breaking news
Kumuram Bheem District News
-
పట్టణంలో సమస్యలా..!
● ఫోన్ చేయండి.. ● మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాల్టీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ ఏ.రాజేందర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ బుధవారం నిర్వహించనుంది. తాగునీరు, డ్రెయినేజీ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు.తేదీ: 16.07.2025(బుధవారం) సమయం: ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సంప్రదించాల్సిన నంబర్లు : 63006 88040, 99089 42431 -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తానూరు: మండలంలోని బోంద్రట్లో ఈ నెల 13న పట్టపగలు గ్రామానికి చెందిన జగ్మే సవిత్రిబాయి, నారాయణ్ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పోలీస్స్టేషన్లో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సోన్కాంబ్లె రాహుల్ ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి రూ.70 నగదు, పదమూడున్నర గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి దొంగిలించాడు. బోంద్రట్ ఎక్స్రోడ్డు సమీపంలోని హైవే పక్కన పొదలో గుంతతవ్వి అందులో దాచి పెట్టాడు. ఎస్సై షేక్ జుబేర్ నిందితుడిని వేలిముద్రల ఆధారంగా పట్టుకున్నాడు. నిందితుని వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్య.. వైద్యం.. విజ్ఞానం
● ఒకేచోట సేవలు అందేలా మల్టీపర్పస్ కేంద్రాలు ● ‘పీఎం జన్మన్’లో భాగంగా జిల్లాకు 23 సెంటర్లు ● ఒక్కో సెంటర్కు రూ.60 లక్షలు ● అన్ని హంగులతో లింబుగూడ కేంద్రం ముస్తాబు ● నేడు ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రివాంకిడి(ఆసిఫాబాద్): పీవీటీజీ గిరిజనుల సమగ్రాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జన్మన్ పథకం కింద మల్టీపర్పస్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 23 పీవీటీజీ గ్రామాలకు మల్టీపర్పస్ సెంటర్లు మంజూరు చేసింది. వాంకిడి మండలం లింబుగూడలో ఇప్పటికే పనులు పూర్తికాగా.. అధికారులు ప్రారంభానికి సిద్ధం చేశారు. బుధవారం లింబుగూడ మల్టీపర్పస్ కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి హర్హ్ మల్హోత్రా ప్రారంభించనున్నారు. ఒకేచోట సదుపాయాలువిభిన్న జీవన శైలి, తక్కువ జనాభా, స్వతంత్ర ఆర్థి క వ్యవస్థ(వేట, సేకరణ), నిలకడ లేని ఆరోగ్యం, విద్యాస్థాయిలతోపాటు ఇతరులతో పోలిస్తే ఎక్కువ పేదరికం అనుభవిస్తున్న గిరిజనులను కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ సమూహంగా గుర్తించి వారి సమగ్రాభివృద్ధి కృషి చేస్తోంది. పీవీటీజీ గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపించడం, దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో 2023లో పీఎం జన్మన్ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద మల్టీపర్పస్ కేంద్రాలు నిర్మిస్తోంది. విద్యతో పాటు వైద్యం, విజ్ఞానం, ఆర్థికాభివృద్ధి సాధించేలా ఒకేచోట సౌకర్యాలు కల్పించనున్నారు. భవనాన్ని అత్యంత ఆధునిక విధానంలో ఆకర్షణీయంగా ని ర్మిస్తున్నారు. భవనం లోపల అంగన్వాడీ కేంద్రం, ఏఎన్ఎం(హెల్త్ సెంటర్) కేంద్రం, కంప్యూటర్ ల్యా బ్, ఆఫీస్ రూంలు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే మధ్యలో గోళాకారంలో ఒక హాల్ నిర్మించా రు. భారీ ప్రొజెక్టర్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. గోడల ను రంగులతో అందంగా గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా గుస్సాడీ, దేవర, తునికాకు సేకరిస్తున్న మహిళ, వాయిద్యాలు, వన్యప్రాణుల చిత్రాలతో తీర్చిద్దారు. పాఠశాల విద్యార్థులకు ఏఐ బోధన, ప్రొజెక్టర్ ద్వారా విజ్ఞాన బోధన అందించనున్నా రు. ఒకేచోట విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి. పనుల్లో నాణ్యతలేమి..!ఆసిఫాబాద్ డివిజన్లో పీవీటీజీలు ఉన్నందున మొత్తం 23 మల్టీపర్పస్ కేంద్రాలు నిర్మిస్తున్నారు. అందులో మూడు టెండర్ దశలో ఉండగా.. మిగిలినచోట పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం రూ.60 లక్షలు వెచ్చిస్తుంది. అయితే అందంగా కనిపిస్తున్న భవనాలను క్షుణ్నంగా పరిశీలిస్తే నాణ్యతలేమి బహిర్గతమవుతోంది. వాంకిడి మండలం లింబుగూడ కేంద్రంలో కిటికీలు ప్రారంభానికి ముందే ఊగుతున్నాయి. భవనం ముందు ఏర్పాటు చేసిన మెట్ల టైల్స్ దెబ్బతిన్నాయి. వరండా సైతం పగుళ్లు తేలింది. కొన్నిరోజుల క్రితం వర్షాలకు వరండాలో సిమెంట్ పైకి లేచింది. జిల్లా అధికారులు గమనించడంతో తిరిగి మరమ్మతు చేయించినట్లు తెలుస్తోంది. ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన తలుపు సక్రమంగా లేదు. ప్రస్తుతం భవనానికి పెయింట్ చేసి చిత్రాలు అద్దడంతో లోపాలు బహిర్గతం కావడం డం లేదని తెలుస్తోంది. జిల్లాలోని మిగితా గ్రామాల్లో కేంద్రాల నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. మండలాల వారీగా కేంద్రాలు మంజూరైన గ్రామాలుఆసిఫాబాద్ : బండగూడ, సల్పలగూడ, బనార్గూడ, వడిగోంది(ఎన్), కుటోడ(కె) ఎర్రగుట్ట, శాకన్గొంది, గుట్టచెల్మ, కౌడియాన్ మొవాడ్, అడఘాట్ వాంకిడి : మన్నెగూడ, లింబుగూడ, ఎనగోంది, సడక్గూడ, చౌపన్గూడ కెరమెరి : చింతగూడ, కొలాంగూడ, కొలాంగూడ(అగర్వాడ) తిర్యాణి : కొలాంగూడ(మంగీ), రెబ్బెన : కొలాంగూడ(గోలేటి) లింగాపూర్ : ములగూడ, రింగారిట్ జైనూర్ : పానపటార్ నేడు లింబుగూడలో ప్రారంభంకేంద్ర సహాయ మంత్రి హర్హ్ మల్హోత్రా బుధవారం తిర్యాణి మండలం సుంగాపూర్లో పర్యటించి.. అ క్కడి నుంచి జన్కాపూర్ పాఠశాలను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి సరాసరి మధ్యాహ్నం 12.30 గంటలకు వాంకిడి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం లింబుగూడలో పీఎం జన్మన్ పథకంలో భాగంగా నిర్మించిన మల్టీపర్పస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.నైపుణ్యాభివృద్ధికి దోహదం మల్టీపర్పస్ కేంద్రాలు గిరిజనులకు విద్య, వైద్యంతోపాటు నైపుణ్యాభివృద్ధికి దోహదపడతాయి. ఈ కేంద్రాల ద్వారా ఒకేచోట విద్య, వైద్యం అందిస్తారు. ఏఐ బోధన, ఇంటర్నెట్ పరిజ్ఞానం కల్పించేందుకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తారు. జిల్లాలో మొత్తం 23 కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తాం. సమీప గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రమాదేవి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిరూ.60 లక్షలతో నిర్మాణం పీఎం జన్మన్ పథకంలో భాగంగా పీవీటీజీ గ్రామాల్లో రూ.60 లక్షలతో మల్టీపర్పస్ భవనాలు నిర్మిస్తున్నాం. అంగన్వాడీ, ఏఎన్ఎం సెంటర్(హెల్త్ సెంటర్), కంప్యూటర్ గది, మరుగుదొడ్లు, ప్రొజెక్టర్ హాల్ వంటివి ఒకేభవనంలో వేర్వేరుగా ఉంటాయి. గిరిజనులకు మౌలిక వసతులు ఒకేచోట లభించనున్నాయి. జిల్లాలో మూడు కేంద్రాల పనులు పూర్తయ్యాయి. మరో మూడు టెండర్ దశలో ఉన్నాయి. మిగతా చోట్ల పనులు కొనసాగుతున్నాయి. నాణ్యతతో పనులు చేపడతాం. – జె.తానాజీ, టీడబ్ల్యూ ఈఈ -
తుంగమడుగుకు రోడ్డు వేయాలి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం తుంగమడుగు గ్రామానికి వెంటనే రోడ్డు వేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్ డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు పలు సమస్యల ను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పట్టణానికి ఆనుకు ని ఉన్నా తుంగమడుగు గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, గర్భిణులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మె ల్యే హరీశ్బాబు గెలిచిన తర్వాత రోడ్డు వేయిస్తానని చెప్పి.. ప్రస్తుతం పట్టించుకోవడం లేద ని ఆరోపించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి హైదరాబాద్ నుంచి రామోజీఫిల్మ్ సిటికి 40 కిలోమీటర్ల దూరానికి కూడా ప్రజల సొమ్ముతో హెలీకాప్టర్ వాడుకుంటున్నారన్నారు. రోడ్డు కోసం ధర్నా చేస్తే 30 యాక్టు అమలులో ఉందని, కేసులు పెడతామని పోలీసులు బెదిరించడం దారుణమన్నారు. అనంతరం గ్రామంలోని ఏకోపాధ్యాయ పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడారు. మూడో తరగతి విద్యార్థులకు ఒకటో తరగతి పుస్తకం కూడా చదవడం రావడం లేదన్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, వీధిలై ట్లు, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 15 రోజుల్లో రోడ్డు వేయని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహిస్తామని తెలిపారు. -
కేంద్ర పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎఫ్వో నీరజ్కుమార్, ఏఎస్పీ చిత్తరంజన్, కేంద్ర మంత్రి వ్యక్తిగత కార్యదర్శి భరత్తో కలిసి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులపై రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పథకాలు నిర్ణీత సమయంలో లబ్ధిదారులకు చేరేవిధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 117 ఆస్పిరేషనల్ జిల్లాలను గుర్తించగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సైతం ఆస్పిరేషన్ కింద ఎంపికై ందని తెలిపారు. నీతి ఆయోగ్ ద్వారా గిరిజనులకు అందుతున్న మౌలిక వసతుల కల్పన, పథకాలపై వివరాలు తెలుసుకునేందుకు ప్రతీ ఆస్పిరేషనల్ ప్రాంతంలో కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీ గిరిజనుల గ్రామాల్లో వసతులు, ఇళ్లు, తాగునీరు, రహదారులు, వైద్య సేవలు, సామాజిక భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జాతీయ జల్ మిషన్ కింద శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఉపాధిహామీ కింద వందరోజుల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. పీఎం గ్రామీణ సడక్ యోజన కింద ఎంపికై న రహదారులు పూర్తి చేయాలని, పీఎం సమ్మర్ యోజన, పీఎం కిసాన్ కింద అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద 3500 పీవీటీజీ కుటుంబాలకు నివాస గృహాలు నిర్మించాలని సూచించారు. స్వాగతం పలికిన జిల్లా అధికార యంత్రాంగంరెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్లోని సింగరేణి గెస్ట్ హౌస్ వద్ద కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్ ఘన స్వాగతం పలికారు. ఎస్పీ పుష్పగుచ్ఛం అందించారు. పోలీస్ సిబ్బంది కేంద్ర సహాయ మంత్రికి గౌరవ వందనం చేశారు. కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష లైబ్రరీ సందర్శన శ్యామాప్రసాద్ ముఖర్జీ మిషన్ కింద నిర్మించి న జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కేంద్ర సహా య మంత్రి హర్ష్ మల్హోత్రా సందర్శించారు. రీడింగ్ గదులు, లైబ్రరీ గది, మినరల్ వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు తెలుసుకున్నారు. అధికారులతో కలిసి గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జన్కాపూర్లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నాయని తెలిపారు. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి గ్రామంలో జాతీయ జల్జీవన్ మిషన్ కింద నిర్మించిన శుద్ధ నీటి ట్యాంకు పరిశీలించారు. గ్రామంలోని ఇగురపు లక్ష్మి ఇంటిని సందర్శించి.. శుద్ధజలం సరఫరాపై ఆరా తీశారు. ఈ సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్వో సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అండర్ ట్రయల్ కేసులపై సమీక్ష
ఆసిఫాబాద్రూరల్: అండర్ ట్రయల్ కేసులపై జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మంగళవారం సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, డీఎస్పీ రామానుజంతో కలిసి సమీక్ష నిర్వహించారు. అండర్ ట్రయల్ కేసులకు సంబంధించి కక్షిదారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారం కృషి చేయాలని సూచించారు. చార్జ్షీట్ వేసిన, వేయని కేసుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. బెయిల్ మంజూరైన వెంటనే నిబంధనల మేరకు నిందితులను విడుదల చేయాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ జైలర్ ప్రేమ్కుమార్, డీసీఆర్బీ ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దిందాలో మళ్లీ పోడు రగడ
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని దిందా గ్రామంలో మళ్లీ పోడు రగడ చోటు చేసుకుంది. దిందా శివారులోని బందెపల్లి బీట్ వద్దకు మంగళవారం ఆయా రేంజ్లకు చెందిన అధికారులు చేరుకున్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. కొంతమేరకు మొక్కలు నాటగా.. విషయం తెలుసుకున్న పోడు రైతులు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారులు గతంలో తమకు భూములు ఇస్తామని ప్రకటించారని, ఏకపక్షంగా అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. తమ పొట్టకొట్టేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఈ క్రమంలో మొక్కలు నాటేందుకు వెళ్తున్న అధికారులు, సిబ్బందిని అడ్డుకున్నారు. కొంతమేర మొక్కలు నాటిన అనంతరం అధికారులు వెనుదిరిగారు. -
అజ్ఞాతం వీడుతున్నారు..!
● జనంలోకి మావోయిస్టులు ● ఉమ్మడి జిల్లా నేతల లొంగుబాటు ● ఆపరేషన్ కగార్తో పంథా మారిన వైనంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఇప్పటికీ కొందరు దశాబ్దాలుగా కుటుంబ సభ్యులు, సొంతూరును విడిచి అడవుల్లోనే గడుపుతున్నారు. రోజు రోజుకు పోలీసు బలగాలు అడవులు, మావోయిస్టు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా ఉద్యమానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరుతున్నారు. తాజాగా మావోయిస్టు దంపతులు అజ్ఞాతం వీడగా.. ఊరిలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఉనికిని కోల్పోతున్న పార్టీనిత్యం పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఘర్షణ నుంచి నేడు పార్టీ ఉనికే లేకుండాపోయే రోజులొచ్చాయి. గడచిన ఏడాదిలోనే పార్టీ వేగంగా క్షీణిస్తోంది. కేంద్ర కమిటీలో పని చేసిన కటకం సుదర్శన్ ఉరఫ్ ఆనంద్(69) మొదలు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలీ జిల్లా ఇన్చార్జి కాసర్ల రవి ఉరఫ్ అశోక్, కంతి లింగవ్వతోపాటు అనేక మంది సీనియర్లను పార్టీ కోల్పోయింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు చనిపోయారు. గత నెల 6న రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం కమిటీ ఇన్చార్జి మైలరాపు అడెల్లు ఉరఫ్ భాస్కర్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆయనపై రూ.45లక్షల రివార్డు ఉంది. దళంలోనే ఒక్కటై..తాజాగా లొంగిపోయిన మావోయిస్టులు లచ్చన్న, అంకుబాయి అప్పట్లో క్రియాశీలకంగా ఉన్న సిర్పూర్ దళంలోనే పని చేస్తూ ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లికి చెందిన లచ్చన్న 1983లో పీపుల్స్వార్ గ్రూప్ చెన్నూరు దళంలో చేరారు. 2002లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2007లో నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సాంకేతిక విభాగం ఇన్చార్జిగా పని చేశారు. 2023నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. ఈయనపై పలు పోలీసుస్టేషన్లలో 35కేసులు ఉన్నాయి. మిగిలిందెందరు?గతంలో అనేకమంది ఉమ్మడి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పని చేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదిలోపే చేరింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు కీలక హోదాల్లో ఉన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లికి చెందిన ఇర్రి మోహన్రెడ్డి, సెంట్రల్ పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీలో సాంకేతిక విభాగంలో ఉన్నారు. మరో ముఖ్య నేత మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ ఉరఫ్ దాదా సింగరేణి కోల్బెల్ట్ కమిటీ చూస్తున్నారు. ఈయనను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్లుగా సమాచారం. అలాగే ఈయన సహచరులుగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు ఎన్కౌంటర్లో మరణించారు. సలాకుల సరోజ, జాడి వెంకటి, పుష్పలత ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అన్న వచ్చిన 37ఏళ్లకు..కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చౌదరి అంకుబాయి 1988లో తన అన్న చిన్నన్నను కలిసేందుకు వచ్చి పార్టీలోకి వెళ్లింది. పీపుల్స్వార్ సిర్పూర్ దళ సభ్యురాలిగా చేరి, ఆ సమయంలోనే ఆత్రం లచ్చన్నను పెళ్లి చేసుకుంది. 1995లో లచ్చన్నతో పట్టణ ప్రాంతానికి బదిలీ కాగా, 2002లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సాంకేతిక విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం నార్త్ బస్తర్ డివిజనల్ కమిటీ టెక్నికల్ విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఈమైపె 14కేసులు ఉన్నాయి. అయితే అన్న కోసం అడవికి వెళ్లిన అంకుబాయి చిన్నన్న కొన్నేళ్ల క్రితమే లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. చెల్లె మాత్రం గత 37ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయింది. -
బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం
● దరఖాస్తులు కోరుతున్న కేంద్రం ● గరిష్టంగా రూ.25 వేలు అందజేత ● ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులకు ప్రయోజనంనిర్మల్చైన్గేట్: బీడీ కార్మికుల పిల్లలు చదువులో రాణించేలా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేయూతనిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.25 వేలు అందజేస్తూ వారి ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులు 75,200 మంది ఉన్నారు. ఆయా కుటుంబాలకు చెందిన విద్యార్థులు సుమారు లక్షా 20 వేల మంది వివిధ స్థాయిల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా పథకం కింద దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందనున్నారు. దరఖాస్తు గడువు.. అర్హులైన విద్యార్థులు http:// scholarship. gov. in వెబ్సైట్లో సంబంధిత వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతపరచాలి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, తదితర వృత్తి విద్యా కోర్సులు, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, సందేహాల నివృత్తికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ చౌరస్తాలో గల బీడీ కార్మికుల ఆస్పత్రిలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అవగాహన లేమి.. బీడీ కార్మికుల పిల్లలకు జాతీయస్థాయిలో ఉపకార వేతన స్కీం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అ యినా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు, కొన్ని సందర్భాల్లో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, దరఖాస్తు అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యల వల్ల చాలామంది ఉపకార వేతనం పొందలేకపోతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు అప్లోడ్ కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా బీడీ కార్మికుల పిల్లల కోసం కేంద్రం ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. దీనిపై ప్రచారం కల్పించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీడీలు చుడుతున్న మహిళా కార్మికులుఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా బీడీ కార్మికులు నిర్మల్ 70,000 ఆదిలాబాద్ 3,000 కుమురంభీం 1,500 మంచిర్యాల 700 మొత్తం 75,200సద్వినియోగపర్చుకోవాలి బీడీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏటా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలి. – డాక్టర్ మహేష్, బీడీ కార్మిక ఆస్పత్రి వైద్యాధికారి, నిర్మల్ అర్హతలు పదోతరగతి, ఇంటర్లో నేరుగా ఉత్తీర్ణులై ఉండాలి. సప్లిమెంటరీ విద్యార్థులు అనర్హులు. దూరవిద్య అభ్యసించిన వారు అనర్హులు. తండ్రి లేదా తల్లికి పీఎఫ్ గుర్తింపు కార్డు తప్పనిసరి. కుటుంబ ఆదాయం నెలకు రూ.10వేల లోపు ఉండాలి. జత చేయాల్సిన పత్రాలు 2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం. విద్యార్థి పేరిట బ్యాంక్ ఖాతా గత సంవత్సరం చదివిన తరగతి, కోర్సుకు సంబంధించిన మార్కుల మెమో ఉపకార వేతనం (రూ.ల్లో) తరగతి స్కాలర్షిప్ 1 నుంచి 4 1,000 5 నుంచి 8 1,500 9 నుంచి 10 2,000 ఇంటర్ 3,000 డిగ్రీ, పాలిటెక్నిక్, ఇతర వృత్తి విద్యాకోర్సులు 6,000 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ 25,000 -
గల్ఫ్లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతి మామడ: కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లిన వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. మండలంలో ని పొన్కల్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ (46) ఆరునెలల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. కంపెనీలో ఉద్యోగం లభించిందని కుటుంబ స భ్యులకు కొన్నిరోజుల క్రితం ఫోన్చేసి చెప్పడంతో సంతోషపడ్డారు. సోమవారం అబుదాబిలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు తీరుతా యని అనుకుంటున్న సమయంలోనే మృత్యు వు గుండెపోటు రూపంలో కబలించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అబుదాబిలోని హెల్పింగ్ హాండ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నిర్మల్టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంది న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థా నికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జిల్లా పద్మశాలి సంఘం సమన్వయకర్త, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ కోకన్వీనర్ ఆడెపు భూమన్న (61) సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలో కాలినడకతో రోడ్డు డివైడర్ను దాటే క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం!
మంచిర్యాలక్రైం: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రాంనగర్కు చెందిన సెటిపెల్లి శ్రీనివాస్ వద్ద కలీమ్ ఐదు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లించడంలో జాప్యం జరగడంతో కాలేజ్రోడ్ ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ షఫీ ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా సోషనల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన కలీమ్ ఆటోస్టాండ్ వద్ద ఆలౌట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఫిర్యాదు రాలేదన్నారు. ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యతలమడుగు: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు సుంకిడి గ్రామానికి చెందిన గంగాధర నందిని (19) ఆదిలాబాద్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్లుగా మానసిక స్థితి సరిగాలేదు. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకుని కనిపించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బేలలో యువకుడు..బేల: మండల కేంద్రంలోని కుమురం భీం కాలనీకి చెందిన కుడిమెత రాంచందర్ (30) ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు రాంచందర్ కుటుంబంలో కొన్నిరోజులు గా కలహాలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంట్లో భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. చనిపోతానని తాడు తీసుకుని బయట కు వెళ్లాడు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఓ చెట్టు కొ మ్మకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య ల క్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మధుకృష్ణ తెలిపారు. మనస్తాపంతో మరొకరు..తానూరు: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు బామ్ని గ్రామానికి చెందిన కోతిమీర గౌతం (35) కొంతకాలంగా మద్యానికి బానిసై ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యలు పుష్పలత, అర్చన, కుమార్తె ఉన్నారు. లింబగూడలో ఇంటర్ విద్యార్థి..సిర్పూర్(టి): మండలంలోని లింబగూడలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సుర్పం శేఖర్ (17) సిర్పూర్లోని ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. ఆసిఫాబాద్లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఈ నెల 11న ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని చెప్పగా పోనని ఇంటివద్దే ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి సుర్పం యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
నవోదయలో ఆటలపోటీలు
● 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడలు ● రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు రాక కాగజ్నగర్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు చదువుతో ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం పీఈటీలు విద్యార్థులకు క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో నేషనల్ స్థాయి క్రీడల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల క్లస్టర్స్థాయి పోటీలు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కాగజ్నగర్లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో జరగనున్నాయి. జరుగనున్న ఈవెంట్స్ అండర్ 14, 17, 19 విభాగంలో హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒక్కో క్రీడలో 6 టీంలుగా 18 జట్లు క్రీడల్లో పాల్గొనున్నాయి. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 29, 31 తేదీల్లో కేరళలో జరిగే రీజినల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రపదేశ్, కేరళ జట్లు పాల్గొననున్నాయి. చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పీఈటీలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల కిత్రం కరుణాకర్, హరీష్నాయక్, నిశ్విత్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – రేపాల కృష్ణ, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయం, కాగజ్నగర్ -
● 8 మందికి గాయాలు
బొలెరోను ఢీకొట్టిన కారు●రెబ్బెన: మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై బొలెరోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. సిర్పూర్ (టి) రైల్వేస్టేషన్లో పనిచేస్తున్న సాగర్ సోమవారం విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భార్య అరుణ, కుమారులు విశ్వక్రాజ్, విహాన్ రాజ్లతో కలిసి బొలెరో వాహనంలో బయలుదేరాడు. రెబ్బెన మండల పరిధిలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో రెడిమిక్స్ ప్లాంట్ వద్దకు చేరుకోగా రెబ్బెన వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్కారు అతివేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులు, డ్రైవర్ సంతోష్కు, షిప్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులను రెబ్బెన పీహెచ్సీ తరలించి ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలించారు. సాగర్ సోదరుడు రజినికాంత్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ వినాయక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణాలు కాపాడి.. కుటుంబ సభ్యులకు అప్పగించి
లోకేశ్వరం: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని బ్లూకోల్ట్ సిబ్బంది కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన పుసవర్ల శ్రీనివాస్ మంగళవారం పంచగుడి వంతెన వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100కు డయల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే బ్లూ కోల్ట్ సిబ్బంది సబ్ధర్ హుస్సేన్, ధన్రాజ్ అక్కడికి చేరుకుని అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈక్రమంలో మద్యానికి బానిసై ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గంజాయి కేసు నమోదునెన్నెల: గంజాయి సేవిస్తున్న యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. జెండావెంకటాపూర్ గ్రామ శివారు మామిడి తోటలో గంజాయి సేవిస్తున్నాడని తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఎస్కూరి శశికుమార్ను దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. అతడి వద్ద నుంచి 130 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. స్టేషన్కు తరలించి విచారించగా భీమారం మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి రాకేష్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. సెల్ఫోన్ పేలి యువకుడికి గాయాలుభీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన గంగాధర్ జేబులో ఉన్న సెల్ఫోన్ మంగళవారం అకస్మాత్తుగా పేలడంతో స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గంగాధర్ మహారాష్ట్రలోని బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో భోరజ్ హైవే వద్ద సెల్ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో స్వల్ప గాయాల పాలైన ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఓవైసీనగర్కు చెందిన షేక్ అహ్మద్, బంగాలగల్లీకి చెందిన సుల్తాన్ ఖాన్ స్థానిక గాంధీగంజ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై నవనీత్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 2.5 కిలోల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైందన్నారు. సమావేశంలో సీఐ జి గోపీనాథ్, ఎస్సై నవనీత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ అవినాష్కుమార్ -
ఆర్కే 5 గనిలో దొంగల బీభత్సం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు వ్యక్తులు గని ఆవరణలోని గోడదూకి స్క్రాప్, కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. గమనించిన సెక్యూరిటీ గార్డు పూర్ణ వెంకటేశ్ విజిల్ వేసి ఇతర సిబ్బందిని అలర్ట్ చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అలికిరి విని దొంగలు చీకట్లో దాక్కుకున్నారు. వెంకటేశ్ వారి వద్దకు వెళ్లడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. మిగతా సెక్యూరిటీ గార్డులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాళ్లతో దాడి చేశారు. దీంతో మధుకర్, కుమార్కు గాయాలయ్యాయి. ఇంతలో ఏసీటీఎస్ టీం సభ్యులు రావడంతో అందరూ కలిసి చాకచక్యంగా ముగ్గుర్ని పట్టుకోగా ఇద్దరు పరారయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డికి సమాచారం అందించగా ఆయన శ్రీరాంపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తక్షణమే స్పందించి కొద్ది గంటల్లోనే మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన నరేంద్ర, పవన్కుమార్, శివ, మునియప్ప, భూమయ్యపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా జీఎం ఎం శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి అభినందించారు. -
‘కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి’
ఇంద్రవెల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టినట్లు ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ అన్నారు. జూన్ 23న చేపట్టిన చైతన్యయాత్ర మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు ‘రూపాయి దాని సమస్య పరిష్కర మార్గం’ అనే అంశంపై పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్కు ఇచ్చారని, దాని ఫలితంగానే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడిందని గుర్తు చేశారు. అంబేద్కర్ లేకుంటే ఆర్బీఐనే లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లక్ష మందితో పోస్ట్ కార్డులు రాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సోన్కాంబ్లే మనోహర్, వాగ్మరే కామ్రాజ్, కాంబ్లే ఉత్తం, బాలాజీ, మస్కే రాజువర్ధన్, పరత్వాగ్ సందీప్, సూర్యవంశీ ఉత్తం, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు. -
పస్తులుంటున్నా పట్టించుకుంటలేరు..
● మోదీ గారు ఇండియాకు రప్పించండి ● కువైట్లో మండల వాసి నరకయాతన ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ జన్నారం: ‘ప్రధాని మోదీ సార్ మూడు రోజుల నుంచి తిండి లేదు. పోలీసుస్టేషన్కు వచ్చిన సార్.. పోలీసులు పట్టించుకుంట లేరు. రెండేళ్ల క్రితం కువైట్ పోయిన.. రెండు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు.. తిండి లేదు, ఇంటికి పంపడం లేదు.. ఎండలు చాలా కొడుతున్నాయి.. సార్ నన్ను కాపాడండి..’ అంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య ప్రధానిని వేడుకుంటూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాంతయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ దేశం వెళ్లి కూలీ గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా యజమాని జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. జీతం రాకపోవడంతో తిండికి గోసైతందని, ఇండియాకు పంపివ్వమంటే పాస్పోర్టు ఇవ్వడం లేదని తెలిపాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పడానికి వెళ్తే మూడు రోజులుగా తిప్పించుకుంటున్నారని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అబుసుల్తాన్ అనే వ్యక్తి పాస్పోర్టు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని, తన నంబరును బ్లాక్లిస్టులో పెట్టాడని, రెండు నెలలుగా వేరేచోట పని చేయగా.. వారూ వెళ్లగొట్టారని పేర్కొన్నాడు. ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వం ఇండియాకు రప్పించాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. శాంతయ్యను రప్పించండి: కుటుంబీకులు శాంతయ్యను ఇండియాకు రప్పించాలని ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు గొర్రె శంకరయ్య, లక్ష్మీ, భార్య ప్రమీల, కుమారుడు సాయితేజ, కూతురు వైష్ణవి వేడుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్నామని, తమ కొడుకు ఏడుస్తూ వేడుకుంటుంటే తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
క్రీడాపోటీలకు హాజరు కావాలని ఆహ్వానం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని నవోదయ పాఠశాలలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర జవహార్ నవోదయ విద్యాలయాల క్లస్టర్స్థాయి పోటీలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ సోమవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబును ఆహ్వానించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల నవోదయ విద్యాలయాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. అండర్– 14, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. -
పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ
చింతలమానెపల్లి(సిర్పూర్): చింతలమానెపల్లి మండలం డబ్బా పంచాయతీ పరిధిలోని ధరంపల్లి గ్రామంలో సోమవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పర్యటించారు. ఈ సందర్భంగా నూతన పాఠశాల భవనానికి భూమిపూజ చేశారు. గ్రామంలో పాఠశాల సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగుతోంది. పాఠశాలకు కేటాయించిన స్థలం వివాదాస్పదంగా మారడంతో నిర్మాణం జరగలేదు. సబ్ కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించారు. రూ.15లక్షల చేపట్టే పనులు ప్రారంభించారు. తహసీల్దార్ మడావి దౌలత్, ఎంఈవో జయరాజ్, ఆర్ఐ విజయ్ పాల్గొన్నారు. -
రేపు మల్టీపర్పస్ కేంద్రం ప్రారంభం
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం లింబుగూడలో ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ కేంద్రాన్ని ఈ నెల 16న కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రారంభిస్తారని అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. లింబుగూడలోని మల్టీపర్పస్ కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పీఎం జన్మన్ పథకం కింద బహుళార్థక ప్రయోజన కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీప గ్రామాలకు చెందిన ప్రజలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలందించేందుకు ఈ కేంద్రం ఓ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ప్రారంభోత్సవానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయని తెలిపారు. -
అర్హత లేని వైద్యం..!
దహెగాం మండలం గెర్రెలోని ఆర్ఎంపీ బినయ్ సర్కార్ గత నెల 22న నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగపల్లి శ్రీనివాస్(36)కు తెలిసీతెలియని వైద్యం అందించాడు. చికిత్స అందిస్తుండగానే శ్రీనివాస్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాధితుడిని ఆర్ఎంపీ తన కారులో ఎక్కించుకుని ఓ చోట రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించాడు. 108కు సమాచారం అందించి అక్కడి నుంచి పరారయ్యాడు. శ్రీనివాస్ మృతి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని జాడె పూజ(16)కు జ్వరం రావడంతో గతేడాది ఆగస్టు 10న ఆర్ఎంపీ వద్ద చికిత్స అందించారు. ఆర్ఎంపీ సైలెన్ బాటిల్ ద్వారా కొన్ని ఇంజక్షన్లు ఇస్తుండగానే పూజ తీవ్ర అస్వస్థతకు గురైంది. భయపడిన అతడు మధ్యలోనే వైద్యం నిలిపేశాడు. కుటుంబ సభ్యులు విద్యార్థిని వెంటనే చంద్రపూర్కు తరలించగా అక్కడ మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యం వికటించి గతేడాది అదే గ్రామానికి చెందిన కాళీదాస్ అనే యువకుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. ● రోగులకు ప్రాణ సంకటం ● క్లినిక్లలో ఆర్ఎంపీ, పీఎంపీల వైద్యం ● గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు ● చోద్యం చూస్తున్న జిల్లా అధికారులు -
పట్టణంలో సమస్యలా..!
● ఫోన్ చేయండి.. ● మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాల్టీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ ఏ.రాజేందర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ బుధవారం నిర్వహించనుంది. తాగునీరు, డ్రెయినేజీ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు.తేదీ: 16.07.2025(బుధవారం) సమయం: ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సంప్రదించాల్సిన నంబర్లు : 63006 88040, 99089 42431 -
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమం అధికారుల దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి జిల్లా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని రవిచంద్ర కాలనీకి చెందిన వొడ్నాల లలిత, ఆసిఫాబాద్ మండలం గోవింద్పూర్కు చెందిన వైరాగడే జగ్రూబాయి వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. పట్టా భూమిని అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్కు చెందిన కవిత మండల్ ఫిర్యాదు చేసింది. తనకు జారీ చేసిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాలో ఇతరుల ఆధార్ నంబర్ నమోదు కావడంతో ప్రభుత్వ రాయితీలు రావడం లేదని, దీనిని సవరించాలని కెరమెరి మండలం కరంజివాడకు చెందిన కుమ్రం లక్ష్మీబాయి కలెక్టర్కు విన్నవించింది. తన తండ్రి కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వమంటే కొంతమంది బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన కోవ దాదారావు కోరాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేయాలని బెజ్జూర్ మండలం సోమిని గ్రామానికి చెందిన గిరిజనులు దరఖాస్తు సమర్పించారు. 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమికి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలని బెజ్జూర్ మండలం మర్దిడి గ్రామానికి చెందిన జూంది ఈశ్వరయ్య కోరాడు. తన కుమార్తెకు రెబ్బెన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు ఇప్పించాలని కెరమెరి మండలం దేవుడిపెల్లికి చెందిన జాడి తిరుపతి దరఖాస్తు విన్నవించాడు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేగుడిసెకు నిప్పంటించి తరిమేశారు నాకు కుమారులు లేరు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 60 సెంట్ల భూమి ఉంది. నా భూమిని గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా పట్టా మార్పు చేయించుకున్నారు. భూమి కోసం ఇంట్లో పడుకుని ఉండగా గుడిసెకు నిప్పంటించి తరిమివేశారు. మూడేళ్లుగా తిరుగుతున్నాను. వెంటనే నాకు న్యాయం చేయాలి. – చాపిడి సోంబాయి, డబ్బా, మం.చింతలమానెపల్లి -
‘స్థానిక’ ఎన్నికల్లో మార్గదర్శకాలు పాటించాలి
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సోమవారం ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నిక మార్గదర్శకాలు, నిబంధనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డీపీవో, ఎంపీడీవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకానికి జాబితా రూపొందించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై సమీక్షలు నిర్వహించాలని, దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని ఆదేశించారు. వాగులు, ఒర్రెలు ఉప్పొంగిన సమయంలో బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిరాశ్రయులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థినులకు అభినందనఆసిఫాబాద్రూరల్: ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన జిల్లా కేంద్రంలోని బాబాపూర్ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలకు చెందిన హిమబిందు, బిక్కుబాయిని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి అభినందించారు. విద్యార్థినులు ఎవరెస్టు శిఖరం బేస్ పాయింట్ వద్దకు చేరుకుని జాతీయ జెండా ఆవిష్కరించారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుకన్య, డీఆర్డీవో దత్తరావు, డీడబ్ల్యూవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్కెరమెరి(ఆసిఫాబాద్): మాదక ద్రవ్యాల వినియోగం జీవితంతోపాటు కుటుంబం, భవిష్యత్తును నాశనం చేస్తుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా సోమవారం మండలంలోని మోడి బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత ప్రమాదకర మత్తు వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి ప్రభావంపై జిల్లాలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ మోసాలకు గురైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు. డ్రగ్స్ గురించి తెలిస్తే వెంటనే 1908 లేదా 87126 70551 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్ఎం ప్రేందాస్ పాల్గొన్నారు. -
నిర్వహణ భారం
కెరమెరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన పెంటపర్తి మీనా గత నెల 2న కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించింది. మూడు రోజులు పీహెచ్సీలోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ ఒకే రోజు తర్వాత ఇంటికి పంపించారు. మూడు రోజులపాటు భోజన వసతి కల్పించాల్సి ఉండగా.. ఒక్కపూట కూడా పెట్టలేదు. దీనిపై ప్రశ్నిస్తే నిధులు లేవని సిబ్బంది చెబుతున్నారని మహిళా కుటుంబ సభ్యులు వాపోయారు. జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్లకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏటా అందించే నిధులు ఆగిపోవడంతో క్షేత్రస్థాయిలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. నిధుల లేమితో రెండేళ్లు కనీస మరమ్మతులు చేపట్టడం లేదు. కెరమెరి(ఆసిఫాబాద్): వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తోంది. దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఒక్కో ఆస్పత్రిలో ప్రతిరోజూ 60 నుంచి 70కి ఓపీ తగ్గడం లేదు. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులు అందకపోవడంతో సౌకర్యాలు మెరుగుపడడం లేదు. హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ రెండేళ్లుగా నిలిచిపోవడంతో సిబ్బందితోపాటు రోగులు అవస్థలు పడుతున్నారు. 2023 నుంచి బంద్..జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. ఐదు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. హా స్పిటల్ డెవలప్మెంట్ కమిటీలకు కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ హెల్త్ మిషన్ కింద మంజూర య్యే నిధులు 2023 నుంచి విడుదల కాలేదు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి, వసతుల కల్పన పనులు ఆగిపోయాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏటా రూ.1.70 లక్షలు, కమ్యూనిటీ కేంద్రాలకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరు చేయాలి. రెండేళ్లుగా ఈ నిధులు రాకపోవడంతో చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. కూలీలకు జీతాలు, పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి వసతుల కల్పనకు కొన్నిచోట్ల అధికారులే సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఇతర వసతుల కల్పనకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు బిగించడం, భవనాలకు రంగులు వేయడం, కిటీకీలు, తలుపులకు మరమ్మతులు కూడా ఆగిపోయాయి. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. ల్యాబ్ నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులు, పేపర్ కొనుగోలు కూడా హెచ్డీఎస్ నిధులతోనే చేపట్టేవారు. అన్నం కూడా లేదు..ప్రసవాల కోసం ఆస్పత్రుల కోసం వచ్చే గర్భిణులు, ప్రసవం అయిన తర్వాత బాలింతల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ప్రసవాల సమయంలో మందుల కొనుగోలుకు ఒక్కో కేసులో రూ.1,600 చొప్పున ఖర్చు చేసేవారు. భోజనం ఖర్చుల కింద రూ.100 వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ కాన్పు అయితే మూడు రోజులు, సిజేరియన్ కేసులకు ఏడు రోజులపాటు బిల్లులు చెల్లించేవారు. ప్రస్తుతం ఇవేవీ రోగులకు అందడం లేదు. జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారులు లేవు. వాగులు, ఒర్రెలు దాటి వచ్చిన వారు ఆస్పత్రుల్లో కొద్దిరోజులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఆస్పత్రుల్లో బాలింతలకు భోజనం అందించడం లేదు. గర్భిణులు, బాలింతలు, వారి వెంట వచ్చిన బంధువులు బయటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అందని నిధులు రెండేళ్లుగా నిలిచిన హెచ్డీఎస్ ఫండ్స్ మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులునివేదిక పంపించాం రెండేళ్లుగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలకు ఎన్హెచ్ఎం స్కీం ద్వారా అందించే నిధులు నిలిచిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో నిధులు విడుదల అత్యవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వ ఆస్పత్రులకు అనారోగ్య కారణాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. నిధుల లేమి ప్రభావం ఆస్పత్రుల నిర్వహణపై పడుతోంది. – సీతారాం, డీఎంహెచ్వో -
పోడుకు సాగునీరు
● ఇందిర సౌర గిరి జలవికాసం పథకానికి శ్రీకారం ● గిరిజన రైతుల భూములకు బోర్వెల్తోపాటు సోలార్ విద్యుత్ సౌకర్యం ● జిల్లాలో తొలివిడతలో 1,101 మందికి లబ్ధితిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లాలోని పోడు భూములకు సాగు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిజనులు వ్యవసాయంలో రాణించేందుకు ఇందిర సౌర గిర జలవికాసం పథకం అమలు చేయనుంది. అటవీ భూములకు పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. వర్షాలే ఆధారం..జిల్లాలోని మెరుగైన నీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు దాదాపు వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. ఇక పోడు భూములు సాగు చేసే రైతులు ఏడాదిలో కేవలం ఒకే పంట పండిస్తున్నారు. మిగితా సీజన్లలో ఇతర పనులపై ఆధార పడుతుండగా, పొలాలు బీళ్లుగా ఉంటున్నాయి. దీంతో గిరిజన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పేరుతో పథకం అమలు చేయనుంది. అటవీ భూములను సాగు చేసుకుంటూ పోడు పట్టాలు ఉన్న రైతులను లబ్ధిదారులుగా గుర్తించనున్నారు. ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో పోడు భూముల్లో బోర్వెల్ వేసుకోవాలంటే అటవీశాఖ నుంచి విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అనుమతి లభించేంది కాదు. ప్రస్తుతం ప్రభుత్వమే సౌర విద్యుత్ ద్వారా మోటార్లు అందించనుంది. బోర్లు వేసేందుకు అవకాశం రావడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల కమిటీల ద్వారా ఎంపికఇందిర సౌర జలవికాసం పథకం అమలు కోసం మండల స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంపీడీవో చెర్మన్గా కొనసాగనుండగా.. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి కన్వీనర్గా ఉంటారు. వీరితోపాటు ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో ఏఈ, మండల వ్యవసాయ శాఖ అధికారి, భూగర్భ జల శాఖ, హర్టికల్చర్ అధికారి, ఫారెస్టు రేంజ్ అధికారి, ఉపాధిహామీ ఏపీవోలు సభ్యులుగా కొనసాగుతారు. మండల పరిధిలోని పోడు భూముల్లో కమిటీ సభ్యులు సర్వే నిర్వహించి బోర్వెల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నవాటిని గుర్తిస్తారు. అనంతరం భూములకు సంబంధించిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మండల కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత జిల్లా కమిటీకి పంపిస్తారు. జిల్లాస్థాయిలో ఈ పథకానికి కలెక్టర్ చైర్మన్గా, ఐటీడీఏ పీవో కన్వీనర్గా ఉంటారు. ఈ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన మండల కమిటీల ఏర్పాటుపై ఇటీవల కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.2.5 ఎకరాలకు ఒక యూనిట్జిల్లాలో అటవీహక్కు పత్రాలు కలిగిన పోడు రైతులు 25,091 మంది ఉన్నారు. వీరు 81,476 ఎకరాలను సాగు చేస్తున్నారు. మొదటి ఏడాది జిల్లాలోని 1,101 రైతులకు ఇందిర సౌర గిర జలవికాసం పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. 3,034 ఎకరాలకు నీటిసదుపాయం కల్పించాలని నిర్ణయించారు. మిగిలిన నాలుగేళ్లలో ఏడాదికి 5,710 రైతుల చొప్పున 18,281 ఎకరాలకు సాగునీటి వసతి అందుబాటులోకి రానుంది. జిల్లాలో ఐదేళ్లలో 23,939 మంది రైతులకు సంబంధించిన 76,159 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందిర సౌర గిరి జల వికాస పథకం కింద 2.5 ఎకరాలను ఒక్క యూనిట్గా ఎంపిక చేశారు. అర్హులైన రైతుకు 2.5 ఎకరాల కంటే తక్కువగా భూమి ఉంటే ఇద్దరు, ముగ్గురు రైతులను కలుపుకుని యూనిట్గా గుర్తించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో యూనిట్కు దాదాపు రూ.6 లక్షలవరకు నిధులు వెచ్చించనున్నారు. బోర్వెల్తో పాటు సౌర విద్యుత్ ద్వారా మోటార్ ఏర్పాటు చేసుకునే సదుపాయం కల్పిస్తారు. అలాగే ఉద్యావనశాఖ ఆధ్వర్యంలో డ్రిప్ సైతం అందిస్తారు. ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగనుంది. అర్హులను ఎంపిక చేస్తాం ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలు కోసం అన్ని మండలాల్లో అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సభ్యులు సర్వే నిర్వహించి అర్హత ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులను ఎంపిక చేసి గిరిజనులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్ దోత్రే, కలెక్టర్, ఇందిర సౌర గిరి జల వికాసం పథకం చైర్మన్ -
పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్
ఆసిఫాబాద్అర్బన్: అనారోగ్యంతో బాధపడు తూ మెరుగైన చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చులు, విద్య, ఇతర అత్యవసర అవసరాల కోసం ఆర్థిక సహాయం కోరినవారికి సీఎంఆర్ఎఫ్ గొప్ప అవకాశం అని అన్నారు. అర్హులకు సకాలంలో సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో ఆదివా రం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోట్నాక విజయ్, ఉపాధ్యక్షులుగా పుర్క ఉద్దవ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, లక్ష్మి, సుభాష్, కార్యదర్శి గా లక్ష్మణ్, సహాయ కార్యదర్శులుగా స్వప్న, ప్రవీణ్, హరికృష్ణ, తులసీదాస్, రవీందర్, కోశాధికారిగా మంగవతి, ఈసీ సభ్యులుగా జంగు, సాయిబాబా, యాదగిరి, విజయలక్ష్మి, చిన్నక్క, బరికిరావ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి సారంగపాణి పరిశీలకులు గా.. ఎన్నికల అధికారిగా వెంకటేశ్వర్రెడ్డి వ్య వహరించారు. గిరిజన క్రీడల అధికారి మీనా రెడ్డి ఎన్నికల నిర్వహణ పూర్తిచేశారు. కార్యక్రమంలో క్రీడాపాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు, రాజేశ్, వాసుదేవరావు, చంద్రశేఖర్రెడ్డి, విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, రవి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో అగ్రగామి..
● నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే ● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ● ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ● పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం ● నలుగురు మంత్రుల రాకతో పండుగ వాతావరణం మధిరతో సమానం..మంచిర్యాల జిల్లాను తన సొంత నియోజకవర్గం మధిరతో సమానంగా భావిస్తూ రాష్ట్రంలో రోల్మాడల్గా నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళ శక్తి సొలార్ ప్రాజెక్టు ప్రారంభోత్స వం అనంతరం మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లక్సెట్టిపేటలో 50 పడకల ఆస్పత్రి, కళాశాల భవన నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఎమ్మెల్యేప్రేమ్సాగర్రావు కోరినట్లుగా దండేపల్లి మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 220, 400 మెగావాట్ల సబ్స్టేషన్లు దశలవారీగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్దికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. దండేపల్లి/ జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: అభివృద్ధిలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంచిర్యా ల జిల్లా పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు పుష్కల అవకా శాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. లక్సెట్టిపేటలో నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిహ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టు, హాజీపూర్ మండలం వేంపల్లిలో 212 ఎకరాల్లో నిర్మించే దత్తసాయి ఇండస్ట్రీయల్ పార్కు, ఐటీ పార్కు, ఆటోనగర్ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధికి నాంది..మంచిర్యాలలో 300 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రీయల్, ఆటోనగర్ పార్కులను ఏర్పాటుతో అభివృద్ధికి నాంది పడిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మొదటి దశగా 240 ఎకరాల భూమిని సేకరించి, 212 ఎకరాల్లో ఈ పార్కుల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.30 కోట్ల నిధులను కేటాయించామన్నారు. ఇందుకు పరిశ్రమల శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పార్కుల ఏర్పాటుతో 2 వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు ప్రశంసించారు. నిధుల సేకరణ, అభివృద్ధి పనుల సరళీకరణలో ఆయన చూపిస్తున్న చొరవ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపే దిశగా సాగుతోందని తెలిపారు. ఆదర్శంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి..మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, మంచిర్యాలలో నిర్మించిన 650 పడకల సూపర్ స్పె షాలిటీ ఆస్పత్రిలో హైదరాబాద్తో సమానమైన సౌ కర్యాలతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకంగా అభివృద్ధి..ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపా రు. కళాకారులకు చేయూతనిస్తామని హామీ ఇచ్చా రు. రూ.2 కోట్లతో కళాభవనం నిర్మాణం చేపడతా మని తెలిపారు. హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రా మ పంచాయతీ పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో గాంధారీ ఖిల్లా సఫారీ కోసం రెండు నూ తన వాహనాలను మంత్రులు ప్రారంభించారు. వ నమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులకు అటవీ శాఖ అధికారులు జంతువుల ఫొటోలతో కూడిన ఫ్రేమ్లు జ్ఞాపికలుగా అందజేశారు. ప్రజల మద్దతుతో ముందుకు..మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల మద్దతు, నమ్మకంతోనే ముందుకు సాగుతున్నానని, వారి శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేస్తానని అన్నారు. ఇంద్రవెల్లి, నస్పూర్లో జరిగిన బహిరంగ సభలకు లక్షలాది మంది హాజరై మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దండేపల్లి మండలంలో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రెండు విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కే.శశాంక్, అటవీ శాఖ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిశ్సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, కలెక్టర్ కుమార్ దీపక్, ఎఫ్డీవో సర్వేశ్వర్, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాష్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, డీఎంహెచ్వో హరీశ్రాజ్, సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ కోటేశ్వర్ డీసీపీ భాస్కర్, ఏసీసీ ప్రకాశ్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఐఎన్టీయూసీ నేతలు జనక్ప్రసాద్, ప్రేమ్చంద్, శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజం..లక్సెట్టిపేట : పట్టణంలో సామాజిక ఆస్పత్రి, ప్రభు త్వ కళాశాల భవనాల ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులలోని బెంచీలపై కూర్చుని చిన్నానాటి జ్నాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి విద్యార్థి వద్ద పుస్తకాన్ని తీసుకుని చదివారు. కళాశాల గదులన్నీ తిరిగి పరిశీలించారు. విద్యార్థి సంఘం నాయకులు స్కాలర్షిప్ల విడుదల కోసం వినతిపత్రం అందజేశారు. -
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
● గ్రూపులు వీడి పార్టీ గెలుపునకు కృషి చేయాలి ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ ● జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ సమావేశంఫ్లెక్సీ వివాదంజిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం సందర్భంగా ప్రేమల గార్డెన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో నియోజకవర్గ ఇన్చార్జి ఫొటో పెట్టకపోవడం ఒక సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడడమేనని రెబ్బెన మండల నాయకుడు దుర్గం సోమయ్య అన్నారు. పార్టీలో రెండు వర్గాలు ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆసిఫాబాద్: పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, గ్రూపులు వీడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యు డు అనిల్కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో శనివారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు అధ్యక్షతన కాంగ్రెస్ సంస్థాగత ని ర్మాణ సమావేశం నిర్వహించగా, అనిల్కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ నమ్ముకుని ఉ న్నవారే నిజమైన కార్యకర్తలని, అలాంటి వారికి గు ర్తింపు ఉంటుందన్నారు. పార్టీ కోసం పనిచేసిన తన కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలు స్థా నిక ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయంలో జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలని సూచించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రాస్రోడ్ నుంచి ప్రేమల గార్డెన్ వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆయనకు స్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ జిల్లా పరిశీలకుడు రమేశ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. త్వరలో జిల్లా కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు తమ బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ సమష్టి కృషితో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీని గెలిపించాలని కోరారు. 18 నెలల్లోనే మార్పు ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎంతో మార్పు వచ్చిందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతోపాటు 65వేల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. గతంలో మంత్రి సీతక్క సహకారంతో ఉపాధిహామీ కింద జిల్లాకు రూ.58 కోట్లు, సీఆర్ఆర్ కింద రూ.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ధరణి పక్కనపెట్టి భూభా రతి చట్టం అమలు చేసిందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ కొంతమంది కుట్రలతో ఓటమి పాలయ్యాయనని ఆరోపించారు. తనకు 60 వేలకు పైచిలుకు ఓట్లు సాధించేందుకు సహకరించిన కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. వారికి స్థానిక ఎన్నికల్లో బీఫాంలు ఇస్తే ఆర్థికంగా సపోర్టు చేసి గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తమకు అన్నివిధాలా సహకరిస్తే అన్ని జెడ్పీటీసీ, ఎంపీసీటీ, సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పదవుల్లో జిల్లాకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ సర్వే చేయించి గెలుపు గుర్రాలకు బీఫాంలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ సూచించారు. సమావేశంలో నాయకులు నరేశ్ జాదవ్, బాలేశ్వర్గౌడ్, అనిల్గౌడ్, తిరుపతి, విశ్వనాథ్, గజ్జి రామయ్య, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
దహెగాం(సిర్పూర్): యువకులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాగజ్నగర్ డీ ఎస్పీ రామానుజం అన్నారు. మండలంలోని కుంచవెల్లి గ్రామంలో శనివారం మండల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు చెడు వ్యసనాలు వీడాలని సూచించారు. మా దకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు వాడినా, విక్రయించినా వెంటనే 1908, 87126 70551 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలి పారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ రూరల్ సీఐ శ్రీని వాస్రావు, ఎస్సై విక్రమ్, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పోలీసులకు చిక్కిన ‘ఆంధ్రా సురేశ్’
● నకిలీ విత్తనాల కేసులో పీడీ యాక్టు నమోదు ● చర్లపల్లి జైలుకు తరలింపుఆసిఫాబాద్అర్బన్/చింతలమానెపల్లి: నకిలీ విత్తనాల సరఫరా కేసుల్లో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన గోరంట్ల సురేశ్బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. శనివారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వివరాలు వెల్లడించారు. నకిలీ విత్తనాల సరఫరా కేసులో నిందితుడు సురేశ్పై చింతలమానెపల్లి పోలీస్స్టేషన్లో ఈ ఏడాది ఏప్రిల్ 4న కేసు నమోదైంది. ఈ నెల 3న రవీంద్రనగర్– 1 సమీపంలో పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. 2018 నుంచి 2025 వరకు నకిలీ విత్తనాల సరఫరాకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో అతడిపై పీడీ యాక్టు నమోదు చేశారు. కౌటాల సీఐ ముత్యం రమేశ్ ఆధ్వర్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం భీమవరానికి చెందిన గోరంట్ల సురేశ్బాబు జిల్లాలోని చింతలమానెపల్లి, బెజ్జూర్, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ మండలాల్లో నమోదైన నకిలీ విత్తనాల సరఫరా కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నా మళ్లీ తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. శాశ్వత చర్యల్లో భాగంగా పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. కాగా, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, భీమినితోపాటు జిల్లాలోని చింతలమానెపల్లి, దహెగాం మండలాలకు ఈ ఏడాది నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో ఆయా పోలీస్స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. ‘ఆంధ్రా సురేశ్ ఎవరు?’ అంటూ ‘సాక్షి’లో ‘నకిలీ ముప్పు’ పేరుతో కథనం కూడా ప్రచురితమైంది. నిందితుడిపై రామగుండం కమిషనరేట్ పరిధిలోనూ కేసులు నమోదై ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. జిల్లాలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంటుందని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. -
జీవో 49 రద్దుపై గ్రామాల్లో సీపీఎం ప్రచారం
కాగజ్నగర్రూరల్: జీవో నంబర్ 49 రద్దు చేయాలని కాగజ్నగర్ మండలం రేగులగూడ, ఊట్పల్లి గ్రామాల్లో శనివారం సీపీఎం నాయకులు కరపత్రాలతో ప్రచారం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడుతూ ఆదివాసీలను జల్ జంగిల్ జమీన్కు దూరం చేసే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో సీపీఎం ఆధ్వర్యంలో కరపత్రాలతో ప్రచారం చేస్తామని తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం సిగ్గుచేటన్నారు. పులుల సంరక్షణ, అడవుల సంరక్షణ పేరుతో గ్రామాలను ఖాళీ చేయించి, అటవీ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్కుమార్, చాపిలే సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి ఊతం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: హాజీపూర్ మండలం వేంపల్లిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రీయల్ పార్క్ కొత్త పరిశ్రమల స్థాపనకు, ఉపాధి అవకాశాల సృష్టికి ఊతమివ్వనుంది. ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఈ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే చొరవతో.. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హాజీపూర్ మండలం వేంపల్లి, పోచంపాడు శివారులో 250 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ పార్క్ కోసం రైతుల నుంచి భూములు సేకరించి పరిహారం చెల్లించారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిర్మాణ పనులూ వేగవంతమవుతున్నాయి. వ్యవసాయ ఆధారిత, అనుబంధ రంగ, తయారీ, శీతల గిడ్డంగులు, పశు, పౌల్ట్రీ, పాల ఆధారిత పరిశ్రమలతోపాటు ఐటీ కంపెనీల కోసం ఐటీ హబ్ను సైతం ఏర్పాటు చేయనున్నారు. సబ్సిడీలు, సౌకర్యాలు.. ఇండస్ట్రీయల్ పార్కులో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుంది. రూ.కోటి నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు సౌకర్యాలు కల్పించనున్నారు. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, రవాణా వంటి మౌలిక సదుపాయాలతోపాటు విద్యుత్ సబ్సిడీలు, రాయితీలు, రుణ సౌకర్యాలను అందించనున్నారు. జాతీయ రహదారి 63, మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉండడం, పెద్దపల్లి జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయం వంటి రవాణా సౌకర్యాలు ఈ పార్క్ను ఆసిఫాబాద్, మహారాష్ట్ర, పెద్దపల్లి జిల్లాలకు అనుసంధానిస్తాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆదివారం మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. లక్సెట్టిపేటలో ఆస్పత్రి భవనం ప్రారంభోత్సవం, జూనియర్ కాలేజీ, హైస్కూల్ విద్యార్థులతో భోజనం, దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భూమిపూజ చేస్తారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. తర్వాత వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు. వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు.. నేడు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జిల్లా అభివృద్ధికి మరో అడుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు -
ఎట్టకేలకు మోక్షం
● జిల్లాలో 7,154 కొత్త రేషన్ కార్డులు మంజూరు ● రేపటి నుంచి జారీ ప్రక్రియ ప్రారంభం ● సెప్టెంబర్లో బియ్యం అందించేందుకు ఏర్పాట్లునిబంధనలివే..కొత్త రేషన్కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతంలో వార్షికాదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల మించి ఉండకూడదు. మాగాణి 3.5 ఎకరాలు, మెట్ట అయితే 7.5 ఎకరాల మించకుండా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వైద్యులు, కాంట్రాక్టర్లు, నాలుగుచక్రాల వాహనదారులను అనర్హులుగా పరిగణిస్తారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసిఫాబాద్: కొత్త కార్డుల మంజూరు ప్రక్రియలో ఎట్టకేలకు ముందడుగు పడింది. దరఖాస్తుదారుల ఎదురుచూపులకు త్వరలోనే మోక్షం కలగనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. పేదలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. జిల్లా అధికారులు సైతం అందుకు తగిన ఏర్పాట్లతో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం సమగ్ర కులగణన సర్వే ప్రాతిపదికన లబ్ధిదారులను గుర్తించింది. అర్హులైన చాలామంది కొత్త కార్డుల కోసం, ఇప్పటికే కార్డులు ఉన్న కుటుంబాల్లో కూడా కొంతమంది పేర్లు నమోదు కాకపోవడంతో.. వారు పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబంలో చిన్నపిల్లలు, పెళ్లయిన కొత్త కోడళ్లు కూడా పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రామాణికంగా తీసుకోవడంతో రేషన్ కార్డులకు ప్రాధాన్యత ఏర్పడింది. 7,154 కొత్త కార్డులు జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో 314 రేషన్ దుకాణాలు ఉండగా, ప్రస్తుతం 1,39,734 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 13,192 అంత్యోదయ కార్డులు కాగా, 1,26,542 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు. ప్రతినెలా సుమారు 2,949.746 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇప్పటికే లబ్ధిదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించారు. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులకు సెప్టెంబర్ నుంచి సరుకులు ఇవ్వనున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో కార్డులేని వారు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో 1,63,647 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొత్త రేషన్కార్డుల కోసం 17,044 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు మీసేవ కేంద్రాల్లో సైతం కొత్తగా దరఖాస్తులు చేశారు. ప్రస్తుతం కొత్తగా 7,154 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కొత్తకార్డులు జారీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపడంతో శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆ రోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, నాయకులు అనిల్గౌడ్, సోమశేఖర్, చరణ్, శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
కాన్పుల మధ్య ఎడం తల్లీబిడ్డకు శ్రేయస్కరం
ఆసిఫాబాద్అర్బన్: కాన్పుల మధ్య సరైన ఎడం పాటించడం తల్లీబిడ్డకు శ్రేయస్కరమ ని మాతాశిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సిద్దార్థ అన్నారు. ప్రపంచ జనాభా ది నోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐడీఏసీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరో గ్య సంస్థ ఈ ఏడాది ఆరోగ్యకరమైన సమ యం, కాన్పుల మధ్య దూరం తల్లీబిడ్డలకు శ్రేయస్కరం అనే నినాదాన్ని ఇచ్చిందని తెలి పారు. 15 నుంచి 49 ఏళ్లలోపు సీ్త్రలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నా రు. శాశ్వత కుటుంబ నియంత్రణతోపాటు తాత్కాలిక నియంత్రణ పద్ధతులైన ఐయూడీ, నిరోధ్, గర్భ నిరోధక సాధనాల వినియోగం గురించి వివరించాలని సూచించారు. జనా భా విస్పోటనాన్ని నియంత్రించేందుకు అవగాహన కల్పించాలన్నారు. వైద్యులు వినోద్, సిబ్బంది రవిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముంపులోనే పంటలు
రావులపల్లి శివారులో మునిగిన పత్తి పంటదహెగాం/పెంచికల్పేట్: ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పలు మండలాల్లో పంటలు మూడు రోజులుగా నీట మునిగే ఉన్నాయి. దహెగాం మండలంలో ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాలైన మొట్లగూడ, రాంపూర్, రావులపల్లి, పెంచికల్పేట్ మండలం మురళీగూడ, జిల్లెడ గ్రామాల శివారులో సాగు చేసిన పత్తి పంట మూడు రోజులుగా వరదలోనే ఉంది. మొక్కలు మురిగిపోతాయని రైతులు వాపోతున్నారు. దహెగాం మండలంలో 900 ఎకరాలు, మురళీగూడ, జిల్లెడ శివారులో 200 ఎకరాలు వరదనీటితో దెబ్బతిన్నట్లు అన్నదాతలు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు. త్వరగా సర్వే నిర్వహించి పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. మురళీగూడ శివారులో మునిగిన పంటలు -
తీరని ‘దిందా’ కష్టాలు!
● ఏటా వర్షాలకు జలదిగ్బంధంలో గ్రామం ● అత్యవసరమైతే ప్రాణాలు పోవాల్సిందేనా..? ● గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వని ప్రభుత్వ యంత్రాంగం ● వాగు దాటుతూ మరో యువకుడు మృత్యువాతచింతలమానెపల్లి(సిర్పూర్): వర్షాకాలం వచ్చిందంటే చింతలమానెపల్లి మండలం దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. ప్రధాన రహదారి నుంచి వచ్చే మార్గం నీటిలో మునిగిపోతుంది. ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. వరద కష్టాలు తీర్చాలని ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చింతలమానెపల్లి మండల కేంద్రం నుంచి గూడెం మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిలో కేతిని నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో దిందా గ్రామం ఉంది. దట్టమైన అటవీప్రాంతంలోని ఈ గ్రామానికి రెండు వైపులా ప్రాణహిత నది ఉండగా, మరోవైపు వాగు ఉంది. ప్రజలు బయటకు రావాలంటే కేతిని వైపు, చిత్తం వైపు వాగు దాటాల్సిందే. ఏటా వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలకు లోలెవన్ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోతాయి. మహారాష్ట్రలో కురిసే వర్షాలతోనూ ప్రాణహిత ఉప్పొంగి లోలెవల్ వంతెన మునిగిపోతుంది. దాదాపు మూడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తు వరకు వరద నిలుస్తుంది. రోజుల తరబడి పరిస్థితి అలాగే ఉంటే ప్రాణాలకు తెగించి గ్రామస్తులు వాగు దాటుతున్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల సైతం రోజుల తరబడి మూసి ఉంటుంది. వాగుకు అవతలి వైపు పొలాలకు వెళ్లాలంటే రైతులు సాహసం చేయాల్సిందే.. అంబులైన్స్ రాని దుస్థితి నెలకొంది. ఈత వచ్చినా ఇబ్బందే..ఎంబీఏ చదువుతున్న డోకె రామకృష్ణ అనే యువకుడు 2015లో వాగు దాటుతూ మృతి చెందాడు. తాజాగా కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్ గురువారం వాగులో గల్లంతు కాగా, శుక్రవారం మృతదేహం లభ్యమైంది. దిందా వాగు ఉధృతిగా ఉన్నప్పుడు దాటడం కష్టమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కోచోట వెడల్పుగా, మరోచోట ఇరుకుగా ఉంటూ వరద సుడులు తిరుగుతుంటుందని చెబుతున్నారు. గతంలో మృతి చెందిన రామకృష్ణ వాగులో సగం దూరం ఈదుకుంటూ రాగా.. ఆ తర్వాత ఉధృతిలో చిక్కుకున్నాడు. మరో యువకుడు సుమన్ సైతం గట్టుకు చేరుకునేలోపే కొట్టుకుపోయాడు. పోరుబాట పట్టినా..వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.3కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీశాఖ అనుమతులు మంజూరు కాలేదు. రెండేళ్ల క్రితం వాగు వద్ద వరదనీటిలో గ్రామస్తులు ధర్నా చేశారు. వారం పాటు నిరసన తెలిపారు. స్పందించిన అధికారులు వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చి వెళ్లారు. అయినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. గతేడాది యువకులు వంతెనకై పోరుదీక్ష పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఉన్నతాధికారుల నుంచి హామీ వచ్చినా వంతెనకు మోక్షం కలగలేదు. గతేడాది అటవీ శాఖ అనుమతులు లభించినట్లు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. కానీ నిధులు సరిపోవంటూ కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదు. వంతెన నిర్మించాలి దిందా వాగు లోలెవల్ వంతెనపై వరద ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నాం. ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం హైలెవల్ వంతెన నిర్మించాలి. – నికాడే వెంకన్న, దిందా కాంట్రాక్టు రద్దు చేయండి కాంట్రాక్టర్ పనుల్లో అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే నిజమైతే కాంట్రాక్టు రద్దు చేసి అతడిపై చర్యలు తీసుకోవాలి. త్వరగా రీటెండర్ నిర్వహించాలి. అప్పటివరకు ప్రజలు వాగు దాటేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. – డోకె రామన్న, బీజేపీ మండలాధ్యక్షుడు -
బస్టాండ్లలో భద్రతేది..?
కాగజ్నగర్ నుంచి చింతలమానెపల్లికి ఆర్టీసీ బస్సులో మే 19న చింతలమానెపల్లికి చెందిన రమ్య ప్రయాణిస్తుండగా బ్యాగులోని మూడున్నర తులాల బంగారం చోరీకి గురైంది. సిర్పూర్(టి)– లోనవెల్లి మధ్య హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసి గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దొంగలించారు. ఆర్టీసీ సిబ్బంది కౌటాల పోలీస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు నిలిపి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సు సురక్షితమని ఎక్కితే.. బంగారం ఎత్తుకెళ్లారని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ నెల 7 పాఠశాల విద్యార్థినులను ఇద్దరు యువకులు ఏడిపిస్తూ వేధింపులకు గురిచేశారు. వారిని ఆసిఫాబాద్ షీటీం సభ్యులు స్వప్న, రజని, దినేశ్ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పోకిరీల చేష్టలు ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు. కౌటాల(సిర్పూర్): మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ తీవ్రంగా పెరిగింది. సీటు కో సం పోటీ పడుతున్నారు. ఇక పల్లె వెలుగు బస్సుల్లో అయితే కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. అయితే బస్సులు, బస్టాండ్లలో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు చోరీ లకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. రద్దీ సమయంలో బస్సుల్లో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు దొంగలు తమ పనిని సులువుగా కానిస్తున్నారు. అమాయకుల బ్యాగులు, మెడలోని ఆభరణాలు, జేబుల్లోని పర్సులు, సెల్ఫోన్లను క్షణాల్లో మాయం చేస్తున్నారు. బాధితులు తేరుకునేలోపే నష్టం జరుగుతోంది. ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్నచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా సంస్థ అలసత్వం ప్రదర్శిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రద్దీ సమయాల్లో..జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్ పట్టణం, కౌటా ల, వాంకిడి, పెంచికల్పేట్ మండల కేంద్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. పండుగలు, శుభకార్యాల సమయంలో బస్టాండ్ ప్రాంతాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శి స్తున్నారు. బస్సు ఎక్కి, దిగే సమయంలో సొమ్ము, నగలు కాజేస్తున్నారు. ఆయా సరిహద్దు మండలాల్లోని ప్రజలకు మహారాష్ట్ర ప్రజలతో సత్సంబంధాలు ఉండడంతో రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు. బస్టాండ్లు, బస్సుల్లో చోరీలకు పాల్పడేవారు సరిహద్దు దాటి పారిపోతున్నారు. నిందితులను పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. కొత్తగా వచ్చే వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. నిఘా నేత్రాలు పటిష్టంగా లేకపోవడం వైఫల్యంగా మారుతోంది. ప్రయాణికుల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లా వివరాలు ప్రయాణ ప్రాంగణాల్లో నిఘా కరువు చేతివాటం చూపుతున్న దొంగలు ఆందోళన చెందుతున్న ప్రయాణికులునిఘా కరువు..జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గతంలో పోలిస్తే బస్సులు, ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు ఐదారు వేల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన ఈ బస్టాండ్లో రెండు సీసీ కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. అవి కూడా కొంతవరకు మాత్రమే కవర్ చేస్తున్నాయి. చోరీలు జరిగినప్పుడు దొంగలు గుర్తించడం కష్టంగా మారుతుంది. అలాగే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు కాగజ్నగర్ ఆర్టీసీ బస్టాండ్ కీలకమైంది. ఇక్కడ గ్రామీణ మండలాలతోపాటు మంచిర్యాల, హైదరాబాద్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి సక్రమంగా పనిచేయడం లేదు. భద్రత మా బాధ్యత ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం కల్పించడంతోపాటు ప్రయాణికులకు భద్రత కల్పించడం మా బాధ్యత. ఆసిఫాబాద్లోని బస్టాండ్లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగజ్నగర్ బస్టాండ్లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రద్దీకి అనుగుణంగా పోలీసుల సహకారంతో భద్రత కల్పిస్తాం. ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీ సిబ్బందిని నియమించాం. ఇబ్బందులకు గురితే సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించాలి. – రాజశేఖర్, ఆసిఫాబాద్ డిపో మేనేజర్ -
నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా
● టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్ఆసిఫాబాద్: జిల్లాలోని వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం చీఫ్ ఇంజినీర్ ఆపరేషన్– 1 అశోక్తో కలిసి విద్యుత్ శాఖ డీఈఈలు, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, అధికరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మధుసూదన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అన్నిరకాల పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించడానికి మెయింటనెన్స్ చేపట్టాలని ఆదేశించారు. అన్ని లైన్లు పరిశీలించి ప్రమాదకరమైన లొకేషన్లు గుర్తించి, సరిచేయాలని సూచించారు. ఉద్యోగులు పనిచేసే సమయంలో భద్రతా పరికరాలు ఉపయోగిస్తూ ప్రమాదాలు నివారించాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. -
హాస్య రచన పోటీల్లో ప్రతిభ
ఆసిఫాబాద్అర్బన్: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘శ్రుతి మించక ముందే దూరంగా ఉండండి’ అనే అంశంపై జిల్లాస్థాయి హాస్య రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థిని దివ్వకు రూ.560, ద్వితీయ బహుమతి పొందిన మోడల్ స్కూల్కు చెందిన కౌషిక్కు రూ.300, తృతీయ బహుమతి పొందిన జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన రాజ్యలక్ష్మికి రూ.200 నగదును జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ అందించారు. ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు వెంకట్రావ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి కుటుంబం..ఆత్మీయం
తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ శ్రీకాంత్ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సయ్య–లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె వివాహం అనంతరం కొన్నేళ్లకు తండ్రి నర్సయ్య మృతిచెందాడు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ అన్నీతానై కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుని ముందుకు నడిపించాడు. కుటుంబం కోసం వ్యాపారం ప్రారంభించి, తమ్ముడు అశోక్ను ఉన్నతంగా చదివించాడు. అన్న కష్టానికి తగ్గట్టుగా పట్టుదలతో చదివి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం సాత్నాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్కు సన్నద్ధమై ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. ఇటీవల గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 250వ ర్యాంక్, గ్రూప్–3లో 417 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం తల్లితోపాటు వివాహమైనప్పటికి సోదరులు ఇద్దరు ఉమ్మడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు, తల్లి మొత్తం తొమ్మిది మంది ఒకే చోట ఉంటున్నారు. -
దిందా వాగులో పడి యువకుడు గల్లంతు
చింతలమానెపల్లి: దిందా వాగులో పడి యువకుడు గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్(18) సుమన్ తన స్నేహితులతో కలిసి గురువారం దిందా వాగుకు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో వారు వాగు దాటేందుకు ప్రయత్నించారు. సుమన్కు ఈతవచ్చినప్పటికీ అవతలివైపు చేరుకునే సమయంలో వాగు ఉధృతి పెరిగింది. సుమన్ గట్టుపై ఉన్న చెట్టును పట్టుకోగా చెట్టుకొమ్మ విరిగింది. దీంతో వాగు ఉధృతిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాగు ఉధృతి ఎక్కువగా ఉండడం, చీకటి పడడంతో సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. గల్లంతైన సుమన్ డిగ్రీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డైట్ సెట్ పరీక్షకు హాజరయ్యాడు. తిరుపతి అమృత దంపతులకు సుమన్ పెద్దకుమారుడు. మరో అజయ్, కిషన్, కల్పన సంతానం ఉంది. -
వాన జోరు.. వరద హోరు!
● జిల్లా అంతటా ఎడతెరిపిలేని వర్షం ● పొంగిపొర్లుతున్న వాగులు, ఒర్రెలు ● ఉప్పొంగిన ప్రాణహిత ● నీటమునిగిన పంటలు ఆసిఫాబాద్/కెరమెరి/చింతలమానెపల్లి/దహెగాం/పెంచికల్పేట్/బెజ్జూర్/సిర్పూర్(టి)/కౌటాల:జిల్లా అంతటా రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు కుమురంభీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేశారు. జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్లోని లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచి పోయి ఆర్ఆర్కాలనీ వాసులు ఇబ్బందిపడ్డారు. కెరమెరి మండలంలోని లక్మాపూర్, అనార్పల్లి వా గులు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. సుమారు 15 గ్రామాలకు చెందిన ప్రజలు వాగు దాటి రాలేకపోతున్నారు. సాంగ్వి కల్వర్టుపై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చింతలమానెపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గురువారం 51.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాబాసాగర్ నాయకపుగూడ దారిలో వాగు ఉప్పొంగడంతో రవాణా నిలిచిపోయింది. పాల్వాయినగర్, చింతలపాటి వద్ద వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో కౌ టాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మార్గంలో రవా ణా స్తంభించింది. గూడెం వద్ద అంతర్రాష్ట్ర వంతెన శ్లాబ్ను తాకేలా ప్రాణహిత నది ప్రవహిస్తోంది. పలు పాఠశాలల ఆవరణలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. శివపెల్లి, దిందా, నాయకపుగూడ, గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నా యి. బూరెపల్లి, రణవెల్లి గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు కొనసాగుతున్నందువల్ల వాగుల ఉధృతి కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దహెగాం మండలంలోని ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో మొట్ల గూడ, రావులపల్లి, రాంపూర్ శివారులో 3 నుంచి 4వందల ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి–గొల్లవాడ మధ్య ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తా త్కాలిక రోడ్డు కొట్టుకు పోయింది. బొక్కివాగు, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అనిల్ కుమార్ సూచించారు. బెజ్జూర్ మండలంలో ప్రాణహిత న ది ఉప్పొంగి సోమిని, తలాయి, తిక్కపల్లి, భీమా రం, ఇప్పలగూడ, మొగవెళ్లి, తదితర గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి. కృష్ణపల్లి, సుస్మిర్ సమీపంలోని రెండు ఒర్రెలు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్(టి) మండలంలో వెంకట్రావ్పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర హైలెవల్ వంతెనకు ఆనుకోని పెన్గంగ నది వరద నీరు ఉదృతంగ ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే తెలంగాణ–మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. వరద నీరు గంట గంటకూ పెరుగుతుండటంతో నదీ తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహితనది, తాటిపెల్లి వద్ద వార్థానది, గుండాయిపేట సరిహద్దులోని పెనగంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి.కెరమెరి: సాంగ్వి కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు -
● ఉమ్మడి కుటుంబాలతోనే మేలు ● చిన్నకుటుంబాలపైనే యువత ఆసక్తి ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
మంచిర్యాలటౌన్/ఆదిలాబాద్/బెల్లంపల్లి/చెన్నూర్: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. యువజన భారతంగా వెలుగొందుతున్న దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అంచనా ఉంది. గతంలో ఇద్దరు పిల్లలే ముద్దు అనే నినాదం ఉండగా.. ప్రస్తుతం ఒక్కొక్కరూ ముగ్గురు కంటే ఎక్కువ మందిని కనాలనే సూచన వస్తోంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ యువతీ, యువకులు, పెళ్లయిన జంటలు 300 మందిని పలు అంశాలపై గురువారం సర్వే నిర్వహించింది. వీరిలో అధిక శాతం ఉమ్మడి కుటుంబాలతోనే మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలే చాలని.. భవిష్యత్ ప్రణా ళికలోనూ ఇద్దరే ముద్దు అని పేర్కొన్నారు. ఉద్యోగం, ఉపాధి తదితర కారణాలతో చిన్న కుటుంబాలుగా వేరుపడడానికే మొగ్గు చూపారు. 4. ఉమ్మడి కుటుంబాల వల్ల ప్రయోజనమా.. చిన్న కుటుంబాల వల్లనా..?1.దేశంలో మరో 25ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కరు ముగ్గురు పిల్లల కన్న ఎక్కువ మందిని కనాలన్న సూచనలపై మీరేమంటారు..3. మీది ఉమ్మడి కుటుంబమా..? చిన్న కుటుంబమా..? 2. పెళ్లి తర్వాత పిల్లలపై మీ ప్రణాళిక ఏమిటిపాటించాలిఇద్దరు చాలుఉమ్మడి కుటుంబాలుచెప్పలేంఇద్దరుచిన్న కుటుంబాలుచిన్నదేఉమ్మడి225364169502847 -
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్కలెక్టర్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, పోలీసుశాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపెల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు ఉప్పొంగితే ప్రభావిత గ్రామాల వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వాగులు దాటకుండా బందోబస్తు చేపట్టాలన్నారు. శిథిలావస్థ ఇళ్లల్లో ఉండే వారిని సురక్షితప్రాంతాలకు తరలించాలని, అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్లో విపత్తు రక్షణ బృందాలను ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించామన్నారు. ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా జరగాలి..జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం వచ్చిన దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం అంకుసాపూర్ శివారులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలన్నారు. ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
● ఏటేటా పెరుగుతున్న జనాభా ● అమ్మాయిల జననాలే అధికం ● క్రమంగా తగ్గుతున్న మహిళల సంఖ్య ● ఉమ్మడి జిల్లాలో జనాభా తీరిదీ ● నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఈ ఏడాది థీమ్.. ‘‘యువతకు న్యాయమైన, ఆశాజనక ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి వారిని శక్తివంతం చేయడం’’ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం. రెప్పపాటులో పుట్టుక చావులు జరిగిపోతున్నాయి. ఏటేటా జనాభా పెరిగిపోతోంది. గతంతో పోలిస్తే జనన, మరణాల సంఖ్య పెరుగుదల రేటు తగ్గిపోతోంది. మారుతున్న పరిస్థితులు జనాభాను నియంత్రిస్తున్నాయి. అందరికీ అన్ని సౌకర్యాల కల్పన మానవ సమాజంలో క్లిష్టంగా మారింది.. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో జనాభాతోపాటు పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. గిరిజన, మైదాన ప్రాంతాల్లో మార్పులు వస్తున్నాయి. తగ్గుతున్న మహిళా జనాభా ప్రతీ వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలు సర్వేల్లోనూ లింగనిష్పత్తి తగ్గుతూ వస్తోంది. పురుషులకు సమానంగా సీ్త్రలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2011అధికారిక జనాభా లెక్కల్లోనే ఇది స్పష్టమైంది. సీ్త్ర, పురుష సమానత్వం లేకపోతే సమాజంలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు లింగనిర్ధారణ చేస్తు ఆడశిశువులను పురిటిలోనే చంపేయడం జనాభాలో అసమతుల్యతకు కారణంగా మారుతున్నాయి. అమ్మాయిలే పుడుతున్నారు.. ‘సీఆర్ఎ్స్(రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) 2021 నివేదికలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 26576మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25124మంది జన్మించారు. అదే సమయంలో మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832మంది మరణించారు. పెరుగుతున్న వలసలు.. గ్రామాలు వదిలి విద్యా, ఉద్యోగ, ఉపాధి సౌకర్యాల కోసం అధికంగా వలసలు పెరుగుతున్నాయి. దీంతో క్రమంగా పట్టణీకరణ పెరుగుతోంది. 2011లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా 43.8శాతం, ఆదిలాబాద్ 23.7శాతం, నిర్మల్ 21.4, కుమురంభీం జిల్లాలో 16.9శాతంతో పట్టణ జనాభా ఉంది. ప్రస్తుతం 2025నాటికి సంఖ్య మరింత పెరగనుంది. అయితే పట్టణాల్లో పెరుగుతున్న వలసలకు అనుగుణంగా శుభ్రమైన తాగు, ఉండేందుకు ఇల్లు, విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి వసతలు కల్పన జరగాల్సి ఉంది. లేకపోతే అల్పాదాయంతో పేదరికంలో అధిక జనాభా మగ్గాల్సి వచ్చే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రతీ చదరపు కిలోమీటరకు జనసాంద్రత చూస్తే ఆసిఫాబాద్ జిల్లా తక్కువ ఉండగా, పట్టణీకరణ చెందిన మంచిర్యాల జిల్లాలో అధికంగా ఉంది. ప్రస్తుతం 2025 నాటికి జనసాంద్రత మరింత పెరగనుంది. వసతులు, సౌకర్యాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు వలసలతో ఆ ప్రాంతాల్లో జన సాంద్రత పెరుగుతోంది. -
సమగ్ర నివేదికలు లేకుండా ఎలా వస్తారు?
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లా అధికారులు సమగ్ర నివేదికలు లేకుండానే ‘దిశ’ సమావేశానికి ఎలా హాజరవుతారని ఎంపీ గోడం నగేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన దిశ(జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ) సమావేశానికి ఎంపీ హాజరై కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మైనింగ్, విద్య, వైద్య, వ్యవసాయ, బీఎస్ఎన్ఎల్. గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల పురోగతిపై ఆయా శాఖల వారీగా సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 973 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 137 అంగన్వాడీ టీచర్లు, 357 ఆయా పోస్టులు ఖాళీలుగా ఉన్నాయన్నారు. బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల చదువు, ఆరోగ్యంపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తిర్యాణి మండలం గోవేన గ్రామ పంచాయతీలో విద్యుత్తు సరఫరా లేని ఆవాస ప్రాంతాలకు వెంటనే విద్యుత్తు సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులపై అసంతృప్తి...దిశ సమావేశంలో పలు శాఖల అధికారులపై ఎంపీ నగేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో గతేడాది, ప్రస్తుత ఏడాదిల్లో ఎలాంటి పనులు చేపట్టారని, ఎంత మందికి పని దినాలు కల్పించారని, ఎన్ని నిధులు వ్యయం చేశారని ప్రశ్నించగా.. ఆ శాఖ పీడీ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎన్ని సీసీరోడ్లు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారు? సీసీరోడ్లకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు, ఇన్చార్జి మంత్రి నుంచి ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయని ప్రశ్నించారు. సీసీ రోడ్ల మంజూరులో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఏదైనా అడిగితే జిల్లా ఇన్చార్జి మంత్రి వద్ద నుంచి సిఫార్సు తీసుకురావాలని చెబుతున్నారని, మీరు కూడా ఇన్చార్జి మంత్రి నుంచి సిఫార్సు తెస్తున్నారా? అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. ఈ అంశంపై ఎంపీ గోడం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అందరికీ సమానంగా పనులు ఇవ్వాలని సూచించారు. అధ్వానంగా మారిన రోడ్లకు ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదని ఆర్అండ్బీ, పంచాయరాజ్ శాఖల అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న తిర్యాణి రోడ్డు గురించి ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలుపగా.. ఆ రహదారి పనులు చేపట్టేందుకు అటవీశాఖ నుంచి అనుమతులు ఇవ్వడం లేదని ఆర్అండ్బీ ఎస్ఈ పేర్కొన్నారు. అక్కడే ఉన్న డీఎఫ్ఓ నీరజ్కుమార్ దానిని ఖండిస్తూ ఆ రహదారి విషయంపై నాకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని సమాధానం ఇచ్చారు. వారిరువురి మధ్య సంభాషణ కొనసాగుతుండగా ఎంపీ కలుగజేసుకుని వెంటనే తిర్యాణి రహదారి పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా, డీఎఫ్వో నీరజ్కుమార్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీ గోడం నగేష్ కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష పలు శాఖల అధికారులపై అసంతృప్తి -
నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
● అదుపులో నలుగురు, పరారీలో ఒకరు ● కారు, బైక్, ఆటో బంగారు, వెండి స్వాధీనం ఇచ్చోడ: నకిలీ పోలీసుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ సీఐ కార్యాలయంలో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నిడమనూర్ గ్రామానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (పశువుల వ్యాపారి), చింతల చెరువు ప్రశాంత్(లారీ క్లీనర్), బదనపూరి అజయ్(మోటార్ మెకానిక్) బొప్పరం సుధాకర్(సెల్ పాయింట్), ఒట్కురి నరేష్ (పెట్రోల్ బంక్ ఉద్యోగి) ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎస్సై పేరు చెప్పి వివిధప్రాంతాల్లో బంగారు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. గతనెల 27న రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండోజు నరసింహచారికి ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం 11 గ్రాముల బంగారం కొన్నారని కేసు కాకుండా ఉండాలంటే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన నరసింహచారి తనకు ఫోన్ చేసిన వ్యక్తి నకిలీ ఎస్సైగా గుర్తించి ఇచ్చోడ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 4న హైదరాబాద్కు చెందిన రుద్రంగి కిరణ్ కుమార్కు ఫోన్ చేసి ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి మాట్లాడుతున్నట్లు చెప్పి, దొంగ బంగారం కొన్నారని బెదిరించి సదరు వ్యక్తి నుంచి రూ1.50 లక్షలు వసూళ్లు చేశారు. అనుమానం వచ్చిన కిరణ్కుమార్ సైతం ఇచ్చోడలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఎస్సై అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో నలుగురిని మండల కేంద్రంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఒట్కురి నరేశ్ పరారీలో ఉన్నారు. వీరిపై గతంలో నల్గొండ, హుజుర్నగర్ పోలీస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నవి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చైన్నె నగరాల్లోని ఆభరణాల షాపుల యజమానులకు ఫోన్ చేసి బెదిరించి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసి జల్సాలకు వాడుకున్నట్లు తేలింది. నిందితుల నుంచి కారు, ఆటో, బంగారు, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
నీట్లో విద్యార్థి ప్రతిభ
లక్సెట్టిపేట: నీట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన కందుల కుషీంద్రవర్మ ప్రతిభ కనబర్చి రాష్టస్థాయి 59 ర్యాంకు సాధించాడు. పదో తరగతి వరకు పట్టణంలోని గుడ్ షెప్పర్డ్ పాఠశాల, చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి మంచి మార్కులు సాధించాడు. ఈయన తండ్రి ప్రవీణ్కుమార్ ప్రైవేటు టీచర్, తల్లి సుమలత గృహిణి. కుమారుడు నీట్లో ర్యాంక్ సాధించడంపై పలువురు అభినందించారు. గుడుంబా పట్టివేతజైపూర్: బైక్పై గుడుంబా తరలిస్తుండగా ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భీమారం మండల కేంద్రంలో ఆరెపల్లి క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్తూర్ మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ శంకర్ బైక్పై 30లీటర్ల గుడుంబా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించగా జోడువాగు వద్ద శంకర్ను అదుపులో తీసుకుని బైక్, గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాసరలో ముగిసిన గురుపౌర్ణమి వేడుకలుబాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు గురువారంతో ముగిశాయి. వ్యాసమహర్షి, సరస్వతి, వ హాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ ఉన్నారు. -
ఎలక్ట్రానిక్స్ గోదాంలో చోరీ
నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాంలో జరిగిన దొంగతనాన్ని నిర్మల్ పోలీసులు ఛేదించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రూరల్ సీఐ కృష్ణ వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా గోదాంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించకుండా పోవడాన్ని యజమాని వెంకటరమణ గుర్తించారు. దీంతో ఆడిట్ నిర్వహించారు. అనుమానాస్పదంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నవత్ శ్రీకాంత్, జిందాడే సచిన్, సాబ్లే జగదీశ్వర్, కూసులే నవీన్ను విచారించగా వారు దొంగతనానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేసిన వస్తువులను తరలించేందుకు ఆటో డ్రైవర్ సయ్యద్ ఇమ్రాన్ సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఫ్రిడ్జ్, గీజర్, సామ్సంగ్ టీవీ, ఆరు కూలర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో ఎస్సై సంజీవ్ ఉన్నారు. కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్కరీంనగర్క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్పల్లికు చెందిన శ్రీనివాస్తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పర్చారు. శ్రీనివాస్కు కోర్టు ఈ నెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. గుడ్లబోరిలో మద్యనిషేధంకౌటాల: మండలంలోని గుడ్లబోరి గ్రామంలో గురువారం మద్య నిషేధం విధిస్తున్నట్లు మహిళలు తీర్మానించారు. గుడ్లబోరి పంచాయతీ పరిధిలోని విజయనగరం, వైగాం, సైదాపూర్, మరియపూరం గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారని వారుత తెలిపారు. యువత మద్యానికి బానిసై ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో మద్యం, గంజాయి విక్రయిస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని మహిళలు తీర్మానం చేశారు. శ్రావంతి, విఠబాయి, సవిత, తారబాయి, మమత, పోచుబాయి, విమలబాయి పాల్గొన్నారు. -
హోరాహోరీగా బాలికల ఫుట్బాల్ పోటీలు
● సెమీస్కు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జట్లు రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఉదయం లీగ్ కమ్ నాకౌట్ పోటీలు నిర్వహించారు. మధ్యాహ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్సాహంగా సాగాయి. మహబూబ్నగర్–నల్గొండ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు దీటుగా తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించకపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్లు నిర్వహించారు. ఇందులో నల్గొండ జట్టు 2–1 తేడాతో మహబూబ్నగర్పై గెలిచి సెమీస్కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో వనపర్తి–ఖమ్మం జట్లు తలపడగా 0–1 తేడాతో ఖమ్మం గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్లో నిజామాబాద్–గద్వాల్ జట్లు తలపడగా 7–1 గోల్స్తో నిజామాబాద్ గెలుపొందింది. ఇక ఆతిథ్య ఆదిలాబాద్ జట్టుకు క్వార్టర్ ఫైనల్స్లో నిరాశే ఎదురైంది. రంగారెడ్డి–ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 4–0 గోల్స్తో రంగారెడ్డి గెలిచి సెమీస్కు చేరింది. శుక్రవారం ఉదయం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ నల్గొండ–నిజామాబాద్ల మధ్య, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఖమ్మం–రంగారెడ్డి జట్ల మధ్య జరుగనుంది. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఎస్సై ఇ.సాయన్న, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలో దనోరా(బి) పంచాయతీ పరిధి ఇన్కార్గూడకు చెందిన ఎల్నారే అనిల్, ఉమ దంపతులకు ఏకై క కుమారుడు శుభం(23). డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 7న మద్యం తాగి ఇంటికొచ్చిన కుమారుడిని రోజు మద్యం ఎందుకు తాగుతున్నానవని తల్లి ఉమ మందలించింది. క్షణికావేశంతో వ్యవసాయ చేనుకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి చెప్పాడు. గ్రామస్తుల సహాయంతో ఓ ప్రైవేట్ వాహనంలో ఆదిలాబాద్లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు.. సోన్: అప్పుల బాధ, భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన పట్టం పోశెట్టి(34) గతంలో దుబాయ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. భార్య పోసవ్వ అలియాస్ అరుణకు కుమారుడు ఉన్నాడు. ఆమె ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అటు అప్పుల బాధ, ఇటు భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన పోశెట్టి గురువారం ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి అక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. -
కలిసుంటే కలదు సుఖం..
● ఉమ్మడి కుటుంబాల్లో ఆత్మీయత, ప్రేమానురాగాలు ● ఆత్మస్థైర్యంతోపాటు బలం ● ఆదర్శంగా నిలుస్తున్న పలు ఫ్యామిలీలు కాలం మారుతోంది.. జీవితం బిజీగా మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చిన్న కుటుంబాలే చింతలేని కుటుంబాలు అన్న భావన నెలకొంది. దీంతో పెద్ద కుటుంబాలు విడిపోయి, ఒక్కొక్కరూ ఒక్కో చోట జీవనం సాగిస్తున్న రోజులివి. చిన్నచిన్న మనస్పర్థలు, వ్యక్తిగత ఆలోచనలు వీరిని దూరం చేస్తున్నాయి. కానీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బంధాలను బలోపేతం చేస్తూ, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ప్రేమ, అనురాగం, ఆత్మీయ ఆప్యాయతలకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు కష్టసుఖాలను పంచుకుంటూ, ఒకరికొకరు అండగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవనం సాగిస్తూ, ఇవి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకరి ఆనందంలో అందరూ భాగస్వాములవుతూ, కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఈ కుటుంబాలు సామాజిక సమతుల్యతను కాపాడుతున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, ఉమ్మడి కుటుంబాల విలువను గుర్తుచేసుకోవడం అవసరం. ఇవి కేవలం కుటుంబ సభ్యులను కలిపే సంస్థానం మాత్రమే కాదు..సమాజంలో ప్రేమ, సామరస్యం, సహకార భావనలను పెంపొందించే బలమైన ఆధారాలు. ఇటువంటి కుటుంబాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా.. ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని ఆదిత్యనగర్ కాలనీకి చెందిన నానక్ సింగ్ పరివారం ఉమ్మడి కుటుంబం. గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబమంతా ఒకేచోట కలిసి ఉంటుండడం విశేషం. నానక్ సింగ్–మంజీత్ కౌర్ దంపతులకు ఆరుగురు సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. చిన్నపాటి ఇనుప వస్తువులు, పనిముట్లు చేసుకుని జీవనం సాగిస్తున్నా, పరివారమంత ఒకే దగ్గర ఆత్మీయంగా కలిసి ఉంటున్నారు. కుటుంబంలో ఒక అబ్బాయికి తప్పా అందరికీ వివాహాలు జరిగాయి. తమ మధ్య ఉన్న అనుబంధమే మా అందరిని 40 ఏళ్లుగా కలిపి ఉంచిందని నానక్ సింగ్ చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా, తామందరం బాధ్యతలు పంచుకుని ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకు శ్రమిస్తామని పేర్కొంటున్నారు.చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ బోథ్: మండలకేంద్రానికి చెందిన రాజశేఖర్ దీప దంపతులు. వారికి పిల్లల సంఖ్య కన్నా, వారిపై పెట్టే శ్రద్ధ ముఖ్యమని నమ్మారు. మేము ఒక్కరే కావాలనుకున్నారు. ఆ ఒకరిలో అన్ని విలువలు, విజ్ఞానం, మంచి భవిష్యత్తును ఇవ్వాలని అనుకురు. సంతానంగా కూతురు రుతిక పుట్టింది. ఆమె అభ్యున్నతికి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. చిన్ననాటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఇటీవల విడుదలైన లాసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. చిన్న కుటుంబం వల్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చామని అనుకుంటున్నాం. -
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డెప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ వేమనపల్లి: విధుల్లో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని డెప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ అన్నారు. పీహెచ్సీలో ప్రసవ వేదన శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి కృపబాయితో కలిసి పీహెచ్సీలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రసూతి కోసం కొండగొర్ల సోనియా పీహెచ్సీకి వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటివి పునరావృతమైతే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర వేళ 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా కమ్యూనిటీ అధికారి వెంకటేశ్వర్, బీపీహెచ్ఎన్ ఆర్ఎస్ పద్మ, ఎస్యూఓలు జగదీశ్, వసంత, సూపర్వైజర్ అపరంజి, రాంశెట్టి బాపు ఉన్నారు. ఎఫెక్ట్.. -
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లా నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎంపీ అనిల్కుమార్యాదవ్, నాయకులు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణహిత ప్రాజెక్టుపై కాలయాపన చేయొద్దు
కౌటాల(సిర్పూర్): ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయొద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు అనేవారికి ఈ వరద నీటిని చూసి కనువిప్పు కలగాలన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి దిగువనున్న గోదావరిలోకి ఇప్పటికే 40 టీఎంసీల నీరు కలిసిందని, ఇక్కడ ఏటా 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నిర్మిస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు డీపీఆర్ కూడా సిద్ధం చేయలేదన్నారు. అంతకుముందు కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల, వీర్ధండిలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ ప్రమోద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవ య్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఎంపీడీవో రమేశ్, ఏపీఎం ముక్తేశ్వర్, ఏపీవో పూర్ణిమ, జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, మండల అధ్యక్షుడు కుంచాల విజయ్, మాజీ ఎంపీటీసీ మోతిరాం, నాయకులు తిరుపతి, రవి, మధుకర్, భూమయ్య, మహేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
వసతుల కల్పనకు చర్యలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఐఈవో కళ్యాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, పంచాయతీరాజ్ డీఈ కృష్ణతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల కల్ప న, అదనపు గదుల నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారులు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో తాగునీరు, మూత్రశాలలు, భవనాలకు మరమ్మతు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, కంప్యూటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు ఇతర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆస్పిరేషనల్ బ్లాక్లో భాగంగా తిర్యాణి మండలంలో రహదారుల అభివృద్ధి, పాఠశాలల్లో వసతులు కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలల నిర్మాణాలు, విద్యుదీకరణ, భవనాల పెయింటింగ్ పనులు చేపట్టాలని సూచించారు. గతంలో ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. -
కదం తొక్కిన కార్మిక లోకం
● జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతంఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ చౌక్ వద్ద మహాధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులు హరించి వేయడంతోపాటు సంఘాలను సైతం అణచివేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పదేళ్లలో కార్మికులు మరింత కష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, నాయకులు కమలాకర్, అశోక్, పిడుగు శంకర్, ఆత్మకూరి చిరంజీవి, సుధాకర్, సారిక, దుర్గం దినకర్, మాలశ్రీ, కార్తీక్, రాజు, దివాకర్, కొమురక్క తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను పునరుద్దరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంలోని బాలభారతి పాఠశాల నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్లతో కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్.త్రివేణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్కుమార్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, నాయకులు నగరం పద్మ, శంకర్, సంజీవ్, వివిధ వర్గాల కార్మికులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో సక్సెస్ రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన కార్మికులెవ్వరూ విధులకు హాజరు కాలేదు. కైరిగూడ ఓసీపీతోపాటు వివిధ డిపార్టుమెంట్లు వెలవెలబోయాయి. ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోగా రవాణా కూడా ఆగిపోయింది. మొదటిషిఫ్టు నుంచి నైట్ షిఫ్టు వరకు మూడు షిఫ్టులో కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో ఏరియా సుమారు 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని కోల్పోవాల్సి వచ్చింది. సింగరేణి అధికారుల అంచనా ప్రకారం.. సమ్మె ప్రభావంతో ఏరియాలో 8 వేల టన్నుల ఉత్పత్తి నష్టం సంభవించగా.. ఉత్పత్తి పరంగా ఏరియా రూ.84.5లక్షల వరకు నష్టపోయినట్లు అంచనా వేశారు. ఏరియాలో సుమారు 800 మంది కార్మికులు పనిచేస్తుండగా.. వారు రూ.38లక్షల వరకు జీతాల రూపంలో నష్టపోయారు. సమ్మె విజయవంతం కావడంపై ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. -
జోరుగా గ్లైఫోసెట్ రవాణా!
● మహారాష్ట్ర నుంచి జిల్లాకు.. ● నిషేధిత గడ్డిమందుతో పర్యావరణానికి ముప్పు ● వానాకాలం సీజన్లో విచ్చలవిడిగా వినియోగంచింతలమానెపల్లి(సిర్పూర్): గ్లైఫోసెట్ మానవాళికే ప్రమాదకరంగా మారిన ఓ గడ్డిమందు. ఈ నాన్ సెలక్టివ్ హెర్బిసైడ్ ద్వారా దుష్పరిణామాలు ఎన్నో ఉన్నా జిల్లాలో చాలామంది విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఈ కలుపు నివారణ మందు మొక్కల్లో ఉండే జీవ ఎంజైమ్లను నాశనం చేయడం ద్వారా మొక్కలను ఎదగకుండా చేస్తుంది. మొదట ఓ అమెరికా కంపెనీ రౌండప్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత దుష్పరిణామాలను పరిగణనలోకి తీసుకుని చాలా దేశాలు దీనిని నిషేధించడమో.. లేక పరిమితి విధించి నియంత్రించడానికి చట్టాలు రూపొందించాయి. జిల్లాలో నిషేధం.. మహారాష్ట్రలో అనుమతి తెలంగాణలో పూర్తిస్థాయి నిషేధం ఉండగా, సరిహద్దులోని మహారాష్ట్రలో నియంత్రణ మాత్రమే ఉంది. అక్కడ అధికారులు సిఫార్సు చేయకుండా వినియోగించే అవకాశం లేదు. రైతులు పత్తి పంటలో కలుపు మొక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు విస్తృతంగా బీటీ 3 విత్తనాలు సాగు చేస్తున్నారు. ఈ విత్తనాలు వాడిన చేలలో గ్లైఫోసెట్ వినియోగించవచ్చు. కలుపు పెరిగినా శ్రమ లేకుండా నివారించవచ్చు. ఈ కారణంతోనే జిల్లాలో బీటీ 3 విత్తనాలు, గ్లైఫోసెట్ గడ్డి మందు వాడుతున్నారు. జిల్లాకు సరిహద్దుగా వాంకిడి, సిర్పూర్(టి), చింతలమానెపల్లి మండలాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అలాగే కొంతమంది రైతులు కూడా మహారాష్ట్రలో కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, ఆష్టి, గోండ్పిప్రి, అహేరి, ఆళ్లపల్లి పట్టణాలోని జి ల్లా రైతులను లక్ష్యంగా చేసుకునే విక్రయాలు జరుపుతున్నారు. వ్యాపారులు మహారాష్ట్రలో లీటర్ రూ.500కు కొనుగోలు చేసి స్థానికంగా రూ.వెయ్యి నుంచి రూ.1200లకు విక్రయిస్తున్నారు. తాజాగా చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద సోమవారం రాత్రి రూ.16వేల విలువైన గ్లైఫోసెట్ మందు, ఖర్జెల్లి శివారులో నిర్వహించిన తనిఖీల్లో రూ. 24వేల విలువైన 30లీటర్ల గ్లైఫోసెట్ గడ్డిమందు లభ్యమైంది. వాంకిడి మండలంలోనూ సోమవారం రాత్రి 40 లీటర్లను పోలీసులు పట్టుకున్నారు. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
దండేపల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనోద్దిన్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నెల్కి వెంకటపూర్ గ్రామానికి చెందిన కోవ మహేందర్ (19) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన మహేందర్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించగా మద్యం మానేసి, మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని వైద్యులు చెప్పారు. కానీ మహేందర్ మద్యం మానేయలేదు. ఈనెల 5న కడుపునొప్పి తీవ్రంగా ఉందని, చనిపోవాలని ఉందంటూ అన్న లక్ష్మణ్కు చెప్పాడు. తాగుడు మానివేసి మందులు వాడితే కడుపునొప్పి తగ్గుతుందని లక్ష్మణ్ సముదాయించాడు. అదేరోజు మధ్యాహ్నం మందుల కోసం ఇంట్లో నుంచి వెళ్లిన మహేందర్, దండెపల్లి వాగులో పురుగుల మందు తాగి స్నేహితుడు మోకాషి శేఖర్కు ఫోన్ చేసి చెప్పాడు. శేఖర్ వెంటనే లక్ష్మణ్కు ఫోన్ చేయగా లక్ష్మణ్ అక్కడకు చేరుకుని బైక్పై మహేందర్ను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పీహెచ్సీలో ప్రసవ వేదన
వేమనపల్లి: పురిటినొప్పులతో వేమనపల్లి పీహెచ్సీకి వెళ్తే గర్భిణీకి వైద్యం కరువైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా నర్సయ్యపల్లికి చెందిన కొండగొర్ల సోనియా కాన్పు కోసం మూడు నెలల క్రితం వేమనపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. పీహెచ్సీ వైద్యంపై నమ్మకం లేక మంచిర్యాల, చెన్నూర్ ప్రైవేట్ వైద్యుల వద్ద వైద్యపరీక్షలు చేయించుకుంటోంది. ఈ నెల 17వ తేదీన ప్రసవానికి సమయం ఇచ్చారు. కాగా బుధవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో వేమనపల్లి పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఏ ఒక్క సిబ్బంది అందుబాటులో లేరు. గత్యంతరం లేక పీహెచ్సీలోని బెడ్పై పడుకోబెట్టగా తీవ్రమైన నొప్పులతో విలవిలలాడింది. పీహెచ్సీలోనే గంటసేపు వేచి చూశారు. కొంతసేపటికి గ్రామంలోనే ఉన్న కాంటిజెంట్ వర్కర్ నిర్మల వచ్చారు. వైద్యాధికారి రాజేశ్కు సోనియా అన్నయ్య రజినీకాంత్ ఫోన్ చేసినా స్పందించలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని 108 అంబులెన్స్లో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నట్లు భర్త స్వామి, తల్లి గౌరక్కలు తెలిపారు. -
● కేజీబీవీలకు సరఫరా కాని ఇంటర్ పాఠ్యపుస్తకాలు ● ఇప్పటికే ప్రారంభమైన తరగతులు ● ఆందోళన చెందుతున్న విద్యార్థులు ● ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పంపిణీ పూర్తి
ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని సంజన. దహెగాం కేజీబీవీలో ఇంట ర్మీడియెట్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తరగతులు ప్రారంభమై 25 రోజులు దాటినా ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. పాత పుస్తకాలతోనే కాలం వెల్లదీస్తోంది. ఆలస్యం అవుతుండడంతో చదువులో వెనుకబడిపోతున్నామని వాపోయింది. జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న బాలికలందరిదీ ఇదే పరిస్థితి.దహెగాంలోని కేజీబీవీలో బోధిస్తున్న అధ్యాపకురాలు(ఫైల్)దహెగాం(సిర్పూర్): చదువు మధ్యలో ఆపిన బాలికలు నష్టపోవద్దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) ఏర్పాటు చేసింది. పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రైవేట్ కళాశాలలకు వెళ్లలేని వారి కోసం ప్రభుత్వం విడతల వారీగా ఇంటర్ తరగతులు సైతం ప్రారంభిస్తున్నారు. అయితే కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు నేటికీ పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై 25 రోజులు దాటడంతో బాలికలు పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నారు. 13 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు జిల్లాలో మొత్తం 15 కస్తూరిబా విద్యాలయాలు ఉండగా, 13 చోట్ల కళాశాలలు కొనసాగుతున్నాయి. పెంచికల్పేట్, కౌటాల కేజీబీవీల్లో ఇంకా ఇంటర్ అందుబాటులోకి రాలేదు. జూన్ 12 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నేటికీ ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 623 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరంలో 547 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు నష్టపోకుండా పాత పుస్తకాలతోనే పాఠాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బాలికలు పాత పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నారు. అయితే పాత పుస్తకాలు ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ కాలేజీలకు సరఫరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభమై నెల రోజులు కావొస్తోంది. జూన్ 1 నుంచే వీరికి తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఫస్టియర్లో 1,577 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,535 మంది చదువుకుంటున్నారు. వీరందరికి గత నెలలోనే పాఠ్య పుస్తకాలు అందించారు. తరగతులు సైతం కొనసాగుతున్నాయి. -
● కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ సూచనతో ప్రారంభం ● ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరణకు సిబ్బంది నియామకం ● ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు
ఆసిఫాబాద్: భూసమస్యలు పరిష్కరించాలని, గ్రామానికి రోడ్డు వేయాలని, పింఛన్ మంజూరు చేయాలని, ఉపాధి చూపి ఆదుకోవాలని.. ఇలా అనేక సమస్యలతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి బాధితులు ప్రతీ సోమవారం కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. అధికారులకు బాధలు చెప్పుకుని పరిష్కారించాలని వేడుకుంటున్నారు. ప్రజల సౌకర్యార్థం ఇక నుంచి సోమవారం మాత్రమే కాకుండా ప్రతీ రోజు దరఖాస్తులు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జీ– 3లో దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ సెల్ ప్రారంభించారు. ఇన్చార్జి మంత్రి సూచనతో.. ప్రతీ సోమవారం కలెక్టరేట్తోపాటు కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వారానికి సగటున వందకు పైగా అర్జీలు వస్తున్నాయి. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతీరోజు దరఖాస్తులు స్వీకరించేలా కలెక్టరేట్లలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనలకు అనుగుణంగా ఆసిఫాబాద్లోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఈ నెల 8న అధికారులతో కలిసి ‘ప్రతి దినం ప్రజల కోసం కలెక్టర్ గ్రీవెన్స్’ పేరుతో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఇద్దరు సిబ్బందిని నియమించారు. కార్యాలయ పని వేళల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. పనివేళల్లో స్వీకరణ కలెక్టరేట్లో ఇక నుంచి పనిరోజుల్లో ఎప్పుడైనా ప్రజలు అర్జీలు సమర్పించవచ్చు. కలెక్టర్ అందుబాటులో ఉంటే నేరుగా ఆయనకే బాధలు చెప్పుకోవచ్చు. లేనిపక్షంలో గ్రీవెన్స్ సెల్లో సిబ్బంది దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వాటిని ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపిస్తారు. మంగళవారం రెండు దరఖాస్తులు రాగా, వాటిని ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత మండలాలకు పరిష్కారం కోసం పంపించారు. జవాబుదారీతనం పెరగడంతోపాటు సమస్యల పరిష్కారంలో పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంప్రజల సౌకర్యం కోసమే జిల్లా కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కొంతమందికి అనుకూలంగా లేకపోవడంతో నిత్యం దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేశాం. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకే ఈ కేంద్రం ప్రారంభించాం. దరఖాస్తులు పరిష్కార స్థితి ఏ స్టేజీలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇది కొత్త ఆలోచన విధానం. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశ్ దోత్రే, కలెక్టర్ ఏడాదిలో 2,244 దరఖాస్తులుప్రత్యేక జిల్లాగా మారిన తర్వాత ప్రజలకు పాలన చేరువైంది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో సుమారు వందకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో మొత్తం 2,244 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,517 దరఖాస్తులు పరిష్కరించగా, 625 పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన 102 అర్జీలను పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించారు. గ్రీవెన్స్లో అధికంగా వ్యవసాయ సంబంధిత సమస్యలే ఉంటున్నాయి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లుతోపాటు వివిధ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. -
వసతిగృహాల్లో శుభ్రత పాటించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): వసతిగృహాల్లో శుభ్రత పాటించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని వసతి గృహాలు, గిరిజన పాఠశాలలు, లింబుగూడలోని మల్టీపర్పస్ సెంటర్, మండల ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీవో మాట్లాడుతూ నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం రావాలన్నారు. మండల ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుడు వినయ్ ఉప్రేను ఆదేశించారు. మల్టీ పర్పస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెయింటింగ్, మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వారి వెంట డీటీడీవో రమాదేవి, వివిధ శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సమస్య పరిష్కరించాలని రైతు ఆత్మహత్యాయత్నం
లక్ష్మణచాంద: తన భూ సమస్య పరిష్కరించడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణచాందకు చెందిన రైతు పసుపుల గంగాధర్కు 10 గుంటల భూమి ఉంది. దానికి పట్టాపాస్ బుక్ ఉండడంతో పాటు ఏటా వివిధ ప్రభుత్వ పథకాలు కూడా పొందుతున్నాడు. అయితే ఆ భూమిని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి తనదిగా చెబుతూ సాగు చేసుకుంటున్నాడు. తన భూమిని తనకు చూపాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. మనస్తాపం చెందిన గంగాధర్ బుధవారం మధ్యాహ్న సమయంలో తహసీల్ధార్ కార్యాలయం వద్దకు వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా గమనించిన రైతులు, అధికారులు అడ్డుకొని మందు డబ్బా లాక్కున్నారు. అనంతరం తహసీల్దార్ సరిత రైతుతో మాట్లాడారు. దీనిపై సాక్షి తహసీల్దార్ సరితను వివరణ కోరగా రైతు ఫిర్యాదుతో గతంలోనే సర్వేయర్ వెళ్లి పంచనామా నిర్వహించారన్నారు. దానికి రైతు సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో డీఐకి, ఏడీ నిర్మల్కు చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతు ఫిర్యాదు పంపుతున్నట్లు తెలిపారు. -
ఇసుక లారీ పట్టివేత
బోథ్: మండల కేంద్రంలో ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర రావు, ఎస్సై ప్రవీణ్ కుమార్లు తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా సోఫీనగర్ నుంచి ఇసుక లారీ అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా బుధవారం మండల కేంద్రానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మాజీద్ అనే వ్యక్తి మండల కేంద్రానికి చెందిన ఇజాజ్ అనే వ్యక్తికి 40 టన్నుల ఇసుక తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. -
ట్రిపుల్ఐటీలో ముగిసిన కౌన్సెలింగ్
భైంసా: ట్రిపుల్ఐటీ బాసర, మహబూబ్నగర్ సెంటర్లకు 2025 –26 విద్యా సంవత్సరానికి గాను తొలివిడత కౌన్సెలింగ్ బుధవారం ముగిసింది. మూడవ రోజు ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్లు కౌన్సెలింగ్ ప్రారంభించారు. రెండు సెంటర్లలో కలిపి 1690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మూడు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్లో 1472 మంది విద్యార్థులు హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలోనే వెయిటింగ్ లిస్టు ఆధారంగా భర్తీ చేస్తామని క్యాంపస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ బాసర క్యాంపస్ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. -
ప్రాజెక్టులో యువకుడి మృతదేహం లభ్యం
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వచ్చి గల్లంతైన యువకుడి మృత దేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన అడ్డెల రఘు(24) తన స్నేహితుడితో కలిసి సరదాగా ప్రాజెక్టు వద్దకు మంగళవారం చేపలు పట్టడానికి వచ్చారు. చేపలు పట్టే క్రమంలో ప్రాజెక్టు గేట్ల సమీపంలో రఘు ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. తన స్నేహితుడు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నీటిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి సోదరుడు అజయ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. బాధితుడికి నష్టపరిహారం అందజేతకాసిపేట: మండలంలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన రైతు బుద్దె రాజలింగుకు చెందిన లేగదూడ పెద్దపులి దాడిలో మృతి చెందగా బాధితుడికి అటవీశాఖ ఆధ్వర్యంలో 24గంటల్లో నష్టపరిహారం అందజేశారు. ముత్యంపల్లి సెక్షన్ పరిధి మల్కేపల్లి బీట్లో మంగళవారం పెద్దపులి దాడిలో లేగదూడ మృతి చెందగా బుధవారం బాధిత రైతుకు బెల్లంపల్లి రేంజ్ కార్యాలయంలో రేంజ్ అధికారి పూర్ణచందర్ రూ. 20వేల నష్టపరిహారం అందజేశారు. డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్నాయక్, ఎఫ్బీవో శ్రీధర్ పాల్గొన్నారు. కోడి పందేల స్థావరంపై దాడిజైపూర్: మండలంలోని దుబ్బపల్లి గ్రామ శివారులో బుధవారం కొంతమంది వ్యక్తులు కోడి పందేలు ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మాట్లాడుతూ కోడి పందెం ఆడుతున్న సీసీసీ, నస్పూర్కు చెందిన గడ్డం సతీశ్, లక్షెట్టిపేట కుమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేశ్, శ్రీరాంపూర్ తీగలపహాడ్కు చెందిన కట్కూరి రాజేశ్లను పట్టుకోగా ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్, యతిరాజు వంశీ, మహేశ్, వైద్య గణేశ్లు, టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్, గోదావరిఖనికి చెందిన పాకి సందీప్, నస్పూర్కు చెందిర రంగు సాయి, అరుణక్కనగర్కు చెందిన ఉదయ్లు పోలీసులను చూసి పారిపోయినట్లుగా తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద ఒక్క కోడి, 31కోడి కత్తులు, రూ.3840లు, మూడు సెల్ ఫోన్లు, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. చెన్నూర్ ఎంఈవోపై విచారణచెన్నూర్: మండల విద్యాధికారి కొమ్మెర రాధాకృష్ణమూర్తిపై డీటీఎఫ్ ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.లలిత బుధవారం విచారణ చేపట్టారు. ఎంఈవో విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఉపాధ్యాయుల సర్వీసు బుక్ రికార్డు పూర్తి చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విచారణ నివేదిక డీఈవోకు నివేదించనున్నట్లు లలిత తెలిపారు. -
జలదిగ్బంధంలో కామాయి గ్రామం
సాత్నాల: భోరజ్ మండలంలోని కామాయి గ్రామానికి చిరుజల్లులు పడితేనే రాకపోకలు నిలిచిపోతున్నాయి. గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. పెన్ గంగ నది పరీవాహక ప్రాంతంలో ఉండే ఈ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రహదారిపై లోలెవల్ వంతెన ఉండటంతో చిన్నవర్షానికే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుంది. కుడి వైపున పెన్గంగా, ఎడమవైపు లో లెవల్ వంతెనపై వరదనీరు పొంగిపొర్లడంతో బుధవారం సాయంత్రం వరకు గ్రామస్తులు జలదిగ్బంధంలో కూరుకుపోయారు. సాయంత్రం 7 గంటల తర్వాత బ్రిడ్జిపైన వరద నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్బాల్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులపాటు జరుగనున్న పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు మరలకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. సరైన మార్గంలో జీవనం సాగించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచింగ్ క్యాంప్ రామకృష్ణాపూర్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, గణపతి తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు లీగ్ పోటీలు.. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల కోసం స్టేడియంలో రెండు గ్రౌండ్లు సిద్ధం చేశారు. మొదటిరోజు గ్రౌండ్ నంబర్ 1లో నిజామాబాద్ –సిద్దిపేట జట్లు తలపడగా నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జట్లు పోటీ పడగా మహబూబ్నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ మధ్య జరిగిన లీగ్లో ఆదిలాబాద్ గెలుపొందాయి. రెండో గ్రౌండ్లో మెదక్ –గద్వాల్ జట్లు తలపడగా గద్వాల్, కరీంనగర్ –నల్గొండ జట్ల మధ్య జరిగిన లీగ్లో నల్గొండ జట్లు గెలుపొందాయి. -
దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత
కుభీర్: దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి దొంతుల పుష్ప అనే మహిళ నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భైంసా వెళ్లేందుకు దొంతుల పుష్ప అనే మహిళ మండల కేంద్రంలోని బస్టాండ్కు వచ్చారు. అక్కడ ఆమెకు ఒక పర్సు దొరికింది. అందులో రూ.24,416ల నగదు, వెండి కాళ్లగజ్జలు (ఒక జత), ఇద్దరు మహిళలు, ఒక పిల్లడి ఫొటోలు ఉన్నాయి. ఒక ఫొటోపై యువతి పేరు కవిత అని రాసి ఉంది. కాగా దొంతుల పుష్ప దొరికిన పర్సును తన భర్త దత్రాత్రితో పోలీస్స్టేషన్కు పంపించి తన నిజాయితీ చాటుకున్నారు. భర్త పర్సును ఎస్సై కృష్ణారెడ్డికి అప్పగించారు. డబ్బు పోగొట్టుకున్న వారు సరైన ఆధారాలు చూపి డబ్బు తీసుకుపోవచ్చని ఎస్సై తెలిపారు. -
బాధితుడి నిర్వాకంతో అధికారుల హైరానా
కై లాస్నగర్: కలెక్టర్ను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి కలెక్టరేట్లో మూర్చ పేరిట కిందపడిపోయి అధికారులు హైరానా పడేలా చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇచ్చోడ మండలం గెర్జాం గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తి తన భూ సమస్యను కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చాడు. తహసీల్దార్ చాంబర్లోకి వెళ్లి మూర్చపోయినట్లు కిందపడ్డారు. దీంతో తహసీల్దార్ శ్రీనివాస్తో పాటు కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆర్డీవో వినోద్కుమార్ సైతం అక్కడి చేరుకున్నారు. బాధితుడు పడిపోయి ఉండడంతో వివరాలు ఆరా తీశారు. ఆ సమయంలోనే చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. దీంతో కార్యాలయ సిబ్బంది 108 అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. కాగా తన భూమిని కొందరు కబ్జా చేయగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మూర్చపోయినట్లు నాటకాలు ఆడినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
సమస్య గుర్తింపు ఇక ఈజీ
● విద్యుత్ లైన్లపై లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు ● సమస్య గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు కొత్త విధానం ● అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు ● త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. కడెం: అటవీ ప్రాంతాల్లో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతుంటాయి. వానాకాలంలో ఈదురుగాలులు సంభవించినప్పుడు విద్యుత్లైన్పై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ సమస్య ఏర్పడినపుడు సమస్యను గుర్తించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్శాఖ సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తుంటారు. అంతవరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతారు. ఇక నుంచి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయానికి చెక్ పడనుంది. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్శాఖ అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా లైన్ఫాల్ట్ కండక్టర్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 12 చోట్ల ఏర్పాటు.. విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పరిష్కరించేలా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు విద్యుత్ సరఫరా అందించే విద్యుత్లైన్లపై అటవీ ప్రాంతాల్లో లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశారు. కడెం, పెంబి మండలాల్లోని 33 కేవీ లైన్పై ఆరుచోట్ల, కడెం మండలంలోని అల్లంపల్లి, ఉడుంపూర్, ఖానాపూర్ మండలంలోని రాజురా 11 కేవీ విద్యుత్లైన్లపై సైతం వీటిని ఏర్పాటు చేశారు. లైన్ఫాల్ట్ కండక్టర్ల ద్వారా విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైవిద్యుత్ సమస్య తలెత్తిన ప్రాంతానికి వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది. పని తీరు ఇలా.. విద్యుత్ సరఫరా నిలిచిపోగానే వైర్లకు ఉన్న మూడు కండక్టర్లు ఎరుపు రంగులో మెరుస్తుంటాయి. లైన్ఫాల్ట్ కండక్టర్ల వద్ద విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సోలార్ సిస్టం ద్వారా లైన్మెన్, ఏఈఈ, డీఈఈ, ఎస్ఈ వరకు అంతరాయం సమాచారం అందజేస్తుంది. ఇందుకు సోలార్ సిస్టంలో సిమ్ వేసి ఉంచుతారు. అందులో సేవ్ చేసిన నంబర్లకు సమాచారం వెళ్తుంది. దీంతో పాటు విద్యుత్ లైన్కు ఎంత దూరంలో సమస్య ఉందని సమాచారం తెలిపే సిస్టం కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి సేవలు అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు పలుచోట్ల విద్యుత్లైన్లకు లైన్ఫాల్ట్ కండక్టర్లు ఏర్పాటు చేశాం. త్వరలోనే వీటి పూర్తిస్థాయి సేవలు అందుబుటులోకి వస్తాయి. – ఎం.రాంసింగ్, ఏఈఈ -
డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
రెబ్బెన: ఇటీవల ట్రాక్టర్ బోల్తాపడి పులికుంట గ్రామానికి చెందిన దుర్గం మారుతి మృతి చెందగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం పులికుంట వద్ద జాతీయ రహదారిపై మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ట్రాక్టర్ యజమాని మృతుడి కుటుంబానికి రూ. 5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ యజమాని వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. సుమారు 45 నిమిషాల పాటు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు విషయాన్ని ఏఎస్పీ చిత్తరంజన్ దృష్టికి తీసుకెళ్లగా హుటాహుటిన ఆయన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గురువారం ట్రాక్టర్ యజమానిని పిలిపించి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దాంతో రాస్తారోకో విరమించారు. -
చిన్నారుల మోములో చిరునవ్వులు
● కొనసాగుతున్న ‘ఆపరేషన్ ముస్కాన్– 11’ ● ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో రెండు బృందాలు ఏర్పాటు ● బాలకార్మికుల గుర్తింపు కోసం విస్తృతంగా తనిఖీలు ● గతేడాది 61 మంది చిన్నారులకు విముక్తి పెంచికల్పేట్(సిర్పూర్): పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి న బాలలు రెక్కల కష్టం చేస్తున్నారు. పుస్తకాలు, ఆటలతో గడవాల్సిన బాల్యం పరిశ్రమలు, వ్యాపా ర సముదాయాల్లో బందీగా మారుతోంది. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించే దిశగా, బందీలుగా మారిన చిన్నారుల మోములో చిరునవ్వులు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ – 11 కార్యక్రమం జూలై 1 నుంచి 31 వరకు కొనసాగనుంది. నెల రోజులపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల పరిధిలో తనిఖీలు చేపట్టేందుకు రెండు బృందాలు ఏర్పాటు చేశారు. బాలకార్మికుల స్థావరాలుగా నిలిచే పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో దాడులు నిర్వహించనున్నారు. గతేడాది ఆపరేషన్ ముస్కాన్– 10లో భాగంగా జిల్లావ్యాప్తంగా తనిఖీ లు నిర్వహించి 61 మంది చిన్నారులను గుర్తించా రు. వీరిలో 48 బాలకార్మికులు మంది ఉండగా.. బాల్య వివాహం జరిగిన ఒకరు, బడిమానేసిన పిల్ల లు 12 మంది ఉన్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి పిల్లలను వారికి అప్పగించారు. అలాగే 2022 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో మొత్తం 143 మందికి విముక్తి కల్పించారు. విస్తృతంగా తనిఖీలుజిల్లాలో 335 గ్రామ పంచాయితీలు ఉండగా, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగజ్నగర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. పోలీసు అధికారులు, శిశుసంరక్షణ, కార్మిక, బాలల హక్కుల పరిరక్షణ సమితి, విద్యాశా ఖ సమన్వయంతో ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజ న్లలో బందీలుగా ఉన్న బాలలను గుర్తించడానికి రెండు బృందాలు ఏర్పాటు చేశారు. కాగజ్నగర్ డివిజన్ బృందంలో ఎస్సై యాదగిరి, ఆసిఫాబాద్ డివిజన్ బృందంలో ఎస్సై చంద్రశేఖర్రావుతో పాటు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్, కార్మిక శాఖ నుంచి ఒకరి ని సభ్యులుగా నియమించారు. వీరు తప్పిపోయిన పిల్లలు, అనాథలు, వీధి బాలలను గుర్తిస్తారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, దాబాలు, మిల్లులు, ఇటుక బట్టీల్లో పనిచేసున్న పిల్లలకు విముక్తి కల్పిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అనాథ బాలికలను జిల్లా కేంద్రంలోని వసతి గృహాలకు తరలించి ఉచితంగా విద్య, వైద్యం, భోజన వసతి కల్పించనున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ వంటి పట్టణాలకు జిల్లా నుంచి వెళ్లి అనేకమంది రైసు మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అధికారులు వీరిపైనా దృష్టి సారించి పనుల్లో ఉన్న చేరిన చిన్నారులను గుర్తించాల్సి ఉంది. మరోవైపు జిల్లాలో ఇటీవల మానవ అక్రమ రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాలికలు, యువతులను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బాలికల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. బాలలను పనిలో పెట్టుకుంటే కేసులు బాలలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించింది. వారి హక్కులను కాలరాస్తూ పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. బడీడు పి ల్లలందరినీ తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు పంపించాలి. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేస్తాం. బాలకార్మికులను గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 నంబర్లకు సమాచారం అందించాలి. – బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు చర్యలు
ఆసిఫాబాద్: ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా రూ.5 లక్షలతో సమకూర్చిన 4 సీట్లతో కూడిన బోటు, 50 లైఫ్ జాకెట్లు, 20 రబ్బర్ ట్యూబులు, ఒక కోత యంత్రాన్ని మంగళవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్తో కలిసి పోలీస్, అగ్నిమాపక శాఖలకు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజల రక్షణ, ఆస్తులు నష్టపోకుండా సత్వరమే రెస్క్యూ చేసేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పోలీస్, అగ్నిమాపక శాఖల్లో 15 మందితో కూడిన శిక్షణ సిబ్బంది ఉన్నారన్నారు. గతంలో విపత్తులు సంభవించినప్పుడు మంచిర్యాల నుంచి సిబ్బంది వచ్చేవారని, ఇప్పుడు జిల్లాలోనే అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
జైనూర్(ఆసిఫాబాద్): సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని జైనూర్ మండల కేంద్రంలో మంగళవారం రైతులు రోడ్కెక్కారు. ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ వానాకాలం సీజన్లో ఎరువులు చేసేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో యూరియా కొరత ఏర్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవికుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. వ్యవసాయాధికారులతో మాట్లాడి ఎరువుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
వైఎస్సార్ ఆశయాలు నెరవేరుస్తాం
ఆసిఫాబాద్అర్బన్: బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్యాంనాయక్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలను వైఎస్సార్ అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆయన కలలను నిజం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రాపర్తి మురళి, నిజాం, లచ్చన్న, వినోద్, విశ్వనాథ్, బాలేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొరత లేదు
యూరియా● జిల్లాలో 6,400 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది ● రైతులెవరూ ఆందోళన చెందొద్దు ● నెలాఖరు వరకు సరిపడా నిల్వలు ● మోతాదుకు మించి వినియోగించొద్దని సూచన ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఏవో రావూరి శ్రీనివాసరావు వెల్లడిసాక్షి, ఆసిఫాబాద్: ‘వానాకాలంలో జిల్లాలోని రైతులు ప్రధానంగా పత్తి, సోయా, కంది, వరి పంటలు సాగు చేస్తున్నారు. యాసంగిలో మొక్కజొన్న, జొన్న పంటలు పండిస్తున్నారు. పంటల్లో అధిక దిగుబడి సాధించాలని, మొక్కలు ఏపుగా పెరగాలనే ఉద్దేశంలో రైతులు యూరియాను విచక్షణారహితంగా వినియోగించడంతో నేల పాడవడమే కాక.. పర్యావరణానికి హాని కలుగుతోంది. ఇది ధరిత్రికి, రైతులకు మంచిది కాదు. ప్రస్తుతం జిల్లాలో యూరియా కొరత లేదు. అధికంగా యూరియా వాడితేనే పంట ఏపుగా పెరుగుతుందనే అపోహాతో ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నారు. అయినా ఈ నెలాఖరు వరకు సరిపడా ని ల్వలు ఉన్నాయి.’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) రావూరి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లా రైతులు వానాకాలంలో ఏ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు? పంటల సాగు అంచనా ఎంత?డీఏవో: జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని 4.45 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని అంచనా వేశాం. ఇందులో ప్రధానంగా పత్తి 3.35 లక్షల ఎకరాలు, వరి 55 వేలు, కంది 32 వేలు, పెసర, సోయా, ఇతర హార్టికల్చర్ పంటలు మరో 23వేల వరకు ఉంటాయి. సాక్షి: యూరియా కొరతతో జిల్లాలో రైతులు బ్లాక్లో ఎరువులు కొనాల్సిన పరిస్థితులు ఉంటు న్నాయి? నిజంగా జిల్లాలో కొరత ఉందా? డీఏవో: జిల్లాలో పంట సాగుకు అనుగుణంగా 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 45 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 20 వేల మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరమవుతుందనే అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అలాగే కాంప్లెక్స్ 18 వేలు మె.టన్నులు, పొటాష్ 230 మెట్రిక్ టన్నులు దిగుమతి అయ్యింది. సాక్షి: గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఎరువులు పంపుతోంది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? డీఏవో: కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం, నేల ఆరోగ్యం కాపాడాలనే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే యోచన చేస్తోంది. గతంలో ఒకేసారి ఎరువులు దిగుమతి అయ్యేవి. రైతులు యూరియాను మోతాదుకు మించి వినియోగించడం అలవాటు చేసుకున్నారు. దీనిని గమనించిన కేంద్రం.. ఇప్పుడు నెలవారీగా రైతులకు సరిపడా మాత్రమే ఎరువులను రాష్ట్రాలకు పంపిస్తోంది. సాక్షి: ఇప్పటివరకు జిల్లాలో ఎంత యూరియా నిల్వ ఉంది? ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు ఎంత అవసరం పడుతుంది? డీఏవో: జిల్లాలో 6400 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. ఇది ఈ నెలాఖరు వరకు సరిపోతుంది. ఆగస్టుకు సంబంధించి 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఇండెంట్ను సర్కారుకు పంపించాం. సెప్టెంబర్కు సంబంధిచిన ఎరువులు ఆగస్టు నెలాఖరున వస్తాయి. సాక్షి: మోతాదుకు మించి యూరియా వాడితే జరిగే నష్టమేంటి? డీఏవో: రైతులు విత్తనం వేసిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు వినియోగించాలి. అంతేకానీ మొక్క వచ్చాక కూడా వాటిని వినియోగించరాదు. ఒక ఎకరానికి 90 కేజీల నుంచి 120 కేజీల వరకు వినియోగిస్తే సరిపోతుంది. కానీ జిల్లాలో ఎకరాకు రెండు, మూడు బస్తాలు వినియోగిస్తున్నారు. దీంతో నేల ఆరోగ్యం పాడవడమే కాకుండా చీడపీడల ఉధృతి పెరుగుతుంది. ఫలితంగా ఆశించిన దిగుబడులు రాకపోవచ్చు. సాక్షి: నానో యూరియా ఎప్పుడు వినియోగించాలి? దాని వల్ల ఉపయోగాలేంటి? డీఏవో: యూరియాకు బదులుగా రెండో దఫాలో నానో యూరియా స్ప్రేను రైతులు వినియోగించాలి. ఎకరాకు అర లీటరు చొప్పున వాడాలి. రెండు విడతలు వాడితే సరిపోతుంది. దీని వల్ల భూసారం దెబ్బతినదు. సాక్షి: జిల్లా చాలామంది రైతులు కాంప్లెక్స్, పొటాష్ వినియోగించడం లేదు? ఎందుకు? డీఏవో: వాస్తవానికి యూరియాతోపాటు పంటలకు పొటాష్, భాస్వరం ఇతర కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉంటుంది. పొటాష్ తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల మొక్క ధృడంగా పెరుగుతుంది. అయితే వీటి ధర ఎక్కువగా ఉండటంతో రైతులు పెద్దగా మొగ్గు చూపడం లేదు. -
కలెక్టరేట్లో ప్రతిరోజూ ప్రజావాణి
● గ్రీవెన్స్ సెల్ ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో ప్రతీ సోమవారం ని ర్వహించే ప్రజావాణితోపాటు ఇక నుంచి ప్రతి రో జూ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని జీ– 3లో ఏర్పాటు చేసి న గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ను అదనపు కలెక్టర్లు దీప క్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడు తూ ప్రతిరోజూ గ్రీవెన్స్ సెల్లో సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. గ్రీవెన్స్సెల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు. రెండు దరఖాస్తులు రాగా, ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత మండలాలకు పరిష్కారం కోసం పంపించారు. కలెక్టరేట్ ఏవో కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఇందిర గిరిజల వికాసం’ అమలుకు కమిటీలుఆసిఫాబాద్: జిల్లాలో ఇందిర గిరి జలవికాసం పథకం అమలు కోసం మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ ఎఫ్డీవో సుశాంత్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిర సౌర గిరిజల వికాసం పథకం మొదటి విడతలో పోడు పట్టా భూములకు సాగునీరు అందించేందు కు బోర్లు, వ్యవసాయ బావులు మంజూరు చేసి, సౌ ర విద్యుత్ అందించనున్నట్లు వివరించారు. రెండున్నర ఎకరాలు కలిగిన రైతులకు బోరు సౌకర్యం, రెండున్నర ఎకరాల లోపు రైతులుంటే ఇద్దరికి కలిపి బోర్లు, బావి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐదు విడతలుగా కార్యక్రమం ఉంటుందని, అటవీశాఖ నుంచి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. అనంతరం సంక్షేమ, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, డీఏవో శ్రీనివాసరావు, జిల్లా ఉ ద్యానవన శాఖ అధికారి నదీమ్, మిషన్ భగీరథ ఈ ఈ సిద్దిక్, ట్రాన్స్కో ఎస్ఈ శేషారావు పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర వసతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు. సబ్జెక్టుల వారీగా అర్థమయ్యేలా బోధించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో దోమల వ్యాప్తిని అడ్డుకుని, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాల పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వంటగది, స్టోర్రూం, మరుగుదొడ్లు నిత్యం శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం పదో తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు రోగులకు తెలిసీతెలియని వైద్యం అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రథమ చికిత్స మా త్రమే అందించాలనే, ఇతర కేసులను ప్రభు త్వ ఆస్పత్రులకు రెఫర్ చేయాలని సూచించా రు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎ లాంటి చికిత్స చేయొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
సమస్యల వెల్లువ
● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అర్జీలు స్వీకరించి బాధితులకు భరోసా కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కాగజ్నగర్ మండలం అందవెల్లికి చెందిన జెల్లా వాణి, చింతలమానెపల్లి మండలం బాబాపూర్కు చెందిన పుణ్యపురెడ్డి కవిత, ఆసిఫాబాద్ మండలం నూర్నగర్కు చెందిన ఫర్జానా బేగం వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. వితంతు పింఛన్ ఇప్పించాలని కాగజ్నగర్ మండలం చింతగూడకు చెందిన డి.శాంత విన్నవించింది. ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడలోని పోచమ్మ దేవాలయానికి వెళ్లే దారిని కొంతమంది ఆక్రమించుకున్నారని, విచారణ చేపట్టి శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. కోసిని గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక నిర్మాణ పనులు పూర్తి చేశానని, బిల్లులు ఇప్పించాలని చింతలమానెపల్లి మండలం గంగాపూర్కు చెందిన దంద్రె శ్రీధర్ కోరాడు. వంశపారపర్యంగా వచ్చిన పట్టా భూమిని కొందరు ఆక్రమించుకుని పట్టా మార్చుకున్నారని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఆసిఫాబాద్ మండలం పర్శనంబాలకు చెందిన తానుబాయి కోరింది. తనకు తెలియకుండా పట్టా భూమిని వేరే వ్యక్తులు పట్టా మార్చుకున్నారని, విచారణ చేపట్టాలని తిర్యాణి మండలం కోయతలండికి చెందిన పెట్టం రాజలింగు కోరాడు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.పెంకుటింట్లో ఉంటున్నాం నేను నిరుపేదరాలిని. పెంకుటింట్లో ఇబ్బందిగా కాలం వెల్ల దీస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు కోసం గతంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికై నా ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – దుప్ప శాంత, చింతగూడ, మం.కాగజ్నగర్ఉద్యోగం ఇప్పించాలి మా తండ్రి పైకురావును 1990లో మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగావకాశం కల్పించింది. నాకు ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం కల్పించడం లేదు. నా వయస్సు దాటిపోయి, నా కుమారుడు మేజర్ అయినప్పటికీ స్పందన లేదు. నాకుగానీ.. కుమారుడికిగానీ అర్హత ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం కల్పించి పరిహారం చెల్లించాలి. – కొట్నాక కిషన్రావు, గుందాడ, మం.వాంకిడి -
సార్వత్రిక సమ్మెకు దూరంగా ఉండాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి పరిధిలో పరిష్కరించే డిమాండ్లు లేనందున ఈ నెల 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంస్థ ఉద్యోగులు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వగా, ఈ సమ్మెలో అధికశాతం డిమాండ్లతో సింగరేణి కార్మికులకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు. సంస్థ పరిధిలో లేని సమస్యల కోసం సమ్మెకు వెళ్లడం సరికాదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తితోపాటు ఓబీ వెలికితీతలో వివిధ కారణాలతో వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. జూలై, ఆగస్టులో వర్షాల ప్రభావంతో ఓసీపీల్లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలగనుందని, వార్షిక లక్ష్య సాధనకు కార్మికులు సహకరించాలని కోరారు. సింగరేణి సంస్థలో ఒక రోజు రూ.76 కోట్ల ఉత్పత్తి జరుగుతుందని, కార్మికులు వేతనాల రూపంలో రూ.13.07 కోట్లు నష్టపోతారని ఆయన తెలిపారు. సమావేశంలో డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, డీవైపీఎం రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా అనిల్యాదవ్
కైలాస్నగర్: క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యే క దృష్టి సారించింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్ర ధాన కార్యదర్శులను నియమించిన టీపీసీ సీ.. తాజాగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జీలను ని యమించింది. ఉమ్మడి ఆదిలాబాద్కు రాజ్య సభ సభ్యుడు ఎం.అనిల్కుమార్ యాదవ్కు బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగి గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ కమిటీల నియామక ప్రక్రియ పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి సారించడంపై శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు అనిల్ కుమార్ ఈ వారంలోనే జిల్లా పర్యటనకు రానున్నట్లుగా సమాచారం. -
మత్తుకు బానిస కావొద్దు
కాగజ్నగర్రూరల్: యువత మత్తుకు బానిస కావొద్దని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్నగర్ మండలం బురదగూడ గ్రామంలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనకు ప్రజలు, యువత, విద్యార్థులు సహకరించాలని కోరారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల బారినపడి యువత జీవితాలు కోల్పోతున్నారన్నారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని, వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి, చెడులు వివరించి, క్రమశిక్షణ నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, రూరల్ సీఐ శ్రీనివాస్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్భయంగా సేవలు వినియోగించుకోవాలిఆసిఫాబాధ్: జిల్లా ప్రజలు నిర్భయంగా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిస్థితి, పరిష్కారానికి సూచనలు ఇచ్చా రు. ఆయన మాట్లాడుతూ ప్రజలు మూడో వ్యక్తి ప్ర మేయం లేకుండా పోలీస్ సేవలు వినియోగించుకో వాలని సూచించారు. చట్టప్రకారం సమస్యలు పరి ష్కరించేందుకు పోలీసులు పనిచేస్తారని తెలిపారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ -
18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు
ఆసిఫాబాద్: జిల్లాలో ఈ నెల 18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఆర్డీవో దత్తారావుతో కలిసి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, సెర్ప్ ఏపీఎంలు, డీపీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించేందుకు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 8వ తేదీన ప్రతీ మండలంలో మండల సమాఖ్య సభ్యులు, 9న గ్రామ సమాఖ్య సభ్యులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే ప్రమాదబీమా, రుణబీమా వర్తింపజేస్తుందన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, సోలార్ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, చేపల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, పాల డెయిరీలను ఏర్పాటు చేస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో మహిళా శక్తి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 22 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొనుగోలు చేయగా, రూ.20 లక్షల కమీషన్ వచ్చిందని వెల్లడించారు. 446 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ.7.82 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఏకరూప దుస్తులు అందించడంలో మహిళా సంఘాల కృషి అభినందనీయమన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి వనిత, కోశాధికారి కుసుమ, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
కొత్తరూపు!
రహదారులకు ● ‘హామ్’ పథకం కింద జిల్లా రోడ్లకు మహర్దశ ● తొలిదశలో 308.13 కిలోమీటర్ల వరకు అభివృద్ధి ● ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఆర్అండ్బీ, పీఆర్ శాఖలు ● డీపీఆర్ రూపకల్పనకు రంగంలోకి దిగిన కన్సల్టెన్సీ సంస్థసాక్షి, ఆసిఫాబాద్: అడుగు లోతు గుంతలు.. కంకర తేలిన రహదారులు.. ఇదీ జిల్లాలోని చాలా మార్గాల్లో రోడ్ల పరిస్థితి. త్వరలో ఈ రహదారులకు మహర్దశ పట్టనుంది. ‘హామ్’(హైబ్రిడ్ యూన్యుటీ మోడ్) పథకంతో గుంతలు, కంకర తేలిన రహదారులు సరికొత్త రూపుదిద్దుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పథకంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తొలిదశలో భాగంగా 308.13 కిలోమీటర్ల పొడవైన పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. వాటికి సంబంధించిన పనులను సర్వే చేసి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) రూపకల్పన కోసం ఓ ప్రైవేట్ కన్సెల్టెన్సీ సంస్థకు సర్కారు అప్పగించినట్లు తెలుస్తోంది. సదరు డీపీఆర్ ఆధారంగా సింగిల్ లేన్ రహదారులను రెండు లేన్లు, కంకర రోడ్లను తారు రోడ్లుగా మార్చనున్నారు. ఆర్అండ్బీ రహదారులు అప్గ్రేడ్..జిల్లా పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిదశలో భాగంగా 308.13 కిలోమీటర్ల పొడవున ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లను నూతనంగా నిర్మించనున్నారు. కిలోమీటరు సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో నెలరోజుల్లో టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. జిల్లా రహదారులు, భవనాల శాఖ(ఆర్అండ్బీ) పరిధిలో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రం నుంచి మండల కేంద్రానికి, గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారులను విస్తరించనున్నారు. మూడు విభాగాల్లో ఇప్పుడున్న రహదారులను రెండు, నాలుగు లేన్లుగా అప్గ్రేడ్ చేయనున్నారు. జిల్లా పరిధిలోని 122.3 కిలోమీటర్ల పొడవున రహదారులను నవీకరించనున్నారు. ఇందులో ఉట్నూర్– ఆసిఫాబాద్ 68 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.68 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్(టి) 28.8కిలో మీటర్ల పొడవున ఉన్న రోడ్డు కోసం సుమారు రూ.29 కోట్లు, సిర్పూర్– మకోడి మార్గంలో 10.5 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.11 కోట్ల వరకు, కల్వడ– వడ్డుగూడ 15 కిలోమీటర్ల రహదారి పనులకు రూ.15 కోట్లు వ్యయం కానుంది.పంచాయతీ రోడ్ల అభివృద్ధి ఇలా..ఇక జిల్లాలో పంచాయతీరాజ్ మంచిర్యాల సర్కిల్ పరిధిలో వచ్చే రహదారుల విషయానికి వస్తే.. ఈ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. మొత్తం మూడుదశల్లో 139 రహదారులను 633.90 కిలోమీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించడానికి ప్రతిపాదించారు. తొలిదశలో భాగంగా ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గాల పరిధిలోని 34 రోడ్లకు సంబంధించి 185.83 కిలో మీటర్ల పొడవున రహదారులు నిర్మించనున్నారు. ఇందులో ప్రధానంగా వీవీపీ రోడ్డు నుంచి బహ్లాన్పూర్ వరకు 22 కిలోమీటర్ల రహదారిని నవీకరించనున్నారు. అలాగే దాంపూర్ నుంచి అర్జున్లొద్ది వయా గిన్నెధరి, గాడలపల్లి రహదారిలో 13.4 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. రెండోదశలో 44 రహదారుల్లో 224.20 కిలోమీటర్ల వరకు, ఆ తర్వాత మూడో దశలో 61 రహదారుల్లోని 223.80 కిలోమీట్లర పొడవున రోడ్లు నవీకరించనున్నారు. మూడు దశల్లో అభివృద్ధి జిల్లా పరిధిలో ‘హామ్’ పథకం కింద మొదటిదశలో 185.83 కిలోమీటర్ల పంచాయతీ రాజ్శాఖ పరిధిలోని రహదారులను అప్గ్రే డ్ చేయనున్నాం. మొత్తం మూడు దశల్లో 139 మార్గాల్లో 633.90 కిలోమీటర్ల వరకు నూతన రహదారులను నిర్మించనున్నాం. ‘హామ్’ పథకంతో జిల్లాలోని రహదారులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. – అజ్మీరా కృష్ణ, పీఆర్ ఎస్ఈ -
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
ఆసిఫాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్క రూ మొక్కలు నాటాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భా గంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సో మవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో దత్తారావు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రహదారులకు ఇరువైపులా, ప్ర భుత్వ భూములు, కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాల ని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. -
‘జీవో 282 రద్దు చేయాలి’
రెబ్బెన: వ్యాపార సముదాయాల్లో పనివేళలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 282 వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల వేతనాలు పెంచాలని ఎనిమిదేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనక్కి తగ్గి 12 గంటల పనివిధానం అమలు చేసేందుకు భయపడుతున్నాయని అన్నారు. కార్మిక సంఘాలన్ని జేఏసీగా ఏర్పడి కేంద్రంపై పోరాడుతుండగా జేఏసీలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘం కూడా ఉండి రాష్ట్రంలో కార్మికుల పనివేళలు పెంచడం సిగ్గుచేటన్నారు. దొడ్డిదారిన తీసుకువచ్చిన 282 జీవో వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో కార్మికులు శంకర్, రవి, గురుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
అందని బ్యాంకు రుణాలు
ఆసిఫాబాద్: మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా స్వయం సహా యక సంఘాలను ఏర్పాటు చేసింది. ఆయా సంఘాల కు అవసరాల మేరకు తక్కువ వడ్డీకి బ్యాంకు లింకేజీతో రుణాలు అందజేస్తోంది. కానీ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహా యక సంఘాలకు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా జూన్లో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తారు. జిల్లాలో 6,295 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ ఏడాది 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.232.44 కోట్లు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణలక్ష్యం పెంచారు. ఒక్కో గ్రూప్లో 15 మంది సభ్యులు ఉండగా గ్రూప్కు రూ.15 లక్షల వరకు రుణాలు పంపిణీ చేస్తున్నారు. తీసుకున్న రుణాలను ప్రతీ నెల విడతల వారీగా చెల్లిస్తున్నారు. ఆన్లైన్లో కానరాని వివరాలుజిల్లా కేంద్రం ఆసిఫాబాద్ గతంలో గ్రామ పంచాయతీ ఉండగా రెండేళ్లక్రితం మున్సిపాలిటీగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో 12 మంది వీవోలు, 12 గ్రామ సంఘాలు, 271 స్వయం సహాయక సంఘాలు, 2,730 మంది సభ్యులు ఉన్నారు. వారంతా కొన్ని సంవత్సరాలుగా బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఆరు మాసాలుగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల వివరాలు ఆన్లైన్లో సెర్ఫ్, మెప్మా జాబితాలో చూపడంలేదు. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలకోసం ఇబ్బందులకు గురవుతున్నారు. రుణాలకోసం నిరీక్షణఆరు మాసాలుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలకోసం నిరీక్షిస్తున్నారు. ఆన్లైన్లో గ్రూపుల వివరాలు కనిపించక పోవడంతో గతనెల 30న ఆర్పీలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సెర్ఫ్, మెప్మా జాబితా లో సభ్యుల వివరాలు కనిపించక పోవడంతో వ్యవసాయ రుణాలకోసం సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకు రుణం అందించాలి ఉపాధికోసం ఏటా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నా. ఆన్లైన్లో జాబి తా కనిపించడంలేదని ఈ ఏడాది ఇప్పటి వరకు రు ణాలు ఇవ్వలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్యాంకు రుణం అందించి ఆదుకోవాలి. – జుల్లూరి శోభ, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, ఆసిఫాబాద్ సమస్య పరిష్కరిస్తాం సాంకేతిక కారణాల వల్ల ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల వివరాలు ఆన్లైన్లో రావడం లేదు. త్వరలో సమస్య పరిష్కరించి, రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం.– రామకృష్ణ, డీఆర్డీఏ అదనపు పీడీ పోర్టల్లో కానరాని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సంఘాల వివరాలు ఆరు మాసాలుగా సభ్యుల నిరీక్షణ -
త్యాగధనుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ
ఆసిఫాబాద్అర్బన్: సమైఖ్య భారతావని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిదని సీనియర్ న్యాయవాది పంచదార దీపక్రావ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శ్యామప్రసాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు శ్యాంప్రసాద్ ఆశయ సాధనకు అంకిత భావంతో ముందుకు సాగాలన్నారు. ఒకేదేశం, ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఆయన ఆశయమని, అది ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే అమలు చేయడం జరిగిందన్నారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముఖర్జీ తప్పుపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వినోద్, నాయకులు ఎగ్రస్ శ్రీకాంత్, మేకర్తి కోటేశ్, రాపర్తి పోశన్న, వవాల్కర్ పెంటన్న, తదితరులు పాల్గొన్నారు. కౌటాల: కేంద్ర మాజీ మంత్రి, జన్సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. ఆదివారం కౌటాలలో ముఖర్జీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్సంఘ్ స్థాపించి ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, మండల అధ్యక్షుడు కుంచాల విజయ్, మాజీ ఎంపీటీసీ దుర్గం మోతీరాం, నాయకులు రవి, కమలాకర్, భూమయ్య, మిథున్, నాగయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు. -
యువవిలాపం
తిర్యాణి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు నెలల క్రితం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకుని రూ.4 లక్షల వరకు వివిధ రకా ల యూనిట్ల కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూ డిన రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ. 50 వేల యూనిట్కు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం 70 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 29,756 దరఖాస్తులురాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో వివిధ వ ర్గాలకు చెందిన నిరుద్యోగులు 29,756 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికకోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖారా రు చేశారు. దీంతో పాటుగా అధికారులు దరఖాస్తుదారులకు సంబంధింత బ్యాంకు సిబ్బందితో కలిసి ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. దీంతో లబ్ధి దారుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇందుకు అనుగుణంగానే ఈ పథకాన్ని జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభిస్తామని ప్ర భుత్వం ప్రకటన చేసింది. కానీ నేటికీ పథకం అమలుకు నోచుకోలేదు. నెల రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి యువ వికాసం అమలుపై ఎలాంటి సృష్టత రాకపోవడంతో దరఖాస్తుదారుల్లో త్రీవ అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా? లేదా అని నిరుద్యోగులు ఆందోళ న చెందుతున్నారు. కాగా పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే సమాచారం కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికా రి, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.మండలం దరఖాస్తుదారులుఆసిఫాబాద్ 3040 బెజ్జూర్ 1788 చింతలమానెపెల్లి 1907 దహెగాం 1622 జైనూర్ 1860 కాగజ్నగర్ 5486 కెరమెరి 1761 కౌటాల 2327 లింగాపూర్ 793 పెంచికల్పేట్ 1072 రెబ్బెన 2827 సిర్పూర్(టి) 1616 సిర్పూర్(యూ) 893 తిర్యాణి 1690 వాంకిడి 1074 మొత్తం 29,756 ఇంటర్వ్యూలకే పరిమితమైన పథకం తదుపరి ప్రక్రియలు నిలిపివేత.. దరఖాస్తుదారుల్లో అసంతృప్తి ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంటర్ పూర్తి చేసిన నేను రాజీవ్ యువ వికాసం పథకంలో ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నా. జూన్ 2 నుంచే రుణాలు ఇస్తామని చెప్పారు. నేటికీ ఇవ్వలేదు. ఎవర్ని అడిగినా వివరాలు చెప్పడంలేదు. లోన్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతా. ప్రస్తుతం ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నా. – మహదేవుని పవన్, గోలేటి, రెబ్బెనమోసం చేయడం సరికాదు యువ వికాసం పేరిట రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకుండా దరఖాస్తుదారులను మోసం చేయడం సరికాదు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాలయాపన చేయకుండా వెంటనే అర్హులైన నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలి. – ఇగురపు సంజీవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి -
క్యాప్ స్కాలర్షిప్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: ప్రతిష్టాత్మక క్యాప్ స్కాలర్షిప్ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి బెల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థి ఎంపికయ్యాడు. మహారాష్ట్ర పూణెలోని ఇర్ఫాన్ పఠా న్ క్రికెట్ అకాడమీలో ఇటీవల క్యాప్ స్కాలర్షిప్ కోసం విద్యార్థుల ఎంపిక పోటీలు జరి గాయి. బెల్లంపల్లి అశోక్నగర్ బస్తీకి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థి రెడ్డి.రిత్విక్ అండర్–14 విభాగంలో సత్తాచాటాడు. క్యాప్ స్కాలర్షిప్ కోసం నిర్వహించే తుది క్రికెట్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించాడు. రిత్విక్ మరో మూడు క్రికెట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఆ పోటీల్లో మెరుగ్గా రాణిస్తే స్కాలర్ షిప్ పొందడానికి ఎంపికవుతాడు. ఎంపికై న విద్యార్థులకు రూ.2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. -
బాలికల వసతి గృహం తనిఖీ
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాన్ని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి(డీడీ)దుర్గాప్రసాద్ ఆదివారం తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది పరిసర ప్రాంతాలను కలియతిరిగారు. నిత్యావసర సరుకులు, రిజిస్టర్ పరిశీలించారు. భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహంలో బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి నిర్వహించారు. దుర్గాప్రసాద్ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రవీందర్గౌడ్, వసతిగృహ సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు. -
మధ్యాహ్నం దాటితే.. వాట్సాప్ వైద్యమే!
● రిమ్స్లో కొందరు సీనియర్ వైద్యుల తీరు ● జూడాలు వాట్సాప్ చేస్తే చికిత్సను వివరిస్తున్న వైనం ● అత్యవసర వైద్యం అందక రోగుల ఇక్కట్లు ● ఇటీవల ఓ వైద్యుడిపై ఆదిలాబాద్ కలెక్టర్ చర్యలు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఇటీవల మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రిమ్స్లో తనిఖీ చేపట్టారు. ఆ వార్డులో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేడు. దీంతో కలెక్టర్ సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించిన ఏడు రోజుల వేతనంలో కోత విధించారు. ఆర్ఎంవోగా పనిచేసే ఓ వైద్యురాలిని విధుల నుంచి తప్పించాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 4న మావల మండలంలోని శంకర్గుట్టకు చెందిన లక్ష్మణ్ కాలుకు గాయం కావడంతో కుటుంబీకులు రిమ్స్కు తీసుకొచ్చారు. వైద్యులు దాదాపు గంటకు పైగా వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత జూనియర్ డాక్టర్ వచ్చి కాలు గాయం ఫొటో తీసి సీనియర్ వైద్యులకు పంపినట్లు బాధితుడి కుటుంబీకులు తెలిపారు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో రక్తస్రావం కావడంతో ఆయన మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబీకులు టూటౌన్లో వైద్యులపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఆదిలాబాద్టౌన్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్లో పనిచేస్తున్న కొందరు వైద్యుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు. ఇక్కడ విధులు నిర్వహించడం కంటే ప్రైవేట్ ప్రాక్టీస్పైనే మక్కువ చూపుతున్నారు. కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు హెచ్చరించినా పెడచెడిన పెడుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నమే ఇంటిముఖం పడుతున్నారు. అత్యవసరమైతే జూనియర్ డాక్టర్ల ద్వారా వాట్సాప్ వైద్యం అందిస్తునట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో వైద్యం అందక పలువురు రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. రిమ్స్లో పనిచేసే చాలా మంది వైద్యులు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూనియర్ వైద్యులతోనే..జిల్లాకు పెద్ద దిక్కయిన రిమ్స్ ఆస్పత్రిలో నాణ్యమై న వైద్యం గగనంగా మారింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న పేదలు వైద్యం కోసం రి మ్స్కు వస్తున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం అందక ఇబ్బందులకు గురవుతున్నారు. రిమ్స్లో సీనియర్ వైద్యులు కొందరు తరచూ విధులకు ఎగనామం పెడుతున్నారు. రూ.లక్షల్లో వేతనం తీసుకుంటున్నా వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారని పలువురు పేర్కొంటున్నా రు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో వైద్యసేవలు అందించాల్సి ఉన్నా కొంతమంది మాత్రమే సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుండగా, మిగతా వైద్యుల జాడ లేకుండా పోతుంది. మెడికో లు, జూనియర్ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, పీజీ వైద్యులే రోగులకు దిక్కవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జూనియర్ వైద్యులు సీనియర్ వై ద్యులకు వాట్సాప్ ద్వారా కేషీట్, రిపోర్టులు పంపి వైద్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వారు వాట్సాప్లో చికిత్స గురించి తెలియజేస్తే ఆ ప్రకా రం రోగికి అందిస్తున్నా రు. రాత్రి వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఫోన్ చేస్తే వచ్చి వైద్యం అందించి ఇంటిముఖం పడుతున్నారు.రిమ్స్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులు మారని తీరు..రిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంది వైద్యుల తీరులో మార్పు కానరావడం లేదు. ఒకప్పుడు వైద్యు ల కొరత ఉండగా, ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి చూస్తే అత్యవసర విభాగాలైన ఎస్ఎన్సీయూ, ఎంఐసీ యూ, మెటర్నటి, ఇతర వార్డుల్లో డాక్టర్లు కని పించకుండా పోతున్నారు. ఆ సమయంలో జూనియర్ వైద్యులు సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం పూట హాజరు కోసమే వస్తున్నారనే విధంగా మారింది. ప్రతిరోజు రిమ్స్ డైరెక్టర్తో పాటు అప్పుడప్పుడు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా డుమ్మా వైద్యుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. వైద్యులు అందుబాటులో ఉంటున్నారు.. రిమ్స్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. రోగులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపడుతున్నాం. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
ఆదివాసీ భవన్ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
కెరమెరి: మండల కేంద్రంలోని నెహ్రూనగర్ సమీపంలో ఉన్న కుమురంభీం ఆదివాసీ భవన్ను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండల కేంద్రంలో ఉన్న ఏకై క ఆదివాసీ భవన్లో పక్కా ప్రణాళికతో టైల్స్ పగులగొట్టి విద్యుత్ వైర్లను, బోర్డు, బోరు స్టార్టర్ను దొంగిలించినట్లు తెలిపారు. దుండగులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, ఆదివాసీ సీనియర్ నాయకుడు సిడాం జగన్నాథ్రావు, రాజ్గోండ్ సేవాసమితి మండలాధ్యక్షుడు పెందోర్ రాజేశ్వర్, నాయకులు సోము, సిడాం ధర్మూ, కుమురం భీంరావు, తదితరులు పాల్గొన్నారు. -
బస్సుకోసం గంటలకొద్దీ నిరీక్షణ
చింతలమానెపల్లి: ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతోంది. సమయపాలన పాటించని బస్సులు, వసతులు లేక ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహారాష్ట్ర సరిహద్దులో గూడెం గ్రామం ఉంది. ఆదివారం మండల కేంద్రానికి, పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు, పలువురు చిన్నారులు గూడెంలో బస్సులు నిలిపే ప్రాంతానికి చేరుకున్నారు. ఒకవైపు వర్షం మరోవైపు బస్సు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రావాల్సిన సమయానికి బస్సు రాకపోవడంతో 40 మందికి పైగా ప్రయాణికులు కొన్ని గంటలపాటు రోడ్డుపైనే వేచిఉన్నారు. గూడెంలో ప్రయాణ ప్రాంగణం నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక..
● మున్సిపాలిటీల్లో గాడితప్పిన పారిశుద్ధ్య నిర్వహణ ● నిషేధిత ప్రాంతాల్లో చెత్తను వేస్తున్న ప్రజలు ● పొంచిఉన్న వ్యాధుల ముప్పు ● 100 రోజుల ప్రణాళికలోనైనా మెరుగుపడేనా..? జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పుతోంది. వర్షాకాలంలో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నా.. రోడ్లపైనే చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. మురుగు నీరు ఇళ్ల మధ్యనే నిలుస్తోంది. కొన్నిచోట్ల రోడ్లపైనే పారుతోంది. ఇక డ్రెయినేజీల్లో నెలల తరబడి పూడిక తీయడం లేదు. పట్టణాల్లోని ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. దీంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఈ ఫొటోలో కనిపిస్తోంది కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ ఏరియాలోని ప్రధాన రోడ్డు పక్కన గల డ్రెయినేజీ. ఈ కాలువ నిర్మాణం సరిగా చేపట్టకపోవడంతో మురుగునీరు కాలువలోనే నిలిచి ఉంటోంది. దీనికి తోడు ప్లాస్టిక్ కవర్లు, చెత్తా చెదారం ఇందులోనే వేస్తుండడంతో పేరుకుపోయి దుర్గంధం తలపిస్తోంది. వర్షాకాలంలో నీరు నిలిచి ఉండడంతో దోమలు, ఈగలు వృద్ధిచెంది రోగాల బారిన పడే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తోంది కాగజ్నగర్ పట్టణంలోని సీతాపతిరోడ్ నుంచి ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఖాళీ స్థలం. ఇందులో బాలాజీనగర్, శ్రీరాంనగర్ కాలనీవాసులు ప్రతీరోజు ద్విచక్ర వాహనాల పై చెత్తను తీసుకువచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఇందిరా మార్కెట్ వ్యాపారులు సైతం కుళ్లిన కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి ఇక్కడే వేయడంతో చెత్తకుప్పగా మారింది. అంతేకాకుండా ఆఫీసులకు వెళ్ళేవారు కూడా కవర్లలో చెత్తను తీసుకువచ్చి ఇక్కడే పడేస్తున్నారు. ఖాళీ స్థలంలో చెత్తవేస్తే రూ.500 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు వారికి కనిపించకపోవడం గమనార్హం కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: మున్సి పాలిటీ పరిధిలో ట్రాక్టర్లతో ప్రతిరోజు చెత్త సేకరణ చేస్తున్నా కొందరు సిబ్బందికి ఇవ్వకుండా ఖాళీ ప్రదేశాలు, రోడ్ల వెంబడి, నిషేధిత ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి. గాలి వీస్తే చెత్త సమీపంలోని ఇళ్ల ముందు వచ్చి చేరుతోంది. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి మున్సిపల్ కార్మికులకు అందించాలని ప్రజలకు అవగాహన కల్పించినా అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు డ్రెయినేజీల్లో పూడిక తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలక ముందే పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని కోరుతున్నారు. నిషేధిత ప్రాంతాల్లో చెత్తపట్టణంలోని ద్వారకానగర్, సీతాపతిరోడ్, సీహెచ్సీ, బాలాజీనగర్, గాంధీచౌక్, మార్కెట్ ఏరియాల్లో చెత్త వేయవద్దని మున్సిపల్ అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినా ఆయా కాలనీల ప్రజలు చెత్తను అక్కడే వేస్తున్నారు. ఉదయం మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తొలగించినా మళ్ళీ అక్కడే వేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నెలల తరబడి తీయని పూడికపట్టణంలోని బాలాజీనగర్, గాంధీనగర్, న్యూకాలనీ, టీచర్స్ కాలనీ, సంజీవయ్య కాలనీ, నిజాముద్దీన్కాలనీ, రైల్వేస్టేషన్ రోడ్, నౌగాం బస్తీ, కాపువాడ, తదితర కాలనీల్లోని డ్రెయినేజీల్లో నెలల తరబడి పూడిక తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. కొన్నిచోట్ల డ్రెయినేజీల్లో ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. రోడ్లపైకి మురుగునీరుపట్టణంలోని ప్రధాన మార్కెట్ ఏరియా, పొట్టి శ్రీరాములు చౌరస్తా, చోటిమసీద్, ఇందిరా మార్కెట్ ఏరియాల్లోని డ్రెయినేజీలు ఇరుకుగా ఉండడంతో పాటు కాలువల్లో దుకాణదారులు ప్లాస్టిక్ కవరు, చెత్తాచెదారం వేయడంతో చిన్నపాటి వర్షం కురిసినా మురుగు కాలువల్లోని చెత్తా చెదారం, మురుగునీరు నీరు రోడ్లపై పారుతోంది. 135 మంది సిబ్బంది విధులుకాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణకు 135 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో పర్మినెంట్ 21, ఔట్ సోర్సింగ్ 107, ఎంఎన్ఆర్ ఏడుగురితో పాటు 7 చెత్త ట్రాక్టర్లు, 20 ట్రాలీలు, 1 జేసీబీ, 1 డోజర్లతో ప్రతిరోజు 24 మెట్రిక్ టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.చర్యలు తీసుకుంటున్నాం పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలు, నిషేధిత ప్రాంతాల్లో చెత్త వేసిన వారికి నోటీసులు జారీ చేస్తాం. 30 వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బందితో విడతల వారీగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం జరుగుతోంది. – ఎల్పుల రాజేందర్, కమిషనర్, కాగజ్నగర్ మున్సిపాలిటీ -
యూరియా పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలి
వాంకిడి: యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్ట ర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు యూరి యా త్వరగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో రెండు కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధి కారులను ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికా రులకు సూచించారు. రేషన్ కార్డుల మంజూ రులో జాప్యం జరగకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఏడీఏ జాడి మిలింద్ కుమార్, తహసీల్దార్ కవిత, మండల వ్యవసాయ అధికారి గోపికాంత్, డీటీ రాంలాల్, తదితరులు ఉన్నారు. -
‘మహిళా శక్తి’ పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పంచాయతీరా జ్ ఈఈ అజ్మెర కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికా భివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రూ.5 కోట్ల ప్రత్యేక నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది అక్టోబర్ చివరిలోగా పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాలో నగదు జమచేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ గజానంద్, సంబంధిత అధికారులు ఉన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
పేరుకుపోతున్న చెత్తాచెదారం
అధికారులు పర్యవేక్షించాలి శానిటేషన్ అధికారులు నిత్యం పట్టణంలో పర్యవేక్షించాలి. కార్మికుల పనితీరు, కాలనీల్లో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. వర్షాకాలం ముఖ్యంగా దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఫాగ్ మిషన్ను అందుబాటులోకి తీసుకురావాలి. చెత్తను తొలగించే వాహనాల సంఖ్య పెంచాలి. – మంథెన సదాశివ్, ఆసిఫాబాద్ ప్రజల సహకారం అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణా రైసింగ్ 2047 లక్ష్యంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు వంద రోజుల పాటు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతీరోజు కాలనీల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నాం. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛ ఆసిఫాబాద్కు ప్రజల సహకారం ఎంతో అవసరం. – గజానంద్, మున్సిపల్ కమిషనర్, ఆసిఫాబాద్ ● స్వచ్ఛ ఆసిఫాబాద్గా తీర్చిదిద్దేందుకు చర్యలు ముమ్మరం ఆసిఫాబాద్అర్బన్: నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఏడాదికాలం పూర్తయినా పారిశుద్ధ్య పనుల నిర్వహణ ఇంకా గాడిలో పడకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్షాకాలం సీజన్ ఆరంభం కావడంతో సీ జనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ దీపాల ఏర్పాటు అంతంత మాత్రంగానే ఉంది. డ్రెయినేజీలు పూర్తిగా చెడి పోవడంతో రోడ్లపైకి మురికి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. డ్రె యినేజీ వ్యవస్థ పూర్తిగా చెడిపోవడంతో చిన్నపా టి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తడి, పొడి చెత్తపై చర్యలు కరువుపట్టణంలో ప్రతీరోజు వాహనాల ద్వారా తొలగించే తడి, పొడి చెత్తను వేరువేరుగా తొలగించకపోవడంతో కాలనీల్లో చెత్త వాహనాలు వెళ్తున్న క్రమంలో తీవ్ర దుర్గందం వెదజల్లుతోంది. పలు కాలనీలకు ప్రతీరోజు చెత్త వాహనాలు రాకపోవడంతో ప్రజలు కాలనీలోని ముఖ్య కూడళ్ల వద్ద చెత్తను పడేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసిఫాబాద్ పట్టణంలో 4 ట్రాక్టర్లు, 5 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కార్యాలయంలో122 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కనీసం ఒక్క ఫాగింగ్ మిషన్ కూడా లేకపోవడం దురదృష్టకరం. పట్టణంలో ఒకవైపు వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా వాటిని కట్టడి చేసే నాథుడే లేడు. పాలకులు మారినా, అధికారులు మారినా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు నామమాత్రంగా కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం జూన్ 2 నుంచి ప్రారంభమైన రైసింగ్ 2047 లక్ష్యంగా చేపట్టిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికలోనైనా పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో వీధి దీపాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాత్రి సమయాల్లో పలు కాలనీలకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇటీవల ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన గజానంద్ పారిశుద్ద్యం నిర్వహణ, స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఓటరు జాబితా అందుబాటులో ఉంచుకోవాలి
దహెగాం(సిర్పూర్): బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో)లు బూత్స్థాయి ఓటరు జాబి తా అందుబాటులో ఉంచుకోవాలని సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్వోలకు శిక్షణ ఇచ్చారు. సర్వేకు వెళ్లినప్పుడు ఓటర్లతో ఎలా మాట్లాడాలో వివరించారు. గ్రామానికి చెందిన ఓటరు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడితే కుటుంబ సభ్యులకు ముందుగా నోటీ సు ఇచ్చిన వారం రోజుల తర్వాత పేరు తొలగించాలన్నారు. తహసీల్దార్ మునవార్ షరీ ఫ్, ఎలక్షన్ డీటీ జోగయ్య, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, డీటీ గణేశ్ పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి పీఎం జుగా
తిర్యాణి: గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పీఎం జుగా పథకాన్ని ప్రవేశపెట్టిందని డీటీడీవో రమాదేవి అన్నారు. శనివారం మండలంలోని దంతాన్పెల్లిలో పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులందరికీ ఆధార్కార్డు ఆప్డేట్తో పాటు నూతన కార్డు మంజురూ, బర్త్ సర్టిఫికెట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీఎం జుగాపై కళాజాత బృందం సభ్యులు నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సమావేశంలో ఎంపీడీవో మల్లేశ్, వెటర్నరీ వైద్యుడు సాగర్, ఏపీఎం శ్రీనివాస్, పీఎం జుగా మండల కోఆర్డినేటర్ వెడ్మ యశ్వంత్రావు, తదితరులు పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలితిర్యాణి: నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం దంతాన్పెల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఏడాదిలో కనీసం రెండు మొక్కలు నాటాలన్నారు. మొక్కలను విరివిరిగా పెంచడం ద్వారానే పర్యావరణ సమతుల్యం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేముల మల్లేశ్, టెక్నికల్ అసిస్టెంట్ వోడిగ సాగర్, పంచాయతీ కార్యదర్శి రాము, తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల రాస్తారోకో
రెబ్బెన: పీఏసీఎస్కు వచ్చిన యూరియా పంపిణీకి టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజులుగా పీఏసీఎస్కు వ స్తున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడంలేదన్నారు. ముందు రోజు జారీ చేసిన టోకెన్లకు యూ రియా పంపిణీ చేస్తున్నారన్నారు. శనివారం ఉద యం వచ్చిన యూరియా లోడ్కు సంబంధించిన టోకెన్లయినా జారీ చేయాలని కోరగా వ్యవసాయ అధికారులు నిరాకరిస్తున్నారన్నారు. పనులు వది లేసి రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దక్కకపోతే పంటలను ఎలా కాపాడుకోవాలని ప్ర శ్నించారు. స్పందించిన అధికారులు టోకెన్లు జారీ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
మంత్రులను కలిసిన ఎమ్మెల్సీ
చింతలమానెపల్లి: నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ దండె విఠల్, కాంగ్రెస్ నాయకులు శనివారం హైదరాబాద్లో సీ్త్ర, శిశు, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. డబ్బాలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, సిర్పూర్లో ప్రయాణ ప్రాంగణం కోసం రూ.2 కోట్ల నిధులు కేటాయించాలని, హైదరాబా ద్కు అదనంగా బస్సు సర్వీసులు కల్పించాల ని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిడాం గణపతి, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల అధ్యక్షులు సుల్కరి ఉమామహేష్, విశ్వేష్, నాయకులు గజ్జి రామయ్య, అశోక్, కొండు శంకర్, రాచకొండ శ్రీవర్థన్, తదితరులు పాల్గొన్నారు. -
వీడని అసంతృప్తి!
● మంత్రివర్గంలో చోటు దక్కక నిరాశలో పీఎస్సార్ ● అగ్రనేతలను కలుస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ● తనకు అన్యాయం జరిగిందంటూ వేడుకోలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) అసంతృప్తి వీడడం లేదు. రెండో విడతలో తనకు కేబినెట్ బెర్త్ ఖాయమని భావించినా పక్కన పెట్టడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన అనుచరవర్గానికి ఊహించని విధంగా షాక్ తగిలింది. మరోవైపు జిల్లా నుంచే చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామికి మంత్రిగా అవకాశం కల్పించి తనకు ఇవ్వకపోవడంపై గత కొద్ది రోజులుగా అసంతృప్తితోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు గత పదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో బలోపేతానికి కృషి చేశానని, తనకు అవకాశం కల్పించాల ని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి సభ నుంచి అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రతోపాటు మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బహిరంగ సభ వరకు ఎన్నో పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేశారు. ఎన్నికల ముందు ఏఐసీసీ అధ్యక్షుడితో సహా పలువురు అగ్రనేతలు పీఎస్సార్కు సముచిత స్థానం ఉంటుందని హామీలు ఇచ్చారు. తీరా ఆయనకు అవకాశం రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇటీవల గాంధీభవన్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నా రు. తనకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటువైపో..!గత ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ బహిరంగ సభలో తన గొంతు నొక్కొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ముందే ఆవేదనతో మాట్లాడారు. నిన్న మొన్న వచ్చిన వాళ్లకు అవకాశం ఇచ్చి తనను విస్మరిస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాకు పదవుల్లో అన్యాయం చేస్తే ఏం చేయడానికైనా సిద్ధమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన అసంతృప్తి ఎటువైపు దారి తీస్తుందోనని రాజకీయంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ విధేయతగా ఉంటున్నారు. అయినా కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో మంత్రివర్గంలో చోటు కాకుండా ఇతర ఏ పదవీ ఇచ్చినా తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యేగానే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆయనకు అవకాశం ఇస్తుందా..? లేదా..? పీఎస్సార్ వెనక్కి తగ్గి ఉంటారా..? అనే చ ర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. -
చేతులపై ఎత్తుకుని.. పట్టాలు దాటించి
రెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని గంగాపూర్ రైల్వే గేట్ను మరమ్మతుల పేరుతో రైల్వే అధికారులు మూసివేయగా, శుక్రవారం ఓ రోగిని వారి బంధువులు చేతులపై ఎత్తుకుని ట్రాక్ దాటించారు. వివరాలు.. ట్రాక్ మరమ్మతుల కారణంగా మంగళవారం నుంచి గంగాపూర్ గేట్ను అధికారులు నాలుగు రోజులపాటు మూసివేశారు. ట్రాక్కు అవతలి వైపు ఉన్న 12 గ్రామ పంచాయతీల ప్రజలు మండల కేంద్రానికి వచ్చేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకుండా పోయింది. ప్రధానంగా రోగులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. వాంకిడి మండలానికి చెందిన దుర్గం హేమరాజ్ రెబ్బెన మండలం నంబాలకు వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అతడికి యాక్సిడెంట్ కాగా అతడి సోదరుడు దుర్గం విశ్వనాథ్ తమ్ముడిని చూసేందుకు నంబాలకు వచ్చాడు. కొన్నిరోజులుగా తమ్ముడి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కసారిగా విశ్వనాథ్కు వాంతులు, భరించలేని కడుపునొప్పి రావడంతో బంధువులు హుటాహుటిన ఆటోలో గంగాపూర్ రైల్వేగేట్ వరకు తీసుకువచ్చారు. గేట్ మూసివేసి ఉండటంతో విశ్వనాథ్ను చేతులపై ఎత్తుకుని ట్రాకు దాటించి అక్కడి నుంచి వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడకముందే ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ఈ నెల 2న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
గర్భిణులకు కష్టాలు
లింగాపూర్: మండల కేంద్రంలోని పీహెచ్సీకి దాదాపు 14 పంచాయతీల నుంచి రోగులు వస్తుంటారు. ప్రతిరోజూ దాదాపు 80 వరకు ఓపీ నమోదవుతుంది. అయితే ఆస్పత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేరు. పీఎం జన్మన్లో విధులు నిర్వర్తించే వైద్యుడు వారం రోజులుగా రావడం లేదు. ఆయుష్ వైద్యాధికారి వనిత సిర్పూర్(యూ) పీహెచ్సీలో డిప్యూటేషన్పై పనిచేస్తోంది. డాక్టర్ లేకపోవడంతో సోమ, శుక్రవారాల్లో గర్భిణుల నుంచి నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్ రక్తనమూనాలు సేకరించి జిల్లా కేంద్రానికి పంపిస్తున్నారు. ఇక స్కానింగ్ కోసం గర్భిణులు ఆదిలాబాద్లోని రిమ్స్కు ప్రత్యేక వాహనాల్లో వెళ్తున్నారు. దూరభారంతో ఇబ్బందులకు గురవుతున్నారు. -
సందర్శించి.. సమస్యలు తెలుసుకుని
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి సందర్శించారు. దివ్యాంగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిబిరంలో వైద్యపరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్లు అందించాలని సూచించారు. దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్యం.. దైన్యం
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ● సమయానికి రాని డాక్టర్లు ● జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలోనూ సేవలు అంతంతే.. ● పోస్టులు భర్తీ చేస్తేనే ప్రయోజనంఆసిఫాబాద్/ఆసిఫాబాద్అర్బన్: వర్షాలు ముసురుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలు తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఇబ్బందికరంగా మారింది. ఉన్నవారు కూడా సకాలంలో విధులకు హాజరుకావడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గర్భిణులు స్కానింగ్ కోసం ఆసిఫాబాద్, ఆదిలాబాద్కు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ పీహెచ్సీలు, ఐదు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 44 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం 27 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను ‘సాక్షి’ విజిట్ చేయగా, అనేక సమస్యలు వెలుగుచూశాయి. తీరుమారని జిల్లా ఆస్పత్రిజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి మారి నా తీరు మారడం లేదు. 50 నుంచి వైద్యకళాశాలకు అనుబంధంగా 330 పడకల స్థాయికి పెరిగింది. ఇక్కడ సూపరింటెండెంట్తో పాటు 95 మంది వైద్యులు సేవలందించాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. ముగ్గురు రెగ్యులర్ కాగా, తొమ్మిది మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 600 మంది ఔట్ పేషెంట్లు నమోదవుతుండగా, పదుల సంఖ్య లో ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. గతంలో ప్రతినెలా సుమారు 40 కాన్పులు జరిగేవి. గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు మంచిర్యాల మాతాశిశు కేంద్రం, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రసవాల సంఖ్య 15 నుంచి 20కి తగ్గింది. కార్డియాలజిస్టు అందుబాటులో లేరు. మంచిర్యాల, కరీంనగర్కు రోగులను రెఫర్ చేయడం పరిపాటిగా మారింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా కేవలం ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. పెచ్చులూడుతున్న పెంచికల్పేట్ పీహెచ్సీపెంచికల్పేట్: మండల కేంద్రంలోని పీహెచ్సీ భవనం స్లాబ్ పెచ్చులూడుతోంది. ఇటీవల వర్షాలకు స్లాబ్ నుంచి వర్షపు నీరు కారుతోంది. ప్రతిరోజూ సుమారు 80 నుంచి వంద మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారు. వర్షపు నీరు కారుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది లేక ఇబ్బందికెరమెరి: మండల కేంద్రంలోని పీహెచ్సీ సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9:30 గంటలకు కేవలం పీఎం జన్మన్ జీఎన్ఎం మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత స్టాఫ్ నర్సులు, ఎల్టీ, హెచ్ఏ, సూపర్వైజర్ ఉదయం 10 గంటలలోపు వచ్చారు. వైద్యాధికారి ఉదయం 10:30 గంటలకు విధులకు హాజరయ్యారు. అప్పటికే వచ్చిన రోగులను స్టాఫ్ నర్సు పరీక్షించారు. ఆ తర్వాత వైద్యాధికారి రోగులకు చికిత్స అందించారు. ఒక్కరోజే 80 మంది రోగులు వచ్చారు. ఇద్దరు వైద్యులు, ఇద్దరు ఫార్మసిస్ట్, మూడు స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలంలో ఎనిమిది సబ్ సెంటర్లలో 16 మంది ఏఎన్ఎంలకు 11 మంది మాత్రమే ఉన్నారు. పీఎం జన్మన్ వాహనం ఆలస్యంగా రావడంతో ఆ సిబ్బంది ఉదయం 11 గంటల వరకు పీహెచ్సీలోనే వాహనం కోసం ఎదురుచూశారు. ఆదిమ గిరిజన గ్రామాలకు సిబ్బంది ఆలస్యంగా వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్థానికంగా యునానీ ఆస్పత్రి లేదు. కానీ ఫార్మసిస్ట్, అటెండర్ను మాత్రం నియమించారు. ఇన్పేషంట్లు లేకపోవడంతో బెడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.విధుల్లో ఒక్కరే..కౌటాల: మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఇద్దరు వైద్యులకు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు స్టాఫ్ నర్సులకు ఇ ద్దరు ఉన్నారు. ఆయుష్ వైద్యురాలు వారంలో మూడు రోజులపాటు విధులకు హాజరవుతున్నారు. ప్రతిరోజూ 60 వరకు ఓపీ నమోదవుతుంది. గతంలో ఇక్కడ రోజుకు రెండు, మూడు ప్రసవాలు చేయగా, సిబ్బంది కొరత కారణంగా గర్భిణులను కాగజ్నగర్కు రెఫర్ చేస్తున్నారు. గుండాయిపేట్ హెల్త్ సబ్ సెంటర్లోనూ సిబ్బంది లేరు. -
మాజీ సీఎం రోశయ్యకు నివాళి
ఆసిఫాబాద్అర్బన్: మాజీ ముఖ్యమంత్రి రోశ య్య జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోశ య్య సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించారని తెలిపారు. ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. రాజకీయాల్లో నైతిక విలువల కు మారుపేరుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, అధికారులు పెద్దన్న, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
మెడికల్ బిల్లులు విడుదల చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎటుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మెడికల్ బిల్లుల విడుదలలో జాప్యం నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందారపు ప్రకాశ్, జాటోత్ సంతోష్, రేగళ్ల వెంకటేశ్వర్లు, అనిల్కుమార్ ఉన్నారు. -
శిథిలావస్థలో ‘ఈఎస్ఐ’
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఈఎస్ఐ శిథిలావస్థకు చేరింది. దీంతో కూల్చివేయాలని ఉత్తర్వులు కూడా వచ్చాయి. ప్రభుత్వం, ఈఎస్ఐ కార్పొరేషన్ ఆస్పత్రికి స్థలం కేటాయించకపోవడం, ఇతర భవనానికి తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడం, నిధులు మంజూరు చేయకపోవడంతో ఇంకా శిథిల భవనంలోనే కొనసాగుతోంది. సూపరింటెండెంట్తోపాటు నలుగురు వైద్యులు. 60 మంది సిబ్బంది ఉన్నారు. సూపరింటెండెంట్, వైద్యులు మంచిర్యాల, వరంగల్, ఇతర ప్రాంతాల నుంచి వారానికి రెండుసార్లు వస్తూ హాజరు వేసుకుని వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఆస్పత్రిని రామగుండం ఈఎస్ఐకు తరలించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. -
మహనీయుల త్యాగాల స్ఫూర్తితో అభివృద్ధి
ఆసిఫాబాద్: మహానీయుల త్యాగాల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య బహుజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. నిజాంకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. రోశయ్య గొప్ప ఆర్థికవేత్త అని, 16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి సజీవన్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, కలెక్టరేట్ ఏవో కిరణ్కుమార్, ఏఎంసీ చైర్మన్ చిలువేరు వెంకన్న, నాయకులు అరిగెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
సమయ పాలనపై పట్టింపేది..?
దహెగాం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయగా.. ఉదయం 10:30 గంటలైనా వైద్యాధికారి విధులకు రాలేదు. ఫార్మసిస్టు వైద్యం అందించారు. అధికారి మధ్యాహ్నం 12 గంటలకు విధులకు హాజరయ్యారు. 24 గంటలపాటు సేవలందించాల్సి ఉండగా, ప్రతిరోజూ ఓపీ సుమారు 50 నుంచి 60 వరకు నమోదవుతుంది. ఇద్దరు డాక్టర్లకు ఒకరు మాత్రమే ఉన్నారు. సదరు వైద్యాధికారినికి రెగ్యులర్ పోస్టింగ్ లోనవెల్లి కాగా.. దహెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డెప్యూటేషన్ ఇచ్చారు. సక్రమంగా విధులకు హాజరు కావడంలేదని, రెండు, మూడురోజులకు ఒకసారి వస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నలుగురు స్టాఫ్ నర్సులకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒక స్టాఫ్ నర్సు అనధికారిక సెలవుల్లో ఉన్నారని సిబ్బంది తెలిపారు. -
అటవీ భూముల రక్షణ అందరి బాధ్యత
రెబ్బెన(ఆసిఫాబాద్): అటవీ భూముల రక్షణ అందరి బాధ్యత అని సింగరేణి పర్యావరణ, అటవీశాఖ సలహాదారు మోహన్ పరిగన్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో శుక్రవారం పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డితో కలిసి గోలేటి టౌన్షిప్లోని సెంట్రల్ నర్సరీ, గోలేటి సీహెచ్పీని పరిశీలించారు. అందుబాటులో ఉన్న మొక్క ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొ క్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను పరి శీలించారు. వచ్చే ఏడాదిలో ఏరియాలో అధి కంగా మొక్కలు పెంచాలని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అటవీ భూములు పరిరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఎన్వి రాన్మెంట్ అధికారి హరీశ్, జూనియర్ ఫారె స్టు అధికారి సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా తిప్పలు!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కుమ్మరి రాజయ్య. రెబ్బెన మండలం నంబాల గ్రామంలో పదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం ఎనిమిది ఆకుల దశకు చేరుకుంది. ఈ సమయంలో పంటకు ఎరువులు వేయాలి. రెబ్బెన పీఏసీఎస్లో యూరియా పంపిణీ జరుగుతోందని తెలుసుకుని బుధవారం వెళ్లగా అధికారులు పాస్పుస్తకానికి రెండు బస్తాల చొప్పున చీటీ రాసి ఇచ్చారు. రెండురోజులుగా యూరియా బస్తాల కోసం పీఏసీఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తే.. గురువారం సాయంత్రం వరకు ఒక్క బస్తా అందలేదు. వారంలో పదెకరాలకు మందు వేయాల్సి ఉండగా.. అధికారులు ఇచ్చే రెండు యూరియా బస్తాలను ఎన్ని ఎకరాలకు సరిపెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. జిట్టవేణి హన్మంతుది రెబ్బెన మండలంలోని కై రిగూడ. 12 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మూడు దఫాల్లో వేయాల్సిన యూరియా తప్పా మిగిలిన ఎరువులను ఫర్టిలైజర్ షాపులో కొన్నాడు. ఇక 60 యూరియా బస్తాల కోసం అడిగితే గంట మందు బస్తాలు కొంటేనే యూరియా అందిస్తామని షాపు యజమాని చెప్పడంతో కంగుతిన్నాడు. గంట మందు, యూరియా బస్తాలకు రూ.750 అవుతుందని చెప్పడంతో.. బుధవారం పీఏసీఎస్కు వచ్చాడు. అధికారులు కేవలం రెండు బస్తాలకే చీటీ రాసి ఇచ్చారు. బయట యూరియాతో ఇతర ఎరువులు ముడిపెడుతుండగా.. పీఏసీఎస్లో కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో ఏమీ పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. అన్ని మండలాల్లో రైతులు దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. రెబ్బెన(ఆసిఫాబాద్): వానాకాలం పంటల సాగుచేస్తున్న రైతులు యూరియా బస్తాల కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్లు, హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పంపిణీ చేస్తున్నా అవి రైతుల అవసరాలకు సరిపడడం లేదు. పత్తి పంటకు మొదటి దఫా ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు ఒకటి, రెండు బస్తాలు అందించి అధికారులు చేతులెత్తుతున్నారు. అరకొర అందిన యూరియా ఏ మూలకు వేయాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలు ఉండటంతో వారిపై అదనపు ఆర్థికభారం పడుతోంది. ముందస్తు అవసరాల కోసం ఇప్పుడే..జిల్లాలోలోని 15 మండలాల పరిధిలో వానాకాలం సీజన్లో సుమారు 4.5లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 3.35లక్షల ఎకరాల్లో పత్తి, 56,861 ఎకరాల్లో వరి, 30,430 ఎకరాల్లో కంది, మరో 22,395 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తారు. ఈ సీజన్లో 60,081 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా ప్రభుత్వానికి ఇండెంట్ పంపించారు. ఇప్పటివరకు జిల్లాకు సుమారు 25వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరాఫరా చేసింది. గతంతో పోల్చితే జిల్లాకు పంపించాల్సిన యూరియాలో కోత విధించింది. దీంతో రైతులు ఆశించినస్థాయిలో బస్తాలు లభ్యం కావడంలేదు. జూలై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పత్తికి మాత్రమే వినియోగిస్తుండగా, మరో 20 రోజులు గడిస్తే వరినాట్ల ప్రక్రియ మొదలుకానుంది. పంటల కాలం పూర్తయ్యే వరకు వేయాల్సిన యూరియా మొత్తం ఒకేసారి కొనుగోలు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పొలాలకు దారి లేకపోవడం, భవిష్యత్తులో యూరియా బస్తాలు దొరుకుతాయో లేదో అనే అనుమానంతో మూడు దఫాలకు సరిపడా ఇప్పుడే కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దీంతో పీఏసీఎస్లకు, హాకా సెంటర్ల నుంచి బస్తాలు పంపిణీ చేస్తున్నా సరిపోవడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 7,500 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వేరే బస్తాలు కొంటేనే..ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో వేరే బస్తాలు కొనుగో లు చేస్తేనే.. యూరియా ఇస్తామని యజమానులు మెలిక పెడుతున్నారు. గంటమందు బస్తాలు, ఇతర సేంద్రియ ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారు. యూరియా బస్తాకు ప్రభుత్వం రూ.266 నిర్ణయించగా.. ప్రస్తుతం కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తూ స్టాక్ లేదని చెబుతున్నారు. రైతుల అవసరాలకు సరిపడా అందని ఎరువు కేంద్రాల వద్ద బారులుదీరుతున్న అన్నదాతలు ఫర్టిలైజర్ వ్యాపారుల తీరుతోనూ ఇబ్బందులు బారులుదీరుతున్న అన్నదాతలుసరిపడా యూరియా బస్తాలు లభ్యం కాకపోవడంతో రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. కొన్ని మండలాల్లో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పాస్ పుస్తకానికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎకరానికి రెండు బస్తాల చొప్పున అందిస్తున్నారు. దీంతో అన్నదాతలు పీఏసీఎస్లు, హాకా కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. రెండు, మూడు రోజులు వేచిచూసినా కొంతమందికి ఒక్క బస్తా అందడం లేదు. రెబ్బెన మండలంలోని పీఏసీఎస్కు ఇప్పటివరకు కేవలం మూడు లారీ లోడ్ల యూరియా సరఫరా కాగా.. ప్రతీ రైతుకు కేవలం రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. పదుల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నవారికి కూడా రెండేసి మాత్రమే అందించారు. మొదటి రోజు బస్తాల పంపిణీ కోసం చీటీలు రాసి ఇవ్వగా.. రెండోరోజు గురువారం ఆలస్యంగా పీఏసీఎస్ కార్యాలయాన్ని తెరిచారు. అధికారుల తీరును తప్పుపడుతూ రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆసిఫాబాద్, కెరమెరి, కౌటాల తదితర మండలాల్లో సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఆందోళన చెందొద్దు జిల్లాలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దు. ప్రస్తుతం పంటలకు వేయాల్సిన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రతినెలా ఎరువులు సరాఫరా అవుతూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో దారి సౌకర్యం, ఇతరాత్ర కారణాలతో బస్తాలన్నీ ఒకేసారి కొనుగోలు చేయాలని చూస్తున్నారు. గురువారం నాటికి జిల్లాలో 7500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
మొక్కలతోనే పర్యావరణ సంరక్షణ
ఆసిఫాబాద్రూరల్: మొక్కల పెంపకంతోనే పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని గోవింద్పూర్ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాలుష్యం నియంత్రించేందుకు పర్యావరణ రక్షణకు పాటుపడాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వంటలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, ఎంఈవో సుభా ష్, ఏపీవో బుచ్చయ్య, ఎంపీవో మౌనిక, ఏఈ సంజయ్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
బెజ్జూర్(సిర్పూర్): 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్, సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల అధికారి శ్రద్ధా శుక్లా అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి నూతన ఓటర్లను నమోదు చేయాలని, చనిపోయినవారి జాబితా రూపొందించాలని ఆదేశించారు. తప్పొప్పులు సవరించాలని అన్నారు. గ్రామాల నుంచి వలస వెళ్లినవారిని గుర్తించడంతోపాటు నకిలీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, డిప్యూటీ తహసీల్దార్ భీమ్లానాయక్, సీనియర్ అసిస్టెంట్ అచ్యుత్రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బీఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల తనిఖీకాగజ్నగర్రూరల్: మండలంలోని గన్నారం ట్రైబల్ వెల్ఫేర్ అప్గ్రేడేడ్ రెసిడెన్షియల్ కళాశాలను గురువారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తని ఖీ చేశారు. రెసిడెన్షియల్లోని వంటశాలను పరిశీ లించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. కోడిగుడ్లు, పాలు ఇస్తున్నారా.. అని ఆరా తీశారు. డైనింగ్ హాల్లో విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. మోనూ ప్రకా రం భోజనం అందించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకు లు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించి నిబంధనలు పాటించాలని సూచించారు. -
కలెక్టర్కు వినతి
ఆసిఫాబాద్రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డీఐఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు గురువారం వినతిపత్రం అందించా రు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు కార్తీక్, దినకర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యనందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీని ద్వారా వేలాది మంది చదువుకుంటున్నారని తెలిపారు. అయితే సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో స్కూళ్లు మూతబడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇప్పటికై నా పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే మెరుగైన ర్యాంకు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేత ఆసిఫాబాద్: అధికారులు, సిబ్బంది సమష్టి కృషి తో తిర్యాణి ఆస్పిరేషనల్ బ్లాక్ జాతీయ స్థాయిలో ఐదు, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు సాధించిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపా రు. జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా అధికా రులు, తిర్యాణి మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సమీ క్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తిర్యా ణి ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకు సాధించడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఆశ కార్యకర్తలు, ఆయాల కృషి ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంఘాలు, మహిళల రివాల్వింగ్ ఫండ్, గర్భిణులకు పోషకాహారం అందించడం, శారీరక, మానసిక ఎదుగుదల లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించడం, విద్యా రంగ అభివృద్ధి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు, భూ ఆధార్ కార్డుల జారీ వంటి అంశాల్లో వందశాతం అభివృద్ధి సాధించాలని ఆదేశించారు. అనంతరం జాతీయస్థాయి ర్యాంకు సా ధించడంలో కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, డీఎంహెచ్వో సీతా రాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీపీవో భిక్షపతి, ఎంపీడీవో మల్లేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
నిషేధిత విత్తనాలు, ఎరువులు అమ్మొద్దు
కెరమెరి(ఆసిఫాబాద్): ఫర్టిలైజర్ దుకాణాల్లో నిషేధిత విత్తనాలు, ఎరువులు అమ్మొద్దని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండల కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. గోదాంలు, తూకం యంత్రాలు, రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణాల ఎదుట స్టాక్, నిల్వ, ధరల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ భూమేశ్వర్, ఏడీఏ వెంకట్, ఏవో యుగేందర్ ఉన్నారు. -
మానవత్వం మరిచి..
మొదటి భార్యకు మగ సంతానం జన్మించలేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలే జన్మించడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. రెండో భార్యతో గొడవపడి దాడి చేసి చంపాడు. కాగజ్నగర్ మండలం వంజిరీ గ్రామానికి చెందిన డోకే జయరాం మొదటి భార్య భీంబాయికి ఓ కూతురు పుట్టగా.. మగ సంతానం కోసం జగన్నాథ్పూర్కు చెందిన పోషక్క(40)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 24న పోషక్కతో గొడవపడి తలపై పలుగుతో బలంగా కొట్టి హత్య చేశాడు.కౌటాల(సిర్పూర్): పాత కక్షలు, వివాహేతర సంబంధాలు, వ్యవసాయ భూముల పంచాయితీలు, ప్రేమ వ్యవహారాలు.. కారణాలు ఏవైనా జిల్లాలో నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హత్య కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో 2023లో 32 హత్యలు జరగగా, 21 హత్యాయత్నాలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అలాగే 2024లో 12 హత్యలు, 32 హత్యాయత్నాలు జరిగాయి. పచ్చనికాపురాల్లో చిచ్చుముఖ్యంగా వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరు దంపతుల మధ్య మూడో వ్యక్తి మరొకరు రావడంతో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలు జరుగుతున్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల సంతానం అనాథలుగా మారుతున్నారు. తాజాగా పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామంలోనూ ఓ యువకుడు వివాహేతర సంబంధం వివాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు. భూతగాదాలు.. ప్రేమ వ్యవహారాలుగ్రామీణ ప్రాంతాల్లో భూతగాదాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అలాగే ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లాలో భూములకు విలువ పెరిగింది. పోడు భూములకు సైతం రైతులు పట్టాలు పొందారు. ఫలితంగా భూపంచాయతీలు పెరిగిపోయాయి. వ్యవసాయ భూములు, ఇంటి స్థలాల విషయంలోనూ దాడులకు పాల్పడుతున్నారు. గత నెల 19న చింతలమానెపల్లి మండలంలోని ఓ గ్రామంలో భూవివాదంలో ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ఇరువర్గాలపైనా కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారాలు కూడా అగ్గిరాజేస్తున్నాయి. గత నెల 3న కౌటాల మండలంలోని ఓ గ్రామంలో ప్రేమ వ్యహహారంలో అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు యువకుడిని కర్రలతో చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారంలో స్నేహితుల మధ్య విభేదాలు తలెత్తినా చివరకు హత్యకు దారితీస్తున్నాయి. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయినవారే కడతేరుస్తున్నారు.. వివాహేతర బంధాలు.. భూ తగాదాలే ప్రధాన కారణాలు ఏటా పెరుగుతున్న హత్య కేసులుసామరస్యంగా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య, భూ వివాదాల్లో సమస్యలు వస్తే క్షణాకావేశంతో వ్యవహరించొద్దు. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. ఆత్మహత్యలకు పాల్పడడం లేదా మరొకరిని హత్య చేయడం సరికాదు. నేరాలకు పాల్పడితే తప్పనిసరిగా శిక్ష పడుతుంది. బాధిత కుటుంబాలు రోడ్డున పడతాయి. నేరాల నియంత్రణకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సమస్యలు ఉంటే డయల్ 100 లేదా పోలీసులను సంప్రదించాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీకష్టసుఖాల్లో భర్తకు తోడుగా నిలవాల్సిన భార్యే అతడి పాలిట మృత్యువైంది. రెబ్బెన మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సతీశ్(30) నంబాలకు చెందిన రజితను వివాహం చేసుకున్నాడు. కాయకష్టం చేసి అతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వస్తున్నాడనే కారణంతో జనవరి 16న గుర్తుతెలియని పురుగుల మందు తాగించి సతీశ్ను అతడి భార్య చంపింది. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్రూరల్: వర్షాకాలం నేపథ్యంలో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను గురువారం సందర్శించారు. విద్యార్థినుల వివరాలు, వంట గదిలో సరుకులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం, విద్యనందించాలన్నారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో పండ్లు, పూల మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి నదీమ్ అహ్మద్, ప్రిన్సిపాల్ రత్నబాయి తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్ తొలగింపు
ఆసిఫాబాద్: విద్యుత్ బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ జి ల్లా నోడల్ అధికారి కళాధర్రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గృహజ్యోతియేతర విద్యుత్ కనెక్షన్ల బకాయిలు వందశాతం వసూలు చేయాలన్నారు. సక్రమంగా చెల్లించని వారి కనెక్షన్లు తొలగించాలని సూచించారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ట్రాన్స్కో ఎస్ఈ శేషారావు, ఏఏవో తుకారాం, ఏఈలు లక్ష్మీరాజం, ఊర్మిళ, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
చింతలమానెపల్లి/కౌటాల/బెజ్జూర్ : పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ పోలీస్ స్టేషన్లను బుధవారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల రక్షణ పోలీసుల బాధ్యతని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, బ్లూకోల్ట్ సిబ్బంది డయ ల్ 100 కాల్స్కు స్పందించి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. సరిహద్దు నుంచి అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి, నివారణ కోసం కృషి చేయాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ ముత్యం రమేశ్, ఎస్సైలు ఇస్లావత్ నరేశ్, విజయ్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
లైటింగ్ లేదు.. నేరుగా హైవే పైకి
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండల పరిధిలోని ఎడవెల్లి, ఇందిరానగర్ల వద్ద జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రెండు గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్ల వద్ద సరైన లైటింగ్ సిస్టం లేదు. వాహనదారులు నేరుగా జాతీయ రహదారి పైకి రాకుండా.. ప్రత్యామ్నాయంగా సర్వీసు రోడ్లు అందుబాటులో లేవు. రాత్రిపూట రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే వారు వాహనదారులకు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇందిరానగర్ వద్ద ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ఇదే తరహాలో రోడ్డు దాటే క్రమంలో వాహనాలు ఢీకొని మృతిచెందారు. అదే సర్వీసు రోడ్డు సౌకర్యం కల్పించి ఉంటే ప్రజలు ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించేవారు. గ్రామం నుంచి బయటకు వచ్చే వాహనదారులు సైతం నేరుగా జాతీయ రహదారి పైకి రాకుండా సర్వీసు రోడ్డు గుండా ప్రయాణించి.. ఆపై హైవే పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎడవెల్లి వద్ద ఒక వైపు నుంచి పర్సనంబాల, మరో వైపు కొండపల్లి గ్రామాలు ఉంటాయి. అక్కడ తప్పనిసరిగా సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎడవెల్లి, ఇందిరానగర్ల వద్ద రోడ్డు ప్రమాదాల తీవ్రత దృష్ట్యా పోలీసులు సమస్యాత్మక ప్రదేశాలుగా గుర్తించారు. రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు కల్పించారు. అప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ జాగ్రత్త చర్యలు తాత్కాలిక ఉపశమనమే తప్పా శాశ్వత పరిష్కారం కాదు. -
దర్జాగా కబ్జా!?
● జిల్లా కేంద్రంలో అక్రమంగా వెలుస్తున్న టేలాలు ● మున్సిపాలిటీగా మారినా మారని తీరు ● అధికారులపై నేతల ఒత్తిళ్లు!సాక్షి, ఆసిఫాబాద్: జిల్లా కేంద్రం అక్రమ టేలాలకు అడ్డాగా మారింది. ఇక్కడ ఖాళీ స్థలం ఉంటే చాలు రాత్రికి రాత్రి అక్రమంగా టేలాలు వెలుస్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలు కూడా తోడవడంతో ప్రధాన రహదారుల్లో యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా చర్యలకు ఉపక్రమించడం లేదు. ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెంది ఏడాదికి పైగా గడిచినా అక్రమంగా టేలాలు నేటీకీ వెలుస్తుండం గమనార్హం. రహదారుల విస్తరణకు రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదాయానికి గండి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ నుంచి వివేకా నంద చౌక్ మీదుగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని బాలికల పాఠశాల వరకు ఇరువైపులా... ఇటు వైపు డీఎస్పీ కార్యాలయం వరకు టేలాల సంస్కృతి కొనసాగుతోంది. సర్కారు స్థలంలో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి రూ.లక్షల ఆదాయం సమకూరుతుంది. కానీ అక్రమంగా ఏర్పాటు చేసిన టేలాల నుంచి మున్సిపాలిటీ అధికారులు నామమాత్రంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తద్వారా భారీగా ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. పైగా ఇష్టానుసారం రహదారిపై ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. అయితే సంబంధిత యజమానులు మాత్రం వాటిని అద్దెకు ఇచ్చి రూ.వేలల్లో అర్జిస్తున్నారు. ఇక శనివారం సంత సమయంలో అయితే ఆ ప్రాంతంలో ప్రజలకు నరకమే. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట టేలాలు ఏర్పాటు చేయడంతో అక్కడ టెండరు ద్వారా దుకాణాలు పొందిన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాబాపూర్ వెళ్లే మార్గంలోని మర్రిచెట్టు చౌరస్తా వద్ద కూడా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా టేలాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మొదట పదుల సంఖ్యలో ఉండగా, అవి ప్రస్తుతం వందల సంఖ్యకు చేరడం గమనార్హం. రహదారులకు ఇరువైపులా ఎక్కడైనా ఖాళీ జాగా కనబడితే తొలుత చిన్నగా ఆక్రమించడం.. తర్వాత శాశ్వత షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పంచాయతీ అధికారులు ఈ టేలాలను తొలగించే ప్రయత్నం చేశారు. కొందరు రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో అప్పట్లో ఆ ప్రయత్నం అధికారులు విరమించుకున్నారు. ఇదే విషయంపై ‘సాక్షి’ ఓ జిల్లా ఉన్నతాధికారి వివరణ కోరగా పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించాక ఈ అక్రమ టేలాలు అన్నింటినీ తొలగిస్తామని స్పష్టం చేశారు. స్థానిక నేతల్లో కుదరని ఏకాభిప్రాయం అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరికివారే యుమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో టేలాల తొలగింపు కార్యక్రమం అప్పట్లో అటకెక్కింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కలిసి రహదారుల అభివృద్ధిపై దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అసిఫాబాద్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలుచేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు. కలెక్టర్ కన్నెర్ర..! జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్కు వెళ్లే మార్గంలో పీటీజీ ఆశ్రమ పాఠశాలకు ఆనుకుని కొన్ని అక్రమ నివాసాలు వెలిశాయి. వాటితో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాఠశాలకు చెందిన ఉన్నతాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని తొలగించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ నివసిస్తున్న వారు వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. వారు స్వచ్ఛందగా ఖాళీ చేయకపోతే బలవంతంగానైనా ఖాళీ చేయించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. అలాగే మంగళవారం పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులతో జరిగిన ప్రత్యేక సమావేశంలోనూ జిల్లా కేంద్రంలోని అక్రమ టేలాల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ జరిగితే ట్రాఫిక్ ఇక్కట్లు తొలుగుతాయని అధికా రులు అభిప్రాయపడినట్లు సమాచారం. -
సామర్థ్యాల ఆధారంగా బోధించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు వారి వి ద్యాసామర్థ్యాల ఆధారంగా బోధించాలని అ దనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మండలంలోని ఝరి ప్రాథకోన్నత పాఠశాల, హట్టి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. ఎఫ్ఎల్ఎన్ పరీక్ష ప్రశ్నపత్రాలను పరిశీలించారు. వి ద్యార్థులతో పాఠ్యపుస్తకాలు చదివించి ప్రశ్నలు అడిగారు. పుస్తకాలు, నోట్బుక్స్, యూని ఫాం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు కొఠారి, రింగన్ఘాట్లో ని ర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లతోపాటు మండల కేంద్రంలోని మోడల్ గృహాన్ని పరిశీలించారు. ఎంఈవో ఆడే ప్రకాశ్, ఎస్వో శ్రీనివా స్, ఎంపీడీవో అంజద్పాషా, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య తదితరులు ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం
సిర్పూర్(టి): సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరికి అవగాహన అవసరమని డీఎంహెచ్వో సీతారాం అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయొద్దని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు పాటించని క్లినిక్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో సిద్దార్థ, అధి కారులు సఫీద్దున్, రవిదాస్, శ్రీకాంత్, సందీప్, ఆర్ఎంపీ సంఘం నాయకులు రాజేశ్వర్, సత్యనారా యణ, నాందేవ్, సుకృజీ తదితరులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
వాతావరణం ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేవాంకిడి(ఆసిఫాబాద్): రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే డీలర్లను హెచ్చరించారు. మండల కేంద్రంలోని రాయల్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్, నిల్వలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ దుకాణంలో ధరలు, నిల్వల స్టాక్ పట్టికలు ప్రదర్శించాలన్నారు. యూరియా, డీఏపీ, ఇతర మందులు అధిక ధరలకు విక్రయించడం, ఇతర మార్గాల ద్వారా తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ స్టాకు వివరాలు సమర్పించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, వ్యవసాయ అధికారి గోపికాంత్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతుల తిప్పలు.. వరదలో బస్తాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలోని రైతులకు ఎరువుల కోసం తిప్పలు తప్పడంలేదు. వానాకాలం పంటలకు కావాల్సిన యూరియా దొరకడం లేదు. ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా.. అధిక రేట్లకు విక్రయిస్తుండటంతో అన్నదాతలపై ఆర్థికభారం పడుతోంది. రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్కు మంగళవారం ఓ లారీ లోడ్ యూరియా వచ్చింది. బుధవారం మరో లారీ లోడ్ రావడంతో వ్యవసాయశాఖ అధికారులు పంపిణీ ప్రారంభించారు. వందలాది మంది తరలిరావడంతో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేసేందుకు టోకెన్లు జారీ చేశారు. కొంతమందికి అధికారులు దొడ్డిదారిలో ఎక్కువ బస్తాలు ఇవ్వడంతో రైతులు ఆగ్రహించారు. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సముదాయించారు. తడిసిన బస్తాలు.. బుధవారం వచ్చిన లారీ గోడౌన్ వరకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రోడ్డుపైనే నిలిపి అన్లోడ్ చేశారు. వర్షం కురవడంతో బస్తాలపై సిబ్బంది కవర్ కప్పించారు. అయితే రోడ్డు వెంబడి వచ్చిన వరద నీటితో బస్తాలు తడిసిపోయాయి. కనీసం వాటిని అక్కడ నుంచి తీసి పక్కన పెట్టకుండా నిర్లక్ష్యంగా వహించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి తడిసిన బస్తాలనే వారికి అంటగట్టారు. ఓ జిల్లాలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతుండగా, రెబ్బెన మండలంలో బస్తాలను వరద ప్రవాహంలో తడుస్తున్నా పట్టించుకోకుండా వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. -
అలరించిన పోలీస్ డ్యూటీ మీట్
మంచిర్యాలక్రైం: కాళేశ్వరం జోన్స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రారంభమైంది. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. కాళేశ్వరంజోన్లోని రామగుండం పోలీస్ కమి షనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు, సి బ్బందికి పలు పోటీలు నిర్వహించారు. గురువారం కూడా పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదా వరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, ర మేశ్, శ్రీనివాస్ ప్రతాప్, సీఐలు బాబురావు, సతీశ్, చంద్రశేఖర్గౌడ్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు రానీయొద్దు
కాగజ్నగర్రూరల్: జిల్లాలోని రైతులకు ఇ బ్బందులు రానీయకుండా, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు అన్నారు. కాగజ్నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో పంపిణీ చేస్తున్న డీఏపీ, యూరియాను బుధవారం పరిశీలించారు. పలువురు రైతులు యూరియా, డీఏపీ సరిపడా ఇవ్వడంలేద ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో.. వెంట నే సంబంధిత ఏవో రామకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉ న్నాయని, యూరియా తగ్గించి నానో యూరి యా వాడాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఏవో వివరించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ అధిక ధరలకు అమ్మితే వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పీఏసీఎస్ సిబ్బంది ముక్తార్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాల, జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులతో కలి సి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందు కు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కాలుష్య నియంత్రణకు చెట్లు కాపాడుకోవడమే ఏకై క మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలకు కేటాయించి న లక్ష్యాన్ని పూర్తిచేయడం కోసం స్థలాలు గుర్తించా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రామ్చందర్, డీఆర్డీవో దత్తారావు, డీటీడీవో రమాదేవి, డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఓపీఎస్లకు వేతన వెతలు!
● ఆరు నెలలుగా ఔట్సోర్సింగ్ కార్యదర్శులకు అందని జీతాలు ● ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం ● పంచాయతీ పాలనపైనా ప్రభావం..రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పరిపాలన, పారిశు ద్ధ్యం, తాగునీటి సరఫరా, మొక్కల సంరక్షణ.. ఇలా ప్రతీ పని సాఫీగా సాగేలా ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను నియమించింది. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు లేని ప్రాంతాల్లో పాలనపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఔట్సో ర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వేతనాల్లో భారీ తేడా ఉన్నా.. సమాన విధులు నిర్వహిస్తున్నా సకాలంలో జీతాలు అందించడం లేదు. కుటుంబాల పోషణ, పంచాయతీ పాలనకు అవస్థలు పడుతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి..గ్రామ పంచాయతీల్లో సర్పంచులు పదవీలో ఉన్నంతవరకు పరిపాలన బాధ్యతలు వారు చూసుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యాక ప్రభుత్వం ప్రతీ జీపీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. ప్రత్యేకాధికారులు కేవలం సంతకాలకే పరిమితమై.. పాలనపై పూర్తి చేతులెత్తారు. ఆ బాధ్యతంతా కార్యదర్శులపై పడింది. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులు విడుదల కాకపోవడంతో ఏ సమస్య ఉన్నా కార్యదర్శులే పరిష్కరించాల్సి వస్తోంది. రెగ్యులర్ సిబ్బందికి ప్రతినెలా క్రమంతప్పకుండా రూ.వేలల్లో జీతాలు వస్తుండటంతో.. అందులో కొంత మొత్తాన్ని పంచాయతీ అవసరాలకు వెచ్చిస్తున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మాత్రం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లవుతోంది. జీతాలు అందక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి పంచాయతీ భారం తలనొప్పిగా మారుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి పంచాయతీ అవసరాలను తీరుస్తున్నారు. రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులు, స్టేషనరీ, పైపులైన్ల మరమ్మతులు, ఇతరాత్ర ఖర్చులకు కూడా నిధులు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా నిర్వహించే ఇతర కార్యక్రమాలు, గ్రామసభల నిర్వహణ వంటి ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల లేకపోవడంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ.లక్ష వరకు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. పాలనపై ప్రభావంఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ప్రతినెలా సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఆ ప్రభావం పంచాయతీ పాలనపై పడుతోంది. ప్రత్యేకాధికారి ఉన్నా పంచాయతీ నిర్వహణలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సాధారణ సమస్యలను సైతం పరిష్కరించేందుకు ఖజానాలో చిల్లీగవ్వ లేదు. ట్రాక్టర్ల మెయింటనెన్స్, డీజిల్, పారిశుద్ధ్య నిర్వహణ, నర్సరీ, డంపింగ్యార్డు నిర్వహణ, పల్లె ప్రకృతివనాలు, శ్మశాన వాటికల నిర్వహణ, తాగునీటి సరఫరా, ట్యాంకుల క్లోరినేషన్ పనులు కార్యదర్శులే చేపడుతున్నారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పంచాయతీ జనరల్ ఖాతాల్లో జమ చేసినప్పటికీ.. ప్రభుత్వం ఆ నిధులను సైతం వినియోగించుకుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దోమల నివారణకు కోసం ఫాగింగ్ పనులు, మురుగు నీరు నిల్వ ఉండకుండా గుంతలు పూడ్చడం, వర్షాలతో రోడ్లపై పడిన గుంతలకు మరమ్మతులు వంటి పనులు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు కాకపోయిన వేతనాలైనా సక్రమంగా అందితే.. అందులో నుంచి పంచాయతీ అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందని ఓపీఎస్లు చెబుతున్నారు.మూడు నెలల జీతాలు విడుదల జిల్లాలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు మూడు నెలల వేతనాలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. మరో రెండు, మూడురోజుల్లో వారికి అందిస్తాం. ఇంకా మూడు నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని సైతం ప్రభుత్వం నుంచి విడుదల కాగానే అందజేస్తాం. గ్రామాల్లో ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారిఆరు నెలలుగా అందట్లే..జిల్లాలో 15 మండలాల పరిధిలో ప్రస్తుతం 52 మంది ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు సుమారు రూ.19వేలు చెల్లిస్తుండగా.. అందులో కాంట్రాక్టర్ కమీషన్, జీఎస్టీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి పోగా రూ.10,500 వరకు చేతికందుతున్నాయి. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరికి అందిస్తున్న వేతనం అరకొరే. అయినా గ్రామాల్లో ఏ చిన్న సమస్య రాకుండా చక్కబెడుతున్నారు. రెగ్యులర్ కార్యదర్శులకు ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. ఔట్సోర్సింగ్ కార్యదర్శులకు మాత్రం మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆరు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఉన్నతాధికారుల వద్ద ఎంత మొరపెట్టుకుంటున్నా.. రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్పా స్పందించడం లేదని వాపోతున్నారు. చేతిలో చిల్లీగవ్వ లేక కుటుంబాల పోషణ నానా తంటాలు పడుతున్నారు. -
లక్ష్యానికి మించి ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో జూన్లో నెలవారీ లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. జూన్లో బెల్లంపల్లి ఏరియాకు రెండు లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా, 2.62 లక్షల టన్నులతో 131 శాతం ఉత్పత్తి సాధించామన్నారు. కొత్త గనుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గోలేటి ఓసీపీ ప్రారంభించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోందన్నారు. ఈ ఏడాదిలోనే స్టేజ్వన్ అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహరా, పర్సనల్ హెచ్వోడీ రాజేశ్వర్రావు, సీనియర్ పీవో ప్రశాంత్ పాల్గొన్నారు. -
రావి శ్రీనివాస్ సస్పెన్షన్ సరైన నిర్ణయమే..
● డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావుఆసిఫాబాద్అర్బన్: ఆదివాసీ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిర్ణయం సరైనదేనని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009, 2014, 2023లో పార్టీలు మారినా.. శ్రీనివాస్కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీచేసి కనీసం జెడ్పీటీసీకి రావాల్సిన ఓట్లు కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. చిన్నారెడ్డి ఇచ్చిన నోటీసుకు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ జైనూర్లో గతంలో జరిగిన గొడవలకు మంత్రిని బాధ్యురాలిగా చేస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆదివాసీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. వంజిరీ, అంకుసాపూర్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతుల కోసం మంత్రిని రావి శ్రీనివాస్ అడిగారని, సీతక్క తిరస్కరించడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నార ని మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు రమేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, నాయకులు మునీర్, మల్లేశ్యాదవ్, గుండా శ్యాం, చరణ్ పాల్గొన్నారు. -
యూరియా కోసం అగచాట్లు!
కౌటాల/కాగజ్నగర్టౌన్: కౌటాల సహకార సంఘం కార్యాలయంలో యూరియా బస్తాలు తీసుకునేందుకు కౌటాల, చింతలమానెపల్లి మండలాలకు చెందిన రైతులు మంగళవారం పెద్దఎత్తున తరలివచ్చారు. కౌటాల రైతు వేదికలో రైతుల వద్ద నుంచి పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలు తీసుకొని ఎకరానికి రెండు బస్తాలుగా చిట్టీలు రాసిచ్చారు. భారీగా రైతులు తరలిరావడంతో సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేసి రైతుల పేర్లు పిలిచి పో లీసుల పహారాలో ఏఈవోలు రైతులకు బస్తాల కే టాయింపు చిట్టీలు అందజేశారు. అనంతరం రైతులు సహకార సంఘంలో బస్తాలు తీసుకోవడానికి క్యూలైన్లో నిలబడ్డారు. కౌటాల మండలానికి 800 బస్తాలు, చింతలమానెపల్లి మండలానికి 800 యూరియా బస్తాలు అందజేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. సిర్పూర్(టి) మండలంలో.. సిర్పూర్(టి) మండలంలోని రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట మంగళవారం నిరీక్షించారు. రైతులు యూరియా తీసుకునేందుకు ఉదయం కార్యాలయానికి వచ్చి సరిపడా ఎరువులు లేకపోవడంతో వేచిచూశారు. ఈ విషయమై ఏవో గిరీశ్ను ఫోన్లో సంప్రదించగా పీఏసీఎస్లో ట్యాబ్ సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమైందని, ప్రతీ రైతుకు ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియా అందజేయనున్నట్లు తెలిపారు. -
● పదేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు బాధ్యతలు ● ప్రభుత్వ నిర్ణయంపై సంఘాల నుంచి వ్యతిరేకత ● ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని వినతి
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయనే భావనలో చాలా మంది చిన్నారుల తల్లిదండ్రుల్లో ఉంది. ఫలితంగా రూ.లక్షలు ఖర్చు చేసినా సరే వారి పిల్ల లను ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి స్కూళ్లలో వసతుల కల్పనతోపాటు మరింత ప ర్యవేక్షణ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఉపాధ్యాయులను నియమించనుంది. వారు ని త్యం తనిఖీలు చేపట్టి పరిశీలించిన అంశాలను ఎ ప్పటికప్పుడు జిల్లా శాఖ అధికారికి నివేదించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీతో పర్యవేక్షకులను ఎంపిక చేయాలని ఎస్పీ డీ నవీన్ నికోలస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తనిఖీ..పదేళ్ల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా స్కూల్ గ్రేడ్ టీచర్లను తనిఖీ అధికారులుగా నియమించి ప్రాథమిక పాఠశాలలు తనిఖీ చేయించనున్నారు. రోజుకు కనీసం రెండు పాఠశాలుల వీరు పరిశీలించాలి. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల తనిఖీలకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ను నియమించుకోవాలి. వారు రోజుకు రెండు బడులను పరిశీలించారు. మూడు నెలల్లో కనీసం 50 ఉన్నత పాఠశాలలు తనిఖీ చేయాలని ఆదేశించారు. అర్హత ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేయనున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహంజిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 560 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 102, ఉన్నత పాఠశాలలు 58 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో సుమారు 45వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలల తనిఖీలతోపాటు పర్యవేక్షణ బాధ్యతలను టీచర్లకు అప్పగించే విధానంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాస్థాయిలో డీఈవో, మండలస్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు ఉన్నారు. ఉన్నత పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లు పర్యవేక్షించడం సరికాదని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. తనిఖీ సమయంలో ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానంగా మారింది. మండలానికి ఇద్దరిని నియమించడం వల్ల జిల్లాలో 15 మండలాల్లో 30 మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరమవుతున్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతుందని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గతంలో సీఆర్పీలే చేశారు.. గతంలో ప్రాథమిక పాఠశాలు, ప్రాథమికోన్నత పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత సీఆర్పీలే చూసుకున్నారు. వివరాలు ప్రత్యేక ప్రోఫార్మాలో ఉన్నతాధికారులకు అందించేవాళ్లం. ఇతర పనులు పెరగడంతో పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయలేకపోతున్నాం. పర్యవేక్షణ అధికారుల బాధ్యత సీఆర్పీలకే ఇవ్వాలి. – డి.పవన్కుమార్, సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడునిర్ణయం సరికాదు ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించాలనే నిర్ణయం సరికాదు. ఇప్పటికే డీఈవో, ఎస్వోలు, ఎంఈవో, సీఆర్పీలు తనిఖీలు చేపడుతున్నారు. బడుల బలోపేతం చేయాలంటే మరికొంత మంది సీఆర్పీలను నియమించాలి, బాధ్యతలు పెంచాలి. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. – ఆడే ప్రకాశ్, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు -
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణిలో పనిచేస్తు న్న ఉద్యోగులకు జాప్యం లేకుండా సీఎంపీఎ ఫ్ సేవలు అందిస్తామని సీఎంపీఎఫ్ రీజియ న్ కమిషనర్లు హరి పచౌరీ, గోవర్ధన్ తెలిపా రు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ప్రయాస్ సమావేశం నిర్వహించా రు. సీఎంపీఎఫ్ లావాదేవీలన్నీ సీకేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని తెలిపా రు. ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా సీఎంపీఎఫ్ సేవలు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా బెనిఫిట్స్కు అర్హులు, పెన్షన్, రివైజ్డ్ పెన్షన్పై అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలు నివృత్తి చేశారు. జీఎం విజయ భాస్కర్రెడ్డి మాట్లాడుతూ సీఎంపీఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షించే క్లర్కులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్లో లే కుండా చూడాలన్నారు. ఎస్వోటూజీఎం రాజ మల్లు, డీవైపీఎం రాజేశ్వర్రావు, సీనియర్ పీవో ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి హత్య
పెంచికల్పేట్:పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన దీకొండ శ్రీధర్చారీ(25) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఎస్సై కొమురయ్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగించే శ్రీధర్చారీ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన పొట్టె రాజన్న ఇంటి వెనుక పెరట్లో దారుణ హత్యకు గురయ్యాడు. మారణాయుధంతో నరికి చంపినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో శ్రీధర్చారీని తానే హత్యచేశానని పొట్టె రాజన్న పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జీవితం పేదల కోసమే..
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నా. పేదలకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేశా. నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నా. నిత్యం 300 నుంచి 400 మంది ఆయా సేవల నిమిత్తం వస్తుంటారు. చివరి పేషెంట్ వరకు ఏరోజుకు ఆరోజు స్కానింగ్ చేయడంతో పాటు రిపోర్టులు తయారు చేసి రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. సేవలకు గుర్తింపుగా కలెక్టర్, మంత్రుల చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నా. – నూతుల కళ్యాణ్రెడ్డి, ప్రొఫెసర్, రిమ్స్ ప్రజలకు సేవ చేయాలని.. ఆదిలాబాద్టౌన్: వరంగల్లోని కేఎంసీలో వైద్య విద్య అభ్యసించా. ఢిల్లీలో పీజీ పూర్తి చేశా. అక్కడే అంబేడ్కర్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించా. జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించాలని తండ్రి శ్రీరాములు కోరిక మేరకు జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యునిగా చేరారు. నాలుగేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నా. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. – డాక్టర్ ఆడె విఠల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్ -
మీ తమ్మునిపై కేసు అయ్యింది..
● ఉపాధ్యాయుడికి సైబర్ నేరస్తుడి ఫోన్.. ● అప్రమత్తతతో తప్పించుకున్న బాధితుడు జన్నారం: హలో.. నేను సీబీఐ నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్మునిపై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్ రండి.. లేకుంటే చాలా ప్రమాదంలో పడుతారని ఉపాధ్యాయుడికి ఫోన్రావడంతో మొదట బిత్తరపోయిన ఉపాధ్యాయుడు తేరుకుని సైబర్ నేరస్తుడని గ్రహించి తప్పించుకున్న సంఘటన జన్నారంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ప్రకాశ్నాయక్కు ఓ వ్యక్తి ఫోన్చేసి నేను సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్ముదు ప్రమోద్పై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్కు రండి అని చెప్పాడు. మొదటగా భయాందోళనకు గురైన ఉపాధ్యాయుడు వెంటనే ఆదిలాబాద్లో ఉంటున్న ప్రమోద్కు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడుగగా గుడిలో పూజ చేస్తున్నట్లు చెప్పాడు. సదరు ఉపాధ్యాయుడు అదే నంబర్కు ఫోన్ చేసి బెదిరించడంతో సైబర్ నేరగాడు ఫోన్ కట్ చేశాడు. విషయాన్ని ఎస్సై అనూషకు చెప్పడంతో అలాంటి ఫేక్ కాల్లను నమ్మవద్దని సూచించారు. సాంస్కృతికశాఖ సలహామండలి సభ్యుడిగా నాగరాజుమందమర్రి రూరల్: మందమర్రి పట్టణానికి చెందిన ధూంధాం సాంస్కృతిక విభాగం వ్యవస్థాపకుడు అంతడ్పుల నాగరాజును తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సాంస్కృతిక మండలి సలహాదారుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. పలువురు కళాకారులు నాగరాజును అభినందించారు. ‘9న సమ్మె విజయవంతం చేయాలి’శ్రీరాంపూర్: జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్ కాలనీలోని జీటీ హాస్టల్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్ కాలరాస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక హక్కులను హరిస్తోందన్నారు. ఈ సమ్మెతో కేంద్రానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ముస్కే సమ్మయ్య, బాజీ సైదా, కిషన్ రావు, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బండి రమేశ్, చంద్రశేఖర్, వెంగళ శ్రీనివాస్, కిషన్ రెడ్డి, కాంతయ్య, సత్యం, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ సమ్మె నోటీసు జూలై 9న జరుపతలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసును హెచ్ఎంఎస్ నాయకులు శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్కు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కేంద్ర నాయకులు తిప్పారపు సారయ్య, ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి, అశోక్, గొల్ల్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.