2012 నుంచి హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి మధ్య నడిచే ఇంటర్సిటి రైలును కాగజ్నగర్కు పొడిగించారు. అనంతరం ఎ లాంటి ఇంటర్సిటి రైళ్లను ప్రవేశపెట్టలేదు. నూతన ట్రిప్లింగ్ లైన్ అందుబాటులోకి రావడంతో మరిన్ని లోకల్ రైళ్లు అవసరం. సికింద్రాబా ద్, భువనగిరి, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్ స్టాప్లుగా కొత్త రైళ్లు ఏమీలేవు. కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో పిక్ లైన్ను ఏర్పాటు చేయాలి. – ఫణిరాజ్, ఉత్తర తెలంగాణ
రైల్వే వినియోగదారుల ఫోరం ప్రతినిధి
సౌకర్యాలు మరింత మెరుగు
బల్లార్షా, కాగజ్నగర్, ఆసిఫాబాద్ రోడ్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. మూడో లైన్ పూర్తి కావడంతో బల్లార్షా నుంచి కాజీపేట వరకు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. ఇకపై ఈ సెక్షన్లో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. – భాస్కర్,
చీఫ్ కమర్షియల్ బుకింగ్ సూపర్వైజర్


