Kumuram Bheem District Latest News
-
సాగులో సాంకేతికత పెంచేందుకు కృషి
కాగజ్నగర్టౌన్: సాగులో ఆధునిక సాంకేతికత పెంచి, రైతులకు శ్రమ, సమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అ న్నారు. కాగజ్నగర్ పట్టణంలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో శుక్రవారం కొత్తపేట, దహెగాం, గురుడుపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో మూడు సహకార సంఘాలకు డ్రోన్లు అందించిందని తెలి పారు. డ్రోన్ల ద్వారా పంటలపై మందుల పిచికారీ వేగంగా చేయవచ్చని, రైతులకు శ్రమ తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు డ్రోన్లు అందిస్తుందని, ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, ఏవో రామకృష్ణ, ఏఈవో రేష్మిత, సొసైటీ సీఈవో సతీష్, రైతులు పాల్గొన్నారు. -
కార్చిచ్చు.. ఆటకట్టు
పెంచికల్పేట్: వేసవి ముదురుతుండటంతో అడవుల్లో చెట్లు ఆకు రాల్చుతున్నాయి. గాలిలో తేమ తగ్గిపోయి పొడి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఎండు ఆకులకు ఒక్క నిప్పురవ్వ తాకినా కాలిబూడిదగా మారుతాయి. చెట్లు, జీవరాశులకు తీవ్ర నష్టం చేకూరుస్తాయి. దీంతో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తుగా సంసిద్ధమైంది. కార్చిచ్చులను గుర్తించేందుకు శాటిలైట్ సమాచారాన్ని వినియోగించుకుంటోంది. అలాగే ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతోపాటు కార్చిచ్చులు ఏర్పడిన సమయంలో స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు. అడవుల రక్షణకు ఫైర్లైన్స్జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ అటవీ డివిజన్లలో 11 రేంజ్లు, 79 సెక్షన్లు, 245 బీట్లు, 846 కంపార్టుమెంట్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 6,04,172 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. మారుమూల గిరిజన గ్రామాలు అటవీ ప్రాంతాల అతి దగ్గరగా ఉన్నాయి. నిత్యం పశువుల కాపరులు, వంట చెరుకు కోసం రైతులు అడవులకు వెళ్తుంటారు. ఎండిపోయిన ఆకులతో ప్రమాదవశాత్తు, మానవ తప్పిదాలతో కార్చిచ్చు రగిలి ఏటా వేలాది ఎకరాల్లో అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. మానవ తప్పిదాలతోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంటల ఉధృతిని తగ్గించడం, అడవుల రక్షణకు ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. శాటిలైట్ సమాచారంతో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను అరికడుతున్నారు. శాటిలైట్ ద్వారా వచ్చే సమాచారంతో తక్కువ సమయంలో ఘటన స్థలాలకు చేరుకునేందుకు వీలవుతుంది. అధికారులు భారీ నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు అవగాహనజిల్లాలోని అడవుల్లో అత్యంత విలువైన వృక్ష, జంతు సంపద ఉంది. పెద్దవాగు, ప్రాణహిత, పెన్గంగ నదులు నిత్యం నీటితో ప్రవహిస్తుండటంతో అరుదైన వన్యప్రాణులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. కాగజ్నగర్ డివిజన్లో పెద్దపులులు, ఇతర వన్యప్రాణాలు, పక్షులు సంచరిస్తున్నాయి. అడవుల్లో కార్చిచ్చులు చెలరేగితే వీటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో కాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలోని గ్రామాల్లో అధికారులు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తున్నారు. తునికాకు, ఇప్పపువ్వు సేకరణకు అడవులకు నిప్పు పెట్టే అవకాశం ఉండటంతో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు.ప్రమాదాల నివారణకు చర్యలు అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. పశువుల కాపర్లు, అడవులకు వెళ్లే వారికి అవగాహన కల్పిస్తున్నాం. కార్చిచ్చుల సమయంలో మంటలు అడవుల్లోకి వ్యాపించకుండా ఫైర్లైన్స్ ఏర్పాటు చేశాం. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ -
‘మానవతావాది అశోక చక్రవర్తి’
వాంకిడి: మౌర్య సామ్రాజ్యంలో ప్రజలకు సక ల సౌకర్యాలు కల్పించి మహా మానవతా వాదిగా సామ్రాట్ అశోక చక్రవర్తి ఎన్నో మన్ననలు పొందారని సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు మార్షల్ దుర్గం సందీప్ అ న్నారు. మండల కేంద్రంలో శుక్రవారం సా మ్రాట్ అశోక చక్రవర్తి 2330వ జయంతి ఘ నంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బౌద్ధంలో ప్రార్థనలు చేశా రు. అశోకుడి రాజ్యంలోని ప్రజలకు విద్య, వైద్యం కోసం తక్షశీల, నలంద వంటి విశ్వవిద్యాలయాలను కట్టించారని గుర్తు చేశారు. బౌద్ధ ప్రచారంలో భాగంగా అనేక స్థూపాలు, శాసనాలు నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్ పెద్దలు దుర్గం శ్యాంరావు, రాజేశ్వర్, రోషన్ ఉప్రె, ప్రకాశ్, రమేశ్ డొంగ్రె, తిరుపతి, ఉపేందర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు భరోసా’తో అన్నదాతల్లో ఆనందం
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ అబ్దుల్లాతో కలిసి సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. పెట్టుబడి సాయం అందిస్తూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లేశ్యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తారిఖ్, భీంరావు, కౌన్సిలర్ వినోద్, నాయకులు ఇందిరా, తిరుపతి, సుధాకర్, ఇమ్రాన్, నిజాం, హరీశ్, రాము, జక్కన్న, మారుతిపటేల్, శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో పఠనోత్సవం!
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పఠనాసక్తి, విద్యా సామర్థ్యాలు పెంపొందించేందుకు సర్కారు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. కరోనా ప్రభావం తర్వాత తగ్గిన పఠన స్థాయిని పెంచడమే లక్ష్యంగా గ్రంథాలయాలను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రంథాలయాలకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఉపాధ్యాయులు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయనున్నారు. కెరమెరి: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ధారాళంగా చదవడం, రాయడం రావాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలల్లో 3వ, 2వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఎఫ్ఎల్ఎస్(ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ) ద్వారా బోధన జరుగుతోంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో విద్యాసామర్థ్యాల పెంపునకు ఇది ఎంతో దోహదపడుతోంది. 2వ తరగతి నుంచి ఆపై అన్ని తరగతుల విద్యార్థులకు ధారాళంగా చదవడం రావాలనే ఉద్దేశంతో గతంలో గ్రంథాలయ పుస్తకాలను సైతం అందించారు. వీటి నిర్వహణకు ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సైతం నిధులు అందనున్నాయి. తగ్గిన పఠనస్థాయికరోనా ప్రభావం తర్వాత విద్యార్థుల్లో పఠన స్థాయి గణనీయంగా తగ్గింది. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనస్థాయి పెంపునకు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సర్కారు పాఠశాలల్లో పఠనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బడుల్లో ప్రత్యేక గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు నిత్యం గ్రంథాలయాల్లోని పుస్తకాలు, పత్రికలు చదవాలనే ఆదేశాలున్నాయి. లైబ్రరీలకు తాజాగా మరిన్ని పుస్తకా లు అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేశారు. అయితే విడుదలైన నిధులను ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ పేరిట డీడీ కడితే వారే పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలను అందించే అవకాశం ఉంది. రూ.17.63 లక్షలు మంజూరుపుస్తకాలు కొనుగోలు చేసి చదివించాలనే ఉద్దేశంతో 2025– 26 విద్యా సంవత్సరానికి పాఠశాలలకే నేరుగా నిధులు విడుదల చేస్తూ ఎస్పీడీ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల వారీగా వేర్వేరుగా నిధులను విడుదల చేశారు. జిల్లాలో 1052 ప్రభుత్వ పాఠశాలలకు రూ.17,63,456 నిధులు విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.1,171 చొప్పున, ఉన్నత పాఠశాలలకు రూ.5,198 కేటాయించనున్నారు. గతంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో కథలు, విజ్ఞానదాయక పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత నిధులతో విద్యార్థులకు ఆసక్తికరమైన పుస్తకాలు కొనుగోలు చేసి చదివించే అవకాశాన్ని ఉపాధ్యాయులకు కల్పించారు. -
నేత్రపర్వం.. పులకించిన భక్తజనం
మంగళసూత్రం చూపిస్తున్న అర్చకుడుజన్కాపూర్లో హారతి ఇస్తున్న కలెక్టర్ కె.హరితఆసిఫాబాద్: శ్రీరామనవమిని పురస్కరించుకుని జిల్లాలోని పట్టణాలు, పల్లెలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన వేదికలపై వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శుక్రవారం సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగదభిరాముడి కల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించి ఆశేష భక్తజనం పులకించింది. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ కోదండ రామాలయంలో అర్చకులు నిమ్మకంటి సంతోష్శర్మ, మహేశ్ శర్మ, ఒఝల శిరీష్శర్మ, ముదిగొండ రాజశేఖర శర్మ, నరేశ్ శర్మ, శ్రీధర్, తిరుపతి చారి, ఢిల్లీ విజయకుమార్ ఆధ్వర్యంలో పెళ్లి తంతు జరిపించారు. ముందుగా కేశవనాథ ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను హనుమాన్ దీక్షాస్వాములు బ్యాండ్ మేళా, మహిళల కోలాటాలు, భక్తిగీతాలతో గాంధీచౌక్, అంబేడ్కర్ చౌక్ మీదుగా జన్కాపూర్ రామాలయం వరకు శోభాయాత్రతో తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయుడు కోవ సాయినాథ్, హారిక దంపతులు, కేశవనాథ కమిటీ ఆధ్వర్యంలో వేర్వేరుగా పట్టువస్త్రాలు, మంగళసూత్రం, ముత్యాలు సమర్పించారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సుముహూర్తంలో అర్చకులు కల్యాణ ఘట్టం నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి కలెక్టర్ కె.హరిత, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, బీజేపీ సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, కార్తీక్, కొండు భారతి, కాంగ్రెస్ నాయకులు గాదెవేణి మల్లేశ్, బాలేశ్వర్గౌడ్, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. దీక్షాస్వాములు, భక్తులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. సాయంత్రం ఆలయంలో పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కమిటీ సభ్యులు డేగల సత్యనారాయణ, శివచందు, పర్రె యాదగిరి, సీహెచ్ రవి, భద్రయ్య, శైలేందర్, మహేశ్, మైనార్టీ నాయకులు జావిద్, కష్యప్ పాల్గొన్నారు. సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. -
వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
కౌటాల: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేయాలని హౌసింగ్ డీఈ సత్రియ అన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని శుక్రవారం పరిశీలించి, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వివరాలను తెలిజేశారు. ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిన వారికి సకాలంలో బిల్లులు అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ మూడో వారంలోగా పనులు పూర్తిచేసుకుని, గృహ ప్రవేశాలు చేయాలని సూచించారు. లబ్ధి దారుల సందర్శన కోసం మోడల్ ఇంటిని పనిదినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. ఆయన వెంట ఏఈ ఎండీ షజయొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
టైగర్జోన్పై గళమెత్తిన ఎమ్మెల్యే బొజ్జు
ఖానాపూర్: నియోజకవర్గంలోని ఆదివాసీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తారు. కవ్వాల్ టైగర్జోన్ కారణంగా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూవివాదాలను పరిష్కరించేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలని కోరారు. మల్యాల, దొంగపల్లి, యాపల్గూడ, వంటి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామాలపై డ్రోన్ సర్వే నిర్వహించడం వల్ల ఆదివాసీ మహిళల గోప్యతకు భంగం కలుగుతోందన్నారు. ఇసుక కొరత కూడా తీవ్ర సమస్యగా మారిందన్నారు. అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
క్రీడాశాఖకు కాంట్రాక్టర్ షాక్
ఆదిలాబాద్: జిల్లా క్రీడా శాఖను (డీఎస్ఏ) నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం నుంచి అరకొరగానే నిధులు అందుతుండడంతో స్థానిక వనరుల ద్వారా నిధులు సమీకరిస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదాయం కోసం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం పరిధిలో ఉన్న షాపులను, స్విమ్మింగ్ పూల్ను టెండర్ల ద్వారా లీజుకు ఇస్తున్నారు. గతేడాది మార్చిలో ఓ కాంట్రాక్టర్ రూ.21 లక్షలకు స్విమ్మింగ్ పూల్ నిర్వహణ హక్కులు దక్కించుకున్నాడు. కానీ సకాలంలో రుసుము చెల్లించకపోవడంతో క్రీడాశాఖ ఆదాయానికి గండిపడుతోంది. 3 నెలలుగా నిలిచిన చెల్లింపులు.. గతేడాది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్లలో అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్కు స్విమ్మింగ్ పూల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒప్పందం ప్రకారం ప్రతీనెల లీజు రుసుమును జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఖాతాలో జమ చేయాలి. కానీ ఈ ఏడాది జనవరి నుంచి కాంట్రాక్టర్ ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. పర్యవేక్షణ లోపంపై విమర్శలు స్విమ్మింగ్ పూల్ నిర్వహణను లీజుకు ఇచ్చినప్పటి నుండి ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. మూడు నెలలుగా బకాయిలు పేరుకుపోతున్నా సదరు కాంట్రాక్టర్కు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం శోచనీయం. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా అధికారులు మౌనం వహించడంపై క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా లీజు ధరను రూ.16.60 లక్షల వరకు తగ్గించాలని సదరు కాంట్రాక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఉన్నతాధికారులు వివరాలను కోరగా, రెండవ లీజుదారుడు ఎంతవరకు కోట్ చేశారనే విషయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జిల్లా క్రీడాశాఖ అధికారులు నివేదికను సిద్ధం చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల పెంపు.. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ 12 సంవత్సరాల లోపు చిన్నారులకు అడ్మిషన్ ఫీజు రూ.1000, నెలవారీ ఫీజు రూ.500 తీసుకోవాలి. 12 సంవత్సరాలు పైబడిన వారికి అడ్మిషన్ ఫీజు రూ.1000, నెలవారీ ఫీజు రూ.1000 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ 10 ఏళ్లలోపు వారికి నెలవారీ ఫీజు రూ.1000, ఆపై వారికి రూ.1500, స్పెషల్ బ్యాచ్ పేరిట రూ.2వేల నెలవారీ ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.రికవరీ చేస్తారా?.. తగ్గిస్తారా? బకాయి మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి అధికారులు రికవరీ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంట్రాక్టర్ పెట్టుకున్న అర్జీని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం లీజు మొత్తాన్ని తగ్గిస్తుందా? లేక పాత ఒప్పందం ప్రకారమే వసూలు చేస్తుందా అనేది ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే లీజు రద్దుచేసి కొత్త టెండర్లు పిలిచే అవకాశాలు లేకపోలేదు.మూడు నెలల బకాయిలను పరిశీలిస్తే రూ.5.25 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ప్రతీనెల 15లోగా లీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే రోజుకు రూ.2,500 పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది. 15 నుంచి 30 వరకు మూడు నెలల్లో 45 రోజులకు లెక్కించినా, పెనాల్టీ మొత్తంగా రూ.1,12,500 అవుతుంది. లీజు రుసుము పెనాల్టీ మొత్తాన్ని కలిపితే సుమారుగా రూ.6,37,500 అవుతుంది. -
నిర్మల్లో వైద్యుడిపై దాడి
నిర్మల్: జిల్లాకేంద్రంలోని ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు సంతోష్రాజ్పై ఓ వర్గం వ్యక్తులు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ పట్టణంలోని వైద్యులందరూ ఆందోళనకు దిగారు. స్థానిక జయశంకర్ చౌరస్తాలో రోడ్డుపై గంటలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. బిల్లుల విషయంలో సదరు ఆసుపత్రికి సిబ్బందితో ఓవర్గం వ్యక్తులు గొడవకు దిగారు. ఇదే క్రమంలో వైద్యుడు సంతోష్రాజ్పైనా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దారు. వైద్యుల రాస్తారోకో... తోటి వైద్యుడిపై దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని డాక్టర్లు అందరూ రోడ్డెక్కారు. ర్యాలీగా స్థానిక జయశంకర్ చౌరస్తాకు చేరుకొని బైఠాయించారు. వీరికి బీజేపీ, కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీల కౌన్సిలర్లు, పలు సంఘాలు మద్దతు పలికాయి. గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో బస్సులు, ఆటోలు, వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ సాయికిరణ్ వచ్చి నిందితులను అరెస్టు చేస్తామని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆందోళన కొనసాగించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్చక్రవర్తి సైతం వైద్యులతో మాట్లాడారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని రాయపూర్కాండ్లీలో రైతు బక్కనోల్ల రాజుకు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు మూడురోజుల క్రితం మొక్కజొన్న పంటను కోసి చేనులోనే ఉంచాడు. గురువారం పంటచేను పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో మంటలు చెలరేగి అర ఎకరంలో పంట దగ్ధమైంది. పంట విలువ రూ.30 వేల వరకు ఉంటుందని రైతు వాపోయాడు. లూజు వైర్ల విషయమై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పంట దగ్ధమైందని రైతు ఆరోపిస్తున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో సాద్వి కుమారి మృతి
గుడిహత్నూర్: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొల్హారీ గ్రామానికి చెందిన సాద్వి కుమారి అశ్విని కాగ్నే (19) మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మరాఠీ వార్కరీ సంప్రదాయానికి చెందిన అశ్విని కాగ్నే మహారాష్ట్రలోని ఖందార్ తాలుకా కల్లారీ గ్రామంలో నిర్వహిస్తున్న సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం పెదనాన్న వసంత్ కాగ్నే, తల్లి అయోధ్యాబాయితో కలిసి ఆటోలో బయలు దేరారు. సీతాగోంది సమీపంలోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొట్టడంతో అశ్విని, వసంత్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్కు తరలించగా అశ్విని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వసంత్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. చెరువులో నీటమునిగి ఒకరు..లక్సెట్టిపేట: ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లికి చెందిన తనుగుల రాజలింగం (46) బుధవారం ఉదయం తన గేదెలను మేపేందుకు చెరువు వైపు వెళ్లాడు. చెరువుకు అవతలివైపు ఉన్న పంటచేలను మేసేందుకు గేదెలు నీటిలో నుంచి వెళ్తుండడంతో వాటిని మరల్చే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం బయట పడింది. మృతుని కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ పరిశీలించారు. చేపల వలకు చిక్కుకుని జాలరి.. లోకేశ్వరం: చేపల వలకు చిక్కుకుని జాలరి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సాథ్గాం గ్రామానికి చెందిన జాలరి పల్లికొండ సతీష్ (31) గురువారం ఉదయం చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని మాల్కాపూర్ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో వేసిన వలను తీసే క్రమంలో దానికి చిక్కుకుని నీట మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. సౌదీలో నిర్మల్వాసి.. నిర్మల్టౌన్: సౌదీ అరేబియా ఓమ్లోజ్ మదీనా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాలు ప్ర కారం..పట్టణంలోని సోఫీనగర్కు చెందిన జావిద్ (42) ఉపాధి కోసం రెండున్నర సంవత్సరాల క్రితం సౌదీకి వె ళ్లాడు. వారం రోజుల క్రితం అక్కడ జ రిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
మామడ: ఉపాధిహామి పనులకు సంబందించిన రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక గురువారం నిర్వహించారు. ఉపాధిహామీ పనుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. నర్సరీలలో మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. జూలైలో నిర్వహించే వనమహోత్సవానికి ఇప్పటి నుంచి నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం చేయాల్సిన పనులను ప్రారంభించాలన్నారు. మండలంలోని 27 గ్రామపంచాయతీల పరిధిలో గతేడాది రూ.7.43 కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు సమావేశంలో గుర్తించారు. మండలంలో 6,882 జాబ్ కార్డులుండగా 11,312 మంది కూలీలు ఉపాధిహామీ పనుల్లో పాల్గొన్నారు. 72 మంది వందరోజుల పనిదినాలు పూర్తి చేశారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీవీవో లక్ష్మ ణ్, హెచ్ఆర్ సురేందర్, ఎంపీడీవో సుశీల్రెడ్డి, ఎంపీవో హరికృష్ణ, ఏపీవో శివాజీ, ఎస్సార్పీ మహేశ్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు?
కాసిపేట: మండల కేంద్రంలోని ముత్యంపల్లి గ్రామశివారులో బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టగా గుప్త నిధుల వేటకే తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి జేసీబీతో పురాతన శిల్పం ఉన్న రాయి పక్కన తవ్వకాలు చేపట్టినట్లు, గతంలో సైతం ఇక్కడ పలుమార్లు రాత్రి సమయంలో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనుగొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు ఎటువంటి సమాచారం లేదని తెలపగా, జేసీబీతో రాత్రి సమయంలో గోతి తవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
తానూరు: మండలంలోని బోరిగాం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జాదవ్ కృష్ణనంద్ పటేల్ను కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం సస్పెండ్ చేశారని ఎంపీడీవో అమీర్ఖాన్ తెలిపారు. జాదవ్ కృష్ణనంద్ పటేల్ అసైన్డ్ భూమిలో 1–84,1–85 నంబర్లతో స్థలాన్ని సృష్టించి అదే స్థలంలో ఇళ్లు నిర్మాణానికి ప్రోసీడింగ్ జారీచేశారు. పూర్తి విచరణ చేపట్టిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఈమేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ చర్యలు తీసుకున్నారని ఎంపీడీవో తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని ధర్నామంచిర్యాలఅగ్రికల్చర్: ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వి ద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యా క్షన్ కమిటీ(టీవీఏఈజేఏసీ) ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల డివిజన్ కార్యాలయం ఎ దుట ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు రానున్న నాలుగు రోజుల్లో విడతల వా రీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ తిరుపతి, కన్వీనర్ తోట నగేష్, కో చైర్మన్ ఉప్పలేటి నరేష్, రమేశ్ రాజు, ప్రభాకర్, మహేందర్, రమేశ్, సాగర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డ్రైవర్లకు మెరుగైన చూపు అవసరం
చెన్నూర్: ప్రతీ డ్రైవర్కు మెరుగైన కంటి చూపు అవసరమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో గురువారం చెన్నూర్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో, లారీ, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కంటి చూపే కీలకమని అన్నారు. 150 మందికి పరీక్షలు నిర్వహించి 24 మందికి కళ్లద్దాలు అందజేసినట్లు తెలిపారు. ఐదుగురిని కంటి శస్త్రచికిత్సకు ఎంపిక చేశామని తెలిపారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు బన్సీలాల్, కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ తనిఖీ భీమారం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీసీపీ భాస్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు పరిశీలించిన తర్వాత ఫిర్యాదులపై ఎస్సై రాజేందర్ను అడిగి తెలుసుకున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్, ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు. ఇంధనంపై గందగోళం సృష్టిస్తే చర్యలు మంచిర్యాలక్రైం: ఇంధనం కొరత ఉందంటూ గందరగోళం సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఇంధనం కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ముందస్తుగా వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించడం, క్యాన్లలో తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేయడం చేస్తున్నారని పేర్కొన్నారు. వేసవిలో పెట్రోల్, డీజిల్ ఇళ్లలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో రెండో ప్లాట్ ఫాంపై గుర్తు తెలియని రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం పులిమడుగు గ్రామానికి చెందిన బోనుగూరు లింగయ్య(40) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. లింగమూర్తికి భార్య రాజలక్ష్మి, ఇద్దరు కూతుర్లు రాగశ్రీ, ఆధ్యశ్రీ ఉన్నారు. భార్య రాజలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నామని జీఆర్పీ ఎస్సై తెలిపారు. -
బుగ్గిపాలైన వలస బతుకులు
లక్ష్మణచాంద: బతుకు దెరువు కోసం వచ్చి పని నిమిత్తం ఇంటికి వెళ్లే క్రమంలో ఊహించని ప్రమాదం సంభవించడంతో మంటల్లోనే వలస బతుకులు బుగ్గిపాలైన విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలంలోని అంకభూపాలపురానికి చెందిన బండారు వెంకటరమణయ్య, పద్మ (35) దంపతులు నాలుగేళ్లక్రితం, ఇదే గ్రామానికి చెందిన మణి, వెంకట్రావ్ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు వచ్చి తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటికి వెళ్లే క్రమంలో....బుధవారం బండారు పద్మ, మణి, ఆమె బావ కుమారుడైన రోహన్ ముగ్గురూ కలిసి ఆర్మూర్ నుంచి జగిత్యాలకు వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. గురువారం ఉదయం ఏపీలోని మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న 33 మందిలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పద్మ మంటల్లోనే కాలి బూడిదైంది. మణి కోమాలోకి వెళ్లగా రోహాన్కు స్వల్పగాయాలయ్యాయి. బతుకు దెరువుకోసం వచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. -
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పరిశీలన
తానూరు: ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసి వాటిని తాగడం ఎంతో మేలని మహిళా అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని బోంద్రట్ గ్రామంలో సాయిబాబా మహిళ సంఘం సభ్యురాలు సిందే అర్చన–సాయినాథ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను గురువారం పరిశీలించారు. వర్షపు నీరు భూమిపై పడకముందే సేకరించి వాటిని నిల్వచేసి అదేనీటిని ఏడాదంతా తాగుతున్నట్లు వివరించారు. దీంతో తమకు ఎలాంటి వ్యాధులు రావడం లేదని తెలిపారు. వర్షపు నీరు స్వచ్ఛంగా ఉండి అరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అర్చన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో రాజేశ్వర్, సీసీ సవిత, గ్రామ సంఘం అధ్యక్షురాలు ప్రతిభ, వీవోఏ రాణి పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనేటీగలు దాడి చేశాయి. దండేపల్లి గ్రామానికి చెందిన 110మంది కూలీలు గురువారం ఉదయం దండేపల్లి అడవిలో అటవీ ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లారు. పనులు చేపట్టిన కొద్దిసేపటికే కూలీలపై తేనేటీగలు దాడి చేయడంతో పరుగులు తీశారు. 20మందిపై దాడి చే యడంతో 108అంబులెన్స్లో దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న జిల్లపెల్లి గంగ, శశికుమార్, చీపిరిశెట్టి సత్తన్న, పద్మ, భీమోజు సుజాతలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
‘అభివృద్ధిలో సిర్పూర్ వెనుకబడింది’
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గం ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. గత 20 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఇది మీ తండ్రి చేశారని అంటుంటారని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలో కలుస్తున్న మావోయిస్టులను అభినందించాలని, కానీ హీరోలను చేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు. తాను నక్సలైట్ బాధితుడిని అని, చిన్నతనంలో తండ్రిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఏడాది క్రైమ్ రేట్, పోక్సో కేసులు పెరిగాయని, గిరిజన మహిళల అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ దందాను అడ్డుకోవాలని కోరారు. -
పనులు నిలిపివేయాలని వినతి
వైభవోపేతం.. సీతారాముల కల్యాణంకల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులుపల్లకి మోస్తున్న మాలధారులుఅక్షింతలు వేస్తున్న భక్తులుమంగళసూత్రం చూపిస్తున్న అర్చకుడుకెరమెరి మండల కేంద్రంలోని శివాలయం ఆవరణలో గురువారం శ్రీసీతారాముల కల్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పల్లెర్ల మధుకర్, ప్రేమల ఇంటి నుంచి సీతమ్మ వారిని, కల్లూరి కృష్ణ, సాగరిక ఇంటి నుంచి రామయ్యను భాజాభజంత్రీల మధ్య మండపానికి తీసుకువచ్చారు. హనుమాన్ మాలధారులు పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. కులకర్ణి బాపూదేవ్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ వివాహ మహోత్సవం జరిగింది. సీతారాముల ప్రతిమలకు పంచామృతంతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సై నాయిన మధుకర్, ఎంపీడీవో సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. – కెరమెరి జానకీపురానికి కల్యాణ శోభఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జానకీపురం(జన్కాపూర్) సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. వారం రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భూమిని చదును చేసి, షామియానాలు, చలువ పందిళ్లు వేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. కల్యాణ ఘట్టాన్ని వినేందుకు వీలుగా జన్కాపూర్ నుంచి ఆసిఫాబాద్ వరకు ప్రధాన రహదారి పొడవునా మైక్లు ఏర్పాటు చేశారు. ఉదయం జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయం నుంచి కోదండ రామాలయం వరకు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఆనవాయితీలో భాగంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సోనేరావు దంపతులు సీతారాముల వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. జిల్లాలో అధికార, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఆలయ చరిత్రఒకప్పటి జనగామ, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అప్పటి పట్టణ ప్రముఖులు స్వర్గీయ రాంచందర్రావు పైకాజీ 1970లో ఆలయాన్ని నిర్మించి సీతారాముల విగ్రహాలు ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆలయంలో ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుతుండటంతో భక్తుల తాకిడి పెరిగింది. పర్వదినాల్లో అన్నదానాలు, భజనలు, ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేశ్ నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత నిర్మించిన ఆలయం శిథిలం కావడంతో రెండు దశాబ్దాల క్రితం భక్తుల సహకారంతో జన్కాపూర్ వాసులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేపట్టారు. సీతారాముల విగ్రహాలతో పాటు శివలింగం, షిర్డీ సాయినాథుడి విగ్రహాలు, ఈశాన్యంలో నవగ్రహాలు ప్రతిష్టించారు. దాతల సహకారంతో కల్యాణ మండపం కూడా నిర్మించారు. మధ్యాహ్నం 12.03 గంటలకు ముహూర్తంశ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో శుక్రవారం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4.30 గంటలకు సీతారాములకు అభిషేకం, 7 గంటలకు కేశవనాథ ఆలయంలో ఉత్సవ మూర్తుల ప్రోక్షణ, పుణ్యాహవచనం, 8 గంటలకు వధూవరులకు మధుపర్కాలు, బాసింగాలతో అలంకరణ, 9 గంటలకు ఆసిఫాబాద్ నుంచి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలతో హనుమాన్ దీక్షాస్వాముల శోభాయాత్ర చేపడతారు. 11 గంటలకు కల్యాణ ఘట్టం ప్రారంభమతుంది. 11.30 గంటలకు కన్యాదానం, మధ్యాహ్నం 12.03 గంటలకు సీతారాముల కల్యాణ ముహూర్తం నిర్ణయించారు. అనంతరం మహాప్రసాదం(అన్నదానం), సాయంత్రం 6 గంటలకు పల్లకిసేవ, రాత్రి 8 గంటలకు విష్ణుసహస్రనామ పారాయణం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం వద్ద బెల్లం పానకం, మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేయనున్నారు. పట్టణానికి చెందిన అర్చకుడు నిమ్మకంటి సంతోష్శర్మ అన్నదాన కార్యక్రమానికి ఆర్థికసాయం అందించారు. 28న జాతీయ లోక్అదాలత్ ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఈ నెల 28న జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎ.వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మహేశ్వర్ గురువారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాము, కార్తీకేయ ఉత్తమ ప్రతిభ చూపారని అన్నారు. ఈ నెల 26 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి నెట్బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. క్రీడల్లో రాణించాలి ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీఎస్వో షేకు అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో గురువారం అస్మిత కబడ్డీ లీగ్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీల్లో జిల్లా నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. మహిళా డిగ్రీ కళాశాల మొదటి స్థానం, తెలంగాణ మోడల్ స్కూల్ రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్, పీడీలు, పీఈటీలు రాకేశ్, శారద, కోచ్లు విద్యాసాగర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. కాగజ్నగర్టౌన్: పాత తీర్మానాల పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులను వెంటనే నిలిపివేయాలని గురువారం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీలో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం నిధుల కొరతతో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వలేని స్థితిలో బల్దియా ఉందన్నారు. కార్మికుల పొట్టకొట్టి తీర్మానాల పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు చేయడం దుర్మార్గమని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టర్, ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వలీ, శ్రీధర్(రాము), మాణిక్యం, పోచం, వసీం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సౌత్జోన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
రెబ్బెన: తమిళనాడులోని ఓని టెన్కాశీలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే ఇండియా సౌత్ జోన్ బాల్బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. పి.సాయిచరణ్, కె.అంజలి, జి.అనూష తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలో పాల్గొనున్న జిల్లా క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆర్.నారాయణరెడ్డి, సెపక్తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు మహేందర్రెడ్డి, మారిన వెంకటేశ్వర్లు, పీఈటీ భాస్కర్, సీనియర్ క్రీడాకారులు నరేశ్, మల్లేశ్, శ్రీకాంత్, గోపాల్ అభినందించారు. -
31లోగా పన్నులు వసూలు చేయాలి
కెరమెరి: పంచాయతీల్లో ఈ నెల 31లోగా పన్నులు వసూలు చేయాలని డీఎల్పీవో ఉమర్ హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమవేశమయ్యారు. వసూలుకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండగా, ఇప్పటివరకు 87 శాతం పూర్తయినట్లు తెలిపారు. బకాయిలపై దృష్టి సారించి లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గోల్డ్మెడల్ సాధించిన సింగరేణి క్రీడాకారుడికి సన్మానం
రెబ్బెన: కోలిండియా స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన బెల్లంపల్లి ఏరియా ఉద్యోగ క్రీడాకారుడిని గురువారం గోలేటి టౌన్షిప్లోని కార్యాలయంలో జీఎం విజయ భాస్కర్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఒడిశాలోని మహానంది కోల్డ్ ఫీల్డ్ ఆధ్వర్యంలో జరిగిన కోలిండియా స్థాయి లాన్ టెన్నిస్లో బెల్లంపల్లి ఏరియా గోలేటి సీహెచ్పీకి చెందిన మురళీకృష్ణ అద్భుత ఆటతీరుతో బంగారు పతకం సాధించాడు. అతడిని శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం సివిల్ ఎస్కే మదీనా బాషా, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్వోడీ ఎస్వీ రాజేశ్వర్రావు, క్వాలిటీ హెచ్వోడీ రాజేశ్, సీనియర్ పీవో శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, నాయకులు మారం శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనదారులకు ఇబ్బందులు రానీయొద్దు
కాగజ్నగర్టౌన్: ఇంధనం కోసం గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడిచే బంకులకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు రానీయొద్దని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్పంప్ ఏరియాలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంక్ను బుధవారం జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్కుమార్తో కలిసి తనిఖీ చేశారు. బంకులో జరుగుతున్న లావాదేవీలు, రిజిస్టర్లు, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, గాలి పంప్మిషన్ను పరిశీలించారు. పీవో మాట్లాడుతూ వినియోగదారులకు సక్రమంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలన్నారు. కనీస వసతులు కల్పించాలని, తాగునీరు, మూత్రశాలల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ఇంధన అవసరం మేరకు ముందస్తుగా తెప్పించుకోవాలని, నో స్టాక్ బోర్డులు పెట్టొద్దని సూచించారు. కార్యక్రమంలో పెట్రోల్ బంక్ ఇన్చార్జి ప్రదీప్, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.10లక్షల విలువైన ఫోన్లు రికవరీ
ఆసిఫాబాద్: ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు సఫలీకృతులవుతున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసి న మొబైల్ రికవరీ మేళాలో రూ.10 లక్షల విలువైన 108 ఫోన్లను ఎస్పీ నితిక పంత్ చేతుల మీదుగా యజమానులకు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ లేనిదే ఏ చిన్న లావాదేవీ కూడా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్ వంటి వాటితో పాటు విలు వైన సమాచారాన్ని సేవ్ చేసుకుంటున్నారని తెలిసి నేరగాళ్లు ఫోన్లు దొంగిలిస్తున్నారన్నారు. వీక్ పాస్ వర్డ్స్ బ్రేక్ చేసి చేసి ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. బాధితులు వ్యక్తిగత సమాచారంతో డబ్బులు కోల్పోతున్నారన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు వెంటనే సీఈఐఆర్ పోర్టల్ https://www.ceir.gov.in లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సెకెండ్ హ్యాండ్ మొ బైళ్లు కొనుగోలు చేస్తే, షాపు యజమాని నుంచి రసీదు తీసుకోవాలన్నారు. దొంగిలించిన ఫోన్లను తెలిసి కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐలు బాలాజీ వరప్రసాద్, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
మాజీ మావోయిస్టు కుటుంబాలను ఆదుకుంటాం
ఆసిఫాబాద్: మాజీ మావోయిస్టు కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎస్పీ నితిక పంత్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సందీప్నగర్కు చెందిన మాజీ మావోయిస్టు బోయిని నగేశ్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, నగేశ్ సాగు చేసుకుంటున్న భూమికి లావుణి పట్టా మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఆయన భార్యకు మహిళా సంఘాల గ్రూపులో సభ్యత్వం కల్పించి, బ్యాంకు రుణం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పదో తరగతి వరకు చదివి మానేసిన కుమార్తె ఉన్నత చదువులకు చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, కలెక్టరేట్ ఏవో జితేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు లింగాపూర్: వాగులు, ఒర్రెల వద్ద వర్షాకాలంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల్లో బుధవారం విస్తృతంగా పర్యటించి లోలెవల్ వంతెనల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా లింగాపూర్ మండలం కంచన్పల్లి పంచాయతీ మూలగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుంనూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు, సౌకర్యాలను పరిశీలించారు. అలిగూడ, గుంనూర్ నుంచి కంచన్పల్లి గ్రామానికి వెళ్లేదారి మధ్యలో లోలెవల్ వంతెన వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిర్పూర్(యు) మండలం మహాగాంపటేల్ గూడలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలన్నారు. కోయినూర్ వంతెనను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, కేజీబీవీని సందర్శించారు. జైనూర్ మండలం గౌరి గ్రామానికి వెళ్లేదారి మధ్యలోని లోలెవల్ వంతెనను పరిశీలించారు. -
విత్తన వరి.. లాభాల సిరి
పెంచికల్పేట్: జిల్లా రైతులు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ పంటల సాగుతో నష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్లుగా అన్నదాతలు వరిధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విత్తన వరి సాగుపై దృష్టి సారించారు. ఆయా విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. పంట పొలాలను సందర్శించి విత్తనాలు, మందులు అందిస్తున్నారు. దీంతో జిల్లాలో విత్తన సాగు గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న సాగు విస్తీర్ణం ఆసిఫాబాద్, రెబ్బెన, సిర్పూర్(టి), కాగజ్నగర్, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో మాత్రమే రైతులు పెద్ద ఎత్తున వరిసాగు చేస్తున్నారు. సుమారు పదేళ్ల క్రితం దహెగాం మండలానికి చెందిన రైతులు విత్తన వరి పండించడం ప్రారంభించారు. క్రమేణా దహెగాం నుంచి పెంచికల్పేట్, రెబ్బెన మండలాలకు విస్తరించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచికల్పేట్ మండలానికి చెందిన రైతులు ఈ విత్తన వరి సాగు వైపు మళ్లారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 2,500 ఎకరాల్లో విత్తన వరి సాగు చేస్తున్నారు. అయితే సాధారణ రకాలతో పోల్చితే విత్తన వరి సాగు కష్టంగా ఉంటుంది. నారు పోసిన నాటి నుంచి పంట చేతికందే వరకు రైతులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కలుపు నియంత్రణ, ఎరువులు చల్లడం, పురుగు మందుల పిచికారీ, పూత సమయంలో కూలీలపై ఆధారపడాల్సిందే. పూత వచ్చే సమయంలో రెండెకరాలకు నలుగురు కూలీలు 20 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేస్తారు. క్రమం తప్పకుండా పురుగు మందుల పిచికారీతోనూ పెట్టుబడులు అధికంగా ఉంటాయి. రూ.60 నుంచి రూ.80వేల ఆదాయం హైబ్రీడ్ వరి సాగులో ఎలాంటి అనుభవాలు లేని రైతులకు కంపెనీల ప్రతినిధులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. నిరంతరం పొలాలను సందర్శించి సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. పంటను ఆయా కంపెనీలే కొనుగోలు చేస్తున్నాయి. విత్తన రకాన్ని బట్టి క్వింటాల్కు రూ.9వేల నుంచి రూ.14 వేలు చెల్లిస్తారు. పెట్టుబడి ఖర్చులు పోగా ఎకరానికి సుమారు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. -
అప్పారి వెంకటస్వామికి నివాళి
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయ ఉద్యమకారుడు అప్పారి వెంకటస్వామి 25వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి మాట్లాడుతూ వెంకటస్వామి ఆదర్శ ఉపాధ్యాయ ఉద్యమనేత అని, యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పని చేశారని గుర్తు చేశారు. ఆయన నిబద్ధత, నిజాయ తీ, నిరాడంబరత, త్యాగశీలి నేటితరం ఉపాధ్యాయులు ఆచరించాలని సూచించారు. పత్రిక సంపాదకుడిగా చివరి శ్వాస వరకు సేవలో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్కమలాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బాల కృష్ణ, మహేశ్, సురేశ్, హరీశ్, సమత, కుమారి, విద్యాచరణ్, శ్రీకాంత్, తరుణ్, వంశీ, యుగంధర్, సాయి, ప్రవీణ్ పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
కెరమెరి/తిర్యాణి: జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. గాలులకు చెట్లు విరిగిపడగా, వడగండ్లతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కెరమెరి మండలం కెలిబి గ్రామంలోని మంగళవారం రాత్రి ఈదురుగాలులకు ప్రాథమిక పాఠశాల భవనంపై చెట్టు విరిగిపడింది. రోడ్డుపై 50 ఏళ్ల భారీ వృక్షం పడడంతో బుధవారం ఉదయం 10 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు పడడంతో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయి. కేంద్రె కేశవ్కు చెందిన ట్రాక్టర్పై చెట్టు పడటంతో దెబ్బతింది. ఇళ్ల రేకులు గాలులకు ఎగిరిపోయాయి. సర్పంచ్ చోలే నాగ్నాథ్ పరిస్థితిని పర్యవేక్షించి అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు తిర్యాణి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బుధవారం వడగండ్లు పడ్డాయి. -
విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో ఎమ్మెల్యే
రెబ్బెన: మండలంలోని దేవులగూడ సమీపంలో గల పులికుంట వాగు ఒడ్డున నూతనంగా నిర్మించిన ఆలయంలో బుధవారం విగ్రహ, ధ్వజ శిఖర ప్రతిష్ఠాపన వేడుకలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. రాజరాజేశ్వర స్వామి, కనకదుర్గాదేవి, లక్ష్మీగణపతి, నవగ్రహాలు, జంట నాగదేవతల విగ్రహాలను ప్రతి ష్ఠించారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు దుర్గం భరద్వాజ్, పర్కాల సాగర్గౌడ్, ఉప సర్పంచ్ వ రలక్ష్మి దుర్గారావు, మాజీ సర్పంచ్ అహాల్యాదేవి, మాజీ ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలో ‘ఆశ్రమ’ విద్యార్థి ప్రతిభ
వాంకిడి: ఆశ్రమ పాఠశాలల్లో విభా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఈ ఎల్పీ(ఇంగ్లిష్ లర్నింగ్ ప్రోగ్రాం) పోటీల్లో వాంకిడి మండలం చౌపన్గూడ ట్రైబల్ వెల్ఫే ర్ శాటిలైట్ సెంటర్కు చెందిన మూడో తరగతి విద్యార్ధి సిడాం భీంరావు ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ మేరకు మంగళవారం ఉ ట్నూర్లో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ చేతుల మీదుగా సైకిల్, స్టడీ చైర్, స్టడీ మెటీరియల్ అందుకున్నట్లు హెచ్ఎం మనోహర్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు. గిత్తే కార్తీక్ మరో ఘనతకెరమెరి: మండలంలో ని కెలి– కె గ్రామానికి చెందిన గిత్తే కార్తీక్ మరో ఘనత సాధించా రు. హైదరాబాద్, పూణె, ముంబయి, కలకత్తాకు చెందిన 12 మంది విద్యార్థులతో కలిసి మహారాష్ట్రలోని కల్సుబాయి, హరిచంద్రగఢ్ శిఖరాలను అధిరోహించారు. అహిల్య నగర్ జిల్లాలోని సెండే నుంచి ఈ నెల 21 నుంచి ట్రెక్కింగ్ ప్రారంభం కాగా, మంగళవారం సాయంత్రం ముగింది. 1600 మీటర్ల కల్సుబాయి శిఖరం, 1400 మీటర్ల హరిచంద్రగఢ్ను నాలుగు రోజుల్లో ఎక్కారు. కాగా, మహారాష్ట్రలోని సందన్వ్యాలీలో ఈ నెల 19, 20 తేదీల్లో 12 మంది విద్యార్థులకు కార్తీక్ శిక్షణ అందించారు. ట్రెక్కింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. -
అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందించాలి
కాగజ్నగర్టౌన్: పట్టణ శివారులోని చారిగాంలో గల డబు ల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతి న పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించారు. 288 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు గత ప్రభుత్వలో 99 శాతం పూర్తయ్యాయ ని, పెండింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. అలాగే బెజ్జూర్ మండలంలో ఆదివాసీలు ఉన్నారని, సాంకేతిక సమస్యలతో ఇళ్లు మంజూరు కావడం లేదని తెలిపారు. అర్హులను ఎల్1లోకి చేర్చి ఇళ్లు మంజూరు చేసేందుకు మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. -
ఉద్యోగులు సమయపాలన పాటించాలి
పెంచికల్పేట్: ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్ హరిత సూచించారు. మంగళవారం మండలంలో పర్యటించారు. పీహెచ్సీ, కేజీబీవీ, బొంబాయిగూడ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమికో న్నత పాఠశాలను తనిఖీ చేశారు. పీహెచ్సీలో స్టోర్రూం, ఆపరేషన్ థియేటర్, ఉద్యోగుల హాజరు రిజి ష్టర్ పరిశీలించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీలో విద్యార్థినులకు అందిస్తున్న భోజ న మెనూ పరిశీలించారు. పదోతరగతి విద్యార్థినులతో ముచ్చటించారు. కేజీబీవీలో చేపట్టిన నిర్మాణ ప నులు పరిశీలించారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిబ్బంది కలెక్టర్కు విన్నవించారు. బొంబాయిగూడలోని ఆదర్శ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం పరిశీలించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి కాగజ్నగర్టౌన్: నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ హరిత సూచించారు. మంగళవారం కాగజ్నగర్ మండలంలోని జంబుగ రైతువేదికలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని భూగర్భ జలశాఖ, సమృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. వాగులపై చెక్ డ్యామ్లు, నీటికుంట లు, బోర్ల సమీపంలో ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇంకుడుగుంతలతో వర్ష పు నీరు భూమిలోకి చేరి నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు. దీని ద్వారా సాగు, తాగునీటికి ఎ లాంటి ఇబ్బందులుండవని వివరించారు. ప్రజావా ణిలో ఎక్కువగా చేతిపంపులు, బోరు బావులు మంజూరు చేయాలని అర్జీలు వస్తున్నాయని తెలిపారు. భూగర్భ నీటి మట్టం పెరగాలంటే ప్రతీ ఇంటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని సూచించారు. జిల్లా నీటి వనరులశాఖ అధికారులు, డీఏవో వెంకట్, ఉ ద్యానవనశాఖ అధికారి నదీం, మిషన్ భగీరథ ఈ ఈ సిద్దిక్, ఎండీ సాంబశివరావు, రైతులున్నారు. -
జెడ్పీ హైస్కూల్ తనిఖీ
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రధ్ధాశుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలు, మధ్యాహ్న భోజన వంట గది, వంటలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బోధన తీరు, తరగతి గదులు, పాఠశాల సదుపాయాలు, తాగునీటి సౌకర్యం, పా ఠశాల రికార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. ఉత్తమ ఫలి తాలు సాధించి ఉన్నత విద్యను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. తహసీల్దార్ రహీమొద్దీన్, సిబ్బంది ఉన్నారు. -
క్షయ రహిత సమాజానికి కృషి చేయాలి
ఆసిఫాబాద్: క్షయ రహిత సమాజానికి కృషి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ సీతారాం సూచించారు. ప్రపంచ క్షయ నివారణ దినో త్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వాస్పత్రి నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన శైలి ద్వారా క్షయను నివారించవచ్చని తెలిపారు. వ్యాధిగ్రస్తులు దగ్గినపుడు, తుమ్మినపుడు నోటి మాస్క్ ధరించాలని, తప్పనిసరిగా చికి త్స పొందుతూ పోషకాహారం తీసుకోవాలని సూచించారు. హైరిస్క్ ఉన్న వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలి పారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాస్పత్రిలో క్షయ నిర్ధారణ పరీక్షాకేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా ఆరోగ్య అధికారి వినయ్, ప్రోగ్రాం అధికారి వెంకటేశ్, విజయమ్మ, సీఎన్వో పవన్కుమార్, ఆశ కార్యకర్తలు, ఎన్జీవో ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిమితి పెరిగింది
దహెగాం: ప్రభుత్వం పంటల రుణ పరిమితిని పెంచగా రైతులు హర్షం వ్యక్తంజేస్తున్నారు. పంటల సా గు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏటా రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ రుణ పరిమితులను సూచిస్తోంది. ఆ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర సహకార అపె క్స్ బ్యాంక్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి వానా కాలం, యాసంగి పంటల రుణ పరిమితి పెంచింది. ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలని ఖరారు చేస్తూ ఎస్ఎల్బీసీ (స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ) కి పంపించింది. దీంతో పంట రుణాల పరి మితిని పెంచుతూ ఎస్ఎల్బీసీ జిల్లా, మండలాల బ్యాంకర్లకు సర్క్యులర్ పంపించారు. ఈ రుణ పరి మితిని ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తారు. 128 రకాల పంటలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, తేనెటీగలు, చేపల పెంపకం తదితర యూనిట్ల కూ ప్రభుత్వం రుణపరిమితి పెంచింది. రుణాల పంపిణీలో పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేరదనే ఆరో పణలున్నాయి. జిల్లాలో అధికంగా పత్తి, వరి సాగు చేసే రైతులే పంట రుణలు తీసుకుంటున్నారు. సాగు విస్తీర్ణం ఇలా..జిల్లా వ్యాప్తంగా 4.45 లక్షల ఎకరాల్లో పంటలు సా గవుతున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నా యి. జిల్లాలో 1.43 లక్షల మంది రైతులుండగా, సు మారు 1.37లక్షల మంది పంట రుణాలకు అర్హులు. కాగా, వీరిలో 78శాతం మందికే రుణాలు అందుతున్నాయి. మిగతా రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆ శ్రయిస్తున్నారు. బ్యాంకర్లు ఇస్తున్న పంట రుణాల కు వడ్డీ తక్కువ ఉండగా పట్టా పాస్బుక్ కలిగిన ప్ర తీ రైతు సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు తీ సుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ, పట్టా పాస్బుక్ ఉన్నా స్థానికంగా లేకపోవడంతో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. గతం కంటే లాభం అదనంపంటల రుణ పరిమితి పెంచడంతో వరికి గతేడాది రూ.46 వేలు ఉండగా ప్రస్తుతం రూ.48వేలు అందనుంది. దీంతో రైతులకు అదనంగా రూ.2వేలు రా నున్నాయి. పత్తికి రూ.4వేలు, మిర్చికి రూ.4వేలు, కందికి రూ.2వేలు, సోయాకు రూ.2వేలు, పెసర, జొన్న, మక్క, పంటలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు అదనంగా రానున్నాయి. దీంతో పంటల సా గుకు అవసరమైన పెట్టుబడులకు ఇబ్బందులు రా కుండా ఉపశమనం కలగనుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కాగా, ఐదెకరాలకు పైగా ఉ న్న రైతులకు రూ.2లక్షలకు మించి రుణాలివ్వడంలేదని చెబుతున్నారు. అడిగితే.. బ్యాంకర్లు కండిషన్లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల నేపథ్యంలో రూ.2లక్షల వర కు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రటించి కు టుంబాన్ని యూనిట్గా తీసుకోవడంతో చాలామంది రైతులకు రూ.2లక్షల వరకు రుణ మాఫీ కాలేదు. దీంతో రైతులు రూ.2లక్షల లోపు పరిమితితోనే రుణాలు తీసుకుంటున్నారు. రుణ పరిమితి పెంపుతో జిల్లా రైతులకు ప్రయోజనం కలగనుంది. గతేడాది లక్ష్యం రూ.3.23 కోట్లు2025–26 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యం రూ.3.23 వేల కోట్లు. లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా స్థాయి సమీక్షల్లో బ్యాంకర్లకు సూచించినా 50శాతం కంటే మించలేదని తెలిసింది. గత ఫిబ్రవరి వరకు 49శాతం అనగా రూ.1,581 కోట్ల రుణాలే ఇచ్చారు. తీసుకున్న రుణాలు రెన్యూవల్ చేయకపోవడంతోనే లక్ష్యాన్ని చేరుకోవడం లేదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. -
విద్యార్థుల క్షేత్ర పర్యటన
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాల విద్యార్థులు మంగళవారం పట్టణ సమీపంలో ని సేంద్రియ వ్యవసాయ యూనిట్ను సందర్శించా రు. కళాశాల ఎకోక్లబ్, భౌతిక రసాయన శాస్త్రం వి భాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. సా గు పద్ధతులు, పర్యావరణ రహిత, సాంకేతిక విధానాల వినియోగంపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా జల్ జీవిక సెంటర్ ఫర్ అక్వాటిక్ లైవ్లీహుడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ పద్మాకర్ సేంద్రియ వ్యవసాయ విధానాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు వాడకుండా బీడు భూములను సాగులోకి తెచ్చి పర్యావరణ హిత సా గు విధానం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు. రసాయన ఎరువుల వినియోగంతో భూసారం తగ్గుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సి పల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు దేవేందర్, శారద, జనార్దన్, రాజేశ్వర్, రోజ్మేరి, నర్సింగరావు పాల్గొన్నారు. -
పల్లెల్లో పైసల లొల్లి!
కౌటాల: జిల్లాలోని గ్రామపంచాయతీలకు రెండేళ్ల తర్వాత విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు కొత్త పంచాయితీ తెచ్చిపెట్టాయి. ఆ నిధులు తమకంటే తమకని తాజా సర్పంచులు, తాజీ మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు వాదులాడుకుంటున్నారు. గత డిసెంబర్లో పదవీబాధ్యతలు చేపట్టిన సర్పంచులు ఆ నిధులు తమకే కావాలని పేచీ పెడుతుండగా.. తాము అప్పులు చేసి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక రెండేళ్లుగా వేచి చేస్తున్నామని, తమ బకాయిలు చెల్లించాలని తాజా మాజీ సర్పంచులంటున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు తాగునీరు, విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య పనులు, ట్రాక్టర్ డీజిల్, పరిపాలన నిర్వహణ ఖర్చులకు అప్పులు చేశామని చెబుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నామని, తమకు డబ్బులు కావాలని మరోవైపు పంచాయతీ కార్యదర్శలు కూడా అడుగుతున్నారు. ఇలా.. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై పంచాయతీల్లో లొల్లి నడుస్తోంది. ప్రస్తుత పాలకులు, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బిల్లుల కోసం పట్టుబడుతుండడంతో చెల్లింపు జాప్యమవుతోంది. జిల్లాకు రూ.25.22 కోట్లుజిల్లాలోని 335 గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. రెండు విడతల్లో రూ.25.22 కోట్లు విడుదలయ్యాయి. నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటివరకు రూ.4కోట్లు ఖర్చయినట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. అప్పటి సర్పంచులు పని చేసిన బిల్లులకు సంబంధించి తీర్మానాలు, ఎంబీ రికార్డులు ఉంటే పరిశీలించి.. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాస్తవమైతే మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించిందని మండల ప్రజాపరిషత్ అధికారులు పేర్కొంటున్నారు. తాము చేసిన పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ పాత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వచ్చిన కొద్దిపాటి నిధులతో పాత బకాయిలు చెల్లించాలా? గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలా? అని కొత్త సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని వారు అంటున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రత్యేకాధికారుల పాలనలో ఖర్చు పెట్టిన పనులకే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని, సర్కారు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని అధికారులు చెబుతున్నారు. పాత, కొత్త సర్పంచుల పైసల పంచాయితీ పక్కన పెట్టి అధికారులు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.ముగ్గురి మధ్య పేచీ!గత పాలకవర్గాల పదవీకాలం రెండేళ్ల కిత్రమే ముగిసింది. దీంతో రెండేళ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామపంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఖర్చులతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టినట్లు కార్యదర్శులు పేర్కొంటున్నారు. తాము పదవిలో ఉన్నపుడు గ్రామాభివృద్ధికి ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలని తాజా మాజీ సర్పంచులు కోరుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన నూతన సర్పంచుల శిక్షణ తరగతుల్లో సర్పంచులు 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించేందుకు అవకాశమివ్వాలని కలెక్టర్ను కోరినట్లు తెలుస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు 2023–24, 2024–25 సంవత్సరాలకు గాను జిల్లాకు విడతల వారీగా విడుదలయ్యాయి. 2023–24 సంవత్సరానికి విడుదలైన నిధులు మాత్రమే మాజీ సర్పంచుల పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులకు బి ల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అందులో నుంచి పంచాయతీ కార్యదర్శులు ఖర్చు పెట్టిన బిల్లులు తీసుకోవాలి. అయితే, ఈ బిల్లులు తాము హామీ ఇచ్చిన పనులకు ఇవ్వాలని తాజా సర్పంచులు, తాము పెట్టిన ఖర్చులకు ఇవ్వాలని మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య పేచీ నడుస్తోంది. -
ఫీల్డ్కు వెళ్లేదెవరు..?
తిర్యాణి: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం(వీబీ జీ రామ్ జీ)లో సిబ్బంది కొరత వే ధిస్తోంది. నూతన నిబంధనలతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్, ఏపీవో పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో పనులపై పర్యవేక్షణ లోపిస్తోంది. నిరుపేద కుటుంబాలకు పనిదినా లు కల్పించాల్సిన బాధ్యతగా సిబ్బందిపై ఉన్నా క్షేత్రస్థాయిలో అవసరానికి అనుగుణంగా సిబ్బంది నియామకాలు జరగడం లేదు. మరోవైపు 2026– 27 ఆర్థిక సంవత్సరం నుంచి వంద రోజుల పని దినాలను 125 రోజులకు పెంచారు. ఉన్నవారిపై పనిభారంజిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1.22 లక్షల కుటుంబాలకు జాబ్కార్డులు ఉన్నాయి. ఇందులో 2.43 లక్షల మంది కూలీల పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే 88 వేల యాక్టీవ్ జాబ్కార్డుల్లో 1.61 లక్షల మంది కూలీలు పనులకు వెళ్తున్నా రు. అయితే ఉపాధిహామీ పథకంలో సిబ్బంది కొర త సృష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని 15 మండలా లకు మండలానికి ఒక్కరు చొప్పున 15 మంది ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు(ఈసీలు) ఉండాలి. కానీ జిల్లాలో ప్రస్తుతం ఏడు ఈసీలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈసీలు లేనిచోట టెక్నికల్ అసిస్టెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పనులు ము మ్మరంగా సాగే సమయంలో ఈసీల పాత్ర ఎంతో కీలకం. పనుల నిర్వహణ సంబంధించిన మ్యాపింగ్తోపాటు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. టెక్నికల్ అసిస్టెంట్లు చేసిన ఎంబీ రికార్డులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. అలాగే మండలస్థాయి పర్యవేక్షకులైన అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి(ఏపీవో) పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. 15 మంది ఏపీవోలు అవసరం ఉండగా 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏపీవోలు లేనిచోట సైతం టీఏలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏపీవో, ఈసీ పోస్టులు ఖాళీగా ఉండటంతో టీఏ(టెక్నికల్ అసిస్టెంట్)లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో వారిపై పనిభారం పడుతోంది. వారి సాధారణ పనులతోపాటు అదనపు బాధ్యతలు నిర్వహించడం తలనొప్పిగా మారింది. దీనికితోడు కొత్త పంచాయతీలు ఏర్పడటంతో ఒక్కో టీఏ దాదాపు పది పంచాయతీల్లో పనులను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు(ఫైల్)335 జీపీలకు 148 మందే ఎఫ్ఏలుపనుల నిర్వహణలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీల కం. కానీ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత కూడా వేధిస్తోంది. 335 పంచాయతీలకు ప్రస్తుతం కేవలం 148 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో ఏఫ్ఏ మూడు, నాలుగు గ్రామాల్లో ఏకకాలంలో పనులు చేయించాల్సి వస్తోంది. నూతన జీపీల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. నియామకాలు చేపట్టాలని సిబ్బంది, కూలీలు కోరుతున్నారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్పండి
ఆసిఫాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి నో చెప్పాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈ ఎస్.భాస్కర్ రెడ్డి అన్నారు. 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్లో ఎకో క్లబ్ కన్వీనర్, ప్రిన్సిపాల్ రవికుమార్తో కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విని యోగంపై అవగాహన కల్పించారు. భాస్కర్రెడ్డి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణానికి హాని కలుగుతుందని, భూమి, నీరు, జీవ వ్యవస్థలకు నష్టం చేకూరుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ వ్యవస్థలు, వన్యప్రాణులు, నీటి వనరులకు ముప్పు కలుగుతుందని తెలిపారు. వస్త్ర సంచులు, తిరిగి ఉపయోగించే సీసాలు, జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాల వంటి సుస్థిర పద్ధతులను అవలంబించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. -
భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం
ఆసిఫాబాద్అర్బన్: భగత్సింగ్ త్యాగ స్ఫూర్తితో కార్పొరేట్లు, సామ్రాజ్యవాద, మతోన్మాద ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్, దినకర్ పిలుపునిచ్చారు. భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో బైక్ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్సింగ్ ఆశయాలను అధ్యయనం చేయాలని, వీలునామా పుస్తకాన్ని చదవాలని సూచించారు. లౌకికవాద విధానాన్ని కాపాడుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్కుమార్, రాజేందర్, మాలశ్రీ, రాజ్కుమార్, తిరుపతి, మనోహర్, శ్రీకాంత్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జిల్లాలోని రైస్ మిల్లర్లలో సీఎంఆర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ అనంతరం మిల్లింగ్లో ఎలాంటి ఆలస్యం జరగొద్దన్నారు. రవాణా, నిల్వ, మిల్లింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించారు. రైస్ మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎస్వో వసంత లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. మార్చిలోగా పనులు పూర్తిచేయాలిఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మంజూరైన పనులు మార్చిలోగా పూర్తిచేయాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 1,084 ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణాలు ఈ నెల 31 లోపు పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, ఏపీవోలు పాల్గొన్నారు. -
పంచాయతీకో ఎఫ్ఏను నియమించాలి
జిల్లాలో సరిపడా ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం పడుతోంది. ఒక్కో ఏఫ్ఏ మూడు నుంచి నాలుగు పంచాయతీల్లో చేపట్టే పనులను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించాలి. మాపై పనిభారం తగ్గించాలి. – బోయిరే రమేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నవారితోనే పనులు ఉపాధిహామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోల కొరత ఉంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడకుండా ప్రస్తుతం ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవో -
అసెంబ్లీలో అంగన్వాడీల సమస్యలు చర్చించాలి
ఆసిఫాబాద్అర్బన్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ వర్కర్ల సమస్యలు చర్చించి పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యూ నియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలు రూ.18వేలకు పెంచా లని, సమస్యల పరిష్కారానికి ఐసీడీఎస్కు నిధులు కేటాయించాలని, ఎన్ఐపీ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, ప్రీప్రైమరీ విద్యను అంగ న్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా మార్చి 16 నుంచి ఒకపూట బడిని నిర్ణయించాలని, మే 1 నుంచి 31 వరకు ఆటంకాలు లేకుండా సెలవులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు త్రి వేణి, రాజేందర్, కృష్ణమాచారి, శ్రీనివాస్, వనిత, రాజేశ్వరీ, గంగామణి, అరుణ, నిర్మల, వజ్రమ్మ, అంజలి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గోడు చెప్పుకుని.. పరిష్కారం కోరి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్కు సమస్యలు చెప్పుకుని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన రైసా బేగం కోరింది. వితంతు పింఛన్ మంజూరు చేయాలని జెండాగూడ గ్రామానికి చెందిన లోకండె పెంటుబాయి వేడుకుంది. రహదారి మరమ్మతులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని కెరమెరి మండలం పరంధోళి గ్రామానికి చెందిన జగన్నాథ్ వినతిపత్రం అందించారు. పింఛన్ పునరుద్ధరించాలని కాగజ్నగర్ పట్టణానికి చెందిన శాన్ మ హమ్మ అర్జీ అందించింది. పట్టా భూమికి అధికారులు కొలతలు నిర్వహించాలని కాగజ్నగర్ పట్టణంలోని పోచమ్మ బస్తీకి చెందిన వేల్పురి రామన్ దరఖాస్తు చేసుకున్నాడు. వ్యవసాయ బావి మంజూరు చేయాలని జైనూర్ మండలం గౌరీ గ్రామానికి చెందిన శేఖు వినతిపత్రం అందించాడు. ఏళ్లుగా సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి లావుణి పట్టా మంజూ రు చేయాలని సిర్పూర్(టి) మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన డోంగ్రి దుర్గమ్మ అర్జీ ఇచ్చింది. ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇంటి పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తొలగించాలని కాగజ్నగ ర్ పట్టణం సర్సిల్క్ కాలనీకి చెందిన సమ్మక్క విన్నవించింది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. -
వేతనాలు చెల్లించకుంటే 30 నుంచి సమ్మె
ఆసిఫాబాద్అర్బన్: మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కె.హరిత, మిషన్ భగీరథ ఈఈ రాకేశ్, ఎల్అండ్టీ ప్రతినిధి శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మార్చి 29లోగా పెండింగ్ వేతనాలు చెల్లించి, ఇతర సమస్యలు పరిష్కరించా లని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలని, నెల వేతనం బోనస్, పెట్రోల్ అలవెన్స్లతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో వర్కర్స్ యూనియ న్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు బాలేశ్, నాయకులు భాస్కర్, శ్రీకాంత్, వెంకటేశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఇక్కడే రిపేర్లు
కాగజ్నగర్టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ఆ శాఖ అధికారులు చ ర్యలు చేపట్టారు. ఇక నుంచి ట్రాన్స్ఫార్మర్లను స్థాని కంగానే బాగుచేయనున్నారు. కాగజ్నగర్ విద్యుత్ డివిజన్ పరిధిలో మరమ్మతుల కేంద్రం ఉన్నా 20 ఏళ్లుగా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో వి నియోగదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే దూరప్రాంతాలకు తరలించాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంతంలో రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కా రం దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా ఈ నెల 18న కాగజ్నగర్ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో హన్మకొండ కార్పొరేట్ కార్యాలయం ఛీప్ ఇంజినీర్ అశోక్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక నుంచి డివిజన్ పరిఽధిలో విద్యుత్ సమస్యలు వేగంగా పరిష్కారం కానున్నాయి. వేగంగా మరమ్మతులుకాగజ్నగర్ డివిజన్ పరిధిలో అనేక మారుమూల గ్రామాలు ఉన్నాయి. గాలివానలు, ఇతర కారణాలతో ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే రోజులపాటు పల్లెలు అంధకారంలో ఉండేవి. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ల కేంద్రం అందుబాటులోకి రావడంతో మరమ్మతుల ప్రక్రియ వేగవంతం కానుంది. విద్యుత్ అంతరాయం తగ్గుతుంది. అలాగే ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, రవాణా ఖర్చులు తగ్గనున్నాయి. రైతులకు సమయానికి విద్యుత్ అందించడం ద్వారా బోర్లు, మోటార్లు సక్రమంగా పనిచేస్తాయి. అలాగే విద్యుత్శాఖ సేవల స్థితిగతులను తెలుసుకునేందుకు 1912 హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా ఈ నంబర్కు సమాచారం అందిస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంబంధిత వాహనాల ద్వారా ఘటన స్థలానికి చేరుకుని పరిష్కరిస్తారు.నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యం. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రం ద్వారా డివిజన్లో ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ట్రాన్స్ఫార్మర్లను తరలించేందుకు 1912 వాహనంతో పాటు రెండు వాహనాలు ఉన్నాయి. వినియోగదారులు హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి సేవలు వినియోగించుకోవాలి. – ఉత్తమ్ జాడే, ఎస్ఈ, ఆసిఫాబాద్ -
శిశుగృహకు నవజాత శిశువు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మండలం సీతానగర్ సమీపంలోని పత్తి చేనులో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన నవజాత శిశువును సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని శిశుగృహానికి తరలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల సంరక్షణలో ఉన్న శిశువు ఆరోగ్య పరిస్థితిని ఎస్పీ నితిక పంత్ పరిశీలించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్ పర్యవేక్షణలో ఆదిలాబాద్ శిశు గృహానికి తరలించా రు. ప్రస్తుత చట్టాలు, మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్తులో శిశువును చట్టబద్ధంగా దత్తత ఇస్తామని అధికారులు తెలిపారు. -
నీటిని పొదుపుగా వాడితేనే మనుగడ
తిర్యాణి: నీటిని పొదుపుగా వాడితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ టెబ్రివాల్ అన్నారు. మండలంలోని చెలిమల వాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు నీటి ఆదాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అడవులను రక్షిస్తేనే వర్షాలు సమృద్ధిగా కురిసి జలసిరులు పారుతాయన్నారు. చెలిమల వాగు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. అడవులను నరుక్కుంటూ పోతే చివరికి ప్రాణవాయువైన ఆక్సిజన్ను కూడా కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా అటవీ ప్రాంతాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్, గిన్నెధరి రేంజ్ అధికారి సరోజినిదేవి, వివిధ గ్రామాల సర్పంచులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దహెగాం మండలంలోని కర్జి, గిరవెల్లి ప్రాంతాల్లో వెయ్యి క్వింటాళ్ల శనగల ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రైతులకు అందుబాటులో శనగ కొనుగోలు కేంద్రాన్ని తెచ్చేందుకు మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్వింటాల్కు రూ.5,875 మద్దతు ధర కు శనగలను అమ్ముకోవాలని, దళారుల చేతికి ఇచ్చి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ సుద్దాల దేవయ్య, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్, ఏడీఏ మనోహర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యాముల్, వ్యవసాయాధికారులు ప్రేమలత, కార్తీష, దుర్గాభవాని, సృజన, శ్రీనివాస్, పీఏసీఎస్ కార్యదర్శి సతీష్గౌడ్, ముక్తార్ పాల్గొన్నారు. -
వేతన భారం!
పంచాయతీలపైకెరమెరి: ఇప్పటికే నిధుల కొరతతో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను ఇక నుంచి పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి నెలల వేతనాలను కూడా చెల్లించారు. ఈ నిర్ణయంపై పంచాయతీ పాలకవర్గాలు కలవరపడుతున్నాయి. ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు భారం కానుంది. పాత పద్ధతిలోనే ప్రభుత్వమే నేరుగా తమ ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలను 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ లేదా ఇతర అంతర్గత వనరుల నుంచే చెల్లించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో మంజూరు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు మేజర్ పంచాయతీలకు సుమారు రూ.3 లక్షల వరకు నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతోనే పారిశుద్ధ్య పనులు, వేతనాలు చూసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీలకు కష్టకాలంజిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,012 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరినీ మల్టీపర్పస్ వర్కర్లుగా పరిగణిస్తూ నెలకు రూ.9,500 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. గతంలో ఈ వేతనాల కోసం ప్రత్యేక నిధులు విడుదలయ్యేవి. పంచాయతీ అభివృద్ధి నిధులతో సంబంధం లేకుండా కార్మికులకు కనీసం మూడు నెలలకోకసారి జీతాలు చెల్లించేవారు. ప్రసుత్తం వేతనాలకు పంచాయతీ నిధులకు ముడిపెట్టడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. గ్రామాల్లో వీధి దీపాలు, బోరు మోటార్ల మరమ్మతు, విద్యుత్ బిల్లుల భారం కూడా పంచాయతీలపైనే పడుతోంది. విద్యుత్ చార్జీలు, వర్కర్ల వేతనాలు చెల్లించగా మిగిలిన నిధులను మాత్రమే అత్యవసర పనులకు వాడుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే నిధులు లేక సర్పంచులు, కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఈ అదనపు భారం మోయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025 నుంచి గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడంపై విమర్శలు వస్తున్నాయి. బకాయి కోసం మాజీ సర్పంచుల ఒత్తిడిమరోవైపు చేసిన పనుల బిల్లులు, బకాయిల కోసం మాజీ సర్పంచులు కొత్త పాలకవర్గాలపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేయించినా బిల్లులు రాలేదని వాదిస్తున్నారు. కొందరు వాస్తవంగా పనులు చేసినా మరికొందరు అక్రమంగా బిల్లులు సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఉన్న నిధులను వేతనాలు, కరెంటు బిల్లులకే కేటాయించమనడంతో పాత బకాయిలు ఎలా చెల్లించాలో తెలియక కొత్త పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. -
తలసిరి మెరుగు
ముస్లింలతో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, శ్యాంనాయక్, నేతలుఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్సీ దండె విఠల్సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లా వృద్ధిలో మార్పు కనిపిస్తోంది. నాలుగు జిల్లాల స్థూల జాతీయోత్పత్తి (జీడీడీపీ) తలసరి ఆదాయం వృద్ధిలో ఒక్కో జిల్లాలో ఒక్కోతీరుగా నమోదైంది. అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాలతో పోలిస్తే గతేడాది కంటే ఈసారి మెరుగుపడింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం–2026 ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోలిస్తే పలు అంశాల్లో వృద్ధి మొదలైంది. అయితే, గతేడాది నివేదిక, పలు జిల్లాల ర్యాంక్లతో పోలిస్తే స్వల్పంగా మారాయి. జిల్లా భౌగోళిక పరిధిలో ఏడాదిలో జరిగిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తిగా పేర్కొనే జిల్లా స్థూల జాతీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లాలో భిన్నంగా నమోదైంది. మంచిర్యాల జిల్లా స్థూల జాతీయోత్పత్తి స్థిర ధరల్లో గతేడాదితో పోలిస్తే ఆదాయం పెరిగినా ఒక ర్యాంక్ తగ్గింది. నిర్మల్ జిల్లా ఓ ర్యాంక్ పెరిగింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు యథాతథంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో రైతుల చేతిలో సాగులో ఉన్న సగటు కమతం (భూమి) చూస్తే రాష్ట్ర సగటు కంటే ఆదిలాబాద్ జిల్లాలోనే అధికంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది తీరుగానే ఉండగా, ఆసిఫాబాద్ స్వల్పంగా పెరిగింది. నిర్మల్, మంచిర్యాల అదేవిధంగా ఉండగా, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం గత సర్వే కంటే సగటున రెండెకరాలు అధికంగా రైతుల చేతిలో సాగులోకి వచ్చింది. పెరగని తయారీ రంగంపంట తీవ్రతలో తక్కువే..తలసరి ఆదాయం (2024–25)జీడీడీపీ (2024–25) స్థిర, ప్రస్తుత ధరల్లో..జిల్లా స్థిర ప్రస్తుత ర్యాంక్ గతేడాది ర్యాంక్ మంచిర్యాల 26,375 13,470 21 20నిర్మల్ 24,078 11,857 22 23ఆదిలాబాద్ 23,051 11,565 25 25ఆసిఫాబాద్ 16,465 8,247 31 31మంచిర్యాల తగ్గింది.. నిర్మల్ పెరిగింది -
సింగరేణి మనుగడకు ఐక్యంగా పోరాడాలి
రెబ్బెన: సింగరేణి సంస్థ మనుగడకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సింగరేణి సేవ్ జాత కార్యక్రమాన్ని శనివారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో ప్రారంభించారు. ఖైరిగూర, గోలేటి సీహెచ్పీలతో పాటు ఇతర విభాగాల్లో గేట్ మీటింగ్లు నిర్వహించారు. గోలేటి టౌన్షిప్లోని బైక్ర్యాలీ చేపట్టారు. సీతారామయ్య మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటు లేక సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. స్థానిక బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. గోలేటిలో ప్రారంభమైన సింగరేణి సేవ్ జాత ఈ నెల 30న కొత్తగూడెంకు చేరుకుంటుందని తెలిపారు. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా, వంటావార్పు కార్యక్రమాలకు కార్మికులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు వీరభద్రయ్య, వైవీ రావు, మడ్డి ఎల్లయ్య, గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కోశాధికారి చంద్రశేఖర్, జీఎం కమిటీ సభ్యులు శేషశయనరావు, జగ్గయ్య, రాజేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కిరణ్బాబు, సురేశ్ కోరి, ఫిట్ కార్యదర్శులు మారం శ్రీనివాస్, ఎంబడి రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగతంగా అధిక విస్తీర్ణంలో..
1,33,051వ్యవసాయ భూములు, వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి, సంస్థల వారీగా ఉన్న సాగులో యూనిట్లుగా ఉన్న పరిధిని పరిశీలిస్తే ఏజెన్సీ అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో వ్యక్తుల చేతులో అధిక మొత్తంలో భూములున్నాయి. మొత్తంగా వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థల పరిధిలో భూమిని చూసినప్పుడు రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ముందువరుసలో ఉంది. 1,85,262.041,84,8961,61,314.381,16,4781,52,964.561,65,277 -
ఈద్ ముబారక్
కాగజ్నగర్లోని ఈద్గా వద్ద ముస్లింలుకాగజ్నగర్లోని ఈద్గాలో నమాజ్ చేస్తున్న ముస్లింలుఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: నెలరోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని నూర్నగర్ ఈద్గా, కాగజ్నగర్ పట్టణంలో ఈద్గాల వద్ద సామూహికంగా నమాజ్ చేశారు. ముస్లిం మత పెద్దలు ఖురాన్ సందేశం చదివి వినిపించారు. ప్రవక్త చూపిన శాంతిమార్గంలో నడవాలని సూచించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ముబారక్ చెప్పుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ సర్పంచ్ మర్సోకోల సరస్వతి, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, టీయూడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, తారిక్ తదితరులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, బీఆర్ఎస్ నేత సయ్యద్ అన్సార్ వేర్వేరుగా ఏర్పాటు చేసిన విందులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అబ్దుల్లా నివాసంలో విందుకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు హాజరయ్యారు. ఆసిఫాబాద్లో సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కాగజ్నగర్లోని ఈద్గా వద్ద ముస్లింలకు ఎమ్మెల్సీ దండె విఠల్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
మెరుగ్గానే ఉపాధిహామీ
గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకంలో కూలీల పని దినాలు నమోదు మెరుగ్గానే ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాలతో పోలిస్తే అధికంగా ఉంది. గతేడాది వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వేతో పరిశీలిస్తే 89.2శాతం అత్యధికంగా ఉండగా, ఈసారి అంతకంటే మెరుగ్గానే నాలుగు జిల్లాలు నమోదయ్యాయి.ఉపాధి కూలీ పని దినాలు (లక్షల్లో..)జిల్లా లక్ష్యం నమోదు సాధించిన శాతం ఆదిలాబాద్ 44.8 41.2 92.00 ఆసిఫాబాద్ 28.3 25.1 91.80 మంచిర్యాల 21.0 18.8 89.40 నిర్మల్ 32.0 28.0 87.40 -
ఆరు గ్యారంటీలు తక్షణమే అమలు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు దోని శ్రీశైలం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో ఆర్డీవో లోకేశ్వర్రావుకు వినతిపత్రం అందించారు. శ్రీశైలం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి, రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అరిగెల మల్లికార్జున్, కోట్నాక విజయ్, ఖాండ్రె విశాల్, సుచిత్ తదితరులు పాల్గొన్నారు. -
యువజన రంగానికి అన్యాయం
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం 2026–27 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువజన రంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. యువతపై ప్రభుత్వానికి బాధ్యత లేదు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, యువతలో ఉన్న ఆందోళనలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. జీరో ప్రాధాన్యత ఇచ్చారు. నిరుద్యోగ భృతిపై ఒక్క మాట లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలతో యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. డిగ్రీలు ఉన్నా అవకాశాలు ఇవ్వడం లేదు. జాబ్ క్యాలెండర్పై ఊసే లేదు. – ఆత్మకూరి చిరంజీవి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి -
ఇంటర్ కాలేజీల్లో లంచ్
ఆసిఫాబాద్రూరల్: ఇక నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆకలికేకలు తీరనున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. ఇంటర్ కాలేజీలకు వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులు అర్ధాకలితో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఇంటర్మీడియెట్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. జిల్లాలో 11 ప్రభుత్వ కళాశాలలుజిల్లాలో ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, తిర్యా ణి, కాగజ్నగర్, జైనూర్, సిర్పూర్(టి), కౌటా ల, బెజ్జూర్, దహెగాం, రెబ్బెనలో ప్రభుత్వ జూ నియర్ కళాశాలలు ఉన్నాయి. లింగాపూర్, పెంచికల్పేట్, చింతలమానెపల్లి, సిర్పూర్(యూ)లో కాలేజీలు లేవు. 4,800 మంది వి ద్యార్థులు చదువుకుంటున్నారు. గతంలో సి ర్పూర్ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కోనప్ప తన వ్యక్తిగత నిధులతో విద్యార్థులకు భోజనం అందించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే సక్కు డీఎంఎఫ్టీ నిధుల ద్వారా మధ్యాహ్న భోజనం సమకూర్చారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆగిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతూ అధికారులకు విన్నవిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భో జన పథకం అమలుకు శ్రీకారం చుట్టడం ఆ హ్వనించదగ్గ విషయం. ప్రభుత్వ నిర్ణయంతో కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఇంటర్ విద్య మరింత బలోపేతమవుతుంది. – రాందాస్, డీఐఈవో ఏటా ఐదు వేల మందికి లబ్ధిజిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏటా ఐదు వేల మందికి లబ్ధి చేకూరనుంది. వీరంతా నిరుపేద, మధ్య తరగ తి కుటుంబాలకు చెందినవారే. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు ఐదేళ్లుగా ఇంటర్ ఫ లితాల్లో రాష్ట్రస్థాయిలో 1, 2, 3 స్థానాల్లో నిలుస్తూ సత్తా చాటుతున్నాయి. మధ్యా హ్న భోజనం అమలైతే విద్యార్థులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
నేడు రంజాన్
ఆసిఫాబాద్అర్బన్: జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, కమిషనర్ గజానంద్, వైస్ చైర్మన్ అహ్మద్ తెలిపారు. కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం బిన్ అహ్మద్, మైనార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించారు. వసతుల కల్పన పనులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ నమాజ్కు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో షామియానాలు ఏర్పాటు చేస్తున్నామని, చల్లని తాగునీరు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఉస్మానియా మసీద్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, నాయకులు సయ్యద్ అన్సార్, నిసార్, అబ్దుల్ రహమాన్, సమద్ సయ్యద్, అమర్ బిన్ అహ్మద్, జావిద్, షబ్బీర్, సల్మాన్ఖాన్, మతిన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘సిండికేట్’ దందా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రూ.లక్షలు పోసి లక్కీడ్రాలో షాపులు గెలుచుకున్న మద్యం వ్యాపారులు అంతా ఒక్కటయ్యారు. ఆఫీసర్ల మామూళ్లు పెరగడంతో సిండికేట్గా మారి అక్రమ దందాలకు తెరలేపారు. 2025– 27 రెండేళ్లకు 32 షాపులు లైసెన్సులు పొంది గత డిసెంబర్ నుంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. మామూళ్లు, ఇతర ఖర్చులకు పోను నిజాయతీగా నడిపితే మిగిలేది ఏం లేదని చెబుతూ ఆఫీసర్లకు పెద్దమొత్తంలో లంచాలు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆబ్కారీ శాఖకు రూ.లక్షల్లో లైసెన్సు ఫీజులు కట్టలేక.. ఇటు మామూళ్లు, ఖర్చులు తట్టుకుని సంపాదించేందుకు చివరకు సిండికేట్గా మారారు. దీంతో ఎమ్మార్పీపై అధికంగా చీప్ లిక్కర్ను రూ.పది చొప్పున ఎక్కువ రేటుతో అమ్ముతున్నారు. వీటితో పాటు బెల్టు షాపులకు రూ.10చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత డిసెంబర్ నుంచే షాపులు మొదలు కాగా ఎవరికి వారే అమ్ముకున్నారు. అయితే గత నాలుగు నెలలుగా షాపులకు నష్టాలు రావడంతో ఈ నెల 15నుంచే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆరు వైన్స్లు సిండికేట్గా మారాయి. ఇప్పటికే వాంకిడి, కెరమెరి మండలాల్లో సిండికేట్ మారి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చింతలమానెపల్లి మండలం గూడెంలోనూ మహారాష్ట్ర సరిహద్దులో అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇక కాగజ్నగర్ పట్టణంలో కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెరిగిన మామూళ్లుగతంలో కంటే పోలీసు ఆఫీసర్లు తమ మామూళ్లు పెంచుకున్నారు. దీంతో మద్యం వ్యాపారులు నెలనెలా రూ.లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తోంది. గతంలో జిల్లా కేంద్రంలో రూ.10వేల చొప్పున ఇస్తే ఇప్పుడు రూ.16వేలకు చేరింది. వీరికి తోడు కిందిస్థాయి, డివిజన్, ఆపై ఉన్నతాధికారికి సైతం ఆ స్థాయిలోనే పంపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో షాపు పోలీసు శాఖకే సుమారు రూ.40నుంచి రూ.50వేల దాక పోతున్నాయి. ఇక ఆబ్కారీ అధికారులకు కింది నుంచి పైదాక మరో రూ.30వేల దాక అందుతున్నాయి. వీరికి తోడు రాజకీయ నాయకులు సైతం అడుగుతుండడంతో మద్యం వ్యాపారులకు నెలకు రూ.లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ ఖర్చులతో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తుండటంతో అంతిమ వినియోగదారుడైన మందుబాబులకు జేబులకు చిల్లు పడుతోంది. ఇవ్వకపోతే కేసులే !నెలనెలా మామూళ్లు ఇవ్వకపోతే మద్యం షాపులకు ప్రధాన వనరుగా ఉన్న బెల్ట్ షాపులను లేకుండా చేస్తామని హెచ్చరికలు వచ్చాయి. అంతేకాక షాపుల ఎదుట న్యూసెన్స్, డ్రంకెన్ డ్రైవ్, పార్కింగ్ తదితర ఉల్లంఘనల కింద చట్ట వ్యతిరేకంగా అమ్ముతున్నారంటూ కేసులు పెడతామని హెచ్చరించారు. మొదట మొత్తం ఆరు దుకాణాలకు రూ.1.20 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ ఓ అధికారి హెచ్చరికలు చేశారు. అంత ఇచ్చుకోలేమని చెబితే, చివరకు రూ.16 వేల చొప్పున మాములుకు ఒప్పుకున్నారు. గత డిసెంబర్ నుంచి ఎవరికి వారే అమ్ముకోగా.. వారం క్రితం తప్పని పరిస్థితుల్లో సిండికేట్ అయ్యామని వ్యాపార వర్గాల్లో చర్చ సాగుతోంది. -
పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తా
కెరమెరి: మహిమాన్విత పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తానని మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శంకర్లొద్ది గ్రామంలో గురువారం నిర్వహించిన పూజా కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. దేశంలోని 10 కోట్లకు పైగా బంజారాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత రామారావు మహరాజ్ తనపై ఉంచారని పేర్కొన్నారు. ప్రేంసింగ్ మహరాజ్ పిలిపించుకుని పనులు చేయిస్తున్నారన్నారు. అంతకుముందు గుహలోని శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాగు భూములకు పట్టాలిస్తాం : ఎమ్మెల్యే దేవ్రావు భోంగ్డెసరిహద్దు గ్రామాల్లో సాగు భూములకు పట్టాలిస్తామని రాజురా ఎమ్మెల్యే దేవ్రావు భోంగ్డె అన్నారు. శంకర్లొద్దిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. రాజూరా నియోజకవర్గంతోపాటు వివాదాస్పద 14 గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోహరాదేవి ఆలయ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం రూ.750 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఏఎస్పీ చిత్తరంజన్, సీఐలు సత్యనారాయణ, రమేశ్, ఎస్సై ఎన్.మధుకర్, ఐదుగురు ఎస్సైలు, 120 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తపస్వీ ప్రేంసింగ్ మహరాజ్, నిర్వాహకులు అనార్పల్లి మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్, బానోత్ వెంకటి, రూప్లాల్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, కెరమెరి మాజీ ఎంపీపీ అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సర్సిల్క్ కా లనీలో గల ఎఫ్ క్వార్టర్స్లో గురువారం జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. అండర్– 17 బాలురు విభా గంలో ఏ.ప్రేమ్, యశ్వంత్, దీక్షిత్, బాలికల విభాగంలో సంజన, అండర్–19 విభాగంలో సాయికృష్ణ, దిలీప్ను ఎంపిక చేసినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ శివనాయర్, అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. మార్చి 22, 24 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్షిప్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందించారు. -
అమ్మాయిల అమ్మకం!
కౌటాల: అమాయక గిరిజన యువతులు, మహిళల పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని మానవ అక్రమ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆడబిడ్డలను సంతలో సరుకుగా అమ్ముతున్నారు. కఠిన శిక్షలున్నా జిల్లాలో అమానవీయ ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో ఒంటరి మహిళలు, పేద కుటుంబాలకు చెందిన యువతులను పెళ్లి, డబ్బు ఎరగా చూపి ఇతర రాష్ట్రాలకు తరలించడం పరిపాటిగా మారింది. తాజాగా బెజ్జూర్ మండలానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులను మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్లో విక్రయించిన ముఠాను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధిత యువతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నేడో, రేపో ఈ ముఠా అరెస్టును చూపి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. బెజ్జూర్ టు మధ్యప్రదేశ్..పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అమ్మాయిలను ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. గతేడాది ఆసిఫాబాద్కు చెందిన ఓ ముఠా సభ్యులు మహబూబాబాద్ జిల్లా రేకులతండాకు చెందిన ఓ మహిళ(24)లతో పాటు ఆసిఫాబాద్ మండల పరిధిలోని ఓ యువతిని మధ్యప్రదేశ్కు విక్రయించారు. ఈ రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేసి గత జూలై 18 తేదీన వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఓ కానిస్టేబుల్ సైతం ఉండడం గమనార్హం. తాజాగా బెజ్జూర్ మండలంలోని ఇద్దరు గిరిజన యువతులను రూ.2.50 లక్షల చొప్పున మధ్యప్రదేశ్లో ఓ ముఠా విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలోని మహిళతో పాటు మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లా నుంచి ప్రత్యేక పోలీస్ బృందం మధ్యప్రదేశ్కు వెళ్లి బాధితులను అక్రమార్కుల చెర నుంచి విడిపించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. అక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పదుల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. సూత్రధారులను పట్టుకునే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.రూ.2.50 లక్షల చొప్పున విక్రయంసమాజం అభివృద్ధి చెందుతున్నా మానవ అక్రమ రవాణా సమస్య అంతం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు దళారులు ధనార్జనే లక్ష్యంగా ఒంటరి మహిళలు, పేద కుటుంబాలకు చెందిన యువతులను లక్ష్యం చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన రంగు, రూపం ఉన్న మహిళలను ఊబిలోకి దించుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన మహిళలు, యువతులు ఏటా అక్రమ రవాణాకు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నా యి. అదృశ్యమవుతున్న వారిలో కొందరి ఆ చూకీ శాశ్వతంగా దొరకకపోవడం గమనా ర్హం. బెజ్జూర్లోని ఇద్దరు గిరిజన అమ్మాయిలను ఒక్కొక్కరిని రూ.2.50 లక్షల చొప్పున ఓ ముఠాకు విక్రయించినట్లు సమాచారం. గతేడాది జరిగిన ఘటనల్లో ఆసిఫాబాద్కు చెందిన యువతిని రూ.1.30 లక్షలకు అమ్మగా.. మహబూబాబాద్కు చెందిన మహిళను రూ.1.10 లక్షలకు మధ్యప్రదేశ్లోని వ్యక్తులకు విక్రయించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు అమలు చేసి మానవ అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
‘నవోదయ’ ప్రవేశాల్లో వెనుకబాటు
కాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే విద్యార్థులకు బంగారం లాంటి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. ఆరో తరగతిలో ప్రవేశం పొందితే 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో ఉచితంగా విద్య అందిస్తారు. అయితే చాలామంది విద్యార్థులు పరీక్ష తీరుపై అవగాహన లేకపోవడంతో పోటీలో వెనుకబడుతున్నారు. ఈ ఏడాది ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఫలితాల్లో నిర్మల్ జిల్లా నుంచి 37 మంది సీట్లు దక్కించుకుంటే కుమురంభీం జిల్లా నుంచి కేవలం ఏడుగురు మాత్రమే సీట్లు సాధించారు. 80 సీట్లకు ప్రవేశపరీక్షఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్నగర్ పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. మెరుగైన విద్యాబోధనతోపాటు వసతి సౌకర్యం, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం ఉచితంగా కల్పిస్తారు. విద్యార్థులకు వేర్వేరుగా వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. బాలికలకు 33 శాతం రిజర్వేషన్ సైతం అమలు చేస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నిబంధనలకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తారు. 2026– 27 విద్యాసంవత్సరంలో విద్యాలయంలో ఆరో తరగతిలో 80 సీట్లకు మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు మొత్తం 6,196 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 4,478 మంది పరీక్షలకు హాజరయ్యారు. అవగాహన కరువుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో నవోదయ ప్రవేశ పరీక్షకు సక్రమంగా సన్నద్ధం కావడం లేదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం సిలబస్ గురించి అవగాహన కల్పించడం లేదు. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎక్కువ మంది సీటు సాధించలేకపోతున్నారు. నాలుగేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఏటా ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నా అందులో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు తక్కువ మంది ఎంపికవుతున్నారు. ముందస్తు ప్రణాళిక అవసరంనవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటే ముందస్తు ప్రణాళిక అవసరం. నాలుగో తరగతి నుంచే విద్యార్థులు ప్రిపరేషన్ ప్రారంభించాలి. వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తే.. ఇందులో మెంటల్ ఎబిలిటీ, గణితం, పేరాగ్రాఫ్ విభాగాల్లో 80 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 మార్కులకు పది భాగాల్లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు ఉంటాయి. గణితానికి సంబంధించి 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి. పేరాగ్రాఫ్కు 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయిస్తారు. అవగాహన అవసరం నవోదయ విద్యాలయంలో సీటు సాధించాలంటే ముందుగా తల్లిదండ్రులకు అవగాహన అవసరం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి పోటీ ఎక్కువ ఉన్నా తక్కువ మంది ఎంపికవుతున్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఆయా పాఠశాలల్లోని ఐదో తరగతి విద్యార్థులకు ఏడాది ముందు నుంచే పరీక్ష విధానం, సిలబస్ గురించి వివరిస్తూ సన్నద్ధం చేయాలి. – రేపాల కృష్ణ, ఫలితాల వివరాలు జిల్లా దరఖాస్తులు రాసినవారు ఎంపికై ంది ఆదిలాబాద్ 1,290 942 17 నిర్మల్ 1,552 1278 37 మంచిర్యాల 1,722 1267 19 ఆసిఫాబాద్ 1,632 991 7 -
శ్రీ పరాభవ.. శుభారంభం
ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా గురువారం శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జిల్లా ప్రజలు ఇంటి ముంగిళ్లకు మామిడి తోరణాలతో అలంకరించారు. కొత్త బట్టలు ధరించి ఆలయాలను దర్శించుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో అర్చకులు ఒఝల శిరీష్ శర్మ, కేశవనాథ ఆలయం, శిర్డీ సాయి మందిరంలో అర్చకులు ఇందారపు మధుకర శర్మ, శివకేశవ మందిర్లో పూర్ణచందర్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. పల్లెల్లో రైతులు వ్యవసాయ పనిముట్లు, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు. కెరమెరి: దనోరాలో అరక దున్నుతున్న రైతుజిల్లా కేంద్రంలోని తన నివాసంలో నేతలకు ఉగాది పచ్చడి అందిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మివేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాంగ్రెస్ నాయకులుకేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రవణంపద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ -
21న ‘సేవ్ సింగరేణి జాత’
రెబ్బెన: సంస్థ పరిరక్షణే ధ్యేయంగా గోలేటి నుంచి కొత్తగూడెం వరకు నిర్వహించే సేవ్ సింగరేణి జాతను ఈ నెల 21న ప్రారంభిస్తున్నట్లు ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. గోలేటిలోని కేఎ ల్ మహేంద్రభవన్లో గురువారం ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ పిలుపు మేరకు అన్ని డిపార్టుమెంట్లలో గేట్ మీటింగ్లు నిర్వహించిన అనంతరం వందలాది మంది కార్మికులతో గోలేటి కేంద్రంగా ఉదయం 8 గంటలకు జాత ప్రారభమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సేవ్ సింగరేణి జాతకు యూనియ న్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య, రాజేశ్, కిరణ్బాబు, మారం శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి మల్లేశ్, నాయకులు అంజయ్య, నరేశ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి సంస్థ మనుగడకు కృషి చేయాలి
రెబ్బెన: తెలుగు నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో సింగరేణి సంస్థ మనుగడ పెంచేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇ వ్వాలన్నారు. బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యతలో ముందుందని, భావి తరాలకు సంస్థను అందించాలంటే ప్రతీ ఉ ద్యోగి నిబద్ధతతో పనిచేయాలని సూచించా రు. గోలేటి ఉపరితల గని అనుమతులు త్వరలోనే రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శేషశయనరా వు, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్కుమార్, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్వోడీ రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం పార్లమెంటు సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక రైల్వే సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్–గడ్చందుర్ మధ్య కొత్త రైల్వేలైన్ సర్వే ఇప్పటికే పూర్తయిందని, డీపీఆర్ను వెంటనే ఆమోదించి పనులు ప్రారంభించాలని, ముద్ఖేడ్–పిప్పల్కోటి (ఎల్సీ33), కాజీపేట–బల్హార్షా (ఎల్సీ71) వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు 36 కిలోమీటర్ల మేర డీపీఆర్ సిద్ధంగా ఉందని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. బాసర సరస్వతీదేవి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అక్కడ మరిన్ని రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని, కాజీపేట నుంచి కాగజ్నగర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును ప్రారంభించాలని విన్నవించారు. ప్రాంతీయ అభివృద్ధికి ఈ రైల్వే ప్రాజెక్టులు ఎంతో కీలమని, కేంద్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. -
రోడ్లు, వంతెనలు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గ సమస్యలను బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి అసెంబ్లీలో ప్రస్తావించారు. రోడ్లు, వంతెనల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. సరైన రోడ్లు లేక మంగీ, గుండాల, మోడి వంటి గ్రామాలకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా వెళ్లడం ఇబ్బందిగా మారిందన్నారు. కెరమెరి ఘాట్రోడ్ను డబుల్ రోడ్గా విస్తరించాలని కోరారు. గుండి, అనార్పల్లి, ఇతర వంతెనలు పూర్తి చేయాలన్నారు. అధ్వానంగా ఆర్అండ్బీ రోడ్లుకాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలోని ఆర్అండ్బీ రోడ్లు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్బాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అధికారులను ప్రశ్నిస్తే బాధితులపైనే కేసులు పెడుతున్నారని తెలిపారు. పెంచికల్పేట్, సల్గుపల్లి తదితర ప్రాంతాల్లోని అడవుల గుండా వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమై ఆర్టీసీ బస్సులు సైతం తిరగలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. అటవీశాఖ అనుమతులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 99.68 శాతం హాజరుఆసిఫాబాద్రూరల్: జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీ క్షకు 6,949 మంది విద్యార్థులకు 6,927మంది (99.68శాతం) హాజరుకాగా, 22 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ కె.హరిత తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించగా, పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్, ఎంఈవో సుభాస్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు. డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలుఆసిఫాబాద్అర్బన్: డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లోనూ డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించొద్దన్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. గృహావసరాల సిలిండర్లు అక్రమంగా వినియోగించినా, నిల్వ ఉంచిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాలకు కొరత లేదని తెలిపారు. విద్యార్థులు సరదా కోసం ఈతకు వెళ్లొద్దుఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు సరదా కోసం ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురికావొద్దని ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటిలోతు తెలియక జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఈత నేర్పించాలని సూచించారు. గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రత పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఇంటి వద్ద ఉంచడం, సానుకూల కార్యకలాపాలపై దృష్టి సారించేలా చూడాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించాలివాంకిడి: ఆస్పత్రులకు వచ్చేవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో సీతారాం అ న్నారు. మంగళవారం రాత్రి నార్లాపూర్ గ్రామంలో జరిగిన ఓ విందులో ఆహారం వికటించి పలువురు అస్వస్థతకు గురై వాంకిడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బుఽ ధవారం వారి ఆరోగ్య పరిస్థితిని తె లుసుకున్నారు. అస్వస్థతకు గురైన 15 మందికి ఎలాంటి ప్రమాదం లేదని, ఒక రోజులో కోలుకుంటారని తెలిపారు. అనంతరం శివాలయం ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. మండల వైద్యాధికారి వినయ్ ఉప్రే, సీహెచ్సీ వైద్యురాలు అయేషా తదితరులు ఉన్నారు. -
మంచికి విజయం.. చెడుకు పరాభవం
ఆసిఫాబాద్: తెలుగు సంవత్సరాది ఉగాది రానే వచ్చింది. ఏటా చైత్ర మాసంలో శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున జరుపుకుంటారు. ఒక్కో ఏడాదిలో వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. విశ్వావసు నామ సంవత్సరం మార్చి 18న ముగిసింది. మార్చి 19 నుంచి ఉగాది రోజు నుంచి శ్రీపరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది. చెట్ల కొమ్మల్లో చిగురించే కొత్త ఆశలు.. కోయిలమ్మ కుహూరాగాల ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ ఏడాది మంచి విజయం సాధిస్తుందని, చెడుకు పరాభవం తప్పదని పండితులు చెబుతున్నారు. ఆరు రుచుల సమ్మేళనంతో జీవిత పరమార్థాన్ని చాటిచెప్పే పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. షడ్రుచుల పచ్చడి జీవితంలో ఎదురయ్యే వివిధ భావోద్వేగాలు, కొత్త ఆశలకు షుడ్రుచుల ఉగాది పచ్చడి ప్రతీక. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల కోసం బెల్లం, లేత మామిడి పిందెలు, కొత్త చింతపండు, ఉప్పు, లేత వేపపువ్వు, కారం వినియోగిస్తారు. అలాగే బొబ్బట్లు, పులిహోర, గారెలు, పాయసం వంటి సంప్రదాయ వంటలు చేసుకుని ఆరగిస్తారు. జిల్లావ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోనూ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఉగాది రోజున పచ్చడి తర్వాత అంతే ప్రాధాన్యం ఉన్న మరో ఘట్టం పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండనున్నాయి..? తదితర విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరవుతారు. వ్యవసాయ పనులు ప్రారంభం కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రైతులు ఏరువాక పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేకువజామునే పంట పొలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని సాయి మందిరంలో ఆకసం(ఆసిఫాబాద్ కవుల సంఘం) ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆర్టీసీని ప్రభుత్వమే ఆదుకోవాలి
ఆదిలాబాద్: ప్రజా రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఎస్డబ్ల్యూఎఫ్ సంఘం రీజినల్ అధ్యక్షుడు ఎస్బీ రావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీ సంస్థకే ఇవ్వాలని, రాష్ట్ర బడ్జెట్లో సంస్థకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, కార్మిక యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి 2017 వేతన సవరణ అలవెన్సులతో పాటు 2021, 2025 వేతన సవరణలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఎం.భీంరావు, నాయకులు దేవిదాస్, మహేష్, డిపో అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, ఆశన్న, దేవిదాస్, మైపాల్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీలో గందరగోళం
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థిని తేజస్విని మృతితో మంగళవారం ప్రారంభమైన విద్యార్థుల నిరసన బుధవారం వరకు కొనసాగింది. ట్రిపుల్ఐటీలో వైద్య సేవలు మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించాలన్న డిమాండ్తో విద్యార్థులు నిరసనకు దిగారు. మంగళవారం సాయంత్రం నుంచి వీసీ కార్యాలయం వద్ద బైటాయించిన విద్యార్థులంతా రాత్రి వీసీ ఇంటి ముందుకు చేరుకున్నారు. గేటు వద్దే నిద్రించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ట్రిపుల్ఐటీకి చేరుకుని భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. వినతిపత్రం ఇచ్చిన విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీలో నెలకొన్న సమస్యలపై తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆధ్వర్యంలో వీసీకి వినతిపత్రం ఇచ్చారు. యాజమాన్యం స్పందించి ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. ఇందుకు యాజమాన్యం సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు తెలిపారు. దీంతో విద్యార్థి సంఘం నిరసనను విరమించింది. వీసీకి మద్దతుగా.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్ఐటీలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ వీసీకి మద్దతుగా నిలిచారు. జేఏసీ బుధవారం సమావేశమై వీసీ గోవర్ధన్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. క్యాంపస్ అభివృద్ధి కోసం పని చేస్తున్న వీసీ, ఓఎస్డీలకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాత్రంతా గందరగోళం... పోలీసులు భారీగా మోహరించినా విద్యార్థులు అక్కడే నిరసన కొనసాగించారు. మరోవైపు మంగళవారం రాత్రి ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బయటకు వచ్చి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించినట్లు తెలిసింది. నిరసనకు కూర్చున్న విద్యార్థులు రాజీనామా కోరడంలేదని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పెంచారన్న ఆరోపణలు వచ్చాయి. జిల్లా ఎస్పీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియో తాము పోస్టు చేయలేదని విద్యార్థి సంఘం ప్రకటించింది. -
మచ్చలుంటే వైద్యులను సంప్రదించాలి
ఆదిలాబాద్టౌన్: శరీరంపై మచ్చలు ఉంటే వైద్యులను సంప్రదించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చిల్కూరిలక్ష్మినగర్ పట్టణ ఆరోగ్యకేంద్రంలో బుధవారం కుష్ఠు గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 నుంచి 31వరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశ కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఉంటే కుష్ఠుగా అనుమానించి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎండీటీతో వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. కుష్ఠు రహిత సమాజం కోసం ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. ఇందులో కుష్ఠు నివారణ అధికారి ఈశ్వర్రాజ్, వైద్యాధికారి దీపిక, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్రావు, రమేశ్, విష్ణు, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు వేగవంతంగా వైద్య సేవలు ప్రజలకు వేగవంతంగా వైద్యసేవలు అందించినందుకు కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. డీఎంహెచ్ఓ సమావేశ మందిరంలో అంబులెన్స్ సేవలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కొన్ని మండలాల్లో అంబులెన్స్ వాహన సేవలను విస్తరించినందుకు కృషి చేస్తున్నామన్నారు. సిబ్బంది పనితీరును అభినందించారు. సమావేశంలో 108 జిల్లా మేనేజర్ శేఖర్, 102 జిల్లా మేనేజర్ మనోహర్, పీఎం సామ్రాట్ పాల్గొన్నారు. -
‘చలో అసెంబ్లీ విజయవంతం చేయాలి’
వాంకిడి: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు నిర్ణయించి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఈ నెల 20న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు బండె హరీష్, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు దుర్గం సందీప్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ మండోకార్వాడ, ఇందాని ఎంపీపీఎస్ పాఠశాలలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాపర్తి నవీన్, సాయికుమార్, మహేందర్, రాజలింగు, అజయ్, విజయ్బాబు, గిర్మాజీ, శ్వేత, అమరేశ్వరి, తిరుమల, తదితరులు పాల్గొన్నారు. -
ఉగాదికి ‘శంకర్లొద్ది’ ముస్తాబు
కెరమెరి: వందల ఏళ్ల చరిత్ర గల కెరమెరి మండలంలోని శంకర్లొద్దిలో గురువారం ఉగాది పర్వది నం ఘనంగా నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజ లు, సేవాలాల్ భక్తులు తరలిరానున్నారు. మహా రాష్ట్ర మంత్రి సంజుభావు రాథోడ్ హాజరై ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే మహా సకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. మహరాష్ట్రలోని సేవానగర్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా ఆయన రానున్నారు. పరంధోళి మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణించి భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన వెంట రాజుర ఎమ్మెల్యే దేవ్రావు భోంగ్డే వస్తారని నిర్వాహకులు తెలిపారు. మహిమాన్విత ప్రాంతం కెరమెరి మండలం కరంజివాడ పంచాయతీలోని శంకర్లొద్దిని బంజారా గురువు ప్రేంసింగ్ మహరాజ్ ఆరేళ్లు తపస్సు చేసిన మహిమాన్విత స్థలమని స్థానికులు చెబుతుంటారు. ఏటా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ జాతర నిర్వహిస్తారు. భక్తులు 20 ఫీట్ల ఎత్తులోని గుహలో కొలువైన శివలింగాన్ని దర్శించుకుంటారు. మహాశివరాత్రి నుంచి శ్రీరామనవమి వరకు 41 రోజుల సేవాలాల్ దీక్ష స్వీకరించే బంజారాలు శంకర్లొద్దిని ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. అనేక మంది సేవాలాల్ భక్తులు పాదయాత్రగా ఇక్కడికి చేరుకుంటారు. శంకరుడితోపాటు దుర్గాదేవి, సేవాలాల్ మహరాజ్కు పూజలు చేస్తారు. బుధవారం రాత్రి నుంచే భజనలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న గంగలో పుణ్యస్నానాలు ఆచరించి జెండాలు, ప్రతిమలకు మొక్కులు చెల్లిస్తారు. ఆదివాసీలకు ‘సిద్దకస’ శంకర్లొద్దికి సమీపంలో జంగుబాయి అమ్మవారి గుహ ఉంది. ఏటా రెండుసార్లు జంగుబాయి ఉత్సవాలకు వెళ్లే ఆదివాసీలు శంకర్లొద్దిలోని శివుడిని సైతం దర్శించుకుంటారు. అయితే ఆదివాసీలు దీనిని సిద్దికసగా పిలుస్తారు. సేవాలాల్ భక్తుల పాదయాత్ర శంకర్లొద్దిలో పూజల అనంతరం మహరాష్ట్రలోని వాసీమ్ జిల్లాలో ఉన్న పొహరాదేవి ఆలయానికి సేవాలాల్ భక్తులు గురువారం పాదయాత్రగా బయలుదేరనున్నారు. సుమారు ఐదు వేల మంది శంకర్లొద్ది నుంచి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొహరాదేవి ఆలయానికి ఆదిలాబాద్ మీదుగా శ్రీరామనవమి రోజు నాటికి చేరుకుంటారు. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తులు వీరితో కలవనున్నారు. -
కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి
రెబ్బెన: బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్న బెల్లంపల్లి ఏరియా కార్మికులకు యాజమాన్యం ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు కోరారు. మంగళవారం ఖైరిగూర ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా బెల్లంపల్లి ఏరియా 126 శాతం ఉత్పత్తి సాధించిందని తెలిపారు. వచ్చే ఏడాది సైతం నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని అధిగమించడం, అధికంగా ఉత్పత్తి చేసే విధంగా కార్మికులను ప్రోత్సాహించాలని అన్నారు. కిలో స్వీట్ బాక్స్, ఒక వెండి నాణెం బహుమతిగా అందించాలని కోరారు. తద్వారా కార్మికులు ఉత్సాహంగా పనిచేస్తారని తెలిపారు. -
కలెక్టరేట్ ఎదుట ‘ఆశ’ల ధర్నా
ఆసిఫాబాద్: కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన హామీల్లో భాగంగా ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశంలో ఆశవర్కర్ల సమస్యలపై తీర్మానం చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల క్రిష్ణమాచారి, కొత్తపల్లి స్వరూప, పద్మ, సుకన్య, సక్రుబాయి, భాగ్య, పద్మ, సునీత తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలి
రెబ్బెన: సింగరేణి కార్మికుల పెండింగ్ డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. 2025 జూలై నుంచి ఇప్పటివరకు జరిగిన మెడికల్ బోర్డులను సమీక్షించి అర్హులను అన్ఫిట్ చేసి, కారుణ్య నియామకాలు చేపట్టాలని, సొంతింటి పథకం అమలుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, పెర్క్స్పై ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, మాస్టర్ సర్క్యులర్ పేరుతో పెట్టిన నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈఅండ్ఎం సూపర్వైజర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పారామెడికల్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అనంతరం ఓసీపీ మేనేజర్ శంకర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. కార్యక్రమాల్లో జీఎం కమిటీ సభ్యుడు రాజేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్బాబు, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి ఓదెలు, షిఫ్ట్ ఇన్చార్జి అంజమయ్య, నాయకులు రాజ్కుమార్, సత్యనారాయణ, నరేశ్, తిరుపతి, నర్సింగం, తిరుపతి, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు -
దీపక్ తివారి సేవలు మరువలేనివి
ఆసిఫాబాద్: అదనపు కలెక్టర్గా దీపక్ తివారి అందించిన సేవలు మరవలేనివని కలెక్టర్ కె.హరిత అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై వెళ్తున్న దీపక్ తివారి ఆత్మీయ వీడ్కోలును మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దీపక్ తివారి జిల్లాలో 2 సంవత్సరాల 8 నెలల పాటు విధులు ని ర్వహించి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. జిల్లా ఇన్చార్జి విద్యాధికారిగా విద్యారంగం బలోపేతానికి, ఆకాంక్షిత జిల్లా తిర్యాణి బ్లాక్లో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేశారన్నారు. అనంతరం దీపక్ తివారి మాట్లాడుతూ విధి నిర్వహణలో జిల్లాలోని అధికారులు అన్నివిధాలా సహకరించారని తెలిపారు. అందరి సహకారంతో శాసనసభ, పార్లమెంట్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు. -
హోటళ్లకు గ్యాస్ సెగ
ఆసిఫాబాద్అర్బన్: ఎక్కడో పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల హోటళ్లలో పొయ్యిలు ఆరిపోయేలా చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అడ్డంకులు నిర్వాహకులకు కొత్త ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మరోవైపు వంటింట్లో ఉండాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అక్కడక్కడా వాణిజ్య సముదాయాల్లో దర్శనమిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నా అక్రమ వినియోగం ఆగడం లేదు. అధికారుల తనిఖీల్లో మంగళవారం దహెగాం, వాంకిడి, కెరమెరిలో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న రాయితీ సిలిండర్లు పట్టుబడ్డాయి. జిల్లా కేంద్రంలో నిర్వాహకులకు కష్టాలుఆసిఫాబాద్ పట్టణంలో దాదాపు 30కి పైగా హోట ళ్లు, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. గ్యాస్ కొరతతో హో టళ్లు నడపడం చాలా కష్టంగా ఉందని యజమానులు చెబుతున్నారు. సిలిండర్ల సరఫరా లేకపోవడంతో సోమవారం నుంచి జిల్లా కేంద్రంలోని ఓ హోట ల్ను మూసివేశారు. మరికొన్ని హోటళ్ల యజమానులు గత్యంతరం లేక కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. కొన్ని ప్రధాన హోటళ్లలో మాత్రం ప్రస్తుతం ఉన్న 2, 3 సిలిండర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. అవి కూడా అయిపోతే తాము కూడా వంటలు నిలిపివేస్తామని చెబుతున్నారు. కమర్షియల్ సిలిండర్లను వాణిజ్య సముదాయాలకు సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని హోటల్ యాజమాన్యాలు కోరుతున్నాయి. నో గ్యాస్..!కౌటాల: మండల కేంద్రంతో పాటు ముత్తంపేట, గురుడుపేట గ్రామాల్లో హోటళ్లు, టీ స్టాల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో హోటల్ నిర్వాహకులకు వారం రోజుల ముందే గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ల సరఫరా నిలిపివేశాయి. కమర్షియల్ గ్యాస్ కొరత ఉండటంతో నిర్వాహకులు రెండు మూడు రోజుల పాటు హోటళ్లను నడిపి, ఆపై బంద్ పెట్టే దిశగా ఆలోచిస్తున్నారు. కొందరు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. సిలిండర్ల కొరతతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. కిరాయిలు చెల్లించాలంటే అదనంగా ఆర్థిక భారం పడుతుంది. ప్రస్తుతం మా వద్ద ఉన్న మూడు సిలిండర్లను వాడుతున్నాం. అవి కూడా అయిపోతే హోటల్ తెరవలేని పరిస్థితి. కట్టెల పొయ్యితో తినుబండారాలను తయారు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతం హోటల్లో ఒక కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లను మూసివేయడంతో పాటు, తెరిచి ఉన్న హోటళ్లలో ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. – ఇరుకుల సంతోష్, హోటల్ యజమాని కమర్షియల్ సిలిండర్ల కొరతతో ప్రస్తుతం హోటళ్లు నిర్వహించడం చాలా కష్టంగా మారింది. కట్టెలు కొనుగోలు చేసి హోటల్ను నడిపితే అదనపు భారం పడుతుంది. వంటచెరుకు కూడా అందుబాటులో లేదు. ప్రస్తుతం ఉన్న సిలిండర్లతో 3, 4 రోజులు హోటల్ను కొనసాగించవచ్చు. గత్యంతరం లేక కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నాం. అధికారులు హోటళ్ల నిర్వహణకు సిలిండర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. – కవాల్కర్ బాబురావ్, హోటల్ యజమాని రాయితీ సిలిండర్లు పట్టివేత దహెగాం: మండల కేంద్రంలోని హోటళ్లలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్కుమార్, శ్రీనివాస్ దాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. అక్రమంగా రీఫిల్లింగ్ చేయడం, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లను నిల్వ చేసినా చర్యలు తప్పవన్నారు. మండల కేంద్రంలో వైన్స్ పర్మిట్ రూంలో రెండు సిలిండర్లు, జేఎస్కే ఫ్యామిలీ రెస్టారెంట్లో ఒక సిలిండర్ను స్వాధీనం చేసుకుని గ్యాస్ గోదాంలో అప్పగించామని తెలిపారు. కెరమెరిలో హోటల్ యజమానులపై కేసుకెరమెరి: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వ్యాపారానికి వాడుతున్న నలుగురు హోటల్ యజమానులపై మంగళవారం కేసు నమోదు చేశామని ఎస్సై ఎన్.మధుకర్ తెలిపారు. మిస్బదాబా యజమాని రాథోడ విక్రమ్, ఆదిత్య దాబా యజమాని రాతోడ్ సుదర్శన్, పద్మ టిఫిన్ సెంటర్ యజమాని ముజాంబిల్ సైద్, ఆగ్రా స్వీట్హౌస్ యజామాని సనే చునిలాల్ డొమెస్టిక్ సిలిండర్లు వాడినట్లు తెలిపారు. వాంకిడి మండలంలో ఇద్దరిపై..వాంకిడి: గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను వ్యాపార నిమిత్తం వినియోగిస్తున్న ఇద్దరు హోటళ్ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. మండలంలోని గోయెగాం సమీపంలో గల దాబా, ఇందాని ఎక్స్రోడ్ సమీపంలోని ఏకే ఫుడ్కోర్ట్లో తనిఖీలు నిర్వహించగా.. డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు యజమానులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటల్ తెరవలేకపోతున్నాం. అయినా వర్కర్లకు మాత్రం వేతనాలు చెల్లించా లి. అలాగే అద్దె, ఇతర బిల్లులు చెల్లింపులతో తమపై ఆర్థిక భారం పడుతోంది. అసలే ఎండాకాలం కావడంతో కట్టెల పొయ్యిని వినియోగించాలంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. – జె.శంకర్, హోటల్ యజమాని -
రోగులకు మెరుగైన చికిత్స అందించాలి
తిర్యాణి: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంగళవారం నీతి ఆయోగ్ కేంద్ర ప్రతినిధి ఆశ్ల శర్మతో కలిసి తనిఖీ చేశారు. ఆపరేషన్ థియేటర్, రోగుల వార్డులు, మందుల నిల్వ గది, ప్రసూతి పట్టికను పరిశీలించారు. నెలల వారీగా జరుగుతున్న ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని శుద్ధజల యంత్రానికి వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందించాలన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నిరోధించవచ్చన్నారు. అనంతరం మండల కేంద్రంలో సంపూర్ణత అభియాన్లో భాగంగా పశువులకు ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగుబాయి మండల సమైక్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, ఎంపీడీవో వేముల మల్లేశ్, ఏపీఎం శ్రీనివాస్, సంపూర్ణత అభియాన్ జిల్లా సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పగటిపూట వీధిలైట్లు వెలగనీయొద్దుఆసిఫాబాద్రూరల్: గ్రామాల్లో పగటిపూట వీధిలైట్లు వెలగకుండా నియంత్రించాలని కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని చిర్రకుంట, పాడిబండ పంచాయతీలను మంగళవారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ వీధిదీపాలు పగలు వెలకుండా మరమ్మతులు చేపట్టి, ఆన్ఆఫ్ స్విచ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీల అభివృద్ధికి కార్యదర్శులు సర్పంచుల సహకారం తీసుకోవాలన్నారు. -
డోర్లి ఓసీపీ సందర్శన
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో మూతపడిన డోర్లి– 2 ఓసీపీని మంగళవారం నాగ్పూర్ కోల్ కంట్రోల్ ఆఫీస్ ఓఎస్డీ రాజేంద్ర చోలే, కొత్తగూడెం కోల్ కంట్రోల్ ఆఫీస్ ఓఎస్డీ కృష్ణమోహన్రావు సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ ప నులను పరిశీలించారు. ఓసీపీ వద్ద నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారడంతో యాజమాన్యం చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి నిర్వహణ, మృతిక సంరక్షణ వివరాలను తెలుసుకున్నారు. అంతకు ముందు జీఎం కార్యాలయంలో జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి కోల్ కంట్రోల్ అధికారులకు ఏరియా వివరాలను వెల్ల డించారు. కార్యక్రమాల్లో గోలేటి ఓసీపీ ప్రాజెక్టు అ ధికారి నాయిని ఉమాకాంత్, ఏరియా సర్వే అధికా రి అఫ్సర్ పాషా, కార్పొరేట్ అదనపు మేనేజర్ తిరుపతి, డోర్లి ఓసీపీ– 2 మేనేజర్ మహేశ్, ఎన్విరాన్మెంట్ అధికారి హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన జీవనం గడుపుదాం
కెరమెరి: ఆరోగ్యకరమైన జీవనం గడుపుదామని మహిళా అభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజె క్టు మేనేజర్ బ్రహ్మచారి, ప్రాజెక్టు అధికారి ప్రవీణ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ని మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం వీవోఏలకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ప్రాముఖ్యత గురించి వివరించారు. తాగునీటి మూలాల వినియోగం, హ్యాండ్ వాష్, క్షేత్రస్థాయిలోని లోపాలను అధిగమించడంపై సూచనలు చేశారు. ప్రజ లకు వీటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్య త వీవోఏలపై ఉందన్నారు. ప్రతీ కుటుంబం మరుగుదొడ్లు వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీలు జీవన్, ధన్రాజ్, దస్తగిరి, సుబ్బారావు, కవిత, సుజాత, సత్తయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు తీపి కబురు
రెబ్బెన: పంట సాగులో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరో సా పెట్టుబడి సాయంపై ఏర్పడిన అనిశ్చితి తొలగిపోయింది. ఎట్టకేలకు ప్రభుత్వం నిధుల విడుదలపై స్పష్టతనిస్తూ రైతులకు తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందా ల్సి ఉండగా ఎన్నికల కోడ్, ఇతర కారణాలతో పెండింగ్లో ఉంది. గతేడాది యాసంగి మాదిరిగా పెట్టుబడి సాయానికి దూరం కావాల్సి వస్తుందని ఆందోళన చెందారు. మున్సిపల్ ఎన్నికల ముగియగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చినా స్పష్టమైన తేదీ ప్రకటించలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ నెల 22 నుంచి విడతలవారీగా నిధుల విడుదల చేస్తామని ప్రకటించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా విడుదలఎకరానికి రూ.12వేల చొప్పున సంవత్సరానికి రెండు దఫాల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. వానాకాలంలో నిధులు విడుదల చేసినా.. యాసంగి సీజన్కు సంబంధించి జాప్యం జరిగింది. యాసంగి పంటలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రారంభంలో నిధులు అందించి ఉంటే విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకు ఉపయోగపడేది. నిధుల విడుదల జాప్యంతో ఖర్చుల కోసం ప్రైవేటు వ్యక్తులు, ఇతర ఆర్థిక మూలాలపై ఆధారపడ్డారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతుభరోసా అందించనున్నట్లు ప్రకటించింది. మూడు విడతల్లో అందించాలని నిర్ణయించింది. మొదటి విడతలో ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల అనంతరం రెండో విడత, ఇక ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగిలిన రైతులందరికీ ఎకరానికి రూ.6వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త వారికి సైతం అవకాశం2025– 26 సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించి కొత్తగా పట్టాపాస్ పుస్తకం పొందిన రైతులకు సైతం రైతుభరోసా సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యవసాయానికి యోగ్యత కలిగిన భూములను గుర్తించిన వ్యవసాయశాఖ అధికారులు రైతుభరోసా పథకానికి అర్హులను తేల్చారు. గత వానాకాలంలో జిల్లాలో 1,43,063 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.2,66,86,59,662 అందించారు. తాజాగా ప్రభుత్వం కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం కల్పించడంతో యాసంగి పెట్టుబడి సాయం పొందే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28లోగా కొత్త పట్టాపాస్ పుస్తకం, డిజిటల్ సంతకం అయిన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. గతంలోనే పట్టాపాస్ పొంది ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి కూడా అవకాశం కల్పించారు. పట్టాపాస్ పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, రైతుభరోసా దరఖాస్తు ఫారంతో కలిపి సంబంధిచి వ్యవసాయ విస్తరణ అధికారికి అందిస్తే సరిపోతుంది. కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలి యాసంగి సీజన్ రైతు భరోసా పెట్టుబడిసాయం కోసం కొత్తగా పట్టాపాస్ పుస్తకం పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 28 నాటికి పట్టాపాస్ పుస్తకం కలిగి ఉన్నవారు, డిజిటల్ సంతకమైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలోనే పట్టాపాస్ పుస్తకం పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలి. పెట్టుబడి సాయం విడుదలపై అధికారికంగా ఎలాంటి ఉత్వర్వులు అందలేదు. ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుంది. – వెంకట్, జిల్లా వ్యవసాయాధికారిమండలాల వారీగా అర్హుల వివరాలు మండలం గ్రామాలు రైతులు గతంలో జమచేసిన ఆసిఫాబాద్ 71 13,496 24,65,11,780 జైనూర్ 34 7,429 18,41,12,249 కెరమెరి 68 8,405 18,32,79,303 లింగాపూర్ 17 5,876 14,34,90,420 రెబ్బెన 35 13,300 22,44,08,136 సిర్పూర్(యు) 22 6,138 15,51,52,215 తిర్యాణి 47 8,501 16,79,13,543 వాంకిడి 49 10,880 23,56,93,793 బెజ్జూర్ 34 10,824 17,04,33,482 చింతలమానెపల్లి 27 8,910 15,20,14,555 దహెగాం 37 13,224 21,26,54,177 కాగజ్నగర్ 41 14,069 23,32,36,566 కౌటాల 21 7,802 13,16,11,013 పెంచికల్పేట్ 25 6,459 9,68,62,889 సిర్పూర్(టి) 32 7,750 13,12,85,541 -
సమస్యలు పరిష్కరించాలని వీవోఏల నిరసన
ఆసిఫాబాద్రూరల్: ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం వీవోఏలతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ వీవోఏలకు సమాన పనికి సమాన వేతనం రూ.26వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణమాచారి, నాయకులు ధనరాజ్, అంకన్న, తిరుపతి, రాంచందర్, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యువతి దారుణ హత్య
పెంచికల్పేట్: పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం సాగించిన యువతి.. అతడి కారణంగా గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. భార్య, పిల్లలు ఉన్న వ్యక్తి యువతిని వదిలించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో ఆమెను కడతేర్చాడు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి పంచాయతీ పరిధిలోని జైహింద్పూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సమ్మక్క(25)తో జైహింద్పూర్ గ్రామానికి చెందిన వివాహితుడు కేర్కరి జలపతి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అతడి కారణంగా సమ్మక్క గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఎలాగైనా సమ్మక్కను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. ముందస్తు ప్లాన్ ప్రకారం.. శనివారం సమ్మక్కకు మాయమాటలు చెప్పి సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక.. తలపై బండరాయితో కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం అడవిలోకి వెళ్లినవారు మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్కుమార్ ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలాన్ని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ పరిశీలించారు. మృతురాలి సోదరి ఆత్రం మిరియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
ఆసిఫాబాద్అర్బన్: పొట్టి శ్రీరాములు జ యంతి వేడుకలను వాసవిక్లబ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, న్యాయవాది ముక్తా సురేష్, కౌన్సిలర్ చిలువే రు వెంకన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరా ములు దీక్షా తత్పరుడని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో అనుకున్న లక్ష్యాన్ని సా ధించే వరకు వెనక్కి తగ్గకుండా పోరాటం చే సిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు ఉదయ్బాబు, కార్యదర్శి బాల శ్రీనివాస్, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్, ఖాండ్రె విశాల్, ప్రశాంత్, కృపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వినతి
రెబ్బెన: విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్పీల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, సీఆర్పీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్ట దేవేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందించా రు. వారు మాట్లాడుతూ 13 ఏళ్లుగా విద్యాభివృద్ధికి సీఆర్పీలు ఎంతో కృషి చేస్తున్నారన్నా రు. ఎన్నికల హామీ మేరకు షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పర్మినెంట్ చేసే వరకు కనీస టైం స్కేల్ ఇవ్వాలని, పీఎఫ్, ఆరోగ్య బీమా కల్పించాలని డి మాండ్ చేశారు. సీఆర్పీలకు జిల్లా, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. -
ఉపాధి వేతనాలు పెండింగ్!
సిర్పూర్(టి): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. సకాలంలో డబ్బులు రాక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీలకు ప్రతినెలా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాల్సి ఉండగా, జనవరి నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. త్వరలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, జిల్లావ్యాప్తంగా పనులు జోరుగా సాగుతున్నాయి. లక్ష్య సాధన దిశగా అధికారులు పనులు చేపడుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని తెలుస్తోంది. 2.50 లక్షల మంది కూలీలుజిల్లాలో మొత్తం 1.50లక్షల జాబ్ కార్డులు ఉండగా, ఇందులో 2.50 లక్షల మంది కూలీలు ఉన్నారు. జనవరి 12 నుంచి ఇప్పటివరకు వేతనాలు రాలేదు. ఒక్క సిర్పూర్(టి) మండలంలోనే రూ.50 లక్షల వరకు పెండింగ్ ఉండగా, జిల్లాలో మొత్తంలో సు మారుగా రూ.11 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంద ని ఆ శాఖ అధికారులు తెలిపారు. జనవరి నుంచి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతోనే డబ్బులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటున్నారు. త్వరలో నే చెల్లించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. త్వరలోనే చెల్లింపులు ఉపాధిహామీ కూలీలకు పెండింగ్లో ఉన్న కూలి డబ్బులు త్వరలోనే మంజూరవుతాయి. నగదు విడుదల కోసం ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని కూలీలు ఎలాంటి ఆందోళన చెందొద్దు. – చంద్రయ్య, ఏపీవో, సిర్పూర్(టి) -
నిధుల కోత.. రాబందుల వలస
పెంచికల్పేట్: పాలరాపు గుట్టను ఆవాసంగా మార్చుకున్న అరుదైన లాంగ్ బిల్డ్ వల్చర్స్(పొడుగు ముక్కు రాబందులు) క్రమంగా కనుమరుగవుతున్నాయి. పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఈ అరుదైన రాబందులను అటవీశాఖ అధికారులు 2013 సంవత్సరంలో పెంచికల్పేట్ మండలంలోని నందిగామ వద్ద, పెద్దవాగు– ప్రాణహిత సంగమం ప్రాంతంలో గుర్తించారు. సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో వాటి సంతతి క్రమేణా పెరిగింది. అయితే కొన్నేళ్లుగా రాబందుల సంరక్షణకు నిధుల కేటాయింపులో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కమలాపూర్కు వలస వెళ్లాయి. అడపాదడపా పాలరాపు గుట్ట వద్ద సంచరిస్తూ పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. గతంలో అధికారులు నిర్వహించిన బర్డ్ వాక్ కార్యక్రమంలో పాలరాపు గుట్ట వద్ద హిమాలయాల్లో నివసించే అరుదైన గ్రిఫ్ఫోన్ రాబందులను కూడా అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు కరువు..జిల్లాలో మొట్టమొదటిసారిగా అంతరించిపోతున్న దశలో ఉన్న రాబందులను అటవీశాఖ అధికారులు పాలరాపు గుట్ట వద్ద గుర్తించారు. 200 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై సహజంగా ఉన్న గూళ్లలో సుమా రు 24 రాబందులను అధికారులు కనుగొన్నారు. వాటి గమనాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా బయాలజిస్ట్ను నియమించడంతో పాటు రాబందులకు ఎలాంటి హాని తలపెట్టకుండా నిధులను కేటాయించి బర్డ్ వాచర్స్ను నియమించారు. వాటి జీవన విధానాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి వాచ్ టవర్ సైతం ఏర్పాటు చేశారు. రాబందుల కోసం ప్రత్యేకంగా ‘రాబందుల రెస్టారెంట్’ ఏర్పాటు చేసి కృత్రిమంగా ఆహారం అందజేయడంతో పదేళ్లలో వాటి సంతతి గణనీయంగా పెరిగి 36కు చేరుకుంది. దీంతో రాష్ట్రంలోనే అరుదైన జాతులకు నిలయంగా పాలరాపు గుట్ట నిలిచింది. లోపించిన పర్యవేక్షణఅటవీశాఖ ఆధ్వర్యంలో సంరక్షణ కేంద్రంగా ఉన్న పాలరాపు గుట్ట వద్ద క్రమక్రమేణా పర్యవేక్షణ లోపించింది. నిధుల లేమితో బయాలజిస్ట్తో పాటు బర్డ్ వాచర్లను కూడా తొలగించారు. మరో వైపు భారీ వర్షాలకు ఎత్తైన ప్రాంతంలో ఉన్న గూళ్లు దెబ్బతినడంతో ఏటా రాబందులు ఆవాసాన్ని వది లి కొత్త ప్రాంతాలకు తరలిపోయాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గల కమలాపూర్ను ప్రస్తుతం ఈ రాబందులు ఆవాసంగా మార్చుకున్నాయి. రక్షణ చర్యలు లేకపోవడంతో మూడు ఏళ్లుగా రాబందులు అప్పుడప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాయి. కమలాపూర్లో అటవీశాఖ అధికారులు పకడ్బందీగా సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు సిబ్బందిని నియమించి నిరంతరం ఆహారం అందిస్తున్నారు. దీంతో కమలాపూర్ ఇప్పుడు అరుదైన రాబందులకు ప్రధాన ఆవాసంగా మారింది.నందిగామ వద్ద రాబందుల స్థావరం పాలరాపు గుట్టసంరక్షణకు ప్రతిపాదనలు పంపించాం అరుదైన జాతికి ఆవాసంగా ఉన్న పాలరాపు గుట్ట వద్ద రాబందులు సంచరిస్తున్నాయి. గ తంలో అటవీశాఖ అధికారులు వాటిని గు ర్తించి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సంతతి అభివృద్ధి చెందింది. అకాల వర్షాలతో గూళ్లు కూలిపోవడంతో రాబందులు ఆవాసాన్ని మార్చుకున్నాయి. వాటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. – అనిల్ కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ -
బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ నితిక పంత్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలు విని చట్టప్రకారం పరిష్కరించాలని ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే చర్యలుజిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, ఎవరైనా సిలిండర్లు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, జిల్లాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో సిలిండర్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమ నిల్వలు జరుగకుండా, మధ్యవర్తులు అధిక ధరలకు విక్రయించకుండా ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్ అధిక ధరలకు విక్రయిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ప్రతిపాదనలకే పరిమితం..
రాబందులను సంరక్షించడానికి అటవీశాఖ అధి కారులు గతంలో ‘జటాయువు’ పేరుతో కార్యక్రమానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో భా గంగా వాటి రక్షణకు సిబ్బంది నియామకం, వేటగాళ్ల ప్రవేశంపై నిషేధం, సంరక్షణ కేంద్రం చుట్టూ కంచె ఏర్పాటు, ఆహారం అందించడం వంటి అంశాలను జిల్లా అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో రాబందుల సంరక్షణ కేంద్రం పనులు ముందు కు సాగడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అరుదైన జాతుల సంరక్షణకు నిధులను కేటాయించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
వేగంగా ప్రజావాణి వినతులు పరిష్కారం
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన వినతులను వేగంగా పరిష్కరిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆధారం లేని తనకు పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన బోర్కుటె భీంరావ్ విన్నవించారు. కాగజ్నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని సర్పంచ్ జాదవ్ రాజేందర్ ఫిర్యాదు చేశారు. కాగజ్నగర్ మండలం రాస్పెల్లి గ్రామంలోని మీసేవ కేంద్రాన్ని రద్దు చేయాలని కోటేష్ కోరాడు. ఒంటరి మహిళ పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన సవిత, దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కౌటాల మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన నగేశ్ వేర్వేరుగా వినతులు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. పట్టా పాస్పుస్తకం ఇప్పించండి రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామ శివారులో సర్వే నం.122/1/2లో ఎకరం భూమి ఉంది. గతంలో ఉన్న సర్వే నంబర్లో తక్కువ భూమి ఉంది. భూమి మొత్తం వివరాలను పొందిపర్చి నూతన పట్టాపాసు పుస్తకం ఇప్పంచాలి. – టేకం భుజంగ్రావు, తక్కళ్లపల్లి, మం.రెబ్బెన -
లక్ష్య సాధనకు సమష్టి కృషి
ఆసిఫాబాద్అర్బన్: ఆకాంక్షిత జిల్లా, తిర్యాణి బ్లాక్ కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికారులు సమష్టి కృషి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్ అధికారి అష్ణశర్మతో కలిసి సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ 2.0 కింద చేపడుతున్న లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో హెల్త్ న్యూట్రిషన్, పాఠశాలల్లో వసతుల కల్ప న, సాగునీటి వసతి, పశువులకు వందశాతం టీకాలు, ఆర్థిక చేయూత, నైపుణ్యత అభివృద్ధి, ఆ కాంక్షిత తిర్యాణి బ్లాక్ కార్యక్రమంలో గిరిజనులు, పీవీటీజీ గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సా రించినట్లు తెలిపారు. సమావేశంలో డీటీడీవో ర మాదేవి, డీఎంహెచ్వో సీతారాం, డీఏవో వెంకటి, పంచాయతీరాజ్ ఈఈ ధర్మేంధర్, గ్రామీణ నీటి సరఫరా ఈఈ సిద్దిక్, ఆకాంక్షిత కార్యక్రమాల జిల్లా సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు. బూత్స్థాయి ఏజెంట్ల జాబితా అందించాలిప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ తరఫున బూత్స్థాయి ఏజెంట్ల వివరాలు అందించా లని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి గుర్తింపు పొందిన రా జకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్లో చేపట్టే ప్రత్యేక సమగ్రత సర్వేలో భాగంగా ఓటర్ల వివరాలు సేకరించేందుకు బూత్స్థాయి అధికారులు ప్రతీ ఇంటింటికి వెళ్తారని తెలి పారు. బూత్స్థాయి ఏజెంట్ల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. అ లాగే మేలో జాతీయ ఇళ్ల గణనకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు. -
అంగన్వాడీల అరెస్టు సరికాదు
కాగజ్నగర్టౌన్: అంగన్వాడీ టీచర్లు, ఆయా ల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లకుండా జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మా ట్లాడుతూ హైదరాబాద్కు వెళ్లకుండా సీఐ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.త్రివేణిని రాత్రి ఇంటి నుంచి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆనంద్, అరుణ, వినోద, మల్లేశ్వరి, విజయ్, రాణి, కళావతి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం అంకితభావంతో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఆదివారం ప్రత్యేక వైద్యశిబిరానికి డీఎంహెచ్వో సీతారాం, కౌన్సిలర్ చిలువేరు వెంకన్నతో కలిసి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రామయ్య, నాయకులు సాయిశ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఇళ్ల గణన చేపట్టాలి
ఆసిఫాబాద్అర్బన్: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం చార్ట్ అధికారులు, అదనపు చార్ట్ అధికారులకు మూడురోజుల శిక్షణను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన, ఇళ్ల గణనలో భాగంగా 2026లో మొదటి విడతలో ఇళ్లు లెక్కించి డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జాబితా రూపొందిస్తారని పేర్కొన్నారు. సెన్సెస్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా గణాంక అధికారి గురువయ్య, జిల్లా సెన్సెస్ అధికారులు వినయ్, గంగయ్య, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దుగృహావసరాలకు కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య అవసరాలకు వాడొద్దని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆదివారం అదనపు కలెక్టర్ డేవిడ్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వసంతలక్ష్మి, కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్లతో కలిసి జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రెవెన్యూ, పౌరసరఫరాలు, మున్సిపల్ అధికారులు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో కొరత లేదని తెలిపారు. ఎల్పీజీ గోదాములు, పెట్రోల్ బంకుల వద్ద స్టాకు వివరాలను ప్రదర్శించాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజుకు 2వేల చొప్పున బుకింగ్ చేసుకొన్న వారికి సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. విద్యాసంస్థలు, వసతి గృహాలు, గురుకులాల అవసరాలకు సరిపడా సిలిండర్లు అందించాలన్నారు. బంకులలో పెట్రోల్ను ప్లాస్టిక్ క్యాన్లలో పోయొద్దన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల సిలిండర్ల బుకింగ్ గడువు ఉందని పేర్కొన్నారు. -
19న శంకర్లొద్దికి మహారాష్ట్ర మంత్రి రాక
కెరమెరి: మండలంలోని శంకర్లొద్ది గ్రామంలో ఈ నెల 19న నిర్వహించే ఉగాది ఉత్సవాలకు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సంజుభావు రాథోడ్ హాజరుకానున్నట్లు సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు, సేవాలాల్ ఉత్సవ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రూప్లాల్ రాథోడ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. శంకర్లొద్దిలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దాతల ద్వారా భక్తులకు ఉచిత అన్నదానం, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. -
నేడు కలెక్టరేట్ ముట్టడి
ఆసిఫాబాద్అర్బన్: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి చాంద్పాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్లో ఆదివారం పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా లేబర్కోడ్లను అమలు చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. దీనికి నిరసనగా నేడు కలెక్టరేట్ ముట్టడి, 23న హైదరాబాద్లోని లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు వీరన్న, తిరుపతి, అఖిల్, సమీర్, తరుణ్, బాబా, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
కిల్లర్.. పారాక్వాట్
చింతలమానెపల్లి: పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు వినియోగాన్ని నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై గడ్డి మందు వినియోగానికి వ్యవసాయశాఖ అధికారుల అనుమతి(ప్రిస్క్రిప్షన్) తప్పనిసరిగా మారనుంది. జిల్లాలో అధికశాతం ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉండగా, ప్రధానంగా పత్తి, వరి, కంది, పెసరతోపాటు కూరగాయలు, శనగ, మొక్కజొన్న, జొన్న పంటలు పండిస్తున్నారు. వరి, పత్తి పంటలకు కలుపు బెడద ఎక్కువగా ఉండటంతో రైతులు గడ్డిమందులను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు అనుకూలించని పక్షంలో కలుపు తీయడం రైతులకు శక్తికి మించిన పనిగా మారుతోంది. కూలీలను వినియోగించినా ఖర్చు భారం పడుతోంది. దీంతో రైతులు కలుపు నివారణ మందుల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. పత్తి సాగులో బీటీ– 3 విత్తనాలపై ప్రభుత్వం నిషేధం విధించినా అక్రమంగా కొనుగోలు చేసి సాగుచేస్తున్నారు. అలాగే గ్లైఫోసెట్ రౌండప్ మందును సైతం అక్రమంగా కొనుగోలు చేసి పత్తిలో కలుపు నివారణకు వాడుతున్నారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు, గ్లైఫోసెట్ తరలిస్తున్న అనేక మందిపై ఏటా కేసులు నమోదవుతున్నాయి. పారా క్వాట్ మొక్కల్లోని ఫోటోసింథసిస్ కణాలను నాశనం చేస్తూ కలుపు నివారణిగా పనిచేస్తుంది. గ్లైఫోసెట్ మొక్కలను మొత్తం నాశనం చేస్తుంది. జిల్లాలో అమలయ్యేనా..?మన రాష్ట్రంలో పూర్తిస్థాయిలో గ్లైఫోసెట్ గడ్డిమందుపై నిషేధం ఉంది. కానీ మహారాష్ట్రలో విక్రయాలకు అనుమతి ఉంది. తాజాగా పారాక్వాట్ మందుపై నియంత్రణ విధించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు వ్యవసాయ అధికారి లేదా సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సదరు అధికారి వ్యవసాయ భూమిని పరిశీలించి అనుమతి ఇస్తారు. మందు వినియోగం తప్పనిసరి అని ధ్రువీకరించి సిఫార్సు చేస్తే డీలర్ వద్ద నుంచి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో గ్లైఫోసెట్, గడ్డి మందు విక్రయాలపై నియంత్రణ లేదు. ఈ నేపథ్యంలో రైతులు అక్కడి నుంచి కొనుగోలు చేసి అక్రమంగా తరలించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అక్రమంగా వ్యాపారాలు చేసే వారికి ఇది ఆదాయ మార్గంగా మారనుంది. రైతులకు సరైన అవగాహన కల్పించి చైతన్యం కలిగిస్తేనే ఫలితాలు సాధించవచ్చు.రైతులకు అవగాహన కల్పిస్తాం పారాక్వాట్ గడ్డిమందు వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తాం. ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. పారాక్వాట్ గడ్డి మందు నియంత్రణపై కొత్త ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఈ మందుతో కలిగే ప్రభావాలపై వ్యవసాయ శాఖలో చర్చలు కొనసాగుతున్నాయి. రైతులు ఈ మందును వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. – వెంకటి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రాణాలకే ప్రమాదంపారాక్వాట్ గడ్డి మందు వినియోగంపై ప్రారంభంలో అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ అనంతర కాలంలో ఆ గడ్డిమందు అనర్థాలను నిపుణులు గుర్తించారు. పారాక్వాట్ వినియోగంతో పర్యావరణపరంగా నష్టంతోపాటు వర్షాలు పడిన అనంతరం కూడా దీని ప్రభావం భూమి, మొక్కల్లో తగ్గడంలేదు. వీటిని పిచికారీ చేసే రైతులు, కూలీలు సైతం దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడేవారు పారాక్వాట్ సేవిస్తే చికిత్స కూడా అందించలేని పరిస్థితి. ప్రధాన అవయవాలు దెబ్బతిని మరణం తప్పనిసరిగా మారింది. మనుషుల్లో దుష్ప్రభావాలకు యాంటీడోస్ లేకపోవడంతో అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో రెండేళ్లుగా ప్రాణాంతక మందు నిషేధం కోసం వైద్యులు పోరాటం చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల్లో చికిత్సకు లొంగని వైనంపై ప్రభుత్వాలకు నివేదికలు అందించారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అసెంబ్లీలో పారాక్వాట్ విషయాన్ని లేవనెత్తారు. గడ్డిమందుకు వ్యతిరేకంగా వైద్యులతో సంఘాన్ని రూపొందించి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో వీరి పోరాటానికి ఫలితం దక్కినట్లయింది. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కౌటాల: క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని గురుడుపేట గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ లెవల్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాపోటీలు నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలన్నారు. కాగా, ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొంటున్నాయని, మొదటి బహుమతి రూ.22 వే లు, ద్వితీయ బహుమతి రూ.11 వేలు అందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్, సర్పంచ్ రాగిసిడెం భీంరావ్, మాజీ ఎంపీపీ నికాడే గంగారాం, నాయకులు హన్మంతు, రాజేశ్, రవి, వెంకటేశ్, సంతోష్, గోసాయి, బ్రహ్మయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
రెబ్బెన: బీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు పార్టీలో గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గోలేటి గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ తీర్థం పు చ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఎక్కితే బ్రేకుల్లేవ్..!
సిర్పూర్(టి) మండలం కోనేరు కాలనీ సమీపంలో ఈ నెల 14న రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కౌటాల నుంచి సిర్పూర్(టి) వైపు వెళ్తున్న డొంగ్రి రక్షిత్, సిర్పూర్(టి) నుంచి కౌటాల వైపు వెళ్తున్న ఆడే రవి వాహనాలు ఎదురుగా ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. కౌటాల: కుర్రకారు రయ్ రయ్మంటూ దూసుకెళ్తున్నారు. బైక్లను ఎలా నడిపినా తమను అడిగేవారు లేరనే ధీమా వారిలో పెరిగిపోతోంది. బైక్పై ముగ్గురేసి యువకులు ఎక్కి హైస్పీడ్తో వెళ్తూ, సడన్గా బ్రేక్లు వేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. మైనర్లు బైకులపై గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్తూ సిగరెట్లు, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. 16 ఏళ్లు కూడా నిండని వారు మత్తులో ప్రమాదాల బారిన పడటమే కాకుండా, ఎదుటివారికీ నష్టం కలిగిస్తున్నారు. సాయంత్రం పోలీసుల నిఘా ఉంటున్నా మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వీరు మరింత రెచ్చిపోతున్నారు. జిల్లాలో గతేడాది 267 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 60 మంది మృతి చెందారు, 74 మంది గాయపడ్డారు. మైనర్ల చేతికి బైక్లు..‘వేగం కన్నా ప్రాణం మిన్నా’ అనే నినాదం ఉన్న సూచిక బోర్డులు రోడ్ల పక్కన తరచూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే పలువురు వాటిని పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాలతోపాటు కౌటాల, రెబ్బెన, వాంకిడి, సిర్పూర్(టి), దహెగాం, చింతలమానెపల్లి మండల కేంద్రాల్లో యువత వేగంగా బైక్లు నడుపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటర్, పదో తరగతి చదివే మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు బైక్లు ఇచ్చి స్కూళ్లకు పంపిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు కూడా బైక్పై ముగ్గురు, నలుగురిని ఎక్కించుకుని పరీక్షలకు హాజరవుతున్నారు. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. నిఘా కరువు..రోడ్లపై కొందరు యువకులు బైక్లను ర్యాష్గా నడుపుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో న్యూసెన్స్కు పాల్పడేవారిపై ఈ–పెట్టీ కేసులు నమోదు చేస్తున్నట్లే, వీరిపై కూడా కేసులు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పనుల కోసం మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తప్పవు ట్రిపుల్, ర్యాష్, మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. వాహనదారుల్లో చాలా మంది బాధ్యతారా హిత్యంగా వ్యవహరిస్తున్నా రు. వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తాం. యువత ర్యాష్ డ్రైవింగ్ను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపడతాం. 18 ఏళ్లు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించి, అతివేగంగా వెళ్లే ద్విచక్ర వాహనదారులపై చర్యలు తీసుకుంటాం. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. – నితిక పంత్, ఎస్పీ సెల్ ‘కిల్’ డ్రైవింగ్..!భుజం, తల మధ్యలో సెల్ఫోన్ పెట్టుకుని వాహనం నడపడం.. బ్లూటూత్లో మాట్లాడుతూ వెనుక నుంచి హారన్ కొట్టినా పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా వెళ్లడం వాహనదారులకు అలవాటైపోయింది. సెల్ఫోన్ డ్రైవింగ్కు రూ.1,000, హెల్మెట్ వాడనందు కు రూ.135 జరిమానా విధిస్తారు. సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు మొత్తుకుంటున్నా, జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా సెల్ఫోన్ డ్రైవింగ్ నిలుస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడపడాన్ని పోలీస్ అధికారులు ‘డేంజర్ డ్రైవింగ్’గా పరిగణిస్తున్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో మెడనొప్పితో పాటు వెన్నెముక నొప్పి కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అత్యవసరం అయితే వాహనాన్ని పక్కకు ఆపి, మాట్లాడిన తర్వాతే వెళ్లాలని సూచిస్తున్నారు. -
మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్ దుర్వినియోగంపై ఫిర్యాదు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్లోకి అనధికారిక వ్యక్తులు ప్ర వేశించి మున్సిపల్ కార్యకలాపాలకు ఆటంకం కలగిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్పర్స న్ డాక్టర్ కొత్తపల్లి అనిత, బీఆర్ఎస్ కౌ న్సిల ర్లు ఆరోపించారు. దీనిపై శనివారం అడిషన ల్ కలెక్టర్ డేవిడ్తోపాటు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారిక స్థలాన్ని వ్యక్తిగత, రాజకీ య కార్యక్రమాల కోసం ఉపయోగి స్తున్నార ని ఆరోపించారు. దీంతో మున్సిపల్ కార్యాల య గౌవరం దెబ్బతింటోందని తెలిపారు. ప్ర జల్లోకి తప్పుడు సందేశం వెళ్తోందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిపాలన సక్రమంగా సాగేందుకు చైర్పర్సన్ చాంబర్ను అధికారిక అవసరాలకే పరిమితం చేయాలని కోరారు. -
అనుమానిత రేషన్కార్డుల తొలగింపు!
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో అనర్హుల రేషన్కార్డుల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం చ ర్యలు చేపట్టింది. లబ్ధిదారులకు పంపిణీ సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ప్రభుత్వం జిల్లాల వారీగా అనుమానిత కార్డుల జాబి తా రూపొందించింది. జిల్లాలో 1,508 అనుమానిత రేషన్కార్డులున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు జాబితా పంపింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనర్హులుగా తేలితే వారి కార్డులు తొలగించనున్నారు. అయితే, అనుమానిత రేషన్ కార్డుల తొలగింపునకు సంబంధించి మార్గదర్శకాలు రాలేదని సివిల్ సప్లయ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు, నాలుగెకరాలకు పైబడి వ్యవసాయ భూమి ఉన్నవారు, అత్యధిక వార్షికాదాయం కలిగినవారు, రెండు రేషన్కార్డుల్లో పేర్లున్నవారిని అనర్హులుగా గుర్తించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్టపేదలకు చౌకధరకే బియ్యం అందించేందుకు ప్రభుత్వాలు రేషన్కార్డులు మంజూరు చేస్తున్నాయి. అ యితే, పలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందా లంటే రేషన్కార్డు ప్రామాణికం కావడంతో పేదలే కాకుండా ధనికవర్గాలు కూడా అక్రమంగా రేషన్కా ర్డులు పొందారు. ఇలాంటివారు రేషన్షాపుల్లో బి య్యం తీసుకుని బ్లాక్లో విక్రయిస్తున్నారు. గతంలో రేషన్షాపులకు వచ్చిన దొడ్డు బియ్యం కూడా విక్రయించేవారు. ప్రస్తుతం లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తుండడంతో పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గతంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న పలు వురు రేషన్కార్డులు పొందాక వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా, ఆదాయం పెరిగినా వారి కార్డులు అలాగే ఉండిపోయాయి. అలాగే, చనిపోయిన లబ్ధి దారుల పేర్లు ఇంకా రేషన్కార్డుల్లోంచి తొలగించకపోవడంతో వారి పేరిట బియ్యం కోటా అలాట్ అవుతోంది. దీంతో వారికి కేటాయించిన బియ్యం పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం రేషన్కార్డుల్లోంచి అనర్హుల తొలగింపు ప్ర క్రియ చేపడుతుండగా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా ఉంటుంది. జిల్లాలో బియ్యం పంపిణీ ఇలా..ఇప్పటికే అనుమానిత కార్డుల జా బితా జిల్లాకు చేరినా అధికారులు ఇంకా ఎలాంటి తొలగింపు ప్రక్రియ చేపట్టలేదు. జిల్లాలో ప్రస్తుతం 315 రేషన్ దుకాణాల ద్వారా 3,519.743 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. 1,63,765 రేష న్కార్డులుండగా 4,95,204 మందికి లబ్ధి చేకూరుతోంది. ప్రభుత్వ ఉద్యో గం వచ్చినవారు, నాలుగెకరాలకు పైబడి వ్యవసాయ భూమి ఉన్నవారు, అధిక వార్షికాదాయం కలి గినవారితోపాటు మరణించిన వా రు, రెండు రేషన్కార్డుల్లో పేర్లు న మోదు చేసుకున్నవారితో కలిపి 1,508 అనుమానిత కార్డుల జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది. వీటిపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. అనర్హులను గుర్తించి వారి కార్డులు తొలగించనున్నారు. మార్గదర్శకాలు రాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాలోని అనుమానిత రేషన్కార్డుల జాబితా చేరింది. ఇప్పటివరకు జిల్లాలో 1,508 అనుమానిత కార్డులున్నట్లు జాబితా వచ్చింది. వారి తొలగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – వనంతలక్ష్మి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి -
ప్రమోషన్ పత్రాలు అందజేత
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో పలువురు ఉద్యోగులకు ప్రాజెక్ట్ అధి కారి మచ్చగిరి నరేందర్ శనివారం పంప్ ఆపరేటర్ ప్రమోషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు రెట్టింపు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఉద్యోగికి సంస్థ నియమ నిబంధనలకు లోబడి ప్రమోషన్లు అందుతాయని తెలిపారు. ప్రమోషన్ల విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని పే ర్కొన్నారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ వీరన్న, మేనేజ ర్ శంకర్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మా రం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్బా బు, వెల్ఫేర్ అధికారి రజినికుమార్, నాయకు డు పుట్ట అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు ప్రారంభం
ఆసిపాబాద్రూరల్: పదోతరగతి పరీక్షలు శుక్రవా రం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు ప రీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో లలిత తెలి పా రు. జిల్లాలోని 38కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 6,943 మంది విద్యార్థులకు 6,924 మంది హాజరు కాగా, 19మంది గైర్హాజరయ్యారు. 99.72శాతం హా జరు నమోదైంది. పరీక్ష ఉదయం 9.30 ఉండటంతో విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. బందోబస్తు కోసం సెంటర్కు ఇద్దరు పోలీ స్ సిబ్బందిని కేటాయించారు. జిల్లాలోని పలు కేంద్రాలను కలెక్టర్ హరిత, డీఈవో లలిత, అదనపు క లెక్టర్ డేవిడ్, పరీక్షల నిర్వహణాధికారి జనార్దన్ సందర్శించారు. జిల్లా కేంద్రంలోని కేంద్రాలను సీఐ బా లాజీవరప్రసాద్, ఎస్సై కమలాకర్ పరిశీలించారు. రెబ్బెన కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్రెబ్బెన: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించా లని అధికారులను ఆదేశించారు. -
వేసవి వేడి.. ఒంటిపూట బడి
కెరమెరి: మార్చి రెండోవారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. అప్పుడే సూర్యప్రతాపం మొదలైంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎండలకు తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేదు. విద్యుత్ సౌకర్యమున్న పాఠశాలల తరగతి గదుల్లో ఫ్యాన్లు లేవు. దీంతో ఉక్కపోతతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మండుతున్న ఎండల దృష్ట్యా ఈ నెల 16నుంచి ఏప్రిల్ 23వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, పాఠశాల సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ఉదయం 8నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించి అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించింది. పదోతరగతి పరీక్షా కేంద్రాలు కేటాయించిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో 1,273 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలుండగా 92వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. పర్యవేక్షణ తప్పనిసరిఒంటిపూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి గా ఉండాలి. ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు ఎక్కువగా బయట తిరిగితే అ తినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై పడే ప్ర మాదముంది. సరదాగా ఆటపాటల కోసం బయటి కి వెళ్లే పిల్లలు ప్రమాదాలు కొనితెచ్చుకునే ఆస్కారముంటుంది. ఇంటి పరిసరాల్లో చెరువులు, కుంట లు, వ్యవసాయ బావులు, నీటి గుంతలుంటే మరి న్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఈత కోసం వెళ్లి నీటమునిగే ప్రమాదమున్నందున వారిని ఇంటి నుంచి బయటకు వెళ్లనీయరాదు. ఎండ తగ్గాక సా యంత్రం బహిరంగ స్థలాల్లో ఆడుకునేలా చూడాలి. సమయపాలన పాటించాలి ఈ నెల 16నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి. ప్రతి ఒక్కరూ ప్రేయర్కు హాజరుకావాలి. విద్యార్థులు ఎండలకు అస్వస్థతకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా చర్యలు చేపట్టాలి. – లలిత, జిల్లా విద్యాధికారిబడి వేళలు ఇలా.. మొదటిగంట 7.45 రెండో గంట 7.50 ప్రార్థన 7.50 నుంచి 8వరకు మొదటి పీరియడ్ 8నుంచి 8.40.. రెండో పీరియడ్ 8.40 నుంచి 9.20.. మూడో పీరియడ్ 9.35 నుంచి 10.. స్వల్ప విరామం 10నుంచి 10.20.. నాలుగో పీరియడ్ 10.20 నుంచి 11.. ఐదో పీరియడ్ 11నుంచి 11.40.. ఆరో పీరియడ్ 11.40 నుంచి 12.30.. -
ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
వాంకిడి: ఆస్పత్రి ఆవరణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో సీతారాం సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆ స్పత్రిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళి క కార్యక్రమంలో పాల్గొని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఆస్పత్రికి వచ్చేవారికి ఆహ్లాదక ర వాతావరణాన్ని అందించాలని పేర్కొన్నారు. వై ద్యసిబ్బంది విధులను నిర్లక్ష్యం చేయకుండా సమయపాలన పాటించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ మెరుగైన సేవలు అందించా లని సూచించారు. అంతకుముందు ఆస్పత్రిలోని వ్యాక్సిన్ రూమ్, మందుల నిల్వ గది, వార్డులు, ప రిసరాలు పరిశీలించారు. ఇన్ పేషెంట్, అవుట్ పే షెంట్ రికార్డులు, సిబ్బంది రిజిష్టర్లు తనిఖీ చేశారు. ఆయన వెంట మండల వైద్యాధికారి వినయ్ ఉప్రే, ఆరోగ్య విస్తరణాధికారి రవిదాస్, ఎంఎల్హెచ్పీ రియాజ్, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాఠశాల అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్అర్బన్: తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ హామీ ఇచ్చా రు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆకాశ్ను శనివారం పాఠశాల యాజమాన్యం, పూర్వవిద్యార్థులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి శు భాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆకాశ్ మా ట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ హోదాలో సన్మానం పొంద డం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నా రు. పాఠశాలలోని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు బోరు వేయిస్తానని హామీ ఇచ్చా రు. పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలిపితే పరిష్కరిస్తానని చెప్పారు. గతంలో పాఠశాలలో విధులు నిర్వహించి ప్రమోషన్, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు నాగరాణి, ఉమారాణిని ప్రధానోపాధ్యాయురాలు అనిత, ఉపాధ్యాయులు శ్రావణ్, గంగాధర్ శాలువాలతో సన్మానించారు. -
సిలిండర్ల కొరత లేకుండా చూడాలి
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్రావ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావ్, ఇతర అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు. జిల్లాస్థాయిలో ఎల్పీజీ డీలర్లతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతీరోజు సమీక్షించాలన్నారు. మంత్రి నాగేశ్వర్రావ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగా హన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావ్ మాట్లాడుతూ ఎల్పీజీ సిలిండర్లపై పత్రికలు, మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై కలెక్టర్లు వెంటనే స్పందించాలన్నారు. కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ సిలిండర్లు అవసరానికి సరిపడా ఉన్నాయన్నారు. సిలిండర్లు కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రబీ సీజన్లో వరి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు సాగులో ఉన్నాయని, ప్రస్తుతం ప్రాజెక్టుల్లో సాగు, తాగునీటికి సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావ్, నీటిపారుదల శాఖ ఈఈలు గుణవంత్రావ్, ప్రభాకర్, వ్యవసాయ శాఖ అధికారి వెంకటి, పౌరసరఫరాల శాఖ అధికారి వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలిఆసిఫాబాద్అర్బన్: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని, కరీంనగర్లో ని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల రక్తదానం చాలా గొప్పదన్నారు. ప్రాణా పాయ స్థితిలో ఉన్న ఎందరికో ప్రాణాలు నిలబెట్టిన వారవుతారన్నారు. డీఆర్డీఏ దత్తారావ్, డీఎంహెచ్వో సీతారాం, డీపీవో భిక్షపతిగౌడ్ పాల్గొన్నా రు. -
విజయీభవ..
ఆసిఫాబాద్రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లలిత తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని ఆమె సూచించారు. ఏర్పాట్లు పూర్తి..జిల్లాలో నేటి నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణకు 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డీవోలు, 38 మంది సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 2, ఒక్కో బృందానికి ముగ్గురు అధికారులతో పాటు 500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. దీంతో పాటు పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు తావులేకుండా ప్రతీ సెంటర్ను కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈవో, ఎంఈవో, ఒక పోలీస్ సిబ్బంది తనిఖీ చేస్తారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. విద్యార్థులు ఫోన్లు, ఇతర సామగ్రి భద్రపర్చుకోవడానికి పరీక్ష కేంద్రం వద్ద క్లాక్ రూం ఏర్పాటు చేశారు. ఎండల తీవ్ర నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో చల్లటి నీరు. అవసరం ఉన్న చోట టెంట్లు ఏర్పాటు చేశారు జిల్లాలో 38 సెంటర్లు..జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు గానూ 38 సెంటర్ల ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రైవేట్ విద్యార్థుల కోసం 5, రెగ్యులర్ విద్యార్థుల కోసం 33 సెంటర్ల ను ఏర్పాటు చేశారు. కాగజ్నగర్లో 8, ఆసిఫాబాద్లో 5, కెరమెరిలో 2, సిర్పూర్(టి)లో 3, రెబ్బెనలో 3, జైనూర్, వాంకిడి, కౌటాల, దహెగాం, బెజ్జూర్, తిర్యాణి, చింతలమానెపల్లిలో రెండేసిసెంటర్లు, పెంచికల్పేట్లో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. నిర్భయంగా పరీక్ష రాయాలి విద్యార్థులు ఎలాంటి ఒత్తి డి, ఆందోళనకు గురికాకుండా నిర్భయంగా పరీక్ష రా యాలి. భయం లేకుండా ప రీక్షలు రాస్తే మంచి మార్కులు సాధిస్తారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – లలిత, డీఈవో -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎ దుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ సీఎస్సీ సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, హెల్త్కార్డులు ఇ వ్వాలని, జీవో 12 సవరించాలని, సహజ మరణానికి పరిహారం రూ.5 లక్షలకు పెంచా లని, వెల్ఫేర్ బోర్డు నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చే శారు. అనంతరం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సప్త బాలకిషన్, ధర్మాయి రవి, కె.కమలా కర్, రాంచందర్, శంకర్, సదయ్య, నరస య్య, మురళి, బాలాజీ, మోయిన్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ క్రీడాకారిణికి సన్మానం
రెబ్బెన: గత నెల 14 నుంచి 19 వరకు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన వరల్డ్కప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణి దేవల్ల శ్రావణిని శుక్రవారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి సన్మానించారు. శాలువాతో సత్కరించి రూ.5 వేలు బహుమతిగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏరియాకు చెందిన క్రీడాకా రిణి గోలేటిలోనే క్రీడా ఓనమాలు నేర్చుకుని నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాజ మల్లు, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్రావు, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, హరిలాల్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మల్లేశ్, చందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి
కాగజ్నగర్టౌన్: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ శాస్త్రవేత్త భాస్కర్రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ఏకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వా డకం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయన్నారు. మార్కెట్కు వెళ్లే ప్రతిఒక్కరూ గుడ్డ సంచులు తీసుకెళ్లాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో వి ద్యార్థుల పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు దేవేందర్రెడ్డి, నర్సింగరావు, మల్లికార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు. -
డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఉండాలి
కౌటాల: డిజిటల్ చెల్లింపులపై ప్రజలకు అవగాహన ఉండాలని టీజీబీ ఆర్ఎం ప్రశాంత్ బాలచంద్ర అన్నారు. కౌటాల రైతు వేదికలో గురువారం సురక్షిత డిజిటల్ చెల్లింపులపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీల పై అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు సేవల ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రుణా లు తీసుకుని, సకాలంలో చెల్లించాలని సూ చించారు. బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఫోన్లు చేసి ఓటీపీలు అడగరని తెలిపా రు. బీమా పథకాలను సద్వినియోగం చేసుకో వాలన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు బీమా చెక్కులు అందించారు. కార్యక్రమంలో బిజినెస్ చీఫ్ మేనేజర్ రవి కిశోర్, సంధ్య, బ్యాంకు మేనేజర్ రమేశ్, శ్రీనివాస్, ఏపీఎం వినేశ్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆశ’ల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి
ఆసిఫాబాద్అర్బన్: రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆశవర్కర్ల సమస్యలు లేవనెత్తాలని గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో సు మారు 28 వేల మంది ఆశవర్కర్లు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వేతనాలు పెంచుతా మని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఆశవర్కర్లకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, ఎన్హెచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు స్వరూప, అనిత, నవీన, లక్ష్మి, నిర్మల, రేణుక, చంద్రకళ, అరుణ, కళావతి, లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు. -
జీపీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
కాగజ్నగర్టౌన్: పంచాయతీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాల ని, వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో పట్ట ణంలోని ఎమ్మెల్యే హరీశ్బాబు నివాసంలో వినతిపత్రం అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్ మాట్లాడుతూ మార్చి 2న ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవా లని డిమాండ్ చేశారు. పంచాయతీల నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ చానల్ ద్వారా 1వ తేదీన వేతనాలు చెల్లించా లన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీవో నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, వసంత్ బాలాజీ, రమేశ్, జానమ్మ, ప్రమీళ, వంశీ, ఆకాశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతోనే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్లు మెంగ్రె ఆకాశ్, షాహిన్ సుల్తానాతో కలిసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచులు, కౌన్సిలర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులతో తమ పరిధిలోని పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటికి ప్రాధాన్య త ఇవ్వాలన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రణాళికలు రూపొందించాలని, భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, నీటి పొదుపు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్ర త, మహిళల ఆరోగ్యం, సురక్షిత ప్రయాణం, సంక్షేమ పథకాల అమలు, చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల కట్టడి, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, పాఠశాలల్లో వసతుల కల్పన, యువజన క్రీడలు, సేవలు, మహిళల సంక్షేమం, పర్యావరణ రక్షణ వంటి పది అంశాలపై ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందాలిఅన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. విద్యాలయాలను ఏకీకృతం చేసేందుకు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ముందుగా ప్రాధాన్యత గల పనులు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతీ ఇంటికి నీటిని సరఫరా చేయాలని సూచించారు. కాగా, ఉదయం ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం మహిళల సంక్షేమం, బాల్య వివాహాల నిషేధం, మహిళల ఆరోగ్యం, మహిళా సాధికారత, పేదరిక నిర్మూల న, ఉపాధి కల్పన, అందరికీ విద్య, ఇతర శాఖల సంబంధిత కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సందేహాల ను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీటీడీవో రమాదేవి, డీఎంహెచ్వో సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. పగలు వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. ల్యాప్టాప్ కష్టాలు బాసర ట్రిపుల్ ఐటీలో మూడు వేల మందికి ఇప్పటివరకు ల్యాప్టాప్లు అందించలేదు. ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 8లోu శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026 -
పశువులకు టీకా అభయం
కౌటాల: జిల్లాలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 9 వరకు నెల రోజుల పాటు పశువులకు టీకాలు వేయనున్నారు. వేసవి నేపథ్యంలో ఉద యం 6 గంటల నుంచి చల్లదనాన్ని బట్టి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తున్నారు. పాడిరైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఇవే.. సాధారణంగా గాలికుంటు వ్యాధి సోకిన గేదెలు, ఆవులు 24 గంటలోపు బక్కచిక్కి అల్సర్ బారిన పడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులు, కాలి గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి మూగజీవాలు చనిపోయే ప్రమాదం ఉటుంది. వైద్యుల సూచనల మేరకు వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల వద్ద ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్, నార్మల్ సైలెన్ వాటర్తో శుభ్రం చేయాలి. మరోసారి ఇన్ఫెక్షన్ బారినపడకుండా యాంటీ బయాటిక్స్, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులను వాడాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన పశువులను ఇతర వాటితో కలిసి ఒకేచోట ఉంచొద్దు. అలాగే ఎప్పటికప్పుడు కొట్టాన్ని శుభ్రం ఉంచాలి. వారానికి ఒకసారి సున్నం చల్లి, క్రిమికీటకాల నివారణకు చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతే వినియోగించాలి. వ్యాధి సోకిన పశువు చనిపోతే తప్పనిసరిగా బ్లీచింగ్ పౌడర్ చల్లి గోతిలో పాతిపెట్టాలి. సద్వినియోగం చేసుకోవాలి రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. మంగళవారం నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రారంభించాం. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 9 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు అందిస్తాం. టీకాలు వేయించడం ద్వారా మూగజీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పశు పోషకులు ఈ అవకాశాన్ని స్వదినియోగం చేసుకోవాలి. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా సిబ్బందికి సమాచారం అందించాలి. – సురేశ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఏటా రెండుసార్లుగాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టీకాలు వేయించాలి. ప్రాణాంతకమైన వ్యాధి కావడంతో చిన్నపాటి అలసత్వం చేసినా మూగజీవాలు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమతో ఉపాధి పొందుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేస్తున్నాయి. జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 19 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. ఏడు సబ్ సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలో ఆవులు, గేదెలు కలిపి 3,39,200 వరకు ఉన్నాయి. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సిబ్బంది టీకాలు వేస్తున్నారు. పశువులను ఇంటి వద్ద ఉంచి టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
సౌకర్యాల లేమి!
ఉపాధిహామీ.. తిర్యాణి: ఉపాధిహామీ పథకంలో నూతనంగా అమలు చేస్తున్న నిబంధనలు కూలీలకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. పారదర్శకత కోసం తీసుకువచ్చిన మార్పులతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుకు రెండుసార్లు హాజరు వేయాల్సి రావడంతో కూలీలు ఎక్కువ సమయం పని ప్రదేశంలో గడుపుతున్నారు. ఎండలు పెరిగినా అధికారులు మాత్రం వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. తాగేందుకు నీళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు. 1,61,268 మంది కూలీలుదారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కనీస ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో 2005లో ప్రత్యేక చట్టం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి శ్రీకారం చుట్టారు. పథకం ప్రారంభమైన నాలుగేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాఫ్ట్వేర్తో నిర్వహించారు. 2022 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన కేంద్ర ప్రభుత్వం పథకం పేరును వీబీ జీ రామ్జీగా మార్చి నూతన నిబంధనలు అమలు చేస్తోంది. గతంలో ఉన్న వందరోజుల పనిదినాలను సైతం 125 రోజులకు పెంచారు. జిల్లాలో 88,721 యాక్టీవ్ జాబ్ కార్డులు ఉండగా అందులో 1,61,268 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ దాదాపు 15 వేల మందికి పైగా కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. వేసవి భత్యం బంద్పాత సాఫ్ట్వేర్ అమలు చేసిన సమయంలో కూలీల కు వేసవి భత్యం అందేది. ఫిబ్రవరి నుంచి జూన్ వ రకు వేతనంతోపాటు 20 శాతం నుంచి 35 శాతం వరకు అదనంగా చెల్లించేవారు. అలాగే పని ప్రదే శం గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల కంటే దూరంగా ఉంటే కిలోమీటర్కు కొంత జమ చేసేవారు. పార, గడ్డపార వినియోగించినందుకు కూలీకు అదనపు భత్యం అందించేవారు. గతంలో గడ్డపారలు సైతం ప్రభుత్వమే కూలీలకు ఉచితంగా సరఫరా చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చెల్లింపులు చేపట్టడం లేదు. వేతనం గిట్టుబాటు కాక ఉపాధి పనులపై కూలీలు అనాసక్తి చూపుతున్నారు.పని ప్రదేశంలోనే అధిక సమయంవారం రోజులుగా ఎండలు పెరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరువగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతా పం చూపిస్తున్నాడు. గురువారం రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత జిల్లానే నమోదైంది. ఉపాధి కూలీలు పనులు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారదర్శకత కోసం ఆన్లైన్ ద్వారా కూలీల ఫొటోలు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు కేవలం రోజుకు ఒక్కసారి ఫొటో తీసి అప్లోడ్ చేసేవారు. ప్రస్తుతం రోజుకు రెండుసార్లు ఫొటో తీస్తున్నారు. మొదటి ఫొటో తీసి అప్లోడ్ చేసిన నాలుగు గంటల తర్వాత మరో ఫొటో తీయాల్సి ఉంటుంది. దాదాపు నాలుగు గంటలకుపైగా పని ప్రదేశంలో కచ్చితంగా ఉంటున్నారు. పనిప్రదేశంలో మౌలిక సౌక్యరాల కల్పనకు ఆయా పంచాయతీలకు ఒక్కో కూలీ రూ.2.50 చొప్పున అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ పని ప్రదేశాల్లో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్, తాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో కూలీలు ఎండలోనే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచే తాగునీటిని తెచ్చుకుంటున్నారు. -
ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు
తిర్యాణి: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందించారు. ఆయన మాట్లాడుతూ విద్యతోనే జీవితంలో ముందుకెళ్లవచ్చన్నారు. ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, దానిని సాధించేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురికావొద్దన్నారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ధరల పెంపుపై నిరసన
ఆసిఫాబాద్అర్బన్: గృహ వినియోగం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బుధవారం సీపీఎం నాయకులు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో యుద్ధ సమయంలో ధరలు పెంచిందని మండిపడ్డారు. అమెరికా మెప్పు కోసం మిత్ర దే శాలతో శతృత్వం పెంచుకోవడం సరికాదన్నా రు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజల కో సం గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, టీకానంద్, నాయకులు నిఖిల్, రాజ్కుమార్, పవన్, మహిళలు పాల్గొన్నారు. -
వర్క్షాప్ మూసివేసే చర్యలు మానుకోవాలి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని మాదారం, గోలేటి భూగర్భ గనులు, ఉపరితల గనులకు అనేక రకాలుగా ఉపయోగపడిన వర్క్షాప్ను మూసివేసే చర్యలను వెంటనే మానుకోవాలని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు డిమాండ్ చేశారు. వర్క్షాప్ డీజీఎం జ్ఞానేశ్వర్ను బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏరియా వర్క్షాప్ను మూసివేసే దిశగా సూపర్వైజర్లు, టెక్నీషన్లను యాజమాన్యం ఖైరిగూర ఓసీపీకి బదిలీ చేస్తే అడ్డుకోవాల్సిన ఏఐటీయూసీ నాయకత్వం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. సేఫ్టీ, మైన్స్, జీఎం కమిటీల్లో ఐఈడీ ప్రకారం ఏరియా వర్క్షాప్లో సూపర్వైజర్లు, టెక్నీషన్లు తక్కువగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏరియా ఆర్గనైజర్ ఎస్కే ఇనూస్, ఆర్గనైజర్లు రాజశేఖర్, సంతోష్, శేఖర్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పోలీసు, రెవెన్యూ, ఎస్సీ సంక్షేమ, శిశు సంక్షేమ, డీవీఎంసీ సభ్యులతో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బాధిత కుటుంబాలకు వేగంగా న్యాయం జరగాలన్నారు. 2025లో 31 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, 2026లో ఇప్పటివరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 3, కాగజ్నగర్ సబ్ డివిజన్ పరిధిలో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆయా కేసులు త్వరగా విచారించి నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతినెలా 30న ప్రతీ మండలంలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ అధికారి అశోక్, డీఆర్డీవో దత్తారావు, సీఐ బాలాజీ వరప్రసాద్, డీవీఎంసీ సభ్యులు కేశవ్రావు, సిడాం అర్జు, గుంగుబాయి, అశోక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సదరం శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న శిబిరాన్ని బుధవారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు తాగునీరు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఎం పెన్షన్ విభాగం రామకృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
లింగాపూర్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, కంచన్పల్లి ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్సై గంగన్న, కేజీబీవీ ఎస్వో మీనా కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ప్రశాంతంగా పరీక్షలు రాయాలి రెబ్బెన: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వార్షిక పరీక్షలు రాయాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యార్థులకు బుధవారం పరీక్ష సామగ్రి అందించారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతి తర్వాత ఐదేళ్ల కెరీర్ను ఈ పరీక్షలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. పదో తరగతిలో సాధించే మార్కులపై ఉన్నత చదువులు ఆధారపడతాయని వివరించారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, గురుకుల ప్రిన్సిపాల్ చైతన్య, సీఆర్పీ మిట్ట దేవేందర్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి వాంకిడి: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్లో బుధవారం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై సూచనలు చేశారు. 400 మందికి పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్, ఎంఈవో శివచరణ్, హెచ్ఎం నటరాజ్ పాల్గొన్నారు.పరీక్ష సామగ్రి పంపిణీకెరమెరి: మండలంలోని మోడి కేజీబీవీలో బుధవారం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏఎస్పీ చిత్తరంజన్ 250 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు, పెన్నులు అందించారు. అలాగే జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 450, సిర్పూర్(యు) పరిధిలో 70 మంది విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై ఎన్.మధుకర్, సర్పంచ్ ఆత్రం లక్ష్మణ్, హెచ్ఎం ప్రేందాస్, కేజీబీవీ ఎస్వో ప్రవీణ పాల్గొన్నారు. -
● పెరిగిన వంట నూనె, ఎల్పీజీ గ్యాస్ ధరలు ● జిల్లాలో రూ.982కు చేరిన గృహావసరాల సిలిండర్ ● పేద, మధ్య తరగతి ప్రజలపై భారం
ఆసిఫాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం నేరుగా వంటింటిపై పడుతోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో వంట నూనెలతోపాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. మరోవైపు బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు 25 రోజుల ఇంటర్ బుకింగ్ పీరియడ్ నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీంతో 25 రోజుల వరకు రెండో సిలిండర్ బుక్ చేసుకునేందుకు వీలుండదు. వాణిజ్య సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గ్యాస్ ఏజెన్సీల నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లోని హోటళ్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన వంటనూనెలు తాజాగా వంట నూనెల ధరలు పెరగడం భారంగా మారింది. ముఖ్యంగా సన్ఫ్లవర్, పామాయిల్ రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచే సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో వంటనూనెలు లీటర్కు రూ.5 వరకు పెరిగాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత భారమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ప్రముఖ బ్రాండ్ల వంట నూనెలు లీటర్కు రూ.161 నుంచి రూ.167 వరకు పెరిగాయి. జిల్లాలో అధిక శాతం ఆదివాసీ, చిన్న రైతు కూలీ కుటుంబాలు ఉండటంతో వారికి రేట్లు భారంగా మారాయి. ఎల్పీజీ రేట్లు ౖపైపెకి జిల్లాలో గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.60 పెరిగి రూ.982కు చేరింది. అలాగే కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.115 పెరిగి రూ.2,144కు చేరింది. జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, సుమారు.1,40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 28 వేలు డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేలకు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్ కనెక్షన్లు, 600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.1.30 కోట్ల వంట గ్యాస్ భారం పడనుండగా, అలాగే వంటనూనె ధరలతో సుమారు రూ.80 లక్షల భారం పడనుంది.నిలకడ లేని ధరలుగతంలో గ్యాస్ ధరలు ఏళ్లపాటు నిలకడగా ఉండేవి. రెండేళ్లుగా గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. నాలుగేళ్ల్ల క్రితం 2022 మార్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండడర్ ధర రూ.875 ఉండగా, 2023 జనవరిలో రూ.976కు పెరిగింది. ఏప్రిల్లో సిలిండర్పై రూ.50 పెంచడంతో రూ.1019 చేరింది. జూన్లో మళ్లీ సిలిండర్పై రూ.50 పెంచడంతో రూ.1072 చేరింది. గత ఆగస్టు వరకు వంటగ్యాస్ రూ.1172 చేరగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై రూ.200 తగ్గించింది. 2024 మార్చిలో సిలిండర్పై మళ్లీ రూ.100 తగ్గించింది. గతేడాది కేంద్రం సిలిండర్పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్ ధర రూ.922కు చేరింది. తాజాగా రూ.60 పెరగడంతో రూ.982కు చేరింది.ఆర్థికంగా భారంపెరిగిన వంటగ్యాస్ ధర సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భా రమవుతుంది. వంటగ్యాస్తో పాటు వంటనూనెల ధరలు పెరిగాయి. బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం రేట్లు అదుపులో ఉంచాలి. – మౌనిక, గృహిణి, ఆసిఫాబాద్ ధరలు నియంత్రించాలిప్రభుత్వం నిత్యావసర వస్తువులు, గ్యాస్, వంటనూనె ధరలను నియంత్రించాలి. పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. పట్టణ ప్రాంతాల్లోని పేదలను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కమల, కూలీ, ఆసిఫాబాద్ -
కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి
పెంచికల్పేట్: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో గ్రా మాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ గుర్తింపును ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా సముద్రాల రాజన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రం అందించి శాలు వాతో సన్మానించారు. పెంచికల్పేట్ సర్పంచ్ షేక్ ఉస్మాన్, నాయకులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో చదివితే మెరుగైన భవిష్యత్తు
ఆసిఫాబాద్రూరల్: క్రమశిక్షణతో చదివితే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని డీఈవో లలిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన పదో తరగతి వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ చిత్తరంజన్ విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, సీఐ బాలాజీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
28న జాతీయ లోక్ అదాలత్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఏ.వీరయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసు, అటవీ, ఎకై ్సజ్ శాఖ అధికారులతో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి మాట్లాడుతూ లోక్అదాలత్లో రాజీమార్గం ద్వారా క్రిమినల్, సివిల్, ప్రీలిటిటేషన్, భూతగాదాలు, వివిధ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శిక్షణ
కాగజ్నగర్టౌన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా టైలరింగ్, కంప్యూటర్ శిక్షణలు అందిస్తున్నామని జీఎం హెచ్ఆర్ ఎంఎస్ గిరి తెలిపారు. పట్టణంలోని హెచ్ఆర్డీ హాల్లో టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ పొందిన 214 మంది యువతీ యువకులకు బుధవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ స్థానిక యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో మిల్లు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై పోరాటం
కాగజ్నగర్టౌన్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో బుధవారం జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉందని తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తలండి మధుకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుడుమెత శ్రీని వాస్, ప్రధాన కార్యదర్శి మండాది దేవ్రావు, కోశాధికారి ఆలం సందీప్, ఉపాధ్యక్షుడు కేశవులు, నా యకులు భిక్షపతి, లాలయ్య, పాపయ్య, వెంకటేశ్, కిష్టయ్య, నందక్క, శ్రీరంగం పాల్గొన్నారు. ప్రమోషన్లు కల్పించాలని ధర్నారెబ్బెన: పంప్ ఆపరేటర్లకు ప్రమోషన్లు కల్పించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రమోషన్ల విషయంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ఏడు నెలలుగా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. మైన్స్, స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి స్పందన లేదన్నారు. అర్హులకు ప్రమోషన్ ఆర్డర్లు ఇవ్వని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, జీఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యులు శేషశయనరావు, జూపాక రాజేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కిరణ్బాబు, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, నాయకులు అంజయ్య, నరేశ్, గణేష్, రారాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
Iవాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. జీవితానికి ‘పొగ’ పెట్టొద్దు! ధూమపానం శ్వాసకోశ, గుండెపోటు, నోటి క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. నేడు ‘జాతీయ ధూమపాన నిరోధక దినోత్సవం’ సందర్భంగా కథనం. IIలోu బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026 -
ఖర్జెల్లి.. కలప పక్కదారి..!
గత నెలలో ఖర్జెల్లి రేంజ్లోని అంబగట్ట గ్రామంలో నిల్వ ఉంచిన కర్రను డిప్యూటీ రేంజ్ అధికారి, ఆమె భర్త అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదైంది. అనంతరం విచారణ చేపట్టారు.తాజాగా ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని కోయపల్లి సమీపంలో పంగోలిన్ అనే అరుదైన రెండు వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తూ బెజ్జూర్ రేంజ్ అటవీ అధికారులకు పట్టుబడ్డారు. ఖర్జెల్లి రేంజ్లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. చింతలమానెపల్లి: తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరిహద్దులోని ప్రాణహిత నదిని ఆనుకుని ఉన్న జిల్లా కీలకమైన ఖర్జెల్లి అటవీ రేంజ్ అక్రమాలకు నిలయంగా మారుతోంది. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి విలువైన కలప తరలిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యాయి. మరోవైపు సంరక్షకులుగా నిలవాల్సిన అధికారులపై ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ మండలాల్లో విస్తరించి ఉన్న ఖర్జెల్లి రేంజ్ పరిధిలో 6 సెక్షన్లు, 18 బీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 18 బీట్లకు ఐదుగురు బీట్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. చింతలమానెపల్లి మండలంలోని సుమారు 20కిలోమీటర్ల అంతర్రాష్ట్ర రహదారి ఈ అటవీ ప్రాంతంలోనే ఉంది. విస్తారమైన టేకు చెట్లుఖర్జెల్లి రేంజ్ అటవీ పరిధిలో భారీస్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ టేకు చెట్లు విస్తారంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. కాటేపల్లి, గూడెం, దిందా గ్రామాలను కేంద్రంగా చేసుకుని గతంలో భారీ ఎత్తున కలప తరలిపోయింది. కానీ నమోదైన కేసులు మాత్రం నామమాత్రమే. ఇటీవల నమోదైన రెండు ఘటనల్లో రేంజ్ అధికారుల వైఫల్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అంబగట్ట ఘటనలో టేకు దుంగలను స్థానికులు పట్టుకోగా.. పంగోలిన్ వన్యప్రాణిని బెజ్జూర్ అటవీ రేంజ్ సిబ్బంది పట్టుకోవడం గమనార్హం. అధికారులపైనే ఆరోపణలు..!ఖర్జెల్లి రేంజ్లో విధుల్లో ఉండే అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అ డవుల అభివృద్ధికి పదుల సంఖ్యలో ఉద్యోగులు వి ధుల్లో ఉన్నా.. రూ.కోట్లు వెచ్చిస్తున్నా తీరుమారడం లేదు. గతంలో ఇక్కడ పని చేసిన ఒక డిప్యూటీ రేంజ్ అధికారి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జిల్లాస్థాయిలో విచారణ నిర్వహించా రు. సదరు అధికారి ఒక ప్రాంతంలో కలపను నిల్వ ఉంచి తరలించినట్లు ఆరోపణలు వచ్చినా విచారణ మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. ఒక నర్సరీలో చేపట్టిన మొక్కల పెంపకంలో సదరు అధికారి తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గోప్యంగా వివరాలు సేకరించారు. అధికారి బదిలీతో అన్నీ మరుగున పడ్డాయి. కబ్జాదారుల నుంచి మామూళ్లు తీసుకుని అటవీ భూముల ఆక్రమణకు సహకరించారని పలువురు అధికారులపైనా ఆరోపణలు వచ్చాయి. కాటెపల్లి, గూడెం, దిందా, గంగాపూర్, బూరెపల్లి బీట్లలో పనిచేసే అధికా రులపై పలుమార్లు విచారణలు జరిగాయి. అంబగట్ట గ్రామంలో నిల్వ ఉంచిన కర్రను తరలించేందు కు ప్రయత్నించిన డిప్యూటీ రేంజ్ అధికారిపై శా ఖాపరమైన చర్యలు సైతం తీసుకున్నారు. చెట్లు న ష్టపోయిన సందర్భాల్లో బీట్ అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకున్నారు. వారి వేతనాల నుంచి రికవరీ విధించారు.స్మగ్లింగ్కు రహదారిఖర్జెల్లి రేంజ్ మహారాష్ట్రలోని ఆళ్లపల్లి డివిజన్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్లకు మధ్యలో ఉంది. గతంలో ఈ మార్గంలో అక్రమంగా భారీ స్థాయిలో కలపను తరలించగా మహారాష్ట్ర అధికారులు కాగజ్నగర్ డివిజన్లో పలు కేసులు నమోదు చేశారు. తాజాగా పంగోలిన్ అనే అరుదైన వ న్యప్రాణులను తరలిస్తుండగా అటవీ సిబ్బంది పట్టుకున్నారు. మహారాష్ట్రలోని అడవుల నుంచి కాగజ్నగర్ మీదుగా, బెజ్జూర్ మండలం మీదుగా వన్యప్రాణులు, కర్రను స్మగ్లింగ్ చేయడానికి స్మగ్లర్లు రేంజ్లోని మార్గాలను వినియోగించుకుంటున్నారు. రేంజ్కు ప్రాణ హిత నది సరిహద్దుగా ఉండగా ఈ మార్గంలో గూడెం వద్ద మాత్రమే వంతెన ఉంది. పటిష్టంగా నిఘా ఖర్జెల్లి రేంజ్లో స్మగ్లింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది నిర్లక్ష్యం ఉన్న సందర్భాల్లో రికవరీ చేపట్టడం సాధారణం. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా యూనియన్ నాయకుడిగా అండగా ఉంటున్నా. అంబగట్ట ఘటనలో కేవలం రూ.47వేల విలువైన కర్రను మాత్రమే సదరు డీఆర్వో తరలించారు. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదు. అంత పెద్ద అడవిలో ఇలాంటి చిన్న ఘటనలు జరగడం సాధారణం. – సుభాష్, ఖర్జెల్లి రేంజ్ అటవీ అధికారి -
ఆరోగ్యకరమైన భారత్ లక్ష్యంగా బైక్ యాత్ర
వాంకిడి: ఆరోగ్యకరమైన భారత్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా బైక్ యాత్ర చేపట్టినట్లు ‘మిషన్ హెల్తీ భారత్’స్థాపకురాలు తాప్సీ ఉపాధ్యాయ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి చేపట్టిన యాత్ర మంగళవారం వాంకిడి చేరుకోగా బీజేవైయం రాష్ట్ర అధికార ప్రతినిధి యెలగతి సుచిత్ ఆధ్వర్యంలో నేతలు ఘన స్వాగతం పలికారు. స్థానిక కేజీబీవీలో జీవనశైలి సంబంధిత వ్యాధులు, యువతలో పెరుగుతున్న స్థూలకాయంపై అవగాహన కల్పించారు. ఫిట్నెస్, సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు తదితర అంశాలను వివరించారు. అనంతరం ‘మన లక్ష్యం ఆరోగ్యకరమైన భారత్’ ప్రతిజ్ఞ చేయించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో బైక్ యాత్ర నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విశాల్, వికాస్, వానేశ్, స్వరాజ్, కుందన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
పెంచికల్పేట్: నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులు గ్రామ పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. మండలంలోని ఎల్కపల్లి రైతు వేదికలో వార్డు సభ్యుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరై సర్టిఫికెట్లు అందించారు. డీపీవో మాట్లాడుతూ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు, వీధిదీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరాతోపాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. అంతకు ముందు దరోగపల్లి, చేడ్వాయి, బొంబాయిగూడ, ఎల్కపల్లి గ్రామాలను సందర్శించి కార్యదర్శులకు సూచనలు చేశారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎల్పీవో హరిప్రసాద్, ఎంపీడీవో అల్బర్ట్, ఎంపీవో మహేందర్ రెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
‘తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’
రెబ్బెన: మెడికల్ బోర్డు విషయంలో తప్పుడు ప్రచారాన్ని కార్మికులు నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. గోలేటి టౌన్షిప్లో మంగళవారం ఐఎన్టీయూసీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మెడికల్ అధికారిపై అవినీతి కేసుల కారణంగా మెడికల్ బోర్డు నిర్వహణలో ఆలస్యం జరిగింద ని, త్వరలోనే బోర్డును పునఃప్రారంభిస్తారని తెలిపా రు. పెర్క్స్పై ఆదాయపు పన్ను మాఫీ, సొంతింటి పథకం అమలు, మెడికల్ బోర్డు పునరుద్ధరణ వంటి కీలక అంశాలను ఐఎన్టీయూసీ నిరంతరం ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తుందన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండేళ్లయినా కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఏఐటీయూసీ రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని ఆరోపించారు. సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ధర్మపురి, సమ్మయ్య, శంకర్రావు, జనరల్ సెక్రెటరీ లు వికాస్కుమార్, వైస్ ప్రెసిడెంట్లు వడ్డెపలి దాస్, సదానందం, యూత్ ప్రెసిడెంట్ రాజు, ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ప్రకాశ్రావు, నాయకులు శ్రీనివాస్, అంబేడ్కర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడోసారి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తిలో శరవేగంగా ముందుకు సాగుతోంది. గడిచిన రెండు సంవత్సరాలుగా వందశాతం వార్షిక ఉత్పత్తి సాధించగా.. ఈసారి సైతం నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందు కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అధిక వర్షాలు, పావురాల గుట్ట వద్ద రోడ్డు దెబ్బతిని బొగ్గు ర వాణా ఆటంకాలు, అనేక సవాళ్లు ఎదురైనా అధి కారులు ముందస్తు ప్రణాళికలతో ఏరియాను ఉత్పత్తిలో ముందంజలో నిలిపారు. ఫిబ్రవరి నాటికి 99 శాతం సాధించారు. ప్రారంభ రెండు నెలల్లో నిరాశపూరిత ఉత్పత్తి కనిపించింది. ఆ వెంటనే వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో నెలలో 20 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. అయినా అధికారులు, ఉద్యోగులు మొక్కవోని దీక్ష ఉత్పత్తిని పరుగులు పెట్టించారు. ముందస్తు ప్రణాళికలతో..ఈ ఏడాది బెల్లంపల్లి ఏరియాను అధిక వర్షాలు అతలాకుతలం చేశాయి. గతేడాది వర్షాకాలంలో కేవలం 1200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 2099 మి.మీ.లుగా నమోదైంది. వర్షాల ప్రభావం ఏరియాలోని ఏకై క ఓసీపీ ఖైరిగూరపై పడింది. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి కురిసిన వర్షాలతో ఆగస్టు, సెప్టెంబర్లో కేవలం ఒక నెల టార్గెట్ చేరుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే బొగ్గు ఉత్పత్తిని చేపట్టేందుకు ఏరియా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా పంపులను సిద్ధం చేసుకున్నారు. అదనపు మోటార్లు, హైకెపాసిటీ మోటార్లను ఏర్పాటు చేసి ఓసీపీ క్వారీ లోపలికి వచ్చే వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడారు. దీంతో వర్షాకాలంలోనూ కొంతమేర ఉత్పత్తి సాధ్యమైంది. అక్టోబర్ నుంచి మరింత వేగం పెంచారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా ఓబీ మట్టి వెలికితీత పనులపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ముందస్తుగా కోల్బెంచ్లు సిద్ధంగా ఉండాలి. కోల్బెంచ్లపై ఉన్న ఓబీని వెలికితీసే బాధ్యత కాంట్రాక్టర్పై ఉంటుంది. అయితే స్థానిక ఓబీ కాంట్రాక్టర్ సైతం బెల్లంపల్లి ఏరియా అధికారులకు పూర్తి సహకరించి పనులు చేపట్టారు. రోజువారీ ఓబీ ఉత్పత్తిని వందశాతానికి మించి వెలికితీయడంతో అక్టోబర్ నుంచి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఉరకలు వేసింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతినెలా నెలవారీ ఉత్పత్తి టార్గెట్ను వందశాతానికి మించి చేపట్టింది. లక్ష్య సాధన వైపు అడుగులుబెల్లంపల్లి ఏరియా ఒకప్పుడు భూగర్భ గనులు, ఓసీపీలతో కళకళలాడింది. కాలక్రమేణా భూగర్భ గనులు, ఓసీపీలు మూసివేతకు గురికాగా ఖైరిగూర ఓసీపీ ఒక్కటే జీవనాడిగా మారింది. గోలేటి ఓసీపీ కోసం ఏరియా అధికారులు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితం లేకుండా పోయింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి గోలేటి ఓసీపీలో ఉ త్పత్తి ప్రారంభమవుతుందని, ప్రస్తుత ఓసీపీకి అతి తక్కువ టార్గెట్ కూడా విధించారు. అయితే ఓసీపీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు రాకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. గతేడాది ఏరియా వార్షిక ఉత్పత్తిలో 97 అని రికా ర్డుకు చూపిస్తున్నా గోలేటి ఓసీపీ ఉత్పత్తి టార్గెట్ను మినహాయిస్తే ఏరియా వందశాతం సాధించింది. 2023– 24 ఆర్థిక సంవత్సరంలోనూ ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఫిబ్రవరి వరకు ఏరియా 99 శాతం వార్షిక ఉత్పత్తిని సాధించగా.. మార్చి నెలాఖరులోపే వందశాతం సాధించనుంది. ఈ ఆ ర్థిక సంవత్సరంలో ఏరియాకు 31.5లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఫిబ్రవరి నెల వరకు 31.06 టన్నులతో 99 శాతం ఉత్పత్తి పూర్తయ్యింది. వార్షిక లక్ష్య సాధనకు కేవలం 43,982 టన్నులు మాత్రమే సాధిస్తే సరిపోతుంది. దానికి ఏరియాకు దాదాపు 20 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 నుంచి 12 వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. దీంతో వరుసగా మూడో సంవత్సరం సైతం ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించనుంది. చిన్న ఏరియా అయినా ఇక్కడి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ఏరియా ఉత్పత్తిలో దూసుకుపోతూ సింగరేణి సంస్థకు లాభాలను తెచ్చిపెడుతోంది. గడువుకు ముందే సాధిస్తాం బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందు సాధించబోతున్నాం. ఈసారి అధిక వర్షపాతం నమోదైనా ముందస్తు ప్రణాళికలను అమలు చేయడంతో వార్షిక టార్గెట్ను వందశాతం సాధించనున్నాం. పావురాల గుట్ట వద్ద రోడ్డు దెబ్బతిని 25 రోజులపాటు రవాణా నిలిచిపోయినా ఆ ప్రభావం టార్గెట్పై పడకుండా చూసుకున్నాం. – విజయ భాస్కర్రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం -
డీఈవోగా లలిత
ఆసిఫాబాద్రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)గా లలిత మంగళవారం జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి డీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి బదిలీ కావడంతో మరో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో ఏడీగా పనిచేస్తున్న లలితను జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ కె.హరితను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. డీఈవో కార్యాలయ సిబ్బంది నూతన డీఈవోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, ఎస్వోలు శ్రీనివాస్, దేవాజీ, లతీఫ్, వరప్రసాద్, జనార్దన్, రాము తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రలను గౌరవించే సమాజంలోనే అభివృద్ధి
ఆసిఫాబాద్: సీ్త్రలు లేనిదే సృష్టి లేదని, సీ్త్రలను గౌరవించే సమాజంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవా రం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకు ల మంగ, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి వని తలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతీ మహిళ జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న వారేనని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ దేశానికి సేవలందించిన మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తు న్న పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలుఅంర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిని నృత్య నిలయం మంచిర్యాల విద్యార్థినులు చేసిన సంప్రదాయ నృత్యం, సన్నీ సెల్స్ డిఫెన్స్ అకాడమీ చిన్నపిల్లలు చేసిన కరాటే వి న్యాసాలు అందరినీ అకట్టుకున్నాయి. క్యాంపెయి న్పై కలెక్టర్, ఎమ్మెల్యే సంతకాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్, జీసీడీవో శకుంతల, జిల్లా సాధికారత సభ్యులు శారద, రాణి, రాజేశ్వర్, మమత, అధికారులు పాల్గొన్నారు. -
కుష్ఠు లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
వాంకిడి: కుష్ఠు లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని డీఎంహెచ్వో సీతారాం అన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఖమాన, ఖిరిడి గ్రామాల్లో కుష్ఠు, బోదకాలు వ్యాధులపై కళాజాత నిర్వహించా రు. ఆటపాటలతో ప్రజలకు అవగాహన క ల్పించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ శరీరంపై రాగి రంగు స్పర్శ లేని మచ్చలు ఉంటే ఆస్పత్రిలో చూపించుకుని వైద్యుడి సలహాలు తీసుకోవాలన్నారు. కుష్ఠు లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యానికి దారి తీస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి ఉచితంగా మందులు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఎన్ఎల్ఈపీ ఆఫీసర్ వినయ్ ఉప్రె, డీఈఎంవో మార్తా, డీఎస్వో రమేశ్ చంద్ర, సమన్వయకర్త శ్యాంలాల్, ఆరోగ్య విస్తరణ అధికారి రవిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రనిధి ఏజెంట్ చేతివాటం
● రూ.7 లక్షలు సొంతానికి వాడుకున్న వైనం సాత్నాల: భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న రాయిడి స్వప్న సీ్త్రనిధి సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు సొంతానికి వాడుకోవడం కలకలం రేపింది. ఎస్సై పవర్ గౌతమ్ కథనం మేరకు గ్రామానికి చెందిన వీవోఏ రాయుడి స్వప్న సీ్త్రనిధి స్వయం సహాయక సంఘాలకు ఏజెంట్గా పనిచేస్తుంది. 2022 నుంచి 10 సంఘాలు, 54 మంది సభ్యులు శ్రీనిధి రుణాలు తీసుకున్నారు. సదరు మహిళల వద్ద నుంచి ప్రతీనెల డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టినట్లుగా రసీదులు చూపించింది. గడువు ముగిసిన తర్వాత దుమ్మ సంగీత, దుమ్మ బూమక్క, కోర చిన్నమ్మ, నలిమెల కాంత మళ్లీ రుణంకోసం అడుగగా బ్యాంకులో తీసుకున్న పాత లోన్ డబ్బులు పూర్తిగా కట్టలేదని అన్నారు. దీంతో సదరు మహిళలు స్వప్నను సంప్రదించగా రూ.7 లక్షలు వాడుకున్నట్లు ఒప్పుకుంది. నెలరోజులకు చెల్లిస్తానని బాండు రాసి ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత సీ్త్రనిధి సంస్థకు చెందిన అధికారులు డబ్బుల విషయం అడుగగా నేను ఇవ్వలేనని చెప్పింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చిన్నారికి నారీ పురస్కార్ఆదిలాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన కల్చరల్, ఫ్యాషన్ అవార్డ్స్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కొంకటి ఇతిక్ష విశేష ప్రతిభ కనబర్చింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యురాలు సరిత గోగుల, నేషనల్ బంజారా భారత్ మహిళా కన్వీనర్ అద్దంకి నాగమణి, ప్రముఖ నటి సంధ్యారాణి చేతుల మీదుగా నారీ పురస్కారాన్ని అందుకుంది. చిన్నారి తల్లిదండ్రులు కొంకటి సృజన, శ్రావణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడెంకు చెందిన జామ్లాబాయ్ తనకి వ్యవసాయ క్షేత్రానికి సాగునీరు అందించేందుకు పైపులు మంజూరు చేయాలని, సిర్పూర్ (యు)కు చెందిన గేడం గజానంద్ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండ మండలానికి చెందిన రామారావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఉపాధికోసం తిరుగుతున్నా.. నేను దివ్యాంగురాలిని. కుటుంబ పోషణ భారంగా ఉంది. ఏదైనా ఉపాధి కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటా. పలుమార్లు ఐటీడీఏకు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా సమస్య పరిష్కరించాలి.– కొడప అంజన బాయి, మాంజ్రీ గ్రామం, నార్నూర్ -
వేసవిలో కూరగాయల సాగు
చెన్నూర్రూరల్: జిల్లాలోని రైతులు యాసంగి సీజన్లో కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నా రు. పెట్టుబడి తక్కువ, కొద్ది రోజుల్లోనే పంట చేతికి అందిరావడంతో పాటు లాభాలు కూడా అధికంగానే ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యా సంగి సీజన్లో రైతులు సుమారు వెయ్యికి పైగా ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. చెన్నూర్ మండలంలోని కత్తెరసాల, సుద్దా ల, శివలింగాపూర్, సుబ్బరాంపల్లి, కిష్టంపేట, అంగ్రాజ్పల్లి, దుగ్నెపల్లి, చింతలపల్లి, అక్కెపల్లి, ఆస్నాద, తదితర గ్రామాల్లోని రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు 10 గుంటల నుంచి ఎకరం వరకు కూరగాయల సాగుకు కేటాయించారు. అందులో అల్చంత, బెండ, వంకాయ, మిరప, టమాట, గోబీ వంటి కూరగాయలతో పాటు తోటకూర, కొత్తిమీర, పాలకూర, పూదీన, చుక్కకూర లాంటి ఆకుకూరలు సాగు చేస్తున్నారు. మొక్కలకు ప్రతీరోజు ఉదయం బోరుబావుల ద్వారా నీటిని అందిస్తున్నారు. పంటలు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రెండు రోజులకు ఒకసారి తోటకూర, బెండ, మిరప, టమాట, వంకాయలు 20 కిలోల నుంచి 30 కిలోల వరకు వెళ్తాయని వాటిని చెన్నూర్ లేదా మంచిర్యాల, గోదావరిఖని మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తామని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి ధరలు ఉండడంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. -
ఉమ్మడి జిల్లాలో పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు
కుమురంభీంనిర్మల్మంచిర్యాల ఆదిలాబాద్నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శిరీష ఇటీవల తరచూ తలనొప్పి, ఆందోళనతో బాధపడుతోంది. పరీక్షలు గుర్తుకొస్తే చేతుల్లో చెమటలు పట్టడం, చదవడానికి కూర్చుంటే గజిబిజి ఆలోచనలు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. ఇది ఒక్క గాయత్రి పరిస్థితి మాత్రమే కాదు.. జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక రెండురోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రిలో పదోతరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంత చదివినా ఏ పరీక్షలోనైనా పాస్ మార్కులు మాత్రమే వస్తున్నాయని తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేవాడు. ఆదివారం ఉదయం తల్లి నిద్రలేపి చదువుకొమ్మని చెప్పింది. కాసేపటి తర్వాత వచ్చి చూసే సరికి ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. మార్కులు తక్కువ వస్తున్నాయనే ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో చదవాలి
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛ వాతావరణంలో చదవాలి. లక్ష్యాన్ని ఎంచుకుని క్రమపద్ధతిలో కృషి చేస్తే విజయం సాధించడం కష్టంకాదు. ‘ఒత్తిడిని భయంగా కాకుండా సవాల్గా తీసుకుంటే విజయం కచ్చితంగా సిద్ధిస్తుంది. – అల్లం సాయికృష్ణ, కెరీర్ గైడెన్స్ నిపుణులు, బోథ్, ఆదిలాబాద్ ఒత్తిడికి గురికావొద్దు పరీక్షల సమయంలో విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికావొద్దు. ప్రతిరోజూ చదువు కోసం సమయపట్టిక రూపొందించుకుని మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా సరిపడా నిద్ర, సమతుల్య ఆహారం, తేలికపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. పరీక్షలను జీవితంలో ఒక దశగా మాత్రమే భావించాలి. ఫలితాలకంటే నేర్చుకున్న జ్ఞానమే ప్రధానం. – అడ్డిగ శ్రీనివాస్, సైకాలజిస్టు, మోటివేషన్ స్పెషలిస్టు -
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
కాసిపేట: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు దేవాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పూలందేవి వాడకు చెందిన కొత్తకాటు మనోజ్కుమార్ (27) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 8న అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి మామిడిచెట్టుకు ఉరేసుకున్నాడు. తెల్ల వారు జామున గమనించిన కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బస్టాండులో పర్సు పోగొట్టుకున్న మహిళమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ఓ ప్రయాణికురాలు పర్సు పోయిందని రోదించిన తీరు ప్రయాణికులను కలచి వేసింది. ఆసిఫాబాద్ జిల్లా బురుగుపల్లికి చెందిన వనిత పనినిమిత్తం మంచిర్యాలకు వచ్చి ఇంటికి వెళ్లేందుకు మంచిర్యాల బస్టాండ్లో ఆసిఫాబాద్ వెళ్లే బస్సు ఎక్కేక్రమంలో ఆమె పర్సు కిందపడిపోయిది. బస్సు ఎక్కిన తర్వాత తనవద్ద ఉన్న పర్స్ కనిపించక పోవడంతో కిందకు దిగి రోదించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజిని పరిశీలించగా ఓ వృద్ధురాలు పర్సును తీసుకొని రోడ్డుపైకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. పర్సులో అరతులం బంగారు చైన్ ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఘటనపై స్థానిక సీఐని వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీస్స్టేషన్లో సంతకం చేసిన ఎమ్మెల్యేమందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఫిబ్రవరి 17న జరిగిన అల్లర్ల ఘటనలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్కు వచ్చి ష్యూరిటీ సబ్మిట్ చేసి సంతకం చేసి వెళ్లారు.


