Kumuram Bheem District News
-
కఠిన చర్యలు తప్పవు
క్రికెట్ బెట్టింగ్ నిర్వహణపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్కు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పిల్లలకు అవసరం మేరకు మాత్రమే తల్లిదండ్రులు డబ్బులివ్వాలి. బెట్టింగ్పై పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగా హన కల్పిస్తున్నాం. ప్రభుత్వం నిషేధించిన యాప్ల్లో బెట్టింగ్లకు పాల్పడుతూ పట్టుబ డితే శిక్ష తప్పదు. బెట్టింగ్, జూదం, మట్కా, గంజాయి లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా బెట్టింగ్ పెడుతున్నట్లు తెలిస్తే పోలీసులు, డయల్ 100కు సమాచారం ఇవ్వండి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – నితిక పంత్, ఎస్పీ -
బీసీలే అధికం..!
ఆసిఫాబాద్: కులాల వారీగా జనాభా వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. కుల గణన– 2024లో భాగంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే వివరాలను ఎట్టకేలకు విడుదల చేసింది. జిల్లాలోని 15 మండలాల్లో 1,64,320 కుటుంబాలు ఉండగా, 5,57,464 జనాభా ఉంది. అత్యధికంగా బీసీలు 40.10 శాతం ఉండగా, తర్వాత ఎస్టీలు 30.08 శాతం, ఎస్సీలు 15.46 శాతం, ఓసీలు 8.08 శాతం, బీసీ ముస్లిం మైనార్టీలు 6.27 శాతం ఉన్నారు. కులం ప్రస్తావన లేని కుటుంబాలు 2,326 ఉండగా, వారి జనాభా 9,471 ఉండటం విశేషం. మాలి కులస్తులు 56,140 మంది..జిల్లావ్యాప్తంగా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే అధికంగా ఉండగా, ముస్లిం మైనార్టీలు కాకుండా వారి కుటుంబాలు 69,071, జనాభా 2,23,563 ఉంది. ముస్లిం మైనార్టీలు(బీసీఈ) 34,963(6.27 శాతం) ఉన్నారు. మాలి కులస్తులు జిల్లాలో 56,140(21.72శాతం) మంది ఉండటం విశేషం. ఆ తర్వాత మున్నూరుకాపు కులస్తులు 23,234(8.99శాతం), ఆరె, ఆరెవల్లు 44,352(17.16శాతం), యాదవ 16,016(6.20శాతం), గౌడ కులస్తులు 5,451(2.11శాతం), గాండ్ల తేలి 7,118(2.75 శాతం), పద్మశాలి 9,234(3.57శాతం), ముస్లిం షేక్లు 29,722(11.50శాతం), రజక 4982(1.93 శాతం), వడ్డే 2433(0.94 శాతం), పెరిక 2369(0.92 శాతం), గోల్డ్ స్మిత్లు 2344(0.91 శాతం), బ్లాక్ స్మిత్లు 1969(0.76 శాతం), వడ్రంగి 3034(1.17 శాతం), మేర 2361(0.91) శాతం), ముదిరాజ్ 4140(1.60 శాతం), వంజర 2482(0.96 శాతం), ఇతర కులస్తులు ఉన్నారు. ఎస్సీ జనాభా 86,207జిల్లా వ్యాప్తంగా 26,251 ఎస్సీ కుటుంబాలు ఉండగా, వారి జనాభా 86,207 ఉంది. ఇందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 22,159(25.70 శా తం), మహర్ 18,596(21.57 శాతం), మాల, మాల అయ్యవారు 24,353(28.25 శాతం), మాలసాలె, నేతకాని (13,396(15.54 శాతం), మంగ్ 124(4.78 శాతం) ఉన్నారు. ఓసీలు 8.08 శాతం 11,863 ఓసీ కుటుంబాలు ఉండగా, వారి జనాభా 45,051 ఉంది. బ్రాహ్మణ 1612((3.58 శాతం), కమ్మ 522(1.16 శాతం), వైశ్య 4,417(9.80 శాతం), ముస్లింలు(బీసీ–ఈ కాకుండా) 12,277(27.25 శాతం), వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు 266(0.59 శాతం) మంది ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఎస్టీలుజిల్లాలో ఎస్టీ జనాభా ద్వితీయ స్థానంలో ఉంది. మొత్తం 47,788 కుటుంబాలు ఉండగా, వారి జనాభా 1,67,680 ఉంది. వీరిలో గోండు, నాయక్పోడ్, రాజ్గోండ్, కోయిటూర్ జనాభా 75,312(44.91 శాతం), కొలాం కోలావార్ 40,506(24.16శాతం), కోయ 17,470(10.42 శాతం), లంబాడా, బంజారాలు 22,685(13.53 శాతం), పర్దాన్ 4141(2.47 శాతం) మంది ఉన్నారు. జిల్లాలో వివరాలుసామాజిక వర్గం కుటుంబాలు శాతం జనాభా శాతం బీసీలు(ముస్లిం మైనార్టీలు కాకుండా) 69,071 42.02 2,23,563 40.10 ముస్లిం మైనార్టీలు 9,347 5.69 34,963 6.27 ఎస్టీలు 47,788 29.08 1,67,680 30.08 ఎస్సీలు 26,251 15.98 86,207 15.46 ఓసీలు 11,863 7.22 45,051 8.08 -
గ్రామ రక్షణకు కరకట్ట నిర్మాణం
ఎఫెక్ట్ఆసిఫాబాద్రూరల్: కుమురంభీం ప్రాజెక్టు కుడి కాలువ అసంపూర్తి పనులతో కోతకు గురై ఆసిఫాబాద్ మండలంలోని మానిక్గూడ ప్రాథమిక పాఠశాల, గ్రామానికి ముప్పు పొంచి ఉందని ఈ నెల 15న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కోత ముప్పు’ వార్తకు అధికారులు స్పందించారు. మానిక్గూడ గ్రామంలో శుక్రవారం రూ.48లక్షల వ్యయంతో కరకట్ట నిర్మాణానికి కలెక్టర్ కె.హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి భూమిపూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అడ ప్రాజెక్టు కుడి కాలువ కొన్నేళ్లుగా వర్షాలకు మట్టి కోతకు గురై ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, వరద ముప్పును తొలగించేందుకు రక్షణ కోసం కరకట్ట నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి అడుగులు పడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాము, అడ ప్రాజెక్టు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
చింతలమానెపల్లి: విత్తనాలు, ఫర్టిలైజర్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని డీఏవో వెంకట్ అన్నారు. మండలంలోని బాలాజీఅనుకోడ రైతు వేదికలో శుక్రవారం మండల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డీలర్లు స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్లు తప్పకుండా నిర్వహించాలన్నారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని, కొనుగోళ్లకు సంబంధించిన రశీదు తప్పకుండా ఇవ్వాలని అ న్నారు. పారాక్వాట్ గడ్డిమందు నియంత్రణ పై నిబంధనలు, నకిలీ విత్తనాలపై అవగాహ న కల్పించారు. అనంతరం గంగాపూర్లోని రైతు అశోక్ గౌడ్ ఆయిల్పామ్ తోటను సందర్శించారు. అనంతరం స్థానిక రైతులతో మా ట్లాడారు. కార్యక్రమంలో మండల వ్యవసా య అధికారి కార్తీషా, రైతులు పాల్గొన్నారు. -
నిప్పుల గుండం
కౌటాల: భానుడు భగభగ మండుతుండటంతో జిల్లా నిప్పుల గుండంగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల చేరువ కావడంతో ప్రజలు వేడి, ఉక్కపోత, వడగాలులకు తల్లడిల్లుతున్నారు. శుక్రవారంలో బెజ్జూర్లో అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, కాగజ్నగర్లో 44.3, వంకులం 44.1, రెబ్బెన 43.9, ఆసిఫాబాద్ 43.9, దనోరా 43.8, కెరమెరి 43.8, లోనవెల్లి 43.7, దహెగాం 43.7, సిర్పూర్(టి) 43.6, కౌటాలలో 43.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో సర్పంచ్ మోర్లె పార్వతి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణగౌడ్ గ్రామంలో ఎండలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో టామ్ టామ్ వేయించారు. ప్రజలు ఉదయం పది గంటలలోగా ఇళ్లకు చేరుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎండల్లో తిరగవద్దని సూచించా రు. కాగా, పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిశాయి. -
కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన
ఆసిఫాబాద్: రెండో పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భోజన విరామ సమయంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కె.హరితకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆరోగ్య కార్డులు అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమర్ హుస్సేన్, ఆయా సంఘాల ప్రతినిధులు రియాజ్ అలీ, పోచన్న, జితేందర్, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో బెట్టింగ్ భూతం
కౌటాల: యువతను బెట్టింగ్ భూతం పీడిస్తోంది. గత నెలలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియల్ లీగ్ మ్యాచ్ల క్రేజ్ పల్లెలకు పాకింది. ఈ నేపథ్యంలో కొందరు యువత, ఉద్యోగులు, విద్యార్థులు ఆన్లైన్ యాప్ల సాయంతో ఇంటి నుంచే బెట్టింగ్ కాస్తున్నారు. మహానగరాలు, పట్టణాల నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలిసీతెలియక యువత డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్నారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్, కౌటాల, తిర్యాణి, రెబ్బెన, వాంకిడి, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో బెట్టింగ్లు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఆగని దందా..యువత ఇష్టాన్ని బెట్టింగ్ సంస్కృతిని ఆసరా చేసుకుంటున్న కొందరు క్రికెట్తో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం బెట్టింగ్ను ఆరికట్టేందుకు ఇటీవల అనేక యాప్లను నిషేధించింది. కానీ బెట్టింగ్ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. వీపీఎన్ ద్వారా ఇతర దేశాల లొకేషన్లు వాడుతున్నారు. మరికొందరు కమీషన్లు తీసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్నేహితులు బృందాలుగా ఏర్పడి బాల్ బాల్కు బెట్టింగ్ పెట్టి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. యూపీఐల ద్వారా సులభంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉండడంతో స్మార్ట్ఫోన్ల నుంచి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. ఆటపై పూర్తిస్థాయి అవగాహన లేనివారు సైతం తమకు తెలిసిన వారిని మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అంచనా వేస్తూ మరీ బెట్టింగ్కు పాల్పడుతుండటం గమనార్హం. నిఘాతోనే కట్టడి..ఐపీఎల్ మ్యాచ్లు ప్రస్తుతం ఉత్కంఠంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కళాశాలల విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున్న పాల్గొంటున్న తరుణంలో కట్టడి ఇంటి నుంచి జరగాలి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. డబ్బు ఖర్చు పెడుతున్న తీరును అడిగి తెలుసుకోవాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగినప్పుడు ఎందుకని ఆరా తీయాలి. పెడదారిన వెళ్తున్నట్లు గమనిస్తే వెంటనే కౌన్సెలింగ్ ఇప్పించి అవగాహన సదస్సులకు పంపించాలి. గతంలో కౌటాల, కాగజ్నగర్, సిర్పూర్(టి)కి చెందిన పలువురు క్రికెట్ బెట్టింగ్ పాల్ప డుతూ పోలీసులకు చిక్కారు. బెట్టింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, దందాను రూపుమాపేందుకు పోలీసులు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
డ్రైవర్లకు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
ఆసిఫాబాద్అర్బన్: డ్రైవర్లకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాను అన్నారు. వాహనాలు జాగ్రత్తగా నడుపుతూ ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తూ, డ్రైవర్లు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించా రు. అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవా రం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రథమ చికిత్స పద్ధతులు, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, రాహ్ వీర్ యోజన, గుడ్ సమారిటన్ నిబంధనలు, పీఎం రాహత్ గురించి వివరించారు. అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాల నివారణ, పరికరాల విని యోగం, రక్షణాత్మక డ్రైవింగ్, వాహన తనిఖీలు, రాత్రి సమయాల్లో డ్రైవింగ్ నైపుణ్యాలపై శిక్షణ గురించి తెలియజేశారు. డ్రైవర్లతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రాణాలు, కుటుంబం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. డ్రైవర్ల కంటిచూపు మందగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి రాంచందర్, డీఎంహెచ్వో సీతారాం, డీఎం రాజశేఖర్, మోటార్ వాహన పరిశీలకులు శంకర్, రాజ మల్లు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
ప్రవేశాలు పెంచేందుకు కృషి చేయాలి
వాంకిడి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని డీఐఈవో బి.రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలను శుక్రవారం సందర్శించారు. సిబ్బందితో సమావేశ మై పలు సూచనలు చేశారు. విద్యార్ధుల హాజ రు శాతం పెంచేందుకు ప్రభుత్వం మధ్యా హ్న భోజనం అమలు చేస్తుందని, అలాగే వె ల్కమ్ కిట్లు మంజూరు చేస్తుందని తెలిపారు. వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి న విద్యార్థుల జాబితా రూపొందించి వారికి బహుమతులు ప్రదానం చేసి అభినందించా లని సూచించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా మూ డో స్థానం సాధించిన నేపథ్యంలో సిబ్బంది డీఐఈవోను శాలువాతో సన్మానించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ చంద్రయ్య, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
చివరి ఆశలు
అడుగంటినప్రాజెక్టు నుంచి ట్రాక్టర్ ఇంజిన్ ద్వారా కాలువలకు నీటిని మళ్లిస్తూ..సాగునీటి కోసం ఏర్పాటు చేసిన పైపులుఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు పొట్టె బాపు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన ఇత ను బొక్కివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద నాలుగు ఎకరాల్లో యాసంగి సీజన్లో వరి పంట సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పంట గింజ దశలో ఉంది. మరో 20 రోజుల్లో కోతకు రానుండగా.. చివరి తడికి నీరందడం లేదు. కళ్ల ముందే పంట ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నాడు. పెంచికల్పేట్: దంచికొడుతున్న ఎండలతో ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు గణనీయంగా తగ్గుతున్నాయి. పంటల చేతికందే దశలో సాగునీటి కటకట అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. పెంచికల్పేట్ మండలంలోని బొక్కివాగు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో ప్రాజెక్టు నుంచి కాలువల్లోకి నీళ్లు రావడం లేదు. 500 ఎకరాల్లో సాగు..పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామం వద్ద బొక్కివాగుపై 2వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 2012లో బొక్కివాగు ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.18 కోట్ల నిధులను వెచ్చించారు. ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయకట్టు కింద సుమారు 500 ఎకరాల్లో అన్నదాతలు వరి పంట సాగు చేస్తున్నారు. ఎండలకు బొక్కివాగు ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో కాలువల నుంచి పంట పొలాలకు నీరు చేరడం లేదు. రైతులు ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లు, పైపుల ద్వారా పొలాలకు నీటిని మళ్లిస్తున్నారు. అడుగంటిన నీరు..గతేడాది కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టు నుంచి పొలాలకు నీటి అందించే కుడి, ఎడమ కాలువల గేట్లు చెడిపోవడంతో ఏడాది కాలంగా నీరు వృథాగా పోయింది. ఎన్నో ఆశలతో యాసంగి సీజన్లో సాగు చేసిన చివరి తడికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్లూర్, పెంచికల్పేట్, మెరెగూడ గ్రామాలకు చెందిన రైతులు నీటిని పంట పొలాలకు తరలించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాజెక్టులో ఆయిల్ ఇంజిన్లు, మోటార్లు, పైపులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రాత్రి, పగలు తేడా లేకుండా ప్రాజెక్టు వద్ద పడిగాపులు కాస్తున్నారు. మోటార్ల ద్వారా నీటిని కాలువలోకి మళ్లించి అక్కడి నుంచి పంట పొలాలు తడుపుతున్నారు. అయినా కూడా కేవలం ప్రాజెక్టు సమీపంలో సాగు చేస్తున్న పంటలకు మాత్రమే నీరందుతోంది. దూర ప్రాంతాల్లోని పొలాల రైతులు దిగుబడుపై ఆశలు వదులుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. -
21న సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి
కాగజ్నగర్టౌన్: ఉపాధిహామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 21న చలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్ తెలిపారు. కాగజ్నగర్ మండలం భట్టుపల్లి, ఎన్జీవోస్ గ్రామాల కూలీలు దరిగాం అటవీ ప్రాంతంలో చేస్తున్న పనులను శుక్రవారం పరిశీలించారు. కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతున్న రెండు ఫొటోల విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుతో పథకాన్ని బలహీనపర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
పుట్టినరోజే ప్రమాదం.. ఆస్పత్రి నుంచే ఫిర్యాదు
సిర్పూర్(టి): మండలంలోని వేంపల్లి సమీపంలో బైక్, టాటా ఏస్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. ఆసిఫాబాద్కు చెందిన నికోడె జగన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం సిర్పూర్(టి) మండలంలోని టోంకిని దేవాలయానికి సోదరి శిల్పతో కలిసి బైక్పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా వేంపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు టాటాఏస్ ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ప్ర యాణికులు కాగజ్నగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిర్పూర్(టి) ఎస్సై సాగర్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. -
కిడ్నీ బాధితులకు ఊరట
కౌటాల: జిల్లాలో బాధితులకు డయాలసిస్ సేవలు చేరువకానున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రం, కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుతుండగా, తాజాగా జిల్లాకు మరో ఐదు డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోగులు వైద్యసేవల కోసం గంటల తరబడి ప్రయాణం చేయడం నరకప్రాయంగా మారింది. డయాలసిస్ దశలో మానసికంగా, శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ చితికిపోతారు. వడపోయని కిడ్నీలు.. ప్రస్తుతం జిల్లాలో వంద మందికి పైగా డయాలసిస్ బాధితులు ఉండగా, వీరికి రోజు విడిచి రోజు డ యాలసిస్ చేస్తున్నారు. మారుతున్న జీవన విధా నం, కలుషిత నీరు, రసాయనాలతో కూడిన ఆహా రంతో ఏటా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. చిన్న పిల్లలు సైతం ఈ వ్యాధి బారిన పడటం విషాదకరం. మహిళలైతే ఇంటి పనుల ధ్యాసలో పడి కిడ్నీల ఆరోగ్య స్థితిగతులను పూర్తిగా విస్మరిస్తున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే ఇతర అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే ఆహారం రుచించదు. ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. తరచూ వికారం, వాంతులు అవుతుంటాయి. మూత్రపిండాల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. అలసట, మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఐదు కొత్త కేంద్రాల మంజూరు మూత్రపిండాల చికిత్స పేద, మధ్య తరగతి ప్ర జలకు భారంగా మారడంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందించి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా జిల్లాలోని కిడ్నీ రోగులకు ఊరటనిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఐదు డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయగా, 25 రక్తశుద్ధి యంత్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ఈ నెల 15న ఉత్తర్వులు వెలువడ్డాయి. బెజ్జూర్, జైనూర్, తిర్యాణి సీహెచ్సీ లు, కౌటాల, కెరమెరి పీహెచ్సీల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ కేంద్రంలో ఐదు రక్తశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తారు. సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అర్ధరాత్రి వరకు డయాలసిస్ సెషన్లు నడుస్తున్నాయి. కొత్త కేంద్రాలు అందుబాటులోకి వస్తే ప్రయాణ భారం తగ్గడమే కాకుండా మెరుగైన సేవలు సకాలంలో అందుతాయి. గతంలో బాధితులు మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు సైతం వెళ్లేవారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
ఆసిఫాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం డీఎంహెచ్వో సీతారాంతో కలిసి పీహెచ్సీలు, సీహెచ్సీల వైద్యులు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావొద్దన్నారు. వేసవి నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాంక్షిత బ్లాక్, జిల్లా కార్యక్రమంలో భాగంగా గర్భిణుల వివరాలు వందశాతం నమోదు చేయాలని ఆదేశించారు. క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీ గ్రామాల్లో నెలకు రెండుసార్లు వైద్యబృందాలు సందర్శించాలని సూచించారు. -
శిక్షణ బాగుంది
పాలిసెట్కు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇస్తున్న ఉచితంగా శిక్షణ బాగుంది. ఉపాధ్యాయులు ప్రవేశ పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన విషయాలను తేలికగా అర్థమయ్యేలా చెబుతున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి తరగతులు కొనసాగుతున్నాయి. – కొండు వర్షిణి, జెడ్పీఎస్ఎస్, భట్టుపల్లి అర్థమయ్యేలా చెబుతున్నారు శిక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మధుకర్ సార్ మొదటి క్లాస్ తీసుకుంటున్నారు. సార్ వచ్చాక ముందుగా పోటీ పరీక్షలు ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశాలను అర్థమయ్యేలా చెబుతారు. అలాగే సాబిర్ సార్ లెక్కలు సులువుగా వివరిస్తారు. ఒకసారి వింటే అలా గుర్తుండిపోతుంది. – సమిరీన్, భట్టుపల్లి పేద విద్యార్థులకు వరం పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ మాలాంటి పేద విద్యార్థులకు వరం. ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణలో చేరాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతతో బోధన చేపట్టడం ఆనందంగా ఉంది. – జిల్లా ఐశ్వర్య, అందవెల్లి టెక్నికల్ కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులకు పదో తరగతి తర్వాత ఏం చేయాలనే దానిపై అవగాహన ఉండటం లేదు. కరోనా సమయంలో ఈ ప్రాంత విద్యార్థుల కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించాం. విద్యార్థులు టెక్నికల్ కోర్సుల వైపు వెళ్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. – కటుకం మధుకర్, శిక్షణ కోఆర్డినేటర్, జిల్లా సైన్స్ అధికారి సౌకర్యాలు కల్పిస్తున్నాం నాలుగేళ్లుగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులను హాజరయ్యే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఉదయం 11.15 గంటలకు స్నాక్స్, తాగునీరు అందుబాటులో ఉంటుంది. శిక్షణ పొందిన విద్యార్థులు మంచి కళాశాలల్లో సీటు సంపాదించి ఉన్నతస్థాయిలో ఉన్నారు. – వాసాల ప్రభాకర్, కోకన్వీనర్, కాగజ్నగర్ ఎంఈవో -
మంచి నిర్ణయం
కౌటాల ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా డయాలసిస్ కోసం కాగజ్నగర్, ఆసిఫాబాద్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. కౌటాలతో పాటు మరో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయం. రోగుల బాధలను గుర్తించి కేంద్రాలు మంజూరు చేయించిన ఎమ్మెల్సీ దండె విఠల్కు కృతజ్ఞతలు. వెంటనే ఈ కేంద్రాలను ప్రారంభించి రోగులకు సేవలు అందించాలి. – దుర్గం జానకీరావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, కౌటాల మెరుగైన వైద్య సేవలే లక్ష్యం కిడ్నీ రోగులు గతంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఆసిఫాబాద్, కాగజ్నగర్లోని డయాలసిస్ కేంద్రాల్లో బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. జిల్లాలో మరో ఐదు కేంద్రాల ఏర్పాటుకు నివేదికలు పంపించాం. మంజూరు ఉత్తర్వులు అందిన వెంటనే ఆయా కేంద్రాల్లో సేవలు ప్రారంభిస్తాం. – సీతారాం, డీఎంహెచ్వో -
నేడు నల్లబ్యాడ్జీలతో నిరసన
ఆసిఫాబాద్: రెండో పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భోజన విరామ సమయంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింగ్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమర్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కార్డులు అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఎటుకూరి శ్రీనివాసరావు, కాంపెల్లి ఊ షన్న, గర్రెపెల్లి కర్నాగౌడ్, అడె శ్రావణ్, అఖిల్, కృష్ణ, లకావంత్ శంకర్, ఉప్రే వినేశ్, జ్యోతి, సంధ్యారాణి, శార్వాణి, శ్రీపద తదితరులు పాల్గొన్నారు. -
‘అంగన్వాడీ ఫోన్లపై ఆరోపణలు నిరాధారం’
ఆసిఫాబాద్: పోషణ్ అభియాన్ కింద అంగన్వాడీ కార్యకర్తలకు అందించిన ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ మంత్రి సీతక్కపై చేసిన ఆరోపణలు నిరాధారమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంత్ చేసిన ఆరోపణలు ఖండించారు. రాజకీయ లాభం కోసం మంత్రి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ 2025– 26 ఆర్థిక సంవత్సరానికి 38,130 స్మార్ట్ ఫోన్లను కొనుగోలును తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా జెమ్ పోర్టల్లో పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు వక్రీకరించడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఉబేద్బిన్ యాహియా, కాట్కర్ భీమ్రావు, ప్రధాన కార్యదర్శులు గాదెవేణి మల్లేశ్, నాంపల్లి శంకర్, నాయకులు సిడాం తిరుపతి, రాము, మోహన్ పాల్గొన్నారు. -
రాజకీయ ముఖచిత్రంలో మార్పు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ, లోక్సభ స్థానాలు పెరగనున్నా యి. దీంతో నాయకులకు అవకాశాలూ రానున్నా యి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల పెంపు కోసం బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ స్థానాల సంఖ్య పెంచేందుకు పునర్విభజన బిల్లు ఆమోదం కోసం చర్చ జరుగుతోంది. ఇక నియోజకవర్గాల పు నర్విభజన కోసం డీ లిమిటేషన్ కమిషన్ సైతం ఏ ర్పాటు చేస్తున్నారు. దీంతో ఒకేసారి అటు మహిళా నాయకులకు అవకాశాలు, ఇటు సీట్ల పెంపుతో అందరికీ అవకాశాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో 50 శాతం చొప్పున స్థానాలు పెంచితే రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు 543 పార్లమెంటు స్థానాలు ఉండగా.. ఈ సంఖ్య 850కి చేరుతుంది. రాష్ట్రంలో ఎంపీ స్థానాలు ప్రస్తుతం 17ఉండగా.. కొత్తగా తొమ్మిది పెరిగి ఆ సంఖ్య 26 స్థానాలకు చేరుతుంది. ఇక రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా 179 స్థానాలకు పెరుగుతాయనే అంచనా ఉంది. కొత్తగా 60 స్థానాలు పెరగనున్నాయి. 2011 ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనాభా 19 లక్షలు ఉంది. మహిళా జనాభా అధికంగా ఉండడంతో ఇక్కడ సీట్లు సైతం మహిళలకు రిజర్వు కానున్నాయి. ప్రస్తుతం మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లులపై పార్లమెంటులో చర్చ కొనసాగుతోంది. ఆమోదం పొందితే మహిళలకు అవకాశాలు కలుగనున్నాయి. పునర్విభజన బిల్లుతో కొత్త స్థానాలు ఏర్పడనున్నాయి. ఎవరికి వారే అంచనాలు ఉమ్మడి జిల్లాలో కొత్తగా నియోజకవర్గాల పెంపుతో రాజకీయ ముఖచిత్రమే మారనుంది. ప్రస్తుతం పది అసెంబ్లీ స్థానాలైన ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చె న్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్ ఉండగా, లోక్సభ స్థానాలు ఆదిలాబాద్, పెద్దపల్లి ఉన్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనే అంచనా ఉంది. మొత్తం స్థానాలు 14లేదా 15కావొచ్చు. ఇక లోకసభ స్థానం కొత్తగా ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో కొత్తగా కనీసం ఐదు నుంచి ఆరుగురు ప్రజాప్రతినిధులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏ నియోజకవర్గం, ఏ మండలంతో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుందని ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సైతం మారనున్నాయి. మహిళలకు 33 శాతం కోటా అమలుతో ఉమ్మడి జిల్లాలో కనీసం నాలుగు స్థానాలు రిజర్వు కానున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లోనూ మార్పులు, చేర్పులు రా నున్నాయి. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా, మాజీలు, రాజకీయ ఆశావహులు ఎక్కడ పో టీ చేయాలో అని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక మహిళలకు రిజర్వు చేసిన చోట్ల తమ కుటుంబ సభ్యుల నుంచి మహిళా నాయకులను ప్రోత్సహించనున్నారు. కొన్ని చోట్ల తమ మండల కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. అయితే జిల్లా భౌగోళిక సరిహ ద్దు, జనాభాను బట్టి ఏ ప్రాంతం కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడుతుందనేది ఇంకా స్పష్టత లేదు.2011 ప్రకారం ఉమ్మడి జిల్లాలో.. -
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
కాగజ్నగర్టౌన్: అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో గురువారం డీఎస్పీ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఆటో, ట్రక్, బస్, లారీ డ్రైవర్లకు వైద్యులు కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సరైన చూపు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతీ డ్రైవర్ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
● పాలిసెట్, ఇతర పోటీ పరీక్షలపై విద్యార్థులకు కోచింగ్ ● జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ● నిపుణులతో బోధన
కాగజ్నగర్టౌన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులు పేదింటి విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నాయి. కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో ఈ శిక్షణ శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులను పాలిసెట్, టీజీఎస్డబ్ల్యూఆర్జేసీసీఈటీ, టీజీఆర్జేసీ, సైనిక్ స్కూల్, తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నారు. జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ ఆలోచనలతో డీఈవో పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం ఆయా సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తున్నారు. ఓ వైపు బోధన కొనసాగిస్తూనే మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలపై పట్టు పెంచేలా సందేహ నివృత్తి సెషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 120 మంది చేరగా, ఇంకా ప్రవేశాల కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నిపుణుల మార్గదర్శనం ఉచిత శిక్షణలో భాగంగా ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించడం, వారానికి ఒకసారి పరీక్షలు నిర్వహించడం, బలహీన విద్యార్థులకు అదనపు క్లాసులు ఏ ర్పాటు చేస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతిఒక్కరూ విజయం సాధించేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి శిక్షణ కేంద్రాలను మరిన్ని మండలాలకు విస్తరించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఫలితాలు మెరుగుదల ఈ శిక్షణ తరగతులకు ఆసిఫాబాద్, కాగజ్నగర్, దహెగాం, కౌటాల, పెంచికల్పేట్ మండలాల వి ద్యార్థులు ఎక్కువగా హాజరవుతున్నారు. గత మూడేళ్లుగా గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నారు. 2023లో పాలిటెక్నిక్లో 108 మంది విద్యార్థులు శిక్షణ పొందితే 98 మంది అర్హత సాధించగా, 2024లో ఈ సంఖ్య పెరిగి 150 మందికి 121 మంది అర్హత సాధించారు. 2025లో కూడా అదే ఉత్సాహంతో 150 మందికి 125 మంది పాలిటెక్నిక్, గురుకులాల్లో సీటు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉచిత కోచింగ్ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. -
లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి
కాగజ్నగర్టౌన్: విద్యార్థుల లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిసెట్, తెలంగాణ సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల ఉచిత కోచింగ్ శిబిరాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా విద్యాధికారి లలితతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని, క్రమశిక్షణతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులకు అంకితభావంతో ఉచిత కోచింగ్ అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్, జిల్లా సైన్స్అధికారి కటుకం మధుకర్, ఎంఈవో వాసాల ప్రభాకర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ అధికారి దేవాజీ, విలీన విద్య కోఆర్డి నేటర్ శాంతికుమారి, విషయ నిపుణులు ధర్మపురి వెంకటేశ్వర్లు, మహ్మద్ షాబీర్, దుర్గమోహన్, మామిడాల తిరుపతయ్య, శ్రీశైలం, రవికుమార్, తిరుపతి, త్రివేణి, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు శాంతికుమార్ పాల్గొన్నారు. -
‘నవోదయ’లో వందశాతం ఉత్తీర్ణత
కాగజ్నగర్టౌన్: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. కాగజ్నగర్ పట్టణంలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 80 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. 600 మార్కులకు జె.ఆదిత్య 584(97శాతం), లక్ష్మి ప్రణవి 575(96.4శాతం), ఎన్.బబ్లు 566(96 శాతం), చప్పిడి స్నేహాల్ 573(95.5శాతం) మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. రేపు విశ్రాంత ఉద్యోగుల నిరసనఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్ణాగౌడ్ తెలిపారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టి అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
రహదారి నిబంధనలపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్అర్బన్: రహదారి నిబంధనలపై ప్రతిఒక్కరికి అవసరమని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమలగార్డెన్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాల ప్రదేశంలోని రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి స్కూల్లో నిబంధనలపై సైన్ బోర్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని కోరారు. అనంతరం విద్యార్థులతో రహదారి నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. డీఈవో లలిత, డీటీవో రాంచందర్, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం చేయాలి జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం చేసి మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో, టీ ఫైబర్ టవర్ల నిర్మాణాలు, స్థల ఎంపికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ భారత్ నిధి కింద బీఎస్ఎన్ఎల్ మంజూరైన 24 టవర్ల నిర్మాణానికి స్థలాల ఎంపిక చేపట్టాలన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, బీఎస్ఎన్ఎల్ అధికారులు సంయుక్తంగా సర్వే పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్వో నీరజ్కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతిగౌడ్, విద్యుత్శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, పీఆర్ ఈఈ ధర్మేందర్, భగీరథ ఈఈ సిద్దిఖ్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు
కాగజ్నగర్టౌన్: తల్లిదండ్రులకు అవగాహ న కల్పించేందుకు ‘నాన్న మా భద్రత కోసం హెల్మెట్ కొని పెట్టుకోండి’ అనే అంశంపై కాగజ్నగర్ పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులకు బుధవారం డీఎస్పీ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ప్రాముఖ్యత, కుటుంబ సభ్యుల భద్రతపై అభిప్రాయాలు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హె ల్మెట్ ధరించాలని, ప్రాణరక్షణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్వో రమాదేవి, ఎస్సైలు సుధాకర్, రాజు పాల్గొన్నారు. -
యాప్తో ఇబ్బందులెన్నో..!
రెబ్బెన మండలం గోలేటికి చెందిన ఆజ్మెర సుక్లాల్ ఉపాధి పనులకు వెళ్తున్నాడు. పని ప్రదేశంలో ఆన్లైన్ ద్వారా ఐరీస్ (కంటి పాపల ఆధారంగా) హాజరు నమోదుకు ప్రయత్నించగా మొదటిరోజు తీసుకోలేదు. ఈజీఎస్ సిబ్బంది కేవైసీ చేయడంతో రెండోరోజు హాజరు సాధ్యమైంది. మూడో రోజు మళ్లీ రెండు కిలోమీటర్ల దూరంలోని పని ప్రదేశానికి వచ్చి హాజరు పడకపోవడంతో పని చేయకుండానే తిరిగి వెళ్లిపోయాడు... ఇది కేవలం సుక్లాల్కు ఎదురైన ఇబ్బంది మాత్రమే కాదు.. జిల్లాలో దాదాపు 20శాతం కూలీలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. తిర్యాణి: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్(వీబీ జీ రాం జీ)గా మార్పు చేసింది. గతంలో జాబ్కార్డు కలిగిన కుటుంబానికి వందరోజుల పనిదినాలు కల్పించగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 125 రోజుల పని దినాలు అమలు చేస్తున్నారు. జిల్లాలో 1.22 లక్షల జాబ్కార్డులు ఉండగా ఇందులో 84 వేల కార్డులు యాక్టివ్గా ఉన్నాయి. 1.52 లక్షల కూలీలు ఉన్నారు. పథకం ప్రారంభం నుంచి నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ వినియోగించారు. దాని ప్రకారం కూలీల హాజరు మ్యానువల్గా తీసుకునేవారు. అలాగే చేసిన పనితోపాటు అదనపు భత్యాలు(వేసవి భత్యం) కూలితో కలిపి 30 శాతం అదనంగా ఇచ్చేవారు. పనిప్రదేశం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే కిలోమీటర్కు కొంత చొప్పున చెల్లించేవారు. తాగునీటికి సైతం డబ్బులు వేతనాల్లో జమ చేసేవారు. కానీ నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్లో ఈ సదుపాయాలన్నీ తొలగించారు. కేవలం చేసిన పనికి మాత్రమే వేతనంగా చెల్లిస్తున్నారు. ఆన్లైన్లో హాజరు..ప్రస్తుతం పనులకు సంబంధించి హాజరు అంతా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎన్ఎంఎస్) యాప్లో వివరాలు పొందుపరుస్తున్నారు. ఉదయం పూట ఒకసారి, మధాహ్నం తర్వాత మరో ఫొటోను(మొదటి ఫొటో అప్లోడ్ చేసిన నాలుగు గంటల తర్వాత) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఉదయం తీసుకునే ఫొటోలో కచ్చితంగా ఒక్కో కూలీకి సంబంధించిన ఐరీస్ ఉండాలి. మధ్యాహ్నం గ్రూప్ ఫోటోను అప్లోడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది కూలీలకు సంబంధించిన ఐరీస్ను సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదు. దీంతో వారు పనులు చేయకుండానే ఇంటికి వెళ్తున్నారు. ఒక్కోసారి కూలీల ఐరీస్ ఒకరోజు తీసుకుంటే.. మరోరోజు ఐరిస్ తీసుకోకుండా ఫేస్ మిస్ మ్యాచ్ అని చూపిస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్లైన్ హాజరుకు అధిక సమయం పడుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోతుండటంతో పని ప్రదేశంలోనే నాలుగు గంటలకు పైగా ఉండాల్సి వస్తోంది. గతేడాది ఇదే సీజన్లో 20 వేలకు పైగా కూలీలకు పనులకు వెళ్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 10 వేలు కూడా దాటడం లేదు. తిర్యాణి మండలంలోని గోవెన వంటి పంచాయతీలోని గ్రామాలకు ఎలాంటి సిగ్నల్స్ అందుబాటులో లేక పనులు చేపట్టడం లేదు.పథకం రద్దు చేయాలని కుట్రలు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చేసి పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగానే రెండు ఫొటోల విధానాన్ని తీసుకొచ్చింది. చాలా మంది కూలీలకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ కాకపోవడంతో పని చేయకుండానే వెనుదిరుగుతున్నారు. పాత విధానంలోనే పనులు చేపట్టి, కనీస వేతనం రోజుకు రూ.800 చెల్లించాలి. – ముంజం ఆనంద్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ -
హిందువులు ఏకతాటిపై నడవాలి
కౌటాల: సమాజ శ్రేయస్సు, సనాతన ధర్మ రక్షణకు హిందువులందరూ ఏకతాటిపై నడవాలని మహాదేవ్ ధర్మ పీఠం గుడిమెట్ సద్గు రు మహదేవ్ స్వామిజీ అన్నారు. కౌటాల మినీ స్టేడియంలో బుధవారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం బ్రిటిష్ పాలనలో స్వామి వివేకానంద చేసిన కృషిని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో హరణ్ఘట్ మహారాష్ట్ర శ్రీసంత్ మరళీధర్ మహరాజ్, ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ కల్వగురి ప్రభుకుమార్, కౌటాల సర్పంచ్ నక్క శంకర్, నిర్వాహకులు దౌలత్, ఎల్ములే దత్తు, ప్రభీర్, సత్యనారాయణ, కుంచాల విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
‘గుర్తింపు’ ఎన్నికలు నిర్వహించాలని వినతి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర కమిషనర్ ఆఫ్ లేబర్ పమేలా సత్పతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ నాయకులు వినతిపత్రం అందించారు. సిర్పూర్ పేపర్మిల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు జె.మల్లికార్జున్ మాట్లాడుతూ 2018 ఆగస్టు 2న జేకే పేపర్ లిమిటెడ్ యాజమాన్యం ఎస్పీఎంను టేకోవర్ చేసుకుందని, 373 మంది పర్మినెంట్, 2,188 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఇండస్ట్రీయల్ రిలేషన్ కోడ్ 2020 సెక్షన్–14(1)టు(4) ప్రకారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్కు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే పాత్ర లేదని కేసు వేసిందని పేర్కొన్నారు. అనేక పరిశ్రమల్లో పాత చట్టం ప్రకారమే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీఎంలోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ పేపర్మిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్, రాష్ట్ర కోశాధికారి రాములు పాల్గొన్నారు. -
ఏడాదిగా నిరీక్షణ!
జిల్లా కేంద్రానికి చెందిన అనుముల గణేశ్ వాంకిడి మండలంలో మూడు ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఎల్ఆర్ఎస్ పథకంలో భాగంగా ఒక్కో ప్లాట్కు రూ.వెయ్యి చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మూడు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఏడాది క్రితం రూ.43,785 చెల్లించగా, ఇప్పటివరకు ఫైనల్ సర్టిఫికెట్ జారీ కాలేదు. ఇంటి నిర్మాణం, విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్ లేక పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. వాంకిడి పంచాయతీ, డీపీవో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదు. -
● వేసవిలో భూసార పరీక్షలు చేయించడం ఉత్తమం ● ఆదిలాబాద్కు నమూనాలు పంపితే నెల రోజులకు రిపోర్టు ● రైతులకు అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వం
దహెగాం: నేల తల్లి ఆరోగ్యం బాగుంటేనే.. రైతు ఇంటికి సిరి సంపదలు చేరుతాయి. విత్తనాలు, వర్షాలపైనే కాకుండా భూమిలోని పోషకాలపై కూడా దిగుబడులు ఆధారపడి ఉంటాయి. రైతులు ఇష్టారీతిన రసాయన ఎరువులు వినియోగించడం ద్వారా ఓ వైపు పెట్టుబడి భారమవుతుండగా, నేల కూడా నిస్సారమవుతోంది. చాలామంది అవగాహన లేక ఏటా ఒకే పంట పండించడంతోనూ భూమిలో నిర్దిష్ట పోషకాలు హరించుకుపోయి దిగుబడిపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్కు ముందు వేసవిలో భూసార పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ప్రస్తుతం యాసంగి సాగు కూడా ముగింపు దశకు చేరుకుంది. వరి, మొక్కజొన్న పంటలు మరికొద్ది రోజుల్లో కోతకు రానున్నాయి. అనంతరం పంట పొలాలు బీడుగా ఉంటాయి. ఇదే భూసార పరీక్షలకు ఇదే అత్యంత అనువైన సమయం. జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండటంతో వేసవిలో మట్టి నమూనాలు సేకరించడం సులభం. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎర్ర నేలలు ఎప్పుడూ పొడిగానే ఉండటంతో ఆయా ప్రాంతాల్లో నమూనాలు సేకరణ, పరీక్షలు ఎప్పుడైనా చేయొచ్చు. ఆదిలాబాద్లో ఎస్టీఎల్ జిల్లావ్యాప్తంగా సుమారు 4.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో స్థానికంగా భూసార పరీక్ష కేంద్రం(ఎస్టీఎల్) లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ల్యాబ్పైనే ఆధారపడాల్సి వస్తోంది. రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను అధికారులు ఆదిలాబాద్లోని సాయిల్ టెస్ట్ ల్యాబ్కు పంపిస్తారు. అక్కడ పరీక్షలు పూర్తయ్యాక భూమిలో ఉన్న పోషకాల వివరాలతో కూడిన రిపోర్ట్ ఇస్తారు. దీని ఆధారంగా ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో తెలుస్తుంది. మట్టి నమూనా పంపిన నెల రోజుల్లో ఈ నివేదిక అందుతుందని అధికారులు చెబుతున్నారు. మూలకు చేరిన నమూనా ల్యాబ్లు మట్టి నమూనాలను ఆదిలాబాద్ పంపడం ద్వారా జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి 2018లో ప్రభుత్వం మండల కేంద్రాలు, క్లస్టర్ల వారీగా భూసార పరీక్ష మిషన్లను మంజూరు చేసింది. వీటికి అవసరమైన కెమికల్స్ కూడా రెండేళ్లపాటు సరఫరా చేశారు. అప్పట్లో పరీక్షలు బాగానే జరిగాయి. కానీ రసాయనాల సరఫరా నిలిచిపోవడంతో ఆ మిషన్లన్నీ మూలకు చేరాయి. రూ.లక్షల విలువైన పరికరాలు ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు అధికారులు సైతం సరైన రీతిలో రైతులకు మట్టి పరీక్షలపై అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు స్పందించి పరికరాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు. -
అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం
ఆసిఫాబాద్: అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం.. అన్నివర్గాలకు ఆర్థిక సామాజిక న్యాయం, రాజకీయ రంగాల్లో సమన్యాయం కల్పించడం కోసం అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావే శ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సి ర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడు తూ ప్రపంచ దేశాలు అంబేడ్కర్ ఆలోచనలపై దృష్టి సారిస్తున్నాయన్నారు. అలాంటి మేధావి భారత పౌరుడు కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. యువత విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ అంబేడ్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదని, సమానత్వం, స్వేచ్ఛ, అంటరానితనం నిర్మూలన, సోదర భావం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. విద్యార్థులకు అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్కుమార్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి అశోక్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నేత శ్యాంనాయక్, కుల సంఘాల ప్రతినిధులు దుర్గం తుకారాం, కేశవరావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
కాగజ్నగర్టౌన్: అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేడ్క ర్ 135వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత, మున్సిపల్ కమిషనర్ తిరుపతి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మాట్లాడు తూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహాత్తర విలువలను రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన చూపిన మార్గం సమాజానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేడ్కర్ రచించిన రాజ్యంగంతోనే ఈ రోజు దేశం అవిచ్ఛిన్న భూ భాగంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తి వంచనలేకుండా కృషి చేస్తామన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కా ర్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కౌన్సి లర్లు దుర్గం సూరజ్, ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, సమత సొసైటీ అధ్యక్షుడు దుర్గం జనార్ధన్, ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేస్తున్న ఎమ్మెల్సీ విఠల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే హరీశ్బాబు -
జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యం
సలహాలు, సూచనలు తునికాకు సేకరణలో కూలీలపై ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ అటవీ అధికారులు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ప్రజలు నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. తునికాకు పేరుస్తున్న ఓ కుటుంబం(ఫైల్)డివిజన్ యూనిట్లు కల్లాలు స్టాండర్డ్ బ్యాగులు కట్టలు ఆసిఫాబాద్ 2 22 5700 57,700 కాగజ్నగర్ 11 139 17700 1,77,000 మొత్తం 13 161 23,400 2,34,000 చింతలమానెపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వేసవి పంటగా తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఆర్థికంగా ఆసరా అందిస్తోంది. జిల్లాలో మే నెలలో తునికాకు సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జిల్లాలో 13 యూనిట్లలో 161 కల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఆసిఫాబాద్ అటవీ డివిజన్లో జోడేఘాట్, రెబ్బెన రేంజ్లో గిరవెల్లి, కాగజ్నగర్ అటవీ డివిజన్లో బె జ్జూర్, సలుగుపల్లి, గూడెం, ఖర్జెల్లి, చీలపెల్లి, ము త్తంపేట్, కొత్తపేట్, అనుకోడ, పెంచికల్పేట్, లోనవెల్లి, డబ్బా యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. టెండర్లు పూర్తిజిల్లాలో సేకరించే తునికాకు నాణ్యత పరంగా రాష్ట్రస్థాయిలో పేరు పొందింది. ఖర్జెల్లి రేంజ్లోని గూ డెం, బెజ్జూర్ రేంజ్ పరిధిలోని బెజ్జూర్, సలుగుపల్లి యూనిట్లలో సేకరించే తునికాకు ప్రత్యేక గుర్తిపు ఉంది. ఈ ఏడాది తునికాకు సేకరణలో భాగంగా యూనిట్లకు అటవీశాఖ టెండర్లను ఆహ్వానించింది. ఫిబ్రవరిలోనే టెండర్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. కొమ్మ కొట్టడం పూర్తి కాగా, మే మొదటి వారం నుంచి తునికాకు సేకరణ ప్రారంభించే అవకాశం ఉంది. 161 కల్లాల పరిధిలో 23,400 స్టాండర్డ్ బ్యాగులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది కూలీలకు కట్టకు రూ.3.40 చెల్లించనున్నారు. సుమారుగా 20వేల మంది ఉపాధి పొందుతారని అంచనా వేస్తున్నారు. ఓ వైపు వన్యప్రాణులు.. మరోవైపు ఎండలుజిల్లాలో తునికాకు సేకరణలో ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులను కూలీలు ఎదుర్కోనున్నారు. అటవీ శాఖ ఆంక్షలు లేవని అధికారులు చెబుతుండగా, వన్యప్రాణులు, పెద్ద పులుల సంచారంతో కూలీల్లో కొంత ఆందోళన ఉంది. గతంలో కాగజ్నగర్ డివిజన్లో పులుల కదలికలతో తునికాకు సేకరణ లో ఆటంకాలు ఎదురయ్యాయి. మరోవైపు మండతున్న ఎండలతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యా యి. కూలీలకు ప్రమాదవశాత్తు వన్యమృగాల ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినా.. ఎండదెబ్బ కా రణంగా మరణించినా బీమా సౌకర్యం కల్పించి పరిహారం అందించనున్నారు. వేసవిలో ఉపాధి అందించే తునికాకు సేకరణలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేస్తున్నా రు. తునికాకు ద్వారా ప్రభుత్వానికి ఆదా యం వస్తున్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కట్ట ధర పెంచాలని, బోనస్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అందించే పరిహారం పెంచాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్యం, మందులను అందుబాటులో ఉంచాలని విన్నవిస్తున్నారు. విజయవంతంగా నిర్వహిస్తాం తునికాకు సేకరణ విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోనే కాగజ్నగర్ డివిజన్లో లభించే తునికాకు నాణ్యతలో ఉత్తమమైందిగా పేరుగాంచింది. కూలీలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ అధికారులు అందించే సలహాలు, సూచనలు పాటించాలి. – అప్పయ్య, కాగజ్నగర్ డివిజన్ అటవీ అధికారి వేసవి పంట.. -
నూతన సంవత్సరాది.. ‘పోయ్లా బైసాఖి’
చింతలమానెపల్లి: బెంగాలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలు నూతన సంవత్సర పండుగ శోభను సంతరించుకున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బెంగాలీల కొత్త సంవత్సరం పోయ్లా బైసాఖి వేడుకలు మంగళవారం సంబు రంగా ప్రారంభమయ్యాయి. పండుగ నేపథ్యంలో మహదేవుడు శివుడికి భారీగా పూజలు నిర్వహించా రు. తారక్నాథ్ రూపంలో ప్రత్యేక దైవానికి సామూహికంగా పూజలు చేసి గత సంవత్సరానికి వీడ్కోలు పలికారు. వైశాఖ మాసం మొదటి రోజును పురస్కరించుకుని గణపతి, లక్ష్మీదేవి, దుర్గాదేవిలకు ఇళ్లలో పూజలు చేసి సంవత్సరానికి స్వాగతం పలికారు. భగవతి పూజలో భాగంగా పశువులను పూజించారు. తులసీమాతకు జలాభిషేకం, గంగాపూజ చేశారు. ఇళ్లను ప్రత్యేకంగా అలంకరించి దీపాలను వెలిగించారు. బుధవారం సైతం పూజలు, కార్యక్రమాలను కొనసాగించనున్నారు. పవిత్ర మాసం వైశాఖంపోయ్లా అనేది పెహలా అనే హిందీ పదం నుంచి వచ్చింది. బైసాఖి అనేది సంవత్సరంలో వచ్చే మొదటి నెలను సూచిస్తుంది. వైశాఖమాసం ప్రారంభాన్ని నూతన సంవత్సరాదిగా బెంగాలీలు జరుపుకొంటున్నారు. ఏటా ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో ఈ పండుగ వస్తుంది. తెలుగు సంవత్సరాది ఉగాది అ నంతరం ఉత్సవాలు జరుపుకోవడం విశేషం. బెంగాలీ నెలలు 12 కాగా.. ఒక్కో నెలలో 32 రోజులు, 31, 30, 29 రోజులు కూడా ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 14న నూతన సంవత్సరం ప్రారంభమైంది. 14, 15 తేదీల్లో రెండు రోజులపాటు మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ప్రత్యేక కార్యక్రమాలునూతన సంవత్సరాదిని పురస్కరించుకుని బుధవా రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నూతన కార్యక్రమాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, గృహ నిర్మాణాలు ప్రారంభించడం, గృహ ప్రవేశం, వ్యాపారులు కూడా వాణిజ్య ఖాతా పుస్తకాలను ఈ రోజే ప్రారంభిస్తారు. హల్ ఖాతాగా పిలిచే ఈ సందర్భాన్ని వ్యాపారులు పవిత్రంగా భావిస్తారు. మరోవైపు కాగజ్నగర్ మండలం ఈస్గాం, నజృల్నగర్, నామానగర్, సీతానగర్, చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్– 1, రవీంద్రనగర్– 2, సిర్పూర్(టి) మండలంలోని లక్ష్మిపూర్ వేడుకలకు వేదికగా నిలుస్తున్నాయి. -
రహదారి నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్అర్బన్: రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కా రులో ప్రయాణించేవారు సీట్ బెల్టు ధరించా లని సూచించారు. మద్యం తాగి నడపడం, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు తరలించాల ని, గోల్డెన్ అవర్లో బాధితులను ఆస్పత్రుల కు తరలిస్తే రహవీర్ పథకం ద్వారా రూ.25వేల నగదు పురస్కారం అందిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రహదారి నిబంధనలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్ లేని ప్రయాణాల్లో తలకు గాయాల తీరును వాటర్ మిలన్లో ట్రయల్ చేసి ప్రదర్శించా రు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, జిల్లా రవాణా అధికారి రాంచందర్ పాల్గొన్నారు. -
అగ్నిమాపక భద్రత నియమాలు పాటించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రతీ పౌరుడు అగ్నిమాపక భద్రతా నియమాలు పాటించాలని వాసవీ క్లబ్ అధ్యక్షుడు ఉదయ్బాబు, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సురేశ్కుమార్ అన్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బందిని వాసవీ క్లబ్ సభ్యులు సత్కరించారు. జిల్లా అధికారి సురేశ్కుమార్ మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబై నౌకాశ్రయంలోని విక్టోరియా డాక్ వద్ద ఎస్ఎస్ ఫోర్ట్ స్టికై న్ నౌకలో భారీ పేలుడు సంభవించిందని, మంటలు అదుపు చేయడంలో 66 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నివాళిగా ఏటా అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాల నివారణ
రెబ్బెన: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించవచ్చని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోలేటి టౌన్షిప్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా విలువైన ప్రాణాలను రక్షించుకోవచ్చని అన్నారు. యువత ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు. -
నేడు హిందూ మహా సమ్మేళనం
కౌటాల: మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం హిందూ మహా సమ్మేళ నం నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ విభాగ్ సహా కార్యవహా మాధవరం రంగస్వామి తెలిపా రు. స్థానిక వాసవీమాత ఆలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ సమ్మేళనానికి మహాదేవ్ ధర్మ పీఠం గుడిమెట్ సద్గురు మహాదేవ్ స్వామిజీ హాజరవుతారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న సమ్మేళానికి ఏర్పాట్లు చేశామన్నారు. హిందువులందరూ సకాలంలో హాజ రు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు దౌలత్, ఎల్ములే దత్తు, ప్రభీర్, సత్యనారాయణ, కుంచాల విజయ్, అనిల్, తిరుపతిరెడ్డి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండతో ఉక్కిరిబిక్కిరి
కాగజ్నగర్టౌన్: ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అ వుతున్నారు. సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సి యస్ దాటాయి. మరో వారం పాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేడి, ఉక్కపోత పెరిగిన నేపథ్యంలో అధికా రులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. మొన్నటి వరకు 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదుకాగా, మంగళవారం పలు మండలాల్లో 43 డిగ్రీలకు చేరువగా నమోదయ్యాయి. వడగాల్పులు తీవ్రత కూడా పెరిగింది. వడదెబ్బ ముప్పురోజురోజుకూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తీసుకోవాలి. శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. బయటి వాతావరనంలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటినప్పుడు శరీ రం ఎండ ప్రభావానికి లోనవుతుంది. ఉక్కపోతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో చల్లబడేందుకు శరీరం నుంచి చెమట వస్తుంది. తగిన నీటిని తీసుకోకుండా, ఎండల్లో తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండటం ఉత్తమం. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉప్పు కలిపిన మజ్జిగ లేదా పళ్ల రసాలు, చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు తాగాలి. తెల్లని వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. తప్పనిసరిగా గొడుగు, నెత్తిపై టోపి వాడాలి. కనీసం ఐదు లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. తక్షణ వైద్యం అందించాలి వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ప్రదేశానికి చేర్చాలి. శరీరంపై దుస్తులను తొలగించి చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఐస్ముక్కల ను గుడ్డతో ఉంచి శరీరం అంతా అద్దితే చాలా మంచిది. శరీరమంతా చల్లని గాలి తగిలేలా చూ డాలి. బాధితుడికి చల్లని నీరు లేదా ఉప్పు, ఇతర లవణాలు కలిగిన నీటిని తాగించాలి. అపస్మారక స్థితిలో ఉంటే నీరు తాగించొద్దు. స్పృహ కోల్పోతే మాత్రం సమయం వృథా చేయకుండా తక్షణ వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేయాలి. – డాక్టర్ అవినాష్, సూపరింటెండెంట్, కాగజ్నగర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిజిల్లాలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్లో)ప్రాంతం ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ 42.7 సిర్పూర్(టి) 42.6 రెబ్బెన 42.5 కెరమెరి 42.5 తిర్యాణి 42.1 కాగజ్నగర్ 41.7 వాంకిడి 41.5 బెజ్జూర్ 40.8 కౌటాల 40.7 చింతలమానెపల్లి 40.6 పెంచికల్పేట్ 40.3 దహెగాం 40.1 -
సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి
ఆసిఫాబాద్: నీతి ఆయోగ్ కార్యక్రమాల్లో భాగంగా సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సాధించాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారి రజత్కుమార్ సైనీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సంబంధిత అధికారులతో సంపూర్ణత అభియాన్ 2.0లో అమలవుతున్న పనులు లక్ష్యాల సాధనపై కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. తిర్యాణి బ్లాక్, జిల్లా బ్లాక్ల కోసం ప్రణాళిక రూపొందించాలని, అంగన్వాడీల్లో పిల్లల సామ్ మామ్ కార్యక్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి సరైన చికిత్స అందించాలని సూచించారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషణ దినోత్సవ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ల నిర్మాణాలను వందశాతం పూర్తి చేయాలని, పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మించి వచ్చే విద్యాసంవత్సరంలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో సంపూర్ణత అభియాన్లో భాగంగా కలెక్టర్ హరిత, డీఎంహెచ్వో సీతారాం, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుబోధ్కుమార్, జీజేహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్లతో కలిసి అంబులెన్స్ను ప్రారంభించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సంపూర్ణత అభియాన్ జిల్లా సమన్వయకర్త బాలరాజు పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంలో పరీక్షకు..
శ్రీరాంపూర్: ఒక వైపు ఇంట్లో తండ్రి శవం.. మరోవైపు పదోతరగతి పరీక్షలు.. అయినా తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయవద్దనే ఉద్దేశంతో పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుమారుడు పరీక్షకు హాజరై చదువు ప్రాముఖ్యతను చాటిచెప్పాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీరాంపూర్ ఏరియా కొత్తరోడ్కు చెందిన మండల రాజయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు వరుణ్ పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం దుఖఃంలోనే పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొనడం అందరినీ కంటతడి పెట్టించింది. గిమ్మలో... సాత్నాల: భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన అర్ధాంగి నీలమ్మ ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. మృతురాలి కుమారుడు సాయిచరణ్కు సోమవారం పదోతరగతి చివరి పరీక్ష ఉంది. ఏంచేయాలో పా లుపోని స్థితిలో ఉన్న సదరు విద్యార్థికి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతో కన్నీళ్లు తుడుచుకుంటూ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష పూర్తయిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. -
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తారు
శ్రీరాంపూర్: రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు. జ్యోతిరావుపూలే, అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఆ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ కార్మికులు రక్తదానం చేసేందుకు ముందుకురావడం హర్షనీయమన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో రక్తం అందక, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వారు రక్తం కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాంటి వారికి అండగా ఉండేందుకు కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా 146 యూనిట్లు రక్తనిధిని రెడ్ క్రాస్ వైద్యులు సేకరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంగళ శ్రీనివాస్, నాయకులు మిడివెల్లి శ్రీణివాస్, సాయిల శ్రీనివాస్, తోడే సుధాకర్, శ్రీపతి బానేశ్, పెరక సదానందం, రెడ్క్రాస్కు చెందిన కాసర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
వినతులిచ్చి.. గోడు చెప్పుకుని
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. అధికారులకు వినతిపత్రాలు అందించి.. తమ గోడు చెప్పుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ డేవిడ్ అన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నూర్నగర్కు చెందిన సాజిదా బేగం, వాంకిడి మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. కెరమెరి మండలం ముకద్దంగూడకు చెందిన రాథోడ్ మనిషా గత సర్పంచ్ ఎన్నికలో పోటీ చేసిన పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరింది. తనకు అనువంశికంగా సంక్రమించిన భూమిని కొంతమంది దౌర్జన్యంగా కబ్జా చేశారని, విచారణ జరిపి న్యాయం చేయాలని ఆసిఫాబాద్ మండలం సాలెగూడకు చెందిన ముంజం బాగుబాయి కోరింది. తమ గ్రామంలోని బాగున్న సీసీ రోడ్డుపై అనవసరంగా మరో సీసీ వేస్తున్నారని, విచారణ చేపట్టాలని కెరమెరి మండలం మహరాజ్గూడకు చెందిన రాథోడ్ విజయ్ ఫిర్యాదు చేశాడు. వ్య వసాయ భూమిలో బోరుబాయి వేయించాలని ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్కు చెందిన దుర్గం హొక్కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, ఇప్పటికైనా తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం ఇప్పలనవగాంకు చెందిన మహమ్మద్ దరఖాస్తు చేసుకున్నాడు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. తప్పుడు సమాచారం నమోదైంది నా భర్త రాజు 13 ఏళ్లక్రితం గుండెపోటుతో మరణించారు. నాకు కుమార్తె ఉంది. జిల్లా కేంద్రంలోని బజార్వాడిలో ఇంటి నం.3–399/1/ఏ/1లో ఒక గుడిసెలో నివాసం ఉంటున్నాను. కుట్టుపని చేసుకుని బతుకుతున్నా. ఇందిరమ్మ ఇళ్ల సర్వే సమయంలో నా నివాస స్థితి తప్పుగా నమోదైంది. ఆర్సీసీ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తప్పుడు సమాచారం నమోదు చేశారు. నా దరఖాస్తు స్టేటస్ను సరిచేసి లిస్టు– 3 నుంచి లిస్టు– 1కు ఇల్లు మంజూరు చేయాలి. – గంగిశెట్టి సువర్ణ, ఆసిఫాబాద్ -
రక్తదానం మహాదానం
జైపూర్: రక్తదానం మహాదానం అని ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజీవి పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్టీపీపీలోని ట్రెయినీ హాస్టల్లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ జయంతి సందర్భంగా వరుసగా ఏడవసారి రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సోసైటీ జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్, ఎస్టీపీపీ జీఎం నర్సింహారావు, సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సుధేశ్ జఖహర్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ పంతులా, ఎస్సీ లైసన్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్టీ లైసన్ ఆఫీసర్ దేవేందర్సింగ్, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్, మెడికల్ సూపరింటెండెంట్ జానకి ప్రభాకర్, ఎస్వోటూ ఈడీ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. -
డిపాజిట్ డబ్బులు చెల్లించాలని ఆందోళన
మందమర్రిరూరల్: డిపాజిట్ చేసిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మందమర్రి మార్కెట్లోని సహారా ఇండియా కార్యాలయం ఎదుట డిపాజిట్ దారులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సదరు సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బుల కాలపరిమితి ముగిసి నాలుగైదేళ్లు కావస్తున్నా ఇవ్వడంలేదన్నారు. కార్యాలయంలో అడిగితే పొంతనలేని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. అనంతరం కార్యాలయంలో మేనేజర్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బాధితులు వెంకటయ్య, సంజీవ్, రాజమౌళి, నరేష్బాబు, సంపత్, మధు, మల్లేశ్వరి, రమాదేవి, లక్ష్మి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతితాంసి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలు వురికి తీవ్ర గాయాలైన సంఘటన గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది స మీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాంసికి చెందిన పది మంది మహిళలు ఆదివారం ఉదయం మ్యాక్స్ వాహనంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్కు వెళ్లి వస్తుండగా సీతాగొంది సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో సోమ హేమలత (62) అక్కడికక్కడే మృతి చెందగా సోమ సుజాత, గంగామాత, వాసవి, శ్రీదేవి, మంత్రి అనిత, వినోద, లక్ష్మి, లావణ్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సోమ సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
వేసవిలో ఆయిల్పామ్ సంరక్షణ
చెన్నూర్రూరల్: తెలంగాణలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలోని కొందరు రైతులు నా లుగేళ్లుగా ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. మంచి ర్యాల జిల్లా వ్యాప్తంగా 800ల మంది రైతులు 3, 500 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 600 ఎకరాల్లో పంట దిగుడి వస్తోంది. క్వింటాలుకు రూ.2005 ధర పలుకుతోంది. కాగా ఈ వేసవిలో ఎండలు బాగా ముదిరిపోయాయి. ఉష్ణోగ్రతలు పె రగడంతో మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంది. కొ త్తగా సాగు చేస్తున్న రైతులు, గతంలో సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధించేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యావనశాఖ అధికారి కళ్యాణి సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయిల్పామ్ తోటల్లో ఒకటి నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుమును పచ్చిరొట్ట ఎరువుగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన వెంటనే చిన్నచిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి. ప్రతీ మొక్కకు ఇరువైపులా మైక్రోజెట్ అమర్చుకోవాలి. వేసవిలో చిన్న మొక్కలకు ప్రతీరోజు 150 నుంచి 160 లీటర్ల నీటిని అందించాలి. ఎదిగిన మొక్కకు రోజుకు 250 లీటర్ల నుంచి 330 లీటర్ల నీటిని అందించాలి. మూడేళ్లలోపు వయస్సు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతినెలా తొలగించాలి. ఎండిన, విరిగిన, చీడపీడలు సోకిన ఆకులను అవసరం మేరకు మాత్రమే తొలగించాలి. చెలుపు లేదా వృథాగా వచ్చిన ఆకులను నరకవద్దు. అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్పామ్తో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు పోషకాలు తప్పనిసరిగా అందేలా చూడాలి. రైతులు సిఫారసు చేసిన పద్ధతిలో మొక్కలకు పోషకాలు అందించి వివరాలను డైరీలో నమోదు చేయాలి. ఎదిగిన మొక్కల గెలలు కోసిన తర్వాత వచ్చిన ఆకులను, మగ పూలగుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ ఆయిల్పామ్ గెలలను పాదులలో మల్చింగ్గా పరవాలి. ఎదిగిన తోటలలో పక్వానికి వచ్చిన గెలను అల్యూమినియం కడ్డీ లేదా కత్తితో కోయాలి. ఎదిగిన తోటలకు నెలకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 2.5 కేజీల మెగ్నీషియం సల్ఫేట్, కిలో బోరాక్స్ను విడివిడిగా నీటిలో కరిగించి ఫెర్టిగేషన్ ద్వారా ఎకరా విస్తీర్ణంలో మొక్కలకు అందించాలి. తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపిస్తే మట్టి నమూనా సేకరించి విశ్లేషణకు పంపించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండల బారి నుండి మొక్కలను కాపాడుకోవచ్చు. అధిక దిగుబడులు పొందవచ్చు. -
సర్కార్ సత్తా
రెబ్బెన: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు అదరగొట్టారు. అడవుల జిల్లాగా పేరుగాంచిన కుమురం ఆసిఫాబాద్ జిల్లా తనదైన ముద్ర వేసుకుంది. ఈసారి ఒకేషనల్ విద్యార్థులు జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు గతేడాది కంటే ఈసారి కాస్త మెరుగైన ఫలితాలనే సాధించినా ఒకస్థానం కిందకు దిగారు. అయినా ఉత్తీర్ణత పెరగడం సానుకూలంశం. ఉత్తమంగా నిలిచిన కేజీబీవీలుజిల్లాలో 15 మండలాలు ఉండగా 12 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ విద్యాలయాల్లో గతంలో పదో తరగతి వరకు మాత్రమే ఉండగా ప్రభుత్వం ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసింది. బాలికలు పదో తరగతి పూర్తయ్యాక ఇతర కళాశాలల వైపు చూడకుండా అందులోనే ఇంటర్ విద్యను అభ్యసించేందుకు వెసులుబాటు కలిగింది. కొన్ని కేజీబీవీల్లో జనరల్ గ్రూప్లు మాత్రమే కొనసాగుతుండగా, అధ్యాపకుల లభ్యతను బట్టి మరిన్ని కొన్నింటిలో ఒకేషనల్ తరగతులు సైతం బోధిస్తున్నారు. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తొమ్మిది కేజీబీవీలు రెండో సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి వందశాతం సాధించిన కళాశాలలు రెండు ఉన్నాయి. జైనూర్, సిర్పూర్(యు) కేజీబీవీల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి శభాష్ అనిపించుకున్నారు. జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యు)లో కేవలం మొదటి సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరంలో కస్తూరిబా గాంధీ విద్యాలయాలు 94శాతం, రెండో సంవత్సరంలో 98.5 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పేద విద్యార్థులు రూ.వేలు ఫీజులు దండుకునే ప్రైవేటు కాలేజీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మార్కులు సాధించారు. రెబ్బెన మండలంలోని గంగాపూర్ కేజీబీవీకి చెందిన బైపీసీ విద్యార్థిని సంజన 980 మార్కులు సాధించి కేజీబీవీల్లో జిల్లా టాపర్గా నిలిచింది. రెండో స్థానంలో కాగజ్నగర్ కేజీబీవీకి చెందిన గంగారాణి ఎంపీసీలో 978 మార్కులు సాధించింది. ఫస్టియర్లో సిర్పూర్(టి) కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ చదువుతున్న ఎన్.మేనక, సీహెచ్.పల్లవి 488 మార్కులు సాధించగా, వాంకిడి విద్యార్థిని అశ్విని 487 మార్కులు సాధించింది. సిర్పూర్(టి)కి చెందిన ఇందు సీఈసీలో 471 మార్కులు సాధించగా, సిర్పూర్(యు) విద్యార్థిని ఎంపీసీలో 457 మార్కులు సాధించింది. కాస్త మెరుగు గత సంవత్సరంతో పోల్చితే ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం కాస్త మెరుగుపడింది. గత సంవత్సరం 79 శాతం మాత్రమే ఉండగా ఈసారి 82 శాతానికి పెరిగింది. అయితే గతేడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, ఈసారి మాత్రం మూడో స్థానంలో ఉంది. ఒక స్థానం తగ్గినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం సంతోషకరం. – రాందాస్, డీఐఈవోరెబ్బెన మండలంలోని గంగాపూర్ కేజీబీవీపెరిగిన ఉత్తీర్ణతఇంటర్ ఫలితాల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయిలో ఒక స్థానం తగ్గింది. గతేడాది ఫలితాల్లో జిల్లా 79 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలవగా, అయితే ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం పెరిగినా రాష్ట్రస్థాయిలో మాత్రమే మూడో స్థానంలో జిల్లా నిలిచింది. 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వీటిలో రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తీర్ణతలో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ కళాశాలలో 275 మంది విద్యార్థులకు 257 మంది(93.45 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక సిర్పూర్ కాగజ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతి తక్కువ ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ఈ కళాశాలలో 285 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా కేవలం 141 మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. ఓవరాల్గా జిల్లాలోని విద్యార్థులు గత సంవత్సరం కంటే కాస్త మెరుగైన ఫలితాలు సాధించడం సంతోషకరం. -
‘సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి’
కాగజ్నగర్టౌన్/సిర్పూర్(టి): గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన దక్షిణ గోండ్ వాన గోండ్రాజు మోకాసి స్మారక జెండా పూజా కార్యక్రమానికి సబ్కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి హాజరయ్యారు. అనంతరం రాయిదర్బార్లో మాట్లాడారు. మేడిపల్లి గ్రామానికి 154 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, అటవీశాఖ సమస్యలతో కొన్ని నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిర్పూర్(టి) నుంచి మాలిని వరకు బీటీరోడ్డు, రెండు వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధుల కేటా యింపులు, అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీవో సత్యనారాయణ, ఆదివాసీ సంఘం నాయకులు సిడాం అర్జు, మోతీరాం, మారు, భీంరావు, శ్రీనివాస్, మాణిక్రావు, లాహను, నాగరాణి, నానయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్బార్కు వచ్చిన ఆదివాసీలకు అంబలి పంపిణీ చేశారు. -
హెల్మెట్ ధరిస్తేనే ఊళ్లోకి ఎంట్రీ..
సిరికొండ: రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది.. ఇంటినుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి వచ్చేవరకు ఇంట్లో ఉన్నవారికి టెన్షన్. దీనిని గుర్తించిన సిరికొండ మండలంలోని రాయిగూడ గ్రామస్తులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, హెల్మెట్ లేకుండా ఊర్లోకి రావద్దని తీర్మానం చేశారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ శివధర్రెడ్డికి సర్పంచ్ పెందుర్ లక్ష్మణ్ తీర్మాన ప్రతిని అందజేశాడు. జామిడిలో... తాంసి: మండలంలోని జామిడిలో ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతామని, గ్రామానికి వచ్చేవారు హెల్మెట్ ధరించి రావాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. సోమవారం మన్నూర్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డీజీపీకి సర్పంచ్ అశోక్ తీర్మాన ప్రతిని అందజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. -
పశువులకు ఏదీ బీమా?
చెన్నూర్రూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. కానీ పాడి పశువులకు ఎలాంటి బీమా సౌకర్యం లేదు. పాడి పశువులు అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందితే బీమా సౌకర్యం లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 12,09,436 మూగజీవాలు ఉన్నాయి. ఇందులో 1,38,536 ఆవులు, 1,04,080 గేదెలు, 2,42,616 ఎద్దులు, 5,36,913 గొర్రెలు, 1,87,291 మేకలు ఉన్నాయి. పాడి పశువులకు బీమా ఉంటే ఆయా సంస్థల నుంచి గతంలో పశువుల అంచనాను బట్టి రూ.50 వేల వరకు నష్ట పరిహారం వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి సౌకర్యం కల్పించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వద్ద ఉన్న ఆవులు, గేదెలు, ఎద్దులకు గతంలో లాగే ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చెన్నూర్ మండలం కత్తెరసాల, అక్కెపల్లి, శివలింగాపూర్, కాచన్పల్లి, గంగారం, సుద్దాల, తుర్కపల్లి, లింగంపల్లి, కాంబోజీపేట, అంగ్రాజ్పల్లి, ఎర్రగుంటపల్లి, బావురావుపేట, కిష్టంపేట, బుద్దారం, సంకారం గ్రామాల్లో రైతులు వ్యవసాయంతో పాటు ఎక్కువగా పాడి పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో బీమా సౌకర్యం ఉన్నప్పుడు పశువులు అనారోగ్యంతో మృతి చెందితే ఎంతో కొంత పరిహారం వచ్చేది. కానీ ప్రస్తుతం బీమా సౌకర్యం లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పశువులకు బీమా సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. -
వ్యక్తిపై హిజ్రాల దాడి
లక్ష్మణచాంద: ఒకరిపై హిజ్రాలు దాడికి పాల్ప డిన ఘటన మండలంలోని చింతల్చాందలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన లింగట్ల రాజన్న ఆదివారం గృహ ప్రవేశ కార్యక్రమం జరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు నిర్మల్కు చెందిన నలుగురు హిజ్రాలు ఒక ఆటోలో వచ్చి రూ.11 వేలు కట్నంగా ఇ వ్వాలని డిమాండ్ చేశారు. తమకు అంతస్థోమ త లేదని, రూ.3 వేలు ఇస్తానని రాజన్న తెలిపా డు. ఒప్పుకోని హిజ్రాలు రాజన్నను చేతులతో కొట్టి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కొద్దిదూరం వెళ్లిన తర్వాత కిందకు తోసేశారు. దీంతో ఆటో రెండు టైర్లు బాధితుడి కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. కు టుంబ సభ్యులు నిర్మల్ ఆసుపత్రికి తరలించా రు. బాధితుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. -
బేలలో శనగ రైతుల ఆందోళన
కై లాస్నగర్(బేల): బేల మండల కేంద్రంలోని సబ్ మార్కెట్యార్డులో వారం రోజులుగా శనగ కొనుగోళ్లను నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం ఆందోళనకు దిగారు. అంబేడ్కర్చౌక్లో గల అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శనగ కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. క్యూఆర్ కోడ్ లేదని చెప్పడంతో పంటను మార్కెట్లో కుప్పలుగా పోసుకుని రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 75శాతం పంట రైతుల ఇళ్లలోనే ఉందని , అయితే అధికారులు మాత్రం కోటా పూర్తయిందని కొనుగోళ్లు నిలిపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం రైతుల వద్దనున్న శనగ పంటను బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. -
డిగ్రీ కళాశాలలో పురాతన నాణేల ప్రదర్శన
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం డిపార్టుమెంట్ ఆఫ్ హిస్టరీ ఆధ్వర్యంలో పురాతన నాణేల ప్రదర్శ న నిర్వహించారు. వందేళ్ల కాలం నాటి రాగి, ఇత్తడి నాణేలు, స్వాతంత్య్రానికి పూర్వం చలామణిలో ఉన్న వివిధ రకాల నాణేలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ పురాతన నాణేల ప్రదర్శనతో విద్యార్థులు చరిత్ర తెలుసుకోగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, కోఆర్డినేటర్ దుర్గం జనార్దన్, అధ్యాపకులు సబిత, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా విక్రయాలు
కాగజ్నగర్టౌన్/కౌటాల: జిల్లాలో నిషేధిత పాలిథిన్ కవర్ల విక్రయాలు, వాడకం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లపై ప్రభుత్వం పూర్తిగా నిషేధించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ నెల 10న కాగజ్నగర్ పట్టణంలోని లారీ చౌరస్తా ప్రాంతంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న నిషేధిత ప్లాస్టిక్ను ముందస్తు సమాచారంతో మున్సిపల్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం అక్రమంగా పాలిథిన్ కవర్లు విక్రయిస్తున్న మెహరాజ్ హుస్సేన్ అనే వ్యక్తికి రూ.5 వేల జరిమానా విధించారు. మళ్లీ విక్రయిస్తే దుకాణం సీజ్ చేస్తామని హెచ్చరించారు. వారసంతల్లో అధిక వినియోగంఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో రోజురోజుకూ ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. అలాగే జిల్లాలోని కాగజ్నగర్, రెబ్బెన, వాంకిడి, ఆసిఫాబాద్, కౌటాల, బెజ్జూర్, దహెగాం, పెంచికల్పేట్ మండలాల్లో వారసంతలకు భారీగా వినియోగదారులు వస్తుంటారు. వందలాది మంది వ్యాపారులు విచ్చలవిడిగా 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లను విక్రయిస్తున్నారు. కొందరు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కవర్లు తీసుకువచ్చి దుకాణాలకు అమ్ముతున్నారు. పట్టణ శివార్లలోని గోదాముల్లో నిల్వ ఉంచి, వాహనాల ద్వారా దుకాణాలకు సరఫరా చేస్తున్నా యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. అన్ని మండలాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, పేపర్లు, కవర్లు దర్శనమిస్తున్నాయి. వీటిని తిని పశువులు, ఇతర పెంపుడు జంతువులు మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణానికి పెనుముప్పుఅంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల ను అదుపు చేయకపోతే 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ చెత్తే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోనూ డ్రెయినేజీలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోవడంతో వరద సమస్యలు తలెత్తుతున్నాయి. కవర్లను తగులబెట్టడంతో కర్బన ఉద్గారాలు విడుదలయ్యి భూతాపం పెరుగుతోంది. ఇది క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు కూడా కారణమవుతోంది. కొరవడిన అవగాహనప్రభుత్వం నిషేధం విధించినా, అధికారుల తనిఖీ లు నామమాత్రంగానే సాగుతున్నాయి. తనిఖీలు, జరిమానాలు నిరంతరం కొనసాగడం లేదు. జూట్ బ్యాగులు, పేపర్ బ్యాగుల వంటి ప్రత్యామ్నాయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మున్సిప ల్, పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాలపై వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కౌటాల పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులకు జరిమానాలు విధిస్తున్నామని, ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తనిఖీలు చేపట్టాలి కిరాణ షాపులు, బేకరీల నిర్వాహకులు కవర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. యజమానులు అధిక మొత్తంలో నిల్వ చేసి చిరు వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలి. వారసంతల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలు, పేపర్ బ్యాగుల వినియోగంపై అధికారులు అవగాహన కల్పించాలి. – శంకర్, కౌటాల నిషేధిత కవర్లు విక్రయిస్తే చర్యలు 40 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్ కవర్లు వాడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాగజ్నగర్ మున్సిపాలిటీలోని దుకాణాల్లో నిషేధిత కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. దుకాణాలను సీజ్ చేస్తాం. షాపుల్లో నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తే ప్రజలు నిర్భయంగా అధికారులకు సమాచారం ఇవ్వాలి. – తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదరస్వామి అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. కెరమెరి మండలం సంఘవి గ్రామానికి చెందిన మడావి రాంబాయి రైతు భరోసా మంజూరు చేయాలని, ఉట్నూర్ మండలం వేణునగర్కు చెందిన రాథోడ్ సుభాష్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాలకు చెందిన ఆత్రం రవికిరణ్ రుణం మంజూరు చేయాలని కోరారు. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. -
ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలని జనాభా గణన రాష్ట్ర సంచాలకులు భారతి హోళీకేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంచాలకులు మాట్లాడుతూ మే 11 నుంచి ప్రారంభించే ఇళ్ల గణనలో భాగంగా ఇళ్ల జాబితా బ్లాక్లను రూపొందించాలన్నారు. ఎన్యుమరేటటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,689 ఇళ్ల జాబితా బ్లాక్లను గుర్తించామని, 10 శాతం అదనపు సిబ్బందితో కలిసి 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. సిబ్బందికి త్వరలో మండలాల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సీపీవో వాసుదేవరెడ్డి, డిప్యూటీ సీపీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలిజిల్లాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో దోమల వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతూ చెత్తాచెదారం తొలగించాలన్నారు. ప్రతీవారం డ్రైడే చేపట్టాలని ఆదేశించారు. చేతి పంపులు, బావుల వద్ద నీరు నిల్వకుండా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని, నీటి ట్యాంకులు క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు దోమల స్ప్రే, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ యంత్రాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. -
అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య
వాంకిడి: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల మేరకు ఇందానికి చెందిన మందాడె సాయినాథ్(23) కొంతకాలంగా ఫిట్స్తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మృతుని తండ్రి మందాడే సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంటర్ విద్యార్థి ..ఖానాపూర్: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సత్తెనపల్లి గ్రామానికి చెందిన భూక్య రాజేశ్వర్ కుమారుడు భూక్య ఆకాష్ (18) ఖా నాపూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల కంప్యూటర్ శిక్షణ కోసం హైదరాబాద్కు వెళ్లి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వాచ్చడు. ఖాళీ సమయంలో డీజే ఆపరేటింగ్ చేసే విద్యార్థి అదే రోజు మధ్యాహ్నం డీజే పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సోమవారం ఉదయం గది తలుపు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీ ద్వారా చూడగా టవల్తో ఉరేసుకుని కనిపించాడు. డీజే వద్ద జరిగిన గొడవలో కొందరు వ్యక్తులు ఆకాష్పై దాడి చేసినట్లు తె లిసింది. అలాగే ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఉండవచ్చని భావిస్తున్నా రు. ఈ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుని తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నర్సాపూర్(జి) మండలంలో ..నర్సాపూర్(జి): పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గొల్ల మాడకు చెందిన గొల్ల శివాజీ, రజిత కుమారుడు మణివర్ధన్(17) నిర్మల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని లొద్దిగుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి శివాజీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. -
హెల్మెట్తో ప్రాణాలకు రక్షణ
ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలకు రక్షణ ఉంటుందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు సమీపంలో జాతీయ రహదారి పక్కన హెల్మెట్ చౌక్ను ఆదివారం ఎస్పీ నితిక పంత్తో కలిసి ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ద్విచక్ర వాహనదారులు భద్రత కోసం విధిగా హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా చేరవేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై చైతన్యం పెంచేందుకు ఈ హెల్మెట్ చౌక్ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా మన ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలు కూడా కాపాడవచ్చన్నారు. 18 నుంచి 40 ఏళ్ల వారే ప్రమాదాల్లో ఎక్కువగా మృత్యువాత పడుతున్నారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7500 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల అంకం ముగిసిందని, ప్రస్తుతం ఐదుగురు మాత్ర మే ఉన్నారని పేర్కొన్నారు. మావోలతో ముప్పు ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు కేటాయించిన గన్మెన్లను తొలగిస్తామన్నారు. అంతకు ముందు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ డీజీపీకి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. భరోసా కేంద్ర భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. వాంకిడి మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ వహీదొద్దీన్, సీఐలు బాలాజీ వరప్రసాద్, రమేశ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7ఎండుతున్న మొక్కలు ఎండల తీవ్రతకు పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణకు అధికారులు షెడ్నెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి అధికంగా ఉంటుంది. అనవసరంగా బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. బాసరకు పోటెత్తిన భక్తజనం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. 8లోu సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 -
టీటీడబ్ల్యూఆర్జేసీలో వందశాతం
కాగజ్నగర్రూరల్: గన్నారంలోని ట్రైబల్ వెల్ఫేర్ అప్గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ రమ్యకృష్ణ తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో ఎ.రజిత 458/470, శ్రీవాణి 457/470, బైపీసీలో ఎం.అర్చన 434/440, సమత 433/440, సెకండియర్ ఎంపీసీలో జె.ప్రవళిక 958/1000, బి.అఖిల 938/1000, బైపీసీలో వై.రాధిక, 988/1000, ఎల్.అభినయ 974/1000 కళాశాల టాపర్లుగా నిలిచారు. జె.ప్రవళిక, ఎంపీసీ(958 )రాధిక, బైపీసీ(988 ) -
ఇంటర్లో హవా..!
ఆసిఫాబాద్రూరల్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రస్థాయిలో టాప్ 5లో నిలుస్తున్న జిల్లా.. ఈసారీ అదే హవా కొనసాగించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో సెకండియర్ ఒకేషనల్ విభాగంలో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. సెకండియర్ జనరల్ విభాగంలో మూడోస్థానంలో నిలవగా, ఫస్టియర్ ఫలితాల్లో తొమ్మిదో స్థానం, ఒకేషనల్ ఫస్టియర్, ప్రైవేట్ జనరల్, ఒకేషనల్ ఫలితాల్లోనూ మూడోస్థానంతో ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ఇలా..ఫస్టియర్ జనరల్ విభాగంలో 4,292 మంది వార్షిక పరీక్షలకు 2,862(66.68శాతం) మంది ఉత్తీర్ణత సా ధించారు. ఇందులో బాలురు 1,990 మందికి 1,049(52.71శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, 2,302 మంది బాలికలకు పరీక్షలు రాయగా, 1,813(78.76శాతం) మంది పాసయ్యారు. ఒకేషన ల్ విభాగంలో 754మంది పరీక్షలకు హాజరు కాగా, 524(69.50శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 345 మంది బాలురకు 198(57.39) మంది, 409 మంది బాలికలకు 326(79.71శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ జనరల్ విభాగంలో 3,745 మందికి 3,077(82.16శాతం) మంది పాసయ్యారు. ఇందులో బాలురు 1,595 మందికి 1,165(73.04) మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 2,150 మందికి 1,912(88.93శాతం) మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో సెకండియర్ విద్యార్థులు 654 మంది పరీక్షలు రాయగా, 576(88.07శాతం) మంది పాసయ్యారు. ఇందులో బాలురు 311 మందికి 257(82.64శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బాలికలు 343 మంది పరీక్షలు రాస్తే 319(93శాతం) మంది పాసయ్యారు. జనరల్ విభాగంలో ప్రైవేట్ సెకండియర్ విద్యార్థులు 270 మంది పరీక్షలకు హాజరు కాగా, 114(42.22శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 183 మందికి 78(42.62) మంది, బాలికలు 87 మందికి 36(41.38) మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ విభాగంలో ప్రైవేట్ విద్యార్థులు 34 మందికి 22(64.71) మంది పాసయ్యారు. ఇందులో బాలురు 28 మందికి 18(64.29) మంది ఉత్తీర్ణత సాధించగా, ఆరుగురు బాలికలకు నలుగురు(66.67) ఉత్తీర్ణులయ్యారు. ‘ప్రభుత్వ’ విద్యార్థుల ప్రభంజనంజిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. సెకండియర్లో 145 మందికి 137 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో వేదక్షర 960 మార్కులతో టాపర్గా నిలిచింది. బైపీసీలో వైష్ణవి 973, సీఈసీలో మాధురి 955 మార్కులు సాధించారు. ఫస్టియర్లో 162 మందికి 136 ఉత్తీర్ణత సాధించారు. ఎంఈసీలో శ్రీవర్ష 449/500, బైపీసీలో కీర్తన 422/440, సీఈసీలో ఐశ్వర్య 427/500 మార్కులతో మెరిశారు. మోడల్ స్కూల్కు చెందిన ఐ.వైష్ణవి ఎంఈసీ సెకండియర్లో 883 మార్కులు, మాధవి సీఈసీ ఫస్టియర్లో 955 మార్కులు సాధించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూపునకు చెందిన 28 మందికి 27 మంది పాసయ్యారు. జశ్వంత్ 466/470 టాప్లో ఉన్నాడు. బైపీసీలో 25 మందికి 23 మంది ఉత్తీర్ణులు కాగా, ఉమిద్ 423/440 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో 20 మందికి 20 మంది ఉత్తీర్ణులు కాగా, సిద్దార్థ 970/1000, బైపీసీలో 12 మందికి 12 ఉత్తీర్ణులు కాగా, మధుకర్ 947/1000 మార్కులు సాధించాడు. మైనార్టీ బాలికల గురుకుల కళాశాలలో 63 మంది 62 ఉత్తీర్ణులు కాగా, హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. సీఈసీలో కళ్యాణి 484/500, అస్రానైజ్ 954/1000 మార్కులు సాధించారు. బాలికల గురుకుల కళాశాలలో సెకండియర్లో 156 మంది 156 మంది, ఫస్టియర్లో 142 మందికి 128 మంది ఉత్తీర్ణులయ్యారు. పీటీజీ బాలురు గురుకుల కళాశాలలో సెకండియర్ విద్యార్థులు 56 మందికి 55 మంది, ఫస్టియిర్లో 74 మందికి 65 మంది పాసయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సెకండియర్లో ఎంపీసీ, బైపీసీలో 57 మందికి 50 మంది పాసయ్యారు. ఫస్టియిర్లో 69 మందికి 64 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆసిఫాబాద్ కేజీబీవీకి చెందిన హారిక ఎంపీసీ ఫస్టియర్లో 445, బైపీసీ సెకండియర్లో స్వాతి 956 మార్కులు సాధించారు. ఆరేళ్లుగా ఫలితాలువిద్యాసంవత్సరం హాజరు ఉత్తీర్ణులు శాతం రాష్ట్రస్థాయిలో స్థానం 2019– 20 ఫస్టియర్ 3,856 2,739 71 02 సెకండియర్ 3,078 2,487 80 01 2020– 21 ఫస్టియర్ 5,252 3,716 70 03 సెకండియర్ 4,826 3,678 76 02 2021– 22 ఫస్టియర్ 5,137 3,748 74 03 సెకండియర్ 4,697 3,793 81 02 2022– 23 ఫస్టియర్ 5,137 3,748 74 03 సెకండియర్ 4,697 3,798 81 02 2023– 24 ఫస్టియర్ 4,570 2,813 61 08 సెకండియర్ 4,095 2,951 81 07 2024– 25 ఫస్టియర్ 4,756 3,349 74 04 సెకండియర్ 4,920 3,948 84 02 2025– 26 ఫస్టియర్ 4,292 2,862 66.68 09 సెకండియర్ 3,745 3,077 82.16 03 అదరగొట్టిన అమ్మాయిలు.. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఫస్టియర్లో జనరల్, ఒకేషనల్ విభాగాల్లో కలిపి 2,335 మంది బాలురు పరీక్షలు రాయగా 1,247 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,711 మందికి 2,139 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో 1,906 మంది బాలురకు 1422 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 2,493 మందికి 2,231 మంది పాసయ్యారు. -
అదుపు తప్పితే అంతే..
టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఆదిత్య నర్సింగ్హోంలో ఆదివారం టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, యువత హాజరై రక్తదానం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ప్రాణ దానం చేసే శక్తి రక్తదానానికే ఉందన్నారు. ఆరోగ్యవంతులు మూడు, నాలుగు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా మాట్లాడుతూ సమాజంలో మానవతా విలువలను పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రసాంశాపత్రాలు అందించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి ఊషన్న, వైద్యులు రావుజీ, సునీత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఎంఈవో ప్రభాకర్, చరణ్దాస్, సత్యనారాయణ, మధుకర్, రాజ్కమలాకర్రెడ్డి, మహిపాల్, దుర్గయ్య, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డకు పెళ్లి కానుక
కెరమెరి: పంచాయతీలో జరిగే ప్రతీ ఆడబిడ్డ పెళ్లికి రూ.10 వేల ఆర్థికసాయం అందిస్తానని మాటిచ్చిన ఆ సర్పంచ్ తన హామీ నిలబెట్టుకున్నారు. జైనూర్ మండలం జామ్నికి చెందిన ధుర్వ గిరిజాబాయికి కెరమెరి మండలం ఆగుర్వాడ గ్రామానికి చెందిన బల్లార్శావ్తో ఆదివారం ఆగుర్వాడలో వివాహం జరిగింది. ఆడబిడ్డకు పెళ్లికానుక అందించాలని భావించిన జామ్ని సర్పంచ్ సోంబాయి నాగోరావు, ఉపసర్పంచ్ కళ్యాణి సమాధాన్ డోంగ్రే నవ వధువుకు మండపంలోనే రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. ఇప్పటివరకు ఐదుగురికి రూ.10వేలు చొప్పున రూ.50 వేలు అందించారు. కార్యక్రమంలో టేకం నాగుబాయి, కొడొప బాది, ఆత్రం రాజు, మడావి దేవ్రావు తదతరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన కేజీబీవీ బాలికలు
జి.గంగారాణి, ఎంపీసీ(978)డి. వైష్ణవి, ఎంపీసీ(456)కాగజ్నగర్టౌన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కస్తూరిబా గాంధీ విద్యాలయాలకు చెందిన బాలికలు సత్తా చాటారు. పలు కాలేజీలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. దహెగాం కేజీబీవీలో ద్వితీయ సంవత్సరంలో 38 మంది విద్యార్థినులకు 38 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 35 మందికి 33 మంది పాసయ్యారు. తిర్యాణి కేజీబీవీలో సెంకడియర్ విద్యార్థినులు 24 మందికి అందరూ ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 36 విద్యార్థినులకు 34 మంది ఉత్తీర్ణత సాధించారు. లింగాపూర్ కస్తూరిబాలో ఈ విద్యాసంవత్సరమే తరగతులు ప్రారంభం కాగా, 15 మందికి 15 మంది పాసయ్యారు. ఇక కెరమెరి మండలంలోని మోడి కేజీబీవీలో ఫస్టియర్ విద్యార్థులు 43 మందికి 40 మంది, సెకండియర్లో 57 మందికి 55 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆసిఫాబాద్ కేజీబీవీలో సెకండియర్ బైపీసీ, హెచ్ఈసీలో 59 మంది 59 మంది ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో స్వాతి 956, ఎంపీసీ లో శైలజ 903 మార్కులు సాధించారు. ఫస్టియర్లో 77 మందికి 72 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో అకాంక్ష 465/470, బైపీసీలో అక్షయ 415/440 మార్కులు సాధించారు. టాపర్గా గంగారాణికాగజ్నగర్ పట్టణం ఆర్ఆర్వో కాలనీలోని కేజీబీవీ బాలికలు జిల్లా టాపర్లుగా నిలిచారు. ఎంపీసీ సెకండియర్లో జి.గంగారాణి 978/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. ఎంపీసీలో జి.శ్వేత 962/1000, డి.వైష్ణవి, 456/470 మార్కులు సాధించారు. కాగజ్నగర్ మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన వనజా– శ్రీనివాస్ దంపతుల కుమార్తె గంగారాణి కేజీబీవీల్లో టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. గంగారాణి ఐదో తరగతి నుంచి కేజీబీవీలోనే చదువుతోంది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ఎస్వో రమాదేవి, ఉపాధ్యాయులు అభినందించారు. -
‘గులాబీ’ జోష్
నస్పూర్/రామకృష్ణాపూర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామారావు జిల్లా పర్యటన ఆ పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. నస్పూర్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశానికి హాజరై కాంగ్రెస్ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, మారుపేర్ల సమస్య, మెడికల్ బోర్డు నిర్వహణ కోసం తాము ఆందోళనలు నిర్వహిస్తామని, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ ప్రసంగిస్తుండగా పలువురు నిరుద్యోగులు సేవ్ సింగరేణి.. మెడికల్ బోర్డు నిర్వహించాలి.. మారు పేర్ల సమస్య పరిష్కరించాలి.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. కత్తి మరొకరికిచ్చి యుద్ధం తమను చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సూచించారు. సింగరేణిలో సమస్యల పరిష్కారానికి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి..నస్పూర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డికి మూసిపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన క్యాతనపల్లి కౌన్సిలర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చివరివరకు పోరాడి చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు దక్కించుకోవడం అభినందనీయమని కొనియాడారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు మాట్లాడుతూ.. గోదావరినదిపై నిర్మించ తలపెట్టిన మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మాణాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే తన స్వార్థంతో రద్దు చేయించారని ఆరోపించారు. క్యాతనపల్లిలో పర్యటన.. సమావేశం తర్వాత క్యాతనపల్లిలోనూ కేటీఆర్ పర్యటించారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆయన రాకతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. మున్సిప ల్ ఎన్నికల్లో క్యాతనపల్లి పీఠాన్ని దక్కించుకున్న నేపథ్యంలో మిత్రపక్షమైన సీపీఐ, బీఆర్ఎస్ నాయకులను వెన్నుతట్టాలని ఆయన రావటంపై కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నివాసానికి వచ్చిన కేటీఆర్ సీపీఐ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ధైర్యంగా నిలబడి మున్సిపాలిటీని దక్కించుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల హక్కులు, వారసత్వ ఉద్యోగాల కోసం సంయుక్తంగా పోరాటం చేస్తే బాగుంటుందని సీపీఐ నేతలకు సూచించినట్లు సమాచారం. వివాహ వేడుకల్లో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలుప్లకార్డులు ప్రదర్శిస్తున్న నిరుద్యోగులుచైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు సన్మానం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలు పొందిన క్యాతనపల్లి, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్లను కేటీఆర్ శాలువాలతో సన్మానించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్జాదవ్, మంచిర్యాల, సిర్పూర్, రామగుండం మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, కోనేరు కోనప్ప, కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిర్యాల రాజిరెడ్డి, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, నాయకులు అక్కూరి సుబ్బయ్య, వంగ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెలో సిబ్బంది.. సేవలకు ఇబ్బంది!
ఈ చిత్రంలో కనిపిస్తున్న యువకుడు పులి రితేష్. తిర్యాని మండలంలో అన్మ్యాన్డ్ కార్మికునికిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2018లో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురికావడంతో ఒకచేయి పూర్తిగా కోల్పోగా రెండో చేయి పనిచేయకుండా అయ్యింది. వైద్యచికిత్సల నిమిత్తం సుమారు రూ.18 లక్షలు ఖర్చు చేశాడు. మూడేళ్లు మంచంపైనే ఉన్నాడు. విద్యుత్శాఖ అధికారులు బాధితుడికి ఇప్పటి వరకు నయాపైసా ఆర్థికసాయం అందించలేదు. ఇలాంటి అచేతనావస్థలో ఉన్న విద్యుత్ కార్మికులు జిల్లాలో మరెందరో ఉన్నారు. కార్మికుల డిమాండ్లు నెరవేరిస్తే సమస్యలు తీరే అవకాశం ఉంది. సమ్మె కొనసాగిస్తాం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్, అన్మ్యాన్డ్, పీస్రేట్, ట్రాన్స్ఫార్మర్ రిపేరర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తాం. ఏపీఏసీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలి. ప్రభుత్వం స్పందించాలి. – ఆత్రం మారుతి, ఆర్టిజన్ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుత్వం చేతిలో ఉంది వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. జిల్లాలో ఉన్న ఎల్ఐ, ఎల్ఎం, జేఎల్ఎంలకు బాధ్యతలు అప్పగించాం. కార్మికుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేతిలో ఉంది. – ఉత్తమ్ జాడే, విద్యుత్శాఖ ఎస్ఈ, ఆసిఫాబాద్ కెరమెరి: విద్యుత్ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్న పలు కేటగిరీ ల కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం ఆర్టిజన్లుగా గుర్తించింది. రెగ్యులర్ పేస్కేల్, పే స్లి ప్, ఆర్జిత సెలవులు వంటి లబ్ధి కల్పించి వీరిని ప్ర త్యేక కేటగిరీగా పరిగణిస్తున్నారు. దీంతో రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే జీతభత్యాల్లో భారీ వ్యత్యా సం ఉంది. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్ శాఖలోని వివిద విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు జిల్లా కేంద్రంలో ఈ నెల 8 నుంచి సమ్మె బాట పట్టారు. జేఏసీగా ఏర్పడి..గతంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో కార్మికులు తెలంగాణ విద్యుత్ జేఏసీగా ఏర్పడ్డారు. తొలుత సంతకాల సే కరణ చేపట్టారు. మార్చిలో హైదరాబాద్లోని ప్రధా న కార్యాలయం ఎదుట, 26, 30 తేదీల్లో డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయం, 4న కేటీపీ(కాకతీయ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం) ఎదుట, 7న ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో ఈ నెల 8 నుంచి నిరవధిక సమ్మెలోకి దిగారు. శ్రమ దోపిడీజిల్లాలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 34 ఉన్నాయి. వాటిలో ఇంటి కనెక్షన్లు 1,41,933, వ్యవసాయ కనెక్షన్లు 15,337, వ్యాపార కనెక్షన్లు 15,190, పరిశ్రమలు 630, చిరుపరిశ్రమలు 11, హైటెన్షన్ కనెక్షన్లు 104, ఇతర కనెక్షన్లు 5,720 ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2017 జూలై 29న సబ్స్టేషన్, కంప్యూటర్ ఆపరేటర్లు, పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను 1947–12/3 చట్టం ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేసింది. దీంతో ఆరుగురు చేయాల్సిన పనిని ఒకరిద్దరితో చేయిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ సర్వీస్ రూల్స్ ప్రకారం వీక్లీఆఫ్, ఓవర్ డ్యూటీ జీతభత్యాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వడం లేదు.జిల్లాలో కార్మికుల వివరాలు కార్మికులు సంఖ్య ఆర్టిజన్స్(ట్రాన్క్) : 22 ఆర్టిజన్స్(ఎన్పీడీసీఎల్) : 90 అన్మ్యాన్డ్ : 66 పీస్రేట్ : 12 ట్రాన్స్ఫార్మర్ రిపేరర్లు : 18 డిమాండ్లు.. -
జీవితమే శాశ్వతం
పరీక్ష తప్పితే జీవితం లేదనుకోవడం పొరపాటు. తమ పిల్లల పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. మందలింపులు చేపడితే సున్నితమైన మనస్తత్వం ఉన్న వారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. చాలామంది ప్రసిద్ధ వ్యక్తులు మొదట్లో చదువులు, పరీక్షల్లో విఫలమైనా జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్న వారి జీవిత గాథలను గుర్తు చేసేందుకు ప్రయత్నించాలి. ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే టెలి మానస్ 14416 నంబర్లో సంప్రదించాలి. – డాక్టర్ సునిల్, మానసిక వైద్యనిపుణులు (డీఎంహెచ్పీ) -
మళ్లీ అరైవ్–అలైవ్
ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం మరోసారి అరైవ్–అలైవ్ కార్యక్రమం చేపట్టనుంది. పోలీసు శాఖ దీనిని కేవలం కార్యక్రమంగా కాకుండా ఒక పబ్లిక్ అవగాహన ఉద్యమంగా అమలు చేస్తోంది. ఇది ఒక రోడ్డు భద్రతా ప్రచా రమే కాదు.. సురక్షితంగా ఇంటికి చేరడం ముఖ్యం అనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడమే లక్ష్యం. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు వివి ధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమానికి అనుగుణంగా అవగాహ న, తనిఖీ, అమలు చర్యలు చేపట్టనున్నారు. జిల్లా పోలీస్, రవాణా, ఇతర శాఖల సమన్వయంతో బ్లాక్ స్పాట్లు, విద్యాసంస్థలు, బస్టాండ్లు, ముఖ్య కూడళ్ల వద్ద అవగాహన సభలు, ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గతేడాది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 3,757 కేసులు నమోదు కాగా, ఈ చలాన్ ద్వారా 1,04,526 కేసుల్లో రూ.1.97 కోట్ల జరిమానా విధించారు. భద్రతే లక్ష్యంగా..జిల్లాలో మొదటి విడత అరైవ్–అలైవ్ కార్యక్రమం గత జనవరి 13 నుంచి 24 వరకు, రెండో విడత ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు, మూడో విడత మార్చి 22 నుంచి 28 వరకు నిర్వహించారు. ప్రస్తుతం ఈ నెల 13 నుంచి నాలుగో విడతకు సిద్ధమవుతున్నారు. గత జనవరి నుంచి మార్చివరకు జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్లో 2 కంటి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి 161 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమున్న 30 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 412 అవగాహన కార్యక్రమాలు చేపట్టగా 14,676 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రెబ్బెన, కెరమెరి పోలీస్స్టేషన్లలో హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ నెల 12న కెరమెరి పోలీస్స్టేషన్ పరిధిలో 250 హెల్మెట్లు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు ప్రాంతంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్న అవగాహన కలిగించేలా హెల్మెట్ చౌక్ (హెల్మెట్ ఆకారంలో ఉన్న భారీ నిర్మాణం) ఏర్పాటు చేయనున్నారు. అవగాహన కార్యక్రమాలుఅరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. హెల్మెట్, సీట్ బెల్ట్, రాంగ్సైడ్ డ్రైవింగ్, ఓవర్స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్పై ప్రచారం. డ్రైవర్లు, ఆటో, లారీ, బస్సుల యజమానులకు రహదారి భద్రతపై శిక్షణ, బైక్ ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, మైక్ అనౌన్స్మెంట్లు చేస్తారు. పోలీసు, రవాణా శాఖ సంయుక్త తనిఖీలు, ఈ చలాన్ అమలు, నియమాల ఉల్లంఘనపై చర్యల తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రచారంలో మద్య సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి పాటించడం, ప్రమాదకర ప్రదేశాల్లో అవగాహన, పాఠశాలలు, మార్కెట్లు, బస్టాండుల్లో ప్రచారం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. నిబంధనలు పాటించాలి వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. నాలుగో విడత అరైవ్ అలైవ్ కార్యక్రమం ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లాలో కొనసాగుతుంది. ప్రజల భద్రతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలి. – నితిక పంత్, ఎస్పీ -
● పరీక్షలే జీవితం కాదు..! ● ఒక్క ఫలితమే నిర్ణయించలేదు ● నేడు ఇంటర్మీడియెట్ ఫలితాలు ● ఒత్తిడికి గురైతే టెలిమానస్ నంబరు 14416లో సంప్రదించవచ్చు
పరీక్ష ఫలితాల్లో ఫెయిలైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చదువు కొనసాగించడం.. మార్కులు పెంచుకునేందుకు బోర్డు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఫెయిలైన సబ్జెక్టులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే సంవత్సరం ఉన్నత చదువులకు వెళ్లేందుకు వీలుంటుంది. తమకు వచ్చిన మార్కుల(మార్కులు తక్కువొచ్చినా, ఫెయిలైనా)పై నమ్మకం లేని విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాసైనా మార్కులు తక్కువొచ్చాయని భావిస్తే విద్యార్థులు బెటర్మెంట్ పరీక్షలు రాసి మెరుగుపర్చుకోవచ్చు. ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చి పలుచన చేయకుండా తల్లిదండ్రులు సన్నిహితంగా ఉంటూ ధైర్యం కల్పించాలి.ఈ చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న యువకుడు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన పంతిక ప్రవీణ్. ఎంసీఏ పూర్తి చేశాడు. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. నచ్చిన ఉద్యోగం రాకపోవడంతో స్వయంశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. పౌల్ట్రీ రంగంలో మెలకువలు నేర్చుకుని ప్రభుత్వ రుణ సదుపాయంతో పౌల్ట్రీఫామ్ నెలకొల్పాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. శిక్షణ ఐఏఎస్లు, ఉన్నతాధికారులు వ్యవసాయం, పౌల్ట్రీఫాంను సందర్శించి అతడిని అభినందించారు. ఉద్యోగంలో ప్రవేశిస్తే ఎక్కడో ఒకచోట మాత్రమే పరిమితమైన సేవలందించే వాడినని, ప్రస్తుతం మరో పదిమందికి ఉపాధి కల్పించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని ప్రవీణ్ చెబుతున్నాడు.నిరుత్సాహం దరిచేరనీయొద్దుపరీక్ష ఫలితాల్లో తగిన మార్కులు రాలేదని ఫెయిల్ అయ్యామని చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. భావోద్వేగాలను సమన్వయపర్చుకుంటూ ఒత్తిడికి గురి కాకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించే గాథలు, అనుభవాలను వారితో పంచుకోవాలి. పరీక్షలే జీవితానికి పరమావధి కాదని వారికి తెలియజెప్పాలి. జీవితంలో ఎదిగేందుకు అనేక మార్గాలు ఉంటాయని అవగాహన కల్పించాలి. – మోత్కూరి రామచందర్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వరకు పరీక్షలు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 53,307 మంది పరీక్షలు రాశారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానుండడంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’.. అంటే నీ కర్తవ్యాన్ని నిష్కామంగా చేయడం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఫలితంపై నీకు హక్కు లేదు. ఏది జరిగినా అది భగవంతుని సంకల్పంగా భావించి సమత్వంతో స్వీకరించడమే నిజమైన జ్ఞానం. – భగవద్గీతమంచిర్యాలఅర్బన్/నిర్మల్ఖిల్లా: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. పదో తరగతి ఫలితాలు త్వరలో వెలువడుతాయి. ఏడాదంతా కష్టపడ్డాను పరీక్ష ఫలితం ఎలా ఉంటుందోననే ఒత్తిడి.. ఆశలు ఉండడం విద్యార్థులకు సహజమే. కానీ.. ఫలితాలు ఒక్కటే జీవితాన్ని పూర్తిగా నిర్ణయించలేవు. పరీక్ష తప్పితే మరోసారి రాసుకోవచ్చు. ఆశించిన ర్యాంకు.. మార్కులు రాలేదని తట్టుకోలేకపోతుంటారు. తల్లిదండ్రులు కాస్త భరోసా కల్పించాలి. క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకం మిగుల్చుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చదువు జీవితంలో భాగమే కానీ అదే జీవితం కాదని ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యాన్ని నింపాలని విద్యావేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు.నిరాశ వద్దు..పౌల్ట్రీరంగంలో ఎదిగి..53వేల మంది..ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులుమంచిర్యాల 12,317ఆదిలాబాద్ 17,564నిర్మల్ 13,125ఆసిఫాబాద్ 10,301 -
కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యపు ధోరణి
రెబ్బెన: కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ నిర్లక్ష్య పు ధోరణి ప్రదర్శిస్తోందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏ రియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు అన్నా రు. శనివారం బెల్లంపల్లి ఏరియా లోని ఏరియా వర్క్షాప్లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సింగరేణి కార్మికులకు ఉన్న హక్కులు కేవలం కేసీఆర్ నాయకత్వంలో టీబీజీకేఎస్ సాధించినవేనన్నారు. ప్రస్తు తం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ కార్మికులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రానున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు టీ బీజీకేఎస్ను అక్కున చేర్చుకుని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మంగీ లాల్, ఏరియా నాయకులు మారిన వెంకటేశ్వర్లు, పిట్ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు సురేష్, గణ పతి, రమేశ్, వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదు
ఆసిఫాబాద్: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదని డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్విని అ న్నారు. శనివారం జిల్లాలోని ఫార్మసిస్ట్లు, మె డికల్ షాపుల యజమానులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్లో డీఎంహెచ్వో సీతారాం, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, ఈ గల్ టీం సభ్యుడు రమేశ్తో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా డ్రగ్ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు వంటి నిషే దిత పదార్థాలపై నియంత్రణ అవసరమన్నా రు. ప్రజారోగ్యం దృష్ట్యా మెడికల్ షాపుల యజమానులు నిబంధనలు పాటించాలన్నా రు. అనంతరం నార్కోటిక్స్, నిషేధిత ఔషధాలు విక్రయించమని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహించిన డ్రగ్స్ కంట్రోల్ క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
బడుగుల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే
ఆసిఫాబాద్రూరల్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే అని డీపీవో భిక్షపతిగౌడ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం, మహిళల విద్యాభ్యాసంకోసం పూలే విశిష్ట సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అకాష్, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, గ్రంథాలయ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్, తదితరులు పాల్గొన్నారు. మాలీ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎక్స్రోడ్డులోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, గ్రంథాలయంలో వేడుకలు నిర్వహించారు. -
పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు, ఎంపీడీవోలు, డీపీవోలు, ఏపీవోలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల సంక్షేమానికి అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పెన్షన్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని సూ చించారు. గతంలో ఈ కార్యక్రమం తహసీల్దార్ల బాధ్యతలో ఉండేదని, నూతన జీవో 172 ప్రకారం బాధ్యతలు ఎంపీడీవోలకు బదలాయించినట్లు తెలి పారు. అర్హత గల అభ్యర్థులు మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తులు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పరిధిలోకి వెళ్తాయని, తమ పరిధిలోని కార్యదర్శుల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి పంపిస్తారని తెలిపారు. సదరు అధి కారి నుంచి ప్రభుత్వ లాగిన్కు వెళ్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో దత్తారావ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పథకాన్ని సంబంధిత అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని వివరించారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఆసిఫాబాద్అర్బన్: యోగా సాధన చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా జయించవచ్చని కలెక్టర్ కె.హరిత సూ చించారు. శుక్రవారం ‘యోగా ఫర్ వన్ ఎర్త్–వన్ హెల్త్’ నినాదంతో కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి వేగవంతమైన జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనా రోగ్య సమస్యలకు యోగా ఒక సమగ్ర పరిష్కారమ ని పేర్కొన్నారు. యోగా వ్యాయామ పద్ధతి మాత్ర మే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానమని తె లిపారు. ప్రతీరోజు యోగాసనాలు వేయడం ద్వారా శరీరానికి దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి పెరగడమే కా కుండా జీవన ప్రమాణాలు మెరుగుపడతా యని తెలిపారు. మానసిక ప్రశాంతత లభించడం ద్వారా వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం మొత్తానికి సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లాలో యోగాపై అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని చిన్న వయ స్సు నుంచే యోగా అలవాటు చేయడం అత్యంత అ వసరమని సూచించారు. యోగా సాధన ద్వారా వి ద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక స్థిరత్వం పెరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ని ప్రతీ పాఠశాలలో ఉదయం యోగా తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. యోగా శిక్షకుడు అశోక్, ఆర్డీవో లోకేశ్వర్రా వ్, డీఆర్డీవో దత్తారావ్, వైద్యులు, ఇతర శాఖల జి ల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులున్నారు. -
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
కాగజ్నగర్టౌన్: సిర్పూరు పేపరు మిల్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఎస్పీఎం మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు మల్లికా ర్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాగజ్నగర్ ప ట్టణంలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో మిల్ కా ర్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లి కార్జున్ మాట్లాడా రు. రాష్ట్రంలో అనేక పరిశ్రమల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నా సిర్పూరు పేపరు మిల్లు యాజమాన్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ను అడ్డుపెట్టుకుని అడ్డు పడుతోందని ఆరోపించారు. కార్మికులకు వేతన ఒప్పందం సజావుగా జరగాలంటే గుర్తింపు కార్మిక సంఘంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. మిల్లు యాజమాన్యం ఎగవేత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. పరి శ్రమ తెరిచి ఎనిమిదేళ్లయినా పూర్తి స్థాయిలో ఉత్పత్తి వస్తున్నా కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు సీఐటీయూ కృషి చేస్తుందని చెప్పారు. యూనియన్ జనరల్ సెక్రటరీ కూశన రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్, ఉపాధ్యక్షుడు ముంజం శ్రీనివాస్, మహ్మద్షబ్బీర్, వెంకటేశం, సహాయ కార్యదర్శులు మహేశ్, రాజేందర్, రామ్, రాజన్న, రమేశ్, త్రివేణి, రాజేందర్ పాల్గొన్నారు. -
సీహెచ్సీగా అప్గ్రేడ్ చేయాలి
ఆసిఫాబాద్రూరల్: రెబ్బెన పీహెచ్సీని సీహెచ్సీగా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ శుక్రవా రం ఏఐటీయూసీ అధ్వర్యంలో అదనపు కలెక్టర్ డేవిడ్కు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ.. రెబ్బెన మండలంలోని 24 గ్రామపంచా యతీలతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజ లు లక్ష మంది వరకు రెబ్బెన పీహెచ్సీపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. పీహెచ్సీలో అత్యవసర సేవలు అందుబాటులో లేక బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాలతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులకు పోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఐపీహెచ్ఎస్ నిబంధనల ప్రకారం వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో 50వేల జనాభాకు ఒక సీహెచ్సీ ఉండాలని తెలిపారు. ఇందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు చొరవ తీసుకోివాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థా యి రహదారి భద్రత కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల్లో నేషనల్ హైవే అధికారులు లైటింగ్ ఏర్పాటు చేయాలని, సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు, సైడ్ డ్రైన్లు నిర్మించాలని, పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. రహదా రులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, వేలాడే తీగలను సరి చేయాలని, రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలకు రేడియం స్టిక్కర్లు అంటించాలని పేర్కొన్నారు. వాహనాలు, స్కూల్ బస్సుల ను తనిఖీ చేయాలని తెలిపారు. రహదారులకు మ రమ్మతు, వంతెనల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదం జరి గితే వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సి పాలిటీలు, మండల కేంద్రాల్లో వాహనాల రద్దీ లేకుండా చూడాలని, మద్యం తాగి, హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రహదారి నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, డీఆర్డీవో దత్తారావ్, రవాణాశాఖ అధికారి రాంచందర్, డీపీవో భిక్షపతి, ఎస్ఈ ఉత్తమ్జాడె, పీఆర్ ఈఈ ధర్మేందర్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. -
అండర్బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన
కాగజ్నగర్రూరల్: మండలంలోని దుర్గానగర్ రైల్వే ట్రాక్ సమీపంలో అండర్బ్రిడ్జి నిర్మాణానికి రోడ్ సెక్టార్ ప్రాజెక్ట్ రైల్వే భూ సేకరణ నిపుణుడు దేవరాజు, కాగజ్నగర్ తహసీల్దార్ మధూకర్ శుక్రవారం స్థల పరి శీలన చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే లైన్ విస్తరణ, అభివృద్ధిలో భాగంగా లెవల్ క్రాసింగ్ లైన్ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రోడ్డు అండర్ బ్రిడ్జీలు నిర్మించనుందని తెలిపారు. ఇందులో భాగంగా దుర్గానగర్, వేంపల్లి గ్రామాల మధ్య కేఎం195/29–31 వద్ద ఎల్సీ 79 లెవల్ క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి జాయింట్ సర్వేచేసినట్లు పే ర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈ లక్ష్మీనారాయణ, ఏఈఈ క్రాంతి, సా యికుమార్, దుర్గానగర్, వేంపల్లి గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. -
కౌన్సెలింగ్ నిర్వహించాలి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో విధులు నిర్వహిస్తున్న ఈపీ ఫిట్టర్ల కు కౌన్సెలింగ్ నిర్వహించాలని హెచ్ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజా బాబు కోరారు. శుక్రవారం ప్రాజెక్ట్ ఇంజినీర్ వీరన్నను కలిసి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో వి నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ఖైరిగూర ఓసీపీలో పని చేస్తున్న ఈపీ ఫిట్టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి వీటీసీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిని కౌన్సెలింగ్లో వెళ్లే వారి స్థానంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స కాలంలో కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో కార్మికులు అన్ని విధాలా నష్టపోతున్నారని తె లిపారు. ఓసీపీ ఇన్చార్జి వెంకటేశ్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి కుమార్గౌడ్, ఏరియా ఆర్గనైజర్లు ఎస్కే ఇనూస్, కళ్యాణ్, రాజశేఖర్చారి, ఎండీ జానీ, శ్రీనివాస్ తదితరులున్నారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడి
కాగజ్నగర్టౌన్: పంట మార్పిడితో అధిక దిగుబ డులు పొందవచ్చని ఏడీఏ మనోహర్ సూచించా రు. శుక్రవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మండలంలోని రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరై మా ట్లాడారు. రైతులు పంట మార్పిడి చేయాలని, ఏటా పత్తి, వరి సాగు చేస్తే భూసారం తగ్గి దిగుబడిపై ప్ర భావం పడుతుందని పేర్కొన్నారు. భూమిలో ఉండే పోషక లవణాలు కూడా తగ్గిపోతాయని తెలిపా రు. అధికంగా యూరియా, డీఏపీ వాడడంతో భూ సారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామకృష్ణ, ఏఈవోలు దుర్గాభవాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి కొనుగోళ్లు సాగేనా..!
చెన్నూర్:ఉమ్మడి జిల్లాలోనే మామిడి దిగుబడిలో మంచిర్యాల జిల్లాకు పేరుంది. మంచిర్యాల జి ల్లాలో 6,707 మంది రైతులు ఉండగా 15, 643.77 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట లు ఉన్నాయి. జిల్లాలో దిగుబడి అయిన నా ణ్యమైన మామిడి తెలంగాణ, మహారాష్ట్ర, గుజ రాత్, ఢిల్లీ, తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతుంది. ఇక్కడి మామిడికి అన్ని రా ష్ట్రాల్లో డిమాండ్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల ప్రజ లు, వ్యాపారులు ఇక్కడి మామిడి పైనే దృష్టి సా రిస్తున్నారు. కానీ ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్నచందంగా ఉంది జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి. జిల్లాలో స్థిరమైన మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో రైతులు మామిడి కా యలు విక్రయించేందుకు మహారాష్ట్రలోని నాగ్పూర్కు వెళ్లాల్సి న దుస్థితి నెలకొంది. మేలైన రకాలకు మంచిర్యాల మామిడి... జిల్లాలో అధిక దిగుబడి వచ్చేమామిడిలో ఎన్నో రకాలు ఉన్నాయి. బంగెనపల్లి, తోతపరి, హిమన్పసంద్, కొత్తపల్లి కొబ్బరి, చెరుకురసం, పెద్ద రసాలు, చిన్న రసాలు, గుట్లీ, దసలి మాత్రమే కాకుండా మరెన్నో రకాల మామిడికాయలు లభిస్తాయి. ఈ ప్రాంత కాయలు రుచితో పాటు నాణ్యత ఎక్కువగా ఉండడంతో వివిధ రాష్ట్రాల వ్యాపారులు మంచిర్యాల జిల్లా మామిడిపైనే ఆధారపడుతారు. మామిడి కాతకు ముందే నాగ్పూర్ వ్యాపారులు జిల్లా రైతులను కలిసి అడ్వాన్స్లు ఇచ్చి వెళ్తుండడం విశేషం. బెల్లంపల్లిలో మార్కెట్ ఏర్పాటు చేసినా.. గతేడాది బెల్లంపల్లిలో మామిడి మార్కెట్ను ప్రారంభించారు. మామిడి విక్రయాలు జరిపేందుకు ఇద్దరే లైసెన్స్ తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు సైతం మార్కెటింగ్ చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు మార్కెట్ను నామమాత్రంగా నడిపించారు. రైతులు స్థానికుల కోసం కొద్దిరోజులు మార్కెట్ నడిపి ఆతర్వాత బంద్ చేశారు. ఈ ఏడాదిలో ఈ నెలాఖరు నుంచి మామిడి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు రైతు ల లైసెన్సులను పెంచడం లాంటి చర్యలు నేటికీ అధికారులు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది సైతం మార్కెట్కు వ్యాపారులు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపడుతారా? లేదంటే రైతులు నాగ్పూర్ మార్కెట్కు వెళ్లాల్సిందేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి మార్కెట్కు వ్యాపారులు వచ్చేలా.. జిల్లా రైతులు నాగ్పూర్ మార్కెట్కు వెళ్లాలంటే వేలాది రూపాయల రవాణా చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. ఒక్కో లారీకి రూ.16 వేల నుంచి రూ.20వేల వరకు కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైతులకు వచ్చే లాభం కిరాయిలకే పోతుంది. బెల్లంపల్లి మార్కెట్కు వ్యాపారులు వచ్చేలా అధికారులు చర్యలు చేపడితే మేలు జరుగుతుందని మామిడి రైతులు పేర్కొంటున్నారు. చెన్నూర్ ప్రాంతంలో కోసిన మామిడి కాయలు నియోజకవర్గాల వారీగా మామిడి సాగు విస్తీర్ణం నియోజకవర్గం రైతులు ఎకరాలు బెల్లంపల్లి 3,433 8,517.42 చెన్నూర్ 2,905 6,173.21 మంచిర్యాల 369 953.14 మొత్తం 6,707 15,643.7715న సమావేశం గతేడాది బెల్లంపల్లి మామిడి మార్కెట్లో ఇద్దరు మాత్రమే లైసెన్సులు పొందారు. మార్కెట్ ప్రారంభించినప్పటికీ వ్యాపారులు రాకపోవడంతో కొనుగోళ్లు జరగలేదు. ఈ ఏడాది జిల్లా మార్కెట్కు వ్యాపారులు, రైతులు వచ్చేలా కృషి చేస్తాం. ఈ నెల 15న రైతులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఏప్రిల్లోనే మార్కెట్ను ప్రారంభించేందుకు కృషి చేస్తాం. – షాబొద్దీన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, మంచిర్యాల తగ్గిన దిగుబడి.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది చెట్లకు పూత రాలిపోవడంతో కాయలు నిలువలేదు. దీంతో ఎకరం విస్తీర్ణంలో 20 నుంచి 30 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా 5 నుంచి 6 టన్నులు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి 50 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. -
కాలభైరవ స్వామికి పూజలు
రెబ్బెన: ఇందిరానగర్లో గల కనకదుర్గాదేవీ, స్వ యంభూ మహంకాళి దేవస్థాన క్షేత్ర పాలకుడు కా లభైరవ స్వామికి శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టు పక్కల మండలాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. స్వామివారిని ద ర్శించుకుని కూష్మాండ, నెయ్యి దీపాలతో దీపారాధ న చేశారు. మంగళహారతులతో ప్రత్యేక పూజలు చే శారు. స్వీట్లు, మద్యం నైవేద్యంగా సమర్పించి మొ క్కు తీర్చుకున్నారు. కాలభైరవ స్వామి అష్టకం, జ పం, ధ్యానం పారాయణాలు చేశారు. ప్రధాన అర్చకుడు వినోద్స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
12న రక్తదాన శిబిరం
కాగజ్నగర్టౌన్: జగ్జీవన్రామ్, అంబేడ్కర్ జయంతుల సందర్భంగా ఈనెల 12న టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని నర్సింగ్హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్తదాతలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. మెడికల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సునీత, రావుజీ, టీఎస్యూటీఎఫ్ నాయకులు రాజ్కమలాకర్రెడ్డి, మహిపాల్, ఫణతి, మహేశ్, సునీల్ తదితరులున్నారు. -
కుమురం భీం
7ఉత్తమ ప్రతిభకు స్టార్ అవార్డులు జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ హైస్కూల్లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. చదువు, క్రీడలు, హాజరు తదితర అంశాల్లో ముందున్నవారికి అవార్డులు ఇస్తున్నారు. మామిడి కొనుగోళ్లు సాగేనా? మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్థిరమైన మార్కెట్ సౌకర్యం లేక దిగుబడిని విక్రయించేందుకు నాగ్పూర్కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఉక్కపోత అధికమవుతుంది. వేడి గాలులు వీచే అవకాశముంది. శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 -
దాహం తీరేలా..
పెంచికల్పేట్: వేసవిలో ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టా రు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలను గుర్తించి నీటి కుంటలు, సోలార్ కుంటలు, చెక్డ్యాంలు, సాసర్ పిట్లు నిర్మించారు. సాసర్ పిట్లలో ప్రతీ వారం ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. నీటి ఆవాసాల వైపు వస్తు న్న వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా ప్ర త్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంరక్షణకు చర్యలు చేపడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. రెండు ఫారెస్ట్ డివిజన్లలో..జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లున్నాయి. ఆయా డివిజన్లలో 11 రేంజ్లు, 79 సెక్ష న్లు, 245 బీట్లు, 846 కంపార్టుమెంట్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, మెకాలు, దుప్పులు, నీలుగాయిలు, కొండ గొర్రెలు, అడవి పందులతో పాటు అనేక రకాల జంతువులు ఆవాసంగా మార్చుకుని జీవనం సాగిస్తున్నా యి. నిత్యం నీటితో కళకళలాడే అటవీ ప్రాంతంలో ని సహజ నీటి వనరులు ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణులు నీటి కోసం అడవులను దాటి వేటగాళ్లకు చిక్కి మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులకు నీటి కొర త లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో నే అవి సంచరించే ప్రాంతాలను గుర్తించి సోలార్ నీటి కుంటలు నిర్మించారు. పగలంతా సోలార్ పంపు సెట్ల ద్వారా కుంటల్లో నీటిని నింపుతున్నారు. మరో వైపు కుంటలు లేని చోట సాసర్ పిట్లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా వారానికోసారి నీటితో నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. నీటి వనరుల వద్ద రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో సెక్షన్, బీట్ అధికారులు ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణకు నిఘా ఏర్పాటు చేశారు. అవి వేటగాళ్ల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నారు. పోతెపల్లి అటవీ ప్రాంతంలో నిర్మించిన సోలార్ నీటి కుంటసంరక్షణకు పకడ్బందీ చర్యలు వేసవిలో అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు సాసర్పిట్లలో నీటిని నింపుతున్నాం. అడవుల్లో ఉన్న సహజ నీటి వనరులు ఎండిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులు నీటి కోసం అడవిని దాటి బ యటకి రాకుండా నీటి వసతి కల్పిస్తున్నాం. వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ
లక్ష్మణచాంద: రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఒకరికి గాయాలైన సంఘటన సోన్ మండలంలో ని కడ్తాల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూర్ బయలుదేరిన లారీ శుక్రవారం తెల్లవారుజామున కడ్తాల్ శివారులో ఎన్హెచ్ 44పై ఆగి ఉంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూర్ వైపు వెళ్తున్న మరోలారీ నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో క్లీనర్ ప్రదీప్కుమార్ త్రిపాఠికి తీవ్రగాయాలు కావడంతో నిర్మల్లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనలో నిలిపిన లారీ ధ్వంసం కావడంతో డ్రైవర్ వికాస్ సాకేత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢీకొట్టిన డ్రైవర్ మానస్ త్రిపాఠిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు. దంపతులపై కేసునెన్నెల: మండలంలోని నార్వాయిపేటకు చెంది న దంపతులు కున్సోతు రమేశ్, రజితపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఆలి తెలిపారు. మేకల విషయంలో కున్సోతు అర్చనతో జరిగిన గొడవలో దంపతులు ఆమెను దూషించడంతో పాటు కొట్టారని సదరు మ హిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్సై వివరించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలునర్సాపూర్(జి): మండలంలోని అర్లి(కె) ఎక్స్రోడ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. తురాటి గ్రామానికి చెందిన ప్రసాద్ పనినిమిత్తం బైక్పై భైంసా వైపు వెళ్తుండగా అర్లి(కె) ఎక్స్రోడ్డు వద్దకు రాగానే కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. కుడికాలు విరగడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ వైరు చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో కై లాస్ సింగ్ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. హౌస్ వైరింగ్ కోసం 41 బండిళ్లను తెప్పించగా గుర్తు తెలియని దుండగులు శుక్రవారం తెల్లవారుజామున వాటిని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. -
వేర్వేరు చోట్ల మొక్కజొన్న పంట దగ్ధం
నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పలువురు రైతులకు చెందిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. భైంసారూరల్ మండలంలోని కామోల్లో మూడెకరాలు, కుంటాల మండలంలోని లింబా(కె)లో రెండెకరాలు, తానూరు మండలంలోని దాగాంలో రెండెకరాలు, నర్సాపూర్(జి) మండలంలోని టెంబరేణిలో ఎనిమిదెకరాల్లో పంట అగ్నికి ఆహుతైంది. భైంసారూరల్: మండలంలోని కుంసర శివారులో శుక్రవారం కామోల్ గ్రామానికి చెందిన కౌలు రైతు మల్లేశ్కు చెందిన మూడెకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న బాధిత రైతు పంట పొలానికి వెళ్లి చూడగా పంట పూర్తిగా కాలిబూడిదైంది. గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని బాధిత రైతు కోరుతున్నాడు. లింబా(కె)లో... కుంటాల: మండలంలోని లింబా(కె) గ్రామంలో బుసాపూర్ రాజేశ్వర్రెడ్డి రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. చేనుపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల నుంచి నిప్పురవ్వలు పడడంతో నిప్పంటుకుని పంటచేను దగ్ధమైంది. దాదానె రూ.లక్ష నష్టం జరిగిందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. దాగాంలో... తానూరు: మండలంలోని దాగాంలో రైతు జాదవ్ సుధాకర్ పటేల్ తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. వారం రోజుల క్రితం పంటను కోసి చేనులోనే ఉంచాడు. శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ వద్ద విదు్య్త్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగడంతో పంటకు నిప్పంటుకుని సుమారు 50 క్వింటాళ్ల మొక్కజొన్న దగ్ధమైంది. సుమారు రూ.1.20 లక్షల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. వ్యవసాయ విస్తీర్ణ అధికారి సిరాజ్ ఘటన స్థలానికి చేరుకుని దగ్ధమైన పంటను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. టెంబరేణిలో... నర్సాపూర్(జి): మండలంలోని టెంబరేణిలో రైతులు నిమ్మల శ్రీధర్రెడ్డి, నిమ్మల శ్రీనివాస్రెడ్డి, మెంచు భార్గవ్ సుమారు 8 ఎకరాల్లో మొక్కజొన్నను కో సి నూర్పిడికి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో వి ద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పంట పూర్తిగా దగ్ధమైంది. ప్రశాంత్ అనే రైతు విత్తనం కోసం నిల్వ ఉంచిన పసుపు అగ్నికి ఆహుతైంది. రైతులు కష్టపడి పండించిన పంట దగ్ధం కావడంతో కన్నీరు ము న్నీరవుతున్నారు. ప్రభుత్వం పరిహారం అందించా లని ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
సామూహిక వివాహ వేడుకలు
ఇంద్రవెల్లి: మండలంలోని దస్నాపూర్లో సంత్ సద్గురు పూలాజీబాబా ధ్యాన్ కేంద్రం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని ఆంద్ ఆదివాసీ సమాజ్కు చెందిన 8 జంటలు ఏకమయ్యాయి. నిరుపేద కుటుంబాల్లో వివాహ ఖర్చు తగ్గించడానికే ఏటా పూలాజీబాబా ధ్యాన్ కేంద్రంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నమని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాందాస్, గ్రామపటేల్ పుండలిక్, కరాడే మారుతి, కేశవ్, రాందాస్, పోటే సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు. 16న పండ్ల తోటలకు మెగా వేలంఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీలలో ఉన్న పండ్ల తోటలకు ఈ నెల 16న ఐటీడీఏ కార్యాలయంలో మెగా వేలం పాట ని ర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి యువరాజు మర్మాట్ శుక్రవారం ఒక ప్రకటనలో తె లిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఆసిఫా బాద్ జిల్లా జంబుగా, రాజంపేట, మంచిర్యాల జిల్లా భీమారం, బెల్లంపల్లిలోని మామిడి, సపోటా తోటలకు వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతానికి భిన్నంగా మూడేళ్లకు కలిపి ఈ వేలం పాట ఉంటుందని, వ్యాపారులు, రైతులు వేలంలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఐటీడీఏ ఉద్యానవన అధికారిని సంప్రదించాలన్నారు. విద్యుత్ కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాదంఖానాపూర్: పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయం గేటు సమీపంలో ఉన్న పురాతన పైపులు, ఇతర సామగ్రికి నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది, స్థానికులు ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబాన్ని కాపాడిన పోలీసులు బాసర: నిజామాబాద్కు చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి బాసర గోదావరిలో దూకేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అశ్విని తన ముగ్గురు పిల్లలతో కలిసి బాసర గోదావరినదిలో దూకేందుకు యత్నిస్తుండగా గమనించిన స్థానిక పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. హెడ్ కానిస్టేబుల్ సంతోష్ వారికి కౌన్సెలింగ్ నిర్వహించి బాధితురాలి తల్లికి అప్పగించారు. -
ఈర్లగండిలో పురాతన శిల్పాల గుర్తింపు
ఖానాపూర్, పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఈర్లగండి (వీరులగండి) ప్రాంతంలో రెండు పురాతన వీరగల్లు శిల్పాలను ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్ కుమార్ ఇటీవల గుర్తించారు. వీరగల్లు శిల్పంలో వీరుడు కుడిచేతిలో బాకుతో, నడుముకు కత్తితో, చేతులు కాళ్లకు కడియాలతో, దండలకు వెండి కడియాలతో శత్రువుతో హోరాహోరీగా పోరాడుతున్నట్లు ప్రతిబింబించబడింది. పైభాగంలో సూర్య, చంద్రుల చిహ్నాలు చెక్కబడి ఉండటం గమనార్హం. ఈ శిల్పం క్రీస్తుశకం 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. మరోవీరగల్లు శిల్పం.. అక్కడే మరో వీరగల్లు రెండు అంతస్తులుగా చెక్కబడి ఉంది. పైభాగంలో వీరుడు చెవులకు జూకాలు ధరించి, కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో డాలు పట్టుకుని ఉండగా కింది అంతస్తులో అదే వీరుడు తన యుద్ధాశ్వాన్ని ప్రేమగా నిమురుతూ చూపించబడింది. తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరా మోజు హరగోపాల్ విశ్లేషిస్తూ, వీరుడు మాత్రమే కాకుండా అతని గుర్రం కూడా యుద్ధంలో ప్రాణా లు విడిచిందని అర్థమని తెలిపారు. ఇది క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిందని, చాళుక్య శైలిలో చెక్కబడినదిగా గుర్తించారు. వీటి సమీపంలోనే ఒక పురాతన మంచినీటి బావి కూడా ఉంది. ఈ వీరగల్లుల ఆధారంగా ఈ ప్రాంతానికి ఈర్లగండి (వీరులగండి) అనే పేరు స్థిరపడినట్లు తెలుస్తోంది. పురాతన మంచినీటి బావి -
అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు
ఉట్నూర్రూరల్:ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో పనుల పు రోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో చే పట్టిన అభివృద్ధి పనులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఆరోగ్యం, గిరిజన సహకార సంస్థ, ఇంజినీరింగ్, విద్య, గురుకులాలు, మహిళా, శి శు సంక్షేమం, ఉద్యానవన, వ్యవసాయ, గ్రామీణ నీ టి సరఫరా, భూ వివాదాలు, అటవీ హక్కుల చ ట్టం, తదితర విభాగాల అధికారులు తమకు కేటా యించిన పనులను నిర్ణీత గడువులోగా చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల ప్రగతిని వివరించారు. -
డిగ్రీ పరీక్షల విభాగంలో సంస్కరణలు
నిర్మల్ఖిల్లా: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానంలో నూతన సంస్కరణలు తీసుకురానున్నట్లు విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకటయ్య వెల్లడించారు. కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనంపై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధ్యాపకులకు ఆన్లైన్ మూల్యాంకన విధానం, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేయూ వైస్ ఛాన్స్లర్ ప్రోఫెసర్ ప్రతాప్రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ సూచనల మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సెమిస్టర్ల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిగా ఆన్లైన్లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దీంతో మూల్యాంకనం వేగవంతం అవుతుందని, ఫలితాలు సకాలంలో విడుదలవుతాయని వెల్లడించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గంగాధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం సూపరింటెండెంట్ ప్రతాప్, టెక్నికల్ అసిస్టెంట్లు కుమార్, విష్ణు, విజయ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ హేమలత, సూర్యసాగర్, పీజీ.రెడ్డి, అర్చన, సుభాష్, శ్రీనివాస్, రమేశ్రెడ్డి, శ్రీహరి, పవన్కుమార్, ఉమేష్, రజిత, రహమాన్, దిలీప్, రవీందర్, రంజిత్, నరేందర్, త్రిపాఠి, మురహరి, మునావర్ తదితరులు పాల్గొన్నారు. -
మేదరిపేట వైన్స్లో కల్తీ బీర్లు!
దండేపల్లి: మండలంలోని మేదరిపేటలో గల ఓ వైన్స్ దుకాణంలో కల్తీ బీర్లు వచ్చాయని మామిడిపల్లికి చెందిన శ్రీనివాస్, మధుకర్ ఆరోపించారు. మేదరిపేటలోని 36వ నెంబర్ వైన్స్ దుకాణంలో శుక్రవారం 5 బీర్లు కొనుగోలు చేశామని, అందులో 2 బీర్లు కల్తీ వచ్చాయని, వాటిని ఓపెన్ చేస్తే చెడు వాసన వచ్చిందన్నారు. విషయాన్ని షాప్ నిర్వాహకులకు తెలియజేస్తే, ‘అక్కడి నుండే వచ్చాయ్.. దానికి మేమేం చేస్తాం..’ అంటూ పొంతనలేని సమాధానం ఇచ్చారన్నారు. దీంతో విషయాన్ని లక్సెట్టిపేట ఎకై ్సజ్ సీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ విషయమై లక్సెట్టిపేట ఎకై ్సజ్ సీఐ సమ్మయ్యను ఫోన్లో సంప్రదించగా, కల్తీ జరిగిందని కొందరు నాకు ఫోన్ చేశారని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. -
హామీలు నెరవేర్చాలి
రెబ్బెన: ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తింపు సంఘం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. గోలేటి సీహెచ్పీలో గురువారం టీబీజీకేస్ ఆధ్వర్యంలో ఫిట్ కార్యదర్శి రమేశ్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. శ్రీని వాసరావు మాట్లాడుతూ సింగరేణిలో రాజకీ య జోక్యం పెరిగిందని, కార్మికులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అన్ఫిట్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడంతో వేలాది కుటుంబాలు అయోమయంలో ఉన్నాయని తెలిపా రు. ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో సింగరేణిలో ఉద్యోగులు ఎక్కువయ్యారని అనడాన్ని ఖండిస్తున్నామన్నారు. నాయకులు మంగీలాల్, వెంకటేశ్, కిరణ్, శ్రీనివాస్, బొంగు వెంకటేశ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
యాప్లో ఇసుక
ఆసిఫాబాద్: అక్రమ రవాణాను నియంత్రించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ యాప్, ఆన్లైన్ విధానంతో ఇసుక బుకింగ్ ప్రక్రియను ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చింది. కలెక్టర్ కె.హరిత జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఇసుక సరఫరాలో పారదర్శకత కోసం ఈ విధానం అమలు చేస్తున్నప్పటికీ కొత్త నిబంధనలు భారంగా మారాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా సామాన్యులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్లైన్ బుకింగ్లో సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. ఇంటి అనుమతి, ఇతర సర్టిఫికెట్లతోపాటు డ్రైవర్ లైసెన్సు, ట్రాక్టర్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో రవాణాకు నిర్దిష్ట సమయం లేకపోగా, కొత్త విధానంలో మాత్రం పగటిపూట మాత్రమే రవాణా చేయాలనే నిబంధన చేర్చారు. ధరల భారంమన ఇసుక వాహనం ద్వారా బుకింగ్ చేయాలంటే యాప్లో ట్రాక్టర్కు రూ.775, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ కింద రూ.115 చెల్లించాలి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత రవాణా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జిల్లాలో అమలు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రూ.1400కు ట్రాక్టర్ ఇసుక లభించింది. తాజా నిబంధనలతో ప్రభుత్వానికి రూ.775 చెల్లించాల్సి ఉండగా, ఇతర ఖర్చులతో కలిపి ఒక్కో ట్రాక్టర్కు రూ.2500 వెచ్చించాల్సి వస్తోంది. నిర్మాణదారులపై దాదాపు రెట్టింపు భారం పడుతోంది. ట్రాక్టర్ యజమానులు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ రంగ ధరలు పెరుగుతుండగా తాజాగా ఇసుక ఆన్లైన్ బుకింగ్ పద్ధతితో మరింత భారంగా మారిందని ట్రాక్టర్ యజమానులు, నిర్మాణదారులు వాపోతున్నారు. కొత్త విధానంతో జిల్లాలోని నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. పొరుగున్న ఉన్న మంచిర్యాల జిల్లాలో ఒక్కో ట్రాక్టర్కు రూ.445 చెల్లిస్తుండగా, మన జిల్లాలో ఒక్కో ట్రాక్టర్కు రూ.775 విధించడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 14 ఇసుక రీచ్లుఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్నగర్, సిర్పూర్–టి, పెంచికల్పేట్, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం మండలాల్లో మొత్తం 14 ఇసుక రీచ్లను అధి కారులు గుర్తించారు. మన ఇసుక వాహనం బుకింగ్ ప్రక్రియ ఈ నెల 1న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 269 ట్రాక్టర్లు బుక్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 84 మందిపై 48 కేసులు నమోదు చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఫోన్ లేదా మీసేవలో ఇసుక బుకింగ్ చేసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రవాణా చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు 8 ట్రాక్టర్ల వరకు పొందవచ్చు. ఇతర నిర్మాణాలకు అనుమతి పత్రాలతోపాటు ట్రాక్టర్ డ్రైవర్ వివరాలతో యాప్లో బుక్ చేసుకోవాలి. – గంగాధర్, మైనింగ్ శాఖ ఏడీ -
దరఖాస్తు చేసుకుంటే అందిస్తాం
సాగులో సాంకేతికను పెంపొందించడానికి ప్రభుత్వం సబ్సిడీపై డ్రోన్లు మంజూరు చేస్తుంది. మూడు రోజుల క్రితం దహెగాం, కొత్తపేట, గురుడుపేట సొసైటీలకు సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద మూడు స్ప్రే డ్రోన్లను అందించాం. రైతులకు కూడా 40 శాతం సబ్సిడీపై అందిస్తాం. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలి. పత్తి కట్టె, వరిగడ్డిని భూమిలో కలిపే మల్చర్ అనే యంత్రాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కట్టెను చిన్నగా కట్ చేసి ఎరువులా మార్చుకుంటే భూమికి పోషకాలు అందుతాయి. – వెంకట్, జిల్లా వ్యవసాయాధికారి -
రుచికరమైన భోజనం అందించాలి
వాంకిడి: విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. వాంకిడి మండలం బెండార గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంటశాల, మూత్రశాలలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షల తీరుపై ఆరా తీశారు. కొందరు విద్యార్థులు గైర్హాజరు కావడాన్ని గమనించి ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గైర్హాజరవుతున్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవీఎంల గోదాం పరిశీలనఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) భద్రపరిచే గోదాంను నెలవారీ తనిఖీల్లో గురువారం కలెక్టర్ హరిత పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం అధికారులు జమీల్, శ్యాంలాల్, ముసాఫిర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఉద్యానవనాన్ని పరిశీలించారు. -
గెలుపోటములు సహజం
రెబ్బెన: క్రీడల్లో గెలుపోటములు సహజమని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. రెబ్బెన మండలం గోలేటిలోని భీమన్న స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 37వ వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషనల్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. ఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జిల్లాకు చెందిన గంగాధర జట్టు 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా, అనంత రం మందమర్రి సింగరేణి ఫ్రెండ్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేయడంలో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో మందమర్రి జట్టు 9 పరుగులు చేయగా, గంగాధర జట్టు 3 బంతుల్లో 12 పనులు చేసి విజేతగా నిలిచింది. గంగధర జట్టుకు రూ.35 వేల నగదు, కప్పు, మెడల్స్, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగదు, కప్పు, మెడల్స్ అందించారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి, ప్రాజెక్ట్ ఇంజినీర్ వీరన్న, డీజీఎం సివిల్ మదీనా బాషా, పర్సనల్ హెవోడీ ఎస్వీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రభుత్వంలో ఉద్యమకారుడికి గుర్తింపు
కాగజ్నగర్టౌన్: ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, దివంగత ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యకు గుర్తింపు దక్కిందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని భట్టుపల్లి చౌరస్తాకు కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేయగా గురువారం బోర్డును ప్రారంభించారు. దివంగత ఎమ్మెల్యే సమ్మయ్య సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కావేటి సాయిలీల మాట్లాడుతూ కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేయడంలో చొరవ చూపిన ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ పాలకవర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కావేటి సమ్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, వసీమున్నిసా, కావేటి విజయ్కుమార్, నాయకులు ఎమ్మాజీ సంతోష్, యూసుఫ్, కొండ్ర జగ్గాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సాగులో సాంకేతికత
దహెగాం: రోజురోజుకూ సాగులో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అరకలు అదృశ్యమవుతుండగా ట్రాక్టర్లు, రోట్వేటర్లతో పొలాలు దున్నుతున్నారు. ప్రారంభంలో పంటలను క్రిమికీటకాల నుంచి కాపాడుకోవడానికి స్ప్రే పంపులు వినియోగించగా, తర్వాత తైవాన్ స్ప్రేయర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మరింత టెక్నాలజీతో డ్రోన్లు వినియోగంలోకి వస్తున్నాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ప థకం కింద 40శాతం సబ్సిడీతో అందించనున్నారు. డ్రోన్ల సహాయంతో సుమారు 25 నిమిషాల్లోనే పది ఎకరాల్లో పంటలకు మందులు పిచికారీ చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జిల్లాలోని మూడు సహకార సంఘాలకు 40 శాతం సబ్సిడీతో అందించగా, వ్యక్తిగతంగా రైతులకు కూడా అందించనున్నారు. 4.50 లక్షల ఎకరాల్లో సాగు..జిల్లాలోని 15 మండలాల్లో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా పత్తి, వరి సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది వర్షాధారంగా పంటలు పండిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో బోరు బావులపై ఆధారపడి వరి సాగు చేస్తున్నారు. సాగులో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి తక్కువ ఖ ర్చుతో అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లు సబ్సిడీపై మంజూరు చేస్తున్నా రు. ఈ క్రమంలోనే పంటలకు మందులు పిచికారీ చేయడానికి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(ఎస్ఎమ్ఏఎమ్) పథకం కింద స్ప్రే డ్రోన్లను 40 శాతం సబ్సిడీపై అందించనున్నారు. మూడు రోజు ల క్రితం సిర్పూర్ నియోజకవర్గంలోని దహెగాం, కౌటాల మండలం గురుడుపేట, కాగజ్నగర్ మండలం కొత్తపేట సొసైటీలకు సబ్సిడీపై మంజూరైన డ్రోన్లను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్ పంపిణీ చేశారు. సహకార సంఘాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా రైతులకు 40 శాతం సబ్సిడీపై అందిస్తామని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. 25 నిమిషాల్లో పదెకరాలు పిచికారీపంటలకు మందులు పిచికారీ చేయాలంటే తైవాన్ స్ప్రే, హ్యాండ్ పంపుతో సమయం ఎక్కువగా పడుతుంది. ఎకరం పొలం పిచికారీ చేయాలంటే అరగంట నుంచి గంట వెచ్చించాల్సి వస్తుంది. అయితే డ్రోన్ ద్వారా పదెకరాల పొలానికి పట్టే సమయం కేవలం 25 నిమిషాలేనని అధికారులు పేర్కొంటున్నారు. దీని ద్వారా రైతులకు సమయం ఆదా అవుతుంది. సొసైటీలకు ఇచ్చిన డ్రోన్లను ఆపరేట్ చేయడానికి పైలట్ను నియమించి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సొసైటీల వద్ద ఉన్న డ్రోన్లను రైతులు అద్దెకు తీసుకోవచ్చు. డ్రోన్లో 15 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు ఉంటుంది. స్ప్రే చేసే ముందు పొలం చుట్టూ తిరిగి హద్దులు పెట్టుకున్న తర్వాత ఆపరేటింగ్ చేస్తారు. రూ.6 నుంచి రూ.9 లక్షల విలువపంటలకు మందులు పిచికారీ చేసే ఒక్కో డ్రోన్ వి లువ రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద 40 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అలాగే బ్యాటరీలు, ఒక జనరేటర్ సైతం అందిస్తారు. రైతులు సొంతంగా తీసుకుంటే అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చు. డ్రోన్ను అద్దెకు తీసుకుంటే గంటకు రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించా ల్సి ఉంటుంది. రోజుకు కనీసం 50 ఎకరాలకు పైగా నే మందులు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. -
రాంజీ గోండ్కు ఘన నివాళి
ఆసిఫాబాద్అర్బన్: తొలి స్వాతంత్య్ర యోధుడు, ఆదివాసీ ముద్దుబిడ్డ రాంజీ గోండ్ 166వ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి పోరాటంలో అనేక మంది ఆదివాసీలు బ్రిటీష్ సామ్రాజ్యవాదులు, స్థానిక రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, నాయకులు రాజ్కుమార్, పవన్కుమార్, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ కార్యాలయంలో..జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అ ధ్యక్షురాలు ఆత్రం సుగుణ మర్సుకోల రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాంజీ గోండ్ చేసిన త్యాగాలు మరువలేనివని, స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులని కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన రాంజీ గోండ్ చరిత్రను యువత తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్కుమార్, తిరుపతి, గోపాల్, నాగోరావ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7భానుడి భగభగ భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలు దాటితే సూర్యడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడిమి తాళలేక జనం గడప దాటేందుకు భయపడుతున్నారు. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత , ఉక్కపోత అధికంగా ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత కాస్త చల్లగా ఉంటుంది. మారనున్న బాసర రూపురేఖలు ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర రూపురేఖలు మారనున్నాయి. సీఎం ఆలయ పునర్మిర్మాణ పనుల కు శంకుస్థాపన చేయగా, ఇటీవల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. 8లోu శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 -
వ్యతిరేకిస్తున్న ట్రాక్టర్ యజమానులు
ఇసుక రవాణాకు పాత విధానమే కొనసాగించా లని జిల్లాలోని ట్రాక్టర్ యజమానుల సంఘం కోరుతున్నారు. ఆన్లైన్ విధానం వద్దని ఈ నెల 7న ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం సైతం అందించారు. గతంలో రూ.1400 డీడీ చెల్లించి ఇసుక రవాణా చేసే విధానం ఉండగా, ఆన్లైన్ విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అమలు ఇబ్బందికరంగా మారిందని, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలతో ట్రాక్టర్ యజమానులు ఉపాధి కోల్పోతున్నారని చెబుతున్నారు. పాత విధానం కొనసాగించాలని, అప్పటివరకు ఇసుక రవాణా నిలిపి వేస్తామని ట్రాక్టర్ యజమానుల సంఘం స్పష్టం చేసింది. -
విద్యార్థులకు ‘స్టార్’ అవార్డులు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు విన్నూత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు గురువారం అవార్డులు, స్టార్ ఆఫ్ ద మంత్ పేరుతో ప్రత్యేకంగా బ్యాడ్జీలు అందించినట్లు ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. హెచ్ఎం ఉమబాల మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి మరింత రాణించేలా స్టార్ అవార్డుల కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల్లో పోటీతత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. -
‘కోఆప్షన్’కు పోటాపోటీ
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో పరిధిలో కోఆప్షన్ పదవుల సందడి నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు పోటీ పడుతున్నారు. నేటితో గడువు ముగియనుండగా, ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారో తేలనుంది. ఎవరికివారు ప్రస్తుతం లాబీయింగ్ చేసుకుంటున్నారు. పట్టణంలో 30 వార్డులు ఉండగా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకున్నాయి. చైర్పర్సన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ షాహిన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్గా డాక్టర్ కొత్తపల్లి అనిత ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికై న 60 రోజుల వ్యవధిలో కచ్చితంగా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. దీంతో అధికారులు ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేయగా, శుక్రవారం దరఖాస్తు గడువు ముగియనుంది. రెండో రోజులు దరఖాస్తుల పరిశీలన చేపట్టి తర్వాత ఎన్నిక తేదీని ప్రకటిస్తారు. పోటాపోటీ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీకి చెందిన వారికి పదవులు దక్కుతాయో వేచి చూడాల్సి ఉంది. మద్దతు కోసం లాబీయింగ్కోఆప్షన్ ఎన్నికలో సంఖ్యాబలం మాత్రమే కాకుండా అంతర్గత సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రతీ ఓటు విలువైనదిగా మారనుంది. కౌన్సిలర్ల మధ్య గట్టి లాబీయింగ్ జరుగుతోంది. కౌన్సిలర్ల మద్దతు కోసం అభ్యర్థులు తీవ్రంగా ప్రయతిస్తున్నారు. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చివరి నిమి షం వరకు సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఫలితం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో స్పష్టత లేదు. చివరి క్షణంలో మారే సమీకరణాలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. నిర్ణయాల్లో కీలకపాత్రమున్సిపాలిటీలో ఎన్నుకున్న కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తారు. పాలనలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కమిటీలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. సమావేశంలో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అభివృద్ధి పనులపై సూచనలు ఇవ్వడం, స్థానిక సమస్యలను చర్చకు తీసుకురావడం. ప్రజల అవసరాలను అధికారులకు తెలియజేస్తారు. ప్రత్యక్ష్యంగా ఎన్నిక కాకపోయినా పాలనలో మాత్రం వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఆశావహుల్లో మాజీలుమున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో కీలకంగా మారాయి. అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి పదవులు ఆశిస్తున్నారు. ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన కోటాలో రెండు పదవుల కోసం మాజీ కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల్లో కూడా మాజీలు అధికంగా ఉన్నారు. వీరంతా ఈ పదవులు దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీ కోటాలో ముస్లింలు, క్రిస్టియన్లు, బుద్ధిస్ట్లు పోటీ పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా కొంతమంది కౌన్సిలర్లకు గాలం వేసి తమ వైపు తిప్పుకుని పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి
కాగజ్నగర్టౌన్: జిల్లాలో మే చివరి వారంలో నిర్వహించే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ జిల్లాలో రాష్ట్ర మహా సభలు నిర్వహించడం గొప్ప అవకాశమన్నా రు. రాష్ట్రంలోని ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాల గురించి చర్చించనున్నట్లు వివరించా రు. సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.త్రివేణి, రాజేందర్, దినకర్, కార్తీక్, రాజ్కుమార్, ఆనంద్కుమార్, కూశన రాజన్న, మాలశ్రీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?
కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాజిపేట నుంచి బల్లార్షా వరకు రైల్వే మూడో లైన్ పనుల్లో భాగంగా కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగుపై చేపడుతున్న నూతన బ్రిడ్జి వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాక్స్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే క్రమంలో గాడర్లు జరిగి పశ్చిమబెంగాల్కు చెందిన రవితో పాటు రాజీవ్, అనుజ్, కన్నయ్య, ముస్తాఫా గాయపడ్డారు. రవి మాత్రం గాడర్ల మధ్యలో ఇరుక్కుని బయటకు రాలేకపోవడంతో తోటి కార్మికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. రవి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనకు ధైర్యం చెబుతూ సిలిండర్తో ఆక్సిజన్ అందించారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి గాడర్లను కట్ చేసి క్షతగాత్రుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆసిఫాబాద్ రోడ్– సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 208/23/13 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పనులు చేపట్టే క్రమంలో కార్మికులకు హెల్మెట్, సెఫ్టీ బెల్ట్, జాకెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ పని ప్రదేశంలో కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, సరైన రక్షణ పరికరాలు అందించకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన రైల్వే వంతెన ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకుడు ముంజం ఆనంద్కుమార్ డిమాండ్ చేశారు. గాయపడిన కా ర్మికులను బుధవారం పట్టణంలోని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు ఎలాంటి భద్ర త లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో పని చేయించడం అత్యంత అమానుషమని పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
బీజేపీ కాగజ్నగర్ పట్టణ అధ్యక్షుడి రాజీనామా
కాగజ్నగర్టౌన్: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె.శివకుమార్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంకు అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తాను గతంలో దేశ సైనికుడిగా సరిహద్దుల్లో సేవ చేశానని, అనంతరం పంచాయతీ సెక్రెటరీగా పని చేశానన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను వ్యక్తిగతంగా లాభం ఆశించకుండా సేవా భావంతో, హిందూ ధర్మంపై ఉన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరానని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్ష పదవిని ఇచ్చిందన్నారు. అనివార్య కారణాలు, సంస్థాగత లోపాలు తనను వెనక్కి నెట్టివేశాయని, దీంతో పట్టణ అధ్యక్షుడిగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వంలో కొనసాగుతూ నా చివరి శ్వాసవరకు ధర్మం, దేశం కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. -
ఎలాంటి ఆధారం లేదు
నా భర్త నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా స్పందన లేదు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో బతుకు కష్టంగా మారింది. ఎలాంటి ఆధారం లేక కూలీ పనికి వెళ్తున్నాను. ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలి.– జాడి గున్నాబాయి, గంగాపూర్, మం.చింతలమానెపల్లి జాబితా సిద్ధం చేస్తున్నాంకొత్త పింఛన్ల కోసం నిత్యం దరఖాస్తులు వస్తున్నాయి. వాటి ఆధారంగా జాబితా సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి అనుమతులు రాలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తాం. అర్హులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. – దత్తారావు, డీఆర్డీవో -
జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చి 330 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేశామని, జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుబోధ్కుమార్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు సమకూర్చి సేవల్లో నాణ్యత పెంచుతామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చే నిధులను అత్యవసర మందులు, ఆక్సిజన్, ఇతర పరికరాల కొనుగోలుకు వినియోగించాలని, ఇతర అవసరాలకు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్కు కేటాయించాలన్నారు. మార్చురీ వ్యాన్, అంబులెన్స్ కోసం, ప్రత్యేక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నందున అవసరమైన ఆపరేషన్ థియేటర్, పరికరాలు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి నివేదించేందుకు కమిటీ సభ్యులు ఆమోదించినట్లు వెల్లడించారు. సమావేశంలో వైద్యులు, కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బెజ్జూర్ ఆస్పత్రి తనిఖీ కౌటాల: బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ కె.హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు రికార్డులతోపాటు వార్డులు, పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ మా ట్లాడుతూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సే వలు అందించాలన్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలని, గర్భిణులు ప్రభుత్వ వైద్యంపై అవగాహన కల్పించాలని, వడదెబ్బపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల, తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
‘డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె’
ఆసిఫాబాద్అర్బన్: ఆర్టిజన్లు, అన్మాన్, పీస్ రేట్, స్పాట్ బిల్లర్, ఇతర కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతోందని తెలంగాణ విద్యుత్ అర్టిజన్లు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ మారుతి, కన్వీనర్ షేక్ నసీరొద్దీన్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. వారు మాట్లాడుతూ ఒకే సంస్థలో రెండు నిబంధనలు అమలు చేయడం సరికాదన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేసి, విద్యార్హతలకు అనుగుణంగా కన్వర్షన్ చేయాలన్నారు. అన్మాన్ కార్మికులను ఆర్టిజన్గా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని కోరారు. 2026 పీఆర్సీ ప్రకారం వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్ కమిటీల నాయకులు బుచ్చి బాబు, లక్ష్మణ్, రాజేశ్, సతీశ్, మల్లేశ్, శిరీష, శ్రీకాంత్, రమేశ్, సలీం పాషా, సాగర్, ఏకాంబరం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీలో డుమ్మాలకు చెక్
ఆసిఫాబాద్రూరల్: ఆధునిక కాలంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యారంగంలో పారదర్శకతను పెంచేందుకు, విద్యార్థులు, అధ్యాపకుల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు విద్యాశాఖ విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పాత హాజరు పద్ధతులకు స్వస్తి పలకనుంది. డుమ్మాలకు చెక్ పెడుతూ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. తరగతులకు డుమ్మా కొట్టే విద్యార్థులకు, విధుల్లో అలసత్వం వహించే సిబ్బందికి చెక్ పెడుతూ ఉన్నత విద్యా ప్రమాణాలను సరికొత్త శిఖరాలకు చేర్చే దిశగా ముఖ గుర్తింపు ప్రక్రియ మైలురాయిగా నిలవనుంది. బయోమెట్రిక్కు స్వస్తి ఇప్పటివరకు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మిషన్లు పని చేయకపోవడం, కృత్రిమంగా వేలిముద్రలు వాడటం వంటి కారణాలతో ఉన్నత విద్యాశాఖ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి హాజరు నమోదు చేసే ఎఫ్ఆర్ఎస్ యాప్ను తీసుకువచ్చింది. రెయింట్ ఏఐ సొల్యూషన్స్ సంస్థ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రక్రియ సాగుతుంది. అధ్యాపకులు స్మార్ట్ఫోన్ ద్వారా తరగతి గదిలోనే నిమిషాల వ్యవధిలో వందలాది మంది విద్యార్థుల హాజరును నమోదు చేయవచ్చు. అధ్యాపకులు, విద్యార్థులు ఒకసారి యాప్లో తమ పేరు, ముఖం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ద్వారా ప్రతిరోజూ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో యాప్ను ఉపయోగించి ఒకేసారి వంద మంది విద్యార్థుల హాజరు తీసుకోవచ్చు. రెండు, మూడు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది. కళాశాల లొకేషన్లో మాత్రమే యాప్ పని చేస్తుంది. ఫోన్లో తీసుకున్న హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖ సర్వర్లో నమోదవుతుంది. దీంతో ఎంత మంది కళాశాలకు వచ్చారు.. ఎంత మంది గైర్హాజరయ్యారనే విషయం క్షణాల్లో తెలిసిపోతుంది. 4,583 మంది విద్యార్థులు జిల్లాలో 3 ప్రభుత్వ, 6 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా, 149 మంది అధ్యాపకులు, 4,583 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డిగ్రీ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదు చేస్తున్నందున అధ్యాపకులు ప్రత్యేకంగా హాజరు పట్టికలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులను తరగతులకు హాజరయ్యేలా చూడడంతోపాటు 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారికి స్కాలర్షిప్ నిలిచిపోనుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు దుర్వినియోగం కాకుండా చెక్ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.హాజరు శాతం పెరుగుతుందిఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్తో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. కళాశాలలో అధ్యాపకులు కూడా సక్రమంగా విధులకు హాజరవుతారు. ఎఫ్ఆర్ఎస్ సక్రమంగా అమలు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీదేవి, కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
పోషకాహారం దిశగా ‘తొలిముద్ద’
రెబ్బెన: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు ఒకపూట భోజనం అందిస్తుండగా, తాజాగా చిన్నారులకు అల్పాహారం అందించనున్నారు. ఈ పథకానికి ‘తొలిముద్ద’గా నామకరణం చేయగా, ఇటీవల సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ‘రెడీ టు కుక్’ విధానంలో ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలు అందించేలా పథకాన్ని రూపొందించారు. అయితే పథకం అమలుకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వలేదు. త్వరలో ఉత్తర్వులు రాగానే జిల్లాలోనూ ప్రారంభిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. 45,708 మంది చిన్నారులుజిల్లాలోని 15 మండలాలు పరిధిలో ఆసిఫాబాద్, జైనూర్, వాంకిడి, సిర్పూర్(టి), కాగజ్నగర్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. 1,006 అంగన్వాడీ కేంద్రాల్లో 45,708 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. తాజాగా అమలు చేయనున్న ‘తొలిముద్ద’ పథకం ద్వారా వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో అందడం లేదు. చాలామంది నేటికీ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిముద్ద పేరుతో చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించాలని నిర్ణయించింది. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో 0– 5 సంవత్సరాల లోపు చిన్నారులు ఉండగా, వారిలో ఏ వయసు వారికి అల్పాహారం అందజేస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది.ఉత్తర్వులు రాలేదు రాష్ట్ర ప్రభుత్వం తొలిముద్ద అల్పాహారం పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. ఏ వయసు చిన్నారులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారో ఇంకా తెలియలేదు. చిన్నారులకు అందించే అల్పాహారం రెడీ టు కుక్ విధానంలో ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలు ఉంటాయని చెబుతున్నారు. వాటిని అంగన్వాడీ కేంద్రాల్లో సిద్ధం చేసి పిల్లలకు అందించాలా? లేక ప్యాకెట్లను నేరుగా పంపిణీ చేయాలా? అన్నది ప్రభుత్వం నుంచి అందే ఉత్తర్వుల్లో ఉంటుంది. ఆదేశాలు రాగానే పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడతాం. – భాస్కర్, ఐసీడీఎస్ పీడీ -
కూలీల సంఖ్య పెంచాలి
ఆసిఫాబాద్: ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీవో దత్తారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో బుధవారం ఎంపీడీవో శ్రీని వాస్, ఎంపీవో బుచ్చన్నతో కలిసి డివిజన్లోని క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ కూలీల సంఖ్య పెంచుతూ, వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించాలన్నారు. ప్రతీ పంచాయతీలో కనీసం వందమంది కూలీలు పనిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా కూలీల హాజరు పక్కాగా నమో దు చేయాలన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. -
జిల్లాలో దరఖాస్తుల వివరాలు
కౌటాల మండలం యాపలగూడ గ్రామానికి చెందిన బెడ్డల తుర్సబాయి భర్త నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇంటిపెద్ద లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్ర తినిధులను వేడుకుంటున్నా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కొత్త పింఛన్ల అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు సిర్పూర్ నియోజకవర్గంలో ఒక్కరికీ కొత్త పింఛన్ మంజూరు కాలేదని స్పష్టం చేశారు. కుటుంబ పోషణకు ఆసరా లేక వితంతువులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, పింఛన్ల దరఖాస్తులు వేలాదిగా పెండింగ్లోనే ఉన్నాయని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు.కౌటాల: మలి వయస్సులో తోడెవరూ లేక వృద్ధులు ఆర్థిక ఇబ్బందులతో గోస పడుతుండగా.. వైకల్యంతో ఏ పని చేయలేక చేయూత కోసం దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం వీరంతా తిరగని ఆఫీసులు లేవు. అడగని అధికారి లేరు. అయినా ఫలితం మాత్రం శూన్యం. ఏళ్లుగా కొత్త పింఛన్ల జాడ లేకపోవడంతో అర్హులకు చేయూత లేక అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి నుంచి మళ్లీ మంజూరు కాలేదని అర్హులు చెబుతున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో నూతనంగా 2 లక్షల నూతన పింఛన్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రజావాణికి వినతుల వెల్లువ జిల్లాలోని 15 మండలాల పరిధిలో 52,635 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా నగదు సాయం అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్త పింఛన్ల కోసం అర్హులు ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో వినతులు సమర్పిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కరుణించేవారు కరువయ్యారు వృద్ధులు మృతి చెందితే వెంటనే వారికి వచ్చే వృద్ధాప్య పింఛన్ నిలిపివేస్తున్నారు. కానీ ఆ వృద్ధుడి భార్యకు మాత్రం కొత్తగా మంజూరు చేయడం లేదు. జిల్లాలో చేయూత పింఛన్ల కోసం నాలుగు వేలకు పైగానే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య 982, వితంతు పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు 2,147 ఉన్నాయి. అందుబాటులో లేని పోర్టల్ వృద్ధాప్యంలో ఉన్నవారితోపాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా పింఛన్ అందించి భరోసా కల్పిస్తోంది. కొత్త పింఛన్ల కోసం దరఖా స్తులు చేసుకునే ఆసరా పోర్టల్ 2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేదు. నూతన ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి కాంగ్రెస్ 27 నెలలు గడిచిపోగా, నాలుగేళ్లకు పైగా కొత్తవాటి జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం నాలుగు వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, అర్హతలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోసినా కనీసం మూడు వేలకు మందికి పైగానే కొత్త పింఛన్లు పొందే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒంటరి మహిళలు 248దివ్యాంగులు 654వృద్ధులు 982వితంతువులు 2,147మొత్తం 4,031 -
బడి పరీక్షలకు వేళాయె
ఆసిఫాబాద్రూరల్: పాఠశాల విద్యార్థులకు బుధవారం నుంచి ఈ నెల 1 వరకు సమ్మెటీవ్ అసెస్మెంట్(ఎస్ఏ– 2) పరీక్షలు జరగనున్నాయి. దీని కోసం ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 1వ నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:45 గంటలు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. 9వ తరగతి జీవశాస్త్రం, భౌతికశాస్త్రం సబ్జెక్టులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది. వార్షిక పరీక్షలో 80 మార్కులు ఉండగా.. మిగతా 20 మార్కులు ప్రాక్టికల్స్లో ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు. 75,218 మంది విద్యార్థులుజిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద మొత్తం 1,244 పాఠశాలలు ఉండగా, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు 75,218 మంది చదువుకుంటున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ మంగళవారం జూమ్ మీటింగ్ ద్వారా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ నెల 18తో పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగియనున్నాయి. ఇప్పటికే ఎస్ఏ– 1తోపాటు పాఠ్యాంశాల మార్కులు, హాజరు వివరాలు రిజిస్టర్లో నమోదు చేశారు. విద్యార్థుల వారీగా హాజరు, మార్కుల వివరాలను విద్యాశాఖ సంచాలకుల వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. 23న ప్రోగ్రెస్ కార్డులుఈ నెల 23తో 2025– 26 విద్యా సంవత్సరం ముగియనుంది. ఆ లోగా సంబంధిత ఉపాధ్యాయులు జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. 1వ నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలు బేస్లైన్, మిడ్లైన్, ఎండ్లైన్ పరీక్షల ప్రగతిని ప్రధానోపాధ్యాయులు విధిగా ఆన్లైన్లో ఎంటర్ చేసే ప్రక్రియను ఈ నెల 22 వరకు పూర్తి చేయాలి. ఈ నెల 23న చివరి రోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థులకు వారి సమక్షంలోనే ప్రోగ్రెస్ కార్డులు అందించాలి. టైం టేబుల్ ప్రకారం నిర్వహించాలి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టైం టేబుల్ ప్రకారం వార్షిక పరీక్షలు నిర్వహించాలి. మార్కుల వివరాలు ఆన్లైన్ నమోదు చేయాలి. ఈ నెల 23న తల్లిదండ్రుల సమక్షంలో ప్రోగ్రెస్ కార్డులు అందించాలి. – జనార్దన్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి -
మరింత స్మార్ట్..!
కెరమెరి: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్గా మారనుంది. క్షేత్రస్థాయిలో మాతాశిశు సంరక్షణ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల సేవలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కొన్నేళ్లుగా పాతతరం ఫోన్లు, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న సిబ్బందికి నూతన స్మార్ట్ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్లు అందించారు. 871 స్మార్ట్ఫోన్లు పంపిణీజిల్లాలోని 40 సెక్టార్ల పరిధిలో మొత్తం 1006 అంగ న్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 0– 6 నెల ల చిన్నారులు 2,855 మంది, మూడేళ్లలోపు వారు 18,657 మంది, 3– 6 ఏళ్ల లోపు వారు 24,196 మంది లబ్ధి పొందుతున్నారు. వీరితో పాటు 2,698 మంది బాలింతలు, 4,992 మంది గర్భిణులు, 19,635 మంది కిశోర బాలికలకు సేవలు అందుతున్నాయి. 2021లో అంగన్వాడీ కార్యకర్తలకు 2జీ సాంకేతికత కలిగిన ఫోన్లను అందించారు. లబ్ధిదా రులకు పౌష్టికాహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ‘పోషణ్ ట్రాకర్’ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత ఫోన్లలో సర్వర్ సమస్యలు, సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం, డిస్ప్లేలు పగిలిపోవడంతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల ఫేషియ ల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) నమోదులో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక స్థోమత ఉన్న కొందరు కార్యకర్తలు సొంతంగా 4జీ ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. మరికొందరు పాత ఫోన్లతోనే కుస్తీ పడుతూ రికార్డుల నమోదులో వెనుకబడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నూతన స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అంగన్వాడీ సిబ్బందికి నూతన ఫోన్లను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 835 అంగన్వాడీ కార్యకర్తలు ఉండగా.. 31 మంది సూపర్వైజర్లు, ఐదుగురు బ్లాక్ కోఆర్డినేటర్లకు కలిపి మొత్తం 871 మందికి స్మార్ట్ఫోన్లను అందజేశారు. నెలకోసారి ఎఫ్ఆర్ఎస్ నమోదుఅంగన్వాడీ కేంద్రాల్లోని 3 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు గల చిన్నారులు, 14 నుంచి 18 ఏళ్ల కిశోర బాలికలకు ప్రతినెలా ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు) హాజరు తీసుకుంటారు. దీనికోసం కొత్త ఫోన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రపంచం 5జీ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో మళ్లీ 4జీ ఫోన్లే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తసెల్ టవర్లు 5జీ నెట్వర్క్ అందిస్తున్న వేళ, 4జీ ఫోన్లతో భవిష్యత్తులో మళ్లీ పాత సమస్యలు పునరావృతం కావచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టుల వారీగా అందించిన ఫోన్లుప్రాజెక్టు ఫోన్లు ఆసిఫాబాద్ 228 జైనూర్ 136 కాగజ్నగర్ 165 సిర్పూర్(టి) 189 వాంకిడి 117 సూపర్వైజర్లు 31 బ్లాక్ కోఆర్డినేటర్లు 5ఇక సేవలు వేగవంతంతాజాగా 4జీ సాంకేతికతతో కూడిన ఫోన్లు అందడంతో అంగన్వాడీ సేవలు వేగవంతం కానున్నాయి. ప్రతిరోజూ యాప్లో లబ్ధిదారులకు సంబంధించిన 14 రకాల రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. -
కాగజ్నగర్లో కూల్చివేతలు
కాగజ్నగర్టౌన్: పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణలో కాగజ్నగర్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా అక్రమ కట్టడాలను మంగళవారం రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రి గేటు సమీపం నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ఎస్పీఎం క్వార్టర్స్ ప్రహరీ, ఖాళీగా ఉన్న ఎస్పీఎం క్వార్టర్లను కూల్చివేశారు. అగ్రసేన్ భవన్ సమీపంలోని మున్సిపల్ అద్దె భవనాలను సైతం కూ ల్చివేశారు. ఎస్పీఎం క్వార్టర్స్ తొలగింపుతో విస్తరణ పనులు వేగంగా జరుగుతాయని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘అధ్వానంగా సింగరేణి కార్మికుల పరిస్థితి’
రెబ్బెన: కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి విమర్శించారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కార్మికులకు 200కు పైగా హక్కులు సాధించి పెట్టామని తెలిపారు. కానీ ప్రస్తుత గుర్తింపు సంఘం యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఏడాదిగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పనితీరును కార్మికులు గమనిస్తున్నారని, త్వరలోనే ఆ సంఘాలకు గుణపాఠం తప్పదని అన్నారు. సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, తిరుపతి, ఫిట్ కార్యదర్శి రమేశ్, వెంకటేశ్, నాయకులు కై త స్వామి, కృష్ణ, రాజమౌళి, రమేశ్, చంద్రశేఖర్, సురేందర్, మల్లేశ్, శంకర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
● విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా ● దాడులు ముమ్మరం చేసిన పోలీసుశాఖ ● ఇటీవల బెజ్జూర్లో రూ.90వేల విలువైన గంజాయి పట్టివేత
కౌటాల: మత్తు పదార్థాల రవాణా కలకలం రేపుతోంది. కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలో త క్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లా మీదుగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విక్రయాలు జరుపుతున్నారు. ము ఖ్యంగా మంచిర్యాలకు ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ నిఘా ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. గతేడాది జిల్లాలో 73 గంజాయి రవాణా కేసులు నమోదు కాగా, 15.224 కిలోల గంజాయి, 1,118 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్లుగా మార్చి విక్రయాలుజిల్లాలోని సరిహద్దు మండలాలైన కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, వాంకిడి, సిర్పూర్(టి) మండలాల మీదుగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా మంచిర్యాల జిల్లాకు గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు తరలిస్తున్న మూడు కిలోల గంజాయిను బెజ్జూర్ పోలీసులు పట్టుకున్నారు. చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారు. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్లతో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్ను రూ.300 నుంచి రూ.1000 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. బానిసలుగా మారుతున్న యువతజిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతికి అడ్డుకట్ట పడటం లేదు. చదువుకునే వయస్సులోనే యువత గ్యాంగ్లుగా మారి వ్యసనానికి బానిసవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సమాచారం పంచుకుంటున్నారు. మద్యంతో పోలిస్తే ఇతర మత్తు పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా.. వాటిని వదలలేకపోతున్నారు. గంజాయిలోని టెట్రా హైడ్రోకానాబినాల్ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. వ్యసనాన్ని మానకపోతే తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి సైతం దారి తీయొచ్చు. కేసులు నమోదు చేస్తాం గంజాయి విక్రేతలు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. యువత మత్తుకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరాలి. మత్తు పదార్థాల రవాణా, విక్రయం, వినియోగం నేరం. అక్రమ దందాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తాం. మహారాష్ట్ర నుంచి రవాణా జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశాం. మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి. – బి.సంతోష్కుమార్, సీఐ, కౌటాల -
మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
ఆసిఫాబాద్: మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం మహిళాశిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన బేటా జన్మోత్సవ్ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్, డీఎంహెచ్వో సీతారాం, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడ పిల్లలను ‘కాపాడుకుందాం, చదివించుకుందాం, ఎదగనిద్దాం’ నినాదంలో పని చేస్తున్నామన్నారు ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా ఆర్థిక చేయూతనందించి వ్యాపార రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల కు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తామన్నారు. అనంతరం పిల్లలకు కావాల్సిన 12 రకాల వస్తువులతో కూడిన 10 బేబీ కిట్లను అందజేశారు. అంగన్వాడీ టీచర్లకు విధుల కోసం 871 4జీ మొబైళ్లను పంపిణీ చేశారు. -
సాగునీటి రంగం బలోపేతంపై దృష్టి
దహెగాం: సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడంపై నీటిపారుదల శాఖ దృష్టి సారించిందని ఇరిగేషన్ డీఈఈలు అజయ్కుమార్, భద్రయ్య తెలిపారు. మండలంలోని కర్జి పెద్ద చెరువు వద్ద చేపట్టిన ప్రీ లెవల్ సర్వేను మంగళవారం పరిశీలించారు. వారు మాట్లాడు తూ కర్జి పెద్ద చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.5.97 కోట్లు మంజూరు చేసిందన్నా రు. చెరువు ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన ప నుల గురించి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పునరుద్ధరణ తర్వాత ఆయకట్టుకు శాశ్వతంగా సుమారు 500 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. సాంకేతిక అనుమతులు పొందిన అనంతరం టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏఈఈ మణితేజ తదితరులు పాల్గొన్నారు. -
20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం డీఈవో లలిత, డీఐఈవో రాందాస్, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే ఓపెన్ పదో తరగతి పరీక్షలకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 643 మంది విద్యార్థులు హా జరుకానున్నట్లు తెలిపారు. అలాగే ఓపెన్ ఇంటర్ పరీక్షలకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 360 మంది పరీక్ష రాస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
కాగజ్నగర్టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కాగజ్నగర్ పో లీసుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో సైకిల్ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్పీఎం గేటు నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా మీదుగా లారీ చౌరస్తా గుండా ర్యాలీ కొనసాగింది. డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు చేసిన సేవలను గుర్తు చేశారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బోథ్ ఏరియా ఆస్పత్రి పరిశీలన
బోథ్: బోథ్ ఏరియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఫైనాన్స్ సెక్రెటరీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం పరిశీలించారు. పిప్రిలో సీఎం సభ అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజనాల రవీంద్ర ప్రసాద్ విన్నపం మేరకు ఆస్పత్రిని పరిశీలించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వైద్య పరికరాలు, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతుల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. దీనిపై డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా అన్ని వసతులతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మందుబాబుల వీరంగంమందమర్రిరూరల్: పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో సోమవారం ఇద్దరు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఎస్సై నరేష్ సంఘటన స్థ లానికి చేరుకుని నిందితులను పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రతీరోజు వైన్షాపుల వద్ద మందుబా బులు వీరంగం సృష్టిస్తున్నారని, పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని కోరుతున్నారు. -
కాలుష్యం నియంత్రించాలని ఫిర్యాదు
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్ పరిసర ప్రాంతాలలో ఏర్పడుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్లోని పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు సోమవారం పెగడపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్లాంట్ నిర్వహణతో గాలి, నీటి కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. యాష్ కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర పరిశీలన జరిపి, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందులో దుస్స భాస్కర్, రాజా గౌడ్, రాజేందర్ రెడ్డి, ప్రభాకర్చారి తదితరులు ఉన్నారు. -
ఆకట్టుకున్న నమూనా ఐక్యరాజ్య సమితి సమావేశం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఫాతిమా కా న్వెంట్ పాఠశాలలో సోమవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నమూనా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం సహకారంతో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలోని 14 పీఎం శ్రీస్కూళ్ల నుంచి 42 మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతి నిధులుగా వ్యవహరించి ప్రసంగించారు. వా తావరణ మార్పులు, మానవులపై పడే ప్రభా వం, ప్రపంచ దేశాలు ఏ విధంగా కృషి చే యాలి.. అనే అంశాలపై చర్చించారు. ఎంఈవో వాసాల ప్రభాకర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయ ని, విద్యార్థులు అంతర్జాతీయ అంశాలపై అ వగాహన కలిగి ఉండాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. జిల్లాస్థాయి నుంచి 11 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చే స్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు లాలాజీ, రాజ, ఇస్లావత్, విజేష్, హదియాబేగం, రేష్మ సుల్తానా పాల్గొన్నారు. -
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
భీమారం/చెన్నూర్రూరల్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. భీమారం మండల కేంద్రం, చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, భీమారం మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకన్న, చెన్నూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, బూత్ అద్యక్షుడు సింగారపు రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదర స్వామి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేయాలని భీంపూర్ మండలం తాంసి కె గ్రామస్తులు, రికార్డు అసిస్టెంటు ఉద్యోగం ఇప్పించాలని ఉట్నూర్కు చెందిన మెస్రం కార్తీక్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదిలాబాద్కు చెందిన కుడిమెత శ్రీనివాస్ కోరారు. వివిధ ప్రాంతాల నుంచి పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలి
ఆదిలాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన భుక్తాపూర్ కాలనీలో గల గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు ఆడిగి సమాధానం రాబట్టారు. కంప్యూటర్ ల్యాబ్, వంట గదిని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టోర్ రూమ్ను తనిఖీ చేసి సరుకులను పరిశీలించారు. మెనూ అమలు తీరును అడగగా ఐటీడీఏ యాప్ ఏర్పాటు చేసి పకడ్బందీగా మెనూ అమలు చేస్తున్నామని సిబ్బంది వివరించారు. అనంతరం డార్మెట్రీ నిర్మాణ పనులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జుగా కింద మరో రూ.2 కోట్లు మంజురయ్యాయని, పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, సీఈ బాలు నాయక్, ఎస్ఈ ఫణికుమారి, ఈఈ తానాజీ, ఏటీడీవో నిహారిక, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మారుతినగర్కు చెందిన కారుకూరి సత్తయ్య(63) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి సత్తయ్య సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంత్రం స్థానిక ఓ లిక్కర్ మార్ట్లో మద్యం సేవించి అక్కడే కుప్పకూలిపోయాడు. సిబ్బంది డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ప్రైవేటు అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే సత్తయ్య మృతిచెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య సత్యలీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధుసూధన్రావు తెలిపారు. -
ఆహార భద్రత అందరి బాధ్యత
మంచిర్యాలటౌన్: సురక్షితమైన ఆహారం ఆరోగ్యానికి ఆధారమని, ఆహార భద్రత అందరి బాధ్యత అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫుడ్ సేఫ్టీపై ఆరోగ్య కార్యక్రమాల అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగాలు రాకుండా ఉంటుందని, తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టి అధికారి మహేష్ వసురం, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత, ఆర్ఎంవో డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గురుకులాలపై నిర్లక్ష్యం
చెన్నూర్: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. గతంలో చురుగ్గా పనిచేసిన పేరెంట్స్ కమిటీలు నామమాత్రంగా పని చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రతీనెల రెండో శనివారం తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేవారు. ఇలా చేయడం ద్వారా ఇటు విద్యార్థులతో పాటు అటు ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండేది. విద్యార్థులు తప్పు చేస్తే ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉండేది. కానీ గతేడాది నుంచి చెన్నూర్ ప్రాంత గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించక పోవడంతో విద్యావ్యవస్థ గాడితప్పుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చెన్నూర్ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో పది రోజుల వ్యవధిలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏడు నెలల క్రితం బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రహరీ దూకి ఇద్దరు యువకులు లోపలికి వచ్చిన ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నూర్ పట్టణంలో గల గురుకుల పాఠశాలలో గతంలో పలు సంఘటనలు జరిగినా నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడమేనా? గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడంతో రాత్రివేళల్లో పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది రాత్రి వేళ విధులు నిర్వహించినప్పటికి పైఅధికారులు అందుబాటులో లేకపోవడంతో ‘మాకేందుకులే’ అనే ధోరణి అవలంభిస్తున్నారని తెలిసింది. దీంతో కొంతమంది విద్యార్థులు ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గురుకులాలకు అందుబాటులో ఉండి విద్యార్థులు గాడి తప్పకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలా చేస్తే మార్పు రావచ్చు విద్యార్థుల మానసికస్థితిలో మార్పులు విద్యార్థుల మానసిక స్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మానసిక నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇస్తున్నాం. చెన్నూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి బాధాకరం. మరో విద్యార్థిని చిన్న విషయానికి పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె సెఫ్గా ఉంది. చెన్నూర్ గురుకుల పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – రామకళ్యాణి, డీసీవో, మంచిర్యాల ఏడాదిగా సమావేశాల్లేవ్ గతంలో గురుకుల పాఠశాలలో ప్రతీనెల రెండో శనివారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసేవారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం కమిటీపై అధికారుల నిర్లక్ష్యం పెరిగింది. పాఠశాలలో పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. కమిటీలను పటిష్టం చేయాలి. సమావేశాలు ఏర్పాటు చేయాలి. – ఎన్.సారయ్య, పేరెంట్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి -
సమస్యలు విన్నవించి.. పరిష్కారం కోరి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై అర్జీలు అందించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ ఆర్డీవో లోకేశ్వర్తో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కాగజ్నగర్ పట్టణానికి చెందిన బేతి సునంద, రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన కమిటె శంకర్, వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి గ్రామానికి చెందిన కొమ్ము విజయ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఓపెన్ కాస్టు ప్రభావంతో భూమి కోల్పోతున్న తనకు పరిహారం అందించాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన జాదవ్ రోహిదాస్ విన్నవించారు. నిషేధిత జాబితా నుంచి తన పట్టా భూమిని తొలగించాలని తిర్యాణి మండలం గంభీరావ్పేటకు చెందిన లింగంపల్లి చిన్నమ్మ అర్జీ అందించింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం నారాయణపూర్కు చెందిన మన్నెంపల్లి అరుణ, కౌటాల మండలం గురుడుపేటకు చెందిన చల్ల లక్ష్మి వేర్వేరుగా దరఖాస్తులు అందించారు.గాలివానకు ఇల్లు నేలమట్టం ఇటీవల గాలివానకు ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యింది. పేద కుటుంబం కావడంతో అద్దె ఇంట్లో ఉండాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలి. – పోగుల లక్ష్మి, టీఆర్నగర్, ఆసిఫాబాద్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. చింతలమానెపల్లి శివారులోని సర్వే నం. 59/17లో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. కొత్త పట్టా పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబంధు రావడం లేదు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టర్ చొరవ చూపి కొత్త పట్టాపాస్ పుస్తకం ఇప్పించాలి. – మానెపల్లి శంకర్, చింతలమానెపల్లి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి గతంలో పలుమార్లు ఇందిరమ్మ ఇంటి కోసం ద రఖాస్తు చేసుకున్నా. ఆన్లైన్లో ఇల్లు మంజూరైనట్లు చూపుతున్నా సంబంధిత అధికారులు మాకు రాలేదని చెబుతున్నారు. సొంత స్థలం ఉన్నా.. ఇల్లు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. త్వరగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – అంకిత, ఎడవెల్లి, మం.రెబ్బెన పీవోపీ నుంచి తొలగించాలి కెరమెరి మండలం సాంగ్వి శివారులోని సర్వే నం.25లో నాలు గెకరాల వ్యవసాయ భూమి ప్రొహిబిషన్(పీవోపీ)లో ఉంది. ప్రస్తుతం రైతుబంధు, రుణ సదుపాయం పొందుతున్నాను. పీవోపీలో ఉంటే భవిష్యత్తులో విక్రయించడం కుదరదు. అధికారులు సర్వే చేసి పీవోపీ జాబితా నుంచి భూమిని తొలగించాలి. – సంతోష్, సాంగ్వి, మం.కెరమెరి -
అక్షరాభ్యాసం.. భూమిపూజ..
8x5నిర్మల్/భైంసా/బాసర: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఓ మహాత్తర ఘట్టానికి అంకురార్పణ జరిగింది. దేశంలోనే ఏకైక సరస్వతీక్షేత్రంగా విరాజిల్లుతున్న నిర్మల్ జిల్లా బాసరను భవ్యమందిరంగా, విశాలమైన కోవెలగా తీర్చిదిద్దేందుకు ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.225 కోట్లు మంజూరు చేయడ మే కాకుండా సోమవారం స్వయంగా వచ్చి ఈ పనులకు భూమిపూజ చేశారు. రూ.200 కోట్లతో ముధోల్లో నిర్మించనున్న యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకూ ఇక్కడే శంకుస్థాపన చేశారు. కేవలం ఆలయం వరకే ముఖ్యమంత్రి పర్యటన పరిమితమైంది. లంచ్టైమ్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పర్యాటక, పలు అభివృద్ధి పనులపై చర్చించారు. మనుమడితో అక్షరాభ్యాసం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉదయం 11.42 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి హెలికాప్టర్లో బాసర చేరుకున్నారు. సీఎం భార్య గీతారెడ్డి, బిడ్డ నైమిషారెడ్డి, అల్లుడు సత్యరెడ్డి, మనుమడు రియాన్ష్ మరో హెలికాప్టర్లో 11.46 గంటలకు చేరుకున్నారు. సీఎం తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎకై ్సజ్, ప్రొహిబిషన్, పర్యాటకశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలకు హెలీపాడ్ వద్ద కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఆలయంలో ప్రదక్షిణ చేశారు. అమ్మవారి ఎదుట అక్షరాభ్యాస పీఠం వద్ద రేవంత్రెడ్డి దంపతులు తమ మనుమడు రియాన్ష్తో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గర్భాలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పైనున్న మహంకాళీ అమ్మవారి వద్దకు వెళ్లి దర్శించుకున్నారు. వేదఆశ్వీరచన మండపంలో సీఎం కుటుంబాన్ని అర్చకులు ఆశీర్వదించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఇన్చార్జి ఈవో విజయరామారావు తదితరులు జ్ఞాపికలు, కండువాలతో సన్మానించారు. లంచ్టైంలో మాటామంతి.. బాసర పర్యటనలో స్థానిక ఓ ప్రైవేటు రిసార్ట్లో లంచ్టైమ్లోనే సీఎం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈసందర్భంగా జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను కలెక్టర్ అందించగా, ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులోని అంశాలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధి అవశ్యకతను బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఆర్కియాలజీ, టూరిజం అధికారులతో మాట్లాడుతామన్నారు. కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్తోపాటు మహిళా సంఘాలసభ్యులు తయారు చేసిన వరికుచ్చులను సీఎంకు జ్ఞాపికలుగా అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బాసర పర్యటనను విజయవంతం చేసినందుకు స్థానిక గ్రామస్తులు, సహకరించిన భక్తులకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఘనంగా భూమిపూజ..బాసర ఆలయంలోని తూర్పు ద్వారం పక్కన పునరాభివృద్ధి పనులకు ము ఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు నగేశ్, వేంనరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు సుదర్శన్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, డీసీసీ చీఫ్, ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్, ఎమ్మెల్సీలు దండె విఠల్, చిన్నమైల్ అంజిరెడ్డి, నిర్మల్, భైంసా మున్సిపల్ చైర్మన్లు అప్పాల కావ్యగణేశ్చక్రవర్తి, తూమోల్ల దత్తాద్రి, బాసర సర్పంచ్ వెంకటేశ్గౌడ్, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావుపటేల్, రేఖానాయ క్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీ సీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తదితరులతో కలిసి భూమిపూజను అట్ట హాసంగా నిర్వహించారు. ఇక్కడే ముధోల్లో నిర్మించే యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ట్రిపుల్ఐటీ, యూనివర్సిటీ ఊసే లేదు.. సీఎం రేవంత్రెడ్డి బాసర పర్యటనలో అందరూ ఊహించిన ట్రిపుల్ఐటీ విద్యార్థుల సమస్యలు, యూనివర్సిటీ ఏర్పాటు గురించి ఎక్కడా చర్చ రాకపోవడం గమనార్హం. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్న ఆర్జీయూకేటీ గురించి మాట్లాడుతారని, జనవరి 16న నిర్మల్సభలో ప్రకటించిన జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఆలయ అభివృద్ధి మినహా ఈ రెండు ప్రముఖ అంశాలకు సీఎం పర్యటనలో ప్రాధాన్యత దక్కకపోవడం జిల్లావాసులను నిరాశపర్చింది. -
అప్పులున్నా ప్రజా సంక్షేమాన్ని ఆపలేదు
ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించి రూ.64 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులున్నా అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మా త్రం ఆపలేదు. జిల్లాలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం సంతోషంగా ఉంది. – జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వేదికపై అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్చార్జి మంత్రి జూపల్లి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, ఎంపీలు గోడం నగేశ్, వేంనరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రేంసాగర్రావు, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులుకైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మళ్లీ వ స్తానని..అభివృద్ధి పనులకు అవసరమైన నిధులిస్తా నని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా నాడు చేపట్టిన పీపుల్స్మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బజార్హత్నూర్ మండలం పిప్రిలో సోమవారం నిర్వహించిన బహిరంగసభకు హాజరయ్యారు. భట్టితో కలిసి వచ్చిన ఆయన రూ. 1,238 కోట్ల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి ప నులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మేరకు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా కు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, మండలస్థాయి నాయకుల వద్దకు వచ్చి వారితో కరచాలనం చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకు సా గుతున్నట్లుగా వెల్లడించారు. ఇంద్రవెల్లిలో పీసీసీ అధ్యక్షుడిగా దళిత గిరిజన,దండోరాతో తాను, పీపు ల్స్ పాదయాత్రతో భట్టి చేపట్టిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ముందుకు సాగుతున్నామన్నారు. అపారమైన ఖనిజ సంపదతో పాటు సంస్కృతికి నిలయమైన ఈ ప్రాంతంలో విద్య, వైద్యం అందాల్సిన అవసరముందన్నారు. బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మార్చి 2027 వరకు సాధ్యం కాదని ఆ తర్వాత దా న్ని పరిశీలిస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తిరిగి ప్రారంభించి రైతులకు సాగునీటిని అంది స్తామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం జూన్ 2లోగానే శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.ఇండస్ట్రీయల్కారిడార్ ఏర్పా టుతోపాటు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేసి దాని ప్రారంభోత్సవానికి సైతం తానే హాజరవుతా నని భరోసానిచ్చారు. రెండు నెలలకోసారి జిల్లాకు వస్తూనే ఉంటానని, నిధులు తెస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వవిప్లు ఆది శ్రీనివాస్, విజ యరమణా రావు, ఎంపీ గోడం నగేశ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ప్రేంసాగర్రావు, అని ల్ జాదవ్, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి,మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్దీపక్ తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన జనం ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యతనివ్వాలి నా జీవితంలో ఎంతో మంది సీఎంలను చూశాను. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది రేవంత్రెడ్డి ఒక్కరే. గోదావరి ఒడ్డున, గుట్టపై ఉన్న గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి రూ.75 కోట్లను కేటాయించాలి. ఆదివాసీలు కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్కు ఎంత చేసినా తక్కువే. అభివృద్ధి పరంగా మరింత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి పునః ప్రారంభించాలి. – కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క జిల్లా నుంచి చేపట్టిన పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దోహదం చేశాయి. అభివృద్ధి, సంక్షేమం కోసం కమిట్మెంట్తో పని చేసే పార్టీ కాంగ్రెస్. రెండేళ్లలోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్కార్డులు, ఉచిత విద్యుత్ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో వందకు పైగా సీట్లను కై వసం చేసుకుంటాం. – బొమ్మ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెండు లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు, మూడు సబ్స్టేషన్లు, ఏటీసీ మంజూరు చేసి శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉంది. సీఎం అంటేనే రాష్ట్రానికి తండ్రిలాంటి వారు. మా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి. బోథ్ను రెవెన్యూ డివిజన్గా చేయాలి. అలాగే రూ.345 కోట్లతో చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.40 కోట్లు ప్రకటించాలి. జందాపూర్–కరంజీ రోడ్డు పనులు పూర్తి చేయాలి. బోథ్లో డిగ్రీ కళాశాల, మినీస్టేడియం, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ యార్డు మంజూరు చేయాలి. సిరిచెల్మ, భరంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. – అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్ 26 ఏళ్ల తర్వాత సీఎం రావడం సంతోషంగా ఉంది 1983లో ఎన్టీఆర్ సీఎం హోదాలో తొలిసారి మా మండలానికి వచ్చారు. మళ్లీ 26 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావడం ఆనందంగా ఉంది. బోథ్లో మినీ స్టేడియం మంజూరు చేయాలి. రూ.18 కోట్లతో చేపట్టిన భీంపూర్– కరంజీ అంతర్రాష్ట్ర రోడ్డ్డును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను పిప్రిలోనే ఏర్పాటు చేయాలి. జిల్లాను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
ఆరోగ్యమే మహాబలం
ఆసిఫాబాద్: ప్రతిఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని, ఆరోగ్యమే మహాబలమని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణ నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో 2కే రన్ చేపట్టారు. అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎంహెచ్వో సీతారాం, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుబోద్ కుమార్తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కుమురం భీం చౌక్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది.కలెక్టర్ మాట్లాడుతూ ముందు జాగ్రత్తలతో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చన్నారు. ఈ నెల 6 నుంచి 11 వరకు వైద్యరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. -
‘ఎన్నికల పొత్తు ధర్మాన్ని పాటించాలి’
పాతమంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకున్నా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ పాటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులు, గెలుపోటములపై పార్టీ నాయకులతో విశ్లేషణ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సీట్లు ప్రకటించడంతో సీపీఐకి నష్టం జరిగిందని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో పొత్తు విషయమై చర్చలు జరిగినా స్థానిక నాయకత్వం పార్టీని అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం వల్ల అక్కడ బీఆర్ఎస్ గెలుపు అనివార్యమైందని తెలిపారు. బెల్లంపల్లిలో నామినేషన్ల వరకు పార్టీని మభ్యపెట్టి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఓట్లు అవసరమైనప్పుడు పొత్తులు పెట్టుకుని ఆ తర్వాత కమ్యూనిస్టులను విస్మరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ పొత్తును ప్రజలు హర్షించారని, చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని అన్నారు. కోల్బెల్ట్ ఏరియాలో సీపీఐకి బలమైన క్యాడర్ ఉందని, భవిష్యత్లోనైనా కాంగ్రెస్ పార్టీ మైత్రి సంబంధాలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, రాష్ట్ర సమితి సభ్యులు లింగయ్య, జిల్లా సమితి సభ్యులు పౌలు, దేవి పోచన్న, దుర్గారాజ్, కుంచాల శంకరయ్య పాల్గొన్నారు. -
హెచ్ఎం, వార్డెన్కు మెమో జారీ
కాసిపేట: మండలంలోని మల్కేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, వార్డెన్ దిన్దర్షాకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీవో) రమాదేవి మెమో జారీ చేశారు. మండలంలోని మల్కేపల్లి, దేవాపూర్, రేగులగూడ ఆశ్రమ పాఠశాలలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూలో భాగంగా విద్యార్థులకు కోడిగుడ్లు వడ్డించాల్సి ఉండగా వడ్డించలేదన్నారు. రేగులగూడ ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, నెన్నెల మండలం కుశ్నపల్లిలో విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడంతో కుశ్నపల్లి హెచ్ఎం లచ్చన్న, ఏఎన్ఎంకు మెమో జారీ చేసినట్లు తెలిపారు. హెచ్ఎంలు గోపాల్, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 20 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీవైఎస్వో హనుమంత రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 27 నుంచి మే 1 వరకు హైదరాబాద్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి క్రీడా పాఠశాలల్లో ప్రవేశం ఉంటుందన్నారు. ఎంపికై న విద్యార్థుల్లో పల్లెర్ల శేయష్, కొండ హరిహరన్, రాకం వేధాంత్, గాలిపెల్లి శివతేజ, రామంచ కృతిక్, దోమల గౌతమ్ రామ్, ఆరె శ్రీ సహస్, రాచర్ల అనురాగ్, మహమ్మద్ అర్హముద్దీన్, మేంగని అనిరుధ్, విద్యార్థినుల్లో బొమ్మెన అధ్విక, బొగురాల మాన్వి, కావేర తీఖ్షిత, రొడ్డ శాన్విక, చింతం సింధూజ, మలవత్ సాయి పల్లవి, సింగతి అక్షయ, కొడపర్తి లితాక్ష, బానోత్ హిమజ, ధరావత్ అక్షయ ఉన్నారు. సీఎం సభలో తప్పిపోయిన మహిళబజార్హత్నూర్: మండలంలోని పిప్రిలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగసభకు హాజరయైన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బోరిగామకు చెందిన బత్తుల గంగూబాయి తప్పిపోయినట్లు ఎస్సై సంజయ్ కుమార్ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 8712659934, 9440619432 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
జగ్జీవన్రామ్ జీవితం అందరికీ ఆదర్శం
ఆసిఫాబాద్అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రావ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ కె.హరిత పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, వివిధ సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ వేత్తగా అణగా రిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన సూచించిన మార్గం ఆచరణీయమని, ఆయన ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎ మ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం, సమానత్వం, సమన్యాయం, ఐక్య త కోసం బాబూ జగ్జీవన్రామ్ చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్చార్జి షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికా రి అశోక్, కుల సంఘాల ప్రతినిధులు కేశవ్రావ్, సిడాం అర్జు, గంగుబాయి, గణేశ్, శంకర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి ప్రతిపాదిత స్థలం పరిశీలన
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను, ఈఎస్ఐ ఆస్పత్రి భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ హరిత ఆదివారం పరిశీలించారు. సమీపంలోని ఈఎస్ఐ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంజేశారు. చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రి య విద్యాలయం ఏర్పాటుకు కాగజ్నగర్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ శివారులో ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను సందర్శించారు. అనంతరం పట్టణంలోని పోలింగ్ కేంద్రం–62లో నిర్వహిస్తున్న ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. బూత్స్థాయి అధికారులతో పనుల నిర్వహణపై సమీక్షించారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పష్టమైన ఓటరు జాబితా తయారీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ మధూకర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
రోడ్డుకు మోకాలడ్డు!
దహెగాం: గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన బీటీ రోడ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీశాఖ అడ్డుకోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. 2018లో పీఎంజీఎస్వై కింద మండలంలోని కర్జి గ్రామం నుంచి మొట్లగూడ వయా రాంపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.6.25 కోట్లు మంజూరు చేసింది. అప్పటి ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్లయినా పనులు పూర్తి కాని పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ప్రయాణ పాట్లు పడుతున్నారు. అటవీశాఖ అనుమతి నిరాకరణకర్జి గ్రామం నుంచి మొట్లగూడ వయా రాంపూర్ గ్రామం వరకు సుమారు 12కిలో మీటర్ల మేర చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.6.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ, కర్జి నుంచి రాంపూర్ వరకు అటవీప్రాంతం ఉండడంతో అటవీ అధికారులు రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అప్పటి నుంచి రోడ్డు నిర్మా ణం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్న చందంగా మారింది. రోడ్డు పనులు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ రవాణా కష్టాలు తొలగుతాయని ఆశించిన తమకు నిరాశే మిగిలిందని వాపోతున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు అటవీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో నిలుస్తున్న బస్సులుకర్జి నుంచి మొట్లగూడ వరకు మట్టి రోడ్డు ఉండడంతో వానాకాలంలో బురదగా మారుతోంది. దీంతో ఆర్టీసీ సేవలు వానాకాలం నాలుగు నెలలు నిలిచి ప్రజలు రవాణా కష్టాలు పడుతున్నారు. కర్జి గ్రామ సమీపంలోని ప్లాంటేషన్ వద్ద భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురవుతోంది. దీంతో ఆటోలు కూడా వెళ్లలే ని పరిస్థితి నెలకొంటోది. కేవలం వేసవి, శీతాకాలా ల్లో మాత్రమే మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బ స్సు మొట్లగూడ వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజ లు చెబుతున్నారు. వానాకాలంలో ఇతర ప్రాంతాల కు రాకపోకలకు సాగించాలంటే ఇబ్బందిగా మారుతోందని వాపోతున్నారు. అత్యవసర సమయంలో గర్భిణులను ప్రసవానికి తరలించడం ఇబ్బందిగా మారిన సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చి తరువాత విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులు ఉన్నాయా.. లేదా.. వెనక్కి వె ళ్లాయా? అనే అనుమానం కలుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం కోసం అటవీశాఖ అనుమతులు ఇ ప్పించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల ని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణానికి 2018లో వేసిన శిలాఫలకం -
ఎమ్మెల్యే కోవ లక్ష్మి హౌస్ అరెస్ట్
ఆసిఫాబాద్అర్బన్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయి తే, కలెక్టరేట్లో నిర్వహించిన బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలకు ఆమె హాజరు కాగా, వెంట ఒక పోలీస్ వాహనం కూడా వెళ్లింది. కలెక్టరేట్ వద్ద కూడా భారీగా పోలీస్ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తాను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతనిధిని అని, తనకు ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగి హక్కు ఉందని చెప్పారు. పోలీసుల ను అడ్డుపెట్టుకుని తనను అక్రమంగా నిర్బంధించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం అన్యాయమ ని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
నేడు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటన
భైంసా/బాసర/కై లాస్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లా బాసర, ఆదిలా బాద్ జిల్లా పిప్రిలో పర్యటించనున్నారు. మొదట బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చే సినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రిలో బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..ఉదయం 10.20 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బాసరకు బయల్దేరుతారు. 11గంటలకు బాసర హెలీప్యాడ్కు అక్కడి నుంచి రాజన్న గెస్ట్హౌస్కు చేరుకుంటారు. 11.10 నుంచి 12.10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.15 నుంచి 12.30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. 12.30 నుంచి 1.30 వరకు రిజర్వ్ టైమ్. 1.45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. 2.15 గంటలకు పిప్రికి చేరుకుంటారు. 2.20 నుంచి 2.30 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. ఐఎస్వో సర్టిఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. సీఎం కప్ విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారు. 4.20గంటలకు హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు. -
జిల్లాలో గాలివాన బీభత్సం
కెరమెరి: మండలంలోని గోయగాం గ్రామపంచా యతీ పరిధి పిప్రి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన గాలివాన బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన మడావి పావుగా, ఆత్రం పగ్గు ఇళ్లు స్వల్పంగా కూలిపోయా యి. ఇళ్ల పైకప్పులు పూర్తిగా లేచిపోయాయి. కు టుంబ సభ్యులంతా ఆరుబయట నిద్రించడంతో ప్రమాదం తప్పింది. నాలుగేళ్ల క్రితం ఐటీడీఏ సహకారంతో నిర్మించుకున్న రేకుల షెడ్లు కూలడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు తెలి పారు. ప్రభుత్వం తమకు ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి మురళీధర్, సర్పంచ్ ఆనంద్రావు, ఉపసర్పంచ్ రాందాస్ గ్రామాన్ని సందర్శించి అధికారులకు నివేదిక అందించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునీర్ అహ్మద్ బాధితులను కలిసి వివరాలు తెలు సుకున్నారు. తహసీల్దార్ సంతోష్ కుమార్కు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు తక్షణసాయం అందేలా చూస్తామని, ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చింతలమానెపల్లి మండలంలో..చింతలమానెపల్లి: మండలంలో ఆదివారం తెల్ల వా రు జామున వర్షంతో పాటు వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి. రుద్రాపూర్, బాబాసాగర్, ఖర్జెల్లి, దిందా, కేతిని, హేటిగూడ గ్రామాల్లో వీచిన గా లులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దిందా గ్రామంలో కోల తిరుపతి ఇంటి కప్పు ఎగిరిపోయింది. రుద్రాపూర్ గ్రామానికి చెందిన గుర్లె సంజీ వ్, హేటిగూడ గ్రామానికి చెందిన మండూరి తిరుపతి, నికాడి భీంరావు, కేతిని గ్రామానికి చెందిన సో యం నందారాం ఇళ్ల కప్పులు లేచిపోయాయి. ప లువురి పెంకుటిళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. ఖర్జెల్లి నుంచి గూడెం అటవీ ప్రాంతంలో పలు చెట్లు రోడ్డుకు అడ్డుగా చెట్లు పడిపోయాయి. కేతిని నుంచి దిందా మార్గంలో చెట్లు నేల కూలగా బీజేపీ నాయకుడు డోకె రామన్న ఆధ్వర్యంలో తొలగించారు. బెజ్జూర్ మండలంలో..మండలంలోని అందుగులగూడ, కుంటలమానెపల్లి, పోతెపల్లి, సుశ్మీర్, సలుగుపల్లి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. డబ్బా నుంచి బెజ్జూర్ మార్గంలో పలుచోట్ల చెట్లు రహదారిపై కూలిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగింది. కుంటలమానెపల్లి గ్రామంలో పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయి. అందుగులగూడలో నలుగురి ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. పోతెపెల్లి గ్రామంలో వర్షం పడడంతో ఇంటి పైకప్పు సరిచేస్తుండగా డోకె సంజీవ్ పిడుగుపాటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం తరలించారు. -
ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సేవలు కరువు
ఆసిఫాబాద్అర్బన్: మండలంలోని సాలెగూడ గ్రామపంచాయతీ గొల్లగుడ గ్రామానికి చెందిన లచ్చన్న అనారోగ్యంతో బాధపడుతుండగా ఆదివా రం అతడి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అతడిని వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. వెంటిలేటర్ లేదని కుటుంబీకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావ్ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని లచ్చన్నను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ‘ప్రాణాలతో చెలగాటమాడొద్దు’ఈ సందర్భంగా అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడు తూ.. జిల్లా కేంద్రంలో అలంకారప్రాయంగా మారి న 200 పడకల ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదని మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరి కాదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందక పేదలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని తెలిపారు. రూ.100 కోట్లతో ఆస్పత్రి భవనం నిర్మించినా సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల కొరత ఉందని తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్ చొరవ చూపి ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందేలా చూడాలని, అన్ని రకాల వైద్యం, పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. -
ట్రాఫిక్ కష్టాలు తీరేదెప్పుడో!
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఫుట్పాత్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. చిరువ్యాపారులు తోపుడు బండ్లు పెట్టుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. డివిజన్ కేంద్రంగా ఉన్నపుడే ప్రజలకు ఇబ్బందిగా మారిన ట్రాఫిక్ సమస్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రెట్టింపైంది. వాహనాల తాకిడి పెరగడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా స్థాయి అధికారుల వాహనాలు, ఇతర మండలాల నుంచి వచ్చిపోయే వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్డు కు ఇరువైపులా పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఆటో స్టాండ్లకు అనువైన స్థలం లేక రోడ్డుపైనే నిలుపుతున్నారు. అసలే ఇరుకై న రోడ్లు, వాటిపై నిర్వహిస్తున్న ఫుట్పాత్ వ్యాపారాల కారణంగా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయా దుకాణాలకు సరుకులు సప్లయ్ చేసే భారీ వాహనాలు రోడ్లపై నిలుపుతుండడంతో సమస్య మరీ తీవ్రమైంది. ముఖ్యంగా బ్యాంకులు, ఇతర కార్యాలయాలు, హోటళ్లు, ఆర్టీసీ డిపో, షాపింగ్ మాల్స్, ఇతర ప్రధాన దుకాణాలు దగ్గరదగ్గరగా ఉండడంతో వాహనాల పార్కింగ్కు స్థలం లేక ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. మేజర్ గ్రామపంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో మున్సిపల్ నిబంధనల ప్రకారం రోడ్లు వెడల్పు చేయాలని, అక్రమ కట్టడాలను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రద్దీగా ప్రధాన కూడళ్లుపట్టణంలోని ప్రధాన కూడళ్లయిన అంబేడ్కర్చౌక్, వివేకానందచౌక్, జగ్జీవన్రామ్చౌక్, గాంధీచౌక్, పొట్టి శ్రీరాములుచౌక్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రధాన కూడళ్లలో వ్యా పార, వాణిజ్య సముదాయాలు ఉండడంతో త ప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేసుకుంటున్నారు. దీంతో రోడ్లపై వెళ్లే ఇతర వాహనాలు తరచూ ప్రమాదాలకు గురికా వాల్సి వస్తోందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నా రు. నూతనంగా ఇళ్లు నిర్మించుకునేవారు నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్లను ఆక్రమించి ర్యాంపులు నిర్మించుకుంటున్నారు. అయినప్పటికీ అడ్డుకునేవారే లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కెరమెరి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూ పాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఆది వారం ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ, సన్ షైన్ హాస్పిటళ్ల సహకారంతో కెరమెరి పోలీసు ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబి రానికి హాజరై మాట్లాడారు. ముందుస్తు పరీక్షలు చేయించుకుంటే వ్యాధులను ప్రారంభ ద శలోనే గుర్తించవచ్చని తెలిపారు. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. నిరుపేద గ్రామీణులకు వైద్యశిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పోలీ సులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటార ని, ఏ సమస్య వచ్చినా ‘డయల్ 100’ కాల్ చేసి తెలుపాలని సూచించారు. శిబిరానికి కెరమెరి ఆర్ఎంపీ, పీఎంపీలు పూర్తి సహకారమందించగా, సీఐ సత్యనారాయణ, కెరమెరి, వాంకిడి ఎస్సైలు మధూకర్, మహేందర్, ఇన్చార్జి జిల్లా ఫార్మసీ అధికారి కలీల్ హుస్సేని, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గోండు పిల్లలు.. మెరికలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఏడేళ్ల గోండు విద్యార్థిని పేరు పర్చకి వర్ష. కొఠారి పాఠశాలలో రెండోతరగతి చదువుతోంది. మాతృభాష గోండి అయినప్పటికీ తెలుగులో చక్కగా మాట్లాడుతోంది. సాధారణ వాక్యాలను ఇంగ్లిష్లో చెప్పగలదు. రాష్ట్ర గీతం, జాతీయ గీతం, వందేమాతరం, ప్రతిజ్ఞ, జయజయహే తెలంగాణ గీతం చూడకుండా స్పష్టంగా పాడుతుంది. కెరమెరి: మండలంలోని కొఠారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే గోండు పిల్లలు గోండు భాషతోపాటు తెలుగులోనూ స్పష్టంగా మాట్లాడి అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 15మంది విద్యార్థులున్నారు. నాలుగో తరగతిలో ఆరుగురు విద్యార్థులుండగా ఐదుగురు, రెండోతరగతిలో ఐదుగురు విద్యార్థులుండగా నలుగు రు తెలుగు పాఠాలు స్పష్టంగా చదవగలుగతున్నా రు. ఆంగ్లంలోనూ నాలుగో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు బాగా చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు పడాల నందకుమార్, గ్రూపు స్టడీ, టీఎల్ఎంకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పాఠశాల ఆవరణలోకి రాగానే విద్యార్థులంతా తెలుగు మాట్లాడేలా హెచ్ఎం శిక్షణ ఇచ్చారు. గోండి భాష మినహా మరే భాష తెలియని పిల్లలు ఈ బడిలో చదువుతూ తెలుగు, ఆంగ్లం స్పష్టంగా మాట్లాడే స్థాయికి ఎదగడం విశేషం. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి..ప్రధానోపాధ్యాయడు విద్యార్థులు తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద వి ద్యార్థులు ఉదయం 6నుంచి 7గంటల వరకు చదవాలని, సాయంత్రం 6 నుంచి 8గంటల వరకు రా యాలని నిర్ణయించారు. వారు రాస్తున్న, చదువుతు న్న ఫొటోలను వారి తల్లిదండ్రులు వాట్సాప్ గ్రూ ప్నకు షేర్ చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో హోంవర్క్ ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా పూర్తి చేస్తున్నారు. ఫలితంగా పాఠశాలలో చెప్పిన పా ఠ్యాంశాలు, కథలు, గేయాలు వారికి కంఠత ఉంటున్నాయి. ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ పెడుతున్నాను పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై శ్రద్ధ పెడుతున్నాను. తెలుగు, ఆంగ్ల భాషలపై పట్టుకోసం బడిలో వారి గోండి భాషను నిషేధించాను. బడిలో ఉన్నంతవరకు తెలుగు, ఇంగ్లిష్ లోనే మాట్లాడాలనే నిబంధన పెట్టాను. విద్యార్థులు ఇంటి వద్ద తప్పనిసరిగా చదవడం, హోంవర్క్ చేసేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపు ద్వారా పర్యవేక్షిస్తున్నాను. ఇందుకు తల్లిదండ్రులు సహకరిస్తుండగా సత్ఫలితాలు వస్తున్నాయి. – పడాల నందకుమార్, ప్రధానోపాధ్యాయుడు, కొఠారి ఉన్నతంగా తీర్చిదిద్దాలి ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు అన్ని భాషల్లో రాయడం, చదవడం రావాలి. కొఠారి హెచ్ఎం చక్కగా విద్యార్థులకు బోధిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా బాగా తెలుగు మాట్లాడగలుగుతున్నారు. అన్ని పాఠశాలల్లోని చిన్నారులు తెలుగు, ఆంగ్లంలో మాట్లాడే స్థాయికి ఎదగాలి. ఇందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలి. – ఆడే ప్రకాశ్, ఎంఈవో, కెరమెరి -
అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి
తిర్యాణి: అసాంఘిక కార్యకలాపాలపై కఠి నంగా వ్యవహరించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో ని పోలీస్స్టేషన్ ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా రికార్డులు, హాజరు రిజి ష్టర్లు పరిశీలించారు. కేసుల పురోగతి వివరా లను ఎస్సై వెంకటేశ్ను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో చట్ట వ్య తిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మా దక ద్రవ్యాలపై దృష్టి సారించాలని తెలి పా రు. వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చే సుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యహరించాలని పేర్కొన్నారు. మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.


