Kumuram Bheem District News
-
‘దాదర్’ పట్టాలెక్కేనా?
బెల్లంపల్లి: కాజీపేట–ముంబై మధ్య గతంలో రాకపోకలు సాగించిన దాదర్ (ముంబై) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ (నంబర్ 07197/98) రైలును ఏడాది క్రితం అర్ధంతరంగా రద్దు చేశారు. అప్పటినుంచి ఈ రైలు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. రైల్వేశాఖ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంతో ముంబైకి వెళ్లడానికి ఉన్న ఒక్కగానొక్క సౌకర్యం కూడా దూరమైంది. కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్ల మధ్యలోని ప్రయాణికులకు దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు నాసిక్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా యి. రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అర్ధంతరంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తూ, కొత్త రైళ్లను ప్రవేశ పెడుతూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటుండగా దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందనే ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాతో అనుసంధానందాదర్ వీక్లీ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తే పాత అనుబంధం మళ్లీ చిగురిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదిలాబాద్తో విడిపోయిన అనుబంధం పెనవేసుకుంటుంది. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ (టి), కాగజ్నగర్ తదితర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్తో నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. తగ్గనున్న దూరభారం కాజీపేట నుంచి ఆదిలాబాద్కు వెళ్లడానికి ఈ మార్గం అత్యంత దగ్గరవుతుంది. ప్రతిపాదిత రూట్ను అమలు చేస్తే దూరభారం తగ్గుతుంది. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ మార్గం ఆదిలాబాద్ నుంచి కాజీపేట వయా నిజామాబాద్, చర్లపల్లితో పోలిస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా కాజీపేట నుంచి ఆదిలాబాద్కు దాదాపు 162 కిలోమీటర్ల దూరం తగ్గడానికి అవకాశాలున్నాయి. ఇన్ని రకాల ప్రయోజనాలున్న దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును పునరుద్ధరించి, క్రమబద్ధీకరించాలని ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నా రైల్వేశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులతోపాటు కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రమబద్ధీకరించేందుకు చొరవ చూపాల్సిన అవసరాన్ని రైలు ప్రయాణికులు గుర్తు చేస్తున్నారు. దాదర్ ఎక్స్ప్రెస్ను నడపాలి దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేయడంతో ముంబై వెళ్లడానికి ఉత్త ర తెలంగాణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్లి అక్కడి నుంచి మరో రైలులో వెళ్లాల్సి వస్తోంది. అర్ధంతరంగా రద్దు చేసిన దాదర్ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల రైలు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. నాసిక్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే భక్తులకు ఉపయుక్తం కానుంది. రైల్వేశాఖ అధికారులు ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. – మంతెన శ్రీనివాస్, రైలు ప్రయాణికుడు, బెల్లంపల్లి పునరుద్ధరణకు మీనమేషాలుదాదర్ వీక్లీ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరించి అత్యధిక ప్రాంతాలు, వేలాదిమంది ప్రయాణికులకు రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాల్సి న అవసరముంది. కాజీపేట జంక్షన్ నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, చంద్రపూర్, మజ్రికదాన్, ఆదిలాబాద్ మీదుగా నాందేడ్, పర్భానీ, జల్న, శంభాజీనగర్, నాగర్సోల్, మన్మాడ్, నాసిక్ రోడ్, కళ్యాణ్, థాణే, దా దర్ (ముంబై)కి రైలు నడపడంతో కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రయాణికులకు సౌలభ్యం కలిగే అవకాశాలున్నా అమలు చేయడం లేదు. ఏ కారణంగానో రైల్వేశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
భీం పోరాటం ప్రజలకు స్ఫూర్తి
కెరమెరి: కుమురంభీం పోరాటం ప్రజలకు స్ఫూర్తి దాయకమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్లోని భీం విగ్రహానికి ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ అధికా రి రమాదేవితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ఆదివాసీల ఆభరణాలు, వాయిద్యాలు, ఫొటో గ్యా లరీ, గుస్సాడీ నృత్యాల ప్రతిమలను తిలకించారు. గ్రామస్తులు ఆయనను శాలువాతో సత్కరించారు. భీం ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పెందుర్ రాజేశ్వర్, మ్యూజియం క్యూరేటర్ ఆడె దుందేరావు, ప్రధానోపాధ్యాయులు ఆత్రం మోతీరాం, కురం జంగు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆదివాసీల ఆత్మబంధువు హైమన్డార్ఫ్ఆసిఫాబాద్: ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్డార్ఫ్, జెట్టి ఎలిజబెత్ దంపతులని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. జైనూర్ మండలం మార్లవాయిలోని డార్ఫ్ దంపతులు, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డార్ఫ్ మ్యూజియం, రీడింగ్ లైబ్రరీ, కాటేజ్, గుస్సాడీ శిక్షణ కేంద్రం, గోండ్వానా పంచాయతీరాజ్ సెంటర్, దర్బార్ స్థలం, 1941లో డార్ఫ్ దంపతులు నివసించిన ప్రదేశం, ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన మహనీయులు ఆదివాసీల సంక్షేమం కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు. అంతకుముందు గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. డార్ఫ్ దంపతుల చిత్రపటం, నివేదిక పుస్తకం అందించి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జైనూర్ ఏటీడీవో శ్రీనివాస్, సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వర్రావు, గ్రామస్తులు ఆత్రం మాణిక్రావు, దేవరీ కనక గణపత్, ఆత్రం రాజేశ్వర్, జైనూర్ ఏఎంసీ డైరెక్టర్ లింగు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులకు పింఛన్ అమలు చేయాలి
ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు రూ.25 వేల పింఛన్ స్కీం అమలు చేయాలని జిల్లాకు చెందిన పలువురు ఉద్యమకారులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లల పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాగౌడ్, ఉద్యమకారులు గంధం శ్రీనివాస్, సీహెచ్ రవి, జాడి అశోక్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో మరో సంఘం
శ్రీరాంపూర్: సింగరేణిలో మరో కార్మిక సంఘం పురుడుపోసుకోనుంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీజీబీకేఎస్) పేరిట కార్మికుల ముందుకు వస్తోంది. సుధీర్ఘకాలం కార్మిక నేతగా పని చేస్తున్న గోదావరిఖనికి చెందిన టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సారథ్యంలో ఏర్పడుతోంది. ఏప్రిల్ 27న రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లో ఈ–2926 నంబర్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. కంపెనీలోని పరిస్థితులపై కొన్ని నెలలుగా పలువురు కార్మిక సంఘాల నేతలు, మేధావులతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నూతన సంఘానికి భీజం పడింది. సోమవారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ సంఘాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జూన్లో మహాసభ ఏర్పాటు చేసి సంఘం నిర్మాణం చేయనున్నారు. కొత్త సంఘం ఆవిర్భావంపై సింగరేణి కార్మికుల్లో చర్చ జరుగుతోంది. కార్మికుల హక్కుల పరిరక్షణ, సింగరేణి సంస్థ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. సింగరేణిలో ఇప్పటికే ఐదు జాతీయ సంఘాలతోపాటు తెలంగాణ భావజాలంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కొనసాగుతోంది. మరికొన్ని ప్రాంతీయ సంఘాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీజీబీకేఎస్ ఏర్పాటుపై ట్రేడ్ యూనియన్ నేతలు దృష్టి సారించారు. బొగ్గు గని పుట్టిన రోజే..మే 4కు బొగ్గు గని చరిత్రలో ప్రత్యేక స్థానముంది. 1774లో జార్ఖండ్లోని రాంచీలో దేశంలోనే మొదటి బొగ్గు గని ఏర్పాటైంది. ఆ రోజే బొగ్గు గని కార్మికుడు పుట్టినట్లు భావిస్తారు. దీంతో ఆ రోజును గుర్తుగా కార్మికులు ఎప్పుడూ స్మరించుకునేలా నేడు యూనియన్ను ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం కంపెనీ వ్యాప్తంగా కెంగర్ల మల్లయ్య అనుచరులు, సీనియర్ కార్మిక సంఘం నేతలు, కార్మికులు మేడారానికి వెళ్తున్నారు. కంపెనీని కాపాడేందుకే.. ప్రస్తుతం కంపెనీ అస్థిత్వం కోల్పోయే ప్రమాదముంది. కొత్త గనులు లేవు. ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఉన్న గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీకి రూ.50వేల కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంది. దీంతో ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. ఇలాగే కొనసాగితే సంస్థను అంబానీకో, అదానీకో అప్పగించే అవకాశముంది. 30ఏళ్ల క్రితం సింగరేణికి ఇలాంటి దుస్థితి వస్తే అప్పుడు కాపాడుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు వచ్చాయి. కంపెనీని కాపాడుకునేందుకు కార్మికుల హక్కులను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా యూనియన్ను నడిపిస్తాం. – కెంగర్ల మల్లయ్య, టీజీబీకేఎస్ వ్యవస్థాపకుడు -
ప్రశాంతంగా నీట్
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో నీట్ ప్రశాంతంగా ము గిసింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, ఉదయం 11 గంటల వరకే విద్యార్థులు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. 11.30 గంటల నుంచి ప్రధాన గేట్ వద్ద పోలీసులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అనంతరం బయోమెట్రిక్ తీసుకుని లోపలికి పంపించారు. పరీక్ష సమయం కంటే నిమిషం ముందు వచ్చిన ఖమానా, కౌటాలకు చెందిన నలుగురు విద్యార్థుల వద్ద గుర్తింపు కార్డులు లేకపోవడంతో అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. మొత్తం 316 మంది విద్యార్థులకు 303 మంది హాజరు కాగా, 13 మంది గైర్హాజరయ్యారని నీట్ కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహం తెలిపారు. కలెక్టర్ కె.హరిత పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. -
షెడ్లు నిర్మించాలి
పెరుగుతున్న ఎండ తీవ్రతను భరించలేకపోతున్నాం. ప్రతిరోజూ రెబ్బెన మండలం కొండపల్లి గ్రామం నుంచి పండించిన దోసకాయలు తీసుకువచ్చి విక్రయిస్తుంటా. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారం చేస్తే రూ.1000 వరకు గిరాకీ అయితది. నీడ కోసం రోడ్డు పక్కనే గొడుగు ఏర్పాటు చేసుకున్నా. ప్రభుత్వం స్పందించి పక్కా షెడ్లు నిర్మించి ఇవ్వాలి. – ప్రేమల్ఎండకు నీరసం వాంకిడి మండలం బెండారా గ్రామం నుంచి సొంతంగా పండించిన దోసకాయలు, కందగడ్డలు విక్రయించేందుకు ఆసిఫాబాద్ పట్టణానికి వస్తా. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకుంటా. సాయంత్రం 4 గంటల వరకు ఎండలోనే ఉండి ఇంటికి వెళ్లిన తర్వాత నీరసంగా ఉంటుంది. మున్సిపల్ అధికారులు చిరువ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలి. – సెండె భీంరావ్ సల్లటి నీళ్లు కూడా ఉండవ్.. కాగజ్నగర్ మండలం ఈస్గాం నుంచి తాటిముంజలను తీసుకువచ్చి ఆసిఫాబాద్లో అమ్ముతుంటా. రోజుకు సుమారుగా 200 ముంజలు అమ్ముడుపోతాయి. సాయంత్రం వరకు ఎండలోనే వడగాలులకు వ్యాపారం చేసుకోవాల్సి వస్తుంది. సల్లటి నీళ్లు కూడా ఉండవ్.. దినమంతా వేడి నీళ్లనే తాగాలి. పక్కా షెడ్లు ఇస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. – బిశ్వజిత్ మండల్ -
ఎల్ఆర్ఎస్.. మరో చాన్స్
ఆసిఫాబాద్: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకానికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. మే 1నుంచి జూలై 31వరకు గడువు విధించింది. గడువులోపు చెల్లించేవారికి పీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం ఇలాంటి అవకాశం ఇవ్వగా కొందరే వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మరోసారి రాయితీ అవకాశం అవకాశం కల్పించడం ప్లాట్ల యజమానులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం 2020 ఆగస్టు 31న ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించింది. అక్రమ లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు జీవో 131 జారీ చేసింది. జిల్లాలో 7,698 దరఖాస్తులుఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమవడంతో జిల్లా వ్యాప్తంగా 7,698 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్లు కలిగిన యజమానులు ఒక్కో ప్లాట్కు రూ.వెయ్యి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. వీటిలో 1,014 మంది దరఖాస్తుదారులు రూ.1.92 కోట్లు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగా, పరిశీలించిన అధికారులు 78 మందికి ప్రొసీడింగ్లు జారీ చేశారు. ఎల్1, ఎల్2, ఎల్3 మూడు దశల్లో అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఎల్1 స్టేజీలో పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎల్2లో డీపీవో, ఎల్3లో అదనపు కలెక్టర్ పరిశీలించిన తర్వాత చివరగా అధికారుల ధ్రువీకరణ అనంతరం ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ పత్రాలు జారీ చేస్తారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని భావించినప్పటికీ గతంలో ఆశించిన స్పందన రాలేదు. 13శాతం దరఖాస్తు దారులే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించారు. దరఖాస్తు దారులు ఫీజు చెల్లించి ఏడాది గడుస్తున్నా 896 దరఖాస్తులు ఇంకా ఎల్1 స్టేజీలోనే ఉన్నాయి. ఇలా వినియోగించుకోవాలిఎల్ఆర్ఎస్ పోర్టల్లో సిటిజన్ లాగిన్లోకి వెళ్లాలి. దరఖాస్తు నంబర్ లేదా ప్లాట్ వివరా లు ఇచ్చి పేమెంట్ స్టేటస్ చూడాలి. అనంత రం దరఖాస్తు స్థితి ఎల్1/ఎల్2/ఎల్3 చూసి పెండింగ్ ఫీజులు, వివరాలు తెలుసుకోవాలి. పోర్టల్లోనే నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర పే మెంట్ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చు. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ కనిసిప్తే వెంటనే చెల్లింపు పూర్తి చేయాలి. కార్డ్ పేమెంట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. దీంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ చెల్లించే అవకాశముంది. 25శాతం రాయితీ ఆటోమేటిక్గా వర్తిస్తుంది. పూర్తి ఫీజు చెల్లింపు అనంతరం డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.వీటికి వర్తించదుశిఖం, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లోని లే అవుట్లలోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదు. నిషేధిత జాబితాలో లేని లే అవుట్లు మాత్రమే పరిగణనలోకి వస్తాయి. లే అవుట్లో కనీసం 10 శాతం ప్లాట్లు ఇప్పటికే విక్రయించి ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే అర్హత ఉండదు. చెరువుకు 200 మీటర్ల దూరం ఉన్న ప్లాట్లకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అనుమతులు అవసరం. -
వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని 15–18 ఏళ్లలోపు బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. శని వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 2నుంచి జూన్ 10వరకు నిర్వహించనున్న వేసవి శి బిరాలపై జిల్లా స్థాయి సమన్వయం, క్షేత్రస్థాయి సి బ్బందికి అవగాహన, నిర్మాణాత్మక శిక్షణ ప్రణాళిక అమలుపై ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, వివిధ శాఖల అధికా రులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో వేసవి శిబి రాలు నిర్వహించాలని సూచించారు. శిబిరంలో వే సవిలో విద్య కొనసాగింపు, ఆరోగ్య సేవల సమన్వ యం, భద్రత అవగాహన, జీవన నైపుణ్యాలు, బా ల్య వివాహాల నివారణ కార్యక్రమాలపై దృష్టి సా రించాలని సూచించారు. రోజువారీ కార్యక్రమాలు ఒకరికొకరు తెలుసుకోవడం, బాల్య వివాహాల ని రోధం, ఆరోగ్య మేళా, అవగాహన, వ్యక్తి గత అవసరాలు, సవాళ్లు, సురక్షిత గ్రామ ప్రణాళిక, సురక్షిత గ్రామం, సమాజంతో సంభాషణ, ఆర్థిక అవగాహ న, శారీరక దారుఢ్యం, ఆటలు, విద్యా కేరీర్, మార్గదర్శనం, సైబర్ భద్రత, స్వతంత్ర ప్రమాణానికై శిక్షణ ఇచ్చి వారిలో మనోధైర్యం నింపాలని సూచించా రు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి వేసవి శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాల ని వివరించారు. డీఆర్డీవో దత్తారావ్, డీటీడీవో ర మాదేవి, డీఎంహెచ్వో సీతారాం, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, సెర్ప్ డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి ఆసిఫాబాద్: కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్దకు ఈ నెల 7న సీఎం రేవంత్రెడ్డి రానున్నందున అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరిత సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని సీఎం, మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. హెలీప్యాడ్, వేదిక, బారికేడ్లు, వీఐపీ గ్యాలరీ, అధికారుల పాసులు, మీడియా పాసులు, పారిశుద్ధ్య పనులు, తాగునీరు, వీఐపీలకు అల్పాహారం, భోజనాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది క్యాంపులతో సిద్ధంగా ఉండాలని, విద్యుత్ సరఫరా ప్రత్యామ్నాయంగా జనరేటర్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
తుమ్మిడిహెట్టిపై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ఈనెల 7నాటి సీఎం పర్యటనకు ముందే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్పై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని శివాజీ భవన్లో జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్ ఎత్తు 148 నుంచి 150 అడుగులకు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తేవాల్సిన బాధ్యత సిర్పూర్ ఎమ్మెల్యేతో పా టు ఆదిలాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డిపై ఉందని పేర్కొన్నా రు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింద ని, రెండు విడతల్లో మంజూరు చేసి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కార్తిక్, రాజేందర్ తదితరులున్నారు. ఆసిఫాబాద్రూరల్: రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్త మహేశ్ సూచించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలో ఎల్లారం గ్రామంలో రైతులకు సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రతీ సంవత్సరం ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. కార్యక్రజుమంలో ఏఈవో స్వాతి, ప్రియ, సుగంధి, సర్పంచ్ సీతారాం, రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన రైతులు -
స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్బ్యాక్
కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్–2026 కార్యక్రమంలో భాగంగా కాగజ్నగర్ మున్సి పాల్టీలో సిటిజన్ ఫీడ్బ్యాక్ సేకరణ ముమ్మరంగా సాగుతోంది. శనివారం మున్సిపల్ సిబ్బంది వార్డులు, ఆయా కాలనీల్లో తిరుగు తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. పట్టణ పారిశుద్ధ్యంపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు. చెత్త సేకరణ, బహిరంగ మలవిసర్జన రహిత పట్టణం, తడి, పొడి చెత్త వేరు చేయడం, వీ ధుల శుభ్రత, మురుగు కాలువల నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై మొత్తం ఏడు ప్రశ్నలకు ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. చాలా బా గుంది.. నుంచి అస్సలు బాగాలేదు.. వరకు నాలుగు ఆప్షన్లలో సమాధానం నమోదు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
నీట్కు సర్వం సిద్ధం
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో నీట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య వృత్తిలో చేరాలనే ఆశతో రోజుల తరబడి చదివిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు 316 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 227 మంది బాలికలు, 89 మంది బాలురు ఉన్నారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా 14 గదులు ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. విద్యార్థులను ఉదయం 11నుంచి 1.30గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ నిర్వహించి సెంటర్లోకి ప్రవేశ అనుమతి కల్పిస్తారు. 28మంది ఇన్విజిలేటర్లు, ఒక పరిశీలకుడు, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 2024 అనుభవం నేపథ్యంలో..జిల్లాలో 2024లో మొదటిసారిగా నీట్ నిర్వహించగా తప్పిదం జరిగింది. ఆధికారుల నిర్లక్ష్యంతో పేపర్ తారుమారైంది. పరీక్షా పేపర్లు రెండు సెట్లుగా రూపొందించగా ఒక సెట్ పేపర్ ఎస్బీఐలో మరో సెట్ కెనరా బ్యాంక్లో ఉంచారు. సెంటర్కు మెయిల్ ద్వారా ఎన్టీఏ అధికారులు పంపించిన నిబంధనల ప్రకారం ఎస్బీఐలో ఉంచిన సెట్ పేపర్ వాడాల్సి ఉండగా.. కెనరా బ్యాంక్లో ఉంచిన సెట్ పేపర్ తీసుకువచ్చి పరీక్ష రాయించారు. దేశవ్యాప్తంగా జీఆర్ఐడీయూ సెట్ నిర్వహించగా ఆసిఫాబాద్లో మాత్రం ఎన్ఏజీఎన్యూ సెట్ నిర్వహించారు. అయితే మిగతా సెంటర్లలో ప్రశ్నాపత్రానికి బార్ కోడ్ ఉండగా జిల్లా కేంద్రంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలకు ఎలాంటి బార్ కోడ్ లేకుండానే జవాబు పత్రాలు ఇచ్చారు. దీంతో 229 మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడింది. అప్పటి కలెక్టర్ చొరవ తీసుకుని కన్వీనర్తో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కాగా, గత తప్పిదం పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు సూచనలుపరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తాం నీట్ నిర్వహణకు అన్ని ఏ ర్పాటు పూర్తి చేశాం. పరీక్ష కు 316 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిబంధనల మేరకు విద్యార్థులను క్షుణంగా తనిఖీ చేసి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తాం. పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తాం. – లక్ష్మీనరసింహం, నీట్సిటీ కోఆర్డినేటర్ -
‘ప్రజాపాలనతోనే అన్ని రంగాల్లో ప్రగతి’
కాగజ్నగర్టౌన్: ప్రజల భాగస్వామ్యంతోనే సంక్షే మ పథకాలు సక్రమంగా అమలవుతాయని, ప్రజా పాలనతోనే అన్ని రంగాల్లో ప్రగతి సాధ్యమని ఎ మ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివారం పట్ట ణంలోని ఎస్పీఎం క్లబ్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ చేర్చే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అర్హులందరికీ ల బ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, వైద్యం, వ్యవసాయ సమస్యలపై చర్చించారు. సర్పంచులు గ్రామంలో నెలకొ న్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం అధికారులు శాఖలవారీగా నివేదికలు చదివి వినిపించారు. మున్సిపల్ చైర్పర్సన్ సాహిన్ సుల్తానా, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, తహసీల్దార్ మధూకర్, ఎంపీడీవో ఉజ్వల్కుమార్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డీఎస్పీ వహీదొద్దీన్, ఏడీఏ మనోహర్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. కుర్చీలు లేక తిప్పలు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధికసంఖ్యలో హాజరయ్యారు. హాల్లో వేసిన కుర్చీలు నాయకులు, అధికారులతోనే నిండిపోయాయి. దీంతో చాలామంది జనం గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. అధికారులు చేసిన ఏర్పాట్లపై ప్రజలు అసహనం వ్యక్తంజేశారు. -
‘అర్హులందరికీ సంక్షేమ ఫలాలు’
ఆసిఫాబాద్: అర్హులందరికీ సంక్షేమ పథకలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్కుమార్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం నియోజకవర్గంలో 36,179 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు సాయమందిస్తున్నట్లు తెలిపారు. వివిధ పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 4నుంచి 9వరకు నిర్వహించనున్న రైతు వారోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, రైతులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికొదిలేసి ప్రచారానికే పరిమితమైందని ఆరోపించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో లోకేశ్వర్రావు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గ్యాస్ సిలిండర్పై రూ.500 సబ్సిడీ ఇస్తున్నట్లు తెలుపగా ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తంజేశారు. గ్యాస్ సబ్సిడీ పూర్తి స్థాయిలో అందడంలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలను కాదని అధికార పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ ప్రొటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. సింగరేణి ప్రాంతానికి రావాల్సిన రూ.80కోట్ల నిధులు విడుదల చేస్తే రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు డీఎంఎఫ్టీ నిధులు ఇస్తుండగా, ఆసిఫాబాద్లో మాజీ ఎమ్మెల్యేకు కేటాయించారని ఆరోపించారు. కలెక్టర్ చొరవ తీసుకుని నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్కుమార్, మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శించడం తగదని సూచించారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని.. ఇది రాజకీయ సమావేశం కాదని, వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని కోరారు. వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు
ఆసిఫాబాద్అర్బన్: అనాలోచిత నిర్ణయాలు అనర్థాలకు దారి తీస్తాయని జిల్లా బాలల సంరక్షణాధికారి మహేశ్ పేర్కొన్నారు. యుక్త వయస్సులో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు జీవితాన్ని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టవచ్చని హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ డ్రైవ్ నిర్వహించారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. స్పష్టమైన లక్ష్యంతో జీ వితంలో ముందుకు సాగాలని, మాదకద్రవ్యాలు, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్య క్తులతో స్నేహాలు ప్రమాదాలకు దారి తీసే అవకాశముందని తెలిపారు. వీలైనంత వరకు సోషల్ మీడి యా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని పే ర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థులు భవిష్యత్లో ఆరో గ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఫీల్ రెస్పాన్స్ అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగంతో కలిగే శారీరక, మానసిక, సా మాజిక సమస్యల గురించి వివరించారు. డ్రగ్స్ అలవాటుతో వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. నర్సింగ్ విద్యార్థులు కమ్యూనిటీ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు. చైల్డ్ ప్రొటక్షన్ అధికారి శ్రవణ్, కౌన్సిలర్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డ్రగ్ వ్యసనం నుంచి బయట పడేందుకు కౌన్సిలింగ్, కుటుంబ మద్దతు, సరైన మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుని, ఒత్తిడిని సానుకూల మార్గాల్లో ఎదుర్కోవాలని సూచించారు. ప్రి న్సిపాల్ పద్మ మాట్లాడుతూ.. చెడు వ్యసనాలతో క లిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమా ల ద్వారా విద్యార్థులో బాధ్యత పెరుగుతుందని తె లిపారు. ఈ సందర్భంగా మదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం పెంపుతో పాటు సమాజంలో డ్రగ్స్ రహిత వా తావరణం నెలకొల్పడానికి ఇది ముఖ్యమైన ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. -
చెరువు అభివృద్ధికి కృషి చేయాలని వినతి
రెబ్బెన: మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరు వు అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక సర్పంచ్ దుర్గం భరద్వాజ్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు భూగ ర్భ జలాల పెంపునకు కీలకమైన ఎల్లమ్మ చెరువుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. పిచ్చిమొక్కలు, పూడిక పేరుకుపోవడంతో ఎగువునున్న ఎన్టీఆర్ కాలనీ ముంపునకు గురవుతోందని తెలిపారు. గతంలో కురి సిన వర్షాలతో కట్ట దెబ్బతిని చెరువు ప్రమాదకర స్థితిలో ఉందని పేర్కొన్నారు. కట్టను బలోపేతం చేయడంతో పాటు పూడికతీత పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేయాల ని కోరారు. చెరువు ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వెంటనే చెరువు అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
తుమ్మిడిహెట్టికి రెండో ముఖ్యమంత్రి
పరిశీలించిన కలెక్టర్, అధికారులుకౌటాల: ఈ నెల 7న సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత, ఎస్పీ పి.నితిక పంత్, ఎమ్మెల్సీ దండె విఠల్ శుక్రవారం కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది ప్రాంతాన్ని పరిశీలించారు. బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీరు తదితర వివరాలపై ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రులు, నీటి పారుదల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మిడిహెట్టిలోని ప్రాణహిత నది బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తారని తెలిపారు. సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణం ప రిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, తహసీల్దార్ ప్రమోద్కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్, సీఐ సంతోష్కుమార్, ఎస్సై చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. 150మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం, వంద టీఎంసీల నీటి వినియోగానికి ఇటీవల రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రలో ముంపు ఏర్పడితే పరిహారం చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల ఏళ్లనాటి సాగునీటి కల సాకారం వైపు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 7న సీఎం రేవంత్రెడ్డి స్వయంగా బరాజ్ నిర్మించే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి శివారు ప్రాణహిత నది వద్దకు రానున్నారు. 18ఏళ్లుగా ఎదురుచూపులు.. ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తుమ్మిడిహెట్టి వద్ద శంకుస్థాపన చేశారు. 152 అడుగుల ఎత్తులో బరాజ్ నిర్మించి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు నీరందించాలి. ఆ తర్వాత ఎల్లంపల్లి వరకు నీటిని తరలించి అక్కడి నుంచి ఆరు జిల్లాలకు నీరివ్వాలి. ఇందుకోసం భూసేకరణ, 71కిలోమీటర్ల కాలువల నిర్మాణానికి రూ.11వేల కోట్లు వెచ్చించారు. అయితే 152మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 30 గ్రామాల ముంపు ఏర్పడుతుందని అభ్యంతరాలు రావడంతో ఆగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. చివరగా 2015లో నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావుతో జరిగిన చర్చల్లో 148మీటర్ల ఎత్తు వరకు అంగీకరించారు. పూర్తి స్థాయి ఎత్తుకు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టారు. రీడిజైన్లో గోదావరి–ప్రాణహిత కలిసే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. తర్వాత వార్దా నదిపై బరాజ్ కట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల సాగునీటికి డిజైన్లు చేసినా ముందుకు సాగలేదు.2008లో నాటి కాంగ్రెస్ సర్కారు హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని ప్రారంభ సమయంలో సందర్శించారు. మళ్లీ 18ఏళ్ల తర్వాత ఓ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఈ నెల 7న ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గతంతో పోలిస్తే బరాజ్ నిర్మాణం, కాలువలు, భూ సేకరణ ఇతర వ్యయం ఎల్లంపల్లి వరకే భారీగా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బరాజ్ ఎత్తు విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ ఇంకా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాలేదు. గోదావరిపై ఉన్న సుందిళ్ల బరాజ్కు తరలించడమా, లేక పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళ్తారా? అనేది తుది ప్రతిపాదన వెల్లడి కావాల్సి ఉంది. దీంతో పెరిగిన ఖర్చులతో రూ.20వేల కోట్ల వరకు అవుతుందనే అంచనా ఉంది.భారీగా పెరగనున్న వ్యయం -
యోగా పోటీలకు ఎంపిక
రెబ్బెన: యోగాసన భారత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వ రల్డ్ యోగాసన చాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన చెల్లుబోయిన ఏడుకొండలు ఎంపికైనట్లు యో గాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. హర్యానాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్లో శనివారం జరిగే కీలక పోటీల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. సీనియర్ బీ విభాగం సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఆసనాల పోటీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపితే దేశం తరఫున ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కుతుందని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొలిపాక కిరణ్కుమార్, రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను అభినందించారు. -
కార్మికుల సంక్షేమానికి పథకాలు
ఆసిఫాబాద్: కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో లోకేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు ఈ– శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి సమగ్రంగా వివరించారు. బాల వ్యవస్థ నిర్మూలనకు అంకితభావంతో పనిచేస్తున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్కు ఉత్తమ అధికారిగా, స్పెషల్ కేటగిరీ కింద చైల్డ్ లేబర్గా గుర్తించి ప్రస్తుతం చదువుకుంటున్న బాలుడు సన్నీకి ప్రోత్సాహక అవార్డు, ఉత్తమ యాజమాన్యం కింద సమర్థవంతమైన నిర్వహణకు జిన్నింగ్ మిల్లు యజమాని రఫీక్ జివానికి అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఏపీడీ రామకృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖి, డీఎంహెచ్వో సీతారాం, కార్మికశాఖ అధికారి సత్యనారాయణ, ఉపాధి కల్పనాధికారి కిరణ్కుమార్, విజయ్కన్నా తదితరులు పాల్గొన్నారు. -
సీజన్కు ముందే దందా..!
రెబ్బెన మండలం కొమురవెళ్లికి చెందిన గజ్జల సూర్యకాంత్, అతని స్నేహితులైన జక్కులపెల్లికి చెందిన ధోని రాజేశ్, కొమురవెళ్లికి చెందిన కొల్లూరి సాయికిరణ్లు ఆంధ్రప్రదేశ్లోని శ్రీనివాస్ వద్ద నకిలీ పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి స్థానిక రైతులకు అంటకట్టే ప్రయత్నం చేశారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు సూర్యకాంత్ వద్ద నుంచి 175 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.37 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. ఏప్రిల్ 28న పోలీసులు ఈ ఘటన వివరాలు వెల్లడించారు. ఆసిఫాబాద్ పట్టణ సమీపంలో ఏప్రిల్ 15న పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన వ్యాపారి రాచర్ల మహేశ్, సాయికిరణ్ కారులో తరలిస్తున్న 80కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. విచారణ అనంతరం పోలీసులు వ్యాపారి మహేశ్ ఇంటి వద్ద మరో 5.70 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.27లక్షల ఉంటుందని, గుజరాత్ నుంచి తెచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. చింతలమానెపల్లి: వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాల దందా ప్రారంభమైంది. ‘అధిక దిగుబడి, తక్కువ ఖర్చు’ అని మాయమాటలు చెబుతూ కొందరు రైతులకు అంటకట్టేందుకు క్వింటాళ్ల కొద్దీ దిగుమతి చేసుకుని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా పత్తి అధికంగా సాగు చేస్తుండగా నకిలీ విత్తనాలతో లాభాలు పొందేందుకు వ్యాపారులు అక్రమ దందాకు తెరతీస్తున్నారు. గతేడాది మంచిర్యాల, బెల్లంపల్లి తదితర పట్టణాల నుంచి కాగజ్నగర్, వాంకిడి, సిర్పూర్(టి) ప్రాంతాలకు సరఫరా చేసి విక్రయించారు. వివిధ ప్రాంతాల నుంచి సరఫరా..ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా జిల్లాలు, మహారాష్ట్రలోని ఇందన్ఘాట్, నాగపూర్, గుజరాత్లో వడోదర, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి నకలీ విత్తనాలు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దందా ఏటా కొనసాగుతోంది. విత్తనాలను పరీక్షల కోసం ల్యాబ్లకు తరలించినప్పుడు నివేదిక రావడానికి సుమారు ఆరు నెలలకు పైగా సమయం పడుతోంది. అలాగే ప్రధాన వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో వీరిని పట్టుకోవడం పోలీసుశాఖ, వ్యవసాయ శాఖలకు కష్టతరంగా మారుతోంది. గతేడాది కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో స్థానిక వ్యాపారులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసిన సురేశ్ అనే ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారిపై మాత్రం పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయగలిగారు. అనర్థాలే ఎక్కువ..నకిలీ విత్తనాలకు జెనటిక్ ఇంజినీరింగ్ కమిటీ అనుమతులు ఉండవు. అధిక దిగుబడి వస్తుందనుకున్నా కలిగే అనర్థాలే ఎక్కువ. భూసారం తీవ్రస్థాయిలో తగ్గుతుంది. జన్యు సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడంతో పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుంచి కనీసం పరిహారం అందదు. దీంతో విత్తనాల క్రయ, విక్రయాల నివారణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలను రూపొందించాయి. పూర్తిస్థాయి అనుమతులు లేకుండా విక్రయిస్తే విత్తన చట్టం– 1966, పర్యావరణ పరిరక్షణ చట్టం– 1986 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. నాణ్యత లేని విత్తనాలను ఇతర ప్రముఖ బ్రాండ్ల పేరుతో అమ్మితే ఆయా కంపెనీలు ఇచ్చే ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తారు. రైతులకు తీవ్ర నష్టం నకిలీ విత్తనాల వినియోగంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. సరైన సమయంలో విత్తనాలు విత్తి దుక్కి దున్నితే కలుపు నివారించుకోవచ్చు. గడ్డి నివారణకు పర్యావరణ హితమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదించిన మందులు వినియోగించాలి. నకిలీ విత్తనాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. – వెంకట్, జిల్లా వ్యవసాయ అధికారి నిఘా పెడితేనే కట్టడినకిలీ విత్తనాల వ్యాపారాన్ని అరికట్టేందుకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఇటీవల సమావేశం నిర్వహించారు. చింతలమానెపల్లి మండలం గూడెం, సిర్పూర్(టి) మండల కేంద్రం, వెంకట్రావుపేట, వాంకిడి మండలంలోని జాతీయ రహదారిపై మహారాష్ట్రకు వెళ్లే మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏఈవోలను తనిఖీ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ మరిత, జిల్లా వ్యవసాయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కల్పించాలి. నకిలీ విత్తనాల గుర్తింపు, నష్టాల గురించి వారికి వివరిస్తే కట్టడి సాధ్యమవుతుంది. -
జీరో ప్రమాదాలే లక్ష్యం..!
ఆసిఫాబాద్: ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యుత్ వాడకంలో వినియోగదారుల్లో భద్రతపై అవగాహన పెంపొందించి, ప్రాణాంతకమైన ప్రమాదాలను సున్నాకు తగ్గించడమే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం. విద్యుత్ భద్రత అనేది కేవలం విద్యుత్ బిల్లు చెల్లించడమే కాదు, తన కుటుంబ భద్రత కూడా అనే నినాదంతో అధి కారులు వినియోగదారులకు అవగాహన కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,77,479 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ, ఇతర కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 17.35 లక్షల యూనిట్లు వినియోగం ఉండగా, ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సురక్షితంగా ఎలా వాడాలి.. షాక్ తగిలితే ఏం చేయాలి, వైరింగ్, ఇన్స్టాలేషన్లో ఉండే ప్రమాదాలు, తదితర అంశాల గురించి వివరించనున్నారు. కార్యక్రమాలు ఇవే..అవగాహన కల్పించేందుకే వారోత్సవాలు రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 1 నుంచి 7 వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ ఆసిఫాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో ఆర్డీవో లోకేశ్వర్రావు, ట్రాన్స్కో ఎస్ఈ ఉత్తమ్ జాడేతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మండలంలో అవగాహన కల్పించాలని, విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం, అలసత్వం, అజాగ్రత్తతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిఒక్కరూ సేఫ్టీ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
దహెగాం: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని సివిల్ సప్లై డీఎం రజిత అన్నారు. మండలంలోని లగ్గాంలో సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డీఎం మాట్లాడుతూ కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు. తేమ 17 శాతం కంటే మించకుండా ఉండాలని, తాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా రైతులు ఇబ్బంది పడకుండా టెంట్లు, షెడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అకాల వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోవడానికి టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోండ్ర మహేశ్గౌడ్, డీసీఏవో శ్యాముల్, ఏవో రామక్రిష్ణ, డీటీ గణేశ్, సీఈవో బక్కయ్య, ఏఈవోలు ఆదిత్య, ఆనంద్ పాల్గొన్నారు. -
ఘనంగా బుద్ధ పౌర్ణిమ వేడుకలు
వాంకిడి: మండలంలోని వాంకిడి జేత్వాన్ బుద్ధ విహార, ఖమాన గ్రామంలోని నాగ్సేన్ బుద్ధ విహార, ఇందాని, ఖిరిడి, సరాండి, బంబార గ్రామాల్లోని బుద్ధ విహారాల్లో శుక్రవారం భగవాన్ బుద్ధుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధుడు, అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాంకిడిలో 70 ఫీట్ల పంచశీల్ జెండాతో ర్యాలీ చేపట్టారు. బుద్ధుడు చూపిన మార్గంతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, ఎస్ఎస్డీ జిల్లా అధ్యక్షుడు మార్షల్ దుర్గం సందీప్, నాయకులు జైరాం ఉప్రె, శేఖర్ జాడె, కిషన్ ఖోబ్రగడె పాల్గొన్నారు. -
కార్మికుల ఐక్యతకు ప్రతీక ‘మేడే’
ఆసిఫాబాద్: కార్మికుల ఐక్యతకు ప్రతీక మేడే అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మున్సిపల్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వద్ద జెండా అవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మేడేను పండగలా కాకుండా పోరాట దినంగా జరుపుకోవాలన్నారు. కార్మిక ఐక్యతను బలోపేతం చేస్తూ దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోదాము వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై కార్మికులు మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు దిన్కర్, రైతు సంఘం నాయకులు తిరుపతి, శ్రీకాంత్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్కిషన్, మండల అధ్యక్షుడు కమలాకర్, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్టుపెల్లి సుధాకర్, నాయకులు, కార్మికులు మాట్ల రాజయ్య, సమ్మయ్య, నంది పద్మ, శ్రీలక్ష్మి, రమ పాల్గొన్నారు. -
బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్
జన్నారం: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన ఓ బాలిక వేసవి సెలవులో పిన్ని, బాబాయి ఇంటికి వచ్చింది. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన డోంగరి లక్ష్మణ్ సదరు బాలికతో సాన్నిహిత్యం ఏర్పర్చుకొని ఆమెతో పొటోలు దిగాడు. ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని, కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించి ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో బాలిక తల్లి గత నెల 28న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపి 29న నిందితుడిని అరెస్ట్ చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
10 వరకు స్వీయ గణనకు అవకాశం
ఆసిఫాబాద్అర్బన్: జనాభా గణన– 2027లో భాగంగా మే 10 వరకు స్వీయ గణన ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం స్వీయ గణన, ఉపాధిహామీ పథకం, నకిలీ విత్తనాలు, మందులు, ఇంధన కొరత, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన జనగణన– మన అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా గణన 2027లో మొదటి విడతగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన ద్వారా తమ ఇంటి వివరాలు, 33 అంశాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్వైజర్లు, 1,689 హౌజ్ లిస్టింగ్ బ్లాక్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇంధన కొరత లేదుజిల్లాలో ఇంధన కొరత లేదని కలెక్టర్ తెలిపారు. డి మాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా ఉంద ని పేర్కొన్నారు. అనవసరమైన వదంతులు నమ్మొద్దన్నారు. ఉపాధిహామీ పనిప్రదేశాల్లో కూలీలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. రానున్న వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులు నకిలీ పత్తి విత్తనాలు, మందులు కొనుగోలు చేయొద్దని సూచించారు. అనుమతి లేకుండా విత్తనాలు, మందులు కొనుగోలు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 34 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, వ్యవసా య శాఖ అధికారి వెంకటి, డీపీఆర్వో సంపత్కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
అధ్యాపకుడికి అంతర్జాతీయ గుర్తింపు
కై లాస్నగర్(బేల): బే ల మండలంలోని కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.వేముగంటి వరప్రసాద్రావు బోధన, సేవ, పరిశోధన రంగాల్లో చేస్తున్న సేవలకుగానూ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. యునైటెడ్ కింగ్డమ్లోని క్వాలిటీ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ కౌన్సిల్ నుంచి ఫెలో రాయల్ మెంబర్ ఆఫ్ ఇంటిగ్రేటేడ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్ పేరిట విశిష్ట గౌరవాన్ని కల్పిస్తూ ధృవీకరణ పత్రం అందజేసింది. సమీకృత శాసీ్త్రయ అభివృద్ధి, వివిధ విభాగాల్లో అసాధారణమైన కృషి , ఆవిష్కరణలు, నిబద్ధతను ప్రదర్శించిన వ్యక్తులకు ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలుఉట్నూర్రూరల్: ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్ వంటి దేశాల్లో ఉద్యోగాల కోసం గిరిజన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో మంద మకరందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ వంటి ఉన్నత స్థాయి పోస్టులతో పాటు స్ప్రే పెయింటర్ (100), ప్యానెల్ బీటర్ (100), ఆటోమోటివ్ మెకానిక్ (100), వెల్డర్ (100), ఎలక్ట్రీషియన్ (120), నర్సులు (90), ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్ (20), అగ్రికల్చర్ ఇంజనీర్ తదితర పోస్టులు ఉన్నాయన్నారు. 25 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సువారు అర్హులన్నారు. ఆసక్తి కలవారు ధ్రువీకరణ పత్రాలతో మే 1 నుంచి 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
కార్మికుల బతుకు పోరు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు గడుపుతున్నారు కార్మికులు. నిద్ర నుంచి మేల్కొనగానే పనికోసం అన్వేషణ మొదలవుతుంది. పనిదొరికితే ఆ రోజు గడుస్తుంది. లేదంటే పస్తులే. ఎండైనా వానైనా, చలినైనా తట్టుకుని కష్టపడాల్సిందే. తమ కుటుంబాల పోషణ కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి, కష్టమైనా ఇష్టంగా పనులు చేస్తున్నారు. ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వారి రాత మాత్రం మారడం లేదు. మేడే సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిలో నిమగ్నమైన కార్మికుల బతుకుపోరాట చిత్రాలు ఇవీ. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
అనాథ పిల్లలను గుర్తిస్తే సమాచారం ఇవ్వండి
ఆసిఫాబాద్: అనాథ పిల్లలను గుర్తిస్తే వెంటనే జిల్లా బాలల సంరక్షణ విభాగానికి సమాచా రం అందించాలని ఆర్టీసీ డీఎం రాజశేఖర్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు పిల్లల దత్తత ప్రక్రియ, బాలల హక్కులపై అవగాహన కల్పించారు. డీఎం మాట్లాడుతూ కొంతమంది నవజాత శిశువులు, చిన్నారులను వదిలివేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అలాంటి పిల్లలను గుర్తిస్తే పోలీసులు, ప్రభుత్వ బాలల సంరక్షణ అధికారికి 1098 ద్వారా సమాచారం అందించాలని కోరారు. పిల్లలను దత్తత తీసుకునే వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన చట్టబద్ధమైన విధానాలు పాటించాలని సూచించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీవోఎన్ఐసీ శ్రావణ్కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది వెంకటేశ్వర్లు, సుకన్య పాల్గొన్నారు. -
కుమురం భీం
7మూగజీవాల దాహం తీరేదెలా.. ఉపాధిహామీ పథకం కింద నిర్మించిన నీటితొట్టీలు శిథిలావస్థకు చేరాయి. మండుటెండలకు మూగజీవాలు దాహం తీర్చుకోవడానికి అల్లాడుతున్నాయి. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ వేడి ప్రభావం కొనసాగుతుంది. పాత పుస్తకాలే దిక్కు! 30 ఏళ్ల పైబడి కొనసాగుతున్న కెరమెరి గ్రంథాలయంపై ఆదరణ కరువైంది. కొత్త పుస్తకాలు లేక పాతవాటితోనే నెట్టుకొస్తుండడంతో పాఠకుల సంఖ్య తగ్గుతోంది. 9లోu శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026 -
వేర్వేరు చోట్ల జొన్న పంట దగ్ధం
బోథ్: మండల కేంద్రంలోని లాల్పిచ్ మైదానం సమీపంలో సాగుచేసిన 13 ఎకరాల జొన్నపంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గురువారం సాయంత్రం పంటచేలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సింగం వెంకటరమణకు చెందిన ఎనిమిది ఎకరాలు, గోవింద్కు చెందిన రెండెకరాలు, మాధవ్కు చెందిన మూడెకరాల్లో పంట పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు ఇచ్చోడలోని ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. సింగం వెంకటరమణకు రూ.4 లక్షలు, గోవింద్కు రూ.1.50 లక్షలు, మాధవ్కు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మెడిగూడలో (ఆర్)లో.. సాత్నాల: మండలంలోని మెడిగూడ (ఆర్)లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జొన్నపంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిట్యాల రాములు రెండెకరాల్లో సాగు చేసిన జొన్నపంటను కోసి పంటచేలోనే ఉంచాడు. గురువారం పంటచేల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకి నిప్పులు ఎగిసి పడడంతో పంటకు నిప్పంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానిక రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.1,50,000 నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. కుంటాలలో.. లోకేశ్వరం(కుంటాల): కుంటాల మండలంలోని కల్లూర్లో 11 కేవీ విద్యుత్ తీగలు గాలికి ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి గ్రామానికి జొన్నపంట దగ్ధమైంది. అందకూర్కు చెందిన వెంకట్ వారం రోజుల క్రితం జొన్నచేను కోసి పంటను కల్లూర్లోని సాయిరాం చేనులో ఆరబెట్టాడు. 11 కేవీ విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. జొన్నపంటతో పాటు రైతులు సాయిరాం, బలిరాంకు చెందిన వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి. జొన్న పంట విలువ రూ.20 వేలు, పరికరాల విలువ రూ.10 వేలు ఉంటుందన్నారు. -
విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్: జిల్లాలో విద్య, వైద్యం, తాగునీటితోపాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటాల్లోనే.. తండ్రి సీతారాం జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి, తల్లి కమల గృహిణి. సోదరుడు బ్యాంకు ఉద్యోగి. మా స్వగ్రామం రాజస్తాన్లోని సవాయి మాధోపూర్. ప్రాథమిక విద్య సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశా. జైపూర్లో ఇంటర్, వారణాసి ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తయ్యింది. అనంతరం 2013– 14లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగం వచ్చింది. అనంతరం సివిల్స్కు ఎంపికయ్యా. 2022 ఐఏఎస్ బ్యాచ్. భార్య మౌనిక ఐపీఎస్ ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. పీవోగా పనిచేసిన అనుభవంగతంలో ఆదిలాబాద్ జిల్లా సబ్కలెక్టర్గా విధులు నిర్వహించా. ఉట్నూర్ ఐటీడీఏ ఇన్చార్జి ఇన్చార్జి ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లాలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తా. ఏఐ టెక్నాలజీతో ఆస్పిరేషన్ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు మోడల్ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటా. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. -
స్క్రాప్ దుకాణాల తనిఖీ
కాగజ్నగర్టౌన్: ‘తుక్కు.. ప్ర మాదాల ముప్పు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. గురువారం పట్టణంలోని స్క్రాప్ దుకాణాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్న దుకాణాలకు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఈఈ ప్రణీల్ సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా.. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్ఓసీ, పొల్యూషన్ అనుమతి, కొనుగోలు, అమ్మకాల రిజిస్టర్ నిర్వహించడం లేదని గుర్తించారు. నిబంధనలు పాటించని వారిపై మున్సిపల్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది దేవా, ఫారుక్, రమేశ్ పాల్గొన్నారు. ఎఫెక్ట్ -
ఇంటికే సరుకులు..!
దహెగాం: ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు సైతం మే 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, సరుకులు ఇంటికే సరఫరా చేయనున్నారు. బియ్యం, పప్పులు, పాలు, గుడ్లు, పల్లీపట్టీలు, మురుకులు, మిల్లెట్స్, బాలామృతం అందిస్తారు. అలాగే నెలరోజులపాటు వారి ఆరో గ్యంపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. 1,006 కేంద్రాలు..జిల్లావ్యాప్తంగా ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరేళ్ల లోపు చిన్నారులు సుమారుగా 37,353 మంది, గర్భిణులు 2,903, బాలింతలు 1,573 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం మే 1 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడకుండా సిబ్బంది సరుకులు ఇంటికే వెళ్లి అందిస్తారు. గృహాల సందర్శన..వేసవి సెలవులైనా బాలింతలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ సిబ్బంది గృహ సందర్శన కార్యక్రమం నిర్వహిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం తెలుసుకుంటా రు. ఆరోగ్యం బాగా లేకుంటే స్థానిక ప్రాథమిక ఆ రోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తారు. చి న్నారుల బరువు, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఎండల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, పోషణపై అవగాహన కల్పిస్తారు. సెలవుల అనంతరం ‘అంగన్వాడీ బాట’వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు చేపడతారు. కేంద్రాల్లో ఐదేళ్ల వారు ఉంటే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. అలాగే చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకోవడానికి ‘అమ్మమాట– అంగన్వాడీ బడిబాట’ కార్యక్రమం ద్వారా గుర్తిస్తారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సెంటర్లలో చేర్పిస్తారు. సరుకులు అందించడానికి చర్యలు అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులకు అవసరమైన సేవలు నిలిపివేయం. సేవలు యథా విధిగా కొనసాగుతుతాయి. లబ్ధిదారులకు సరుకులు ఇంటికే అందించడానికి చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం నుంచే వచ్చే పౌష్టికాహారం నేరుగా వా రి ఇళ్ల వద్ద అందిస్తాం. గృహ సందర్శన కార్యక్ర మం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తాం. – రెబెకా, ఐసీడీఎస్ సీడీపీవో -
భాషపై పట్టేది..?
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం ఆందోళనకరంగా మారింది. కఠినమైన గణితం, సైన్స్లో కాకుండా భాష సబ్జెక్టుల్లో తప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలల నుంచి 6,932 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరైతే ఇందులో 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. 405 మంది ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా తెలుగు సబ్జెక్టులో 190 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే తెలుగు తర్వాత ఇంగ్లిష్లో 186 మంది, గణితంలో 141 మంది, సైన్స్లో 128 మంది, హిందీ, సాంఘిక శాస్త్రంలో 30 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జిల్లాలో చాలామంది మరాఠీ, గోండి మాట్లాడే విద్యార్థులు ఉన్నారు. దీంతో వారు తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజీలపై పట్టు సాధించలేకపోయారని అధికారులు చెబుతున్నారు. శతశాతం 2.0 అమలుభాష సబ్జెక్టుల్లో విద్యార్థులు కొంతమంది తప్పినా.. జిల్లా మాత్రం గతేడాదితో పోల్చితే మెరుగైన ఉత్తీర్ణ త శాతం నమోదు చేసింది. మూడేళ్లుగా చివరి మూ డుస్థానాలకే పరిమితం కాగా, 2025–26 ఫలితాల్లో మాత్రం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానంలో నిలిచింది. పదో తరగతిలో ఉత్తీర్ణత శా తం పెంచాలనే సంకల్పంతో జిల్లా విద్యాశాఖ శతశాతం 2.0 కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసింది. గిరిజన జిల్లాలో మెరుగైన ఫలితాలు రావా లని అదనపు కలెక్టర్ పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించారు. వారంలో ఒకరోజు హెచ్ఎంలు, ఎంఈవోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. డిసెంబర్లోగా సిలబస్ పూర్తి చేయించారు. దీంతో ముందుగానే రివిజ న్ మొదలు పెట్టేందుకు అవకాశం కలిగింది. ఉద యం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. రోజువారీగా సైక్లింగ్ టెస్ట్లు ఏర్పాటు చేశా రు. విద్యార్థుల హాజరు, సబ్జెక్టుల వారీగా రిపోర్టులు స్వయంగా పరిశీలిస్తూ వెనుకబడిన వారిపై ప్ర త్యేక దృష్టి సారించారు. మరోవైపు సింగరేణి యాజ మాన్యం సహకారంతో ప్రత్యేక తరగతులకు హాజర య్యే వారికి ఉదయం, సాయంత్రం స్నాక్స్ అందించారు. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక మాడ్యూల్ తయా రు చేయించి ఉపాధ్యాయులకు అందించారు. మెరుగైన ఉత్తీర్ణతజిల్లాలోని మొత్తం 170 ఉన్నత పాఠశాలలకు 54 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. 13 ఆశ్రమాలు, మూడు బీసీ సంక్షేమ గురుకులాలు, 8 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, 9 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ఒక మైనార్టీ పాఠశాల, రెండు సాంఘిక సంక్షేమ గురుకులాలు, 18 ప్రైవేట్ పాఠశాలలు, 3 గిరిజన సంక్షేమ గురుకులాలు 100 శాతం ఉత్తీర్ణతతో మెరిశాయి. కెరమెరి మండలంలో 338 మంది పరీక్షలకు హాజరైతే కేవలం ముగ్గురు మాత్రమే పాస్ కాలేదు. లింగాపూర్ మండలంలో ఇద్దరు, పెంచికల్పేట్, సిర్పూర్(యు)లో ఆరుగురు చొప్పున, తిర్యాణిలో నలుగురు మాత్రమే ఫెయిల్ అయ్యారు. గరిష్టంగా కాగజ్నగర్ మండలంలో 104 మంది ఉత్తీర్ణత సాధించలేదు. ఆసిఫాబాద్లో 66 మంది, బెజ్జూర్లో 23, చింతలమానెపల్లి 39, దహెగాం 12, జైనూర్ 33, కౌటాల 24, రెబ్బెన 21, సిర్పూర్(టి) 41, వాంకిడి మండలంలో 21 మంది ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలు గతేడాది కంటే ఈసారి కాస్త మెరుగైన ఫలితాలు సాధించాం. నేను జిల్లా విద్యాధికారిగా విధుల్లోకి వచ్చే సమయానికే వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. తక్కువ ఉత్తీర్ణత శాతం సాధించిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలు చేపడతాం. – లలిత, డీఈవో -
మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య
లక్ష్మణచాంద: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంజాల్ గ్రామానికి చెందిన మూడారపు ప్రణయ్కుమార్ (28) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని భార్య వినీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. బైకును తప్పించబోయి.. ఎడ్లబండిని తాకి.. వేమనపల్లి: ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు పక్కనే నిలిచి ఉన్న ఎడ్లబండిని తాకడంతో విద్యుత్ స్తంభం విరిగి బస్సుపై పడింది. దీంతో గ్రామంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద వారసంత జరుగుతోంది. సుంపుటం నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బస్టాండ్ సమీపంలోకి రాగానే డ్రైవర్ ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి మరోవైపు నిలిపి ఉన్న ఎడ్లబండిని తాకించాడు. ఎడ్ల బండి విద్యుత్ స్తంభానికి తాకడంతో స్తంభం విరిగి ఆర్టీసీ బస్సుపై పడిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో పెను ప్రమాదం తప్పింది. వార సంత జరిగే ప్రదేశంలోనే ఈ ఘటన జరగడం, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ శాఖ ఏఈ దీక్షిత్, సబ్ ఇంజినీర్ ఆకాష్, నీల్వాయి ఎస్సై జగదీష్రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. -
‘బెల్లంపల్లి’లో 104శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా ఏప్రిల్ నెలలో 104 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. ఏప్రిల్లో ఏరియాకు 2.88 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 3లక్షల టన్నులతో 104 శాతం ఉత్పత్తి సాధించిందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తిని వందశాతం సాధించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 35లక్షల టన్నుల టార్గెట్ నిర్దేశించారని తెలిపారు. మొదటి నెల స్ఫూర్తిని చివరివరకు కొనసాగించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు. సమావేశంలో డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, ఇన్చార్జి ఎస్వోటూజీఎం టి.మధుసూదన్, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శ్రమశక్తి అవార్డుకు ఎంపిక
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా వాటర్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన కార్మిక నాయకుడు జక్కుల రాజేశం శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగే మేడే వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. 1986లో సింగరేణి సంస్థలో చేరిన రాజేశం సాజక్, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, టీబీజీకేఎస్ సంఘాల్లో క్రీయాశీలకంగా పని చేశారు. సికాస ఉద్యమం బలంగా ఉన్న సమయంలో వారితో కలిసి పోరాడి శ్రీరాంపూర్ ఏరియాలోని అరుణక్కనగర్, సుందరయ్యనగర్, తదితర సింగరేణి భూముల్లో కార్మికులకు గుడిసెలు వేయించారు. తాళ్లపల్లి ఎంపీటీసీగా, సర్పంచ్గా సేవలందించారు. అమరులైన కార్మికులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో శ్రీరాంపూర్ బస్టాండ్లో కార్మిక విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఎన్టీఆర్ విగ్రహం, బస్టాండ్ ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలో ఏర్పాటు చేసినవే. 2018లో రిటైర్డ్ అయినప్పటికీ ఇప్పటికీ కార్మికుల సమస్యలపై తన గళం విప్పుతూనే ఉన్నారు. కార్మికవర్గ పోరాటాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీరాంపూర్: ఐఎన్టీయూసీ కేంద్ర, బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. 1987లో సింగరేణిలో ఉద్యోగంలో చేరిన శంకర్రావు ప్రస్తుతం శ్రీరాంపూర్ సీహెచ్పీలో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఒకే సంఘంలో పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుండడమే కాకుండా అందరితో సన్నిహితంగా మెలుగుతారు. తనకు అవార్డు రావడం సంతోషకరంగా ఉందన్నారు. -
అనాథలకు అమ్మానాన్నగా..
ఉట్నూర్రూరల్: కాలం కాఠినంగా మారింది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన ఆ శిశువును కళ్లు తెరవకుండానే అనాథను చేసింది. ఉట్నూర్ మండలం రాంజీగోండ్కు చెందిన గిరిజన మహిళ ఆత్రం గంగుబాయి ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. నాలుగు నెలల క్రితం భర్త విఠల్కూడా మృతి చెందాడు. తాజాగా తల్లి మృతితో మూడేళ్ల బాలుడు, పుట్టిన శిశువు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించారు. గురువారం బాధిత నివాసానికి చేరుకుని చిన్నారుల నానమ్మను ఓదార్చారు. ‘మీరు అనాథలు కాదు, నా పిల్లలు’ అని మాటిచ్చి, పసి బాలుడిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆవిర్భావ్ నామకరణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భార్య దృపదతో కలిసి పసి బాలుడికి ‘ఆవిర్భావ్’ అని నామకరణం చేశారు. పెరిగి పెద్దయ్యే వరకు పోషణ, పాలు, ఖర్చులు తాను భరిస్తానని ప్రకటించారు. ప్రభుత్వం తరపున రూ.1,90,000 చెక్కు అందజేశారు. సొంత పిల్లల్లా భావించి బాధ్యతలు చేపట్టిన ఈ దంపతుల చర్య స్థానికుల్లో సంతోషాన్ని రేకెత్తించింది. ఆవిర్భావ్ జీవితంలో కొత్త వెలుగు పుట్టాలనే ఆశతో పేరు పెట్టారు. ఈ మానవత్వం సమాజానికి ప్రేరణగా నిలిచింది. -
‘గిరి’ విద్యార్థులకు అభినందన
ఆసిఫాబాద్రూరల్/కెరమెరి: పదో తరగతి ఫలితాల్లో జైనూర్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు సత్తాచాటారు. పి.లోకేశ్వరి జిల్లా టాపర్గా నిలవగా, అదే పాఠశాలకు చెందిన ఎం.ఆర్థిక రెండో స్థానం, ఎ.సంధ్యారాణి మూడో స్థానం దక్కించుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 13 ఆశ్రమోన్నత పాఠశాలల హెచ్ఎంలు, టాపర్లుగా నిలిచిన గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులను డీటీడీవో రమాదేవితో కలిసి కలెక్టర్ హరిత అభినందించారు. గిరిజన విద్యార్థులు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో పీవో మంద మకరందు అభినందించి శాలువాతో సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో జీసీడీవో శకుంతల, ఏసీఎం ఉద్దవ్, ఏటీడీవో శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, ఉపాధ్యాయులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’లో గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రతిభ
ఉట్నూర్రూరల్: ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్ష ఫలితాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. గురువారం పీవో చాంబర్లో మాట్లాడుతూ ఈ విజయానికి ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణమన్నారు. భవిష్యత్తులో కూడా ఆశ్రమ పాఠశాలలు ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అదుపుతప్పి ఆటో బోల్తానర్సాపూర్ (జి): మండలంలోని నసీరాబాద్ వద్ద గురువారం అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. దిలావర్పూర్ నుంచి కూలీలతో భైంసా వైపు వెళ్తున్న ఆటో నసీరాబాద్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓబేద్ అనే యువకుడికి గాయాలు కావడంతో 108 కు సమాచారం అందించారు. ఈఎంటీ ఆనంద్, పైలట్ సాయికిరణ్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
7న తుమ్మిడిహెట్టికి సీఎం..!
కౌటాల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 7న కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి రానున్నట్లు సమాచారం. తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రావిటీతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 100 టీఎంసీల నీటిని తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బరాజ్ ఎత్తు పెంపుపై మహారాష్ట్రను ఒప్పించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణపై సమీక్షించారు. ఈ నెల 7న తుమ్మిడిహెట్టిలో సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పర్యటించి ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్నారు. కాలువ నిర్మాణం, ప్రాజెక్టు పనులపై ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించనున్నారు. మహారాష్ట్రలో ఏ మేరకు ముంపు ఉంటుందో స్వయంగా పరిశీలించనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలెక్టర్ కె.హరిత తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది పరిసరాలను పరిశీలించనున్నారని సమాచారం. -
సమస్యలపై మౌనంగా ఉండొద్దు
కాగజ్నగర్టౌన్: సమస్యలు వస్తే మహిళలు మౌనంగా ఉండొద్దని, ధైర్యంగా ఎదుర్కొనాలని డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో కొనసాగుతున్న ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలపై డయల్ 100, 112 టోల్ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. షీటీమ్లు, భరోసా కేంద్రాలు మీ కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. ఒంటరిగా వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులకు లొకేషన్ షేర్ చేయాలని సూచించారు. అపరిచితులతో చాటింగ్, ఫొటోలు పంపించడం, ఓటీపీలు చెప్పడంతో చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ఎస్హెచ్వో ప్రేమ్కుమార్, ఎస్సై రాజు, ఎంఈవో ప్రభాకర్, షీటీమ్ ఇన్చార్జి సునీత, సిబ్బంది రమాదేవి, శ్రీనివాస్, సునీత పాల్గొన్నారు. -
● రాష్ట్రస్థాయిలో 28వ స్థానానికి జిల్లా ● గతేడాదితో పోల్చితే ‘పది’లో ఉత్తమ ఫలితాలు ● 6,932 మంది విద్యార్థులకు 6,527 మంది పాస్ ● మరోసారి సత్తా చాటిన బాలికలు
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు గతేడాదితో పోల్చితే మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్రస్థాయిలో గతేడాది జిల్లా 32వ స్థానంలో నిలవగా, బుధవారం వెలువడిన ఫలితాల్లో 28వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో మరోసారి బాలికలే బాలురపై పైచేయి సాధించారు. అంతే కాక పలు ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతతో సత్తా చాటాయి. 2025– 26 విద్యా సంవత్సరంలో ఇన్చార్జి డీఈవోగా అదనపు కలెక్టర్ దీపక్ తివారికి బాధ్యతలు అప్పగించడం కలిసి వచ్చింది. ఆయన పర్యవేక్షణలో విద్యాశాఖ గాడినపడింది. నిత్యం పాఠశాలలను తనిఖీ చేయడం, ఫలితాలపై దృష్టి సారించడం, ఎంఈవోలు, ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో మెరుగైన ఫలితాలు మెరుగయ్యాయి. 6,527 మంది పాస్ జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలలు ఉండగా 6,932 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. 3,213 బాలురు పరీక్షలు రాయగా 2,949 మంది (91.78 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 3,719 బాలికలకు 3,578 మంది(96.21) పా సయ్యారు. ఈసారి రాష్ట్ర విద్యాశాఖ సీబీఎస్ తరహాలో విద్యార్థులకు ప్రతీ పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజులు గడువు ఇచ్చింది. విద్యార్థులు చదువుకునేందుకు సమయం దొరికింది. విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ స్నాక్ అందించి నెల రోజులపాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దీంతో గత సంవత్సరంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 87 నుంచి 94.16 శాతానికి పెరిగింది. 54 స్కూళ్లలో వందశాతం ఫలితాలు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలల్లో 54 పాఠశాలు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇందులో ప్రభు త్వ పాఠశాలలు ఎనిమి ది ఉండగా, 13 ఆశ్రమాలు, ఏడు కేజీబీవీలతోపాటు 18 ప్రైవేట్ స్కూళ్లలో కూడా పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ పాసయ్యారు. జిల్లా కేంద్రంలో ఇలా.. సాత్విక(562)కీర్తన(561)క్రిషిత(556)దివ్య(549)సానియా(555)హారిక(525)సూర్యతేజ(532)సాహిల్(538)రిషిత(547)సీతారాం(540)కెరమెరి మండలం టాప్.. కెరమెరి: పదో తరగతి ఫలితాల్లో 99.11 ఉత్తీ ర్ణతతో కెరమెరి మండలం మొదటి స్థానంలో నిలవగా, తిర్యాణి 98.46 శాతం, సిర్పూర్(యు) 97.35, లింగాపూర్ 96.72, పెంచికల్పేట్ 96.25 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 85.82శాతంతో చింతలమానెపల్లి మండలం చివరి స్థానానికి పరిమితమైంది. కాగజ్నగర్(సిర్పూర్–టి) టీజీటీడబ్ల్యూఆర్జేసీకి చెందిన అక్షయ 587 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. కాగజ్నగర్ క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన వై.వైష్ణవి 557 మార్కులతో రెండో స్థానం, కాగజ్నగర్లోని కేరళ హైస్కూల్ విద్యార్థి ఎస్.సంతోష్(576) మార్కులతో మూడో స్థానంలో నిలిచాడు. అధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామని ప్రభుత్వ పరీక్షల సహాయాధికారి జనార్దన్గౌడ్ వెల్లడించారు. -
మట్టిలో ‘గిరి’ మాణిక్యాలు
కెరమెరి: పదో తరగతి ఫలితాల్లో మరోసారి గిరిజన విద్యార్థులు సత్తా చాటారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రంలోని ఐటీడీఏల్లో ఉ ట్నూర్ ఐటీడీఏ ఫలితాల్లో రెండోస్థానంలో నిలిచింది. జిల్లాలో 37 ఆశ్రమోన్నత పాఠశాలలు ఉన్నా యి. మొత్తం 1,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 1,276 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 531 మంది, బాలికలు 745 మంది పాసయ్యారు. గతేడాది 93.8 శాతం ఫలితాలు సాధించగా ఈసారి 98 శాతం ఉత్తీర్ణతతో భేష్ అనిపించుకున్నారు. 13 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణ త సాధించడం విశేషం. రొంపెల్లి, పోచంలొద్ది, సల్గుపల్లి, కమ్మర్గాం, కేతిని, జైనూర్, మహాగాం, కోహినూర్(కే), పంగిడిమాదర, కంచన్పల్లి, రాజీ గూడ సోమ్ని, అనార్పల్లి వందశాతం ఫలితాలు సాధించాయి. మిగిలిన 24 ఆశ్రమాలు కూడా 90 శాతానికి పైగా ఉత్తీర్ణతతో సత్తా చాటాయి. లోకేశ్వరి 542 మార్కులతో ఉత్తమ ప్రతిభ చూపింది ప్రత్యేక ప్రణాళికతో ఫలితాలు ఐటీడీఏ అధికారులు అమలు చేసిన ప్రత్యేక ప్రణాళి కలు ఫలితాలు ఇచ్చాయి. వందశాతం యాక్షన్ ప్లాన్ అమలు చేయడంతోపాటు వెనుకబడిన వి ద్యార్థులను దత్తత తీసుకుని ఉదయం 5 నుంచి 7 వరకు, సాయంత్రం 7 నుంచి 10 వరకు ప్రత్యేక త రగతులు నిర్వహించారు. రెండుసార్లు గ్రాండ్ టెస్టులు, ఒక్కో సబ్జెక్టుకు 30 స్లిప్ టెస్టులు నిర్వహించా రు. సీ, డీ గ్రేడ్లో ఉన్న విద్యార్థులను గుర్తించి శ్రద్ధ చూపడంతో ఉత్తమ మార్కులు సాధించగలిగారు. -
మేడే జయప్రదం చేయండి
కాగజ్నగర్టౌన్: మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో బుధవారం మేడే పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు అమలు చేయడం సరికాదని హితవు పలికా రు. ఈఎస్ఐ, పీఎఫ్ ఈఎస్ఐ, గ్రాట్యూటీ, బోనస్ చట్టాలపై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్ధార్థ, సాయి, బురాణ్, ఇమ్రాన్, మీనాక్షి, శారద పాల్గొన్నారు. -
మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం
ఆసిఫాబాద్: మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి జిల్లా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు చేసే వారిని గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయాలన్నారు. విద్యాసంస్థల సమీపంలోని టేలాలు, పాన్షాపులు, కిరాణ దుకాణాలపై నిఘా పెట్టాలని సూచించారు. విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్లు, బస్డ్రైవర్లు, కూలీలకు గంజాయితో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ షాపుల్లో అధిక మోతాదు మందుల విక్రయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతిఒక్కరూ ఆధార్ కలిగి ఉండాలి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రతిఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, యూఐడీఏఐ స్టేట్ అసిస్టెంట్ మేనేజర్ నరేశ్తో కలిసి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 5 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలు 13,781 మంది ఆధార్ అప్డేట్ చేసుకోలేదని తెలిపారు. నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు బయోమెట్రిక్ హాజరు విధానం ఉంటుందని, ఆధార్ అప్డేట్ కాకపోతే సమస్య ఏర్పడుతుందన్నారు. పీవీటీజీ గ్రామాల్లో ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వందేళ్లు దాటిన వారి వివరాలు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. జిల్లాలో 87 ఆధార్ నమోదు కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ఈ– డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతం రాజ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య ఆసిఫాబాద్: జిల్లాలోని కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థాన సముదాయంలో గల కార్యాలయంలో బుధవారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికారి వి.సంకేత్ మిత్ర, కలెక్టర్ కె.హరిత, జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి, స్పెషల్ సబ్ జైలు సూపరింటెండెంట్ ప్రేమ్కుమార్తో కలిసి కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని అండర్ ట్రయల్ కేసులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కక్షిదారుల పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చార్జ్షీట్ వేసిన, వేయని కేసులకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. బెయిల్ మంజూరైన వెంటనే నిబంధనలు పాటిస్తూ సంబంధిత వ్యక్తులను విడుదల చేయాలన్నారు. కొనసాగుతున్న క్రీడాపోటీలురెబ్బెన: మేడే వేడుకలను పురస్కరించుకుని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఖైరిగూర ఓసీపీలో మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. బుధవారం టగ్ ఆఫ్ వార్, బాల్ ఇన్ బాస్కెట్, మ్యూజికల్ బాల్ వంటి క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి మాట్లాడుతూ 8 గంటల పనిదినం కోసం, కార్మికుల ఆత్మగౌరవం కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటమే మేడే అని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, అడిషనల్ మేనేజర్ విజయకుమార్ సాహో, వెల్ఫేర్ అధికారి రజిని కుమార్, ఏఐటీయూసీ నాయకులు శేషు, రాజేష్, కిరణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
కెరమెరి: రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని గోయగాం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ కృషితోనే మనకు నేడు రాజ్యాంగ హక్కులు లభించాయన్నారు. ఆయన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. మహనీయుడి విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ అనిల్, సర్పంచ్ ఆనంద్రావు, గ్రామ పటేల్ శంకర్, నాయకులు అశోక్, మునీర్ అహ్మద్, నగరారే తారు, తారక్ సండే ఆనంద్రావు, శంకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. -
తుక్కు.. ప్రమాదాల ముప్పు
కాగజ్నగర్టౌన్: జిల్లాలో స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు మున్సిపల్, పోలీస్, ఫైర్, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజల భద్రతతో చెలగాటం ఆడుతూ ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్, కౌటాల, దహెగాం మండల కేంద్రాల్లో 30 వరకు స్క్రాప్ దుకాణాలు ఉండగా, ఇందులో 90 శాతం దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ లేదు. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్.. ఇలా ఏదీ తీసుకోకుండా నివాస ప్రాంతాల మధ్య, పాఠశాలల పక్కన షాపులు నడుపుతున్నారు. కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి రిజిస్టర్లు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. నిబంధనలపై పట్టింపేది..? పట్టణాల్లో తుక్కు దుకాణాలు నిర్వహించేవారు మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. నివాస ప్రాంతాలకు 100 మీటర్ల దూరంలోనే వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషన్లు ఇసుక బకెట్లు, నీటి ట్యాంక్ తప్పనిసరిగా ఉండాలి. ఎవరి నుంచి ఏం కొన్నారో విధిగా నమోదు చేయాలి. రోడ్డుపై సామాన్లు వేయకుండా కంపౌండ్ లోపలే నిల్వ చేయాలి. కానీ కాగజ్నగర్ పట్టణంలో స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు రోడ్డు మొత్తం ఇనుప రేకులు, టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలతో నింపుతున్నారు. రాత్రిపూట లైటింగ్ కూడా ఉండదు. పోలీసుల తనిఖీలు లేకపోవడంతో దొంగతనం చేసిన బైక్లు, మంచినీటి పైపులు కేబుల్ వైర్లు, రైల్వే ఇనుము, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇనుప బోర్డులు, రాగి, కేబుల్ వైర్లు ఇక్కడ అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వచ్చి సామాన్లు అమ్ముతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం వేసవి కావడంతో పెట్రోల్ డబ్బాలు, ప్లాస్టిక్ థర్మాకోల్, కేబుళ్లు, వ్యర్థాలు చిన్న నిప్పు రవ్వకే మంటలు చెలరేగి భారీ ప్రమాదాలకు ముప్పు పొంచి ఉంది. దుకాణాలకు దగ్గరగా చుట్టూ ఇళ్లు ఉండటతో భారీ నష్టం తప్పదు. అయినా ఒక్క దుకాణంలో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు. నిబంధనలు పాటించని స్క్రాప్ దుకాణాలపై ఉక్కుపాదం మోపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చర్యలు తీసుకుంటాంనిబంధనలు పాటించని స్క్రాప్ దుకాణాలపై చర్యలు తీసుకుంటాం. యజమానులు ప్రజ లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. కాగజ్నగర్ పట్టణంలోని స్క్రాప్ దుకాణా లను తనిఖీ చేస్తాం. యజమానులు ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలి. – తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ఈ ఫొటోలో కనిపిస్తున్న స్క్రాప్ దుకాణం కాగజ్నగర్ పట్టణంలోనిది. రోడ్డుకు పక్కనే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడంతో ఆ దారి గుండా వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఈ దుకాణం పక్కనే ఆశ్రమ ఉన్నత పాఠశాల, బీసీ బాలుర వసతి గృహం, ఎస్సీ బాలుర వసతి గృహం, ఓ ప్రైవేటు పాఠశాలకూడా ఉన్నాయి. వ్యర్థాలను కాల్చినప్పుడు పొగ పాఠశాలల్లోకి వెళ్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
వేడి.. ఉక్కపోత
కౌటాల/దహెగాం: ఎండలకు జిల్లా అగ్నిగోళంలా మండుతోంది. గడిచిన మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నా యి. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉదయం 9 గంటల నుంచే ప్రజలు చెమటతో తడిసిపోతున్నారు. మంగళవారం కెరమెరిలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆసిఫాబాద్ 45.1, కుంచవెల్లి 44.8, సిర్పూర్(టి) 44.6, ధనోరా 44.2, వాంకిడిలో 44.0 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు ఎండల తీవ్రతతో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం దహెగాం మండల కేంద్రంలో నిర్వహించిన వారసంతలో డేరాలు వేసుకోవడంతోపాటు గొడుగు పట్టుకుని కూరగాయలు విక్రయించారు. -
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు
ఆసిఫాబాద్: వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేతిపంపులు, బోర్వెల్స్, పైప్లైన్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. మారుమూల గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. చేతిపంపులు ఎండిపోతే ప్రత్యామ్నాయంగా వ్యవసాయ బావులు, వ్యవసాయ పంపుసెట్లను గుర్తించి యజమానులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో దీపాలు పగటిపూట వెలగుకుండా ఆన్ ఆఫ్ స్విచ్బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ వందశాతం పూర్తయ్యేలా బీఎల్వోలకు సహకరించాలన్నారు. ఉపాధిహామీ పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రైతులు తమ వివరాలను నమోదు చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, మిషన్గీరథ ఈఈ సిద్దిక్, భగీరథ గ్రేడ్ ఈఈ రాకేశ్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్ పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనఆసిఫాబాద్రూరల్: రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ చూపిన జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కె.హరిత అభినందించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు భువనగిరిలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షూటింగ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు రవికుమార్, సోమశేఖర్, కోచ్లు రాకేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి
కెరమెరి: ద్విచక్ర వాహనం నడిపేవారితో పా టు వెనుక కూర్చొనే వ్యక్తులు సైతం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. మండలంలోని ఆగుర్వాడ గ్రామంలో మంగళవారం అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రోజా, గ్రామస్తుల సహకారంతో పోలీసుల ఆధ్వర్యంలో వంద హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడు తూ రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలు కాపాడుతుందని తెలిపారు. గ్రామస్తులతో రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ ఎస్సై మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
ఆసిఫాబాద్అర్బన్: పదోన్నతిపై జిల్లాకు వ చ్చిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించా రు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతి నిధుల సహకారంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టర్ కె.హరితను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించా రు. జిల్లా పౌరసంబంధాల అధికారి వై.సంపత్కుమార్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి(ఏవో) కిరణ్కుమార్ అదనపు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
బంకుల్లో నోస్టాక్
దహెగాం/రెబ్బెన: రాష్ట్రంలో ఇంధన కొరత వదంతులు వ్యాపిస్తుండగా.. జిల్లాలోని పలు పెట్రోల్ బంక్ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. దహెగాంలోని ఓ పెట్రోల్ బంకులో సుమారుగా వారం రోజుల నుంచి నోస్టాక్ బోర్డు పెట్టారు. మ రో బంకులో పెట్రోల్ ఉన్నా మిషనరీలు పనిచేయడం లేదు. వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్తుండగా, ప్రైవేట్ వ్యాపారులు లీటరు రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. రెబ్బెన మండలంలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా మంగళవారం పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదంటూ నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. గోలేటి విలేజ్లోని బంక్లో పెట్రోల్, డీజిల్, గోలేటి ఎక్స్రోడ్లోని బంకులో పెట్రోల్ అందుబా టులో లేదు. ఈ బంకులో బుధవారం మధ్యాహ్నం వరకు సరిపోయేంత స్టాక్ మాత్రమే ఉంది. నక్కలగూడ సమీపంలోని బంకు కొన్ని రోజులుగా మూసి ఉంటోంది. కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఉన్న బంకులోనూ స్టాక్ అంతంత మాత్రంగానే ఉంది. -
వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
ఆసిఫాబాద్: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం యాసంగి వరిధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ, సహకార, పౌరసరఫరాల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు సెర్ప్ ఆధ్వర్యంలో 14 కొనుగోలు కేంద్రాలు, సహకార శాఖ ఆధ్వర్యంలో 19 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్ రూ.2,389, సాధారణ రకానికి క్వింటాల్కు రూ.2,369 చెల్లిస్తారని, సన్నరకం ధాన్యం క్వింటాల్కు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. విశాలమైన ప్రదేశాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వెలుతురు, టార్పాలిన్ కవర్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం కోతలు మొదలైనందున రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని తెలిపారు. వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోళ్లు పూర్తిగా ఓపీఎంఎస్ విధానంలో ఉంటుందని, విక్రయించే పద్ధతిపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, జిల్లా సహకార శాఖ అధికారి బి.మనోహర్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజిత, కాగజ్నగర్ వ్యవసాయ శాఖ సంచాలకులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం
రెబ్బెన: సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి అన్నారు. 140వ మే డే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్షాప్, స్టోర్స్, ఎంవీటీసీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు పోటీల్లో ఉత్సా హంగా పాల్గొన్నారు. విజేతలకు వర్క్షాప్ డీజీఎం జ్ఞానేశ్వర్, ఇంజినీర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఆర్గనైజింగ్ కార్యదర్శి శేషశయనరావు, కిరణ్, మారం శ్రీనివాస్, కోశాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..!
ఆసిఫాబాద్అర్బన్: 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేసవి సెలవులు ముగిసి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బడి తలుపులు తెరిచిన తొలిరోజే విద్యార్థుల చేతులకు కొత్త పుస్తకాలు అందించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గతంలో ఎదురైన జాప్యాన్ని నివారించి, సకాలంలో విద్యార్థులకు అభ్యసన సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు విడతలవారీగా జిల్లా కేంద్రంలోని డిపోకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే 2,82,435 టెక్ట్స్ బుక్స్ అందుబాటులోకి వచ్చాయి. వేసవిలోనే సరఫరాజూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు అందించనున్నారు. ప్రతీ విద్యార్థికి సకాలంలో పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్తిస్థాయిలో సరఫరా చేయనున్నారు. జిల్లాకు వందశాతం పాఠ్యపుస్తకాలు తెప్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలో ఇలా..జిల్లావ్యాప్తంగా 15 మండలాల పరిధిలోని 103 ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 106, ప్రాథమిక పాఠశాలలు 833 పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 62,315 మంది విద్యార్థులు చదువుతుండగా, 3.39లక్షల పుస్తకాలు అవసరం ఉంటాయని గుర్తించారు. ఇప్పటికే పార్ట్–1కు సంబంధించి 2,82,435 పుస్తకాలు జిల్లా కేంద్రంలోని డిపోకు చేరుకున్నాయి. మిగితావి మరో పదిరోజుల్లో చేరుకోనున్నాయి. జిల్లా డిపో నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలించనున్నారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పాఠశాలలకు సరఫరా చేస్తారు. పార్ట్– 2కు సంబంధించి 2,95,380 పాఠ్య పుస్తకాలు వస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నాటికి జిల్లాకు అవసరమైన పూర్తిస్థాయి పుస్తకాలు వస్తాయని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను కూడా ప్రభుత్వం అందిస్తోంది. ప్రతీ సబ్జెక్టుకు ఒక నోట్ పుస్తకం చొప్పున అన్ని సబ్జెక్టులకు అందించనున్నారు. వీటిని కార్గోల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నేరుగా ఆయా పాఠశాలలకు పంపించనున్నారు. ప్రారంభం రోజే పంపిణీకి ఏర్పాట్లు 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభు త్వ పాఠశాలల విద్యార్థుల కు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల్లో 82 శాతం ఇప్పటికే జిల్లా కేంద్రంలోని గోదాంకు చేరుకున్నా యి. మిగతావి సైతం పది రోజుల్లో రానున్నాయి. వచ్చిన పుస్తకాలను భద్రపరుస్తున్నాం. విద్యార్థుల కు ఇబ్బంది కలగకుండా పాఠ్య పుస్తకాలను ముందస్తుగానే సరఫరా చేస్తోంది. జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి ఎమ్మార్సీలకు పంపిస్తాం. స్కూళ్ల ప్రారంభం రోజే పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. – రాథోడ్ ప్రకాశ్, పుస్తకాల డిపో మేనేజర్ జిల్లా వివరాలు -
వి‘నూతనం’గా సందేశం
కౌటాల: ‘మీరు గెలిచేది రూపాయి.. ఓడిపోయేది మాత్రం మీ ప్రాణం.. గెలిచే ప్రతీ రూపాయి కంటే మీ ప్రాణం వెలకట్టలేనిది.. పందెంతో ప్రాణాలు పణంగా పెట్టకండి. మీరు కూడా బెట్టింగ్ భూతాని కి బలి కావొద్దు..’ అంటూ యువతకు సందేశం ఇస్తూ కౌటాల ఎస్సై డి.చంద్రశేఖర్ ఇటీవల చేసిన వీడియో రీల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 18న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘పల్లెల్లో బెట్టింగ్ భూతం’ కథనానికి ఆయన స్పందించారు. బెట్టింగ్ నష్టాలపై యువతకు అవగాహ న కల్పించడానికి స్థానిక ‘ఫేమస్ కురాళ్లు’ యూ ట్యూబర్లతో కలిసి సందేశంతో కూడిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఐపీఎల్ నేపథ్యంలో యువత బెట్టింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్తో కలిగే నష్టాలపై తీసిన వీడియో సైతం వైరల్గా మారింది. ఎస్సై చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్లతో పాటు ఫేస్బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ రీల్స్లో పోస్టు చేస్తున్నారు. యువతకు అవగాహన కల్పించాలనే.. బెట్టింగ్ నష్టాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని తరుచూ వార్తా పత్రికల్లో చూస్తున్నాం. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే యువతకు బెట్టింగ్ నష్టాలపై అవగాహన కల్పించాలని స్థానిక యూట్యూబర్లతో కలిసి సందేశంతో కూడిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాం. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలి. – డి.చంద్రశేఖర్, కౌటాల ఎస్సై -
వినతులిచ్చి.. గోడు చెప్పుకుని
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి(ఏవో) కిరణ్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ఒంటరి మహిళ పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలం ఇందానికి చెందిన బొర్కుటె భారతి దరఖాస్తు చేసుకుంది. వితంతు పింఛన్ మంజూరు చేయాలని కాగజ్నగర్ పట్టణం నౌగాం బస్తీకి చెందిన ఇమాంబీ విన్నవించింది. పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని ఇతరులు ఆక్రమించి సాగు చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటకు చెందిన కుమ్రం నిర్మల దరఖాస్తు చేసుకుంది. తన పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతుబంధు ఇప్పించాలని ఆసిఫాబాద్కు చెందిన వైరాగడే లక్ష్మి దరఖాస్తు చేసుకుంది. తిర్యాణి మండలం దుగ్గాపూర్కు చెందిన రంగు కిరణ్ భూమి కొలతలు చేయాలని అధికారులను కోరాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన పుస్తం పూజిత, ఆసిఫాబాద్ మండలం వావ్దమ్కు చెందిన మడావి రాంబాయి వేర్వేరుగా అర్జీలు అందించారు. సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని కాగజ్నగర్ మండలం ఈజ్గాంకు చెందిన పరంజిత్ దరఖాస్తు చేసుకుంది. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు జిల్లా విద్యార్థినులు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ తెలి పారు. క్రీడాకారులను సోమవారం కోచ్ అరవింద్తో కలిసి జిల్లా కేంద్రంలో సోమవారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన నందిని, కవిత ప్రతిభ చూపారన్నా రు. ఈ నెల 28 నుంచి 30 వరకు హన్మకొండలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటా రని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్ ఉన్నారు. -
బుద్ధ జయంతిని సెలవుగా ప్రకటించాలి
ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ జయంతి ని సెలవు దినంగా ప్రకటించాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోర్కర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని లుంబినీ దీక్షభూమి వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సంఘా ల నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో అనేక మంది సంస్కర్తల జయంతి, పండుగలకు సెలవు ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం ఈ నెల 29న కెరమెరి మండలం గోయగాంలో నిర్వహించే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరు కావాలని ఎస్పీ నితిక పంత్కు ఆహ్వానపత్రం అందించారు. లుసియానా అమెరికన్ యూనివర్సిటీ పూణే నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆయను ఉపాధ్యాయ, కుల సంఘాల ఆధ్వర్యంలో శాలు వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సెంటర్ కమిటీ అధ్యక్షుడు మసాదే ప్రశాంత్, నాయకులు తుకారాం, సంతోష్, రాజు, తారు, దత్తు, శంకర్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్టౌన్/ఆసిఫాబాద్: ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీని వాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలు అధికారులను ఆదేశించారు. హిమాయత్నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్ర జాప్రతినిధులు, జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీ క అని అన్నారు. నిర్మాణ ప్రక్రియలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని, అధికారుల వద్ద ఫైల్ వారం రోజులకు మించి ఉండవద్దని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే అధికారులను డిప్యూటేషన్పై తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతీ దశలో పనుల ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థోమతలేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశ ల వారీగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూ రయ్యే నిధుల ద్వారా రుణం తీర్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎంపీలు నగేశ్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, రామారావు పటే ల్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీష్బాబు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్, ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షిషా, హరిత, భవేష్ మిశ్రా, కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ సివిల్ జడ్జిగా సంకేత్ మిశ్రా
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జిగా సంకేత్ మిశ్రా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివర కు ఇక్కడ పనిచేసిన సీనియర్ సివిల్ జడ్జి యువరాజ బదిలీ అయ్యారు. సంకేత్ మిశ్రా కు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడు తూ పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని సూచించారు. కా ర్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగిరి సతీశ్బాబు, న్యాయవాదులు తాటిపెల్లి సురే శ్, ముక్త సురేశ్, డి.వెంకటేశ్వర్లు, జగన్మోహన్రావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7ప్రాణాలకు లేదు రక్షణ..! వాంకిడి మండలంలో కొనసాగుతున్న విద్యుత్ మరమ్మతులు, కొత్తలైన్ పనుల్లో భద్రత పాటించడం లేదు. చిన్న తప్పిదంతో కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. అర్ధరాత్రి వరకు వేడి ప్రభావం ఉంటుంది. ఆర్కేపీలో క్రీడా సందడి అస్మిత ఖేలో ఇండియా అండర్–16 బాలిక ల ఫుట్బాల్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎనిమిది జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. 8లోu మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 -
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) 26వ ఆవిర్బావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయుడు కోవ సాయినాథ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం తె లంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. రెండున్నర దశాబ్దాల్లో పార్టీ సాధించిన విజయాలు, రాష్ట్ర సాధన, అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్రను స్మ రించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అ ధ్యక్షుడు రవీందర్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకా శ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, నాయకులు మర్సుకో ల సరస్వతి, అలీబిన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, బాలకృష్ణ, రాజంపేట సర్పంచ్ బుర్స పో చయ్య, ఉప సర్పంచ్ లక్ష్మి పాల్గొన్నారు. -
ఓసీపీలో భగభగ!
రెబ్బెన: ఎండలకు సింగరేణి బొగ్గు గనులు భగభగ మండుతున్నాయి. ఎండలు, వడగాల్పుల నడుమ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 9 నుంచి భానుడు ప్రతాపం చూపుతుండగా.. సాధారణ ప్రాంతాల్లో పనిచేయడమే కష్టతరంగా మారింది. అలాంటి సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన ప్రదేశాల్లో మరింత ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక ఓపెన్కాస్ట్ల్లో కార్మికుల పరిస్థితి ప్రాణసంకటంగా మారుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండుటెండల్లో పనిచేసే కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు వడదెబ్బకు గురికాకుండా యాజమాన్యం ఉపశమన చర్యలు చేపడుతోంది. చల్లనీ నీటి సౌకర్యంతోపాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తోంది. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మాత్రమే ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి సాగుతోంది. పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు సుమారు 600 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. రక్షణగా చలువ పందిళ్లుభూగర్భ గనులతో పోల్చితే ఎండాకాలం ఓసీపీల్లో విధుల నిర్వహణ కార్మికులకు కష్టతరంగా ఉంటుంది. ప్రధానంగా క్వారీ లోపల, డంపింగ్ యార్డులు ఇతర ప్రాంతాల్లో నిలువ నీడ కూడా అందుబాటులో ఉండదు. కార్మికులకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రతీ వేసవిలో సంస్థ చలువ పందిళ్లు ఏ ర్పాటు చేస్తుంది. ఈసారి సుమారు 20 వరకు చలు వ పందిళ్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా క్వారీ లోపలి భాగంలోని పంప్ స్టేషన్, ట్రిప్మెన్, కోల్యార్డుల వద్ద వీటిని ఏర్పాటు చేయగా.. ఉపరితలంలో కాఫర్బండ్, డంప్యార్డుల వద్ద ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా కర్రలతో పందిరిని ఏర్పాటు చేసి పైకప్పును తుంగ, ఇతర చల్లని నీడను ఇచ్చే వాటితో కప్పి ఉంచుతారు. కార్మికులు వేడిగాలులకు డీహైడ్రేషన్కు గురికాకుండా రంజన్లలో నీటిని అందుబాటులో ఉంచుతున్నారు. పనివేళల్లో మార్పు ఎప్పుడో..?ఓసీపీల్లో వేసవిలో పగలు విధుల నిర్వహణ కార్మికులకు నిప్పుల కుంపటిలో పనిచేయడంతో సమానంగా ఉంటుంది. దీంతో యాజమాన్యం అనేక ఉపశమన చర్యలు చేపట్టినా కొన్ని సందర్భాల్లో కార్మికులు అనారోగ్యానికి గురవుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం ఎండల తీవ్రత తీవ్రరూపం దాల్చిన సమయంలో పనివేలు మార్చుతుంది. మొదటి షిప్టు సమయాన్ని ఒక గంట ముందుకు జరిపి, రెండోషిప్టును ఒక గంట ఆలస్యంగా ప్రారంభించేవారు. మధ్యాహ్నం కార్మికులకు కాస్త ఊరట లభించేది. అయితే ఈ ఏడాది మే ప్రారంభం కంటే ముందే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడే సుమారు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అవుతున్నాయి. మేలో 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం ఓసీపీల్లో పనివేళల మార్పుపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది.రెండు షిఫ్టుల్లో మజ్జిగ.. ఖైరిగూర ఓసీపీలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను మించి నమోదు అవుతుండటంతో కార్మికులు అల్లాడిపోతున్నారు. క్వారీ లోపల ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. బొగ్గు పొరల నుంచి వెలువడే వేడి, ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతతో అనారోగ్యం, వడదెబ్బకు గురికాకుండా యాజమాన్యం ప్రతిరోజూ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతోంది. మొదటి, రెండో షిప్టుల్లో రోజుకు సుమారు 400 మందికి పైగా మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. -
మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు
రెబ్బెన: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకుని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోలేటి సీహెచ్పీలో మహిళా ఉద్యోగులకు పలు క్రీడాపోటీలు నిర్వహించారు. గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు క్రీడానైపుణ్యం చాటుకోవడం అభినందనీయమన్నారు. కార్మిక రంగంలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు సీహెచ్పీ హెచ్వోడీ కోట య్య బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, పిట్ కార్యదర్శి రామయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేషు, కిరణ్, శ్రీనివాస్, షమీ, సురేష్కోరి, కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
2 వరకు అవగాహన కార్యక్రమాలు
ఆసిఫాబాద్అర్బన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ నెల 27 నుంచి మే 2 వరకు ఆరురోజులపాటు అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో భరోసా కేంద్రం, షీటీం సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. షీటీం, భరోసా కేంద్రం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు సంయుక్తంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపా రు. ముఖ్యంగా పిల్లలు, మహిళల రక్షణ, భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాల నివారణ, లింగ సమానత్వం, బాల్య వివాహాల నివారణ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్ అవగాహన, యాంటీ ర్యా గింగ్ వంటి అంశాల గురించి గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలు, ప్రజలు గుమిగూడే ప్రదేశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పనిప్రదేశాల వద్ద మహిళలపై అకృత్యాల గురించి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, భరోసా కేంద్రం సబ్ ఇన్స్పెక్టర్ దివ్య, షీటీం ఎస్సై బిక్కులాల్ పాల్గొన్నారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలిప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం వివిధ మండలాలకు చెందిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 16 ఫిర్యాదులు స్వీకరించగా, పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. -
‘నాటు’.. ఆరోగ్యానికి చేటు
పెంచికల్పేట్ మండలం దరోగపల్లికి చెందిన కర్నె పెంటయ్య వారం రోజులపాటు గ్రామంలో దొరికే నాటుసారా తాగాడు. అస్వస్థతకు గురై ఈ నెల 21న గ్రామంలోనే మరణించాడు. ఇంటిపెద్ద గుడుంబా తాగి మరణించడంతో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. పెంచికల్పేట్: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలు, పల్లెల్లో గుడుంబా గుప్పుమంటోంది. తయారీదారులు ప్రత్యేకంగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాలను ఎంచుకుని నాటుసారా తయారీ చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో గ్రామాల్లోని దుకాణాల కు తరలించి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎకై ్సజ్, పోలీసుశాఖల అధికారులు దాడులు చే స్తున్నారు. బెల్లం పానకం, సారా స్వాధీనం చేసుకు ని కేసులు నమోదు చేస్తున్నా వారి తీరుమాత్రం మారడం లేదు. నాలుగు రోజుల క్రితం పెంచికల్పే ట్ మండలం దరోగపల్లికి చెందిన కర్నె పెంటయ్య గుడుంబా తాగి తీవ్ర అస్వస్థతతో మృతి చెందడం పల్లెల్లో గుడుంబా తీవ్రతకు అద్దం పడుతోంది. గుట్టుగా రవాణాగ్రామీణ మండల కేంద్రాల నుంచి నిత్యం బొలెరో వాహనాలు పట్టణ ప్రాంతాలకు వాణిజ్యపరంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు పట్టణాల నుంచి గుట్టుచప్పుడు కా కుండా నాటుసారా తయారీకి వినియోగించే నల్ల బెల్లం, చక్కెర, పటిక, యూరియాను పెద్దఎత్తున తరలిస్తున్నారు. అక్కడి నుంచి మారుమూల ప్రాంతాల్లో గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నారు. బెల్లం అమ్మకాలపై నిఘా పెరగడంతో వ్యాపారులు చక్కెర దిగుమతిపై దృష్టి సారించారు. దుకాణాలే అడ్డాలుహానికరమైన పదార్థాలతో తయారు చేస్తున్న గు డుంబాను ప్యాకెట్ల రూపంలో కిరాణ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ వేలాది లీటర్ల విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. బెల్టుషాపులు, కొన్ని కిరాణ దుకాణాలు విక్రయాలకు అడ్డాగా మారాయి. నాటుసారాను వృత్తిగా మార్చుకున్న కొంత మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అమ్మోనియా, యూరియా వంటి రసాయనాలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. వేసవిలో ఎండలకు గుడుంబా తాగితే శరీరం డీహైడ్రేషన్కు గురై తీవ్ర అస్వస్థత, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా కొందరు పరిస్థితి చేయిదాటి ప్రాణాలు కోల్పోతుండగా, పదుల సంఖ్యలో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో పేదలు ఆస్పత్రి ఖర్చులకు ఆర్థికంగా చితికిపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు అడపాదడపా దాడులను చేస్తున్నా తయారీ, విక్రయాల జోరుకు బ్రేకులు పడటం లేదు. అధికారులు ఇప్పటికై నా స్పందించి విచ్చలవిడిగా వెలిసిన నాటుసారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఆటోలో తరలిస్తున్న గుడుంబాను పట్టుకున్న పోలీసులుకేసులు 196 నేరస్తులు 174 బైండోవర్ చేసిన వ్యక్తులు 63 పట్టుకున్న నాటుసారా 775లీటర్లు బెల్లం 950 కిలోలు పటిక 335 కిలోలు బెల్లం పానకం 3500 లీటర్లు సీజ్ చేసిన వాహనాలు 19 -
సంతకు స్థలమేది..?
ప్రైవేట్ స్థలంలో పశువులు కౌటాల: జిల్లాలోనే అతిపెద్ద సంత అయిన కౌటాల పశువుల సంతకు సొంత స్థలం లేకుండా పోయింది. ఏటా రూ.లక్షల ఆదాయం సమకూరుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం సొంత స్థలం కేటాయించకపోవడంతో అటవీ ప్రాంతంలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతీ సోమవారం నిర్వహించే కౌటాల పశువుల సంతకు కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, సిర్పూర్(టి) మండలాలతోపాటు మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వందలాది మంది రైతులు వస్తారు. వందల సంఖ్యలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతాయి. గతంలో పశువుల సంతను స్థానిక బీరన్న ఆలయ ఆవరణలో నిర్వహించగా.. ఆలయ కమిటీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం స్థానిక మినీ స్టేడియం సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అయినా అటవీశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు లేక పశువులు మృతి చెందుతుండగా.. అక్కడే అటవీ ప్రాంతంలోనే కళేబరాలను పడేస్తున్నారు. సమీప ప్రాంతాలు దుర్గంధంగా మారుతున్నాయి. స్థలం కేటాయించాలి కౌటాల పశువుల సంతలో రోజు వందల పశువులను రైతులు క్రయవిక్రయాలకు తీసుకొస్తారు. ప శువులకు తాగునీరు, పశుగ్రాసం అందించాలి. ముందుగా పశువుల సంతకు సొంత స్థలం కేటాయించాలి. – సురేశ్, కన్నెపల్లి తాగునీటికి కటకట ఇటీవల నిర్వహించిన సంత వేలం ద్వారా గ్రామ పంచాయతీకి రూ.38 లక్షల ఆదాయం సమకూరింది. సొంత స్థలం లేకపోవడంతో వసతులు కల్పించడం ఇబ్బందిగా మారింది. తాగునీటి వసతి లేకపోవడంతో పశువుల యజమానులు పడరాని పాట్లు పడుతున్నాయి. కనీసం నీడ కూడా లేకపోవడంతో గంటల తరబడి ఎండలో ఉంచుతున్నారు. ఇక రైతులు మాత్రం ఇంటి నుంచి బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. కొంతమందికి కొనుగోలు చేయడం తప్పడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు స్పందించి సొంత స్థలం కేటాయించి సౌకర్యాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. -
స్వీయ గణనతో జనగణన వేగవంతం
ఆసిఫాబాద్అర్బన్: స్వీయ గణన ద్వారా జనగణన– 2027 కార్యక్రమం వేగవంతమవుతుందని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొదటి విడతలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన, రెండో విడతలో జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన, స్పష్టమైన జాబితా రూపొందిస్తామని, ఇందుకోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. స్వీయ గణనపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన పోర్టల్ https:// se.census.gov.in అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఐడీ అందించవచ్చని తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు ప్రతిరోజూ వివరాలు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రజలు వాస్తవ సమాచారం అందిస్తూ సహకరించాలని కోరారు. సమావేశంలో కార్యాలయ సిబ్బంది, మాస్టర్ ట్రైనర్లు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
ఆదిలాబాద్: నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం జిల్లా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 27 నుంచి నిజామాబాద్లో నిర్వహించనున్న పోటీల్లో జిల్లా బాలబాలికల జట్లు సత్తా చాటాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి అజయ్, కోశాధికారి గౌతమ్, హరిచరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు వికాస్, సాయిరామ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. -
● జాతీయ రహదారి వెంట కానరానిబస్ షెల్టర్లు ● ఎండలోనే ప్రయాణికుల నిరీక్షణ
బూర్గుడలో బస్సు కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు ఆసిఫాబాద్రూరల్: బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులకు నీడ కరువవుతుంది. నాలుగు వరుసల జాతీయ రహదారి– 363 వెంబడి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో బస్సులు వచ్చే వరకు ప్రయాణికులు ఎండలోనే వేచి చూస్తున్నారు. జాతీయ రహదారి –363 రెబ్బెన మండలం తక్కెలపల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని వాంకిడి మండలం గోయెగాం వరకు విస్తరించి ఉంది. ఈ రహదారిని అనుకుని సుమారు 21 వరకు బస్టాప్లు ఉన్నాయి. వీటిల్లో కేవలం మూడుచోట్ల మాత్రమే షెల్టర్లు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల బస్టాప్లు ఉన్నప్పటికీ నిల్వ నీడ లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. సమస్య ఇక్కడే.. రెబ్బెన మండలంలో తక్కెలపల్లి, పులికుంట, గోలేటి ఎక్స్రోడ్, దేవులగూడ, పుంజుమేరగూడ, నక్కలగూడ, ఇంద్రానగర్, కాగజ్నగర్ ఎక్స్రోడ్, ఎడవెల్లి, కొండపల్లి, కై రిగాం వద్ద షెల్టర్లు నిర్మించలేదు. అలాగే ఆసిఫాబాద్ మండలంలో బూర్గుడ రహపల్లి రోడ్డు, బూర్గుడ– 2, వాంకిడి మండలంలో ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు, సాలేగూడ, ఇప్పల నవేగాం, జైత్పూర్, ఇందానీ ఎక్స్రోడ్డు, బెండార, సామెలా, గణేష్పూర్, గోయగాం, బాంబార గ్రామాల్లోని బస్టాప్ల వద్ద షెల్టర్లు ఏర్పాటు చేయలేదు. ప్రయాణికులు వేసవిలో ఎండకు ఎండుతూ వర్షాకాలంలో వానకు నానుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి 50 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారి నిర్మించారు. గతంతో ఉన్న షెల్టర్లు తొలగించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు స్పందించి హైవే వెంబడి షెల్టర్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘మహిళా లోకానికి తీవ్ర అన్యాయం’
కాగజ్నగర్టౌన్: మహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, మిత్ర పక్షాలు మహిళా అన్యాయం చేశాయని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. మేడ్చల్ జిల్లా షోపూర్లోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. నారీ శక్తి వందన్ అథినియమ్ను అడ్డుకుని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిజస్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. మహిళా ద్రోహులుగా వారిని సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశా రు. పీఎం నరేంద్రమోడీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, నాయకులు సరిత, ఝాన్సీ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీశ్బాబు -
‘ముందస్తు’కు స్పందన
కాగజ్నగర్టౌన్: మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముందస్తు ట్యాక్స్ చెల్లింపు(ఎర్లీబర్డ్) పథకానికి కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. 2025– 2026 సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు లేని వారికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నెల 30వ తేదీలోపు పన్నులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ప్రకటించారు. దీంతో ఆసక్తిగల పన్నుదారులు కార్యాలయలు, మున్సిపల్ సిబ్బందికి చెల్లిస్తున్నారు. బిల్ కలెక్టర్లు సైతం వార్డుల వారీగా తిరుగుతూ అవగాహన కల్పిస్తూ వసూళ్లు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ బల్దియాలు ఉన్నాయి. కాగజ్నగర్ మున్సిపాలిటీలో భవన సముదాయాల ద్వారా ఏటా సుమారు రూ.5 కో ట్ల ఆస్తి పన్ను వస్తుంది. సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రభు త్వ పన్నుల బకాయిలు ఏడాది తర్వాత కాకుండా ముందుగానే వసూలు చేయాలనే లక్ష్యంతో ఎర్లీ బర్డ్ పథకం అమలు చేస్తుంది. ఈ ఏడాది కాగజ్నగర్లో 15,138 భవన సముదాయాలకు రూ.3.53 కోట్లు, ఆసిఫాబాద్ పట్టణంలో 6,433 భవన సముదాయాలకు రూ.2.57కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కాగజ్నగర్లో 7.65శాతం, ఆసిఫాబాద్లో 4.67 శాతం వసూళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉండడంతో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి కాగజ్నగర్ మున్సిపాలిటీలో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లింపుల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాత బకాయిలు లేకుండా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చు. ఈ అవకా శం ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. వార్డుల వారీగా అవగాహన కల్పిస్తున్నాం. పట్టణ ప్రజ లు ముందస్తుగా చెల్లించి రాయితీ పొందా లి. – తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ -
ఘనంగా వాసవీమాత జయంతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరీ జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించా రు. వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ ఆర్యవైశ్యులతో కలిసి వాసవీ మాత చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నా రు. ఆమె మాట్లాడుతూ వాసవీమాత చూపించిన సత్యమార్గంలో నడుస్తూ, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఆత్మాహుతి చేసి, ధైర్యం, త్యాగం పాఠాలు నేర్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రతినిధులు కొలిప్యాక వేణుగోపాల్, ఎకిరాల శ్రీనివాస్, చెట్ల ప్రశాంత్, కొలిప్యాక రవి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
‘లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’
మందమర్రిరూరల్: లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసఫ్ అన్నారు. ఆదివారం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పనిగంటలు 8 నుంచి 14 గంటలకు పెంచే ప్రయత్నాలు శ్రమ దోపిడీకి దారితీస్తాయన్నారు. మే డే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ సింగరేణి విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ మెడికల్ బోర్డులు, సొంతింటి పథకం, ఇన్కంటాక్స్ మాఫీ, తదితర సమస్యలను యాజమాన్యం పరిష్కరించని పక్షంలో జూన్లో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. నాయకులు రాజ్కుమార్, సలెంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు పనులకు భూమిపూజ
ఆసిఫాబాద్రూరల్: పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన రూ.3కోట్లతో పాత రౌట సంకెపల్లి గ్రా మంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుమురంభీం పుట్టిన ఊరికి రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు నిర్మా ణం పూర్తయితే గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు క ష్టాలు తీరనున్నాయని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. సర్పంచ్ పండు, గ్రామస్తులున్నారు. ఫూలే దంపతుల విగ్రహావిష్కరణవాంకిడి: మండలంలోని నార్లాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, సీ్త్రల అభున్నతికి ఎనలేని కృషి చేసిన సామాజిక ఉద్యమకారులు ఫూలే దంపతులు అని కొనియాడారు. అంతకుముందు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పూలాజీ బాబా సంస్థాన్ పట్నాపూర్ అధ్యక్షుడు ఇంగ్లె కేషవ్రావు, సర్పంచులు బాపూజీ, సతీశ్, నాయకులు అజయ్కుమార్, సెండె వాసు, మెంగాజీ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలి
లింగాపూర్: మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకుసాగాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా వసుధ ఫౌండేషన్ స్వ చ్ఛంద సేవా సంస్థ సహకారంతో జైనూర్ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపంలో ఆదివాసీ మహిళలకు ఏర్పాటు చేసిన ఉచి త కుట్టు శిక్షణను ఎస్పీ శనివారం ప్రారంభించారు. ఉచిత కుట్టు శిక్షణను మహిళలు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇ ది చక్కని అవకాశమన్నారు. ఆర్థికంగా స్వావలంబన సాధించి గుర్తింపు పొందాలని సూ చించారు. జైనూర్ సీఐ రమేశ్, ఎస్సైలు రవి కుమార్, విక్రమ్, గ్రామపంచాయతీ సర్పంచ్ కోడప ప్రకాశ్, 40మంది మహిళలున్నారు. -
విద్యార్థులకు వరం.. శిక్షణ శిబిరం
సిర్పూర్(టి): సాంఘిక సంక్షేమ బాలురు, బాలికల వసతిగృహాల్లోని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్ర భుత్వం వేసవిలో నెలపాటు వేసవి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 25నుంచి మే 25వరకు నిర్వహించనున్న శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు వివి ధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. వేసవి శిక్షణ శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చే యగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలురు, బాలికల వసతి గృహాల్లో చదివే పలువురు విద్యార్థులు వేసవి శిక్షణ కేంద్రాలకు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ కేంద్రానికి ఇత ర జిల్లాల నుంచి విద్యార్థులు రానున్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాలోని సిర్పూర్ (టి) సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం, బా బాసాగర్, వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్నగర్లోని బాలుర వసతి గృహాల విద్యార్థులు, సాంఘిక సంక్షే మ సమీకృత వసతిగృహం సిర్పూర్(టి), బాలికల వసతిగృహం ఆసిఫాబాద్ విద్యార్థినులు తమకు కే టాయించిన కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్లోని ప్రత్యేక శిక్షణ కేంద్రాలకు వెళ్లారు. గతంలో సాంఘిక సంక్షేమ గురుకులాలకే.. గతంలో రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ బాలురు, బాలికల గురుకులాల విద్యార్థులకే వేసవిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఈసారి సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకూ ప్ర త్యేకంగా అదే శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వా రు ఆసక్తి కనబరుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక నిపుణులతో.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నెలపాటు ఇచ్చే వేసవి శిక్షణకు వివిధ రంగాల్లోని ప్రత్యేక నిపుణులను నియమించారు. విద్యార్థులకు మెరుగైన బోధన, క్రీడల్లో నైపుణ్యాలు గుర్తించడం, క్రీడలపై ప్రత్యేక శిక్షణ, కంప్యూటర్ విద్య తదితర రంగాల్లో విద్యార్థులకు ప్ర త్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే, విద్యార్థులు ఉండేందుకు వ సతి ఏర్పాటు చేయగా నాణ్యమైన భోజనం, ప్రత్యేక మెనూ అమలుకు ఏర్పాట్లు చేశారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రెబ్బెన: స్ట్రక్చర్ కమిటీల ద్వారా యాజమాన్యం దృష్టికి వచ్చిన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి కోరా రు. శనివారం బెల్లంపల్లి ఏరియా పర్యటనలో భా గంగా ఖైరిగూర ఓసీపీకి వచ్చిన సింగరేణి డైరెక్టర్ (పీఅండ్పీ) వెంకటేశ్వర్రావుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. 2025 జూలై నుంచి జరిగిన మెడికల్ బోర్డులను సమీక్షించి దరఖాస్తు చే సుకున్నవారిని అన్ఫిట్ చేసి కారుణ్య నియామకా లు కల్పించి సహకరించాలని కోరారు. ఉద్యోగులందరికీ వెంటనే సొంతింటి పథకం అమలు చేయాలని, ఇందుకోసం వేసిన కమిటీలో యూనియన్ ప్ర తినిధులనూ సభ్యులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. సీఐఎల్, సింగరేణి ఎగ్జిక్యూటివ్ల తరహా లోనే సాధారణ కార్మికులకు పెర్క్స్పై ఆదాయపు పన్నును రీఫండ్ చేయాలని, ఖాళీగా ఉన్న క్లరికల్ స్టాఫ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇతర సమస్యలూ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేషశయనరావు, జూపాక రాజే శ్, కిరణ్బాబు, ఖైరిగూడ పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, యానియన్ నాయకులు ఆఫ్రిది, వెంకటేశ్, శ్రీనివాస్, రవి, రమేశ్, సుధీర్, రారాజు, కోటి, శ్రీనివాస్, రాంకిషన్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
క్రీడా క్యాంపులను వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: వేసవి క్రీడా క్యాంపులను సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిత సూచించా రు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీ డా పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరా న్ని డీటీడీవో రమాదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలకు మరింత పదు ను పెట్టేందుకు క్రీడా శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు ఉదయం, సా యంత్రం వేళల్లో క్రీడల్లో శిక్షణ తీసుకోవాలని సూ చించారు. హ్యాండ్బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్పై శిక్షణ ఇ స్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చే సుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. డీవైఎ స్వో ఆశ్వక్, డీఎస్వో షేకు, ఏసీఎంవో ఉద్ధవ్, జీసీడీవో శకుంతల, హెచ్ఎం సాయిబాబా, పీడీ తిరుప తి, కోచ్ అరవింద్, విద్యాసాగర్ తదితరులున్నారు. 11నుంచి తొలివిడత జనగణనఆసిఫాబాద్అర్బన్: మే 11నుంచి జిల్లాలో తొలివిడత జనగణన నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 26నుంచి మే 10వరకు స్వీయగణనకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,689 ఇళ్ల బ్లాక్లను గు ర్తించామని, 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. -
భవనాలు చూసి ఆశ్చర్యపోయాం
మేము మా పనులు తప్పితే ఊరు దాటి వెళ్లింది లేదు. మొదటిసారి హైదరాబాద్ వెళ్లొచ్చినం. ఉట్నూర్లో రెండంతస్తుల భవనాలు మించి కనబడవు. అక్కడ మాత్రం 50 అంతస్తుల భవనాలను బస్సులో వెళ్తూ చూశాం. నగరం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాం. – సోయం భీంరావు మంచి విడిది, భోజనాలుఈ పర్యటనలో మాకు చారిత్రక కట్టడమైన తా రాబందీ బారాదరీలో వసతి కల్పించారు. మంచి వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. మంత్రి జూపల్లి మాతో కలిసి భోజనం చేశారు. అ లాగే ఎమ్మెల్యే బొజ్జు కుటుంబ సభ్యులతో కలి సి మాలో ఒకడిగా వచ్చారు. – మేస్రం జాగు ఆదివాసీలకు అద్భుత అవకాశం ఆదివాసీలకు ఇదో అద్భుత అవకాశం. ప్రస్తుతం విడతల వారీగా ఆదిలాబాద్ జిల్లా నుంచి గిరిపుత్రులను హైదరాబాద్ నగర సందర్శనకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఖమ్మంలోని పీవీటీజీలు బాహ్య సమాజానికి దూరంగా జీవితాలను వెల్ల దీస్తున్నారు. అలాంటి వారిలో నగర సందర్శన కొత్త అనుభూతినిస్తుంది. వారి కుటుంబాలు సైతం అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంటుంది. – వెడ్మ బొజ్జుపటేల్, ఎమ్మెల్యే, ఖానాపూర్ -
కుమురం భీం
7ఇన్చార్జీల పాలనే దిక్కు చింతలమానెపల్లి మండలంలో ప్రభుత్వ కా ర్యాలయాలకు పక్కా భవనాలు లేవు. ఇన్చార్జి అధికారులతోనే నెట్టుకొస్తుండగా మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది. పాలి‘సెట్’ సాధించేలా.. పాలిసెట్లో మంచి ర్యాంక్ సాధించేలా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 -
స్మార్ట్గా స్వీయగణన
కెరమెరి/కాగజ్నగర్ టౌన్: జనగణన–2027లో భా గంగా నేటి నుంచి స్వీయ జనగణన ప్రక్రియ ప్రా రంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియకు భిన్నంగా ప్రభుత్వం ఈసారి జనగణన సర్వే నిర్వహిస్తోంది. గతంలో నేరుగా ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించేవారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం సాంకేతిక విధానాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలని భావించింది. ఇందుకు ఆదివారం నుంచి స్వీయ గణన ప్రక్రియ నిర్వహించేందుకు నిర్ణయించింది. దేశభవిష్యత్ను నిర్ణయించే అత్యంత కీలక జనగణన–2027 ప్రక్రియ జిల్లాలో చారి త్రాత్మకంగా అడుగు వేయబోతుంది. ఈసారి నిర్వహించనున్న జనగణన అంకెల సర్వే కాకుండా డిజి టల్ యజ్ఞంలా రూపొందించారు. జిల్లాలో ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా ని ర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో శనివారం ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి ప్ర త్యేక సమావేశాలు నిర్వహించి స్వీయ గణనపై అవగాహన కల్పించారు. వికసిత్ భారత్– 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రజలే స్వయంగా తమ వివరా లు నమోదు చేసుకునే స్వీయ నమోదు విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. స్వీయగణన నేటి నుంచి వచ్చే నెల 10వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి అవగాహన కోసం నేటి నుంచి గ్రామాల్లో చాటింపు చేయనున్నారు. అంగన్వాడీలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఉపాధి హామీ సిబ్బంది, ఇందిరా క్రాంతిపథం, మండల సమాఖ్య తదితర శాఖల అధికారులు ప్రజలకు డిజిటల్ సర్వేపై అవగాహన కల్పించనున్నారు. స్మార్ట్ఫోన్ ఉంటే చాలు..అధికారులు ఇంటి వరకు వచ్చే అవసరం లేకుండా మనకు మనమే స్వయంగా వివరాలు నమోదు చే సుకోవచ్చు. అధికారులు వచ్చేవరకు వేచి చూడాల్సి న అవసరమే లేదు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే కు టుంబ వివరాలు నమోదు చేయవచ్చు. ఈ విధానంతో సమాచార లోపాలు తలెత్తే అవకాశముండదు. సాధారణ గణనలో అధికారులు వచ్చినప్పు డు ఇంట్లో అందరూ అందుబాటులో లేకపోవడం లేదా సమాచార లోపం లాంటి సమస్యలు ఎదురయ్యేవి. సెల్ఫ్ ఎన్యుమరేషన్తో వీలును బట్టి తీరిక సమయంలో మనమే స్వయంగా వివరాలు నమో దు చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా తప్పులు దొ ర్లే అవకాశముండదు. ఒకవేళ ఏదైన పొరపాటు జరి గినా వెంటనే సరిదిద్దుకునే వెసులుబాటూ ఉంది. అధికారులు ఇంటికి సర్వే కోసం వచ్చినప్పుడు స్వీ య నమోదు ప్రక్రియ తర్వాత వచ్చే 11అంకెల ఐడీ ని చూపిస్తే సరిపోతుంది. యువత, విద్యావంతులు ఈ డిజిటల్ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలి. సంక్షేమ పథకాలకు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ డేటాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. జిల్లాలు, రాష్ట్రాలకు వనరుల పంపిణీలో పారదర్శకత కోసం నిధుల కేటాయింపు ఈ జనగణన ఆధారంగా తీసుకోనున్నట్లు తెలు స్తోంది. పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులు, ఇతర ప్రత్యేక నిర్మాణాల ప్రక్రియ అత్యంత కీలకం కానుంది. అయితే, తొలుత 26, 27 తేదీల్లో అధికా రులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్ ఇళ్లకు వెళ్లి జనగణన ప్రారంభించనున్నారు. ఎంపీడీవోలు, తహసీ ల్దార్లు, ఎంపీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకుని వారితో నమోదు చేయిస్తారు.ప్రత్యేక పోర్టల్ ద్వారా..డిజిటల్ స్వీయ సర్వే నిర్వహణకు కేంద్రం ప్రత్యేక పోర్టల్ను రూపొందించింది. ముందుగా https://se.census.gov.in వెబ్ సైట్ను మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా రిజి ష్ట్రేషన్ పూర్తి చేయాలి. గృహ గణన, కుటుంబ సభ్యుల సమాచారాన్ని 33 కాలమ్స్లలో పూరించి సబ్మిట్ చేయాలి. తర్వాత వచ్చే 11 అంకెల ప్రత్యేక ఐడీ (ఎస్ఈఐడీ)ని భద్రపర్చుకోవాలి. ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చినపుడు మీరు భద్రపరిచిన ఐడీ నంబర్ తెలియజేస్తే వారు పరిశీలన పూర్తి చేసినట్లు నిర్ధారిస్తారు. జనగణన చట్టం–1948 ప్రకా రం వ్యక్తిగతంగా మీరిచ్చే సమాచారాం అ త్యంత గోప్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిని ఏ ఇతర ఓటరు జాబి తా లేదా తనిఖీ కోసం వినియోగించే అవకాశముండదని స్పష్టం చేశారు. జిల్లాకు సంబంధించిన వివరాలు -
గంగుబాయి కుటుంబాన్ని ఆదుకుంటాం
కెరమెరి: జ్వరంతో మృతి చెందిన గంగుబాయి కుటుంబాన్ని ఆదుకుంటామని కలెక్టర్ కె.హరిత అ న్నారు. సిర్పూర్(యు) మండలంలోని మహగాం ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గంగుబాయి ఇటీవల మృతి చెందగా, శుక్రవారం గిరి జన సంక్షేమశాఖ డీడీ రమాదేవితో కలిసి విద్యార్థిని స్వగ్రామం బాజ్జిపేట్ను సందర్శించారు. గంగుబా యి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు జంగుబాయి, సోమ్రావును పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా హామీ ఇచ్చారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించా రు. తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే చేతిపంపు మంజూరు చేశారు. జీసీడీవో శకుంతల ఉన్నారు. జనగణన పకడ్బందీగా నిర్వహించాలిమేలో ప్రారంభమయ్యే జనగణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణలో మాట్లాడారు. ప్రతీ ఇంటికి వెళ్లి 32 అంశాలను సేకరించాలన్నారు. జిల్లాలో 994 మంది ఎన్యూమరేటర్లు, 174 మంది సూపర్వైజర్లు విధుల్లో ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు 1,689 ఇళ్ల జాబితా బ్లాక్లను గుర్తించా మని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బీర్శా తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనమే లక్ష్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, నమ్మకమైన, అ ధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్లో శుక్రవారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లాల వ్యవసాయ అధికారులు సురేఖ, విత్తన డీల ర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఎఫ్పీఓల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్వేష్రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని నాణ్యమైన విత్తనాల వినియోగం వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు వంటి పంటలు సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాల్లో విత్తనాల కొరత లేదని, సన్న, దొడ్డు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రెండు జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని, ఇందుకు 50 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని, కనీసం 20 వేల క్వింటాళ్లను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరాకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ(టెక్నికల్), సహకార అధికారులు, ఏడీఏలు, ఎంఏఓలు, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సింగరేణి ఆధ్వర్యంలోనూ శిక్షణ
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది విద్యార్థుల కోసం వేసవి క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ క్రీడల్లో శిక్షణ అందించనున్నారు. శిక్షణ కోసం గోలేటిలోని భీమన్న స్టేడియాన్ని ఎంపిక చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. శిక్షకులకు పారితోషకం అందించడంతోపాటు శిబిరాలకు హాజరయ్యే క్రీడాకారులకు స్నాక్స్ సైతం యాజమాన్యం సమకూర్చనుంది. ప్రస్తుతం శిక్షకుల ఎంపిక కోసం ఆసక్తి గల రాష్ట్ర, జాతీయ స్థాయి, సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. శిక్షకుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగానే కేంద్రాలు ప్రారంభించనున్నారు. శిబిరాల నిర్వహణ తేదీ ప్రస్తుతానికి నిర్ధారణ కాకపోయినా వచ్చే వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. 25 రోజులపాటు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇవ్వనున్నారు. విద్యార్థులకు క్రీడల్లో మెలకువలు నేర్పించేందుకు నియమించే శిక్షకులకు పారితోషకంగా రూ.3400 అందించనున్నారు. విద్యార్థులు ఒకపూట స్నాక్స్ సైతం యాజమాన్యం అందిస్తుంది. వేసవి సెలవులు వృథా చేసుకోకుండా తమకు నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించుకోవాలని సింగరేణి అధికారులు కోరారు. -
చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలి
రెబ్బెన: ఇందిరానగర్ గ్రామపంచాయతీలో హరితహారం మొక్కల నరికివేతపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మతో పాటు ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలను పచ్చదనంతో నింపేందుకు రూ.లక్షలు వెచ్చించి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారన్నారు. ఇందిరానగర్ ఆర్అండ్ఆర్ కాలనీలో ప్రధాన రహదారి వెంట ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపుల గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారాయన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండానే నిర్లక్ష్యంగా సుమారు 40కి పైగా చెట్లను మొదటికి నరికివేశారని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, పచ్చదనాన్ని అందించిన చెట్లు మోడుగా మారిపోయాయని తెలిపారు. చెట్లను నరికివేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం రెబ్బెన అటవీశాఖ రేంజ్ అధికారులు ఇందినగర్కు వెళ్లి నరికిన చెట్లను పరిశీలించారు. కార్యక్రమాల్లో గ్రామస్తులు గుండేటి స్వామి, రమేశ్, దుర్గం తిరుపతి, రావూజీ, సంతోష్, వసంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
మూడోరోజూ.. అదే తీరు
ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మూడోరోజూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిపో నుంచి పాక్షికంగా బస్సులు నడిచాయి. ఔట్సోర్సింగ్, ప్రైవేట్ డ్రైవర్లతో నాలుగు రూట్లలో 46 బస్సులు నడపగా, ఇందులో 20 ఆర్టీసీ సర్వీసులు, 26 ప్రైవేటు అద్దె బస్సులు ఉన్నాయి. కండక్టర్లు లేకపోవడంతో మహిళలు, పురుషులు అందరికీ ఉచిత ప్రయాణం కల్పించారు. ప్రయాణికుల రద్దీతో బ స్సులు కిక్కిరిసిపోయాయి. సమ్మెతో ఆసిఫాబాద్ డిపోకు సుమారు రూ.48 లక్షలు వాటిల్లింది. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్ను పోలీసులు తొలగించారు. ఎస్పీ నితిక పంత్ డిపో ను సందర్శించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడా రు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ప్రభుత్వం సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఎండలతో నీడ లేక ఇబ్బందవుతుందని, బస్టాండ్ సమీపంలో టెంట్ వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు ఎస్పీని కోరారు. శంకర్గౌడ్కు నివాళిఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్ప డిన వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌక్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మికులు ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు. కార్మికుడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. శంకర్గౌడ్ మరణమే చివరి మరణం కావాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, సంఘం జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశోక్, మంజుల, కవిత, ప్రవీణ్, లక్ష్మణ్, ఎజాజ్, దేవి, కుమార్, ఆర్పీ సింగ్, కార్మికులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల సంఘీభావంఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కొయ్యల హేమాజీ, జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, నాయకులు తిరుపతి, కేశవరెడ్డి, గోవర్ధన్, ఖాండ్రే విశాల్తో కలిసి బస్టాండ్ వద్ద కార్మికులను కలిసి మద్దతు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నే శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన హక్కుల కోసం కా ర్మికులు ధైర్యంగా పోరాడాలని, ఆత్మహత్యలకు పా ల్పడవద్దని సూచించారు. కార్మికులకు తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మికులతో మాట్లాడుతున్న ఎస్పీ నితిక పంత్ ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు, బీజేపీ నేతలు -
గ్రామీణ వ్యవస్థ పటిష్టమైతేనే పురోగతి
ఆసిఫాబాద్రూరల్: గ్రామీణ వ్యవస్థ పటిష్టమైతేనే పురోగతి సాధ్యమవుతుందని డీపీవో భిక్షపతిగౌడ్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్లో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పాటుపడాలన్నారు. ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో మౌనిక, సర్పంచ్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధితో ఉపాధి అవకాశాలు
ఆసిఫాబాద్అర్బన్: నైపుణ్యాభివృద్ధితో నిరుద్యోగులైన యువత ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ కె.హరిత అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. జీవితంలో స్థిరపడాలంటే యువత నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. తద్వారా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు, మంచి జీతాలు ఇస్తాయని తెలిపారు. బైక్ రిపేరింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, హౌజ్వైరింగ్, ప్లంబింగ్, శానిటరీ, కంప్యూటర్, ట్యాలీ, అకౌంటింగ్, కుట్టు మిషన్, ఆభరణాల త యారీ, బ్యూటీపార్లర్, మగ్గం పనులు, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పీఎం ఇంటర్న్షిప్ పథకం పోస్టర్ ఆవిష్కరించారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన మైనార్టీ గురుకుల విద్యార్థులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సంక్షేమ అధికారులు రమాదేవి, అశోక్, సురేశ్, నదీమ్, డీఆర్డీవో దత్తారావు పాల్గొన్నారు. -
సెపక్తక్రా రెఫరీగా కుమ్మరి మల్లేశ్
రెబ్బెన: జాతీయసా యి సెపక్తక్రా పోటీ ల రెఫరీగా రెబ్బెన మండలం గోలేటికి చెందిన సీనియర్ క్రీ డాకారుడు కుమ్మరి మల్లేశ్ ఎంపికైనట్లు సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొరివిలో ఈ నెల 28 వరకు జరిగే అండర్– 14 జాతీ య స్థాయి సెపక్తక్రా పోటీలకు మల్లేశ్ రెఫరీగా వ్యవహరించనున్నారు. గతంలో మల్లేశ్ రాష్ట్ర జట్టు కోచ్, మేనేజర్గా పనిచేశారు. 2008, 2009లో సెపక్తక్రా జాతీయ స్థాయి రెఫరీగా సేవలందించారు. ఆయనను అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, కార్యవర్గ సభ్యులు భాస్కర్, రామకృష్ణ, ఒలింపిక్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా సెపక్తక్రా ఉపాధ్యక్షుడు ఎస్.తిరుపతి తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. -
డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. ఉట్నూర్– ఆసిఫాబాద్ రహదారి పనులకు కాంట్రాక్టర్కు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, అసంపూర్తిగా ఉన్న కెరమెరి, లక్మాపూర్ వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. కెరమెరి మండలం కోట పరందోళి జంగుబాయి దేవస్థానం కమిటీకి 2024 సంవత్సరానికి సంబంధించి రూ.10లక్షల బకాయిలు విడుదల చేయాలన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సంతోష్కు వినతిపత్రం అందించారు. సమీప పీహెచ్సీల వైద్యులు వారానికి ఒకసారి పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. -
శంకర్గౌడ్ కుటుంబానికి రూ.2కోట్లు చెల్లించాలి
రెబ్బెన: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట్ డిపో డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం చెల్లించాలని మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులుగౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. చట్టబద్ధంగా సమ్మె నోటీసు ఇచ్చి కార్మికులు ఆందోళనకు దిగినా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ పరి స్థితి ఏర్పడిందన్నారు. శంకర్గౌడ్ది ఆత్మహ త్య కాదని, ప్రభుత్వ హత్యని మండిపడ్డారు. పరిహారం చెల్లించడంతోపాటు బాధిత కు టుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నీరజగౌడ్, జిల్లా అధ్యక్షుడు మనోహర్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి లావణ్యగౌడ్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
రెబ్బెన: మహబూబా బాద్ జిల్లా కొరివిలో జరగనున్న 69వ జాతీ య స్థాయి సెపక్తక్రా అండర్– 14 బాలుర పోటీలకు రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్ సింగరేణి ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి గంగాధరి శివచరణ్ ఎంపికైనట్లు సెపక్తక్రా అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమ్మరి మల్లేశ్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుఫున పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా క్రీడాకారుడిని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్రెడ్డి, జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజేషన్ కార్యదర్శి వెంకటేశ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి తదితరులు అభినందించారు. -
ఆటాడేద్దాం..!
జిల్లా కేంద్రంలో బాక్సింగ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు(ఫైల్)తిర్యాణి: విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత క్రీడాశిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. శనివారం నుంచి జూన్ 7 వరకు విద్యార్థులకు వివిధ క్రీడాంశాల్లో నిపుణులతో శిక్షణ అందించనున్నారు. జిల్లా యువజన క్రీడల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే శిక్షణ కేంద్రాల నిర్వహణకు అర్హుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరిస్తోంది. కోచ్లకు ప్రభుత్వం గౌరవ వేతనం అందించనుండగా, శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడాసామగ్రిని సైతం పంపిణీ చేయనుంది. జిల్లావ్యాప్తంగా పది శిబిరాలు ఏర్పాటు చేయనుండగా, అవసరానికి అనుగుణంగా వాటి సంఖ్య పెంచుతామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం శిక్షణసమ్మర్ క్యాంపుల్లో గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాలను మరింత పదును పెట్టడంపై అధికారులు దృష్టి సారించనున్నారు. జిల్లావ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్న నేపథ్యంలో ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు శిక్షణ కొనసాగనుంది. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, స్విమ్మింగ్, నెట్బాల్, బాక్సింగ్, సెపక్తక్రా, బాల్బ్యాడ్మింటన్ వంటి క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కేంద్రాల నిర్వాహకుల నుంచి వస్తున్న దరఖాస్తులు, ప్రాధాన్యత ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పది క్రీడాశిబిరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ మరో ఒకటి, రెండు పెంచుకునే సౌలభ్యం ఉంది. సీనియర్లతో సూచనలువేసవి క్రీడాశిక్షణ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాభివృద్ధి మరింత మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా శిక్షణ కేంద్రాలకు వెళ్లేవారికి అక్కడ సీనియన్లు నుంచి మెలకువలు నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. తద్వారా క్రీడారంగాల్లో రాణించి ఉన్నతస్థాయి పోటీల్లో పాల్గొనడం, అర్హత సాధించడంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేసవి సెలవుల్లో చిన్నారులు చెడు వ్యసనాలకు అలవాటు కావడం, సెల్ఫోన్ వినియోగంతో సమయం వృథా చేయడం కాకుండా వారి శారీరక, మానసికోల్లాసానికి దోహదపడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను సమీపంలోని క్రీడాశిబిరాలకు పంపించాలని అధికారులు సూచిస్తున్నారు. సమ్మర్ క్యాంప్కు వెళ్తా.. చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడటం చాలా ఇష్టం. కానీ ఆడించే వారు లేకపోవడంతో ఆటను పూర్తిగా నేర్చుకోలేపోతున్నా. సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తే వెళ్లి ఆటలో మెలకువలు నేర్చుకుంటా. ఎప్పటికై నా రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాలనేది నా కోరిక. – జుంగోని దీక్షిత్గౌడ్, విద్యార్థి, తిర్యాణి గ్రామీణ క్రీడలపై దృష్టి వేసవి క్రీడాశిక్షణ కేంద్రాల నిర్వహణలో భాగంగా ఈ ఏడాది గ్రామీణ క్రీడలపై దృష్టి సారించాం. కోచింగ్ ఇచ్చేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈ నెల 25 నుంచి జూన్ 7 వరకు జిల్లాలోని పది ప్రాంతాల్లో ఈ కేంద్రాలు నిర్వహిస్తాం. ఉదయం పూట రెండు గంటలు, తిరిగి సాయంత్రం రెండు గంటల పాటు శిక్షణ అందిస్తారు. – ఆశ్ఫక్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి -
కుమురం భీం
7జాతర చూసొద్దాం..! ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరకు లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి ముస్తాబైంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. 8లోu జొన్న.. ఆరోగ్యం మిన్న మార్కెట్లో జొన్న పంటకు మంచి డిమాండ్ ఉంది. దీంతో పత్తి సీజన్ ముగియగానే ఏజెన్సీ రైతులు భూమి చదునుచేసి జొన్న పంట వేస్తున్నారు. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం చల్లబడుతుంది. -
ట్రాఫిక్ పరేషాన్..!
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పార్కింగ్కు స్థలం లేకపోవడంతో వాహనదారులకు నిత్యం నరకం కనిపిస్తోంది. ప్రధాన రహదారులపై ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. పొట్టి శ్రీరాములు చౌరస్తా, అంబేడ్క ర్ చౌరస్తా, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో, హరిద్వార్ లాడ్జ్ మూలమలుపు వరకు ఉన్న ప్రధాన రహదారి రద్దీకి కేరాఫ్గా మారింది. ఆక్రమణలే కారణంపట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, రాజీవ్ గాంధీ చౌరాస్తా, ప్రధాన మార్కెట్ ఏరియాల్లో ఇరువైపులా దుకాణాల యజమానులు, చిరువ్యాపారులు దుకాణాల ఎదుట ఉన్న ఫుట్పాత్లను ఆక్రమించారు. వస్తువులను రోడ్డుపైకి పెడుతున్నారు. దీనికితోడు తోపుడు బండ్లు, చిరువ్యాపారులు రోడ్డుపైనే అమ్మకాలు సాగి స్తున్నారు. దీంతో వాహనాలు వెళ్లడానికి స్థ లం లేకుండా పోయింది. 30 అడుగుల రోడ్డులో 10 అడుగులు ఆక్రమణలకే సరిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ స్థలం ఎక్కడ..?పట్టణంలో ఎక్కడా పార్కింగ్ స్థలం లేకపోవడం ఇబ్బందిగా మారింది. వాహనదారులు రోడ్డు పక్కనే కార్లు, బైక్లు నిలుపుతున్నారు. దీంతో రోడ్డు మరింత ఇరుకుగా మారుతోంది. ఫుట్పాత్ ఆక్రమణలను వెంటనే తొలగించాలని, తోపుడు బండ్లకు ప్రత్యేక స్థలం కేటా యించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రెండోరోజూ ఆర్టీసీ సమ్మె
ఆసిఫాబాద్: డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండోరోజుకు చేరింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సుదూ ర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కట్లకు గురయ్యారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తల్లిదండ్రులు పిల్లలతో బస్టాండ్లలో నిరీక్షించాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక స్థోమత కలిగిన వా రు కార్లలో ప్రయాణించగా, పేదలు ఆటోలను ఆ శ్రయించారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనాల యజమానులు అధిక చార్జీలు వసూలు చేశారు. తాత్కాలిక సిబ్బందితో సర్వీసులుప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సులు నడిపించారు. వాంకిడి, మంచిర్యాల, కౌటాల, ఆదిలాబాద్ రూట్లతో సర్వీసులు రాకపోకలు సాగించాయి. 19 సంస్థ బస్సులు, 27 ప్రైవేటు బస్సులు నడిపినట్లు డీఎం రాజశేఖర్ వెల్లడించారు. అయితే పూర్తిస్థాయిలో కండక్టర్లు లభించలేదు. 46 బస్సులు రోడ్డెక్కితే ఇందులో కండక్టర్లు లేని 24 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. సమ్మె కారణంగా ఆసిఫాబాద్ డిపోకు రోజుకు రూ.16 లక్షల చొప్పున రెండు రోజులు నష్టం వాటిల్లింది. అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసనజేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మెలో ఉండడంతో ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి కరువైందన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2021–25 సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జాక్ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ మంజూల, కార్మికులు జ్యోతి, దివాకర్, నరేశ్, ప్రవీణ్, మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు. కాగజ్నగర్కు యథావిధిగా సర్వీసులుకాగజ్నగర్టౌన్: ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం మంచిర్యాల, ఆసిఫా బాద్ డిపోల నుంచి కాగజ్నగర్కు బస్సులు నడిపించారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో మంచి ర్యాల నుంచి కాగజ్నగర్, ఆసిఫాబాద్ నుంచి కా గజ్నగర్ పట్టణానికి బస్సులు రావడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. ము ఖ్యంగా కాగజ్నగర్ నుంచి మంచిర్యాలకు సర్వీ సులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఆసిఫాబాద్: నకిలీ విత్తనాల విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గు రువారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఏవో వెంకటి, డీఎస్పీ వహీదొద్దీన్తో కలిసి తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం దృష్ట్యా విత్తన సరఫరా, నిల్వలు, నాణ్యతపై ప్రత్యే క దృష్టి సారించాలని, దుకాణాలు, గోదాములను తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, లైసెన్స్లు రద్దు చేయాలని ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వాహనాలను తనిఖీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల గుర్తింపు, రసీదు స్వీకరణ ప్రాముఖ్యత గురించి వివరించాలని అన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కృషి చేయాలని, నూతన విధానం కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. జనగణనకు ప్రజలు సహకరించాలిజనగణనకు జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. జనగణన– 2027 కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు sc.census.gov .in ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని పేర్కొన్నారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు స్వీయ గణన ఐడీ అందించాలని సూచించారు. -
భగీరథ మహర్షి సేవలు చిరస్మరణీయం
ఆసిఫాబాద్అర్బన్: భగీరథ మహర్షి సేవలు భారతీయ సంస్కృతిలో చిరస్మరణీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్ డేవి డ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, ఇతర అధికారులతో కలిసి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం మాట్లాడుతూ తలపెట్టిన పనిని పూర్తి చేసేంతవరకు పట్టుదలతో ప్రయత్నించాలని సూచించారు. సమాజ అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేయడంలో భగీరథ స్ఫూర్తిదా యకమని పేర్కొన్నారు. అనంతరం రైతు నమోదు ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని రైతులు తమ వివరాలు న మోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి నదీమ్, గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఏవో వెంకటి, ఏడీఏ మనోహర్, ఉద్యానవన అధికారి నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ప్రమాదాల కలకలం
కాగజ్నగర్: ప్రస్తుత కాలంలో ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల వినియోగం అనివార్యమైంది. అయితే ఇ టీవల కాగజ్నగర్ పట్టణంలో చోటుచేసుకుంటున్న వరుస గ్యాస్ ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 21న పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో గల ఓ హోటల్లో సంభవించిన గ్యాస్ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. మల్లేశ్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, కరీంనగర్ ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్చిలో 20వ వార్డు(కరుణరోడ్డు) వద్ద ఓ ఇంట్లో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంతకు ముందు పెట్రోల్ పంపు ఏరియాలోని ఓ వసతి గృహంలోనూ సిలిండర్ లీకై ప్రమాదం తప్పింది. వసతి గృహంలోని కిచెన్ సామగ్రి కాలిపోయింది. ఒకే ఏజెన్సీ సిలిండర్లు..!కాగజ్నగర్లో చోటు చేసుకుంటున్న అన్ని ప్రమాదాల్లో ఒకే ఏజెన్సీకి చెందిన గ్యాస్ సిలిండర్లు ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. మూడు ప్రమాదాల్లో బాధితులు ఒకే ఏజెన్సీకి చెందిన సిలిండర్లు వినియోగించడంతో నిర్వాహకుల ముందు జాగ్రత్త చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి వసంత లక్ష్మిని ఫోన్లో పలుమార్లు సంప్రదించగా, అందుబాటులో రాలేదు. -
బడికి బైబై
కెరమెరి: 2025– 26 విద్యాసంవత్సరం ముగిసింది. గురువారం పాఠశాలలకు చివరిదినం కాగా, శుక్రవారం నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఖుషీ ఖుషీగా ఇంటిబాట పట్టారు. ఆశ్రమ పాఠశాలల్లో చివరి పరీక్ష ముగియగానే హాస్టళ్ల నుంచి వెళ్లిపోయారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. చివరిరోజు సందడే సందడిజిల్లాలో 1,273 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా 89 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నా రు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమి కోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు నిర్వహించారు. తల్లిదండ్రుల ఎదుటే పిల్లల ప్రగతిపత్రాలు అందించారు. ఏడాది పాటు చదివిన తీరును విషదీకరించారు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. బడి ఆస్తులు భద్రమేనా?జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విలువైన సామగ్రి చోరీకి గురి కావడం, ధ్వంసం కావడం గతంలో పలుచోట్ల జరిగింది. పాఠశాల పరిసరాల్లో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్తులు కాపాడేందుకు వాటి రక్షణకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాంపస్ కమాండోస్గా విద్యార్థులకు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులు తరచూ బడిని సందర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించాలి. సాయంత్రం బడి మైదానంలో ఆడుకోవాలని సూచించారు. వీరు సైన్స్ ప్రయోగశాలలు, ల్యాబ్లో విలువైన పరికరాలు, కంప్యూటర్లు, క్రీడాసామగ్రి, పుస్తకాలు, నీటి శుద్ధి పరికరాలు, విద్యుత్ మోటార్లు చోరీ కాకుండా పర్యవేక్షించాలి. డిజిటల్ పాఠ్యాంశాల కోసం అందించిన ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డులు, విలువైన ఫర్నీచర్, అడ్మిషన్ రిజిస్టర్, రికార్డులు, మిగిలిన ఎండీఎం బియ్యం భద్రతకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
పచ్చని కుటుంబాల్లో ‘మత్తు’ చిచ్చు
కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన అవ్తారే లింబాజీ(69)– పెంటుబాయి దంపతుల రెండో కుమారుడు కుశబ్రావు కూలీ పనిచేస్తున్నాడు. కుశబ్రావు ఈ నెల 14న మద్యం తాగి ఇంటికి వచ్చి తండ్రితో పెళ్లి విషయమై గొడవపడ్డాడు. తనకు పెళ్లి చేయడం లేదని, బంధువుల వద్ద చెడుగా చెబుతానడనే అనుమానంతో తండ్రి లింబాజీపై మద్యం మత్తులో దాడి చేశాడు. లింబాజీ కడుపులో తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. వడుగురే గణేశ్(42) భార్య సరోజతో కలిసి సిర్పూర్(టి) మండలం చీలపెల్లి గ్రామంలోని అత్తగారింట్లోనే ఉంటున్నాడు. గణేశ్ మద్యానికి బానిసకావడంతో గత నెల 29న మద్యం మత్తులో తన మామ భూమయ్యతో గొడవపడ్డాడు. భూమయ్య అల్లుడి చెంపపై బలంగా కొట్టి నెట్టివేయడంతో గణేశ్ కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య సరోజ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఇంటి పెద్దను కోల్పోయారు. కౌటాల: ప్రశాంతమైన గిరిజన జిల్లాలో హత్యల సంస్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ కలహాలు, ఆస్తి తగదాలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలతో సొంతవారినే కడతేరుస్తున్నారు. రక్త సంబంధీకులే రక్తం కళ్లజూస్తున్నారు. జిల్లాలో గంజాయి, మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మత్తుకు బానిసగా మారినవారు మానవత్వాన్ని మరిచి అయినవారినే చంపుకోవడం సమాజానికి మాయనిమచ్చగా మిగులుతున్నాయి. హత్యలతో కుటుంబాలు రోడ్డున పడుతుండగా, బాధితుల పిల్లలు అనాథలుగా మారున్నారు. చంపిన వారు జైలు పాలవుతున్నారు. ఇరు కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. మద్యం మత్తు, గంజాయి వ్యసనం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. టోల్ఫ్రీ నంబర్ 14446కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. కారణాలు అనేకంజిల్లాలో ఎక్కువగా మత్తు, క్షణికావేశంలో హత్యలు జరుగుతున్నాయి. భూతగాదాలు, వివాహేతర సంబంధాలు సైతం ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ తమ జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు. ఏటా పదుల సంఖ్యలో హత్య, హత్యయత్నం కేసులు నమోదవుతున్నాయి. వివాహేతర సంబంధాలతో ఎలాంటి పరిణామాలు జరిగినా కుటుంబాలు సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి నెలకొంటుంది. పెంచికల్పేట్ మండలంలో జరిగిన యువతి హత్య ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. కొండపల్లికి చెందిన ఆత్రం సమ్మక్క(25)తో జైహింద్పూర్కు చెందిన వివాహితుడు కేర్కరి జలపతి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అతడి కారణంగా సమ్మక్క గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో సమ్మక్కను మార్చి 14న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. అలాగే ఈ నెల 8న చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద మహారాష్ట్ర యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నేరాల నియంత్రణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చట్టాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఘటనల వివరాలు -
మక్కల కొనుగోళ్లు షురూ
కాగజ్నగర్టౌన్: ఈ ఏడాది మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని దహెగాం, కాగజ్నగర్, పెంచికల్పేట్, బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాల్లో సుమారు 13వేల ఎకరాల్లో రైతులు పంటను సాగు చేశారు. ప్రస్తుతం కోతలు పూర్తికావడంతో రైతులు పంటను అమ్మేందుకు సిద్ధమయ్యారు. కాగజ్నగర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 చెల్లిస్తున్నారు. తేమ నిబంధనలు ఇలా.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే మక్కల్లో పీఏసీఎస్ సిబ్బంది మాయిశ్చర్ మీటర్తో తేమశాతాన్ని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 శాతానికి మించితే కొనుగోలు చేయడం లేదు. తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని వెనక్కి తిప్పి పంపి ఆరబెట్టుకుని రావాలని సూచిస్తున్నారు. 14 శాతం లోపు ఉంటేనే తూకం వేసి క్వింటాల్కు రూ.2400 మద్దతు ధర చెల్లిస్తున్నారు. కేంద్రం వద్ద రైతు పేరు, ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంక్ఖాతా, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, తేమ శాతం తూకం వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. టోకెన్ ఇచ్చిన 48 గంటల్లో రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరుపుతున్నట్లు పీఏసీఎస్ కార్యదర్శి సతీశ్ వెల్లడించారు. -
ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత
కాగజ్నగర్టౌన్: ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యతని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. అంతర్జాతీయ మదర్ ఎర్త్డేను పురస్కరించుకుని బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని, కాలుష్య నియంత్రణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ వంటి చర్యలను చేపట్టాలని కోరారు. చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, జిల్లా సైన్స్ అధికారి, పర్యావరణ అంబాసిడర్ కటుకం మధుకర్, ఎంఈవో ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు దేవాజీ, పర్శ చంద్రశేకర్, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, జనార్దన్, ఉపాధ్యాయులు షబ్బీర్, వేణు, శ్యామ్, త్రివేణి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉపాధికి భరోసా
ఆసిఫాబాద్రూరల్: ఇంటర్తోనే విద్యార్థులు ఉపాధి అవకాశాలు సృష్టించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హెల్త్ కేర్, మల్టీమీడియా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, హైటెక్ టైలర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మల్టీపర్పస్ వర్కర్, డెయిరీ టెక్నాలజీ వంటి వివిధ రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఇంటర్న్షిప్ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు జిల్లా కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులకు హెల్త్ కేర్, మీడియా రంగాలపై పదిరోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించారు. ఆరు ఒకేషనల్ కాలేజీలు జిల్లాలో మొత్తం 49 జూనియర్ కళాశాలలు ఉండగా, ఇందులో 11 ప్రభుత్వ కళాశాలలు, 5 ప్రైవేట్, మిగిలినవి కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ కళాశాలలు. ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్నగర్, కౌటాల, ఆసిఫాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్, ఎస్టీ బాలికల గురుకుల కళాశాలల్లో వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఇంటర్, వృత్తి విద్య కోర్సు చదువుతూనే వారికి ఇష్టమైన అంశంలో ఉచిత శిక్షణ కల్పిస్తారు. ఇది భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడనుంది. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో 10 నుంచి 15 రోజులపాటు ఎంచుకున్న కోర్సుపై సమీపంలోని పరిశ్రమ, ఆస్పత్రులు, ఫొటోషాప్, కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మల్టీపర్సన్, హెల్త్ వర్కర్ వంటి టెక్నాలజీలపై శిక్షణ అందించి ధ్రువీకరణ పత్రం అందిస్తారు. ఈ కోర్సుల్లో 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్ ద్వారా నేర్చుకుంటారు. -
కాగజ్నగర్లో డీఆర్ఎం పర్యటన
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో బుధవారం దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ పర్యటించారు. ప్రత్యేక రైలులో స్టేషన్కు చేరుకున్నారు. అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలం, గూడ్స్ షెడ్, ట్రాక్లు, సైడింగ్ సౌకర్యాలను పరిశీలించారు. కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు కావాల్సిన రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, నీటి సౌకర్యాలపై ఆరా తీశారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలతోపాటు అదనంగా ఏం అవసరమో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైల్వే డీవోఎం ఆపరేటింగ్, నార్త్ ఇంజినీరింగ్, సిగ్నల్, ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్ అధికారులు, ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై దాసు ఉన్నారు. డీఆర్ఎంకు వినతి డీఆర్ఎం గోపాలకృష్ణన్ను ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఠాకూర్ ప్రవీణ్సింగ్ కలిసి వినతిపత్రం అందించారు. బెంగాలీల సౌకర్యార్థం బల్లార్షా మీదుగా హైదరాబాద్ నుంచి నూతన రైలు సౌకర్యం, కాజిపేట నుంచి బల్లార్షా మీదుగా ముంబయికి రైలు, 17036 బల్లార్షా నుంచి కాజిపేట ఎక్స్ప్రెస్ రైలును చర్లపల్లి వరకు పొడిగించి.. ప్రస్తుతం నడుస్తున్న సమయాల్లో మార్పు చేయాలని కోరారు. అలాగే కాగజ్నగర్ మీదుగా ఐదేళ్లుగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు క్రమబద్ధీకరించాలని, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఫిట్ లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆదిలాబాద్ నుంచి తిరుపతి వయా బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్ మీదుగా వీక్లి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడిపించాలని విన్నవించారు. -
పాఠశాలలకు ‘సావర్ఖేడా’ స్ఫూర్తి
కెరమెరి: పీఎంశ్రీ స్కూల్ సావర్ఖేడా ఇతర పాఠశాలలకు స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని సావర్ఖేడా ప్రాథమిక పాఠశాలలో బుధవారం గ్రాడ్యుయేషన్ డేకు డీఈవో లలితతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో విద్యార్థులు క్రమశిక్షణ ఉంటూ చదువులో రాణించడంలో గ్రామస్తుల సహకారం ఎంతో ఉందన్నారు. గ్రామం మద్యపానానికి దూరంగా ఉండడం అభినందనీయమని, ఇది ఐఎస్వో సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉన్న గ్రామంగా అభివర్ణించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడంతో విద్యాసామర్థ్యాలు పెంపొందాయని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో బడి అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడంపై హెచ్ఎం కడేర్ల రంగయ్యను అభినందించారు. అనంతరం చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, సర్పంచ్ కావ్డే తుల్సిరాం తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా టాపర్లకు సన్మానం
ఆసిఫాబాద్రూరల్: ఇంటర్మీడియెట్లో జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ హరిత సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. జైనూర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థిని ఐశ్వర్య 967, ఎంపీసీ విద్యార్థి వరప్రసాద్ 984 మా ర్కులు సాధించారని తెలిపారు. 15 మంది విద్యార్థులు ఉత్తమ మార్కులతో రాణించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఐఈవో రాందాస్, ప్రిన్సిపాళ్లు కళ్యాణి, సంతోష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సీఐతో వాగ్వాదం
ఆర్టీసీ అధికారులు ప్రైవేటు బస్సును నడిపేందుకు ప్రయత్నించగా, జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్తో మహిళా కండక్టర్లు వాగ్వాదానికి దిగారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నుంచి ఉదయం బస్సులు బయటకు వెళ్లకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు. ఎట్టకేలకు అధికారులు ఔట్సోర్సింగ్ డ్రైవర్లతో బస్సులు నడిపారు. ఆసిఫాబాద్ డిపో నుంచి తొమ్మిది బస్సులు కాగజ్నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, వాంకిడి రూట్లతో నడిపించారు. కండక్టర్ లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు పురుషులకు సైతం ఉచిత ప్రయాణం కల్పించారు. కాగజ్నగర్ బస్స్టేషన్ మీదుగా కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్పేట్ మండలాలకు వెళ్లే బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగజ్నగర్లోని బస్టాండ్లో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూశారు. -
రెబ్బెనలో నీళ్ల డబ్బాలే..
రెబ్బెన: మండలంలోని 24 పంచాయతీల ప్రజలు ఏదైనా అనారోగ్యానికి గురైతే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిందే. ఎండాకాలం కావడంతో ఆస్పత్రిలో తాగేందుకు నీటిసౌకర్యం లేదు. రూ.లక్షలు ఖర్చు చేసి రోగులు, ప్రజ ల తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గతంలో ఆర్వో ప్లాంటు ప్రారంభించారు. అది చెడిపోగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. చల్లని నీటిని ఏర్పాటు చేసేందుకు ఫ్రిజ్ అందుబాటులో ఉన్నా ప్రస్తుతం ఉపయోగంలో లేదు. వాటర్ప్లాంట్ల నుంచి క్యాన్లు కొని ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవి సరిపోక రోగులు దాహార్తితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వేసవి తీవ్రత దృష్టా ఆస్పత్రిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉంచారు. ఇద్దరు డాక్టర్లు ఉండగా మంగళవారం ‘సాక్షి’విజిట్ చేసిన సమయంలో ఒక్కరే అందుబాటులో ఉన్నారు. -
దేవతలకు చూపించాకే విత్తుతాం
పొలాల్లో విత్తనాలు విత్తే ముందు కులదైవాలకు చూపించడం మా ఆచారం. అక్కడ ప్రత్యేక పూజలు చేసి నేలతల్లికి మొక్కిన తర్వాతే వ్యవసాయ పనులు ప్రారంభిస్తాం. – సలాం శ్యాంరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆచారాలు పాటిస్తున్నాం ఏళ్ల క్రితం మా పెద్దలు ప్రారంభించిన మెహతుక్ పూజలను నేటికీ పాటిస్తున్నాం. పూజలు చేయకుండా విత్తనాలు నాటడం మా సంప్రదాయంలో లేదు. – పుర్క బాపూరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ ప్రచార కార్యదర్శి -
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ద్వారకానగర్లో మంగళవారం రాత్రి హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. శ్రీగాయత్రి విశ్వకర్మ పీఠాధిపతి చంద్రమౌళి, ప్రధాన వక్తగా చందా వింద్య, గోనే భూమయ్య హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి అధికంగా ఉంటుంది. -
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదాల నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని ఎస్పీఎంను సందర్శించారు. పరిశ్రమల రక్షణలో భాగంగా నిజామాబాద్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ హెచ్.లక్ష్మికుమారితో కలిసి మాక్డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్లోరిన్, యాసిడ్ వంటి విషపూరిత పదార్థాలు లీకేజీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. టెక్నికల్ నిపుణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ ఏకే మిశ్రా, జనరల్ మేనేజర్ గిరి, సేఫ్టీ మేనేజర్ శ్రీనివాస్, కమర్షియల్ జీఎం అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఇళ్ల గణన విధులు నిర్వర్తించే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన శిక్షణకు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో గణాంక అధికారి గురువయ్య, మాస్టర్ ట్రైనర్లు ఊషన్న పాల్గొన్నారు. మ్యాపింగ్ త్వరగా పూర్తిచేయాలిఆసిఫాబాద్: ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సెర్ప్ ఏపీఎంలు, వీవోఏలు, సూపర్వైజర్లతో మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా మ్యాపింగ్ కాని ఓటరు వివరాలు సేకరించి.. వారు ఇక్కడికి ఎలా వచ్చారు అనే వివరాలతో పోల్చుకోవాలని సూచించారు. ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షిస్తామని తెలిపారు. -
నిరుద్యోగులకు సింగరేణి ప్రోత్సాహం
రెబ్బెన: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు సింగరేణి సంస్థ తగిన ప్రోత్సాహం అందిస్తుందని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయంలో మంగళవారం పుస్తకాలు పంపిణీ చేశారు. జీఎం మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలను ఉన్నతస్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో సేవా సమితి ఆధ్వర్యంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశామన్నారు. 2014 నుంచి వందలాది మంది చదుకున్నారని అన్నారు. గోలేటిలోని గ్రంథాలయంలో 35 మంది ప్రభుత్వ కొలువులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, సీఎంవోఏఐ ఏరియా అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, పర్సనల్ హెచ్వోడీ ఎస్వీ రాజేశ్వర్రావు, ఖైరిగూర మేనేజర్ శంకర్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, లైబ్రరీ కేర్ టేకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్తాలు ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి
ఆసిఫాబాద్: శుభ ముహూర్తాల నేపథ్యంలో బాల్యవివాహాలు జరిగే అవకాశం ఉందని, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, బాలరక్ష భవన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ బాలరక్ష భవన్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో రహస్య సమాచార సేకరణతోపాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కమూనిటీ ఇన్వాల్వ్మెంట్ పెంచాలన్నారు. బాల్యవివాహాలతో ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, బాలల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడే ప్రభావాల గురించి వివరించాలని సూచించారు. గ్రామస్థాయిలో బాలల సంరక్షణ కమిటీలను బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పెంటుబాయి, లైలా, షూర్ స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త బండి సంతోష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మ క్షేత్రంలో విత్తన పూజలు
కెరమెరి: జిల్లాలోని గిరిజన గ్రామాలు విత్తన పూజ లకు సిద్ధమయ్యాయి. బుధవారం నుంచి తెలంగా ణ– మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్గూడ అడవుల్లో కొలువైన తమ ఇష్టదైవం జంగుబాయి పుణ్య క్షేత్రంలో ఆదివాసీలు విత్తన పూజలకు శ్రీకారం చుట్టనున్నారు. గుహలోని దీపం వద్ద ప్రత్యేక పూజ లు చేసి, రావుడ్, పోచమ్మ, మైసమ్మ దేవతలకు విత్తనాలను చూపించి మొక్కులు చెల్లించుకోనున్నారు. జిల్లాతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గిరిజనులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల ప్రగాఢ నమ్మకంఏటా మృగశిర కార్తె ప్రారంభానికి ముందే జంగుబాయి సన్నిధిలో విత్తనాలను ఉంచి పూజలు చేయడం ఆచారం. అక్కడ పూజించిన విత్తనాలను చేలలో విత్తితే పంటలు సమృద్ధిగా పండుతాయని, అధిక దిగుబడులు వస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీనిని గోండి భాషలో ‘మెహతుక్’అని పిలుస్తారు. మంగళవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం నిర్వహించగా, బుధవారం నుంచి నెలరోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. వివిధ గ్రామాల నుంచి మేళాలు(బృందాలు) తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. దేవతల ఆశీర్వాదం తీసుకుని..మే నెలలో ప్రతీ గ్రామంలోని పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. గ్రామస్తులందరూ కలిసి తమ కుల దైవాలు పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి ఖిల్లా, పద్మల్పురి కాకో దర్శనానికి వెళ్లి విత్తనాలను చూపిస్తారు. దేవతల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తిరిగి గ్రామానికి చేరుకుని ఆకీపేన్, అమ్మోరు, పోచమ్మ తల్లుల వద్ద విత్తనాలకు పూజలు చేస్తారు. అనంతరం పటేల్ పంపిణీ చేసే విత్తనాలను రైతులు ఇళ్లకు తీసుకెళ్తారు. అదేరోజు అర్ధరాత్రి రెండున్నర కిలోల జొన్నలను పిండి చేసి, వాటితో గట్క వండి ఆరగిస్తారు. అనంతరం అడవికి వెళ్లి చెట్టు(కుమ్ముడ్) ఆకులను తెచ్చి డొప్పలుగా తయారు చేస్తారు. ఆ డొప్పల్లో పూజించిన విత్తనాలను వేసి గ్రామంలోని అన్ని ఇళ్లకు పంచుతారు. ఈ కార్యక్రమాలన్నీ మృగశిర కార్తెకు కొద్దిరోజుల ముందుగానే పూర్తిచేస్తారు. రైతు కుటుంబాల్లో సందడిమృగశిర కార్తెకు ముందు నుంచే రైతుల కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విత్తన పూజల రోజు ఉదయాన్నే ఇళ్లను శుభ్రం చేసుకుని పేడతో అలికి ముగ్గులు వేస్తారు. అనంతరం పొలంబాట పట్టి, అక్కడ కులదేవతలు, నేలతల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆపై పొలంలో విత్తనాలు చల్లి, నాగలికి పూజలు చేసి దున్నడం ప్రారంభిస్తారు. పటేల్ ఇళ్ల ఎదుట మహిళలు పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా వంటి పురాతన క్రీడలు ఆడుతూ ఉత్సాహంగా గడుపుతారు. అలాగే మరికొందరు ఆదివాసీలు తమ ఇష్ట దైవమైన చంచి భీమల్ దేవుడి పెళ్లి సందర్భంగా ఏప్రిల్, మే నెలల్లోనే విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరు డొప్పల్లో విత్తనాలు కలిపి భీమల్ దేవుని వద్ద ఉంచి పూజిస్తారు. ఆ విత్తనాలను భద్రపరిచి, మృగశిర కార్తె రాగానే పొలాల్లో చల్లుతారు. -
ఇన్చార్జికి బాధ్యతలు
చింతలమానెపల్లి: బాబాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ వైద్యాధికారి లేక కమ్యూనిటీ హెల్త్ అధికారి రాజ్కుమార్ ఇన్చా ర్జి బాధ్యతలు అప్పగించారు. జనరల్ వార్డులో ఫ్యాన్లు పనిచేస్తున్నా యి. చల్లని మినరల్ నీటిని అందుబాటులో ఉంచుతున్నామని వైద్యాధికారి రాజ్కుమార్ తెలిపారు. వేసవి నేపథ్యంలో వడదెబ్బ, వాంతులు, విరోచనాలకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయని ఫార్మసిస్టు వీఎస్ఎన్ రెడ్డి తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షల కోసం ల్యాబ్ టెక్నీషియన్ స్వప్న, మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ సుమతి, స్టాఫ్ నర్స్ దుర్గ విధుల్లో ఉన్నారు. ఓపీ ఏఎన్ఎం తార్సీనా రోగులకు అవసరమైన సలహాలు అందిస్తున్నారు. మండలంలో 24గంటలు పనిచేసే పీహెచ్సీ ఏర్పాటు చేయాలని మండల వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
తీర్చాలి దాహం
వేసవి తాపం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాగునీటి ఇక్కట్లుఅసలే ఎండాకాలం.. రోజురోజుకూ భానుడు తీవ్ర రూపం దాల్చుతున్నాడు. ప్రజలు వేడి, ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన వారికి తాగేందుకు కనీసం గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. కొన్నిచోట్ల వైద్యసిబ్బంది తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులను ‘సాక్షి’ సందర్శించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూల్వాటర్ ఫ్రిజ్లు చెడిపోయినా మరమ్మతులు చేయించడం లేదు. వైద్యసిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మిగులుతోంది. -
దహెగాంలో చల్లటి నీళ్లు లేవు
దహెగాం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ‘సాక్షి’విజిట్ చేసింది. వైద్యధికారి ఉదయం పది గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. వేసవి దృష్ట్యా అవసరమయ్యే మందులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్సీ నూతన భవనం కావడంతో ఫ్యాన్లు సక్రమంగానే ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు చల్లటి నీరు అందుబాటులో లేక సాధారణ తాగునీటిని తాగుతున్నారు. రెగ్యులర్ వైద్యాధికారి లేకపోవడంతో రెబ్బెన పీహెచ్సీ వైద్యుడు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. సిబ్బంది కొరత వేధిస్తోంది. -
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి
కాగజ్నగర్టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రికి భారత్ డైనమిక్ లిమిటెడ్ వారి సహకారంతో 15 ఐసీయూ బెడ్లు, 10 స్ట్రెచర్ బెడ్లు అందజేశారు. అలాగే మంగళవారం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానాతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని, సగటున నెలకు 50కి తగ్గకుండా నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘కాయకల్ప’ పథకానికి ఆస్పత్రి ఎంపికయ్యే అవకాశం ఉందని, అందుకు వైద్యులు, సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు. వంద పడకల నూతన ఏరియా ఆస్పత్రి పూర్తయితే నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని తెలిపారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విన్నవించడం, అసెంబ్లీలో ప్రస్తావించడంతో అదనంగా కాగజ్నగర్లో 5, సిర్పూర్(టి)లో 5, కౌటాల పీహెచ్సీ 5, బెజ్జూర్లో 5 పడకలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ అవినాష్, వైద్యులు శ్రీధర్బాబు, అరుణ్, హర్షవర్ధన్, గైనకాలజిస్ట్ అరుణ, రథన్రాజ్, నాయకులు నందిసాయి, గజ్జెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
ఆసిఫాబాద్: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వంతోపాటు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించారు. గత కొన్ని వారాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపింది. తాజాగా మంగళవారం రాత్రి హైదరాబాద్లో ఆర్టీసీ మంత్రితో పాటు యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె అనివార్యమైంది. జిల్లాపై ప్రభావంమంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఓ వైపు వేసవి సెలవులు ప్రారంభం కావడం, వివాహాది శుభకార్యాలు ఉండడంతో సమ్మె ప్రభావం జిల్లాలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పడనుంది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో 76 బస్ సర్వీసులు ఉండగా, 269 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజూ ఐదు రూట్లతో 71 షెడ్యూళ్లు, 30 వేల కిలోమీటర్లు, 16 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు రూ.16 లక్షల ఆదాయం సమకూరుతుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ 32 డిమాండ్ల పరిష్కారం కోసం బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయాలని, 2021, 2025 వేతన సవరణలు, 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.350 కోట్లు షరతులు లేకుండా విడుదల చేయాలని, కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రయోజనాలు కల్పించడంతోపాటు 32 డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెకు దిగారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ఔట్సోర్సింగ్ సిబ్బందితో ప్రైవేటు బస్సులను నడిపిస్తాం. – రాజశేఖర్, ఆర్టీసీ డీఎం, ఆసిఫాబాద్ -
కాగజ్నగర్ సీహెచ్సీ ఆదర్శం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ సామాజిక ప్ర భుత్వ ఆస్పత్రి సేవల్లో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడికి ప్రతిరోజూ సుమారు 300 మంది రోగులు వస్తుంటారు. సగటున 20 మంది ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. ఓపీ పేషెంట్లను చూడటానికి ఇద్దరు మహిళా వైద్యులు, ఒకరు గైనకాలజిస్ట్, జనరల్ వైద్యురాలు, చిల్ట్రన్స్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ వైద్యులు నిత్యం సేవలందిస్తున్నారు. రక్త పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ, స్కానింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వేసవి నేపథ్యంలో మందుల కొరత లేకుండా స్టాక్ ఉంచుతున్నారు. ఫ్యాన్లు, చల్లని మినరల్ తాగునీటి సౌకర్యం కల్పించారు.రోగుల్లో ధైర్యం నింపాలి వైద్యం అంటే కేవలం మందులు రాసివ్వడం కాదు. రోగుల మనసులో ధైర్యం నింపాలి. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందిండమే లక్ష్యం. ప్రతిరోజూ ఓపీకి సుమారు 300 మంది వరకు వస్తున్నారు. – అవినాష్, సూపరింటెండెంట్, కాగజ్నగర్ సీహెచ్సీ -
కొనుగోళ్లకు వేళాయె
దహెగాం: జిల్లాలో యాసంగి వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. మరో వారం రోజుల్లో కోతలు ముమ్మరం కానున్న నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా జిల్లావ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు అనువైన స్థలాలను అధికారులు పరిశీలించారు. 23 వేల ఎకరాల్లో సాగు..జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 23,000 ఎకరాల్లో వరిసాగు చేశారు. ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలోని దహెగాం, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, కాగజ్నగర్, సిర్పూర్ (టి) మండలాల్లో సాగు అధికంగా ఉంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, తిర్యాణి, రెబ్బెన మండలాల్లోనూ బోర్లు, వట్టివాగు, పీపీరావు ప్రాజెక్టు ఆయకట్టు కింద పండిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి మెరుగ్గా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. మరో వారం రోజుల్లో వరికోతలు ఊపందుకోనున్నాయి. అయితే, రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో అకాల వర్షాలతో పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. 34 కొనుగోలు కేంద్రాలు..యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 34 ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 19 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 15 కేంద్రాలను నిర్వహించనున్నారు. గతేడాది వానాకాలం సీజన్లో 40 కేంద్రాలు ఉండగా, యాసంగిలో వాటి సంఖ్యను 34కు తగ్గించారు. ప్రభుత్వం ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ.2,389, సాధారణ (బీ గ్రేడ్) రకానికి రూ.2,369 మద్దతు ధర ప్రకటించింది. వీటితోపాటు సన్నరకం వరి ధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ కూడా చెల్లించే అవకాశం ఉంది. ఈ బోనస్ అందుతుందనే ఆశతోనే చాలా మంది రైతులు ఈసారి సన్నరకాలను పెద్దఎత్తున సాగు చేశారు. కేంద్రాల్లో సౌకర్యాల కల్పనగతంలో అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేంద్రాల వద్ద తగినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉంచుతామని అధి కారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా రైతులకు నీడ కోసం టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, షెడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించనున్నా రు. ధాన్యం సేకరణ, తరలింపులో ఆలస్యం కాకుండా సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచనున్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి, తాలు లేకుండా నాణ్యతా ప్రమాణాల మేరకు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. గతేడాది కొనుగోళ్లలో జరిగిన ఆలస్యం పునరావృతం కాకుండా త్వరితగతిన ప్రక్రియను పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. దహెగాంలోని కేంద్రంలో ఆరబెట్టిన వరిధాన్యం(ఫైల్)త్వరలో కొనుగోళ్లు ప్రారంభం యాసంగి వరి కొనుగోలుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. ఎండలను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నాం. వర్షం వచ్చినా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధం చేశాం. కోతలు ముమ్మరం కాగానే సేకరణ ప్రక్రియ మొదలవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు సన్నరకానికి క్వింటాలుకు రూ.500 బోనస్ రైతులకు అందుతుంది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి. – మోహన్, డీసీవో -
అడ్మిషన్లకు ‘దోస్త్’
కాగజ్నగర్టౌన్: డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం మూడు దశల్లో సీట్లు భర్తీ చేయనుండగా, మొదటి విడత దరఖాస్తులు ఈ నెల 15 నుంచి స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించగా, మే 14న సీట్లు కేటాయించనున్నారు. రెండో దశ మే 15 నుంచి 30 వరకు, మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ మే 31 నుంచి జూన్ 20 వరకు కొనసాగనుంది. ఫస్ట్ ఫేజ్కు రూ.200, సెకండ్, థర్ట్ ఫేజ్కు రూ.400 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీటు కన్ఫామ్ అయిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇలా..ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది. జిల్లాలో 3,745 మంది సెకండియర్ పరీక్షలకు హాజరుకాగా, 3,077 మంది ఉత్తీర్ణులయ్యారు. డిగ్రీలో అడ్మిషన్ పొందాలంటే వీరు దోస్త్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఇంటర్ మార్కుల మెమో, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు, కులం, ఆదాయం, నివాస, ధ్రువీకరణ పత్రాలు, పూర్తి చిరునామా, కలర్ఫొటో, సెల్ నంబర్(ఆధార్ నంబర్కు లింక్ అయి ఉండాలి), క్రీడలు, ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు ఉంటే జతచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఉంది. అలాగే ప్రైవేట్ యాజమాన్యాల కింద ఎనిమిది డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. కాగజ్నగర్ డిగ్రీ కళాశాలలో సుమారు 600, ఆసిఫాబాద్ 340 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలలో సుమారు 300 సీట్లు భర్తీ చేసేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీజీసీహెచ్ఈ) అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ కోసం దోస్త్ ద్వారా అడ్మిషన్లు ప్రారంభించారు. బీఏ, బీకాం(కంప్యూటర్స్), బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ కంప్యూటర్ గ్రూప్లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు విధానండిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజు పేమెంట్ చేయడం వంటి విషయాల్లో విద్యార్థులకు అవగాహన ఉంటే సెల్ఫోన్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే మీసేవ, జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ అప్లికేషన్లో ఓటీపీ అత్యంత కీలకం. ఫోన్ నంబర్కు ఆధార్ అనుసంధానమైతేనే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. సెల్ఫోన్కు వచ్చిన పిన్, అంతకు ముందు దోస్త్ ఐడీ ఆధారంగా సంబంధిత పోర్టల్లో లాగిన్ కావ్వాలి. ఆయా కళాశాలల్లో ఆసక్తి గల కోర్సు, కళాశాలను ఎంపిక చేసుకోవాలి. సీట్ల కేటాయింపు తర్వాత ఆన్లైన్లోనే రిపోర్టు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నిర్ణీత తేదీల్లో కళాశాలల్లో సంబంధిత జిరాక్స్ ప్రతులు సమర్పించాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో చేరాలంటే ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చే సుకునేందుకు టీజీసీహెచ్ఈ అవకాశం కల్పించింది. దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థుల సెల్ఫోన్ నంబర్ ఆధార్కు లింక్ అయ్యి ఉండాలి. వి ద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాస్థాయిలో హెల్ప్లైన్ సెంటర్ కాగజ్నగర్లో ఏర్పాటు చే శాం. అప్లికేషన్లో ఇబ్బందులు ఎదురైతే కోఆర్డినేటర్ నంబర్ 9440194179కు ఫోన్ చేసి సందేహా లు నివృత్తి చేసుకోవాలి. https://dost.cgg.g ov.in వైబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2026– 27 విద్యా సంవత్సరం నుంచి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి చేయనుంది. – శ్రీదేవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కాగజ్నగర్ -
త్వరితగతిన సమస్యల పరిష్కారం
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జై నూర్ మండలం ధబోలి గ్రామానికి చెందిన మెస్రం మారుబాయి దరఖాస్తు చేసుకుంది. ఇంటర్నెట్ సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని పెంచికల్పేట్ మండలానికి పోర్మేటి సరోజ కోరింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితా 3 నుంచి తన పేరును జాబితా 1లోకి మార్చాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన పుస్తం పూజిత విన్నవించింది. లావుణి పట్టా భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు బోర్వెల్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని లింగాపూర్ మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ వినతి అందించాడు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్ జారీ చేయాలని దహెగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన మానెపల్లి అమృత, బెజ్జూర్ మండలం సలుగుపల్లికి చెందిన దుర్గం కౌసల్య కోరారు. చింతలమానెపల్లి మండలం రణవెల్లిలోని ప్రాథమకోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలి ‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో గుడిసెలు తీసేసి నిర్మాణ పనులు ప్రారంభించాం. బేస్మెంట్ పూర్తయి గోడల నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇళ్లు లేక బయట ఉంటున్నాం. వర్షాకాలం వస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బిల్లులు మంజూరు చేసి, ఇళ్లు పూర్తయ్యేలా చూడాలి.’ అని వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామానికి చెందిన సిడాం భీమ్బాయి, మడావి గిరిజాబాయి, ఆత్రం లచ్చు, మెడపతి భీము కోరారు. -
బసవేశ్వర చరిత్ర భావితరాలకు ఆదర్శం
ఆసిఫాబాద్: మహర్షి బసవేశ్వరుడి చరిత్ర భావితరా లకు ఆదర్శమని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగతో కలిసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి బసవేశ్వరుడు 12వ శతా బ్దపు గొప్ప భారతీయ తత్వవేత్త, సంఘ సంస్కర్త, లింగాయత్ స్థాపకుడు అని కొనియాడారు. సమాజంలో కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి న అభ్యుదయ వాది అన్నారు. సమానత్వం, ప్రేమ, భక్తి బోధిస్తూ కుల వ్యవస్థపై తీవ్రంగా పోరాటం చేశారని తెలిపారు. తాగునీటి ఇబ్బందులు రానీయొద్దువేసవిలో మారుమూల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ కార్యాలయాలను సోమవారం తనిఖీ చేసి హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే ఇంజినీరింగ్ అధికారులు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించా రు. మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు. ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలిఆసిఫాబాద్రూరల్: ఇళ్ల గణనలో ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఇళ్ల గణనలో ఇంటి యజమాని నుంచి సరైన వివరాలు సేకరించాలన్నారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని ఆదేశించారు. -
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి
కాగజ్నగర్టౌన్: పట్టణ ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే అన్నారు. పట్టణంలోని ఆదర్శనగర్ సబ్స్టేషన్ను సోమవారం సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలో ఈ నెల 17, 18 రోజుల్లో సాంకేతిక కారణాలతో రెండుసార్లు కరెంటు పోయిందని, వెంటనే స్పందించిన అధికారులు సమస్య పరిష్కరించారని గుర్తు చేశారు. ఓవర్లోడ్ను అధిగమించేందుకు 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 6, 100 కేవీఏల 18 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డీఈ నాగరాజు, ఏడీఈ ఇర్ఫాన్ అహ్మద్ పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లు ప్రారంభం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ బీట్ మార్కెట్లో సోమవా రం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్కలు పండించిన రైతులు విన్నపం మేరకు కౌటాల, కాగజ్నగర్లో రెండు మక్కల కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశామని తెలిపారు. రైతులు ప్రభుత్వ మద్దతు ధర రూ.2400కు విక్రయించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీఏవో వెంకట్, డీసీవో మోహన్, ఏవోలు రామకృష్ణ, నాగరాజు, గిరిషన్, కార్తీక్, ప్రేమలత, పీఏసీఎస్ కార్యదర్శి సతీశ్గౌడ్, ఏఈవోలు రేష్మిత, సృజన, జ్ఞానేశ్వర్, విశాల్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 20 నుంచి 27 వరకు ఉమ్మడి జిల్లాలో జరిగే ఓపెన్ పదో తరగతి, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తాం. విద్యార్థులు గంట ముందుగాననే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. – భోజన్న, డీఈవో, నిర్మల్ సెల్ఫోన్ నిషేధం ఓపెన్ పరీక్షలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశాం. హాల్టికెట్ల పంపిణీ పూర్తి అయ్యింది. ఇప్పటకే హాల్ టిక్కెట్ల పంపిణీ పూర్తి అయ్యింది. పరీక్ష నిర్ణీత సమయం కంటే గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. సెంటర్లోకి సెల్ఫోన్ నిషేధం. – జనార్దన్గౌడ్, పరీక్షల సహాయ కమిషనర్ -
నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం నుంచి నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఏ (ఎల్) కోర్సుల రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు, మొదటి, మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల (బ్యాక్ లాగ్) నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే 1, 4, 6న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21, 23, 25, 28, 30, మే 2, 5, 7, 11 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే 1, 4, 6, 8, 12, 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. బ్యాక్లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు.. కేయూ పరిధిలోని డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ సబ్జెక్టుల విద్యార్థులకు మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21, 23, 25, 28, 30, మే 2, 5, 7, 11, 13న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7, 8, 11, 13, 15, 18, 20, 22న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు మే 12, 14, 16, 21, 23, 25, 26, 28 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను సందర్శించిన అధికారులు.. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 69,427 మంది, ఖమ్మం జిల్లాలో 38,143 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 73,421 మంది విద్యార్థులు మొత్తం 1,80,991 మంది పరీక్షలు రాయనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 115 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 115 మంది అబ్జర్వర్లను నియమించారు. ఆన్లైన్లో జవాబుపత్రాల మూల్యాంకనం.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో తొలిసారిగా ఆన్సర్షీట్లపై స్టిక్కర్లు అంటించనున్నారు. హాల్టికెట్ నంబర్, సబ్జెక్టుల పేర్లు, పరీక్ష కేంద్రంపేరు, కోడ్నంబర్తో కూడిన స్టిక్కర్లను రూపొందించారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. హాల్టికెట్ నంబర్ను బట్టి విద్యార్థి ఆన్సర్షీట్పై స్టిక్కర్ను అతికిస్తారు. ఇక విద్యార్థి ప్రత్యేకంగా హాల్టికెట్ నంబర్రాసే అవసరం ఉండదు. ఈ సెమిస్టర్ల జవాబుపత్రాల మూల్యాంకనం ఇక ఆన్లైన్లో నిర్వహించనున్నారు. విద్యార్థి ఆన్సర్షీట్పై ఉండే స్టిక్కర్ను కాకుండా మిగతా ఆన్సర్షీట్ను స్కాన్చేసి ఆన్లైన్లో జవాబుపత్రాలను మూల్యంకనం చేసే అధ్యాపకులకు పంపుతారు. మూల్యాంకనం తర్వాత ఇక మాన్యువల్గా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ లేకుండానే విద్యార్థి ఆన్సర్షీట్పై ఉన్న స్టిక్కర్ ఆధారంగానే ప్రక్రియ పూర్తిచేస్తారు. -
రాష్ట్రస్థాయి కవితా పోటీల్లో ప్రతిభ
మందమర్రిరూరల్: మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన కాపురపు రవికుమార్కు కవితా పోటీల్లో ప్రథమ బహుమతి దక్కింది. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కవితా పోటీలు నిర్వహించారు. రవికుమార్ రాసిన ‘నువ్వు–నేను వేరెట్లైతంరా’అనే కవిత ప్రథమ స్థానంలో నిలిచింది. ఆదివారం జనగామలో నిర్వహించిన అకాడమీ వార్షికోత్సవ వేడుకలో నిర్వాహకులు శాలువా కప్పి అవార్డును అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, కేంద్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిదారెడ్డి, కాళోజీ అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి, యక్షగాన కళాకారులు గడ్డం సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
‘ఓపెన్’కు సర్వం సిద్ధం
లక్ష్మణచాంద/కెరమెరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఓపెన్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమన్వయకర్త అశోక్ తెలిపారు. పదో తరగతి అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన.. ఎంత తీవ్రను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు ఉన్న పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్యసిబ్బంది, మందులు అందుబాటులో ఉంచనున్నారు. నిర్మల్ జిల్లాలో.. నిర్మల్ జిల్లాలో ఓపెన్ పదో తరగతి పరీక్షలకు 1,035 మంది, ఇంటర్ పరీక్షలకు 747 మంది వి ద్యార్థులు హాజరుకానున్నారు. పదోతరగతికి 5, ఇంటర్కు 4 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. 9 మంది సీఎస్లు, 9 మంది డీవోలు, 9 మంది సిట్టింగ్ స్క్వాడ్, నలుగురు ఫ్లయింగ్ టీమ్, 95 మంది ఇ న్విజిలేటర్లను కేటాయించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో.... మంచిర్యాల జిల్లాలో ఓపెన్ పది పరీక్షలకు 475 మంది, ఇంటర్ పరీక్షలకు 1,226 మంది హాజరుకానున్నారు. 8 పరీక్షా కేంద్రాలు, సీఎస్లు 8 మంది, డీవోలు 8 మందిని కేటాయించారు. ఆన్లైన్లో హాల్టికెట్లు... పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఓపెన్ పాఠశాలలో హాల్ టికెట్లు తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో తీసుకున్న హాల్ టికెట్లు కూడా అనుమతిస్తారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా సమాచారం ఓపెన్ ‘పది’ అభ్యర్థులు 3,053 ఇంటర్ అభ్యర్థులు 2,912 ‘పది’ పరీక్ష కేంద్రాలు 15 ఇంటర్ పరీక్ష కేంద్రాలు 14 సీఎస్లు 29 డీవోలు 29 ఆదిలాబాద్ జిల్లాలో... ఆదిలాబాద్ జిల్లాలో ‘పది’ పరీక్షలకు 900 మంది, ఇంటర్కు 584 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 7 పరీక్షా కేంద్రాలు, ఏడుగురు డీవోలు, ఏడుగురు సీఎస్లు, ఏడుగురు సిట్టింగ్ స్క్వాడ్ను కేటాయించారు. ఆసిఫాబాద్ జిల్లాలో... ఆసిఫాబాద్ జిల్లాలో పది పరీక్షలకు 643 మంది, ఇంటర్ పరీక్షలకు 360 మంది హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలు 5, ఐదుగురు సీఎస్లు, ఐదుగురు డీవోలను కేటాయించారు. -
చెరువులోపడి బిహార్ వాసి మృతి
లోకేశ్వరం: చెరువులో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలి పిన వివరాల మేరకు బిహార్లోని బెగూసహా ని జిల్లా బిచ్కంద తా లూకా ముంజహూ ల్కు చెందిన చోటు కుమార్ సహానీ (28) నిజామాబాద్ జిల్లా గుండారంకు చెందిన గంగాధర్ వద్ద 20 రోజులుగా జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం పంచగుడి గ్రామ సమీపంలో పనులు చేసేందుకు వచ్చాడు. ఈనెల 17న అతిగా మద్యం సేవించి నడుచుకుంటూ వెళ్తుండగా చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యముధోల్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని కాల్వ గల్లీకి చెందిన కారగిరి రాందాస్(45) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం అతని భార్య లేచి చూసేసరికి ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. వడదెబ్బతో మహిళ మృతినెన్నెల: వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గుండ్లసోమారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన చల్లూరి రుక్మ (55) తమ కూతురు శోభతో కలిసి ప్లాస్టిక్ కవర్లతో ఏర్పాటు చేసిన గుడిసెలో నివాసం ఉంటోంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన ఎండకు ప్లాస్టిక్ కవర్ కిందనే ఉన్న రుక్మకు వడదెబ్బ తాకింది. దీంతో వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురైంది. కూతురు శోభ 108కు సమాచారం అందించడంతో గ్రామస్తుల సాయంతో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. -
మానవత్వంతో వైద్యం చేయాలి
నిర్మల్చైన్గేట్: వైద్యులు మానవత్వంతో వైద్యం చేయాలని ఏపీఐ (అసోసియేషన్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ జీ.నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ బ్యాంకెట్ హాల్లో ఆదివారం ఏపీఐ తెలంగాణ చాప్టర్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ దామెర రాములు ఆధ్వర్యంలో ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నర్సింహులు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ఈ సభ నిర్మల్లో నిర్వహించడం హర్షనీయమన్నారు. ఆన్లైన్పై ఆధారపడి, సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. వైద్య విద్యను అభ్యసించి, అనుభవంతో కూడిన చికిత్స అందించే వైద్యుల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రాజారావు, రాష్ట్ర బాధ్యులు ప్రొఫెసర్ నావల్ చంద్ర, ప్రొఫెసర్ చందర్, ప్రొఫెసర్ రమేశ్, ప్రొఫెసర్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ కస్టమ్స్ అధికారిగా నిర్మల్ యువకుడు
నిర్మల్ఖిల్లా:‘విజయం అంటే ఒక గమ్యం కాదు.. నిరంతర ప్రయాణం.’ సాధించిన దానితో సంతృప్తి చెందకుండా, ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలనే స్ఫూర్తిని ఆచరణలో చూపుతున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ముడారపు విఘ్నేష్. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతిష్టాత్మకమైన కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించినప్పటికీ తన లక్ష్యం సివిల్ సర్వీసెస్ సాధన దిశగా అడుగులు వేస్తున్నాడు. విజయపథంలో సాగుతున్న ప్రయాణం.. జిల్లా కేంద్రానికి చెందిన ముడారపు వాణి–శ్రీనివాస్ దంపతుల కుమారుడు విఘ్నేష్. తన పాఠశాల విద్యాభ్యాసాన్ని స్థానిక వాసవి హైస్కూల్లో, ఇంటర్ ఐఐటీ రామయ్య కళాశాలలో పూర్తి చేశాడు. తన ప్రతిభతో ఎన్ఐటి నాగ్పూర్లో బీటెక్ సీటు సాధించాడు. గేట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 800 ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటిలో అవకాశం పొందినా, సివిల్స్ లక్ష్యంతో ఆ సీటును వదులుకోవడం ఆయన పట్టుదలకి నిదర్శనం. అంతటితో ఆగకుండా, రాష్ట్ర స్థాయి గ్రూప్–1 పరీక్షలో 488 ర్యాంకు సాధించినా, ఆశించిన స్థాయి ఉద్యోగం రాకపోవడంతో దానిని కూడా వదిలేశాడు. చివరకు ఆలిండియా స్థాయిలో నిర్వహించే ఎస్ఎస్సీ సీజీఎల్–2025 పరీక్షలో సౌత్ జోన్లో 700 ర్యాంకు సాధించి తాజాగా జీఎస్టీ కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. ఉన్నతోద్యోగం రావడం ఆనందమేం కానీ నా అసలైన లక్ష్యం సివిల్ సర్వీసెస్ అని, ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తూనే అదే దిశగా సిద్ధమవుతున్నానని విఘ్నేష్ స్పష్టం చేస్తున్నాడు. -
ఆత్మీయ కలయిక.. అనుబంధాల వేడుక
శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ప్రగతి మైదానం ఆత్మీయ కలయికకు.. అనుబంధాలకు వేదికై ంది. ఆదివారం ‘ప్రగతి స్టేడియం పిలు స్తోంది.. రా’ పేరుతో మహా ఆత్మీయ సమ్మేళనం ని ర్వహించారు. ముందుగా సంత మైదానం నుంచి ప్రగతి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అన ంతరం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ శ్రీనివాస్, ఏఐటీయూసీ అధ్యక్షు డు వీ.సీతా రామయ్య హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావనీర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 34 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ మైదానం ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిందన్నారు. ఇక్కడి సీ ఈఆర్ క్లబ్లో ఎంతోమంది కళాకారులు తమ కళ ను మెరుగుపర్చుకోవడానికి వేదికై ందన్నారు. అనేక మంది క్రీడాకారులు, కళాకారులు ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించారన్నారు. రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులను ఒకే వేది కపై చేర్చిన నిర్వాహక కమిటీని వక్తలు అభినందించారు. సింగరేణి ప్రగతిని కీర్తించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం సత్యనారాయణ, రిటైర్డ్ జీఎంలు పురుషోత్తం, జయరావు, పాండురంగారావు, ప్రేంకుమార్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ పిన్నింటి రఘునాథ్రెడ్డి, డీవైఎస్వో హన్మంతరెడ్డి, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కార్పొరేటర్ వేల్పుల రవీందర్, నిర్వాహక కమిటీ కోఆర్డినేటర్ యాదిరెడ్డి పాల్గొన్నారు. -
కుమురం భీం
7పశు వైద్యశాల లేక ఇక్కట్లు లింగాపూర్లో పశువైద్యశాల లేకపోవడంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. స్థానిక పాడి రైతులు 22 కిలోమీటర్ల దూరంలోని జైనూర్కు వెళ్తున్నారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. పగలు వేడి కాస్త తగ్గుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. ‘ఓపెన్’కు సర్వం సిద్ధం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 8లోu సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 -
అడవుల రక్షణకు సహకరించాలి
పెంచికల్పేట్: అడవుల రక్షణకు గ్రామీణ ప్రాంత ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమా ర్ టిబ్రేవాల్ అన్నారు. పెంచికల్పేట్ మండలంలో ని అగర్గూడ, గుండెపల్లి గ్రామాల్లో ఆదివారం 30 మందికి ఇండక్షన్ స్టౌవ్లు అందించి, ఆయా గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్లు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోడు వ్యవసాయంతో పేరుతో అడవులను నాశనం చేయొద్దని సూచించారు. గ్రామాల్లోని సమస్యలను అటవీ అధికారులతో చర్చించి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. డీఎఫ్వో మాట్లాడు తూ అనుమతులు లేకుండా అడవుల్లో ప్రవేశించవద్దన్నారు. రానున్న రోజుల్లో గిరిజన గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ భార్గవ్, ఎఫ్డీవో అప్పయ్య, ఎఫ్ఆర్వో అనిల్కుమార్, సర్పంచులు రాజేశ్వరి, సులోచన, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సభకు భారీగా తరలిరండి
ఉట్నూర్రూరల్: ఇంద్రవెల్లి అమరువీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు సోమవారం నిర్వహించే సభకు గిరిజనులు భారీగా తరలిరావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ కోరారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆదివారం వారు విలేకరులతో మా ట్లాడారు. ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మృతివనం వద్ద సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అమరుల ఆశయాలను కొనసాగించడం ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో కుమురం భీం మనుమడు కుమురం సోనేరావు, జిల్లా సార్మేడి తొడసం అమృత్రావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్ సంతోష్, నాయకులు మెస్రం నాగనాథ్, త్రిమూర్తి, మోతీరాం, మారుతి, రామ్దాస్, భరత్, ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు. -
ఇంద్రవెల్లి గాయానికి
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం 45 ఏళ్లుఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే స్మృతి వనం ఏర్పాటుకు సంకల్పించారు. రూ.కోటి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రాయితీ రుణాలతో వాహనాలు అందించడంతో పాటు మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి. అసలేం జరిగింది..స్వాతంత్య్రం వచ్చి అప్పటికి మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్దమైన హక్కుల సాధన కోసం పీపుల్స్వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చా రు. మధ్యాహ్నం 3 గంటల వరకే ప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే అతడిపై దాడి చేయగా నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15 మంది ఆదివాసీలు చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60 మంది వరకు మృతి చెందినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. రెండోసారి స్మారక స్తూపం నిర్మాణంఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. దానిని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్ల తో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో స్తూపం నిర్మించింది. అమరవీరుల ఆశయ సాధన కోసం రిలే దీక్షలునాటి ఆదివాసీ అమరుల ఆశయ సాధన కోసం ఇటీవల కొద్ది రోజుల పాటు ఆదివాసీలు స్తూపం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. 1981 ఏప్రిల్ 20. జల్..జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. వారి అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 45 ఏళ్లు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా ఏర్పాటు చేసింది. అలాగే ఆంక్షలు లేకుండా అధికారికంగా నివాళులర్పించే అవకాశం కల్పించింది. ఈ సారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – ఇంద్రవెల్లిహిందూ సమ్మేళనం విజయవంతం చేయాలిఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్స్లో ఈ నెల 24న సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సమితి అధ్యక్షుడు బోనగిరి సతీశ్బాబు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్య అతిఽథిగా భవానీ స్వామిజీ(కామాఖ్య దేవస్థానం ప్రధాన అర్చకులు), ప్రధాన వక్తగా సౌమిత్రి లక్ష్మణాచార్యులు హాజరు కానున్నట్లు తెలిపారు. మాజీ ఏఎంసీ శ్రీనివాస్ మాట్లాడుతూ గడపలోపలే కులం గడప దాటితే హిందువులమని అన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు ఖాండ్రె విశాల్, ప్రధాన కార్యదర్శి ఆకుల సంతోష్, ఆర్ఎస్ఎస్ సంపర్గ ప్రముఖ్ నాగుల శ్రీనివాస్, సరస్వతి శిశుమందిర్ ప్రధాన ఉపాధ్యాయులు గుండేటి కోటేశ్వర్రావు, సభ్యులు పాల్గొన్నారు. 33 ఏళ్లు.. నివాళులకు దూరంనాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రపాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా బందోబస్తు ఏర్పాటు చేసేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన సంఘాల నాయకులతో పాటు ఎంపీ మధుసూదన్రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీలు ఆ రోజున ఆంక్షల నడుమ నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించింది. రెండు గంటల సమయం ఇవ్వడంతో ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేసి నివాళులర్పిస్తూ వచ్చారు. -
సద్వినియోగం చేసుకోవాలి
14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల కిశోర బాలికలు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వసతి గృహాల్లో చదువుకునే బాలికలు ఇంటికి వచ్చాక వారి తల్లిదండ్రులు పిల్లలను ఆస్పత్రులకు తీసుకెళ్లి టీకాలు వేయించాలి. భవిష్యత్తులో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ముప్పు ఉండదు. జిల్లాలో 3,980 మంది కిశోర బాలికలు ఉన్నట్లు గుర్తించాం. వేసవి సెలవుల్లో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. – సీతారాం, డీఎంహెచ్వో -
షెల్టర్ లేక.. రోడ్డుపై నిరీక్షణ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు మండే ఎండల్లోనే నిరీక్షిస్తున్నారు. కూర్చునేందుకు కనీసం బెంచీలు లేక వృద్ధులు, మహిళలు, చిన్నారులు వేడి, ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఈ మార్గం గుండా బెజ్జూర్, దహెగాం, పెంచికల్పేట్, కౌటాలకు నిత్యం బస్సులు నడుస్తుంటాయి. మార్కెట్లో వివిధ పనుల నిమిత్తం వచ్చే రైతులు, విద్యార్థులు ఇక్కడే వేచి చూస్తుంటారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండటంతో తట్టుకోలేని కొందరు సంచులతో రోడ్డు పక్కన కింద కూర్చుకుంటున్నారు. ‘బస్సు రావడానికి అరగంట పట్టినా ఇక్కడే ఎండకు మాడాల్సిందే’ అంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి ఇదే సమస్య ఉన్నా మున్సిపల్, ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కనీసం తాత్కాలిక షెడ్డు నిర్మించాలని కోరుతున్నారు. -
హెచ్పీవీపై అనాసక్తి!
వాంకిడి: గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించింది. జిల్లావ్యాప్తంగా వసతి గృహాలు, హైస్కూల్స్, అంగన్వాడీల రికార్డుల ప్రకారం జిల్లాలో 3,980 మంది కిశోర బాలికలు ఉన్నట్లు గుర్తించి.. జిల్లాలోని 24 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంచారు. అయితే వైద్యారోగ్యశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా బాలికలు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడానికి అనాసక్తి చూపుతున్నారు. నెల దాటినా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 10.5 శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారు. 3,980 మంది కిశోర బాలికలుభవిష్యత్తులో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు ప్రభుత్వం హెచ్పీవీ వ్యాక్సినేషన్ను చేపడుతోంది. వైద్యారోగ్య శాఖ అధికారులు జిల్లాలో 14– 15 ఏళ్ల బాలికలు 3,980 మంది ఉన్నట్లు గుర్తించి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు ఏఎన్ఎంలు, ఆశలు, అంగన్వాడీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అయినా టీకాలు తీసుకునేందుకు బాలికలు ముందుకు రావడం లేదు. మార్చి 8న ప్రారంభమైన ఈ కార్యక్రమం నెల గడిచి 12 రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు 419 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 10.5 శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారు. బాలికల్లో సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. చాలామంది బాలికలు పాఠశాలల్లోనే ఉన్నారు. 9, 10వ తరగతి చదువుకుంటున్న బాలికలు చాలా మంది హాస్టళ్లలో ఉన్నారు. మార్చి నుంచే వార్షిక పరీక్షల హడావుడి ప్రారంభం కాగా బాలికలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. పరీక్షల సమయంలో వ్యాక్సిన్తో ఏదైన అనారోగ్యం బారిన పడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ప్రకటించనున్నారు. దీంతో టీకాల లక్ష్యం త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.ప్రయోజనాలెన్నో..హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మహిళలు కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ల బారినపడి వాటిని గుర్తించలేకపోతారు. సుదీర్ఘ కాలంగా చికిత్స చేయించుకోకపోవడంతో అది కాస్తా క్యాన్సర్కు దారి తీసే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా మహిళలు అనారోగ్యం బారిన పడుతుంటారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ జిల్లాలోని అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. ఇదే వ్యాక్సిన్ బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అందుబాటులో ఉండగా.. ఒక్క టీకా సుమారు రూ.4000 నుంచి రూ.5000 వరకు ఉంటుంది. ఉచితంగా అందుబాటులో ఉన్న టీకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. -
22 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీ పరిరక్షణ, సమస్యల సాధనకు ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన ఆదివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉచిత బస్సు పథకం కింద నెలకు రూ.400 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బెడ్ విన్నర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, అద్దె బస్సు డ్రైవర్లను సంస్థలో విలీనం చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని కోరారు. ట్రేడ్ యూని యన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు దివాకర్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, జేఏసీ నాయకులు సాంబశివ్రావు, మధుకర్, తులసీరాం, శంకర్, కృష్ణ, నారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లోకి మాజీ ఎంపీపీ
కౌటాల: కౌటాల మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్ శనివారం హైదరాబాద్లో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని మంత్రి సూచించారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రానున్న ‘పరిషత్’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారు. పార్టీ నాయకులు అర్షద్ హుస్సేన్, సదన్రెడ్డి తదితరులున్నారు. -
జనగణనకు రెడీ
కెరమెరి: దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి జిల్లాలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జనగణనను సమగ్రంగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులను శనివారం ప్రా రంభించింది. మూడు దశల్లో శిక్షణ తరగతులు ని ర్వహించనుంది. జనగణనలో ఎలాంటి లోపాలు త లెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నా రు. మొదటి దశ శిక్షణ తరగతులు ఈ నెల 18, 20, 21తేదీల్లో, రెండోవిడత 24, 25, 26తేదీల్లో, మూ డోవిడత మే 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో ఇళ్ల గణనజనగణన–2026లో భాగంగా మొదటి దశలో ఇళ్ల గణన చేపట్టనున్నారు. ఇందులో మొదటిసారిగా స్వీయ గణన ప్రవేశపెట్టారు. కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుంచైనా పోర్టల్లో వివరాలు నమోదు చేయవచ్చు. ఆధునిక సమగ్ర డేటా సేకరణకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అధికారులు ఐడీని జనరేట్ చేసి ఎన్ఎంఎఫ్, ఈ మెయిల్ ద్వారా అందిస్తే ఎన్యుమరేటర్ పరిశీలిస్తారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి శిక్షణ ప్రారంభించగా జిల్లా స్థాయిలో టెక్నికల్ అసిస్టెంట్ను నియమించారు. మున్సిపల్ స్థాయిలో కమిషనర్ను, మండల స్థాయిలో సెన్సెస్ చార్జ్ (తహసీ ల్దార్, ఎంపీడీవో) లను నియామకం చేశారు. 750 నుంచి 800 మంది జనాభాకు ఆరుగురు ఎన్యుమరేటర్లు, ఒక సూపర్వైజర్ను కేటాయించారు. ఒక ఎన్యుమరేటర్ను ఒక బ్లాక్గా విభజించారు. పథకాల అమలు కోసమే.. జనగణన సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్లు కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించనున్నారు. ఈ సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేసి భద్రపరచనున్నారు. గిరిజన ప్రాంతాలు, దూర ప్రాంతాల్లోనూ జనగణన సజావుగా సాగేందుకు అ వసరమైతే అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నారు. ప్రతీ దశలో పర్యవేక్షణ వ్యవస్థను బలో పేతం చేసి డేటా కచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీంతో జనగణన ద్వారా ప్రభుత్వం వ ద్ద సరైన డేటా, గణాంకాలు లభించే అవకాశముంది. ఈ డేటా ద్వారా సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు కూడా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే మే 11నుంచి అధికారికంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఒక్క ఇల్లు వదలకుండా..ఎన్యుమరేటర్ పరిధిలో ఉన్న ఒక్క ఇంటిని కూడా వదలకుండా సర్వే చేపట్టనున్నారు. ఇప్పటికే అధికా రులు వార్డుల వారీగా మ్యాప్లను సిద్ధం చేశారు. వాటి ఆధారంగానే ఎన్యుమరేటర్ బ్లాక్లను విభజించారు. హెచ్ఎల్వో యాప్ ద్వారా ఓ మ్యాప్ను ఎన్యుమరేటర్ భవనాలు, రోడ్లు, వీధులను చూపిస్తూ పటాన్ని గీస్తారు. అన్ని ఇళ్ల వివరాలు నమోదు చేస్తారు. జనగణన చట్టం 1948 ప్రకారం సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ఆర్టీఐ చట్టం–2005 ప్రకారం బహిర్గతం చేయరాదని అధికారులు చెబుతున్నారు. ఇల్లు లేని వారిని రెండోదశలో..బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, ఫుట్పాత్లపై, ఫ్లైఓవర్ల కింద, ప్రార్థనాస్థలాలు, మండపాలు, రైల్వే ప్లాట్ఫాంలు తదితర ప్రదేశాల్లో నివసించే వారిని రెండో దశలో లెక్కించనున్నారు. ఇళ్ల జాబితా ప్రకారం బ్లాక్లోని ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్ల నంబర్లు కేటాయిస్తారు. డిజిటల్ పద్ధతిన ఈ నంబర్లు వేస్తారు. వరుసక్రమంలో కేటాయింపు ఉంటుంది. కాగా, పంప్హౌస్లు, దేవాలయాలు, జ్ఞాన మందిరాలు, పొలాల్లో కట్టిన గుడిసెలకూ నంబర్లు కేటాయిస్తారు. 34రకాల వివరాలు మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఇంటి స్థితి, తాగునీరు, దంపతుల వివరాలు, మరుగుదొడ్డి, మురుగునీటి పారుదల, ఎల్పీజీ కనెక్షన్, వంట గది, రేడియో, టెలివిజన్ ఇంటర్నెట్ సదుపాయం, ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్, నాలుగు చక్రాల వాహనాలు తదితర వివరాలు నమోదు చేయనున్నారు. రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం అధికారులు వివరాలుఎన్యుమరేటర్లు 1,168సూపర్వైజర్లు 174ఫీల్డ్ అధికారులు 20సెన్సెస్ క్లర్కులు 17సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లు 17టెక్నికల్ అసిస్టెంట్లు 20ఎంపీడీవోలు 15 -
‘బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాలి’
ఆసిఫాబాద్: తెలంగాణ తల్లి మనోభావాలు దెబ్బ తీసేలా, అమరుల త్యాగాలను అవమానించేలా లో క్ సభలో వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూ ర్య క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏఎంసీ చైర్పర్సన్ ఇ రుకుల్ల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, పా ర్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన తప్పుడు వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సూర్య వ్యా ఖ్యలపై కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం వహించడం దురదృష్టకరమని విమర్శించారు. తేజస్వి సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు మహిళలకు సరైన ప్రాతినిథ్యం కల్పించిందని, దీనిపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. డీలిమి టేషన్తో సంబంధం లేకుండా మహిళా బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ చౌక్ వద్ద ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గ డ్డల సత్తయ్య, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, పార్టీ నాయకులు తారిక్, తిరుపతి, సుధాకర్, జావిద్, మారుతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


