు క్రవారం రైల్వే డీఆర్ఎం గోపాల కృష్ణ తనిఖీ చేశారు. స్థానిక యువకులు సిర్పూర్(టి) స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ కేటాయించాలని, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సిర్పూర్(టి) వరకు పొడిగించాలని, నాగ్పూర్, హజ్నీ ప్యాసింజర్ రైలు నిలపాలని వినతిపత్రం అందించారు. -
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించాలి
కాగజ్నగర్/సిర్పూర్(టి): నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, వెంటనే తన పదవికి రాజీనామా చే యాలని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అలీ డి మాండ్ చేశారు. గురువారం ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి సిర్పూర్(టి)– కాగజ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే బెజ్జూర్ మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రాను న్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే కనీసం బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డా రు. దీనిపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బా బు సైతం స్పందించి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేశ యువత కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత రాహు ల్ గాంధీకి అందరూ మద్దతు తెలపాలని పిలుపుని చ్చారు. కేంద్ర మంత్రిని తొలగించేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొండ్ర జగ్గాగౌడ్, నాహిర్ అలీ, శ్రీవర్ధన్, బుస శంకర్, పెంటయ్య, సుధాకర్, విశ్వేశ్వర్, సామల రాజన్న తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి రాజీనామా చేయాలికౌటాల: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అలీ, ఎమ్మెల్సీ విఠల్ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, విద్యార్థుల అరెస్ట్ను ఖండిస్తూ గురువారం కౌటాల మండల కేంద్రంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నికాడే గంగారాం, సర్పంచులు సంతోష్, రాంప్రసాద్, భీంరావు, చందు తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత గడ్డిమందులు విక్రయించొద్దు
చింతలమానెపల్లి: పారాక్వాట్, గ్లైఫోసెట్ వంటి నిషేధిత గడ్డి మందులు విక్రయించొద్దని డీఏవో వెంకట్ అన్నారు. మండలంలోని బాలాజీఅనుకోడ రైతు వేదికలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్, ఎరువులు, విత్తనాల డీలర్లు, రైతులతో అత్యవసర పంటల ప్రణాళిక సమావేశం నిర్వహించారు. డీలర్లకు పలు సూచనలు చేశారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు విక్రయించవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం– 2026 అత్యవసర ప్రణాళికపై రైతులతో చర్చించారు. ఎల్నినో ప్రభావంతో జూలై, ఆగస్టులో వర్షాలు బలహీనంగా ఉంటాయని, రైతులు తక్కువ నీటి అవసరం ఉండే పంటలను సాగు చేయాలన్నారు. వర్షాధార ప్రాంతాల్లో వరి సాగు చేయొద్దన్నారు. మినుములు, పెసర, కందులు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కొర్రలు, నువ్వులు, సన్ఫ్లవర్, కూరగాయలు, టమాట, పండ్లు సాగు చే యాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కార్తీషా, ఎఈవోలు తదితరులు పాల్గొన్నారు. -
అపార చిక్కులు..!
వాంకిడి: ‘వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అపార్’(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్కూల్ రికార్డుల్లో ఉన్న విద్యార్థుల వివరాలు ఆధార్ కార్డుతో సరిపోలకపోవడమే దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘అపార్ ఐడీ’ విధానాన్ని 2023లో అధికారికంగా ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నెలకొంటున్న ఆటంకాలను దృష్టిలో ఉంచుకుని పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. మూడేళ్లు కావొస్తున్నా పూర్తి కాలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్య అధికంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి మొత్తం 95,533 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 51,179 మందికి మాత్రమే అపార్ ఐడీలు జనరేట్ అయ్యాయి. ఆధార్ – పాఠశాల రికార్డుల్లో తేడాలుక్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఆధార్ సంబంధిత పొరపాట్లతో జిల్లాలో ఇప్పటివరకు 53.57 శాతం మంది విద్యార్థులకు మాత్రమే ఐడీలు జనరేట్ అయ్యాయి. విద్యార్థుల వివరాలు సరిపోలకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఆధార్ కార్డులోని వివరాలు, పాఠశాల రికార్డుల్లోని(యూడైస్ ప్లస్) వివరాలు వేర్వేరుగా ఉంటున్నాయి. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, తండ్రి పేర్లలో తేడాలు ఉంటున్నాయి. రెండింటిలోనూ చిన్నపాటి స్పెల్లింగ్ తేడా ఉన్నా ఐడీ జనరేట్ కావడం లేదు. ఆధార్లో సవరణలు చేపట్టాల్సి రాగా, ఆ మార్పుల ప్రక్రియ సైతం ఆలస్యమవుతోంది. చిరునామా, పుట్టిన తేదీ తదితర వివరాలను సరిదిద్దాలంటే జనన ధ్రువీకరణ పత్రం అవసరమవుతుంది. దీనికోసం పంచాయతీ కార్యదర్శులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. దానికి అడ్వకేట్ అఫిడవిట్తో పాటు పలు పత్రాలను జతపరిచి ‘నాన్ అవైలబిలిటీ’ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది తహసీల్దార్, ఆర్డీవోల నుంచి అప్రూవల్ వచ్చాకే బర్త్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. దానికి కనీసం నెల రోజులైనా సమయం పడుతుందని తెలుస్తోంది. ఏదైనా కారణంతో దరఖాస్తు పెండింగ్లో పడితే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు విద్యాశాఖ పోర్టళ్లకు, ఆధార్ వెరిఫికేషన్ పోర్టళ్లకు మధ్య సమన్వయ లోపాలు తలెత్తుతున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి..విద్యార్థులకు అపార్ ఐడీని నమోదు చేసే క్రమంలో వారి తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా సమ్మతి(అనుమతి) పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక లేఖపై తమ పిల్లలకు అపార్ ఐడీ కేటాయించడాన్ని అనుమతిస్తున్నట్లు సంతకం చేసి ఇవ్వాలి. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. తల్లిదండ్రుల నుంచి అనుమతి లేకపోతే అపార్ ఐడీ కోసం బలవంతం చేయకూడదని ఆదేశించింది. వివరాల నమోదులో సమ్మతిని నిరాకరించేందుకు, ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించేలా సవరణలు చేపట్టాలని సూచించింది. దీంతో ఐడీల నమోదు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.12 అంకెల డిజిలాకర్..జిల్లాలో అపార్ నమోదు వివరాలుమండలం విద్యార్థులు నమోదు పెండింగ్ ఆసిఫాబాద్ 14,915 8,412 6,503 బెజ్జూర్ 4,455 1,824 2,631 చింతలమానెపల్లి 4,360 1,880 2,480 దహెగాం 4,162 2,115 2,047 జైనూర్ 7,670 4,313 3,357 కాగజ్నగర్ 21,856 13,630 8,226 కెరమెరి 5,229 3,030 2,199 కౌటాల 5,924 2,605 3,319 లింగాపూర్ 1,575 715 860 పెంచికల్పేట్ 2,313 1,300 1,013 రెబ్బెన 5,441 3,016 2,425 సిర్పూర్(టి) 6,254 3,384 2,870 సిర్పూర్(యు) 2,684 1,147 1,540 తిర్యాణి 3,125 1,188 1,937 వాంకిడి 5,567 2,620 2,947 మొత్తం 95,533 51,179 44,354నూతన విద్యావిధానం– 2020 కింద విద్యార్థులకు ఒక జీవితకాల స్టూడెంట్ ఐడీ రూపొందిస్తారు. ఈ అపార్ ఐడీ విద్యార్థులకు 12 అంకెల డిజిలాకర్లా ఉపయోగపడుతుంది. ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయి ఉన్నత చదువుల వరకు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకేచోట నిక్షిప్తమై ఉంటాయి. ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దరఖాస్తులు చేయాలన్నా ప్రస్తుతం ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతుల ఫైళ్లను పట్టుకుని తిరగాల్సి వస్తోంది. కానీ ఈ అపార్ ఐడీ నమోదు చేసుకుంటే విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకేచోట లభ్యమవుతాయి. 12 అంకెల అపార్ డిజిలాకర్ నంబరును ఎంటర్ చేయగానే అన్ని ధ్రువపత్రాలను చూసుకునే వీలుంటుంది. జిరాక్స్ ప్రతులతో తిరగాల్సిన అవసరం ఉండదు. అవగాహన కల్పిస్తున్నాం విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాలు, పాఠశాల రికార్డుల్లోని వివరాలు సరిపోలకపో వడంతోనే అపార్ ఐడీల నమోదులో జాప్యం జరుగుతోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. అలాగే అన్ని ప్రధానోపాధ్యాయులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ కార్డులో ఉన్న తప్పిదాలను వెంటనే సవరించుకోవాలి. – సచ్చిదానంద చారి, డీఈవో -
ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
వాంకిడి: ఉపాధ్యాయులు రాక వి ద్యార్థులు చదువుకు దూరమవుతు న్న తీరుపై గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘బడికి తాళం.. చదువుకు దూరం’ అనే కథనానికి అధికారులు స్పందించారు. వాంకిడి మండలంలోని సల్పలగూడ టీడబ్ల్యూపీఎస్లో విధులు నిర్వర్తిస్తున్న పెందుర్ చరణ్ దాస్, లింబుగూడ టీడబ్ల్యూపీఎస్లో విధులు నిర్వర్తిస్తున్న జాదవ్ దివ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కాంప్లెక్స్ హెచ్ఎం నారాయణ మూర్తి తెలిపారు. ఏసీఎంవో ఉద్దవ్ ఆదేశాల మేరకు కాంప్లెక్స్ హెచ్ఎం నారాయణ మూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా డీటీడీవో జాదవ్ అంబాజీ సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మన్నెగూడ బడికి టీచర్..మన్నెగూడ ఎంపీపీఎస్ టీచర్ సెలవుల్లో ఉండటంతో ప్రత్యామ్నాయంగా వేరే టీచర్ను కేటాయించలేదు. విద్యార్థలు పాఠాలు నష్టపోతున్నారనే విషయాన్ని కథనంలో ప్రస్తావించగా.. విద్యాశాఖ అధికారులు స్పందించి ఒక టీచర్ను డిప్యూటేషన్పై ఆ పాఠశాలకు కేటాయించారు. గురువారం ఆయన విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఎఫెక్ట్ -
సన్నబియ్యం పక్కదారి పట్టొద్దు
ఆసిఫాబాద్: జిల్లాలో ప్రజాపంపిణీ ద్వారా రేషన్ కార్డులు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలకు అందిస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ఆహార భద్రత, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 315 చౌకధరల దుకాణాలు, 973 అంగన్వాడీ కేంద్రాలు, 1173 పాఠశాలలు, 115 సంక్షేమ వసతి గృహాలకు ప్రతినెలా 3,205 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న 40 రేషన్ డీలర్ల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలను ఆదేశించారు. కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటుకు జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 31లోగా ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రవాణా సౌకర్యం లేని గ్రామాలకు మూడు నెలల కోటా ఒకేసారి సరఫరా చేయాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీటీడీవో అంబాజీ, డీఈవో సచ్చిదానంద చారి, డీఎస్వో సాదిక్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్ వందశాతం పూర్తి చేయాలిఆసిఫాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలు వందశాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావు, కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహినా సుల్తానా, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తో కలిసి ఎస్ఐఆర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిజిటలైజేషన్ 85.94 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన 14 శాతం పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీలు, మున్సిపల్ పాలకవర్గాలు సహకరించాలన్నారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లోని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని సూచించారు. బూత్స్థాయి అధికారులకు ఫారాలు అందించని పక్షంలో ఓటు కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
భూ సమస్యలకు చెక్!
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ధరణి పోర్టల్లో వచ్చిన తప్పులు, పెండింగ్ వివాదాలు, సర్వే నంబర్ల గందరగోళానికి తెరదించాలనే ఉద్దేశ్యంతో భూ భారతి రీసర్వేకు శ్రీకారం చుట్టింది. భూమి హద్దులు, యాజమాన్యంతోపాటు మ్యాపులు కచ్చితంగా గుర్తించి, డిజిటల్ ప్రక్రియ చేపట్టనున్నారు. దశల వారీగా సర్వే చేపట్టనుండగా, తొలి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని 15 మండలాల్లో 70 గ్రామాలను ఎంపిక చేశారు. అలాగే ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లోని సర్వే రికార్డులు సక్రమంగా లేని 37 గ్రామాలను ఎంపిక చేశారు. ప్రతీ మండలంలో 4 నుంచి 5 గ్రామాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిదశలో ఆసిఫాబాద్ మండలంలోని దానాపూర్, సీతానగర్ గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ, గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. పాత రోజుల్లో గొలుసు, కర్రలతో భూములు కొలిచేవారు. ప్రస్తుతం డిజిటల్ సర్వే చేపట్టేందుకు జిల్లాకు 10 డీజీపీఎస్ మిషన్లు కేటాయించారు. శాటిలైట్ సిగ్నల్తో సెంటిమీటర్ కచ్చితత్వంతో భూమి అక్షాంశ, రేఖాంశాలు కొలువనున్నారు. ఆకాశం నుంచి మొత్తం గ్రామానికి ఒకేసారి ఫొటోలు తీసి, డిజిటల్ మ్యాప్, త్రీడీ సర్ఫేస్ తయారు చేసేందుకు అవకాశం ఉంది. కొనసాగుతున్న గ్రామసభలురెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులతో సమావేశమయ్యేందుకు ఈ నెల 16 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్లో రెవెన్యూ శాఖ సిబ్బందికి మండలానికి ఒకరికి చొప్పున సర్వేపై శిక్షణ ఇస్తున్నారు. భూమి హద్దులు, ఉన్న రికార్డులు, సర్వే నంబర్లు, ఆక్రమణల వంటి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో కొలతలు తీసి మ్యాప్లు, పార్సిళ్లు సిద్ధం చేస్తారు. భూముల హద్దులు, యాజమాన్య వివరాలు, రికార్డులు ఒకే పద్ధతిలో నమోదు చేయాలనే ఉద్దేశ్యంతో సర్వే చేపడుతున్నారు. గ్రామ సభలు, ఫీల్డ్ సర్వే, డ్రోన్, జీపీఎస్ ఆధారిత కొలతలు, ఫీల్డ్ వెరిఫికేషన్, డ్రాఫ్ట్ రికార్డులు, అభ్యంతరాలు పరిష్కారం వంటి పనులు చేపట్టనున్నారు. అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది రికార్డులు, మ్యాపులు, భూవివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. రైతులు అందుబాటులో ఉండాలి జిల్లాలోని 15 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద 70 గ్రామాలను ఎంపిక చేశాం. రికార్డులు సక్రమంగా లేని మరో 37 గ్రామాలను సైతం సర్వే కొనసాగుతుంది. గ్రామ సభలు, భూ కొలతల సమయంలో రైతులు అందుబాటులో ఉండాలి. సిబ్బందికి సహకరించాలి. రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారమవుతాయి. తొలిదశ గ్రామాలివే..జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద తొలి దశలో 70 గ్రామాలను ఎంపిక చేశారు. ఆసిఫాబాద్ మండలం గుడిగుడి, గోవింద్పూర్, మేకలవాడ, కేస్లాపూర్, పిప్పల్గోంది, జైనూర్ మండలం పొలాస, జామ్ని, దుబ్బగూడ, జైనూర్, పవార్గూడ, కెరమెరి మండలం మురికిలంక, పార్డా, నాగాపూర్, పిప్పిరి, సాకడ, లింగాపూర్ మండలం గుమ్నూర్– కె, వంకమాడి, గుమ్నూర్– బి, కంచెపల్లి, రెబ్బెన మండలం ఫకీర్పల్లి, గుడిపల్లి, మేడిగూడ, సీతానగర్, రంగాపూర్, సిర్పూర్– యు మండలం భూనూర్, చాప్రి, దేవుడిపెల్ల, కోహినూర్, మహాగామ్, వాంకిడి మండలం నూకెవాడ్, బోరంజిగూడ, దేవుడిపల్లి, అకిని, చించోలి, తిర్యాణి మండలం తలండి, రాళ్లకన్నెపల్లి, దుగ్గాపూర్, చింతపల్లి, గంగాపూర్, బెజ్జూర్ మండలం రేచిని, నాగెపల్లి, సుశ్మీర్, గబ్బాయి, చింతలమానెపల్లి మండలం బాలాజీఅనకొడ, చిట్టమ్, కోర్సిని, కోయపల్లి, దహెగాం మండలం అమరగొండ, రావులపల్లి, దుబ్బగూడ, తీపర్గాం, కాగజ్నగర్ మండలం నారాపూర్, దుబ్బగూడ, లంజన్గూడ, మారెపల్లి, బోరిగాం, కౌటాల మండలం బాలెపల్లి, సడ్గాం, వీరపల్లి, తలండి, నాగెపల్లి, పెంచికల్పేట్ మండలం గొంట్లపేట్, జిల్లెడ, నందిగామ్, పెంచికల్పేట్, సిర్పూర్– టి మండలం చుంచుపల్లి, హీరాపూర్, జక్కాపూర్, టోంకిని, వెంకట్రావ్పూట్ గ్రామాలను ఎంపిక చేశారు. వీటితో పాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలోని రికార్డులు సక్రమంగా లేని 37 గ్రామాలను ఎంపిక చేశారు. దశలవారీగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్వే చేపట్టనున్నారు. -
రవీంద్రనగర్లో అదనపు కలెక్టర్ పర్యటన
చింతలమానెపల్లి: మండలంలోని రవీంద్రనగర్– 1 పంచాయతీలో గురువారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ పర్యటించారు. కాలినడకన తిరుగుతూ పీహెచ్సీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వారసంత, డ్రెయినేజీ పనులను పరిశీలించారు. వారసంతలో చెత్త పోగై ఉండడంపై పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించారు. ఆర్ఎంపీ దవాఖానా నుంచి ఇంజిక్షన్లు, ఖాళీ సీసాలు చెత్త వేసినట్లు సిబ్బంది తెలపడంతో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చే యాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిసరాలు, తరగతి గదులు పరిశీలించారు. పాఠశాలలో లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. 9, 10వ తరగతి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యాధికారి రాజ్కుమార్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పంచాయతీలో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను వెంట తీసుకెళ్లారు. ఎంపీడీవో మహేందర్, సర్పంచ్ సూరజ్దాస్, కార్యదర్శి భాస్కర్, ఉప సర్పంచ్ బిష్ణు బిశ్వాస్ ఉన్నారు. -
29 నుంచి వర్షవాస్
వాంకిడి: జిల్లావ్యాప్తంగా ఈ నెల 29 ఆషాఢ పౌర్ణమి నుంచి అశ్విని పౌర్ణమి వరకు మూడు నెలలపాటు వర్షవాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమత సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సందీప్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బౌద్ధ మత గురువులు మూడు నెలలపాటు ఒకేచోట ఉండి ధర్మోపదేశం చేశారని, జ్ఞానం పొందడానికి ఈ మూడు నెలలు పవిత్రమైనవన్నారు. అంబేడ్కర్ రచించిన గ్రంథాలు, బౌద్ధంపై ఉన్న గ్రంథాలను మూడు నెలలపాటు పఠించాలని కోరారు. కార్యక్రమంలో వర్షవాస్ కమిటీ అధ్యక్షుడు దుర్గం శ్యాంరావు, ఎస్ఎస్డీ జిల్లా ఆర్గనైజర్ రోషన్, నాయకులు సెండె అన్నాజీ, నాగ్సేన్, రాజేంద్రప్రసాద్, అరుణ్, కిరణ్, భీంరావు, బుద్దాజీ తదితరులు పాల్గొన్నారు. -
‘అక్రమ అరెస్టులు సరికాదు’
కాగజ్నగర్టౌన్: విద్యుత్ ఉద్యోగుల అక్రమ అరెస్టులు సరికాదని తెలంగాణ యూనైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ముంజం ఆనంద్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని పోలీస్ స్టే షన్ వద్ద మాట్లాడారు. విద్యుత్ ఆర్టిజన్, అసిస్టెంట్, ఇతర విద్యుత్ ఉద్యోగుల న్యాయమై న సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లో నిర్వహించే మహా ధర్నాకు వెళ్లకుండా అ డ్డుకోవడం సిగ్గుచేటన్నారు. న్యాయమైన హ క్కుల కోసం పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104, 327, టీఎస్యూఈఈయూ నాయకులు అరెస్టయిన విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. -
బడికి తాళం.. చదువుకు దూరం
ఇది వెల్గీ పంచాయతీలోని మన్నెగూడ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్. ఇక్కడ ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా సెలవులో ఉన్నారు. అప్పుడప్పుడు ఒక టీచర్ గ్రామానికి వెళ్లి పిల్లల ఎఫ్ఆర్ఎస్(హాజరు) తీసుకుని వెళ్తునట్లు గ్రామస్తులు తెలిపారు. దీనిపై కాంప్లెక్స్ హెచ్ఎం ప్రభోద్ను ఫోన్లో వివరణ కోరగా ఉపాధ్యాయుడిని పంపిస్తున్నామని, వర్షాలు ఉన్నప్పుడు టీచర్ వెళ్లలేని పరిస్థితి ఉంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ గ్రామానికి సరైన రోడ్డు ఉంది. వాహనాలు కూడా వెళ్తుండటం గమనార్హం. అలాగే జంబుల్ధరి గ్రామంలోని ఎంపీపీఎస్ సైతం సాయంత్రం 3 గంటలకే మూసివేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం టీచర్ వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. హాఫ్ డే లీవ్ పెట్టినా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. వాంకిడి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పిల్లల భవితవ్యంపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. వాంకిడి మండలంలోని గిరిజన గ్రామాల్లో గల పాఠశాలను బుధవారం ‘సాక్షి’ సందర్శించింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మూడు పాఠశాలలు, మరో రెండు ఎంపీపీఎస్లు వివిధ సమయాల్లో మూసి ఉన్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఏదైనా ఒక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు సెలవు తీసుకుంటే ఆ స్థానంలో ఇతర పాఠశాలలో పనిచేసే టీచర్ను డిప్యూటేషన్పై పంపించాలి. ఈ విధానం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ లోపంతోనే తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది లింబుగూడలోని టీడబ్ల్యూపీఎస్. మధ్యాహ్నం 1:46 గంటలకు బడికి తాళం వేసి కనిపించింది. పాటగూడ పంచాయతీ కేంద్రంలోని టీడబ్ల్యూపీఎస్కు కూడా తాళం వేసి ఉంది. స్థానిక పిల్లలను అడిగితే సెలవు అని చెబుతున్నారు. కాంప్లెక్స్ హెచ్ఎం నారాయణ మూర్తిని వివరణ కోరగా లింబుగూడ పాఠశాలకు టీచర్ హాజరైనట్లు తెలిపారు. కానీ ‘సాక్షి’ సందర్శించిన సమయంలో అక్కడ టీచర్, పిల్లలు ఎవరూ కనిపించలేదు. బడికి తాళం వేసి ఉంది. -
లింగాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ
లింగాపూర్: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను బుధవారం ఎస్పీ నితిక పంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతోపాటు రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. మండలంలో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిపాలన బాధ్యతలకే పరిమితం కావొద్దు
ఆసిఫాబాద్రూరల్: ప్రధానోపాధ్యాయులు కేవలం పరిపాలన బాధ్యతలకే పరిమితం కావొద్దని, విద్యార్థుల అభ్యసన పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ఎస్వోలకు బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై సూచనలు చేశారు. ప్రధానోపాధ్యాయులు నూతన విద్యావిధానం, ఎఫ్ఎల్ఎన్, అభ్యసన ప్రక్రియ, సమగ్ర పాఠశాలల నిర్వహణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, నిరంతర మూల్యంకనంపై దృష్ట సారించాలన్నారు. విద్యార్థి అభ్యసన స్థాయికి అనుగుణంగా విద్యాప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్లు హనుమంతు, ప్రభోద్, నటరాజ్, అమరేందర్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ సాగుతో లబ్ధి కౌటాల: సేంద్రియ పద్ధతిలో పంటల సాగుతో రైతులకు లబ్ధి చేకూరుతుందని డీఏవో వెంకట్ అన్నారు. మండలంలోని ముత్తంపేట గ్రామంలో పంటలను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ సహజ వ్యవసాయ మిషన్లో ముత్తంపేట గ్రామం ఎంపికై నట్లు తెలిపారు. రసాయనాల వినియోగంతో భూసారం తగ్గడంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో అధికారులు మనోహర్, విజయ్కుమార్, ఏఈవోలు సాగర్, సర్పంచ్ ఉష, ఉప సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం మరిచి.. దాడులకు తెగబడి
కౌటాల: మనుషుల్లో అనుబంధాల కన్నా ఆవేశమే రాజ్యమేలుతోంది. ప్రేమ, అప్యాయతలు.. పగ, ప్రతీకారాలుగా మారుతున్నాయి. జిల్లాలో వరుస హత్యలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నపాటి కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు, పరువు, భూ వివాదాలతో గొడవలతో హత్యలకు పాల్పడుతున్నారు. చాలా ఘటనల్లో రక్తసంబంధీకులే నిందితులుగా ఉంటున్నారు. ఇటీవల రెబ్బెన మండలంలో జరిగిన ఘటనలు నేరాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. జిల్లాలో 2023లో 32 హత్యలు జరగ్గా, 2024లో 12, గతేడాది 18 హత్య జరిగినట్లు పోలీసు రికార్డులు జరుగుతున్నాయి. ఆ మూడేళ్లలో 84 హత్యాయత్నం కేసులు సైతం నమోదయ్యాయి. మద్యం, గంజాయి మత్తులో కట్టుకున్న వారిని కడతేర్చడం, కన్నవారిని కొడుకులే హత్య చేయడం, తల్లిదండ్రులను పిల్లలు చంపడం, తోడబుట్టినవాడిని చంపుకోవడం వంటి ఘటనలు మాయని మచ్చగా మిగులుతున్నాయి. నేరాల నియంత్రణకు పోలీస్శాఖ చేపడుతున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. -
నాణ్యమైన విద్యనందించాలి
కెరమెరి: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని గిరిజన సంక్షేమ అధికారి జాదవ్ అంబాజీ అన్నారు. మండలంలోని జోడేఘాట్, బాబేఝరి ఆశ్రమ ఉన్నత పాఠశాలలను బుధవారం ఏటీడీఏ శ్రీనివాస్తో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, స్టోర్, వంట గదులు పరిశీలించారు. విద్యార్థులతో బోర్డుపై తెలుగు, ఇంగ్లిష్ పదాలు రాయించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అంతకు ముందు జోడేఘాట్లోని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. గ్రామ పటేల్ రాజేశ్వర్, హెచ్ఎంలు మోతీరాం, జంగు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. -
పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
ఆసిఫాబాద్: ఆర్థిక స్థోమత లేని నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన యూటీఆర్సీ సమావేశంలో మాట్లాడారు. విచారణలో ఉన్న కేసులను సమీక్షించారు. చట్టపరంగా బెయిల్ మంజూరైన కేసుల్లో జామీను పెట్టుకుని విచారణ ఖైదీలను ఎంపవర్డ్ కమిటీకి రెఫర్ చేశారు. సమావేశంలో డీఎల్సీఏ కార్యదర్శి సంకేత్మిత్ర, జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావు, జైలు సూపరింటెండెంట్ ప్రేమ్కుమార్, ఎస్సై విజయ్ పాల్గొన్నారు. -
‘ఆడబిడ్డలను మోసం చేస్తున్న సర్కార్’
కెరమెరి: హామీలు నెరవేర్చకుండా ఆడబిడ్డలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి నగదుతోపాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, డీటీ సంతోష్కుమార్, సర్పంచ్ పెందోర్ ఆనంద్రావు, నాయకులు యూనూస్, చందు, రిజ్వాన్, ధర్మూ, అరుణ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేత రాహుల్గాంధీతోపాటు ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద బుధవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలను రూ.కోట్లకు అమ్ముకుని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, నాయకులు గంగరాం, బాలేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లరిబ్బన్లతో విధులకు హాజరు
కాగజ్నగర్టౌన్: ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 63వ రోజుకు చేరాయి. మంగళవారం కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల రి బ్బన్లు ధరించి విధులకు హాజరై నిరసన తెలి పారు. మజ్దూర్ యూనియన్ ఉపాధ్యక్షుడు ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ యాజమాన్యం కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్ రాములు, వివిధ కార్మిక సంఘాల నాయకులు షబ్బీర్, శ్రీనివాస్, రాజేశ్, నబి, రాజమోగిలి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రికి ఖాళీల సుస్తీ!
ఆసిఫాబాద్: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమా దం ఉంది. ఇలాంటి తరుణంలో జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత ప్రజలకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఓపీలో ఒక్కో డాక్టర్ 150 మంది వరకు రో గులను చూడాల్సి రావడంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతో సీరియస్ కేసులను మంచిర్యాలకు.. అక్కడి నుంచి వరంగల్కు రెఫర్ చేస్తున్నారు. రాత్రిపూట డ్యూటీ డాక్టర్లు తక్కువగా ఉండడంతో ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందడం లేదు. 500 నుంచి 600 వరకు ఔట్పేషెంట్లుజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి గతంలో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండేది. మూడేళ్లక్రితం వైద్య కళాశాలను ఏర్పాటు చేయడంతో అనుబంధ బోధనాస్పత్రిగా మారింది. 50 పడకల స్థాయి నుంచి 330 పడకలకు అప్గ్రేడ్ చేశారు. ప్రతిరోజూ 500 నుంచి 600 మంది ఔట్ పేషెంట్లు, 200 వరకు ఇన్పేషెంట్లు నమోదవుతున్నారు. మూడు నెలల్లో 24,012 ఔట్ పేషెంట్లు రాగా, 168 సర్జరీలు, 89 ప్రసవాలు, 8,933 అడ్మిషన్లు జరిగాయి. చుట్టుపక్కల మండలాల ప్రజలు వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు. గైనకాలజిస్టు లేక అత్యవసర పరిస్థితుల్లో సాధారణ వైద్యులు, నర్సులే కాన్పులు చేస్తున్నారు. ఇక కార్డియాలజీ సేవలు అందని ద్రాక్షగానే మిగిలాయి. గర్భిణులకు ప్రసవ వేదన..ఆస్పత్రిలో గైనకాలజిస్టులు, మత్తు డాక్టర్లు లేకపోవడంతో సాధారణ కాన్పులు మాత్రమే జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. అత్యవసర సమయంలో సిజేరియన్లు చేయడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్జరీలకు రూ.వేలు చెల్లిస్తున్నారు. ఈ సేవలు మెరుగుజిలా ఆస్పత్రి పరిధిలో 65 మంది డయాలసిస్ వ్యాధిగ్రస్తులుండగా, ఐదు డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి. ప్రతిరోజూ 48 మందికి డయాలసిస్ చేస్తుండగా, మిగితా 16 మంది వెయిటింగ్లో ఉంటున్నారు. మరో ఐదు డయాలసిస్ యూనిట్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రోగులందరికీ డయాలసిస్ సేవలు అందించే వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం ఆర్థోపెడిక్ వైద్యుల సేవలు మెరుగుపడటంతో క్షతగాత్రులకు ఇక్కడే సిమెంటు పట్టీలు వేస్తున్నారు. రేడియాలజిస్టు విధుల్లో చేరడంతో గర్భిణులు, ఇతరులకు 60 మంది స్కానింగ్ చేస్తున్నారు. కిమోథెరపీ కేంద్రం ఏర్పాటు చేయగా ముగ్గురు పేషెంట్లకు సేవలందిస్తున్నారు. మైత్రీ క్లినిక్లో తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లకు చికిత్స అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ 10 నుంచి 20 మంది చేరుతున్నారు.పోస్టులున్నా.. వైద్యులేరిజిల్లా ఆస్పత్రిలో 210 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరయ్యాయి. కానీ 22 మంది పనిచేస్తున్నారు. 188 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 95 కాంట్రాక్టు వైద్యులకు 11 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు ఒక్కరే ఉన్నారు. ఏడుగురు ఆర్ఎంవోలు, ఆరుగురు క్యాజువాలిటీ మెడికల్ అధికారులు, 11 మంది స్పెషలైజేషన్ వైద్యులకు ఒక్కరు కూడా లేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్లే అదనపు విధులు నిర్వహించాల్సి వస్తోంది. 70 మంది సీనియర్ రెసిడెంట్ వైద్యులు రాగా 53 మంది హైదరాబాద్లోని కుద్బుల్లాపూర్కు వెళ్లిపోయారు. నెల రోజుల క్రితం వైద్య కళాశాలకు 28 మంది వైద్యులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా కేవలం ముగ్గురు మాత్రమే విధుల్లో చేరడం గమనార్హం. జిల్లాలో పనిచేసేందుకు కొందరు డాక్టర్లు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. 203 మంది స్టాఫ్ నర్సులకు 165 మంది ఉన్నారు. వీరిలో 20 మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్ వేయించుకున్నారు. రౌండ్ది క్లాక్ 18 మంది మత్తు డాక్టర్లకు కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. ఐసీయూ సెటప్ వైద్యులు లేకపోవడంతో సర్జరీలు జరగడం లేదు. ఈఎన్టీ, ఫోరెన్సిక్, మైక్రో బయాలజీ సిబ్బంది లేదు. -
కాసులిస్తేనే సర్టిఫికెట్లు!
డెత్ సర్టిఫికెట్ కోసం కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామ పంచాయతీలో ఓ రైతు అనారోగ్యంతో మృతి చెందాడు. రైతుబీమా పథకంతోపాటు బ్యాంకు బీమా పథకాలు, వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేయడానికి మరణ ధ్రువీకరణ పత్రం కోసం అతడి కుమారుడు స్థానిక పంచాయతీ కార్యదర్శిని కలిశాడు. రూ.2 వేలు ఇస్తేనే డెత్ సర్టిఫికెట్ ఇస్తామని సదరు కార్యదర్శి చెప్పడంతో గత్యంతరం లేక డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నాడు. కౌటాల: జిల్లాలోని కొందరు అధికారులు డబ్బులి స్తేనే ధ్రువీకరణ పత్రాల మంజూరు చేస్తూ అవినీ తికి పాల్పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారుల వరకు కాసులిస్తేనే పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరు ఏకంగా నకిలీ సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఇటీవల సిర్పూర్ (టి) పంచాయతీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ జారీలో అప్పటి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేయడం జిల్లాలో కలకలం రేపింది. ఇలాంటి నకిలీ సర్టిఫికెట్ల బాగోతాలు అనేకం ఉన్నాయని సమాచారం. ఉన్నత చదువులు, వివాహాల కోసం జనన ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో చాలామంది పంచాయతీ కార్యదర్శులను సంప్రదిస్తున్నారు. పదేళ్ల క్రితం పుట్టిన వారికి సర్టిఫి కెట్లు జారీ చేయడం, నకిలీ పత్రాలు అందించడంలోనూ మీసేవ కేంద్రాల నిర్వాహకులు పంచాయతీ అధికారులకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. మీసే వలో దరఖాస్తు చేసుకుని ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్లకు కూడా రూ.వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్పంచులతో విభేదాలుఏళ్లుగా పంచాయతీల్లో పాతుకుపోయిన కొందరు కార్యదర్శులు సర్పంచులకు సహకరించడం లేదని బహిరంగంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సర్పంచులు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కార్యదర్శులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.కొరవడిన పర్యవేక్షణ..జిల్లాలోని 15 మండలాల్లో 335 పంచాయతీలు ఉండగా, 300 మందికి పైగా కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో యువతే ఎక్కువగా ఉండడంతో చాలామంది లక్ష్యంతో పనిచేస్తూ గ్రామాలను ఆదర్శవంతంగాా తీర్చిదిద్దుతున్నారు. మరికొందరు మాత్రం ధరలు నిర్ణయించి పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మండల కేంద్రాల్లో పెద్దఎత్తున కొత్త ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్వోసీలు, ఇంటి నంబర్లు, ఇతర అనుమతులకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓనర్షిప్ సర్టిఫికెట్లు, కొత్త విద్యుత్ మీటరు, మ్యారేజ్, బర్త్, డెత్ సర్టిఫికెట్లకు కూడా ధరలు నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఎంపీడీవో, కార్యదర్శిపై కేసు సిర్పూర్(టి) పంచాయతీలో నకిలీ జనన ధ్రువపత్రం జారీ చేసిన వ్యవహారంలో గతంలో విధులు నిర్వర్తించిన ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి తిరుపతిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైంది. 2011లో ఇతర ప్రాంతంలో జన్మించిన బాలికకు 2007 లో సిర్పూర్(టి)లో జన్మించినట్లు నకిలీ జనన పత్రం సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఎల్నినోను సమష్టిగా ఎదుర్కొందాం
ఉట్నూర్రూరల్: ఎల్నినో విపత్తు నుంచి బయటపడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సమష్టిగా కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అన్నారు. ఉట్నూర్లోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఎల్నినో ప్రభావం– ప్రత్యామ్నాయ చర్యలపై సోమవారం ఉమ్మడి జిల్లా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోగ్య సమస్య దృష్ట్యా రాలేకపోయారని, మంత్రి ఆదేశాల మేరకే తాను హాజరైనట్లు ఇల్లంబర్తి స్పష్టం చేశారు. ఉట్నూర్ పీవోగా గతంలో విధులు నిర్వర్తించానని, ఉమ్మడి జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో తీవ్ర వ్యాధులు సంక్రమించేవని ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం చేయకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్త్తృత అవగాహన కల్పించాలన్నారు. కంది, పెసర, నువ్వు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా జలాశయాలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 40–45 శాతం వరకు వర్షపాత లోటు నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది సమష్టిగా పనిచేస్తే ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్ ప్లాన్, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎల్ నినో బుక్లెట్, తెలంగాణ జలసిరి పోస్టర్ను ప్రత్యేక అధికారి, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా, కుమురంభీం కలెక్టర్ హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు హాజరుకాగా మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ గైర్హాజరయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలిసమావేశంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామగోపాల్వర్మ పాల్గొని ఎల్నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులు, పంటల సాగులో తీసుకోవాల్సి న జాగ్రత్తలు, రక్షణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో చర్చించిన కీలక అంశాలను, క్షేత్రస్థాయి సమస్యలను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఇల్లంబర్తి హామీ ఇచ్చారు. సమావేశంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, నాలుగు జిల్లాల అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్ఎస్ చిత్రు, బి. వెంకటేశ్వర్లు, పి. చంద్రయ్య, యువరాజ్ మర్మాట్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి, చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ పి.పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
‘సంక్షేమ పథకాలు ప్రైవేట్కు ఇవ్వడం సరికాదు’
ఆసిఫాబాద్అర్బన్: తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు చేస్తున్న పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్వో దాసరి వేణుకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ 1996 భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించకుండా జీవో నం.12 జారీ చేసి ప్రజాధనాన్ని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం దారుణమన్నారు. అర్హులకు 15 రోజుల్లోగా లేబర్ కార్డులు జారీ చేయాలని, వలస కార్మికులను వెల్ఫేర్ బోర్డులో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, నా యకులు గౌస్బాబా, కమలాకర్, అశోక్, రవి, రాంచందర్, నవీన్, సదయ్య, నర్సయ్య, శంకర్, రావుజీ, మధు తదితరులు పాల్గొన్నారు. -
సహజ అడవిని తలపించేలా..
వాంకిడి: వన్యప్రాణులు సాఫీగా రోడ్డు దాటేలా రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో నిర్మించిన ఎకో బ్రిడ్జి (వంతెన) పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. మంచిర్యాల నుంచి కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి–363పై వన్యప్రాణులు రోడ్డు దాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రెబ్బెన సమీపంలో పులికుంట వద్ద, వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు వద్ద ప్రత్యేక వంతెనల నిర్మాణం చేపట్టారు. రూ.22 కోట్లతో వాంకిడి మండలంలో ఎకో బ్రిడ్జి (వన్యప్రాణులు రహదారిపై నుంచి వెళ్లేలా), రెబ్బెనలో రూ.20 కోట్లతో అండర్ పాస్ (వన్యప్రాణులు రహదారి కింది నుంచి వెళ్లేలా) వంతెనల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతాల్లో దట్టమైన అటవీ విస్తీర్ణం ఉండగా ఈ మార్గం గుండానే పులులు, చిరుతలు, తదితర వన్యప్రాణులు అడవులు మారుతుంటాయి. ఈ క్రమంలో వాహనదారులు రోడ్డుపైకి వచ్చే జంతువులను తప్పించే క్రమంలో ప్రమాదాల బారిన పడటమే కాకుండా వన్యప్రాణులు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ సమయంలో అటవీశాఖ వైల్డ్లైఫ్ అధికారులు దీనికి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక వంతెనల నిర్మాణాలను ప్రతిపాదించారు. 2024లో వంతెన దాటిన పులి..వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో రహదారికి ఇరువైపులా దట్టమైన అడవులు ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి కాగజ్నగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి పులులు, చిరుతల సంచారం ఉంటుంది. ప్రతీ సంవత్సరం చలికాలంలో ఈ అడవుల గుండా వీటి కదలికలు ఉంటున్నాయి. అయితే 2024లో ఒక పెద్ద పులి ఈ వంతెన పైనుంచి అడవి దాటినట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన పెద్ద పులి వంతెన దాటి మరో వైపునకు వెళ్తుండగా వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీంతో వంతెన నిర్మాణం సఫలీకృతమైనట్లు అధికారులు సైతం భావిస్తున్నారు. వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు వంతెన పైన కెమెరాను ఏర్పాటు చేశారు. పైనుంచి వెళ్లే జంతువులు రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా ఐరన్ జాలితో కంచె ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మొక్కలు నాటుతుండటంతో వన్యప్రాణులకు వంతెన మరింత సౌకర్యవంతంగా మారనుంది. పులులు, చిరుతలు, జింకలు, కోతులు, ఏలుగుబంట్లు వంటి తదితర వన్యప్రాణులు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అయితే రహదారులు అటవీ ప్రాంతాల గుండానే ఉండటంతో వన్యప్రాణులు రోడ్డు దాటే క్రమంలో వేగంగా వచ్చే వాహనాలను ఢీకొని చనిపోయేవి. అటవీశాఖ తీసుకున్న ఓవర్పాస్, అండర్ పాస్ వంతెనల ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. వాంకిడి మండలం గోయేగాం సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో జాతీయ రహదారి–363 నిర్మాణ సమయంలోనే 2022లో ఎకో బ్రిడ్జీ పనులు ప్రారంభించారు. ఏడాదిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ వంతెన స్లాబ్పైనా మట్టి వేయడం, మొక్కలు నాటడం వంటి పనుల్లో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అటవీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు వంతెనను సందర్శించి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. స్లాబ్పై మట్టి వేసేలా వంతెన నిర్మాణ యాజమాన్యాన్ని ఆదేశించగా ఇటీవల పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పలురకాల గడ్డి జాతి మొక్కలు నాటుతున్నారు. ఈ వర్షాకాలంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వన్యప్రాణులకు సహజ అడవి వాతావరణాన్ని కల్పిస్తాయి. దీంతో పులులు, చిరుతలు వంటి వన్య మృగాలు రోడ్డుపైకి రాకుండా పైనుంచే సంచరించనున్నాయి. -
ప్రతిభకు తగ్గ కోర్సులు ఎంచుకోవాలి
కాగజ్నగర్టౌన్: విద్యార్థులు తమ ఆసక్తి, ప్రతిభ కు తగిన కోర్సులు ఎంచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శని వారం పట్టణంలోని ఎస్పీఎం క్లబ్లో మిత్ర కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడు తూ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, మనలో ఉన్ననైపుణ్యతను మెరుగుపర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చన్నారు. కేరీర్ మిత్ర ఫౌండేషన్ వారు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవా లన్నారు. ఒకచోట ఆగిపోకుండా నిత్యం ప్రయత్నించడం ద్వారా లక్ష్యసాధన సులభతరం అవుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు నైపుణ్యతకు సంబంధించిన పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఫౌండేషన్ సభ్యులు వంశీకృష్ణ, విజయ్కుమార్, శ్రీకాంత్, మణికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
కాగజ్నగర్టౌన్: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ వహీదుద్దీన్ తెలి పారు. ఎస్పీ నితకా పంత్ ఆదేశా ల మేరకు శనివా రం పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో తెల్లవారు జాము న పోలీసులు నాలుగు బృందాలుగా విడిపో యి ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేష న్, లైసెన్స్ లేని 64 ద్విచక్ర వాహనాలు, అనుమతి లేకుండా నడుస్తున్న 1 ఆటోను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరి రక్షణలో భాగంగా చోరీలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు భద్రత నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సైలు లక్ష్మ ణ్, యాదగిరి, సందీప్ పాల్గొన్నారు. -
కుమురం భీం
7వరద ప్రాంతంలో పీహెచ్సీ.. చింతలమానెపల్లి మండల కేంద్రంలో పీహెచ్సీ భవన నిర్మాణానికి శనివారం పనులు ప్రారంభించగా ఎంపిక చేసిన స్థలం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 9లోu ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అల్పపీడనం ప్రభావంతో చాలాచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. కుస్తీ పట్టేదెలా? కుస్తీ క్రీడాకారులను ఆదిలోనే సమస్యలు ప లుకరిస్తున్నాయి. అరకొర వసతులతో తెలంగాణ క్రీడా పాఠశాల విద్యార్థులు అసౌకర్యాల మధ్య సాధన చేయాల్సి వస్తోంది.ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026 -
ముందుగా గర్భిణుల నమోదుతోనే..
మంచిర్యాల జిల్లాలో హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి రెగ్యులర్గా చెకప్లు చేయించడం, ప్రసవం అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవడంతోనే మృత శిశు మరణాలు తగ్గాయి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ముందుగానే రక్తం ఎక్కించేలా ఏర్పాట్లు చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకునేలా వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం చేస్తున్నాం. ఇద్దరు గైనకాలజిస్టులు, మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో గర్భం దాల్చిన నుంచి ప్రసవం అయ్యే వరకు పరీక్షించడం వంటి చర్యలు తీసుకున్నాం. – డాక్టర్ నరేందర్రాథోడ్, మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
ఆరుతడి వైపు అడుగులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న లోడుపల్లి గ్రామానికి చెందిన రైతు పేరు సికిరం బోరయ్య. తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాడు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఇటీవల పత్తి విత్తనాలు నాటాడు. మండుతున్న ఎండలతో పత్తి మొలకలు చనిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి సాగు చేసిన చేనులో కంది వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నాడు. పెంచికల్పేట్: జిల్లాలో ఆశించిన స్థాయిలో వానలు కురియకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్, జూలై మాసాల్లో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సాగు చేసిన పత్తి పంటలు మండుతున్న ఎండలకు నీటి కొరతతో మొలకదశలోనే దెబ్బతింటున్నాయి. వర్షాధారం, చెరువులు, కుంటలు, కాలువల కింద వరి నారుమడులు మాడిపోతున్నాయి. వర్షాల కొరతతో జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. జిల్లాలోని రైతు వేదికల్లో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలుగా సుమారు 23 వేల ఎకరాల్లో కంది, 2 వేల ఎకరాల్లో పెసర్లు సాగు చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు అవగాహన సదస్సులుఎల్నినో నేపథ్యంలో వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడిచినా నేటికీ అత్యల్ప వర్షపాతం నమోదైంది. దీంతో ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించడానికి గ్రామాల్లోని రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తక్కువ నీటితో పండే కంది, జొన్న, పెసర్లు, ఇతర చిరుధాన్యాల పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు. మొలకెత్తని పత్తి, వరి సాగు చేసే పొలాల్లో జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు కంది, పెసర పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు.వరికి ప్రత్యామ్నాయం..జిల్లాలోని 15 మండలాల్లో ఏటా ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు సుమారు 50 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది లోటు వర్షపాతం నేపథ్యంలో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు, బావులపైన ఆధారపడి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జూన్, జూలై మాసాల్లో కురిసిన మోస్తరు వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. నెలరోజులుగా వర్షాలు లేకపోవడంతో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. -
బెల్టు షాపులు మూసి వేయాలని ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులు మూసివేయాలని వాంకిడి మండలంలోని చిచ్చల్లి, సోనాపూర్, గణేష్ పూర్, పోనగూడతోపాటు మొత్తం ఏడు గ్రా మాల మహిళలు శుక్రవారం జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ మద్యానికి బానిసలైన పురుషులు కుటుంబాలను పట్టించుకోవడం లేదని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. సంపాదనంతా ఆస్పత్రుల కు వెచ్చిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బెల్టు షాపులను తక్షణమే మూసివేసేందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరా రు. మహిళల ధర్నాకు ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు నంది పద్మ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, నాయకులు ఆత్మకూరి చిరంజీవి, రాజ్కుమార్ మద్దతు పలికారు. -
సాగుకు ముందే ఆన్లైన్
ఆసిఫాబాద్: సన్న రకాల వరిసాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ‘సన్నబియ్యం ప్రోత్సాహక పథకం’అమలు చేస్తోంది. సన్నరకం వరిసాగు చేసే రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అంతేకాక సాగు తర్వాత రైతుల వివరాలు సేకరించకుండా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఆన్లైన్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 16 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. జిల్లాలోనూ ‘సన్నబియ్యం ప్రోత్సాహక పథకం’ఆన్లైన్ నమోదు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో 47 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రైతుల ఖాతాల్లో రూ. 2.35 కోట్లు జమ కానున్నాయి. ఆన్లైన్ ప్రక్రియ ఇలా..గతంలో ఈ పథకం ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండడంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పంట కోత తర్వాత రైతులు మీసేవ, వ్యవసాయాధికారి కార్యాలయానికి వెళ్తుండేవారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే లబ్ధి పొందే అవకాశం ఉండేది. తాజా నిబంధనల ప్రకారం రైతు తన పొ లానికి కావాల్సిన సన్నరకం వడ్లు లైసెన్సు ఉన్న ఎరువుల దుకాణంలో కొనుగోలు చేయాలి. ఆర్ఎన్ఆర్– 15048, కేఎన్ఎం– 1638, బీపీటీ 5204, హె చ్ఎంటీ సోనా, జైశ్రీరాం, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 వంగడాలను వాడాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. షాపు యజమాని రైతు ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకుని వెంటనే వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. నమో దు పూర్తయిన వెంటనే రైతులకు రశీదు ఇస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి నేరుగా రైతు ఖాతాలో డీబీటీ ద్వారా ఎకరాకు రూ.500 చొప్పున జమ చేస్తుంది. ఒక్కో రైతుకు క్వింటాల్కు రూ.500, గరిష్టంగా ఐదెకరాల వరకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.కొత్త విధానంతో సులువుగతంలో రైతులకు నగదు జమయ్యేందుకు 3 నుంచి 6 నెలల సమయం పట్టేది. ఫొటోలు, సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే తిరస్కరించేవారు. సిబ్బంది కొరతతో వెరిఫికేషన్కు సైతం చాలా సమయం పట్టేది. కొత్త విధానంతో రైతులకు సులువుగా మారనుంది. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఫర్టిలైజర్ దుకాణంలో ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. సీజన్ పూర్తికాగానే రెండు నెలల లోపు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని అధికారులు చెబుతున్నారు.నీటి వసతి ఉంటేనే వరి సాగు చేయాలి ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. సాధారణ వర్షపాతం కంటే లోటు ఉంటుంది. బోరుబావులు, నీటి వసతి ఉంటేనే వరి సాగు చేయాలి. నీటి వసతి లేని ప్రాంతాల్లో కంది, జొన్న, పెసర వంటి ఆరుతడి పంటలు పండించాలి. – మిలింద్, ఏడీఏ, ఆసిఫాబాద్ -
బడిలో తల్లిదండ్రుల వాగ్దానం
కెరమెరి: విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్రతోపాటు తల్లిదండ్రులు కీలకం.. పాఠశాలలో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవడంతోపాటు ఇంటి వద్ద వారి చదువుకు ఆటంకం క లకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ ప్రతినెలా మూడో శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్(పీటీఎం) నిర్వహిస్తోంది. ఇది కొ న్నేళ్లుగా సత్ఫలితాలను ఇస్తోంది. అయితే ప్రతినెలా కేవలం మొక్కుబడిగా కాకుండా వందశాతం ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో సమావేశాలకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే పీటీఎం సమావేశాలకు తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు. ఉదయం 10గంటలకు పీటీఎం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో ‘తల్లిదండ్రుల వాగ్దానం’ అనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారు. చదివించాలి.. రాయించాలిజిల్లాలో 720 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 34,265 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పోషకులు, ఉపాధ్యాయుల సమావేశాల్లో తల్లిదండ్రుల ఎదుట విద్యార్థులతో చదివించడం, రాయించడం, లెక్కలు చేయించాలి. తద్వారా వారి అభ్యస న స్థాయిని, సామర్థ్యాలను, సృజనాత్మకతను ప్రదర్శించి సర్కారు బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంపొందుతుంది. దీనిని కచ్చితంగా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మొక్కుబడిగా సాగిన ఈ కార్యక్రమాలను ఈ ఏడాది నుంచి అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలా నిర్వహించాలంటే..ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండగా, తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానించి తరగతి గదిలో కూర్చోబెట్టాలి. హాజరు రిజిస్టర్లో సంతకాలు చేయించాలి. ‘మీ పిల్లవాడు ఇటీవల చేసిన ఏదైనా పనితో మీకు ఆనందం కలిగిందా?’అని వారితో 15 నిమిషాలు మాట్లాడించాలి. అనంతరం 20 నిమిషాల పాటు విద్యార్థుల నమోదుపై చర్చించాలి. తల్లిదండ్రుల ఎదుట విద్యార్థులు తరగతి గదిలో ఏర్పాటు చేసిన అంశాలను ప్రదర్శించాలి. విద్యార్థి తన పాఠ్యపుస్తకం నుంచి ఒక భాగాన్ని బిగ్గరగా చదవాలి. బోర్డుపై ఒక గణిత సమస్యను పరిష్కరించి చూపించాలి. విద్యార్థులు తాము స్వయంగా చేసిన చిత్రాలు, హస్తకళలు, సైన్స్ నమూనాలను ప్రదర్శించాలి. పాఠశాల గురించి ఆంగ్లంలో మాట్లాడించాలి. తర్వాత ఒక 20 నిమిషాల పాటు సమయానికి రావడంతో కలిగే ఉపయోగాలను వివరించాలి. పిల్లల అభ్యసనంలో ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారని, అలాగే తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా అవసరమని వివరించాలి. గోయగాం ప్రాథమిక పాఠశాలలో పోషకులు, ఉపాధ్యాయుల సమావేశం(ఫైల్)తల్లిదండ్రులతో వాగ్దానాలుసమావేశాల్లో భాగంగా తల్లిదండ్రులతో ఆరు వాగ్దానాలలో ఒక దానిని ఎంచుకుని రిజిస్టర్లో సంతకం చేయించాలి. అనంతరం ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో 3 నుంచి 5 నిమిషాలు విడివిడిగా మాట్లాడా లి. వారి పిల్లల పేర్లను ప్రస్తావిస్తూ, తరగతి గదిలో వారు చూపించిన ఒక బలం లేదా సా నుకూల ప్రవర్తన గురించి అభినందించాలి. పిల్లల అభివృద్ధి కోసం ఏదైనా ఒక ముఖ్యమై న అంశాన్ని పేర్కొంటూ దానిని ఇంట్లో కూడా అమలు చేయాలని సూచించాలి. పకడ్బందీగా నిర్వహించాలి ప్రతినెలా మూడో శనివారం పీటీఎం సమావేశాలు బాధ్యతగా, పకడ్బందీగా నిర్వహించాలి. ప్రతీ పాఠశాలలో తల్లిదండ్రులు వందశాతం హాజరయ్యేలా చూడాలి. రాష్ట్ర విద్యాశాఖ తెలిపిన నిబంధనలను తప్పకుండా పాటించాలి. నేడు తల్లిదండ్రులతో తప్పనిసరిగా వాగ్దానం చేయించాలి. విద్యార్థుల ప్రగతిని స్వయంగా తెలుసుకుంటే కన్నవారిలో మరింత ఉత్సాహం పెరుగుతుంది. – సచ్చిదానంద చారి, జిల్లా విద్యాధికారి -
పోలీసు క్రీడాకారులకు అభినందన
ఆసిఫాబాద్అర్బన్: మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన ఐదో తెలంగాణ పోలీస్ గేమ్స్, స్పోర్ట్ మీట్– 2026లో జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబర్చి 13 పతకాలు సాధించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ నితిక పంత్ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. వినయ్కుమార్, ఆర్.శ్రీకాంత్, చక్రవర్తి బంగారు పతకాలు సాధించగా, పూల్సింగ్ రెండు, అక్బర్ ఒక సిల్వర్ పతకం సాధించారు. లవన్కుమార్, వినేష్ రెండు చొప్పున కాంస్య పతకాలు, సాయికుమార్, పూల్సింగ్, సాయికిరణ్ ఒక్కో కాంస్య పతకంతో సత్తా చాటారు. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర, జాతీయస్థాయి పో టీల్లో కూడా ఇదే స్ఫూర్తితో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాగునీరు సద్వినియోగం చేసుకోవాలి
పెంచికల్పేట్: బొక్కివాగు ప్రాజెక్టు నీటిని రైతులు సాగుకు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామంలోని బొక్కివాగు ప్రాజెక్టు గేటుకు బిగించిన నూతన షటర్ ద్వారా కాలువకు శుక్రవారం ఆయన నీటిని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, రైతులు ప్రాజెక్టు నీటిని అవసరం మేరకే వాడుకోవాలని సూచించారు. రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఎల్లూర్, ఎల్కపల్లి సర్పంచులు చప్పిడే రవీందర్, రాంచందర్, డీఈ భద్రయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు కుకిడే రాజేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు సంతోష్, పార్టీ నాయకులు ఉన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసి టీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల పనితీరు, విద్యార్థులకు అంది స్తున్న భోజనం, ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్వో బాలా మణి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, కుసుం నీలాదేవితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,33,627 మంది ఎస్టీలు, 81,596 మంది ఎస్సీలు ఉన్నారని తెలిపారు. వారందరికీ రా జ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం సంక్షేమ పథకాలు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు బుక్కులు, ఏకరూప దుస్తులు అందించాలన్నారు. వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేలా నాణ్యమైన విద్యనందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాల్లో రహదారి, తాగునీటితోపాటు వసతులు కల్పించాలని, రహదారి నిర్మాణాలకు అటవీశాఖ అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల్లో ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని, ఉపాధి కల్పనలో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ప్రతినెలా 30న నిర్వహించే పౌరహక్కుల దినోత్సవానికి మండలస్థాయి అధికారులు హాజరై చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై శాఖల వారీగా సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలుకు చర్యలుకలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాల పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారి ప్రాంతాల్లో ఖర్చు చేస్తామన్నారు. గిరిజనేతరులు సాగు చేసే పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే కమిషన్ చైర్మన్కు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సమావేశంలో కాగజ్నగర్ ఆర్డీవో కృష్ణయ్య, డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, జిల్లా అధికారులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కాగజ్నగర్లో మళ్లీ కూల్చివేతలు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి పాత రైల్వే గేటు సమీపం వరకు రోడ్డుకిరువైపులా ఉన్న కట్టడాలను కూల్చివేసేందుకు ఏప్రిల్ 7న పనులు ప్రారంభించారు. దుకాణాల యజమానులు సామగ్రి సర్దుకోవడానికి రెండు నెలల గడువు కోరారు. అధికారులు అందుకు అంగీకరించి పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం గడువు ముగియడంతో మళ్లీ శుక్రవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కూల్చివేతల కోసం మూడు జేసీబీలను రంగంలోకి దించారు. రాజీవ్గాంధీ చౌరాస్తా నుంచి ప్రధాన రహదారి వెంబడి ఉన్న దుకాణ సముదాయాలను కూల్చివేయడం ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్య తీరేనా..?రాజీవ్ గాంధీ చౌరస్తా పట్టణానికి కీలకమైన జంక్ష న్. ఇక్కడి నుంచి నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరుచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరుతుందని, అభివృద్ధికి ఊతమిస్తుందని వ్యాపారులు, స్థానికులు భావిస్తున్నారు. కూల్చివేతలు పూర్తి చేసి రోడ్డు పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు. -
అంకుసాపూర్లో ‘సర్’ పూర్తి
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని అంకుసాపూర్ పంచాయతీ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే విజయవంతంగా ముగిసింది. ఇక్కడ మొత్తం 750 మంది ఓటర్లు ఉండగా, 719 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. మరో 31 మందిని వివరాలు సేకరించలేని కేటగిరీగా గుర్తించారు. 719 మంది నుంచి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించి వివరాలు డిజిటలైజేషన్ చేశారు. గురువారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఎల్వోలు సుజాత, నర్సక్కను సర్పంచ్ గంగారాం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, గ్రామస్తులు బలరాం, రవి, సంతోష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో క్రీడామెరికలు
ఖానాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మ స్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆర్.విజ్ఞత ఈనెల 12న సూ ర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన అస్మిత్ ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో 58 కిలోల విభాగంలో పాల్గొని ఐదోస్థానంలో నిలిచింది. భైంసా డివిజన్కు చెందిన విద్యార్థులు ఈనెల 11, 12 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వుషూ పోటీల్లో అ త్యంత ప్రతిభ కనబర్చి 4 బంగారు, 3 వెండి, 7 కా ంస్య పతకాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. స్ఫూర్తిదాయక విజయాలు గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వరుసగా రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తుండటంతో నిర్మల్ జిల్లాలో క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. సరైన శిక్షణ, పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా అత్యున్నత స్థాయికి చేరగలరని ఈ విజయాలు మరోసారి నిరూపించాయి. బంగారు పతకం విజేతలు డి.రాజేశ్వరి, ఎ.అబ్దుల్ రహేమాన్, వాగ్మారే కరణ్, అక్షర వెండి పతకం విజేతలు శ్రీరాముల ప్రణీల్రాజ్, శ్రీరాముల కషిక, మహేందర్ కాంస్య పతకం విజేతలు జంగం గంగాప్రసాద్, విష్ణుప్రియ, అభిమన్యు, అనన్య, రూమిక, మనస్విక, స్నేహ -
విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెంచాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆలోచన శక్తి, పరిశోధన, శాసీ్త్రయ వైకరి ని పెంచాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో గురువారం సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమానికి హాజరై సూచనలు చేశారు. ఆయన మాట్లాడు తూ జీవశాస్త్ర బోధనలో పాఠ్య పుస్తకానికే పరి మితం కావ్వొద్దన్నారు. ప్రయోగాలు, పరిశీల న, చర్చలు, స్థానిక వనరులు వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం, కార్యాచరణ ఆధారిత అభ్యసన పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం ఉమబాల, జిల్లా రిసోర్స్పర్సన్లు రాజేష్, శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు. -
అనారోగ్య సమస్యతో మహిళ ఆత్మహత్య
దండేపల్లి: అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన ముడిమడుగుల లక్ష్మి (50) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధి తీవ్రత పెరిగింది. భర్త పెద్దన్న బుధవారం చొప్పదండిలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని స మయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం గమనించిన స్థా నికులు పెద్దన్నకు సమాచారం అందించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. పురుగుల మందు తాగి డ్రైవర్..ఆదిలాబాద్టౌన్: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బట్టిసావర్గాంకు చెందిన కారు డ్రైవర్ దర్శనాల విజయ్ కుమార్ (38) టీచర్స్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. గురువారం సాయంత్రం తిర్పెల్లి వద్ద గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో రిమ్స్కు తరలిస్తుండగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియలేదన్నారు. ఉరేసుకుని యువకుడు..నిర్మల్టౌన్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బంగాల్ పేట్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివాసం ఉంటున్న వినోద్ (20) కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చి ఉరేసుకున్నాడు. మృతుని తల్లి లసుంబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
న్యాయం చేయాలని మృతదేహంతో నిరసన
సిర్పూర్(టి): మండలంలోని హీరాపూర్కు చెందిన రైతు టేకం పెంటు (26) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విధితమే. భూకబ్జాదారుడు కె.వేణుగోపాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణలో గిరిజన సంఘ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మన్నెవార్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆకలితోనే చదువులు
లక్ష్మణచాంద: ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల మాదిరి ప్రభుత్వ జూని యర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉదయాన్నే కళాశాలలకు హాజర య్యే విద్యార్థులు మధ్యాహ్నం ఖాళీ కడుపులతో పా ఠాలపై శ్రద్ధ చూపరని భావించిన ప్రభుత్వం ఉద యం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులు, పోషకులు హర్షం వ్యక్తం చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని సంబరపడ్డారు. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఉ మ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో తరగతులకు హాజరవు తూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాఠాలపై శ్రద్ధచూపలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.ఉమ్మడి జిల్లా సమాచారంజిల్లా కళాశాలలు మొత్తం విద్యార్థులు నిర్మల్ 13 4,930 మంచిర్యాల 10 4,320 ఆదిలాబాద్ 13 6,606 కుమురంభీం 11 4,810


