breaking news
Kumuram Bheem District Latest News
-
48,160 ఓట్లు ఔట్..!
ఆసిఫాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)– 2026 ప్రక్రియ తుదిదశకు చేరింది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువు సోమవారంతో ముగిసింది. జిల్లాలో 678 పోలింగ్ కేంద్రాల పరిధిలో 4,55,596 మంది ఓటర్లు ఉండగా వందశాతం ఎన్యూమరేషన్ ఫారా లు పంపిణీ చేశారు. మొత్తం ఓటర్లలో 48,160(10.57శాతం) మంది మంది వివిధ కారణాలతో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించకపోవడంతో వారి ఓట్లు జాబితా నుంచి తొలగించనున్నారు. ఇందులో మరణించిన ఓటర్లతోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు అత్యధికంగా ఉన్నారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా..బోగస్ ఓట్లకు చెక్ పెట్టడంతో పాటు ఒకరికి ఒకేచోట ఓటుహక్కు అనే నినాదంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఓటరు జాబితాతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతోంది. జనవరి 31న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు సేకరించి, మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెలరోజుల పాటు బూత్ లెవల్ అధికారులు గడపగడపకూ సర్వే చేపట్టారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేశారు. జూలై 31తో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ గడువు ముగియగా ఈ నెల 10 వరకు పెంచారు. ఫొటో, చిరునామాతో తాత్కాలిక ఓటరు జాబితా డిజిటలైజేషన్ పూర్తవడంతో మంగళవారం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు వెబ్సైట్లో ఓటరు పేరు, వయస్సు, చిరునామా, ఫొటోతో కూడిన తాత్కాలిక కొత్త ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. పేరు లేని 18 ఏళ్లు నిండిన వారు, మిస్ అయిన వారు 06, 07, 08 ఫామ్ల ద్వారా బీఎల్వోలు, ఆన్లైన్లో ఏడు రోజుల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యంతరాలకు సంబంధించిన ప్రతీ దరఖాస్తును బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తారు. తహసీల్దార్ విచారణ చేసి నిర్ణయిస్తారు. అనంతరం అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.నేడు ఓటరు జాబితా ప్రదర్శన జిల్లాలో ఎన్యూమరేషన్ ఫా రాల డిజిటలైజేషన్ పూర్తయింది. మంగళవారం అన్ని గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో తాత్కాలిక ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. తర్వాత సమ యం ఇస్తారు. అభ్యంతరాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేసి అనుమానాలు నివృత్తి చేస్తాం. – లోకేశ్వర్రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్నియోజకవర్గాల వారీగా వివరాలుఅంశం సిర్పూర్ ఆసిఫాబాద్ మొత్తం మొత్తం ఓటర్లు 2,28,916 2,26,680 4,55,596 పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు 2,28,916 2,26,680 4,55,596 డిజిటలైజ్ చేసినవి 2,03,957 2,03,479 4,07,436 ఓటర్లు స్వయంగా సమర్పించినవి 2,067 554 2,621 సేకరణకు వీలుకాని మొత్తం ఫారాలు 24,959 23,201 48,160 మరణించిన వారు 5,943 5,374 11,317 చిరునామా లేనివారు/లభించనివారు 858 1,336 2,194 శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారినవారు 12,485 11,318 23,803 ఇతర కారణాలు 73 315 388 ఇప్పటికే నమోదైన వారు 5,600 4,858 10,458 89.43 శాతం డిజిటలైజేషన్4,55,596 మంది ఓటర్లలో 4,07,436 మంది ఫారాలు సమర్పించడంతో 89.43 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. సిర్పూర్ డివిజన్లో 2,28,916 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 2,03,957(89.1శాతం), ఆసిఫాబాద్లో 2,26,680 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 2,03,479(89.43 శాతం) డిజిటలైజేషన్ పూర్తయింది. 48,160(10.57శాతం) మంది వివిధ కారణాలతో ఎన్యూమరేషన్ ఫారాలు అందించలేదు. వీరంతా ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నారు. ఇందులో ఎక్కువగా 23,803 మంది శాశ్వతంగా వలస వెళ్లగా, 11,317 మంది చనిపోయారు. 388 మంది ఇతరులు ఉన్నారు. 10,458 మంది ఇతర ప్రాంతాల్లో ఓటుహక్కు కలిగిఉన్నారు. 2,621 మంది ఓటర్లు స్వయంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్నారు. -
కుమురం భీం
7సమావేశాల్లో సర్‘పంచ్’లు సమస్యలపై సర్పంచులు గళమెత్తుతున్నారు. యువ సర్పంచులు చాలామంది విద్యావంతులు కావడంతో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 9లోu ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ‘మోడల్’కు సీబీఎస్ఈ హంగులు మోడల్ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. 8లోu మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్/కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ డి మాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం ఆసిఫాబాద్, కాగజ్నగర్లో జైల్భరో కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టారు. మొద ట కలెక్టరేట్ నుంచి బస్టాండ్ ఏరియా చౌరస్తా వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ చౌరస్తా వద్ద బైఠాయించగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. అలాగే కాగజ్నగర్ పట్టణంలోని బాలభారతి ఉన్నత పాఠశాల నుంచి రాజీవ్గాంధీ చౌరస్తా వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే 12 గంటల పనివిధానం వచ్చే ప్రమాదం ఉందని, ఉద్యోగులకు సామాజిక భద్రత లేకుండా పోతుందన్నారు. ముందస్తు నోటీసు లేకుండానే కార్మికులను తొలగించే విధానానికి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. కార్మిక వ్యతి రేక లేబర్ కోడ్కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అలాగే వీబీజీ రాంజీ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, నాయకులు బాలకిషన్, శ్రీకాంత్, కృష్ణమాచా రి, దుర్గం దినకర్, గొడిసెల కార్తీక్, చాంద్ పాషా, ముంజం శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాగజ్నగర్లో ప్రభుత్వ భూములు కబ్జా’
ఆసిఫాబాద్అర్బన్: కాగజ్నగర్ ప్రాంతంలో ప్రభు త్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం డిమాండ్ చే శారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సో మవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. కాగజ్నగర్ మండలం కోసిని శివారులో సంకల్ప్ గ్రీన్ సిటీ పేరుతో సర్వే నం.85/3, 86/3, 87/3 లో లేఅవుట్కు అనుమతులు తీసుకుని సర్వే నం.79, 60లో రూ.20కోట్ల విలువైన సుమారు మూడెకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. అలాగే మున్సిపాలిటీకి చెందిన 216, 217, 218 సర్వే నంబర్లలోని భూమి, శిశుమందిర్కు చెందిన భూమి కూడా ఆక్రమణకు గు రైందని తెలిపారు. అనుమతులు ఒకచోట తీసుకుని హద్దులు మార్చి ప్రభుత్వ భూములు కలుపుకొని వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్లాట్లు కొనుగోలు చేస్తే అమాయక ప్రజలు నష్టపోయే ప్ర మాదం ఉందన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారిపై సమగ్ర విచా రణ జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, నాయకులు కోట్నాక విజయ్, సెర్ల మురళి, ఖాండ్రె విశాల్, తిరుపతి, సప్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏరు పారె.. ఆశ చిగురించె!
దహెగాం: ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ ప్రారంభంలో వానలు లేక అన్నదాతలు అల్లాడిపోయారు. ఏ కుంట చూసినా చుక్కనీరు కనబడలేదు. పత్తి విత్తనాలు విత్తుకున్నా.. చెరువుల కింద ఎక్కడా ఒక్క ఎకరం నాటు పడలేదు. ఈ తరుణంలో వరుణుడు కరుణించాడు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పెద్దవాగు, పెన్గంగ, ప్రాణ హిత నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో ఆ యకట్టు రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. పొలాల్లో వీల్స్ కొట్టడం, నారు మడులు సిద్ధం చేసి మొలక అలుకుతున్నారు. ఆలస్యమైనా జిల్లా రైతులు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో 4.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా, ఇందులో ప్రధానంగా 3.75 లక్షల ఎకరాల్లో పత్తి, సుమారుగా 48 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పత్తి విత్తుకుని రెండు నెలలు కావొస్తుండగా, ప్రస్తుతం పూత దశకు చేరుతోంది. ఎరువులు వేసి కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. బోర్ల సౌకర్యం ఉన్న రైతులు ఇప్పటికే నాట్లు వేసి 20 రోజులు గడిచింది. ఇంకా వరి నాట్లు కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటల కింద ఇప్పుడిప్పుడే నార్లు అలుకుతుండగా, నాట్లు పూర్తయ్యేందుకు మరో 20 నుంచి 25 రోజులు పట్ట అవకాశం ఉంది. లోటు నుంచి సాధారణం..జిల్లావ్యాప్తంగా పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం 15 మండలాల్లో లింగాపూర్, తిర్యాణి, కెరమెరి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దహెగాం, కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో సాధారణం కంటే తక్కువగా కురిసింది. అయినా 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 643.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 702 మి.మీ.లు కురిసింది. భూగర్బ జలాలు సైతం గణనీయంగా పెరిగాయి. అలాగే ప్రధాన ప్రాజెక్టులైన కుమురంభీం, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీరావు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టులు నిండటం రైతులకు ఊరట కలిగించే అంశం. జూన్ 1 నుంచి ఆగస్టు 10 వరకు వర్షపాతం(మి.మీ.లలో) మండలం సాధారణం కురిసింది వ్యత్యాసం జైనూర్ 689.2 781.7 13.0 సిర్పూర్(యు) 672.1 798.2 19.0 లింగాపూర్ 648.7 794.6 22.0 తిర్యాణి 557.7 747.8 34.0 రెబ్బెన 550.7 616.3 12.0 ఆసిఫాబాద్ 574.2 649.6 13.0 కెరమెరి 576.8 726.0 26.0 వాంకిడి 611.8 646.9 6.0 కాగజ్నగర్ 585.5 589.2 1.0 సిర్పూర్(టి) 659.8 686.7 4.0 కౌటాల 709.8 668.6 –6.0 చింతలమానెపల్లి 701.7 615.8 –12.0 బెజ్జూర్ 740.0 756.9 2.0 పెంచికల్పేట్ 679.5 786.0 16.0 దహెగాం 699.1 673.6 –4.0 ప్రాజెక్టుల్లో నీటినిల్వ(టీఎంసీల్లో) -
సవాల్గా అతిథి రక్షణ!
పెంచికల్పేట్: కాగజ్నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతాల్లో కొన్ని నెలలుగా బెబ్బులి గాండ్రిపులు లేక పల్లెలు, అటవీ సమీప ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగింది. ఈ తరుణంలో మహారాష్ట్రలోని అహెరి అటవీ ప్రాంతం నుంచి బెజ్జూర్, పెంచికల్పేట్ రేంజ్ల పరిధిలోకి ఓ పెద్దపులి అతిథిగా వచ్చింది. నాలుగైదు రోజులుగా ఇది స్థానిక ప్రాంతాల్లో చురుగ్గా తిరుగుతోంది. మూడు రోజుల క్రితం పెంచికల్పేట్– అగర్గూడ రహదారిపై కొందరు పులిని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 20 ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతంలో పాదముద్రలు, ట్రాప్ కెమెరాల ద్వారా కదలికలను గమనిస్తున్నారు. గతంలో కాగజ్నగర్, పెంచికల్పేట్ రేంజ్ల పరిధిలో పెద్దపులులు మరణించిన నేపథ్యంలో ఓ వైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు పెద్దపులి రక్షణకు చర్యలు చేపడుతున్నారు. రెండు రేంజ్ల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పులి ఆవాసానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రైతుల్లో భయాందోళనపెద్దపులి పంట చేలలో సంచరిస్తుండటంతో రైతులు, కూలీలు హడలిపోతున్నారు. విస్తారమైన వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పులి సంచారం సమాచారంతో కూలీలు పనులకు రావడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. సాధారణంగా మహారాష్ట్రలోని తడోబా రిజర్వు ఫారెస్టు నుంచి పెద్ద పులులు కాగజ్నగర్ డివిజన్ పరిధిలోకి ప్రవేశిస్తుంటాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు దాటి కాగజ్నగర్, సిర్పూర్(టి), బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం అడవుల్లో సంచరిస్తాయి. ఈ క్రమంలో తోడు, ఆహారం కోసం కొన్నిసార్లు మైదాన ప్రాంతాల్లోని పంట చేల వైపు వస్తున్నాయి. పశువులు, మనుషులపైనా దాడులకు పాల్పడుతున్నాయి. 2020 నవంబర్ 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ పులి దాడిలో చనిపోయిన విషయం తెలిసిందే. అదే ఏడాది నవంబర్ 29న పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల చేనులో పత్తి తీస్తుండగా దాడి చేసి హతమార్చింది. 2023 నవంబర్ 16న వాంకిడి మండలం కమాన్పూర్ గ్రామానికి చెందిన భీము పంట చేనులో పులి దాడిలో చనిపోయాడు. 2024 నవంబర్ 29న కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి సైతం పులిదాడిలో చనిపోయింది.వేటగాళ్ల ఉచ్చుల ముప్పుజిల్లాలో 6,04,172 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల పరిధిలో 11 రేంజ్లు ఉన్నాయి. కాగజ్నగర్ డివిజన్ పరిధిలో సుమారు మూడు పెద్దపులులు సంచరిస్తున్నట్లు అంచనా.. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి ఆవాసాన్ని వెతుకుంటూ వస్తున్న పెద్దపులులు డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు ఉచ్చులకు బలవుతున్నాయి. టైగర్ కారిడార్గా ఉన్న కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణ అటవీశాఖ అధికారులుకు సవాలుగా మారింది. 2024 డిసెంబర్ 27న దరిగాం అటవీ ప్రాంతంలో విషప్రయోగంతో ఎస్ 9, కే 15 అనే రెండు పులులు మృతి చెందిన విషయం తెలిసిందే. పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని కోయచిచ్చాల అటవీ ప్రాంతంలో 2025 మే 13న వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి కే8 అనే పులి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నాటి ఘటనలతో జిల్లాలో పులుల సంరక్షణపై నీలినీడలు అలుముకున్నాయి. తాజాగా కొత్త పులి పెంచికల్పేట్ రేంజ్లోని అగర్గూడ, మెరెగూడ, కోయచిచ్చాల, లోడుపల్లి, కొండపల్లి, బెజ్జూర్ రేంజ్ పరిధిలోని పాపన్పేట్, తలాయి, మత్తడి ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిఘా కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు. కదలికలు గమనిస్తున్నాం పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. అగర్గూడకు చెందిన ద్విచక్ర వాహనదారులకు కనిపించడంతో సమాచారం అందించారు. అటవీ ప్రాంతంలో ప్రత్యేక బృందాలతో పాదముద్రలు, ట్రాప్ కెమెరాలతో పులి కదలికలను గమనిస్తున్నాం. ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమచారం అందించాలి. పులి ఆవాసానికి ఆటంకం ఏర్పడకుండా సహకరించాలి. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ -
12వ వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలి
రెబ్బెన: 12వ వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు చేసి.. వెంటనే చర్చలు ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం గోలేటిలోని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు, అలవెన్సులు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేవరకు ఐక్య పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఏరియా జీఎం శ్రీరమేశ్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు, గుర్తింపు సంఘం జీఎం కమిటీ సభ్యులు జగ్గయ్య, రాజేశ్, మారం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్బాబు, చంద్రశేఖర్, సమీ, సురేశ్ కోరి, ఫిట్ కార్యదర్శులు రామయ్య, అశోక్, రమేశ్, వసీం తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
కాగజ్నగర్టౌన్: పెంచికల్పేట్ మండలం మొట్లగూడ వద్ద సోమవారం విద్యుత్షాక్తో స్తంభం పైనుంచి పడి మృతి చెందిన నాగపూరి చందు కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. మృతదేహాన్ని కాగజ్నగర్ సామాజిక ఆస్పత్రికి తీసుకురాగా, ఎమ్మెల్యే ఆస్పత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి విద్యు త్ శాఖ నుంచి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ ఇమ్రాన్ అహ్మద్, రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం– 327 జిల్లా కార్యదర్శి ఎమ్మాజీ సతీష్, విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. అనంతరం రూరల్ సీఐ కుమారస్వామి పంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మూకుమ్మడి రాజీనామా కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొటక్షన్ యూనియన్(రిజిస్టర్ నం.2381) కార్యవర్గం మూకుమ్మడిగా రాజీనా మా చేసింది. పట్టణంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ప్రకటన చేశారు. ఇక నుంచి సంఘం కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వారిలో యూనియన్ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ, కార్యనిర్వహక అధ్యక్షుడు గోలెం వెంకటేశం, ఉపాధ్యక్షులు గొగర్ల శ్యాంరావు, శీలం రాజమొగిలి, కొత్తకొండ రాజేశ్, చిలుముల వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులు కొమ్ము చక్రవర్తి వెంకటేశ్, అహ్మద్ హుస్సేన్, చంద్రమోహన్రావు, క్రిష్ణ, రాజు, మహముద్ ఉన్నారు. -
మరింత భరోసా..!
కెరమెరి: స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలు డిజిటల్ విధానంలో ధ్రువీకరించేందుకు మూడ్రోజుల క్రితం చేపట్టిన ఈ–కేవైసీ జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఽఆధార్ అనుసంధానం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సంఘాల కార్యకలాపాలను మరింత పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అర్హులైన సభ్యులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందించేందుకు ఈ–కేవైసీని కీలకంగా పరిగణిస్తున్నారు. సంఘాల్లోని సభ్యుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, ఇతర వివరాలు ధ్రువీకరించడం ద్వారా అందరికీ గుర్తింపు ఏర్పడుతుంది. దీంతో వివిధ రకాల ఆర్థిక, సంక్షేమ ప్రయోజనాలను అర్హులైన వారికి అందించడం సులభం కానుంది. ముఖ్యంగా సభ్యుల వివరాల్లో తప్పులు, ఒకే వ్యక్తి పేరుతో నమోదైన వివరాలు, పాత సమాచారం తదితర సమస్యలు గుర్తించి సరిచేసేందుకు ఈ ప్రక్రియ ఎంతో దోహద పడుతుంది. రుణాల ప్రక్రియలోనూ కీలకమే..స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంక్ రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సంఘాల పొదుపులు, బ్యాంక్ లావాదేవీలు, రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులు లాంటి అంశాల్లో సభ్యుల వివరాలు సరిగా ఉండడం అవసరం. ఈ–కేవైసీ పూర్తయితే సభ్యుల గుర్తింపు స్పష్టంగా ఉండనుండడంతో బ్యాంకింగ్ ప్రక్రియలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు తగ్గే అవకాశముంది. మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక లావాదేవీల సహకారం పొందడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడనుంది. ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాలు సంఘాల ద్వారా మహిళలకు చేరుతున్నాయి. ఈ–కేవైసీ ద్వారా సభ్యుల వివరాలు ధ్రువీకరిస్తే అర్హులైన సభ్యులను గుర్తించడం, వారి వివరాలు డిజిటల్ రికార్డుల్లో భద్రపర్చడం సులభమవుతుంది. ఫలితంగా భవిష్యత్లో ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, తప్పనిసరిగా అందించే అవకాశముంది. సంఘాల నిర్వహణలో పారదర్శకతగ్రామీణ ప్రాంతాల్లో పొదుపు రుణాలు, చిన్నతరహా వ్యాపారులు, ఉపాధి కార్యక్రమాల నిర్వహణలో సంఘాలు కీలకంగా ఉన్నాయి. వేలాది మంది మహిళలు సంఘాల ద్వారా ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతీ సభ్యురాలి వివరాలు కచ్చితంగా ఉండడం అత్యవసరం. ఈ–కేవైసీ పూర్తయితే సంఘాల సభ్యుల వివరాలు క్రమబద్ధీకరించడంతో పాటు భవిష్యత్లో డిజిటల్ విధానంలో సేవలు అందించేందుకు మార్గం సుగమమవుతుంది. జిల్లాలో ఆదివారం వరకు 4.2 శాతమే ప్రక్రియ పూర్తి కాగా, మిగతా సభ్యుల నమోదును వేగవంతం చేయాల్సిన అవసరముంది. జిల్లాలోని కెరమెరి, జైనూర్, తిర్యాణి, సిర్పూర్(యు), లింగాపూర్, వాంకిడితోపాటు కాగజ్నగర్ డివిజన్లోని కొన్ని మండలాల్లోని గ్రామాలు నెట్వర్క్కు దూరంగా ఉన్నందున ఈ ప్రక్రియ ముందుకుసాగడం లేదు. ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని ఐకేపీ సిబ్బందిని జిల్లా అధికారులు ఆదేశించారు. జిల్లా వివరాలుమహిళా సాధికారతకు మరో అడుగుస్వయం సహాయక సంఘాలు పొదుపు సంఘాలుగానే కాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన కు వేదికలుగా మారుతున్నాయి. సంఘాల ద్వారా పొదుపు అలవాటు, బ్యాంకింగ్ పరిజ్ఞా నం, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు తదిత ర కార్యక్రమాల్లో మహిళలు ముందుకువస్తున్నా రు. ఈ నేపథ్యంలో డిజిటల్ వివరాల ధ్రువీకరణ భవిష్యత్ సేవలకు పునాదిగా నిలువనుంది. ఈ–కేవైసీ ప్రక్రియ వేగంగా పూర్తిచేసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, జీవనోపాధి అవకాశాలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. -
మహిళా జట్టుకు సిల్వర్ మెడల్
రెబ్బెన: వనపర్తిలో ఆదివారం జరిగిన 72వ బాల్బ్యాడ్మింటన్ అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహిళా జట్టు అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. ఫైనల్లో రంగారెడ్డి జట్టుతో ఓటమి పాలుకాగా, రెండోస్థానంలో నిలిచిన ఆదిలాబాద్ జిల్లా మహిళల జట్టు సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. ఇదే టోర్నమెంట్లో జిల్లా పురుషుల జట్టు సెమీ ఫైనల్లో హైదరాబాద్ జట్టుతో ఓటమిపాలై నాలుగో స్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, కుమ్మరి మల్లేశ్, శ్రీధర్, నరేష్ క్రీడాకారులను అభినందించారు. -
ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలి
కాగజ్నగర్టౌన్: ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం సచిన్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాలభారతి పాఠశాల నుంచి రాజీవ్గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హక్కులు, సంస్కృతి పరిరక్షణ, జీవో 3 పునరుద్ధరణ, 1/70 రక్షణకు ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీలో కలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ముంజం ఆనంద్కుమార్, నేర్పల్లి అశోక్, కోట శ్రీనివాస్, దిగిడ బక్కన్న, మడావి గణపతి, డి.లక్ష్మి, కనక నగేష్, శంకర్, ఆత్రం మాణిక్రావు, రవీందర్, కొడప సాంబయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
కెరమెరి: ఆదివాసీ చట్టాలపై అవగాహన అవసరమని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ అన్నారు. మండలంలోని జోడేఘాట్లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. వివిధ అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఏటా ఆగస్టు ప్రపంచ ఆదివాసీ దినోత్స వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, భీం మనుమడు కుమురం సోనేరావు, పోరుగ్రామాల అధ్యక్షుడు పెందోర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
బెల్టు షాపులు మూసివేయాలని నిరసన
కాగజ్నగర్రూరల్: మండలంలోని భట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల బెల్టు షాపులు మూసివేయాలని ఐద్వా, డీవైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జీపీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత మాట్లాడుతూ బెల్టు షాపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే బెల్టు షాపులను మూసివేయాలని కోరారు. అనంతరం సర్పంచ్ రాజేందర్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు ముంజం ఆనంద్, వినోద తదితరులు పాల్గొన్నారు. -
సంబురం
అంబరాన్నంటిన జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవంఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హాజరై సంప్రదాయబద్ధంగా జెండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది తెగల అమరుల చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం కుమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఆదర్శనీయమని, వాటిని భావితరాలకు అందించాలన్నారు. జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సదుపాయం, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలతో చర్చించి గిరిజన యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ ప్రపంచంలో ఆదివాసీల సంస్కృతి, జీవనశైలి, ఆచారాలు, అలవాట్లు విభిన్నమైనవని అన్నారు. పోలీసులు ఎల్లప్పుడూ ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి స్మారక స్థూపం అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేశారని తెలిపారు. పోడు సమస్యను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐటీడీఏను బలోపేతం చేయాలిసిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ ఐటీడీఏ ఉత్సవ విగ్రహంలా తయారైందని, ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్, జుగా పథకాల ద్వారా గిరిజనులు, పీవీటీజీలకు గృహాలు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. 5వ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వాలు బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధికి 5 శాతం నిధులు కేటాయించాలన్నారు. కార్యక్రమం సాగిందిలా..అంతకు ముందు రాయిసెంటర్ వద్ద గిరిజన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి ర్యాలీగా బయలుదేరి గాంధీచౌక్ వద్ద అంకమరాజు ఆలయంలో పూజలు చేశారు. కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదివాసీ భవన్లో పోరాట యోధులకు నివాళుల ర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివాసీ గీతాలాపన చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్, ఎస్పీ, డీసీసీ అధ్యక్షురాలు చేసిన పర్ధాన్ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. క్రీడాపాఠశాలల, గిరిజన గురుకుల పాఠశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థినులతోపాటు ఆదివాసీలు నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో డీఎఫ్వో బాలామణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో పుర్క ఉద్దవ్, జీసీడీవో శకుంతల, డీఎంహెచ్వో నాగేంద్ర, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, పుర్క మాణిక్రావు, సిడాం అర్జు మాస్టర్, మర్సుకోల సరస్వతి, పెందూర్ గోపి, గుణవంత్రావు, మోతీరాం, ఆత్రం భీంరావు, సిడాం శంకర్, ఎల్లయ్య, బుర్స పోచయ్య, సుధాకర్, మారుతి తదితరులు పాల్గొన్నారు. వసతుల కల్పనకు కృషిఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో అటవీ అధికారులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవి నుంచి ఆదివాసీలను దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
సామూహిక పారాయణం
ఆసిఫాబాద్: పెద్దపల్లి జిల్లా సుందిళ్ల శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఆదివారం సామూహిక నరసింహ శతక పారాయణం చేశారు. ఆసిఫాబాద్, గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, కోరుట్ల, మెట్పల్లి తదితర ప్రాంతాలకు చెందిన వారు ‘నరసింహ శతక’ గ్రూపు ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఒక పద్యపారాయణం చేస్తున్నారు. వంద పద్యాల ముగింపు సందర్భంగా ఆదివారం సుందిళ్ల నరసింహ స్వామి ఆలయంలో సామూహిక వంద పద్య పఠనం చేశారు. అనంతరం పవిత్ర మానస సరోవర యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన చందా ఈశ్వర్కుమార్, పుష్పలత దంపతులను శాలువాలతో సన్మానించారు. నిర్వాహకులు కేశెట్ట సద్గుణ, కాచం సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు. -
‘సర్దుబాటు’ కొలిక్కి..!
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 2026– 27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య పూర్తికావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు కల్పించారు. మంగళవారం నుంచి కేటాయించిన పాఠశాలల్లో టీచర్లు బోధన చేయాల్సి ఉంటుంది. జిల్లాలో స్థానిక సంస్థల పరిధిలో 728 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 42,358 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పాఠశాలల్లో అదనంగా ఉన్న వారిని సమీపంలోని బడులకు డిప్యూటేషన్ ద్వారా సర్దుబాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అడ్మిషన్లు పూర్తికాకపోవడంతో ఖాళీల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో సర్దుబాటు ప్రక్రియ ఆగస్టు వరకు వచ్చింది. 728 స్కూళ్లు.. 397 ఖాళీలుజిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 728 ఉన్నాయి ఆయా స్కూళ్లలో స్కూల్ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2,447 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 2,050 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో 397 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. 2024లో జీవో 317 ద్వారా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 65 మంది స్పౌజ్(భార్యాభర్తలు) కేసుల్లో ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. 1 నుంచి 10 మంది మంది పిల్లలు ఉంటే ఒక ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 మంది ఉంటే ఐదుగురు, 151 నుంచి 200 మంది ఉంటే ఆరుగురు ఉండాలి. అలాగే ఉన్నత పాఠశాలల్లో 200 ఉంటే స బ్జెక్టు ఒక్క ఉపాధ్యాయులు, 201 నుంచి 250 మంది ఉంటే అదనంగా గణితం బోధించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాల్సి ఉంటుంది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా 96 మంది టీచర్లను సర్దుబాటు చేశాం. ఈ నెల 11 నుంచి ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరాలి. – సచ్చిదానంద చారి, డీఈవో జిల్లాలో సర్దుబాటు ఇలా.. మండలం ఉపాధ్యాయులు ఆసిఫాబాద్ 19 దహెగాం 14 బెజ్జూర్ 1 జైనూర్ 5 చింతలమానెపల్లి 1 కాగజ్నగర్ 3 కెరమెరి 10 కౌటాల 5 లింగాపూర్ 2 రెబ్బెన 6 సిర్పూర్(టి) 5 సిర్పూర్(యు) 1 తిర్యాణి 5 వాంకిడి 13 96 పాఠశాలలకు టీచర్లుజిల్లాలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 96 పాఠశాలలో 96 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. 80 మంది స్కూల్ గ్రేడ్ టీచర్లు, 16 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. 2024లో 111 పాఠశాలలకు 108 మంది ఎస్జీటీలు, 28 మంది స్కూల్ అసిస్టెంట్లు, 2025లో 80 పాఠశాలలో 92 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో 58 మంది ఎస్జీటీలు, 34 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రస్తు తం 96 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో అత్యధికంగా ఆసిఫాబాద్ మండలంలో 19 మంది, దహెగాంలో 14 మంది, వాంకిడి 13 మంది, కెరమెరి పది మందిని సర్దుబాటు చేయగా, బెజ్జూర్, చింతలమానెపల్లి, సిర్పూర్(యు) మండలాల్లో కేవలం ఒక్కొక్కరిని సర్దుబాటు చేశారు. -
చేయూతకు కసరత్తు
ఆసిఫాబాద్రూరల్/ఆసిఫాబాద్అర్బన్: చేయూ త పింఛన్ల మంజూరుకు ఎట్టకేలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా పింఛన్ కోసం నిరీ క్షిస్తున్న అర్హుల కల నెరవేరనుంది. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ఈ నెల 7న సీఈవో దివ్య దేవరాజన్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నుంచి డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ, అర్హతలు, నిబంధనలు వివరించారు. ఆగస్టు 15నాటికి అర్హులను ఎంపిక చేసి సెప్టెంబర్లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల పరిధిలో 53,745 మంది చేయూత పింఛన్దారులున్నారు. ఫలించనున్న ఐదేళ్ల నిరీక్షణ జిల్లాలో వేలాదిమంది చేయూత పింఛన్ కోసం ఐదేళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నారు. అర్హత కలిగిన ద రఖాస్తుదారులతోపాటు కుటుంబ పరిస్థితుల్లో మా ర్పులు వచ్చినవారికీ పింఛన్లు మంజూరు చేయాల ని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్లోనే దరఖాస్తు చేయాలని సూచించింది. గతంలో ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసినవారూ ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్లోనే వివరాలు అందించాలి. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కు లం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు ఈ కొత్త దరఖాస్తు ఫారా న్ని జత చేసి అందిస్తే సరిపోతుంది. ఎక్కడ దరఖాస్తు చేయాలంటే..గ్రామీణ ప్రాంతాలవారు గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాలవా రు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవా లి. గ్రామపంచాయతీలు, మున్సిపాలి టీల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డీఆర్డీవో ద్వారా కలెక్టర్ పరిశీలనకు పంపి తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరి తేదీ లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుత పింఛన్ వివరాలువృద్ధులు 22,731 వితంతువులు 21,333 దివ్యాంగులు 5,774 ఒంటరి మహిళలు 2,558 చేనేత కార్మికులు 473 గీత కార్మికులు 132 బీడీ కార్మికులు 88 ఫైలేరియా బాధితులు 554 డయాలసిస్ బాధితులు 102అర్హులు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరవుతుంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోనివారు ఉంటే గ్రామపంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి. – దత్తారావ్, డీఆర్డీవో ముందుగా ఏడు రకాల వారికే.. ప్రభుత్వం ముందుగా ఏడు రకాల ప్రత్యేక పింఛన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు, చేనేత కా ర్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులున్నా రు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ వారికి తర్వాత దశలో ప్రాధాన్యం ఇస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా వర్గాలకు చెందిన అర్హులు నిరాశకు గురవుతున్నారు. 2022లో చివరి సారిగా..గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిసారిగా 2022 అక్టోబర్లో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు దరఖాస్తుదారు ల వయస్సు 65ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. అయినా, ఇప్పటివరకు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూ డా రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దివ్యాంగుల పింఛన్ రూ.4,016 నుంచి రూ.6,016కు, ఇతర పింఛన్లు రూ.2,016 నుంచి రూ.4,016కు పెంచుతామని చెప్పింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. కొత్త పింఛన్ల మంజూరుకు జిల్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ఆసిఫాబాద్అర్బన్: వానాకాలంలో సీజన్లో వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్వో నాగేంద్ర సూచించారు. పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరి చేరవని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జిల్లాలో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. డ్రై డే నిర్వహణకు ఆదేశాలిచ్చాంప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలల్లో పాత్రలు, కూలర్లు, పూలకుండీలు, కొబ్బరి చి ప్పలు, పాత టైర్లలో నీరు నిల్వ లేకుండా చూస్తాం. మురుగునీరు నిలిచే చోట ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో దోమల నివారణ మందు చల్లిస్తాం. ఇంటింటా అవగాహన కల్పిస్తున్నాంగ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. తాగునీటి ట్యాంకుల్లో క్లోరి నేషన్ చేయిస్తున్నాం. పీహెచ్సీల వారీగా ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్లు, సూపర్వైజ ర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటా అవగాహన కల్పిస్తున్నాం. జ్వరం, మలేరియా, డెంగీ అనుమానిత కేసులను త్వరగా గుర్తించి ర్యాపిడ్ డయోగ్నస్టిక్ టెస్టులు, అవసరమైన చోట మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో 12 మలేరియా, 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. సీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్వరం మందులు, యాంటీబయాటిక్స్, మలేరియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, పాముకాటు కేసులను దృష్టిలో ఉంచుకుని యాంటి స్నేక్ వేనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాం. వైద్యుల కొరత ఉన్నప్పటికీ..జిల్లాలోని 17 పీహెచ్సీలుండగా ప్రస్తుతం రెగ్యులర్ వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొందరు వైద్యులు ఇతర పీహెచ్సీలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న మానవ వనరులతో ప్రజలకు సేవల్లో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు భాగస్వాములు కావాలివ్యాధుల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి. సీజనల్ వ్యాధుల నియంత్రణలో వైద్యారోగ్యశాఖతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చు. కటాఫ్ గ్రామాలపై ప్రత్యేక దృష్టిజిల్లాలోని 135 కట్ఆఫ్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సీజనల్ వ్యాధులపై అవగా హన కల్పిస్తున్నాం. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, ఇతర హైరిస్క్ వర్గాల ఆరోగ్య పరి స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. గర్భిణు ల డెలివరీ తేదీలను గుర్తించి వారిని ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సంబంధిత సిబ్బంది ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అవసరమైతే ముందస్తుగా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తాం. రవాణా సౌకర్యం, అ త్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వైద్యపరీక్షలు చేయించుకోవాలిఎవరికై నా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పీహెచ్సీకి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలి. గతేడాది జిల్లాలో 73 డెంగీ, 37 మలేరియా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన ఏరియాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి వైద్యశిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. -
‘డబుల్’ వాసుల దారి కష్టాలు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని చారిగాం గ్రామంలోగల డబుల్ బెడ్రూం ఇళ్లకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు బురదతో నిండి ద్విచక్రవాహనాలు, ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాత్రి వేళ బురదలో పడి పలువురు గాయాలపాలైన ఘటనలున్నాయి. విద్యుత్ స్తంభాలు వేసినా స్ట్రీట్ లైట్లు లేక రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని డబుల్ బెడ్రూం ఇళ్ల నివాసాల వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. -
కుమురం భీం
7సాగుకు నీరందేదెప్పుడు? ఇటీవల కురిసిన వర్షాలకు వట్టి వాగు జలాశయం నిండింది. కాలువలకు నీటిని విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. వెదురు.. ఉపాధికి ఆదరువు గిరిజనులు వెదురుతో వివిధ రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. వీరి కోసం నడ్డంగూడలో ‘కుమురం సూరు’ వెదురు ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది.ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
నిధులు విడుదలయ్యేలా చూడాలని వినతి
కెరమెరి: గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదలయ్యేలా చూడాలని మండలానికి చెందిన పలువురు సర్పంచులు, నా యకులు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావును కోరా రు. శనివారం జిల్లా కేంద్రంలో వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింద ని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ము నీర్ అహ్మద్, నాయకులు దండుగుల ఎల్లప్ప, యూసూఫ్, సర్పంచులు ఆత్రం లక్ష్మణ్, కుమురం భీంరావు, ఆనంద్రావు, బలవంత్రావు, శంకర్, అమోల్ తదతరులున్నారు. -
సంస్కృతి ఉట్టి పడేలా..
ఆసిఫాబాద్: ఆదివాసీ అస్తిత్వానికి ప్రతీకగా జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ సంఘాలు, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలకు కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులు, ఆదివాసీ గిరిజన సంఘాల ప్రముఖులు, జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నా రు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో గిరిజ నశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ కె.హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సంబంధిత అధి కారులతో పాటు తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, రాయ్సెంటర్ సార్మేడీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆది వాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ది శానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దివాసీ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వేడుకలకు ఏర్పాట్లుజిల్లా కేంద్రంలోని రాయ్సెంటర్లో ఆదివారం ప్రత్యేక పూజలు, ఆదివాసీ జెండా ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి కుమురంభీమ్ చౌక్ వద్ద భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ఆదివాసీ భవ న్కు చేరుకుని కుమురంభీమ్ చిత్రపటంతో పా టు ఆదివాసీ ప్రముఖుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా గుస్సాడీ, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తొమ్మిది తెగలవారు హాజరు కానుండగా ఒక్కో తెగవారు ఒక్కో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తారు. ఆదివాసీ కళలు, ఆచారా లు, సంప్రదాయ దుస్తులు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా నిర్వహించనున్న కార్యక్రమాలు ప్రత్యేకాకర్షణగా నిలవనున్నాయి. వేడుకల్లో పాల్గొనేవారికి జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తాగునీరు, భోజన వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సంస్కృతి పరిరక్షణే లక్ష్యంప్రపంచ ఆదివాసీ దినోత్సవం కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా ఆదివాసీ హక్కులు, గుర్తింపు, భాష, సంస్కృతి, సంప్రదా యాల పరిరక్షణకు వేదికగా మారాలని ఆది వాసీ సంఘాలు కోరుతున్నాయి. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన అవసరముందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అడవులు, ప్రకృతి వనరుల ను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీలు పోషి స్తున్న పాత్రను గుర్తించాలని చెబుతున్నా రు. కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ స మాజం ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, ఉపాధి, భూమి హక్కులు, అటవీహక్కులు, జీవో 3, మౌలిక వసతులు తదితర సమస్యలు అధికారుల దృష్టికి తేనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతీ ఆదివాసీకి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చూడాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఆది వాసీ పిల్లలకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధితోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
మాదిగలపై వివక్ష తగదు
ఆసిఫాబాద్అర్బన్: మాదిగలపై వివక్ష చూపుతూ కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గాదెవేణి మల్లేశ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అంబేడ్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ మీదుగా శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. స్థానిక సీఐ రవికి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ మాట్లాడారు. మల్లేశ్ ఓ నేతతో ఫోన్లో మాదిగలను కించపరిచేలా మాట్లాడిన తీరు ఓ సామాజిక మాధ్యమంలో వైరలైందని తెలిపారు. మల్లేశ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుని కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దూడల అశోక్, రాంచందర్, జయరాజ్, రాజలింగు, ఇప్ప నాగరాజు, నరేశ్ తదితరులన్నారు. -
రేపు జైల్ భరో
దహెగాం: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 10న జైల్ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి తెలిపారు. శనివా రం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి జైల్భరో కరపత్రం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కా ర్పొరేట్లకు కొమ్ముకాస్తోందని ఆరోపించా రు. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జైల్భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధికసంఖ్యలో పా ల్గొని విజయవంతం చేయాలని కోరారు. మ ధ్యాహ్న భోజన కార్మికులు శ్రీలత, పార్వతి, పద్మ, మల్లీశ్వరి, లక్ష్మి తదితరులున్నారు. విజయవంతం చేయాలిఆసిఫాబాద్అర్బన్: ఈ నెల 10న తలపెట్టిన జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం జైల్భరో ప్రచార కరపత్రాలను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లాలోని 15 మండల కేంద్రాలు, రెండు మున్సిపల్ కేంద్రాల్లో భారీ నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ
కాగజ్నగర్టౌన్: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు 15 ఏళ్లుగా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.ప్రవీణ్కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, పోలీస్, ఫారెస్ట్, బ్యాంకింగ్ తదితర ఉద్యోగాలకు ఉపయోగపడేలా ఫౌండేషన్ శిక్షణ కోసం డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉపకార వేతనంతోపాటు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తామన్నారు. అనంతరం అధ్యాపకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, కోఆర్డినేటర్ జనార్దన్, అధ్యాపకులు శారద, రాజేశ్వర్, దత్తాత్రేయ పాల్గొన్నారు. -
తొలి విద్యాభ్యాసమే భవిష్యత్తుకు పునాది
ఆసిఫాబాద్రూరల్: ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో తొలి విద్యాభ్యాసమే చిన్నారుల భవిష్యత్తుకు పునాది అని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్లో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులపై ఒత్తిడి లేకుండా ఆటపాటలు, సంభాషణలు, చిత్రలేఖనం ద్వారా నేర్చుకునేలా చొరవ చూపాలన్నారు. పిల్లల్లో భాషా నైపుణ్యాలు, సంఖ్యా భావనలు, ఆలోచనలు, సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎంలు మార్గదర్శకత్వం వహించాలన్నారు. ఇండోర్, అవుట్ డోర్ ప్లే మెటీరియల్, టీఎల్ఎం, చిత్రాలు, పుస్తకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈవో సచ్చిదానంద చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, రిసోర్స్పర్సన్లు శంకర్, వెంకటేశ్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి ఆసిఫాబాద్: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్ రావు, కృష్ణయ్యతో కలిసి జిల్లా అధికారులతో పంద్రాగస్టు వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15న వేడుకల్లో పోలీస్ గౌరవ వందనం, పతాకావిష్కరణ, వేదిక అలంకరణ, పోడియం, వాహనాలను పూలతో అలంకరించడం, షామియానాలు, కుర్చీలు, తాగునీరు, స్నాక్స్, టీ, స్టాల్స్ ఏర్పాటు, శకటాలు, సౌండ్ సిస్టం, ప్రసంగ ప్రతి, ప్రముఖుల సీటింగ్ నిర్వహణ, ఫొటోగ్రఫీతో పాటు మీడియా గ్యాలరీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలన్నారు. -
ఘనంగా ‘సామల’ వర్ధంతి
కాగజ్నగర్టౌన్: ప్రఖ్యాత సాహితీ వేత్త, బహుభాషా కోవిదుడు సామల సదాశివ వర్ధంతిని పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని ఆయ న విగ్రహానికి తెలంగాణ సాహితీ సదస్సు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అలాగే పద్మశాలి భవనంలో ఆ సంఘం నాయకులు సదాశివ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. వక్తలు మాట్లాడుతూ సామల సదాశివ తెలుగు, ఉర్డూ, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లో విశేష పాండిత్యాన్ని సంపాదించారని, భాషల మధ్య సాహిత్య వారధిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ సదస్సు సలహాదారు కటుకం మధుకర్, కార్యనిర్వాహక కార్యదర్శి మామిడాల తిరుపతయ్య, ఎంఈవో ప్రభాకర్, పద్మశాలి సంఘం నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు శాంతకుమారి, శ్యాంసుందర్, రాజేశ్వర్రావు, ప్రకాశ్, ఓం ప్రకాశ్, నానాజీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే కఠిన చర్యలు
కాగజ్నగర్టౌన్: ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత హెచ్చరించారు. స్థానిక ఎస్సై రాజు, పోలీసులతో కలిసి శుక్రవారం పట్టణంలోని పలు మెడికల్ షాపుల్లో స్టాక్, కొనుగోళ్లు, అమ్మకాల రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ట్రామడాల్, అల్ఫ్రాజోలామ్, బుప్రెనోర్పిన్ ఇంజెక్షన్లు, షెడ్యూల్ హెచ్– 1 మందులు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘ప్రాణహిత’పై ముందడుగు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్ట్కు ముందడుగు పడుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించనుండగా ముంపు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మహారాష్ట్ర నుంచి బరాజ్ ఎత్తు పెంపునకు అనుమతులు ఇప్పించాలంటూ సాగు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీలతో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. తాజాగా మరో నాలుగు మీటర్లు ఎత్తు పెంచి, 152 మీటర్ల బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ముంపుపై మహారాష్ట్రతో అనుమతులు వస్తేనే ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు కానుంది. బ్యారేజీని కనీసం 150నుంచి 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అవకాశముంటుంది. దీంతో విద్యుత్ వినియోగం లేకుండానే కాలువల ద్వారా నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓ సర్వే సంస్థ వార్దా, పెన్గంగ కలిసే చోట 165 టీఎంసీలు నీటి లభ్యత ఉన్నట్లు అంచనా ఉన్నట్లు సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని గ్రావిటీతో తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు, ఆపై మిడ్ మానేరుకు అటు నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో ఏళ్లుగా ఈ ప్రాంత రైతాంగం పడుతున్న సాగు నీటి గోస తీరే అవకాశముంది. కుట్టు మిషన్లతో మహిళలకు ఉపాధిపనులు మొదలైతేనే ఊరట2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మాణంతో ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో 16లక్షల ఎకరాలకు నీరందాలి. ఇందులో ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలోనే 2లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే, ప్రాజెక్ట్పై పట్టింపు లేకపోవడంతో ముందుకు సాగలేదు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల పాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ మరుగునపడింది. మధ్యలో పలుసార్లు వార్దా, పెన్ గంగలపై ప్రత్యామ్నాయంగా బ్యారేజీ నిర్మించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. అయితే, ఆ ప్రతిపాదనలేవి ముందుకు సాగలేదు. ఇక ఇప్పటికే ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం తవ్విన కాలువలు కబ్జాలకు గురయ్యాయి. భూ సేకరణ పూర్తయి భూములు వృథాగా ఉన్నాయి. కాలువల కోసం వినియోగించే పైపులను కూడా తరలించారు. దీంతో ఈ ప్రాజెక్ట్పై ఆశలు వదులుకున్నారు. అయితే, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేయగా, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముందడుగు పడుతోంది. గత రాష్ట్ర బడ్జెట్లోనూ రూ.248కోట్లు ప్రతిపాదించారు. మహారాష్ట్రలో భూముల ముంపు సమస్య పరిష్కారమైతే ప్రాజెక్ట్ నిర్మాణానికి మార్గం సులువు కానుంది. -
పిల్లలను ప్రతిరోజూ పాఠశాలలకు పంపించాలి
● అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఆసిఫాబాద్రూరల్: పిల్లలను ప్రతిరోజూ పాఠశాలలకు పంపించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన టీచర్, పేరెంట్స్ మీటింగ్కు హాజరయ్యారు. విద్యార్థుల విద్యాప్రగతి, హాజరు, అభ్యసన సామర్థ్యాలు, క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాలు తదితర అంశాలపై తల్లిదండ్రులతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ ఇంటి వద్ద కూడా విద్యార్థులతో సాధన చేయించాలన్నారు. విద్యాప్రగతిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు 16 మంది ఎంపిక
ఆసిఫాబాద్అర్బన్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో 7, 8వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ గిరిజన క్రీడాపాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని హెచ్ఎం లింబారావు, వ్యాయామ ఉపాధ్యాయు డు బండ మీనారెడ్డి గురువారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు, కోచ్ విద్యాసాగర్కు ఐటీడీఏ పీవో మంద మకరందు, డీటీడీవో జాదవ్ అంబాజీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలి పారు. అలాగే పాఠశాల ఆవరణలో ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవో చిరంజీవి, హెచ్డబ్ల్యూవోలు విజయలక్ష్మి, సరిత, కోచ్లు అరవింద్, తిరుమల్ విద్యార్థినులను అభినందించారు. -
పోరు బాట!
తిర్యాణి: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం– 2005 ప్రారంభం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం వీబీ జీ రామ్జీ పథకం పరిధిలోకి వచ్చారు. అయితే ఉద్యోగ భద్రత లేకపోవడంతోపాటు వారికి కనీస వేతనాలు అందడం లేదు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో పోరుబాట పట్టారు. జూలై 27 నుంచి పెన్డౌన్ కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపుతున్నారు. అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. వేతనాల కోసం నిరీక్షణజిల్లాలో ప్రస్తుతం టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏలు) 74, ఏపీవోలు 11, ఈసీలు ఆరుగురు, కంప్యూటర్ ఆపరేటర్లు 37 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరికీ ప్రతినెలా 1 తేదీనే వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వీబీ జీ రాంజీ ఉద్యోగులకు మాత్రం ఈ ఆదేశాలు అమలు కావడం లేదు. జిల్లాలోని ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నా తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన పనులువీబీ జీ రాంజీ ఉద్యోగులు పెన్డౌన్ చేస్తుండటంతో జిల్లాలో కార్యక్రమాలు నిలిచిపోయాయి. వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఎస్టిమేషన్లు పంపించేవారు కరువయ్యారు. దీంతో నేటికీ మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం పూర్తిస్థాయి ముందుకు సాగడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి పథకం పనులకు సైతం బ్రేక్ పడింది. గ్రామాల్లో సామూహిక, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.ప్రధాన డిమాండ్లు ఇవే.. -
కలవని చేతులు!
ఆసిఫాబాద్: జిల్లా అధికార పార్టీ నాయకుల చేతులు కలవడం లేదు. వర్గ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ నేతల్లో విభేదాలు కొత్త కాకాపోయినా ఇటీవల ఏజెన్సీ మండలాల్లో కొందరు నాయకులు బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి మరీ తమ నిరసన తెలిపారు. ఇప్పుడు ఏకంగా డీసీసీ అధ్యక్షురాలిపై అసంతృప్తితో ఉన్న ఓ వర్గ నాయకులు, కార్యకర్తలు ఏకంగా హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగడం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక సీనియర్లను విస్మరిస్తూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. జిల్లా, మండల స్థాయి పదవుల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ విలేకరుల సమావేశం నిర్వహించి.. నాన్లోకల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గతంలోనూ వర్గపోరుకాంగ్రెస్ పార్టీలో గతంలోనూ పలుమార్లు వర్గపోరు బహిర్గతమైంది. స్థానిక నాయకత్వం, ఎన్నికల సీట్ల కేటాయింపు, నిధుల విషయంలో విబేధాలు బయటపడ్డాయి. ఒకసారి ఏకంగా రాష్ట్ర నాయకుల సాక్షిగా కుర్చీలు విసురుకోవడం గమనార్హం. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించి భంగపడ్డవారు స్వతంత్రంగా పోటీ చేశారు. ఫలితంగా పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవులు, నామినేటెడ్ పోస్టుల పంపిణీలో సమన్వయం లోపిస్తోంది. నేతల తీరుతో క్యాడర్లోనూ అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లా అధ్యక్షురాలిని మార్చాలని..ప్రస్తుతం కాంగ్రెస్ వర్గపోరు మొత్తం డీసీసీ పీఠం చుట్టూనే తిరుగుతోంది. జిల్లా అధ్యక్షురాలిని తక్షణమే మార్చాలని వ్యతిరేక వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా డీసీసీ అధ్యక్షుడిగా కొక్కిరాల విశ్వప్రసాదరావు పనిచేశారు. రాష్ట్రంలో అధికారంలో కొలువుదీరిన తర్వాత పరిణామాలతో రాష్ట్ర నాయకత్వం కొత్త అధ్యక్షుల నియామకాల వైపు మొగ్గు చూపింది. ఇందులో భాగంగా డీసీసీ పీఠం కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో ఆదివాసీ మహిళ అయిన ఆత్రం సుగుణను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో ఆ పదవిని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో అసమ్మతి నేతలు ఆత్రం సుగుణను స్థానికేతర నేత అంటూ గాంధీభవన్ మెట్లెక్కారు. రాష్ట్ర నాయకత్వం అందరినీ సమన్వయం చేసుకోకపోతే స్థానికంగా పార్టీకి నష్టం తప్పదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. -
పల్లెలకు ప్రత్యేక ప్రొఫైల్
ఆసిఫాబాద్: పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అవసరమైన డేటా సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే ఒక ప్రత్యేక ఫార్మాట్ అందజేశారు. ఈ నెల 4న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పంచాయతీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్ మాదిరిగా పంచాయతీ స్థాయిలో అదే విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) కింద ప్రతీ గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. విద్య, వైద్య, అటవీ, రెవెన్యూ, పౌరసరఫరాలు, డీఆర్డీఏతో పాటు 17 శాఖలతో సమావేశాలు నిర్వహించి, పల్లెల అవసరాలు తెలుసుకోనున్నారు. తద్వారా జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది. గ్రామ సభలు నిర్వహించి మండలాల వారీగా పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. విలేజ్ ప్రొఫైల్ తయారైతే ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టే అవకాశం ఉంది. గ్రామ జనాభాకు అనుగుణంగా రోడ్లు, తాగునీరు, విద్య, వైద్య తదితర మౌలిక వసతుల సదుపాయాలు మెరుగుపడనున్నాయి. యాప్లో సమగ్ర సమాచారంగ్రామ పంచాయతీల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తే నుంది. గ్రామ ఆవిర్భావం, ప్రొఫైల్ నుంచి మూడేళ్లలో ఏం చేయాలి, ఎంత బడ్జెట్ అవసరం ఉంది.. ఏ శాఖ నుంచి ఎంత ఖర్చు చేస్తున్నారు.. అనే పూర్తి వివరాలను 39 రకాల అంశాలతో డిజిటలైజ్ చేయనున్నారు. దీంతో ఒక్క క్లిక్తో గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. స్థానిక వనరుల ఆధారంగా పల్లెల అభివృద్ధి సాధనతో పాటు నిధుల్లో అవినీతి అక్రమాలను నియంత్రించడం, ప్రతీ పైసాకు లెక్క ఉండేలా ప్రణాళిక రచిస్తోంది. గ్రామ సభల ద్వారా ప్రజల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి, మూడేళ్లలో గ్రామాభివృద్ధి చేపట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పంచాయతీలో నాలుగు గ్రామ సభలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటికే జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.కార్యదర్శులకు శిక్షణ పూర్తి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ పూర్తయ్యింది. ఇప్పటికే పంచాయతీరాజ్ కమీషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. గ్రామ సభల్లో సేకరించిన సమాచారం ఆధారంగా గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపడతాం. – భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారివిలేజ్ ప్రొఫైల్వాంకిడి పంచాయతీ కార్యాలయంపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను మూడు భాగాలుగా వర్గీకరించారు. మొదటి భాగంలో విలేజ్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. ఇందులో గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. గ్రామం, విస్తీర్ణం, సరిహద్దులు, లొకేషన్, జనాభా, సీ్త్రలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంఖ్య, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, బిల్ కలెక్టర్, మల్టీపర్సస్ వర్కర్ల వివరాలు నమోదు చేయనున్నారు. సాగుభూమి, బోరుబావులు, కుంటలు చెరువులు, కాల్వలు, రహదారులు, వీధి దీపాలు, డ్రెయినేజీలు, హెల్త్ సబ్ సెంటర్లు, బ్యాంకులు, రేషన్ దుకాణాలు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, క్రీడాప్రాంగణాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పశు వైద్యశాలల వివరాలు నమోదు చేయనున్నారు. అలా గే పంచాయతీల ఆదాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, ఆసరా పింఛన్లు, గతంలో ఖర్చు చేసిన వివరాలు అప్లోడ్ చేస్తారు. -
అంకుసాపూర్లో సంయుక్త సర్వే
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ పరిధిలోని అటవీ భూములు, పట్టా భూముల విషయంలో నెలకొన్న వివాదంపై రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు, పట్టేదారులు గురువారం సంయుక్త సర్వే నిర్వహించారు. సర్వే నం. 145లో అటవీ శాఖకు కేటాయించిన 684 ఎకరాల భూములు పోగా, మిగిలిన భూములు పట్టేదారులకే చెందుతాయని ఆర్డీవో కృష్ణయ్య స్పష్టం చేయడంతో స్థానిక రైతులు అంగీకరించారు. భవిష్యత్తులో ఒక నిర్ణీత తేదీన పూర్తిస్థాయి జాయింట్ డిమార్కేషన్ చేపట్టి సరిహద్దులు నిర్ణయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, డీఎఫ్వో అప్పయ్య, సర్వేయర్లు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఉపాధ్యాయుల సర్దుబాటు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు(రేషనలైజేషన్) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాల ని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం డీఈవో సచ్చిదానంద చారితో కలిసి టీచర్ల సర్దుబాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు, ఉపాధ్యాయుల సీనియార్టీ, విద్యార్థుల సంఖ్యను పరి గణనలోకి తీసుకుని సర్దుబాటు చేపట్టాలన్నా రు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా కేటాయింపులు ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు. -
డీఎంహెచ్వోగా నాగేంద్ర బాధ్యతలు స్వీకరణ
ఆసిఫాబాద్: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గా డాక్టర్ సిడాం నాగేంద్ర గురువారం జిల్లా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఉషే గాం పీహెచ్సీ వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర కొన్ని నెలలుగా ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్వోగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయనను డీఎంహెచ్వోగా నియమిస్తూ వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఉత్తర్వుల జారీ చేశారు. జిల్లాలో వైద్య సేవలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అలాగే ఇప్పటివరకు డీఎంహెచ్వోగా విధులు నిర్వర్తించిన సీతారాం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, కాగజ్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వోగా సేవలందిస్తున్నారు. -
ఆదివాసీ సంప్రదాయాలు ఎంతో గొప్పవి
ఆసిఫాబాద్అర్బన్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదా యాలు ఎంతో గొప్పవని ఎస్పీ నితిక పంత్ అన్నా రు. ప్రజలకు మరింత చేరువ కావడం, ఆదివాసీ సమాజంతో సమన్వయాన్ని బలోపేతం చేసేందు కు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గు రువారం ఆదివాసీ పటేళ్లు, నాయకులు, గోండ్వాన రాయిసెంటర్ సర్మెడీలు, సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎంతో మంది యోధులు నడయాడిన నేల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అని, కుమురంభీం, రాంజీగోండ్ వంటి మహనీయుల త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, సామాజిక ఐక్యత పెంచడంలో పటేళ్లు, సర్మెడీలు కీలక పాత్రం పోషిస్తున్నారని తెలి పారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. జైనూర్లో ప్రతీ సోమవారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహిస్తామని తెలిపారు. అలా గే పోలీసు నియామకాల్లో ఉద్యోగాలు సాధించేలా ఆదివాసీ యువతకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అ నంతరం ఆదివాసీ యువకులు తమ గ్రామాల్లోని సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఆదివాసీ నాయకులు, ప్రజలు, పోలీసు అధికారులు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, ఆదివాసీ పటేళ్లు, గోండ్వాన రాయి సెంటర్ సర్మెడీలు సిడం అర్జున్మాస్టర్, పెందూర్ సుధాకర్, మోతీరాం, బుర్స పోచయ్య, కోవ విజయ్, చిన్నన్న, భీంరావ్, ప్రేమ్కుమార్, కిషన్, సభ్యులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం అమ్మకాలపై మహిళల కన్నెర్ర
కెరమెరి: కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న మద్యం విక్రయాలపై గిరిజన మహిళలు కన్నెర్రజేశారు. కెరమెరి మండలం అగుర్వాడా గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు గురువారం సర్పంచ్ వాడ్గురే రోజా ఆధ్వర్యంలో బెల్టు షాపులపై దాడులు చేశారు. షాపుల్లోని మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థా నికంగా బెల్టుషాపుల్లో మద్యం తాగి ఇంట్లో పెద్దలు గొడవలకు దిగుతున్నారని, మత్తులో మహిళలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా లుగు రోజుల క్రితమే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులను మరోసారి హెచ్చరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు మడావి బాగుబాయి, చహకటి నీలా బాయి, పైకుబాయి, శ్యామలాబాయి, కై నుబాయి, లక్ష్మిబాయి, జంగుబాయి, మంసుబాయి తదితరులు పాల్గొన్నారు. -
జయశంకర్ ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్అర్బన్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రొ.జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి జయశంకర్ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ఏఎంసీ చైర్పర్సన్ మంగతో కలిసి నివాళులర్పించారు. మహనీయులు చూపిన దారిలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో దాసరి వేణు, బీసీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఆర్డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలుకాగజ్నగర్రూరల్: ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. కోసిని శివారులోని 79, 80 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని గురువారం ఆర్డీవో కృష్ణయ్య, తహసీల్దార్ మధుకర్తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డు నం.15వ వార్డు, కాపువాడలో ఓ వ్యక్తి రహదారిని ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నాడని, ఓ వెంచర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్లాట్లు చేశారని ఆరోపణల వచ్చిన నేపథ్యంలో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ ఆస్తులకు హద్దులు నిర్ధారించి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, అధికారులు పాల్గొన్నారు. -
ప్రజా గాయకుడు గద్దర్కు నివాళి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో గురువారం ప్రజాగాయకుడు గద్దర్కు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్ మాట్లాడుతూ గద్దర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కళాకారుడని కొనియాడారు. పాటను ఆయుధంగా మార్చి పేదలు, బడుగు, బలహీన వర్గాల సమస్యలను ప్రపంచానికి వినిపించిన ప్రజా గాయకుడు అని అన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్, మాలి మహా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగోసె శంకర్, నాయకులు మారుతి, ఉపేందర్, సూర్యవంశీ తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7బయటకు వెళ్తే భయం కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో పశువులు, శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. రహదారిపై తిష్ట వేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 9లోu ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. చేనేత కళ చెదురుతోంది..! చేనేత పరిశ్రమకు చేయూత కరువైంది. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. నాడు ఓ వెలుగు వెలిగిన పరిశ్రమ నేడు డీలాపడింది. 8లోu శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
నాన్లోకల్ అనడం దివాలాకోరుతనం
జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నాయకులు వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని, తనను నాన్లోకల్ అనడం దివాలాకోరుతనమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కొంతమంది కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి అభివృద్ధి పనులిప్పిస్తామంటూ హైదరాబాద్ గాంధీ భవన్కు తీసుకెళ్లి తనపై ఆరోపణలు చేయించారన్నారు. కొందరు నాయకులు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకమని ఆరోపించారు. నాన్లోకల్ అంటున్న వారు ముందుగా తన గురించి తెలుసుకోవాలని, సిర్పూర్–యు మండలం పుల్లార గ్రామంలో పుట్టిన ఆదివాసీ బిడ్డనని స్పష్టం చేశారు. ఆదివాసీ బిడ్డను నాన్లోకల్గా చిత్రీకరించడం ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనన్నారు. 1995లో కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా గెలిచానని, అప్పటి నుంచి పార్టీ మారలేదని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా పార్టీ తనకు ఎంపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం తన పనితీరు, నిబద్ధతను గుర్తించిన అధిష్టానమే టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా, డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వీధుల్లో నిలబడి ప్రశ్నించడం అంటే అధిష్టానాన్ని సవాల్ చేయడమే అన్నారు. పార్టీ క్రమశిక్షణను దెబ్బతీసే చర్యలను ఏమాత్రం సహించబోనని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, ఆత్మ చైర్మన్ గడ్డల సత్తయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, నాయకులు జి.మల్లేశ్, తారిక్, భీమ్రావు, నాంపల్లి శంకర్, కమల్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు నియామకాల్లో న్యాయం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: పోలీస్ ఉద్యోగాల నియామకాల్లో నిబంధనల ప్రకారం 75శాతం కేటాయింపులు వర్తింపజేసి ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ నితిక పంత్కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత నోటిఫికేషన్లో జనరల్ జీవోల ప్రకారం పోస్టులు ఇవ్వడంతో ఏజెన్సీ ఆదివాసీ అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిగణనలోకి తీసుకుని జీవో నం. 24 ప్రకారం డీఎల్ఎస్సీ నిర్వహణ అనంతరం ఏజెన్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. కోరారు. సమస్యను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎస్పీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆత్రం అర్జున్, ఆత్రం ఆనంద్రావు, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం ఇస్తున్న నాయకులు -
రైతుబిడ్డకు రాష్ట్రస్థాయి ర్యాంకు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మండలం కొత్త సార్సాల గ్రామానికి చెందిన రైతు కందుల పోచయ్య– సుశీల దంపతుల కుమారుడు రాజన్న బుధవారం విడుదలైన పీజీ సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించాడు. స్థానిక రాస్పెల్లి జెడ్పీఎస్ఎస్లో పదో తరగతి, ఖమ్మం జిల్లా మధిరలో అగ్రిక ల్చర్ డిప్లొమా(82 శాతం మార్కులు) పూర్తి చేశాడు. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్సీఎస్) 81 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. పీజీ సెట్ ఫలితాల్లో ఎమ్మెల్సీ బోటనీ విభాగంలో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్తో మెరవడంతో ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
దేశ నిర్మాణంలో నవోదయ విద్యాలయాల కీలక పాత్ర
కాగజ్నగర్టౌన్: దేశ నిర్మాణంలో జవహర్ నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం 39వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ నవో దయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాయని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులు, విద్యాలయానికి పేరు తీసుకురావాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్సీని విద్యార్థులు స్కౌట్తో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ, ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేశ్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల మంగతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్ల ద్వారా నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. జిల్లాలోని సుమారు 80వేల మంది విద్యార్థుల రెండు జతల ఏకరూప దుస్తులు కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్ నిర్వహణ, రెబ్బెన మండలం నంబాల గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్, ప్రతినెలా ఒక్కో ఆర్టీసీ బస్సు ద్వారా రూ.70వేల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి సంఘాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు ఆదాయాన్ని పొందేలా వ్యాపార రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలి ఆసిఫాబాద్అర్బన్: ఎస్ఐఆర్ ప్రక్రియలో అనమలిస్ జాబితాలోని వివరాలను సరిచేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అనమలిస్ జాబితాలోని సంఖ్యను తగ్గించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 10లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
గాంధీభవన్కు చేరిన హస్తం వర్గపోరు!
ఆసిఫాబాద్: జిల్లాలో కాంగ్రెస్ నాయకుల వర్గపోరు హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరింది. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు వందమందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం గాంధీ భవన్కు తరలివెళ్లారు. పార్టీ పదవుల కేటాయింపుల్లో సీనియర్ కార్యకర్తలను విస్మరించారని, స్థానికేతరురాలైన సుగుణను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రెబ్బెన మాజీ ఎంపీపీ సోమయ్య, ఆర్టీఏ సభ్యుడు లావుడ్య రమేశ్తోపాటు పలువురు మాట్లాడుతూ మండల స్థాయి పార్టీ పదవుల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కోల్పోవడంతోపాటు మండల అధ్యక్ష నియామకాల్లో ఏకపక్ష నిర్ణయాలు, ఎస్ఐఆర్ బీఎల్ఏల నియామకాల్లో పారదర్శకత లోపించిందని మండిపడ్డారు. ఎస్సీ, మైనార్టీ సెల్ నియామకాల్లోనూ సామాజిక సమతుల్యత లోపించిందని, పీఎసీఎస్ నామినేటెడ్ పదవుల విషయంలోనూ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో 95 శాతం పదవులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించినట్లు ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు అహ్మదుల్లా, మహేశ్గౌడ్, సుదర్శన్ గౌడ్, శెండె దత్తు, మాజీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ఈ –కేవైసీ వేగంగా పూర్తి చేయాలి
కాగజ్నగర్టౌన్: రేషన్ కార్డుదారుల ఈ– కేవైసీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండలంలోని రేషన్ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలన్నారు. కాగజ్నగర్ మండలంలో 57 రేషన్ షాపులు ఉండగా 33,386 మందికి ఆహార భద్రత కార్డులు, అందులో 1,11,371 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 18,857 కార్డులకు సంబంధించిన 57,655 మంది ఈ– కేవైసీ పూర్తయ్యిందని తెలిపారు. 31,646 మంది ఈ– కేవైసీ పెండింగ్ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణయ్య, తహసీల్దార్ మల్లెపూల మధుకర్, మున్సిపల్ అధికారి రాజేందర్ పాల్గొన్నారు. -
శిక్షణతో బోధన మెరుగు
కెరమెరి: శిక్షణతో ఉపాధ్యాయుల బోధన మెరుగుపడుతుందని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం రెండో విడత ఎఫ్ఎల్ఎన్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు మెరుగుపర్చడంలో ఎఫ్ఎల్ఎన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతీ టీచర్ తరగతి గదిలో అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్, ఆర్పీలు శ్రీధర్, నరేశ్, రవితేజ పాల్గొన్నారు. -
ప్రజా‘వాణి’ మరింత చేరువ!
కెరమెరి: ప్రజలు జిల్లా కేంద్రం వరకు వెళ్లకుండా మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనుంది. ఇందుకోసం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. గతంలోనూ ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అలాగే కాగజ్నగర్లో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలోనూ కొనసాగింది. కానీ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా బదిలీ తర్వాత నిర్వహించడం లేదు. మండల కేంద్రాల్లో అధికారులు హాజరుకాకపోవడం, వినతుల పరిష్కారం కాకపోవడంతో ప్రజలు కలెక్టరేట్కు వెళ్లడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే ఈసారి మాత్రం కార్యక్రమాన్ని నామమాత్రంగా కొనసాగించకుండా ప్రతీ ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్లో నమోదు చేయనున్నారు. సంబంధిత అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. నోడల్ అధికారిగా ఎంపీడీవో జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మండల కేంద్రాల్లో 15 ఎంపీడీవో కార్యాలయాలు ఉన్నాయి. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. తహసీల్దార్, మండల పంచాయతీ అధికారులు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, విద్య, వైద్యం, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, అటవీ, గృహనిర్మాణ, రోడ్లు, భవనాలు, నీటి పారుదల తదితర శాఖల అధికారులు తప్పక హాజరుకావాల్సి ఉంది. ప్రతీ ఫిర్యాదును పోర్టల్లో నమోదు చేసి ఫిర్యాదుదారుడికి ఐడీతో రశీదు ఇస్తారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన కంప్యూటర్, స్కానర్తో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేనా..? జిల్లాలోని పలు మండలాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి. ప్రతీ సోమవారం ప్రజావాణికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు గిరిజనులు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలోనూ వినతులు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లు, రేషన్, భూ సమస్యలు, తాగునీరు, విద్యుత్, రహదారులు, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, ఉపాధి వంటి అంశాలపై వినతులు ఇవ్వడానికి మండల ప్రజావాణి ఒకే వేదికగా ఉపయోగపడనుంది. ప్రతీ అర్జీని ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, ప్రత్యేక ఐడీ ఇవ్వనున్నారు. అలాగే గడువులోగా పరిష్కరించడం, పర్యవేక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. అయితే స్థానికంగా మండల అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయడం, గడువులోగా పరిష్కరించడం, తదితర నిబంధనల కారణంగా పర్యవేక్షణ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఆప్రమత్తతే ఆయుధం
కాగజ్నగర్టౌన్: సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తూ చాలా మంది జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి. ఉన్నత చదువులు చదివి, సాంకే తిక విషయాలపై అవగాహన ఉన్నవారు సైతం సైబర్ వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో సైబర్ జాగృత దివాస్ సురక్షకా తిరంగా సైబర్ భద్రత కార్యక్రమంలో భాగంగా కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం హెచ్ఆర్డీ హాలులో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో అధిక పెట్టుబడి, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలు, సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ వేధింపులు, సైబర్ స్టాకింగ్ వంటి అంశాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్కుమార్, కుమారస్వామి, ఎస్సైలు, ఎంఈఓ ప్రభాకర్, ఎఫ్ఎస్ఓ, యువకులు, సీనియర్ సిటిజన్స్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ అనుభవాలు పంచుకున్నారు. ఏపీకే ఫైళ్లు డేంజర్ రాష్ట్రంలో ఒక్క రోజులోనే సైబర్ నేరాలతో సుమారు రూ.5 కోట్ల మేర ప్రజలు నష్టపోతుండగా, దేశవ్యాప్తంగా రోజుకు సుమారు రూ.70 కోట్ల వరకు నష్టం జరుగుతోంది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశను ఆసరాగా చేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. అనుమానాస్పద ఏపీకే ఫైళ్లు, లింకులతోనే చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. బ్యాంకింగ్, సోషల్ మీడియా డిజిటల్ సేవలకు సంబంధించిన పాస్వర్డ్లను తరచూ మార్చాలి. ఓటీపీలు, బ్యాంకుల వివరాలు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. సమీప పోలీస్టేషన్, సైబర్క్రైమ్ పోలీసులను కూడా సంప్రదించాలి. గోల్డెన్ అవర్లో స్పందిస్తే నగదు రికవరీకి అవకాశం ఉంటుందని ఎస్పీ వివరించారు. ఈ ఏడాది సైబర్ మోసాల వివరాలు మొత్తం పిటిషన్లు 262ఎఫ్ఐఆర్లు 27కోల్పోయిన నగదు రూ.2,62,86,270హోల్డ్లో ఉంచిన మొత్తం రూ.49,45,308బాధితులకు తిరిగి అందించిన మొత్తంరూ.7,25,709 -
ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులు, తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, రాయ్సెంటర్ సార్మెడిలతో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలన్నారు. తొమ్మిది గిరిజ న తెగలకు చెందిన ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు ఐకమత్యంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వేడుకల నిర్వహణకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో డీటీడీవో అంబాజీ, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు సిడాం అర్జు, బుర్స పోచయ్య, కుర్సింగ మోతీరాం, మడావి నర్సింగ్రావు, చహకటి దస్రు, కొడప విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ‘భూ భారతి’పై అవగాహన అవసరంఆసిఫాబాద్: భూభారతి పోర్టల్పై రెవెన్యూ శాఖ లోని జూనియర్ అసిస్టెంట్లకు అవగాహన అవసరమని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం జూనియర్ అసిస్టెంట్లకు భూ భారతి పోర్టల్పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్లు ఆపరేటర్లపై ఆధారపడకుండా కార్యాలయ పనులతోపాటు భూ భారతి పోర్టల్లో నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భూ సేకరణ అంశాలు, దరఖాస్తులు, ఇతర అంశాలతో పాటు ఏ పనిని అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు రాము, రవి కాంత్, జిలాని పాల్గొన్నారు. -
సందర్శించి.. బోధించి
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని తుంపల్లి ప్రభుత్వ పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వందశాతం హాజ రయ్యేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవా లన్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తు న్న నేపథ్యంలో ఉపాధ్యాయుల పనితీరు, విద్యాబోధనపైనే గ్రామాల్లోని పాఠశాలల భవిత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. -
కుమురం భీం
7వాడీవేడిగా మండల సమావేశం జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ పంచాయతీల సర్పంచులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. 9లోu ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో చాలాచోట్ల ఉరుములతో వర్షం కురిసే అవకాశం ఉంది. కళాశాలల్లో క్వాలిటీ ఫుడ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో న్యూట్రిషన్, శానిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు ఇందులో భాగస్వాములు కానున్నారు. 8లోu బుధవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
నేడు ‘నవోదయ’ ఫౌండేషన్ డే
ఆసిఫాబాద్రూరల్: కాగజ్నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం 39వ ఫౌండేషన్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు డీఈవో సచ్చిదానంద చారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవోదయ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణతో కలిసి మాట్లాడారు. నవోదయ విద్యాలయాలు పేద విద్యార్థులకు వరం లాంటివని తెలిపారు. జిల్లాలోని అర్హులు ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 7లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 1986లో ప్రారంభమైన జవహర్ నవోదయ పాఠశాల ఎంతో మందికి దారి చూపిందని తెలిపారు. ఇప్పటివరకు తమ పాఠశాల నుంచి ఏడుగురు సర్వీసెస్కు ఎంపికయ్యారన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఏఐ, మల్టీ స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో పీజీటీ డాక్టర్ రామయ్య, పేరెంట్ కమిటీ మెంబర్ ఊషన్న, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం కళాశాలను సందర్శించి.. తరగతి గదులు, ల్యాబ్లు, లైబ్రరీ, హాస్టల్, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత ఇంజినీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ 15 రోజులకు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యేను పిన్సిపాల్, ప్రొఫెసర్లు శాలువాతో సన్మానించారు. -
రైతులపై రవాణా భారం!
రెబ్బెన: పెరిగిన ఎరువుల ధరలతో సతమతమవుతున్న అన్నదాతలపై మరోభారం పడింది. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఎరువులు లభించేవి. ఇక నుంచి సహకార సంఘాలకు సరఫరా చేసే ఎరువుల రవాణా భారాన్ని రైతులే భరించాలి. రవాణా చార్జీలను రద్దు చేస్తూ జీవో విడుదలైంది. ప్రస్తుతం రవాణా చార్జీలతో కలిసి ఎరువుల బస్తాలు విక్రయిస్తున్నారు. సాధారణంగా సహకార సంఘాలకు మార్క్ఫెడ్ ద్వారా రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తారు. గోదాముల నుంచి లారీల ద్వారా ఎరువులను పంపిస్తూ లారీ కిరాయి, హమాలీ ఖర్చులను మార్క్ఫెడ్ భరించేది. సహకార సంఘాలు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించేవి. అయితే జూలై 9 నుంచి సహకార సంఘాలకు మార్క్ఫెడ్ పంపించే ఎరువులకు సంబంధించిన లారీ కిరాయి ఖర్చును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల మాదిరిగానే సహకార సంఘాల్లోనూ ప్రభుత్వ ధర కంటే ఎక్కువ ధరకు ఎరువుల బస్తాలను విక్రయిస్తున్నారు. లారీల కిరాయి, హమాలీ ఖర్చులను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఒక్కో బస్తాపై రూ.32 నుంచి రూ.55 వరకు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై ఏకంగా రూ.200 నుంచి రూ.300 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఖర్చుజిల్లాలో ప్రస్తుతం 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 15 మండలాలకు చెందిన రైతులకు ఎరువులను విక్రయిస్తున్నారు. జిల్లాలోని సహకార సంఘాలకు మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని గోడౌన్ల నుంచి అవసరాన్ని బట్టి ఎ రువుల బస్తాలు అందిస్తున్నారు. ఆదిలాబాద్ దూ రం కావడంతో ఈ సీజన్లో అధికంగా మంచిర్యాల నుంచే సరఫరా చేస్తున్నారు. గతంలో మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి సరఫరా చేసే ఎరువు ల బస్తాలకు రవాణా చార్జీలను మార్క్ఫెడ్ భరించగా.. ప్రస్తుతం ఎల్వోఎల్ను ఉపసంహరించుకున్నారు. మంచిర్యాల నుంచి రెబ్బెనకు ఒక లారీ ఎరువులను(444 బస్తాలు) తీసుకువస్తే కిరాయి రూ.12,978 అవుతుంది. హమాలీ మామూలు కింద మరో రూ.1000 అదనంగా చెల్లిస్తున్నారు. అదే ఆదిలాబాద్ నుంచి తీసుకువస్తే లారీ కిరాయి కింద రూ.23,360, హమాలీ మామూలు కింద మరో రూ.1000తో కలిపి మొత్తం రూ.24,360 ఖర్చు అవుతోంది. ఈ మొత్తాన్ని రైతుల నుంచే రాబడుతున్నారు. మంచిర్యాల నుంచి ఎరువులను తీసుకువస్తే ఒక్కో బస్తాపై రైతుపై రూ. 31.48, అదే ఆదిలాబాద్ నుంచి సరఫరా అయితే రూ.54.86 అధికంగా భారం పడుతోంది. కౌటాల, బెజ్జూర్ ప్రాంతాల రైతులపై ఈ భారం దాదాపు రూ.50 నుంచి రూ.70 వరకు ఉంటుంది. రవాణా చార్జీలు ఇవ్వడం లేదుఇంతకు ముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సరఫరా చేసే ఎరువుల రవాణా చార్జీలను మార్క్ఫెడ్ భరించింది. ఈ నెల 9 నుంచి ఆ చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్లు జీవో విడుదల చేసింది. ప్రస్తుతం రవాణా చార్జీల భారాన్ని కలిపి రైతుల నుంచి తీసుకుంటున్నాం. తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో మార్క్ఫెడ్ ఈ విషయంపై పునరాలోచిస్తోంది. – కరుణాకర్, జిల్లా సహకార శాఖ అధికారిరైతుల నుంచి వ్యతిరేకతసహకార సంఘాల ద్వారా విక్రయించే ఎరువులపై రవాణా భారాన్ని మోపుతుండటంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో సహకార సంఘాల్లో కేవలం యూరియా మాత్ర మే అందుబాటులో ఉండగా, రూ.266లకే లభ్యమయ్యేది. అదే ప్రైవేటు ఫర్టిలైజర్ షాపుల్లో ఒక్కో యూరియా బస్తాను రూ.330 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. సహకార సంఘంలో కొనుగోలు చేస్తే దాదాపు రూ.60 నుంచి రూ.80 వరకు ఆదా అవుతోంది. ఈ సమయంలో మార్క్ఫెడ్ రవాణా భారాన్ని రైతులపై మోపడంతో రూ.32 వరకు భారం పడుతోంది. ఈ సీజన్ ప్రారంభంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సహకార సంఘాల రవాణా భారాన్ని సైతం రైతులపై మోపడంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. -
తల్లిపాలే అమృతం!
ఆసిఫాబాద్అర్బన్: శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలే తొలి పెట్టుబడి.. వారిలో రోగ నిరోధక శక్తిని పెంచి, భవిష్యత్తులో వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. కొందరు తల్లులు మాత్రం అవగాహన లేపోవడం, అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పోతపాలు పట్టిస్తున్నారు. ఫలితంగా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాల విశిష్టతను వివరిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించగా, ఈ నెల 7 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ముర్రుపాలు పట్టడం, తల్లిపాల ప్రాముఖ్యతపై సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలింతలకూ పోషకాహారం అవసరంజిల్లా వ్యాప్తంగా ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 39,153 మంది చిన్నారులు, 4,507 మంది గర్భిణులు, 1,853 మంది బాలింతలు ఉన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే 70 శాతం మంది తల్లులు ముర్రుపాలు పట్టిస్తుండగా, ఆరు నెలల వరకు పాలు మాత్రమే పట్టించేవారు కేవలం 30 శాతం మందే ఉంటున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రసవం తర్వాత బాలింతలు తీసుకునే ఆహారం కూడా పోషక విలువలతో కూడి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తల్లి పోషకాహారం తీసుకుంటేనే బిడ్డకు కూడా పాలు సమృద్ధిగా అందుతాయి. బాలింతలు రోజుకు 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల పప్పు, తప్పనిసరిగా పాలు తీసుకోవాలి. ఆహారంలో పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ముర్రుపాలతో రోగాలు దూరంబిడ్డ పుట్టిన మొదటి రెండురోజులు ఎంతో కీలకం. తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలి. ఇందులో కొలోస్ట్రమ్ పుష్కలంగా ఉండి బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పలు రకాల వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ఆరు నెలల పాటు తల్లిపాలు ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. శారీరక, మానసిక వికాసానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, పిండి పదార్థాలన్నీ సమతుల్యంగా లభిస్తాయి. అందుకే కనీసం ఆరు నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలనే అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పిలుపునిస్తోంది. పోతపాలు తాగే పిల్లలతో పోలిస్తే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ. కొన్ని రకాల క్యాన్సర్లు, మానసిక రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది. పాలు ఇవ్వడం బిడ్డకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. కాన్పు తర్వాత వచ్చే మానసిక ఒత్తిళ్లు సైతం తగ్గుతాయి. పాలిచ్చే సీ్త్రలలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు చాలా వరకు తగ్గుతుంది. -
బాల ఆధార్కు బాలారిష్టాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందే ‘బాల ఆధార్’ సేవలు బాలారిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వరకు ఎలాంటి బయోమెట్రిక్ నమోదు లేకుండానే బాల/శిశు ఆధా ర్ జారీ చేయాలనే ఉద్దేశంతో యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రత్యేకంగా ఈ వీలు కల్పించింది. మొదట పిల్లలకు పేర్లు పెట్టకముందే బేబీ ఆఫ్తోనే తల్లిదండ్రుల ఆధార్తో కార్డులు జారీ చేశారు. కానీ కొన్ని చోట్ల ఈ సేవను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించారు. దీంతో మీ సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం ఉంటేనే బాల ఆధార్ నమోదు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వాసుపత్రుల్లో ఈ సేవలు అందడం లేదు. మంచిర్యాల, ఆసిఫా బాద్, కాగజ్నగర్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రభుత్వాసుపత్రుల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సేవలు కూడా అందడం లేదు. దీంతో తల్లిదండ్రులు చిన్నారులకు ఆధార్ కోసం తిప్పలు పడుతున్నారు. ఆధార్ చిన్నారుల నివాస రుజువు, తల్లిదండ్రుల ఆధార్తో అనుసంధానం, టీకాలు, ‘అభా’ కార్డు, రేషన్కార్డుతోపాటు ఇతర అనేక చోట్ల తప్పనిసరిగా మారింది. ప్రతీరోజు సాంకేతిక సమస్యలే..రాష్ట్ర వ్యాప్తంగా ప్రసవాలు అధికంగా జరిగే పీహెచ్సీలు, సీహెచ్సీలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో కేసీఆర్ కిట్ నిర్వహణ చూసే సిబ్బందికే బాల ఆధా ర్ జారీ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 140మంది వరకు సిబ్బందికి ప్రత్యేకంగా ట్యాబ్లు అందజేశారు. ఈ యాప్లో శిశు ఫొటో, తల్లిదండ్రు ల వివరాలు నమోదు చేసి, కార్డు జారీ చేయవచ్చు. ఈ సేవలు అవకాశం ఉన్నా ఏ ప్రభుత్వ ఆసుపత్రి లోనైనా ఉచితంగా పొందవచ్చు. చాలా చోట్ల ఈ కార్డు జారీపై అవగాహన లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పొందే సేవలకు దూరం అవుతున్నా రు. ఇక ఎవరైన ఆధార్ కోసం వెళ్లినా యాప్ సరిగా పని చేయకపోవడంతో రోజుల తరబడి సేవలు ని లుస్తున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వాట్సాప్ వేదికగా సాంకేతిక సమస్యలు తీర్చాలని ఎప్పటికప్పుడు గ్రూప్లో పోస్టు చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. ఓటీపీలు రాక, సర్వర్ ఎర్రర్, వివరాలు అప్ లోడ్ కాక అవస్థలు పడుతున్నారు. సాంకేతిక సమస్యలను హైదరాబాద్ కేంద్రంగా ఈ యాప్లో ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉన్నా పట్టింపు కరువైంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లో తల్లి, బిడ్డ ఒకే చోట ఉన్న సమయంలోనే ఉచితంగా సులువుగా పొందే ఆధార్ కార్డు ప్రైవేటు ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. -
అనుమానిత వ్యక్తుల సమాచారం అందించాలి
రెబ్బెన: బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు అందించాలని డీఎస్పీ అశోక్ అన్నారు. మండలంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లో మంగళవారం తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆటోస్టాండ్లో డ్రైవర్లతో మాట్లాడారు. అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డ్రైవర్లు సహకరించొద్దన్నారు. గంజాయి అమ్మినా తాగినా కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయికి సంబంధించి సమాచారం ఉన్నా తెలియజేయాలని సూచించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించే అవకాశం లేనివారు ఈగల్ ఫోర్స్కు 1908 కాల్ చేయాలని కోరారు. కార్యక్రమాల్లో రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల రక్షణ కోసమే పోక్సో చట్టం
కెరమెరి: పిల్లల రక్షణ కోసమే పోక్సో చట్టం రూపొందించారని, దీనిపై ప్రతీ విద్యార్థి అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర అన్నారు. మండలంలోని ఝరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పలు చట్టాల గురించి వివరించారు. రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, మహిళల రక్షణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్యవివాహాల నిషేధం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లలపై లైంగిక వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎలాంటి వేధింపులకు గురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్ఎం భరత్కుమార్, ఏఏపీసీ చైర్పర్సన్ రాధాబాయి తదితరులు పాల్గొన్నారు. -
‘క్యాచ్ ది రెయిన్’పై చిత్రలేఖన పోటీలు
కాగజ్నగర్టౌన్: పెట్రోల్ పంప్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం క్యాచ్ ది రెయిన్ అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ ‘వర్షపు చుక్కను ఒడిసిపట్టుకుందాం’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. వర్షపు నీటి గుంతల ఏర్పా టు, చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి అంశాలపై విద్యార్థులు ఆకర్షణీయమైన చిత్రాలు గీసి ఆకట్టుకున్నారు. మున్సిపల్ అధికారులు యశ్వంత్, ఉపాధ్యాయులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
వాన చినుకును ఒడిసిపడదాం..!
కాగజ్నగర్టౌన్: భూగర్భ జలాలు అడుగంటుతు న్న నేపథ్యంలో నీటి సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నీటిని పొదుపుగా వాడుకోవడంపై పట్టణాల్లోని ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయంలో క్యాచ్ ది రెయి న్ డిజిటల్ ఫ్లెక్సీలు కార్యాలయ ఆవరణలో ఏర్పా టు చేశారు. అలాగే క్యాచ్ది రెయిన్ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ ప్రచా రం చేస్తున్నారు. పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. 20వేలకు పైగా గృహాలు ఉండగా, 70 వేలకు పైగా జనాభా ఉంది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద పట్టణ ప్రజ లు, అధికారులు సెల్ఫీలు దిగుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా అకౌంట్లలో అప్లోడ్ చేస్తుండడంతో వైరల్గా మారుతోంది. అందరూ భాగస్వాములు కావాలి నీట సంక్షోభాన్ని అధిగమించేందుకు నీటిని పొదుపుగా వాడుకునే కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలి. పట్టణ ప్రజలు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇళ్లతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో కూడా రూఫ్టాప్ రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. – తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్నీటి సంరక్షణ చర్యలివే..రూఫ్ టాప్ హార్వెస్టింగ్: ఇంటి పైకప్పు నీటిని పైపుల ద్వారా బోరులోకి లేదా ట్యాంక్లోకి మళ్లించాలి. రీచార్జ్ పిట్: ఇంటి ఆవరణలో చిన్న గుంత తీసి వర్షపు నీటిని భూమిలోకి పంపించాలి. నీటి వృథాను అరికట్టడం: లీకేజీ ట్యాప్లు సరిచేయడం, అవసరానికి మించి నీటిని వాడకుండా ఉండడం. సమీపంలోని చెరువులు, కుంటల పరిశుభ్రతలో పాల్గొనడం. -
ఇంటర్ సిలబస్ మారింది
మంచిర్యాలఅర్బన్: ఇంటర్ విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి నూతన కరికులమ్, సవరించిన పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన పద్ధతులు అమలు చేయనుంది. ఇంటర్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారిత విద్యపై అధ్యాపకులకు జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఏఐ బోధన ద్వారా ఇంజినీరింగ్లో చేరే విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగనుంది. ఉన్నత విద్యతోపాటు భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలకు పునాది పడనుంది. రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇలా..నూతన విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు హైదరాబాద్లో పలు వేదికలపై జూలై 31 నుంచి ఆగస్టు 5వరకు మూడు విడుతల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిక్ రిసోర్స్ పర్సన్లకు (డీఆర్పీ) రెండు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 సబ్జెక్టుల్లో ఇంగ్లిష్ మినహాయిస్తే సబ్జెక్టుకు ఒక్కరి చొప్పున 10 మంది అంటే దాదాపు 40 మంది అధ్యాపకులను డీఆర్పీలుగా ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. డీఆర్పీలు జూనియర్ లెక్చరర్లకు ఇదే తరహాలో రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాథమికాంశాలైన ఏఐ నిర్వచనం, చరిత్ర, రోజువారీ జీవితంలో దాని అప్లికేషన్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిప్ లెర్నింగ్ మధ్య తేడాలు, గణిత శాస్త్రానికి ఏఐ, ప్రోగ్రామింగ్ పునాదులు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం..రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు జిల్లాల వారీగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. మారిన సిలబస్లో కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో తీసివేసిన, కొత్తగా చేర్చిన పాఠ్యాంశాలను సులభంగా ఎలా బోధించాలో అవగాహన కల్పించనున్నారు. క్లాస్రూమ్లలో టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాధనాలు, డిజిటల్ పద్ధతులను ఉపయోగించి పాఠాలను ఆకర్షణీయంగా ఎలా చెప్పాలో శిక్షణ ఇస్తారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే నూతన అసెస్మెంట్, పరీక్షల ప్యాట్రన్పై స్పష్టతనిస్తారు. కేవలం సబ్జెక్టు బోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా గైడెన్స్ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయనున్నారు.ఉమ్మడి జిల్లాలో ఇంటర్ కళాశాలలు, విద్యార్థుల వివరాలుజిల్లా కళాశాలలు విద్యార్థులు మంచిర్యాల 10 4,320 నిర్మల్ 13 4,844 ఆదిలాబాద్ 13 6,606 కుమురంభీం 11 4,180పాఠ్యాంశాల్లో మార్పులు..ఇంటర్మీడియెట్ తెలుగు పుస్తకాన్ని మొత్తం మా ర్చేశారు. సబ్జెక్టుల వారీగా అనేక మార్పులు చేశా రు. జంతుశాస్త్రంలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించగా.. ఫస్టియర్లో ప్రాక్టికల్స్కు 15 మార్కులు, భౌతికశాస్త్రంలో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చేర్చడంతో పాటు ప్రాక్టికల్స్కు 15 మార్కులు, వృక్షశాస్త్రంలో ఆర్థిక వృక్షశాస్త్రం చేర్చి ప్రాక్టికల్స్కు 15 మార్కులు కేటాయించారు. గణితంలో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతం అధ్యాయాలు చేర్చా రు. రసాయనశాస్త్రంలో ప దార్థాల స్థితులు, ప ర్యావరణ రసాయన శాస్త్రం, స్టోయికియోమెట్రీ పాఠంలో మెలారిటీ భావన తొ లగించారు. మొ దటి సంవత్సరం ప్రాక్టీకల్ పరీక్షల కోసం క్వాలి టేటివ్ అనాలసిస్ నుంచి 15 లవణాలు కొత్తగా చేర్చారు. హిస్టరీలో యూనిట్–6లో దక్షిణ భారతదేశం, దక్కన్రాజ్యాలు, యూనిట్–8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చగా మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల తొలగించారు. సు ల్తానేట్ రాజవంశీయుల అంశం యూనిట్–7లో కలిపారు. యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలన కు వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు, జా తీయోద్యమం (తొలిదశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఎకనామిక్స్లో పాజిటివ్ ఎకనా మిక్స్, నార్రేటివ్, నార్మేటివ్ ఎకనామిక్స్ చేర్చా రు. స్టాటిస్టిక్స్ సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు. తెలుగులో పాఠ్యాంశాలు మార్పులు చేశారు. -
రెండో విడత ‘ఇందిరమ్మ’ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ పథ కం అమలు వేగవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కా న్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ప్రకాశ్, డిప్యూటీ ఈఈ వేణుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో లబ్ధిదారుల డెస్క్ పరిశీలన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 10 లోపు, కెరమెరి మండలంలో 13 దరఖాస్తులు మా త్రమే పెండింగ్ ఉన్నందున మంగళవారం నాటికి డెస్క్ పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. సిర్పూర్–టి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, వాంకిడి, లింగాపూర్, రెబ్బెన మండలాల్లో వందలోపు దరఖాస్తులు పెండింగ్ ఉన్నందున శనివారం సాయంత్రంలోగా పరిశీలన పూర్తి కావాలన్నారు. ఎల్– 1, 2, 3 జాబితాల్లోని లబ్ధిదారుల వివరాలు పరిశీలించి, ప్రజావాణిలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన 500 రూఫ్ రీప్లేస్మెంట్ ఇళ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆర్సీ లెవల్లో ఉన్న 2,712 ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డెస్క్, క్షేత్రస్థాయి పరిశీలనలు గడువులోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
యాప్లోనే ఎరువుల బుకింగ్
కాగజ్నగర్టౌన్/కౌటాల: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన యాప్లోనే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని డీఏవో వెంకట్ అన్నారు. కాగజ్నగర్ మండలం వంజీరి రైతు వేదికలో దహెగాం, కాగజ్నగర్, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాలు, కౌటాల రైతు వేదికలో బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి మండలాలకు చెందిన ఎరువుల డీలర్లతో సోమవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి ఫర్టిలైజర్ యాప్లోనే యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొత్త యాప్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెట్కు యూరియా సరఫరా తగ్గుతుందని తెలిపారు. సమావేశాల్లో ఏడీఏ మనోహర్, ఏవోలు రామకృష్ణ, కార్తీష, నాగరావు, ఏఈవోలు శ్రీనివాస్ అంజన్న, ఘాన్శ్యాం, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భా గంగా నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస, డ్యాన్స్, పాటల పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు సోమవారం డీఎస్పీ అశోక్తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్యంతో చదివితే తప్పక విజయం సాధిస్తారని తెలిపారు. కా ర్యక్రమంలో ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణుల ప్రయాణ వేదన
పెంచికల్పేట్: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. జిల్లాలోని మా రుమూల గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో గర్భిణుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. భారీ వర్షాలకు మట్టిరోడ్లు బురదమయంగా మారడంతో 108, 102 అంబులెన్స్లు నడవడం లేదు. గిరిజన గ్రామాల నుంచి వైద్యం కోసం కాలినడకన, ప్రైవేటు వాహనాల్లో అస్పత్రులకు చేరుకుంటున్నారు. ఇటీవల పెంచికల్పేట్ మండలం మురళీగూడ గ్రామానికి చెందిన ఆరుగురు గర్భిణులు నెలవారీ వైద్యపరీక్షలకు కాలినడకన సుమారు కిలోమీటరు నడిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి 3 కిలోమీటర్లు గూడ్స్ వాహనంలో ప్రయాణించి 102 వాహనం వద్దకు చేరుకున్నారు. అనంతరం 102 వాహనంలో ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకున్నారు. ఏటా జిల్లాలో ఎక్కడో ఒకచోట రోడ్డు సౌకర్యం లేక సకాలంలో వైద్యం అందక మాతాశిశు మరణాలు నమోదవుతున్నాయి. 135 హైరిస్క్ గ్రామాలుజిల్లాలోని 15 మండలాల్లో ఈ సీజన్లో 619 మంది గర్భిణులను గుర్తించారు. ఇందులో ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 330 ప్రసవాలు జరిగాయి. ఎలాంటి రహదారి సౌకర్యం లేని 135 గ్రామాలను వైద్యారోగ్య శాఖ అధికారులు హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో 34 మంది గర్భిణులు ఉన్నట్లు గు ర్తించగా, ఇందులో 26 మందికి ప్రసవం జరిగింది. పెంచికల్పేట్ మండలంలోని నందిగామ, మురళీగూడ, జిల్లెడ, కమ్మర్గాం, మెరెగూడ, దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, లోహ, బెజ్జూర్ మండలంలోని సోమిని, మొగవెల్లి, సుశ్మీర్, చింతలపల్లి, చింతలమానెపల్లి మండలంలోని దిందా, కాగజ్నగర్ మండలంలోని మానిక్పటార్, మాలిని, సిర్పూర్(టి) మండలంలోని ఇటికలపహా డ్తో పాటు ఆసిఫాబాద్ డివిజన్లోని ఏజెన్సీ గ్రా మాల్లో చాలా గ్రామాలకు సరైన రహదారులు లేవు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు బురదమయంగా మారాయి. కనీసం రోడ్ల వెంట 108 వాహనాలు నడిచే కూడా అవకాశం లేదు. దీంతో వైద్యం కోసం గర్భిణులకు ఇక్కట్లు తప్పడం లేదు. హైరిస్క్ గ్రామాల్లో గర్భిణులను ముందస్తుగా అస్పత్రులకు తరలించి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.జిల్లాలో గర్భిణుల వివరాలు ప్రభుత్వ ఆస్పత్రులు -
ఈ– కేవైసీ పూర్తి చేయడం కీలకం
ఆసిఫాబాద్: గడువులోగా రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం కీలకమని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం మీ సేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల ఆపరేటర్లతో స మీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యుల ఈ కేవైసీలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. ప్ర జలకు అసౌకర్యం కలగకుండా ఆధార్ అప్డేట్ పూర్తి చేయడం ఆపరేటర్ల బాధ్యతన్నారు. అధికారులు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఈ– డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతంరాజ్, డీఎం జి.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఫిర్యాదు పరిష్కరించేందుకు చర్యలు
ఆసిఫాబాద్: ప్రతీ ఫిర్యాదును చట్టబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతఆసిఫాబాద్: మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీ సు శాఖ తొలి ప్రాధాన్యత కల్పిస్తుందని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జూలైలో జిల్లావ్యాప్తంగా షీటీం ఆధ్వర్యంలో 30 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పోక్సో చట్టం, మహిళల భద్రత అంశాలపై అవగాహన కల్పించామన్నారు. 98 హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించి 9 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. 12 ఫిర్యాదులు స్వీకరించగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రెండు కేసుల్లో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. వేధింపులు, హింస, సైబర్ వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా ఆసిఫాబాద్ డివిజన్ షీటీం 87126 70564, కాగజ్నగర్ డివిజన్ షీటీం 8712670565 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తాగునీరు అందడం లేదని, సమస్య పరిష్కరించాలని లింగాపూర్ మండలం పిట్టగూడ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 వాహనం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. రెబ్బెన మండలం దేవలగూడలో యూటర్న్ మూసివేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, తక్షణమే యూటర్న్ను పునరుద్ధరించాలని గ్రామస్తులు దరఖాస్తు చేసుకున్నారు. కెరమెరి మండలం సాంగ్వి గ్రామంలో 2024లో మంజూరైన సీసీ రోడు పనులు పూర్తి చేసిన నేపథ్యంలో బకాయిలు ఇప్పించాలని రమేశ్ విన్నవించాడు. వాంకిడి మండలం గోయగాం గ్రామంలోని తెలంగాణ– మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నాగదేవత భీమన్న గుడిలో బోర్వెల్ తొలగించారని, తిరిగి వేయించాలని భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. మూడెకరాల భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతామని బెదిరిస్తున్నారని, ఉమ్మడి సర్వే చేపట్టి కొత్త పట్టా ఇప్పించాలని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పుల్లుబాయి దరఖాస్తు చేసుకున్నారు. మరణించిన తన భర్త పేరుమీద ఉన్న అటవీ భూమి హక్కు పత్రాలు మార్చాలని రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన జరుపుల జుమ్లిభాయి వేడుకుంది. రైతు భరోసా నిధులు జమ చేయాలని సిర్పూర్(యూ) మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రామె అర్జీ అందించాడు. ఇల్లు మంజూరు చేయాలి నాకు మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు ఆన్లైన్లో చూపించింది. కానీ అధికారులు మాత్రం రాలేదని చెబుతున్నారు. పట్టణంలోని కంచుకోటలో చిన్న గుడిసెలో ఉంటున్నాం. రెండో జాబితాలోనైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి. – ఖైరున్నీసా, ఆసిఫాబాద్ పింఛన్ మంజూరు చేయాలి అనారోగ్యంతో బాధపడుతున్నా. వివాహం కానందు న ప్రభుత్వం ఒంటరి మహిళా పింఛన్ మంజూరు చే యాలి. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – సమీర సలక్క, చింతలమానపల్లి -
ఆకట్టుకున్న క్షిప్రావధానం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన క్షిప్రావధానం ఆకట్టుకుంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన తెలుగు పండితులకు ఐదురోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా అష్టావధాని మాడుగుల నారా యణమూర్తి క్షిప్రావధానం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముదు బాల రాజేంద్రప్రసాద్ సంచాలక అధ్యక్షుడిగా వ్యవహరించగా, డీఆ ర్పీ నల్లగొండ సత్యనారాయణ సమన్వయం చేశారు. అవధాన పద్యాలతో సభ ప్రారంభమైంది. తొలుత రాజేంద్రప్రసాద్ అవధానాల విధివిధానాలు, తీరుతెన్నులు, క్షిప్రావధానం ప్రత్యేకత గురించి వివరించారు. తెలుగు పండితురాలు భువనేశ్వరి అప్రస్తుత ప్రసంగం, అర్థవంతమైన ప్రశ్నలతో భావస్పోరక హా స్య, వ్యంగ్య సమాధానాలతో సభను రంజింపజేశారు. పుష్పలత వ్యస్తాక్షరిగా, వెంకటాద్రి న్యస్తాక్షరి పృచ్చకులుగా ప్రశ్నించారు. కార్యక్రమం ఆధ్యంతం రసవత్తరంగా సాగింది. ఏసీఎంవో పుర్క ఉద్దవ్, కోర్సు డైరెక్టర్ కొడం రవీందర్, తెలుగు పండితులు పాల్గొన్నారు. -
నిలిచిన యంత్రలక్ష్మి
కెరమెరి: అన్నదాతలకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. విత్తనాలు, ఎరువుల ధరలు అమాంతం పెంచడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ఏటా యంత్ర పరికరాలు, ఇతర రాయితీలు అందించా ల్సిన సర్కారు ఆ వైపుగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. రాయితీపై వ్య వసాయ యంత్రాలు, పనిముట్లు అందించాలని రై తులు ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలే దు. అబ్కీ బార్ కిసాన్ సర్కారు.. అని చెప్పుకొంటున్న కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరస్థితులకు భి న్నంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. వా నాకాలం సీజన్ ప్రారంభమై రెండునెలలైనా యంత్రపరికరాల పంపిణీపై దృష్టి సారించలేదు. ఆర్థికంగా చితికిపోతున్న రైతులుఅన్నదాతలకు వ్యవసాయం పెనుభారంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు అమాంతం పెరగడంతో ఆర్థికభారం మోస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించడం లేదు. ఏటా పెట్టుబడి సాయంగా రైతుభరోసా ఇస్తున్నా ఏమాత్రం సాగు ఖర్చులకు సరిపోవడంలేదు. దీంతో రైతులు వ్యవసాయాన్ని భారంగా భావిస్తున్నారు. నిధులు లేవని 2018 నుంచి యంత్రలక్ష్మి పథకాన్ని నిలిపివేశారు. నాలుగేళ్లుగా రాయితీ విత్తనాల పంపిణీ నిలిచిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధికధరలకు కొనుగోలు చేసి అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. పరికరాలు పంపిణీ చేయాలి ప్రభుత్వం ఎకరాకు రూ.6వేల పెట్టుబడి సాయం ఇవ్వడం మంచిదే. కానీ, వ్యయసాయ యంత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో వ్యవసాయశాఖ నుంచి వివిధ రకాల పరికరాలు అందేవి. ప్రస్తుతం సాగుకు ఖర్చులు అధికమవుతున్నాయి. – సోనేరావు, రైతు, కెరమెరి రాయితీలిచ్చి ఆదుకోవాలి విత్తనాలు, యూరియా ధరలు పెరిగాయి. వ్యవసాయం చేద్దామంటే ప్రస్తుతం చేతిలో డబ్బులుంటే గాని కుదరని పరిస్థితి ఉంది. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతుభరోసాతోనే చేతులు దులుపుకొంటోంది. ఎప్పటిలాగే రాయితీలిచ్చి ఆదుకోవాలి. – మడావి రఘునాథ్, రైతు మెట్టపిప్రి -
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి
కాగజ్నగర్టౌన్: ప్రజా ఉద్యమాలను మరింత బ లోపేతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కామ్రెడ్ అబ్బాస్ సూచించారు. పట్టణంలోని కిశోర్ ఫంక్షన్ హాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ఆది వారం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అబ్బాస్ హాజరై మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఆర్థి క విధానాలు కార్మికులు, రైతులు, పేద ప్రజల ప్ర యోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించా రు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు భారత ఆర్థిక వ్య వస్థపై చూపుతున్న ప్రభావాన్ని పార్టీ కార్యకర్తలు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణాన్ని పెంచుతూ సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీపీఎం జెండాను ఆవిష్కరించారు. శిక్షణ తరగతులకు ముంజం ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, కార్యవర్గ సభ్యులు దేవిక, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కార్తిక్ జాదవ్, రాజేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘భగీరథ’ పైపులైన్ లీకేజీ
కాగజ్నగర్టౌన్: వరదల కారణంగా కాగజ్నగర్ మండలంలోని చింతగూడ సమీపంలో గల మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ దెబ్బ తినడంతో కాగజ్నగర్, దహెగాం మండలా ల్లో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలి చిపోయింది. ఈ విషయమై మిషన్ భగీరథ డీఈ పృథ్వీరాజ్ను వివరణ కోరగా.. చింతగూడ వద్ద పైపులైన్ గాస్కెట్ భారీ వరదలకు దెబ్బతినడంతో లీకేజీ అవుతోందని తెలిపా రు. దీంతో కాగజ్నగర్, దహెగాం మండలా ల పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరా యం ఏర్పడుతోందని పేర్కొన్నారు. మరమ్మతులు చేపట్టి సోమవారం నుంచి తాగునీటి స రఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. -
కుమురం భీం
7బోనస్కు ‘సన్న’గా మెలిక ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ చెల్లిస్తూనే రోజుకో మెలిక పెడుతోంది. ఏడు రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రకటించగా రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద తాకిడికి దెబ్బతిన్న పత్తి ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల పత్తి చేన్లను వరద ముంచెత్తింది. ప్రభుత్వం సర్వే నిర్వహించి నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురుస్తుంది. సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
అధికార్ల కక్కుర్తి..!
కౌటాల: సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం.. రూ.లక్షల్లో జీతాలు.. అయినా.. ఇది సరిపోదన్నట్లుగా కొందరు జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. జిల్లాలో చాలామంది అధికారులు వాహన వినియోగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు అద్దె కార్లు వినియోగించవచ్చు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధి కారులు, తహసీల్దార్, ఎంపీడీవోలకూ ఈ సదుపా యం ఉంది. కానీ, నెలనెలా అందించే వాహనాల అద్దె కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తమ సొంత వాహనాలు వినియోగిస్తూ ప్రభుత్వం కల్పి స్తున్న సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్ర భుత్వ అధికారులు ట్యాక్సీ రిజిస్ట్రేషన్ (పసుపు రంగు నంబర్ ప్లేట్) ఉన్న వాహనాలు వినియోగించా లి. ఈ వాహనానికి బీమా కోసం ఏటా రూ.30వేల వరకు, ఫిట్నెస్ కోసం రూ.1,500 రవాణా శాఖకు చెల్లించాలి. సొంత వాహనం (తెల్ల నంబర్ ప్లేట్ ఉన్న వాహనం) రూ.3వేల వరకే బీమా చెల్లించాల్సి ఉంది. ఫిట్నెస్ చార్జీలుండవు. జిల్లాలోని అనేక మంది అధికారులు సొంత వాహనాలనే వాడటంతో రవాణాశాఖ ఆదాయానికి గండిపడుతోంది. అద్దె కోసం అడ్డదారులుజిల్లాలో ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని శాఖల్లో అద్దెకార్ల తంతు నడుస్తోంది. ట్యాక్సీ రిజిస్ట్రేషన్లున్న కార్ల నంబర్లు, ఆయా యజమానుల వివరాలు అధికారులు తెచ్చుకుంటున్నారు. వీరి వాహనాలనే వినియోగించుకుంటున్నామని బిల్లులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అనేక చోట్ల అధికారులే సొంతంగా వాహనాలు నడుపుకొంటూ డ్రైవర్కు ఇచ్చే వేతనం కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. తమకు తెలిసిన వారివి లేదా రూ.5వేలు, రూ.10 వేలు కమీషన్లు ఇస్తూ ఎల్లోప్లేట్ కలిగిన ఇతరుల పేరిట ట్రైజరీ నుంచి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ప్రతీ ప్రభుత్వ అధికారి కారులో నెలలో 2,500 కిలో మీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఇందుకు డ్రైవర్ వేతనం, ఇంధన ఖర్చుతో కలిపి మొత్తం రూ.33వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారుగా 100కు పైగా అద్దె వాహనాల దందా నడుస్తోంది. వీటికి ప్రతినెలా రూ.33వేల చొప్పున రూ.33లక్షల వరకు బిల్లులు చెల్లిస్తున్నారు. అధికారులు సొంత వాహనాలు వినియోగిస్తుండడంతో ఒక్కో వాహనానికి చెల్లించాల్సిన బీమా, ఫిట్నెస్ నెలకు రూ.లక్షల్లో రవాణాశాఖ ఆదాయం కోల్పోతోంది. ఉపాధికి కత్తెరప్రభుత్వ అధికారుల అద్దె కార్లకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేసినప్పుడు.. కారు బిల్లులు కాజేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. బ్యాంక్ రుణా లు, సబ్సిడీ, కార్పొరేషన్లతో పాటు ఓనర్ కం డ్రైవర్ వంటి స్కీం, దళిత బంధు పథకాల్లో నిరుద్యోగ యువత ట్యాక్సీ ప్లేట్కార్లు కొనుగోలు చేశారు. కానీ, ప్రస్తుతం గిరాకీలు దొరకడం కష్టంగా మారింది. దీంతో కొందరు కార్లు అమ్ముకుంటున్నారు. బెజ్జూర్ తహసీల్దార్ రామ్మోహన్ విధులకు వినియోగిస్తున్న సొంత కారు కౌటాల తహసీల్దార్ ప్రమోద్కుమార్ విధులకు వచ్చింది ఈ సొంత కారులోనే..కౌటాల తహసీల్దార్ ప్రమోద్కుమార్ కాగజ్నగర్ నుంచి సొంత కారులో తానే డ్రైవ్ చేస్తూ విధులకు హాజరవుతున్నారు. బెజ్జూర్ తహసీల్దార్ రామ్మోహన్ కూడా ప్రభుత్వ విధులకు సొంత కారునే వినియోగిస్తున్నారు. కాగజ్నగర్లో ఉంటూ బెజ్జూర్కు సొంత వాహనంలో వస్తారు. ఇలా జిల్లాలో చాలా మంది అధికారులు సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో ట్యాక్సీప్లేట్ కార్లు నడిపేవారికి ఉపాధి లేకుండా పోతోంది. -
ఎస్టీ హోదా కల్పించాలి
కాగజ్నగర్టౌన్: మాలీ కులస్తులకు ఎస్టీ హో దా కల్పించాలని తెలంగాణ మాలీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురె శ్యామ్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని తిలక్నగర్ బీసీ భవన్లో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించగా ఆయన హా జరై మాట్లాడారు. మాలీలకు ఎస్టీ హోదా కో సం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా, ని రసన కార్యక్రమాలు నిర్వహించేందుకు విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేలా రాష్ట్రంలోని నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. జిల్లా స్థా యి నాయకుల సలహాలు, సూచనలు తీసుకుని రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు, ప్ర జాచైతన్య కార్యక్రమాలపై ప్రణాళికలు రూ పొందించామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి వసంత్రావు, మంచిర్యాల జిల్లా అ ధ్యక్షుడు మొర్ల మొండి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, మాలీ కులస్తులు హాజరయ్యారు. -
అమ్మలకు ఆషాఢ బోనం
చింతలమానెపల్లి: బోనాలతో ఊరేగింపుగా వెళ్తున్న మహిళలుకాగజ్నగర్టౌన్: ఊరేగింపులో మహిళలు, శివసత్తులుచింతలమానెపల్లి: ఆలయంలో పూజలు చేస్తున్న గ్రామస్తులుకాగజ్నగర్టౌన్/చింతలమానెపల్లి: కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్లోని శ్రీమహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లారీ చౌరస్తా నుంచి సర్సిల్క్ దేవాలయం వరకు డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు–శివాణి దంపతులు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త పల్లి అనిత– శ్రీనివాస్ దంపతులు ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, సభ్యులు ఏర్పాట్లు చేయగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే, చింతలమానెపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో పోచమ్మ బోనాల పండగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని ధరంపెల్లి, బారెవాడ, డబ్బా గ్రామాలకు చెందిన మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. పోచమ్మ తల్లికి నూతన వస్త్రాలు, బోనాలు సమర్పించారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. -
గిరిజన విద్యాభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్రూరల్: ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని డీటీడీవో అంబాజీ పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తానని తెలిపా రు. హాస్టళ్లలోని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారి న పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వెల్లడించారు. సాక్షి: డీటీడీవోగా జిల్లాకు ఎలాంటి సేవలందిస్తారు?డీటీడీవో: ఆదివాసీ జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. 2014లో ఉమ్మడి జిల్లా ఏటీడీవోగా పని చేశాను. ఆదివాసీలకు సేవ చేయడం నా బాధ్యత. ఇందులో భాగంగా గిరిజనుల అభివృద్ధి కోసం సేవలందిస్తాను. ఆశ్రమ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యను బలోపేతం చేస్తా. తరచూ పాఠశాలలను విజిట్ చేసి విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను. సాక్షి: సింగిల్ టీచర్ స్కూళ్లు ఎన్ని ఉన్నాయి? టీచర్ల కొరత ఉందా? ఎక్కడైనా స్కూళ్లు మూతబడ్డాయా?డీటీడీవో: జిల్లాలో 46 ఆశ్రమ వసతిగృహాలు, 334 ప్రాథమిక పాఠశాలున్నాయి. వీటిలో 13,600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 806 మంది టీచర్లలో రెగ్యులర్ ఉపాధ్యాయులు 403 మంది, సీఆర్టీలు 457 మంది పని చేస్తున్నారు. 334 సింగిల్ టీచర్ స్కూళ్లున్నాయి. ఈ సంవత్సరం మూతబడిన ఒక స్కూల్ను తెరి పించాం. సింగిల్ టీచర్ స్కూల్ ఉపాధ్యాయు డు అత్యవసర పరిస్థితిలో హాజరు కాని రోజు ఆ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని హెచ్ఎం, సీఆర్టీకి ఒకరోజు ముందు సమాచారం ఇచ్చి వేరే టీచర్లను పంపిస్తాం. విధులను నిరక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. సాక్షి: పదోతరగతి ఫలితాలపై మీ అంచనా?డీటీడీవో: పదో తరగతి ఫలితాల్లో గతేడాది 98శాతం ఉత్తీర్ణత నమోదైంది. 13 స్కూళ్లు వందశాతం ఫలితాలు సాధించాయి. ఈసారి 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూ పొందించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి చేయిస్తాం. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటాం. నూతన విద్యావిధానంపై అన్ని సబ్జెక్ట్ టీచర్లకు బోధించే విధానంపై ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తాం. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అర్థమయ్యేలా బోధించేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలనున్న నేపథ్యంలో హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డీటీడీవో: వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తుగా అన్ని వసతిగృహల్లో ఆ ర్వో (వాటర్) నీటిని అందిస్తున్నాం. పిల్లలకు రోజువారీగా మెనూ ప్రకారం ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. విద్యావీక్ష యాప్లో రోజువారీగా వండిన ఆహార పదార్థాలను హెచ్ఎం ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. దీంతో మెనూ అమలవుతుందా? లేదా? అన్నది వెంటనే తెలిసిపోతుంది. పాఠశాలలకు అవసరమైన మేజర్, మైనర్ పనులు పూర్తి చేస్తున్నారు. ఆర్బీకే వైద్య బృందం ప్రతీవారం పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధింత వార్డెన్, హెచ్ఎం, ఏఎన్ఎంలకు సూచించాం. అవసరమైతే కార్పొరేట్ వైద్యసేవలూ అందిస్తాం.సాక్షి: గిరిజన విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?డీటీడీవో: జిల్లాలో గిరిజన సంక్షేమ కోసం వసతి గృహాలు, పాఠశాలలను విజిట్ చేస్తూ విద్యను మరింత బలోపేతం చే స్తా. ఉపాధ్యాయులు, విద్యార్థులు రో జూ పాఠశాలలకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందిస్తా. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేక గ్రూప్లుగా విభజించి స్పెషల్ క్లాస్లు నిర్వహించేలా చర్యలు చేపడతాం. వారిలో అభ్యస న సామర్థ్యాలు పెంచుతాం. ప్రతిరోజూ ఏటీడీవో తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా చర్యలు తీసుకుంటాం. -
పోడుసాగుపై ఆంక్షలు ఎత్తివేయాలి
కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామస్తులు పో డుసాగుపై అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన చేపట్టారు. ఉడుంపూర్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. పంటల సాగులో నిబంధనలు ఎత్తివేయాలని నాలుగు గంటల పాటు కడెం–జన్నారం–ఉట్నూర్ ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేపట్టి బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎఫ్డీవో శివకుమార్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. పోడుసాగులో ట్రాక్టర్లు, మిషన్లను ఉపయోగించరాదని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ నిబంధన మేరకు ఎడ్ల నాగలితో సాగు చేపట్టవచ్చని తెలిపారు. సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్, పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఏళ్లుగా చేస్తున్న భూముల సాగులో ఇప్పుడు నిబంధనల పేరిట ట్రాక్టర్లు, మిషన్లను అడ్డుకోవడం సరికాదన్నారు. తమ వ్యవసాయాన్ని అడ్డుకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎఫ్ఆర్వో గంటల శ్రీనివాస్రెడ్డి వారికి చెప్పడంతో ఆందోళన విరమించారు. నాలుగు గంటల రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లు విసిరి దాడి చేశారు ప్రభుత్వం ఇచ్చిన ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో ట్రాక్టర్తో దున్నడం నేరమని కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దాని ప్రకారం ఆపాం. పలువురు గ్రామస్తులు కార్యాలయంపై రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.50 వేల ఆస్తినష్టం వాటిల్లింది. నాతో పాటు, సిబ్బందికి ప్రాణహాని ఉంది. – శ్రీనివాస్రెడ్డి, ఎఫ్ఆర్వో, ఉడుంపూర్ -
బస్సు కిందపడి ఒకరి ఆత్మహత్య
మంచిర్యాలరూరల్(హాజీపూర్): బస్సు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన హాజీపూర్ మండలం రాపల్లి స్టేజీ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్కు చెందిన ఆసాది లింగయ్య(55) ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఆటోలో మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన లింగయ్య ఒక్కసారిగా బస్సు కిందకు దూకాడు. తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య జయశీల, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కుమారుడు సునీల్, కుమార్తె సుజాత ఉన్నారు. ఈ ఘటనపై పోలీస్స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. లింగయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్థాపానికి గురై బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉరేసుకుని భర్త సిర్పూర్(టి): భార్యతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిర్పూర్(టి) ఎస్సై సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లోనవెల్లి గ్రామానికి చెందిన బెండారి పితాంబర్(53), పవిత్ర దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. గ్రామంలో వారికి 12 ఎకరాల భూమి ఉంది. పదెకరాల భూమి కౌలుకు ఇస్తూ రెండెకరాలు సొంతంగా వ్యవసాయం చేసుకుంటుండేవాడు. ఈసారి 12 ఎకరాల భూమి తామే స్వతహాగా చేసుకుందామని భార్య..భర్త పితాంబర్కు చెప్పింది. తనకు ఆరోగ్యం బాగాలేదని 12ఎకరాల భూమి వ్యవసాయం చేయడం సాధ్యం కాదని చెప్పగా శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పితాంబర్ శనివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్సపొందుతూ వివాహిత మృతి కడెం: పురుగుల మందు తాగిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని కల్లెడకు చెందిన సీపెల్లి గంగామణి (35)ను అదే గ్రామానికి చెందిన రొడ్డ బుచ్చన్న గతనెల 7న తిట్టాడు. మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగింది. కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా ల, జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థా యి కిడ్స్, జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మారయ్య ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థులు అండర్–8 విభాగంలో గణేశ్, అండర్–10 విభాగంలో రిత్విక్, కార్తిక్, అండర్–12లో సాయిచరణ్, అండర్–16లో యశ్వంత్ ప్రతిభ కనబర్చారు. ఈనెల 7, 8 తేదీల్లో హన్మకొండ జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, పీడీ , ఉపాధ్యాయులు వీరిని అభినందించారు. -
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఫుడ్ ఫాయిజన్ ఘటన ఇంకా మరువకముందే శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. గురిజాలకు వెళ్లేదారిలో ప్రభుత్వ గిరిజన బా లుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఏఎన్ఎం సైతం అస్వస్థత కు గురైన ఘటన కలకలం రేపింది. మధ్యా హ్న భోజనం చేసిన విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకుని కడుపునొప్పితో బాధపడగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి ఏఎన్ఎం భవానీ చికిత్స తీసుకుని డిశ్చార్జీ కాగా విద్యార్థుఽలు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో అకిరానందన్, రుషి , యశ్వంత్ ,నేశ్వంత్, విష్ణు, మణిచరణ్, విక్కీ ఉన్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. -
పెన్గంగ వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ
సిర్పూర్(టి): నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలం మీదుగా ప్రవహిస్తున్న పెన్గంగ నది వరద ఉధృతిని శనివారం ఎస్పీ నితిక పంత్ పరిశీలించారు. వెంకట్రావ్పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని హైలెవల్ వంతెన వద్ద వరద ఉధృతి ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వాహనా ల రాకపోకలు నిలిపివేయాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెన్గంగ పరీ వా హక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారులు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి ప్రజ లకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపా రు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టు చేసుకోకుండా రోప్లు, లైఫ్బాయ్లు, లైఫ్ జా కెట్లు తదితర అత్యవసర రక్షణ కిట్లు అందుబా టులో ఉంచామని తెలిపారు. మత్స్యకారులు చేపల వే టకు వెళ్లొద్దని, పడవ ప్రయాణాలు చేయరాదని సూచించారు. అనంతరం పారిగాం గ్రామ సమీపంలోని వంతెన వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వహీదొద్దీన్, ఎస్సై సాగర్ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలికౌటాల: ప్రాణహిత, వార్థా నదుల సరిహద్దు గ్రా మాల ప్రజలు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని పరిశీలించారు. నదుల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోందని, ఎవరూ అటు వైపు వెళ్లవద్దని తెలిపారు. రోప్లు, లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రి అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వహీదొద్దీన్, కౌటాల సీఐ సంతోష్ కుమార్, సర్పంచ్ సూరజ్ తదితరులున్నారు. -
కలిస్తే బాల్య స్మృతులు నెమరువేసుకుంటాం
ఆసిఫాబాద్: తొమ్మిది మంది స్కూల్ మేట్స్తో నా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. చిన్న వయస్సులో ఏర్పడిన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మాలో ఎవరికీ స్వార్థం అనేదే లేదు. మా మధ్య ఎలాంటి దాపరికాలూ ఉండవు. అన్ని విషయాలు కలిసే డిస్కస్ చేస్తాం. ఒకరికొకరం అవసరమైన సలహాలు ఇచ్చుకుంటాం. అంతస్తు, హోదాతో తేడా లేకుండా కొనసాగుతున్న మా మైత్రి బంధం వెలకట్టలేనిది. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎలా ఉన్నామో ఇప్పటికే అందరం కలిస్తే బాల్యంలోకి వెళ్లిపోతాం. చిన్నపిల్లల్లా మారి సిల్లీ పనులు చేస్తాం. నిజంగా మేము చాలా అదృష్టవంతులం. ఇప్పటి పిల్లలకు ముందు తరాలవారితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలోనే మిత్రులంటారు. – కె.హరిత, కలెక్టర్ -
నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురి అరెస్టు
తాండూర్: భీమిని పోలీస్స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల నిషేధిత గడ్డిమందు తరలిస్తున్న నలుగురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తాండూర్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో భీమిని ఎస్సై కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి భీమిని మండలం రాంపూర్ శివారులో తనిఖీ నిర్వహించారు. ఇన్నోవా కారులో తరలిస్తున్న గడ్డి మందును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా వెంకటాపూర్ శివారులో తనిఖీ నిర్వహించగా రెండు బైక్లపై గడ్డి మందు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు క్యాన్ల, 10 ప్యాకెట్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 క్యాన్లలో రూ.1.04 లక్షల విలువ కలిగిన 210 లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన కాగజ్నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన గుండ రాజు, బట్టుపల్లికి చెందిన పార్వతి కిరణ్, భీమిని మండలం వెంకటాపూర్కు చెందిన రుకుం వెంకటేశ్, పల్లె రవీందర్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్నోవా కారు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మహా రాష్ట్రలోని రాజురాలో గడ్డి మందును కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలోని రైతులకు అమ్మడానికి ప్రయత్నించగా వారిని చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందును ఎవరైన విక్రయిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, సీఐ దేవయ్య, ఎస్సైలు కోటేశ్వర్, ప్రసాద్రావు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు కాలానుగుణంగా వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల ని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో ఆసిఫా బాద్, మంచిర్యాల ఉపాధ్యాయులకు నిర్వహించిన ఐదురోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై శిక్షణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతిగదిలో సమర్ధవంతంగా అమలు చే యాలని సూచించారు. విద్యార్థుల్లో పఠనం, రచన, గణిత నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత, నాయకత్వ ల క్షణాలు పెంచాలని తెలిపారు. గిరిజన వి ద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, జీసీడీవో శకుంతల, లక్ష్మయ్య, కోర్సు డైరెక్టర్ రవీందర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో మంద మకరందు -
స్నేహమేరా శాశ్వతం
స్నేహితురాలి ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులు అభ్యసించా ఆసిఫాబాద్అర్బన్: పేద కుటుంబానికి చెందిన నేను బడికి వెళ్లినపుడు నా స్నేహితురాలు అంజలి పెన్సిళ్లు, నోట్బుక్స్, డ్రెస్సులు ఇస్తూ ప్రోత్సహించేది. తన ప్రోత్సాహంతోనే నేను బీఏ, బీఈడీ చదివాను. 10వ తరగతి వరకు తబలాపూర్లో ఇద్దరం కలిసే చదివాం. బడికి వెళ్లే దారి మధ్యలోని పెద్దవాగును జంటగా దాటే వాళ్లం. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాజకీయాలపై మక్కువతో 2024లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేశాను. ప్రస్తుతం అంజలి తన కుటుంబంతో ఆదర్శ గృహిణిగా జీవిస్తోంది. ఎవరికి సమస్య వచ్చినా ఫోన్లో ఒకరికొకరం భరోసా కల్పించుకుంటాం. నిజమైన స్నేహానికి కులాలు, మతాలు, ధనిక, పేదరికం ఏవీ అడ్డురావు. ఇందుకు మా స్నేహమే నిలువెత్తు నిదర్శనం. – అంజలితో ఆత్రం సుగుణమనల్ని అర్థం చేసుకుని.. కష్టాల్లో ధైర్యం చెప్పి.. సంతోషాన్ని రెట్టింపు చేసేవారే స్నేహితులు. కాలం మారినా, దూరం పెరిగినా.. కష్ట, సుఖాల్లో తోడుగా నిలిచేవారే మిత్రులు. జీవితమనే ప్రయాణంలో ప్రతీ అడుగులో అండగా ఉండేవారు దోస్తులు.. రక్తసంబంధం కాకపోయినా హృదయాలను కలిపే అనుబంధమే స్నేహం.. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్, ఆర్డీవో తదితరులు వారి స్నేహ సంబంధాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
రేషన్ బియ్యం విక్రయిస్తే చర్యలు
కెరమెరి: రేషన్ బియ్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని, రేషన్ కార్డులను రద్దు చేస్తామని అదనపు కలెక్టర్ డేవిడ్ హెచ్చరించా రు. శనివారం మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులో పేరుండి మరణించిన వారి పేర్లు తక్షణమే తొలగించాలని, ఈకేవైసీ ఈ నెల 31 వరకు పొడిగించారని తెలిపారు. గడువులోపు వందశాతం పూర్తి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ నాగార్జున, డీటీ సంతో ష్కుమార్, డీలర్లు, సేల్స్మెన్లు పాల్గొన్నా రు. -
నాణ్యమైన బోధన అందించాలి
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపు, బోధన అభ్యసన ప్రక్రియ, ప్యా నెల్ ఇన్స్పెక్షన్లను సమర్ధవంతంగా నిర్వహించాల ని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ సూచించా రు. కలెక్టరేట్లో శనివారం హెచ్ఎం, సబ్జెక్టు టీచ ర్లు, ప్యానెల్ టీం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ప్యానెల్ ఇన్స్పెక్షన్లు కేవలం తనిఖీలకే పరిమితం చేయకుండా బోధనను మెరుగుపరిచే మార్గదర్శక ప్రక్రియ అమలయ్యేలా చూడాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల అభ్యస న స్థాయి, బోధన, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు, విద్యార్థుల నోటుబుక్స్, మూల్యాంకన విధా నం, హాజరు, పరిశుభ్రత, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానె ల్ వినియోగం, ప్రయోగశాల వినియోగం, మౌలిక వసతులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరింత పెంచేలా నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువలతో కూడిన బోధన అందించాలని సూచించారు. సమావేశంలో డీఈవో సచ్చిదానంద, ఎస్వో శ్రీనివాస్, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
నిందితులకు శిక్షపడేలా చూడాలి
ఆదిలాబాద్టౌన్: దర్యాప్తు పకడ్బందీగా నిర్వహించి బాధితులకు న్యాయం చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బి.సి శశికుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఉ మ్మడి జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన దర్యాప్తు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. ఆలస్యం జరిగితే ప్రజలకు కోర్టులపై విశ్వాసం కోల్పోతారని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే నేరస్థలంలో సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు చేపట్టాలన్నారు. నిర్దిష్ట సమయంలో చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేసి వారికి రావల్సిన నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో పీపీ ముస్కు రమణారెడ్డి, అదనపు ఎస్పీ సురేందర్రావు, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏసీపీ, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, అశోక్, లైజన్ అధికారులు రమేశ్, ఈశ్వర్సింగ్, రాఘవేందర్, ఉమాదేవి, గంగాసింగ్, పరశురాం, పండరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదికోసారైనా అందరం కలుస్తాం
ఆసిఫాబాద్: నా శ్రీమతి కూడా నా ఫ్రెండే. మేం కలి సే గ్రూప్స్న కు ప్రిపేరయ్యాం. చిన్నప్పటి ఫ్రెండ్స్తోపాటు ఉద్యోగరీత్యా వివిధ చోట్ల పని చేయడంతో నాకు విలువైన స్నేహితులు దొరికారు. ఈ విషయంలో నేను చాలా అదృష్ట వంతుడిని. ఆర్టీసీలో పని చేస్తున్నప్పుడు డ్రైవర్స్ స్నేహితులయ్యారు. ఇప్పటికీ నన్ను ఎరా.. అని పిలుస్తారు. మా స్నేహానికి హోదాలు, కులమతాలు లేవు. నేను ఢిల్లీలో పని చేసినప్పుడు కూడా నాకు మళయాలీలు, నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్సయ్యా రు. వీరిలో క్రిస్టియన్స్, ముస్లింలూ ఉన్నారు. వాట్సప్ పుణ్యమాని రోజూ పలకరించుకుంటాం. ౖఏడాదికి ఒకసారైనా కలిసి పార్టీ చేసుకుంటాం. నా దృష్టిలో స్నేహితులు అంటే జీవితంలో అన్నింటికన్నా విలువైనవారు. – లోకేశ్వర్రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్ -
కుమురం భీం
7‘లోలెవల్’తో తిప్పలు లోలెవల్ వంతెనల పైనుంచి వరదనీరు వెళ్తుండగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి. కొందరు వాహనాలు దాటించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రి‘పరేషాన్’! ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ.. కోచింగ్, స్టడీమెటీరియల్ తది తర ఖర్చుతో ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది. ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
ప్రణాళికతో బోధించాలి
శిక్షణ అనంతరం ఉ పాధ్యాయులు ప్రతీ రోజు పాఠశాలలో 3గంటల నుంచి 4గంటల వరకు రెమిడియల్ టీచింగ్ అమలు చేయాలి. ప్రత్యేక ప్రణాళికతో బోధిస్తే తప్పకుండా వెనుకబడిన విద్యార్థులు నిర్దేషించిన సామర్థ్యాలు సాధించగలుగుతారు. ఏ సమయంలో.. ఏమి బోధించాలనే విషయాలను ముందే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసి టీచింగ్ ప్రారంభించాలి. 2నుంచి 5వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం వచ్చేలా, గణితంలో సామర్థ్యాలు సాధించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. – ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్ -
వెనుకబడితే రెమిడియల్
కెరమెరి: విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అయినప్పటికీ కొందరు విద్యార్థులు నిర్దేషిత సామర్థ్యాలను సాధించలేకపోతున్నా రు. దీంతో వెనుకబడిన విద్యార్థులను ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి తీసుకురావడానికి ప్రభుత్వం రెమిడియల్ టీచింగ్ను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 2, 3, 4, 5 తరగతుల విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి చదవడం, రా యడం, గణిత సామర్థ్యాలను బలోపేతం చేయాల నే లక్ష్యంతో విద్యాశాఖ చేపట్టిన ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు రెమిడియల్ టీచింగ్పై అన్ని మండలాల్లో ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు గత నెల 29 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించింది. రెండు దఫాల్లో శిక్షణ ఇవ్వనుండగా ఇప్పటికే మొదటి విడ త శిక్షణ తరగతులు ముగిశాయి. రెండో విడత శిక్షణ తరగతులు ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించనుంది. శిక్షణలో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసే పద్ధతులు, లెర్నింగ్ గ్యాప్ల గుర్తింపు, చిన్న బృందాల బోధన, ఆటలు, కథలు, చిత్రాలు, బోధనోపకరణాల వినియోగం, కార్యాచరణ ఆధారిత అభ్యాసం, నిరంతర మూల్యాంకనం, పురోగతి నమోదు లాంటి అంశాలను మాస్టర్ ట్రైనర్లు వివరిస్తున్నారు. ప్రతీ విద్యార్థి అవసరానికి అనుగుణంగా బోధించడం ద్వారా అభ్యాస ఫలితాలు మెరుగుపడతాయని సూచిస్తున్నారు. ఐదు స్టెప్పుల్లో విద్యార్థులకు బోధించాలని చెబుతున్నారు. రెమిడియల్ టీచింగ్లో..అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించాలి. చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల్లో వారి లోపాలను గుర్తించాలి. విద్యార్థి స్థాయికి అ నుగుణంగా ప్రత్యేక కార్యాచరణ, నిరంతర మూ ల్యాంకనం ద్వారా పురోగతి అంచనా వేయాలి. ఎఫ్ ఎల్ఎన్ లక్ష్యాల సాధనకు కీలకమైన బోధన విధా నం అమలు చేయాలి. విద్యార్థుల అభ్యసన స్థాయి ని పరీక్షల ద్వారా గుర్తించాలి. చిన్న, చిన్న గ్రూపులుగా లేదా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా బోధించాలి. సులభమైన ఉదాహరణలు, ఆటలు, చిత్రాలు, కార్యకలాపాల ద్వారా పాఠ్యాంశాలు నేర్పించాలి. తరచూ మూల్యాంకనం చేసి పురోగతిని పరిశీలించాలి. అభ్యసన సామర్థ్యాలను పెంచాలి. వెనుకబడిన విద్యార్థులపై స్పెషల్ ఫోకస్తరగతి గదిలో కేవలం పాఠ్యపుస్తకానికి పరిమి తం కాకుండా బోధన పద్ధతులను అనుసరించా లని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సా రించాలని, ఉపాధ్యాయులకు మండల రిసోర్స పర్సన్లు శిక్షణలోసూచిస్తున్నారు. ముఖ్యంగా తె లుగు, ఆంగ్లంలో చదవడం, పదాల నిర్మాణం, వాక్యాల రచన, గణితంలో సంఖ్యా పరిజ్ఞానం, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం లాంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం పాఠశాలల్లో రెమి డియల్ తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రతీరోజు బడిలో 3గంటల నుంచి 4వరకు రెమిడియల్ తరగతులు బోధించి వెనుబడి న విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలు సాధించడంలో రెమిడియల్ టీచింగ్ కీలక పాత్ర పోసిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
బాసర: నిర్మల్ జిల్లా బాసర–బిద్రెల్లి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డు దుర్మరణం చెందాడు. స్థానికులు, బాసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముధోల్ గ్రామానికి చెందిన కె.బాబు (50) బాసర ట్రిపుల్ ఐటీ ప్రారంభమైనప్పటి నుంచి సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి ముధోల్ నుంచి బాసరకు రాత్రి డ్యూటీ కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో బాసర–బిద్రెల్లి మధ్య ప్రధాన రహదారిపై పంక్చర్ అయిన లారీ నిలిపి ఉంది. దానిని చీకట్లో గమనించలేకపోయిన బాబు.. వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాబు తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, 108లో క్షతగాత్రుడిని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాబు మృతిచెందాడు. సుదీర్ఘకాలంగా ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న బాబు అకస్మాత్తుగా మరణించడంతో సహచర భద్రతా సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఘటనపై బాసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాసర ఎస్హెచ్వో దీపక్ తెలిపారు. -
కూరగాయల విత్తనాలు పంపిణీ
కాగజ్నగర్టౌన్: కిచెన్ గార్డెన్ ఏర్పాటు కో సం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వి ద్యార్థులకు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జలజీవిక వాటర్ఫర్ లైవ్లీహుడ్ సంస్థ సహకా రంతో శనివారం కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి మా ట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి ఇంటి వద్ద చిన్న కి చెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని రసాయన ర హిత, పోషకాహారంతో కూడిన కూరగాయలు పండించాలని సూచించారు. జలవిక వా టర్ ఫర్ లైవ్లీహుడ్ సంస్థ డైరెక్టర్ పద్మాకర్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు దేవేందర్, శారద, కృష్ణవేణి, రోజ్మేరి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన పోస్టర్ను కలెక్టర్ కె.హరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారమని తెలిపారు. పోషణ్ అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 1నుంచి 7వరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, గర్భిణులు, బాలింతలతో సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, పోషణ్ అభియాన్ బృందం సభ్యులు, సీడీపీవోలు పాల్గొన్నారు. -
కార్మికులుగా పేర్లు నమోదు చేసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రతీ కార్మికుడు కార్మిక శా ఖలో పేరు నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ అధికారి దుర్గం క్రాంతి సూచించా రు. శనివారం జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో కార్మికులకు పలు అంశాలపై అవగాహన కల్పించా రు. కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు వ ర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని సూచించారు. జూని యర్ అసిస్టెంట్ విజయ్కన్నా, సిస్టం ఆపరేటర్ ఖలీద్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, జిల్లా కోశాధికారి ఆనంద్రావ్, మండలాధ్యక్షుడు కమలాకర్, ఉపాధ్యక్షుడు రాంచందర్, కార్యదర్శి నర్సయ్య, నాయకులు సదయ్య, శంకర్, ఆప్రోచ్, బాలాజీ తదితరులున్నారు. -
‘ప్రజల ఓటుహక్కు కాపాడటమే ధ్యేయం’
ఆసిఫాబాద్అర్బన్: ప్రజల ఓటుహక్కును కాపాడటమే కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి, మాజీ విప్ ఆరెపల్లి మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్లతో కలిసి మాట్లాడారు. జిల్లాలో 4,55,596 మంది ఓటర్లు ఉండగా 4,07,621 మంది డిజిటలైజేషన్ పూర్తయ్యిందని తెలిపారు. కార్యకర్తలను బీఎల్ఏలుగా నియమించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇరుకుల మంగ, విశ్వనాథ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్, మండల అధ్యక్షుడు మురళి, పట్టణ అధ్యక్షుడు హస్మి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్నగర్ ఆర్డీవో కృష్ణయ్యతో కలిసి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి సంస్థ అధికారులు సర్వీస్ రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రాంగ్రూట్, యూ టర్న్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా అడ్డంగా ఉన్న విద్యుత్స్తంభాలు, మూలమలుపుల వద్ద చెట్లపొదలు తొలగించాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పాఠశాలల బస్సులను నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. మాదకద్రవ్యాలను నిర్మూలించాలిసమాజాన్ని నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా మాదకద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థలకు 400 మీటర్ల దూరంలో గుట్కా, సిగరేట్ అమ్మకాలను నిషేధించాలని ఆదేశించారు. డీఎస్పీలు వహీదుద్దీన్, అశోక్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్వో సీతారాం, ఎస్సీ కార్పొరేషన్ అధికారి అశోక్ పాల్గొన్నారు. హెచ్ఐవీ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలిఆసిఫాబాద్: జిల్లాలో హెచ్ఐవీ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశానికి ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1 నాటికి బహుళ రంగాల కార్యాచరణ వ్యూహం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్షలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో స్వీయ ప్రమాద అంచనా, క్యూర్ కోడ్లను ఏర్పాటు చేయాలన్నారు. హెచ్ఐవీ బాధితులు, పాజిటివ్ నెట్వర్క్ సభ్యులకు సంక్షేమ పథకాల ద్వారా సహాయాన్ని అందించాలని ఆదేశించారు. డీఎంహెచ్వో సీతారాం జిల్లాలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న హెచ్ఐవీ, ఎయిడ్స్ సేవలపై నివేదికను సమర్పించారు. క్లినికల్ నిపుణులు డాక్టర్ విజేత వ్యాధి నివారణ, నియంత్రణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
153 శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా జూలైలో 153 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని జీఎం శ్రీరమేశ్ తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. గడిచిన నెలలో బెల్లంపల్లి ఏరియాకు 1.93 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 2.95 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఆశించిన స్థాయికి మించి ఉత్పత్తి చేపట్టామని వివరించారు. నెలాఖరులో మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు ఏరియా సుమారు 25 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి కోల్పోయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 9.93 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా.. 12.34 లక్షల టన్నుల(124 శాతం) ఉత్పాదకతతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, సీనియర్ పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా వైద్యపరీక్షలు నిర్వహించాలి
ఆసిఫాబాద్అర్బన్: సదరం శిబిరాల్లో పారదర్శకంగా వైద్యపరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న సదరం శిబి రాన్ని శుక్రవారం సందర్శించారు. లోకో మోటార్(ఆర్థోపెటిక్) విభాగానికి సంబంధించిన వైకల్య ని ర్ధారణ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అర్హులకు వేగంగా యూడీఐడీ ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. శిబిరానికి హాజరైన ది వ్యాంగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఏపీడీ రామకృష్ణ, ప్రభుత్వ ఆస్పత్రి ఉప పర్యవేక్షకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టం అంచనా వేస్తాం
పెంచికల్పేట్: పెద్దవాగు, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో పంట నష్టం వివరాలను ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకట్ అన్నారు. పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామంలో పెద్దవాగు వరదలతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం రైతులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు సాగులో జాగ్రత్తలు వహించాలన్నారు. చేలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వేరు కుళ్లు తెగులు రాకుండా మందులు పిచికారీ చేయాలని సూచించారు. ఇతర సందేహాలు ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయన వెంట సర్పంచ్ రాజేశ్వరి, ఏవో రామకృష్ణ, ఏఈవో వంశీ తదితరులు ఉన్నారు. -
కిట్టు.. బోధన మెరుగయ్యేట్టు
లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన, గణితం, సైన్స్ పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకం కింద గణితం, సైన్స్ పరికరాల కొనుగోలుకు పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు గణితం కిట్లకు రూ.5 వేలు, సైన్స్ కిట్లకు రూ.5 వేల చొప్పున ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు విద్యాశాఖ మంజూరు చేసింది. పరికరాల కొనుగోలుకు కమిటీప్రతీ పాఠశాలలో గణిత, సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, గణితం, సైన్స్ ఉపాధ్యాయులు, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటారు. పాఠశాలకు మంజూరైన నిధులతో కమిటీ అభిప్రాయం మేరకు గణితానికి రూ.5 వేలు, సైన్స్కు రూ.5 వేలు వెచ్చించి అవసరమైన కిట్లను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రయోజనంగణిత, సైన్స్ పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ప్రయోగాత్మక బోధన జరిగి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. విద్యార్థులలో సృజనాత్మక, శాసీ్త్రయ దృక్పథాలు పెంచడంలో కిట్లు కీలకంగా మారతాయి. ఈ నిధులతో పీఎంశ్రీ పాఠశాలల్లో గణిత, సైన్స్ క్లబ్లను మరింత బలోపేతం చేసి, ప్రాజెక్టు ఆధారిత విద్యను అమలు చేస్తారు. ప్రత్యక్ష బోధనసైన్స్, గణితం పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా తరగతి గదిలో విద్యార్థులకు చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధన చేయడంతో ఆ పాఠ్యాంశాలను విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అయితే పాఠశాలలకు వచ్చిన డిజిటల్ ప్యానెల్ బోర్డులతో ప్రతీ పాఠ్యాంశాన్ని వీడియోలు, చిత్రాలు, పటాలు చూపిస్తూ బోధించడానికే ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యక్షంగా బోధన పరికరాలు, ప్రయోగ పరికరాలు ఉపయోగిస్తూ బోధన చేయడంతో విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుంది. గణిత, సైన్స్ కిట్లను వినియోగిస్తూ ప్రయోగాత్మక, ప్రత్యక్ష బోధనను ఉపాధ్యాయులు చేస్తే ప్రభుత్వం కిట్లను అందించిన లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు, మంజూరైన నిధులు..జిల్లా పాఠశాలలు మంజూరైన నిధులు మంచిర్యాల 22 రూ.2.20 లక్షలు ఆదిలాబాద్ 21 రూ.2.10 లక్షలు నిర్మల్ 19 రూ.1.90 లక్షలు కుమురంభీం 16 రూ.1.60 లక్షలు -
ప్రభుత్వ వైద్యం మరింత బలోపేతం
కాగజ్నగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు డయాలసిస్ బెడ్లను శుక్రవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్లకుండా స్థానికంగా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐదు బెడ్లు అదనంగా రావడంతో కిడ్నీ రోగులు ఎక్కువ సంఖ్యలో చికిత్స పొందే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాలలో 5, సిర్పూర్లో 5, కాగజ్నగర్లో 10 డయాలసిస్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య శ్రీ సిబ్బంది సకాలంలో జీతాలు పొందుతున్నా కో పేమెంట్ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నూతనగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ అవినాష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గర్భిణులకు ఇబ్బందులు రానీయొద్దు
ఆసిఫాబాద్అర్బన్: భారీ వర్షాల నేపథ్యంలో గిరిజన గ్రామాల్లోని గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లోని పీహెచ్సీలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లో నమోదైన గర్భిణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టులో ప్రసవ తేదీలు ఉన్న గర్భిణులను గుర్తించి, ప్రసవానికి ముందే సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. అనంతరం లింగాపూర్ మండలంలో భారీ వర్షాలతో రవాణా సౌకర్యం దెబ్బతిన్న భీమానాయక్ తండా, లొద్దిగూడ గ్రామాలను సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. లింగాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భీమానాయక్ తండాకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. -
మళ్లీ మూడు నెలల రేషన్
ఆసిఫాబాద్అర్బన్: వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేకుండా ఆగస్టులో ఒకేసారి మూడు నెలల కోటా సరఫరా చేసేందుకు పౌర సరఫరా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే ఈ కేవైసీ గడువును సైతం ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇప్పటివరకు జిల్లాలో 82శాతం ఈ కేవైసీ పూర్తయ్యింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో తిర్యాణి తదితర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఇబ్బందులు తొలగనున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి దిగుమతి, పంపిణీపై డీలర్లు అభ్యంతరం తెలిపినా.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.. జిల్లాలో ఇలా..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 13,387 అంత్యోదయ కార్డులు, 1,52,135 ఆహార భద్రత కార్డులు, 20 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. 5,45,046 మంది లబ్ధిదారులుగా కొనసాగుతున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి ఆరు కేజీల సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలలకు కలిపి 10,125.407 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాలోని రేషన్ షాపులకు తరలిస్తున్నారు. దీని కోసం పౌరసరఫరాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదాంల నుంచి సన్నబియ్యం తరలింపు ప్రారంభమైంది.పంపిణీకి ఏర్పాట్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆగస్టు 31 వరకు రేషన్ షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రేషన్కార్డుదారులు ఈ నెల 31లోగా ఈ కేవైసీ తప్పని సరిగా చేయించుకోవాలి. రేషన్ షాపుల్లో నిల్వ సామర్థ్యం తనిఖీ చేసి, ఆ మేరకు బి య్యం సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. – మహ్మద్ సాజీద్ హుస్సేన్, డీసీఎస్వో -
ముంచెత్తిన వరద..!
దహెగాం మండలం దిగిడ శివారులో నీట మునిగిన పంటను చూపుతున్న రైతుఈ ఫొటోలోని రైతు పేరు కుడ్మెత చిన్నన్న. పెంచికల్పేట్ మండలం గుండెపల్లి శివారులో తనకున్న మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు వరద పోటెత్తడంతో మూడెకరాల పంట నీట మునిగింది. సుమారు రూ.60వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. దహెగాం/పెంచికల్పేట్: జిల్లావ్యాప్తంగా బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నా యి. పెద్దవాగు, ఎర్రవాగులతోపాటు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం నాటి కి పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు నీటమునిగా యి. వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పత్తి నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వరద ఇలాగే కొనసాగితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది. చేలలోకి బ్యాక్వాటర్భారీ వర్షాలతో వట్టివాగు, కుమురంభీం(అడ) ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరింది. అధికారులు రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఫలితంగా పెద్దవాగులోకి భారీగా వరద చేరింది. అలాగే ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురువడంతో ప్రాణహిత నది సైతం ఉప్పొంగింది. దహెగాం మండలంలోని పీపీరావు ప్రాజెక్టులోకి వరద చేరి అలుగు పోయడంతో వరద ఎర్రవాగులోకి చేరింది. ఓ వైపు వాగులు ఉప్పొంగడం, ప్రాణహిత నదికి సైతం భారీ వరద రావడంతో బ్యాక్ వాటర్ పత్తి చేలను ముంచెత్తింది. పెద్దవాగు, ఎర్రవాగు పరీవాహక ప్రాంతాల్లోని ఒడ్డుగూడ, మర్రిపల్లి, అమరగొండ, గెర్రె, గిరవెల్లి, కర్జి, దిగిడ, రాంపూర్, మొట్లగూడ ప్రాంతాల్లో పత్తి చేలు నీట మునిగాయి. అలాగే పెంచికల్పేట్ మండల కేంద్రంతోపాటు, మురళీగూడ, జిల్లెడ నందిగామ, కమ్మర్గాం, గుండెపల్లి, అగర్గూడ, ఎల్లూర్ గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ప్రవాహం ఇలాగే కొనసాగినా.. వర్షాలు కురిసినా చేలలో వరద రోజుల తరబడి నిలిచే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా జిల్లా రైతులు వరదలతో పంటలు నష్టపోతున్నారు. ఈ ఏడాది పత్తి ఆశాజనకంగా ఉందని భావిస్తున్న తరుణంలో వరదలు వారి ఆశలను దెబ్బతీశాయి. -
జిల్లాను అగ్రగామిగా నిలపాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని పెంచి ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణలో జిల్లాను ఆగ్రగామిగా నిలపాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్స్పైర్ మానక్పై సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో శాసీ్త్రయ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇన్స్పైర్ మానక్ కార్యక్రమంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలను నమోదు చేయాలన్నారు. ప్రతీ స్కూల్ నుంచి ఐదు ప్రాజెక్టులను నమోదయ్యేలా సంబంధిత ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో సుభాష్ పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘ఎస్ఐఆర్’ నిర్వహించాలి
కాగజ్నగర్టౌన్: ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆర్డీవో సీహెచ్.కృష్ణయ్యతో కలిసి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి పూర్తి పారదర్శకతతో నమోదు చేయాలన్నారు. మరణించిన వారి ఓట్ల తొలగింపు, డబుల్ ఓట్ల గుర్తింపు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల సవరణ వంటి ప్రక్రియలను పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతీ బీఎల్వో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతీ దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించాలన్నారు. గడువులోగా ఎస్ఐఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, సూపర్వైజర్లు, బీఎల్వోలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
దహెగాం: రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎస్డీ ఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. మండలంలోని లగ్గాం సమీపంలో లోలెవల్ పైనుంచి పారుతున్న వరదతోపాటు మండల కేంద్రం సమీపంలో ని పెద్ద చెరువు వరద పోస్తున్న అలుగు, దహెగాం– కాగజ్నగర్ ప్రధాన రహదారి వద్ద వరద నీటిని పరిశీలించారు. లోలెవల్ వంతెనలు, ప్రమాదకర వంతెనల వద్ద పరిస్థితిపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. భద్రత చర్యల్లో భాగంగా దహెగాంలో 12 మందితో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వాగులు, ఒర్రెలు దాటే ప్రయత్నం చేయొద్దని, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, శిథిల ఇళ్లలో ఉండడం ప్రమాదకరమని తెలిపారు. కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ కుమారస్వామి, తహసీల్దార్ మునావార్ షరీఫ్, ఎస్సై చుంచు రమేశ్ పాల్గొన్నారు. -
దంచికొట్టిన వర్షం
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్/సాక్షి నెట్వర్క్: జిల్లాలో రెండోజూ గురువారం వర్షం దంచికొట్టింది. వర్షానికి జనజీవనం స్తంభించిపోగా, వ్యాపార లావాదేవీలు లేక మార్కెట్లు వెలవెలబోయాయి. వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ప్రాణహిత, పెన్గంగ నదుల్లో ఉధృతి పెరిగింది. వందల ఎకరాల్లో పత్తి పంటలు నీటమునిగాయి. అత్యధికంగా బెజ్జూర్లో 183.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సిర్పూర్(యు)లో 3.2 మి.మీ.ల వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 121.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. వర్షం నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ కె.హరిత గురువారం సెలవు ప్రకటించారు. వర్షానికి జిల్లా కేంద్రంలోని రహదారులు జలమయ్యాయి. పెద్దవాగు రెండువైపులా ఒడ్డు వరకు ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి. కుమురంభీం(అడ) ప్రాజెక్టు ఆరు గేట్లు పైకెత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. అలాగే వట్టివాగు ప్రాజెక్టు నాలుగు గేట్లను పైకెత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగు లు ఉప్పొంగాయి. అధికారుల పర్యవేక్షణభారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హరిత ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగు, తుంపెల్లి వాగు, అడ ప్రాజెక్టును పరిశీలించారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఎస్పీ నితిక పంత్ పోలీసు అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలు, లోలెవల్ వంతెనలను పరిశీలించారు. అడ ప్రాజెక్టులో నీటిమట్టం, గేట్ల నిర్వహణ, వరద ప్రవాహ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగజ్నగర్, దహెగాం, పెంచికల్పేట్ మండలాల్లోని వరద ప్రాంతాలు, ప్రమాదకరమైన వంతెనలు, పొంగిపొర్లుతున్న వాగుల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ రాజురా వాగు, అదనపు డేవిడ్ అడ ప్రాజెక్టుకు పరిశీలించి పరిస్థితిపై ఆరా తీశారు. తక్షణ సహయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాలకు కంటోల్ రూం(85008 44365) ఏర్పాటు చేశారు. వాగులకు వరద.. నిలిచిన రాకపోకలువాంకిడి మండల కేంద్రంలోని కేబీనగర్ కాలనీలో నివాసాలు జలమయమయ్యాయి. కెరమెరి మండలంలో లక్మాపూర్, అనార్పల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 15 గ్రామాలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సాంగ్వి, రాంపూర్, ఇంద్రానగర్, కెలికే కల్వర్టుల పైనుంచి వరద ప్రవహించడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. లింగాపూర్ మండలం ఫూల్సింగ్తండాకు వెళ్లేదారిలోని లోలెవల్ వంతెన కోతకు గురైంది. రెబ్బెన మండలంలో నంబాల వంతెన పైనుంచి వరద ప్రవహించింది. గంగాపూర్, లక్ష్మిపూర్, పులికుంట, గుండాలవాగు, కొండపల్లి, పెద్దవాగుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. తక్కళ్లపల్లిలో పుష్పాల నాగమ్మ ఇంటి గోడ కూలింది. దహెగాం మండలంలోని పీపీరావు ప్రాజెక్టుతోపాటు పెద్ద చెరువులోకి భారీగా వరద చేరింది. ఐనం, లగ్గాం సమీపంలో ఉన్న లోలెవల్ వంతెనల పైనుంచి వరద పారడంతో రాకపోకలు స్తంభించాయి. మొట్లగూడ, దిగిడ గ్రామాలకు చెందిన ఎనగందుల శంకర్, మడే అశోక్ల ఇళ్లు కూలిపోయాయి. సిర్పూర్(టి)లోని నాగమ్మ చెరువు జలకళను సంతరించుకుంది. పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూర్ బొక్కివాగులోకి వరద చేరడంతో మత్తడి దూకింది. కొండపల్లి గొల్లవాడ మధ్య ఉన్న ఒర్రె వరద నీటిలో చిక్కున్న బొలెరో వాహనాన్ని స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. సలుగుపల్లి, అగర్గూడ గుండెపల్లి, కమ్మర్గాం, నందిగామ, మురళీగూడ, జిల్లెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు, ఉచ్చమల్ల వాగు, బొక్కివాగు పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు నీట మునిగాయి. చింతలమానెపల్లి మండలంలో పాల్వాయినగర్, చింతలపాటి వద్ద వాగులు ఉప్పొంగి కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మార్గంలో రవాణా స్తంభించింది. రణవెల్లి, గూడెం వద్ద ప్రాణహిత నిండుగా కనిపిస్తోంది. శివపెల్లి, దిందా, నాయకపుగూడ, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హేటిగూడ నుంచి కుంటలమానెపల్లి మార్గంలో రవాణా నిలిచిపోయింది. బెజ్జూర్ మండలంలో సుశ్మీర్ వాగు ఉప్పొంగి ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవల్ వంతెన పైనుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న తుంపెల్లి వాగుపెంచికల్పేట్: కొండపల్లి, గొల్లవాడకు వెళ్లే రహదారిపై వరదలో చిక్కుకున్న బొలెరోదహెగాం: దిగిడ గ్రామంలో కూలిన ఇంటి గోడలుగుండి వాగును పరిశీలిస్తున్న కలెక్టర్ హరితవర్షపాతం ఇలా(మి.మీ.)బెజ్జూర్ 183.5 పెంచికల్పేట్ 165.4 వాంకిడి 136 కౌటాల 131.4 ఆసిఫాబాద్ 125 దహెగాం 121.7 కాగజ్నగర్ 121.5 సిర్పూర్(టి) 117.3 రెబ్బెన 114.3 చింతలమానెపల్లి 111.7 కెరమెరి 109.4 తిర్యాణి 107.3 లింగాపూర్ 99.6 జైనూర్ 94.3 సిర్పూర్(యు) 3.2 -
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: భారీ వర్షాలపై జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వర్ష పరిస్థితులు, రక్షణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో 24 గంటల పాటు పని చేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పిస్తున్నామని వివరించారు. -
‘తిర్యాణి’ బంద్ సంపూర్ణం
తిర్యాణి: మండల సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన తిర్యాణి మండల బంద్ సంపూర్ణమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ ఏళ్లుగా మండలంలో నిర్మాణానికి నోచుకోని రహదారుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని, అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మడావి గుణవంత్రావు, నాయకులు వెడ్మ భగవంత్రావు, తాళ్ల శ్రీనివాస్గౌడ్, తోట లచ్చన్న, శంకర్గౌడ్, జుంగోని లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
కౌటాల: జిల్లాతోపాటు మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదనీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. తాటిపెల్లి వద్ద వార్దా, గుండాయిపేట గ్రామానికి సరిహద్దులోని పెన్గంగ నది సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది వరదతో పుష్కర ఘాట్లను తాకుతోంది. వరద పెరగడంతో గంగపుత్రులు చేపల వేట నిలిపివేశారు. వార్దా, పెన్గంగ నదులు ఉప్పొంగడంతో మహారాష్ట్రకు నాటు పడవల రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌటాల సీఐ బి.సంతోష్కుమార్ సూచించారు. -
ఇంటర్లోనే ఉపాధికి బాట
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్లేస్మెంట్ విభాగాలు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 47 ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు ఉండగా వీటిలో సుమారు 13వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులకు నాణ్యమైన కెరీర్ మార్గదర్శనం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఉపాధి అవకాశాలకు వారధిలా.. విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించి, ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు దక్కేలా కళాశాలలో ఒక అధ్యాపకుడికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న అధ్యాపకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లాస్థాయి కోఆర్డినేటర్లు వారికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్లుగా ఎంపిక చేస్తారు. కోఆర్డినేటర్లు తమ ప్రాంతంలోని పరిశ్రమల ప్రతినిధులతో సంబంధాలు కొనసాగించడం, నైపుణ్యాలను విద్యార్థులకు సమకూర్చడం, విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందేలా చూడటం తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారు ఆయా కళాశాలల్లో విద్యార్థుల వివరాలు, వారి ఆసక్తులు, ఉన్నత విద్య లక్ష్యాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రత్యేక డేటాబేస్ రూపొందిస్తారు. విద్యార్థులకు కెరీర్ ప్రణాళికపై నిరంతర మార్గదర్శనం అందించే బాధ్యత కూడా వారిదే. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన ప్లేస్మెంట్ విభాగాల ద్వారా ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పారామెడికల్, వ్యవసాయం, పాలిటెక్నిక్, స్కిల్ డెవలప్మెంట్ తదితర రంగాలపై నిపుణులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఫార్మా వంటి కంపెనీల సమన్వయంతో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయనున్నారు. విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ పద్ధతులు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వివరాలు..ప్రయోజనం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధికంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. వీరిలో చాలా మందికి ఉన్నత విద్య, స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలపై సరైన సమాచారం అందుబాటులో ఉండదు. ప్లేస్మెంట్ విభాగాలు ఏర్పాటు ద్వారా అలాంటి విద్యార్థులకు సరైన దిశానిర్దేశం లభించడంతో పాటు భవిష్యత్ కెరీర్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం కలగనుంది.గ్రామీణ విద్యార్థులకు -
వైష్ణవ్జీ.. రైలు వేయండి
నిర్మల్: జిల్లావాసుల రైలు కల సాకారమయ్యే దిశగా పట్టాలు పడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇంకెన్ని దశాబ్ధాలు మొర పెట్టుకోవాలంటూ ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ శీర్షికన ఈనెల 13న ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిశారు. ఉత్తర తెలంగాణ ప్రజలు, ప్రధానంగా రైల్వేలైన్ లేని నిర్మల్వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ –నిర్మల్ –ఆదిలాబాద్ రైల్వేలైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కలిసి వెళ్లి.. సుదీర్ఘంగా వివరించి.. జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని ఎంపీ నగేశ్, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావుపటేల్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇలా కలిసిన ప్రతిసారీ రైల్వేమంత్రి ఏదో నామమాత్రంగా సమాధానమిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పక్కాగా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సారథ్యంలో నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్ ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందన్రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్లు బృందంగా కలిసి వెళ్లారు. మంత్రి కార్యాలయంలోనే భేటీ అయ్యారు. ఈ రైల్వేలైన్ నిర్మాణ ఆవశ్యకతపై సుదీర్ఘంగా అశ్వినీవైష్ణవ్కు వివరించారు. ఈ ప్రాంతంలో వరుసగా బీజేపీ ఎంపీని గెలిపించడంతో పాటు ఈ లైన్ నిర్మాణం చేపట్టాల్సిన నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారన్న విషయాన్నీ మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అశ్వినీవైష్ణవ్ గ్రీన్సిగ్నల్..! రైల్వేలైన్ కోసం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా వచ్చి చేసిన ప్రతిపాదనపై కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు పురోగతిపై అనుకూలంగా ఆయన సంకేతాలు ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కదిలించిన ‘సాక్షి’ కథనాలు.. దేశంలోని ఉత్తర –దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న గ్రాండ్ట్రంక్ రైల్వేలైన్కు ప్రత్యామ్నాయంగానూ ఆర్మూర్ –నిర్మల్ –ఆదిలాబాద్ రైల్వేలైన్ ఉపయోగపడుతుందని, దాదాపు 7లక్షల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని చాలా సందర్భాల్లో ‘సాక్షి’ వి భిన్న కథనాలు ప్రచురించింది. కొన్నేళ్లుగా పదేపదే కేంద్రానికి వినతులు ఇవ్వడంపై ఈనెల 13న ప్రచురితమైన ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ కథనం ప్రజా ప్రతినిధులను కదిలించింది. ఈమేరకు కలిసికట్టుగా బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం నేరుగా కేంద్ర రైల్వేమంత్రిని కలిసి ప్రాజెక్టుకు ఆమోదం కోరడంలో కీలకమైంది. సానుకూలంగా స్పందించారు.. రైల్వేలైన్ నిర్మాణం కోసం బీజేపీ ప్రజాప్రతినిధులంతా మంత్రి అశ్వినీవైష్ణవ్ను ఢిల్లీలో కలిశాం. ఈ ప్రాంత ప్రజల కోరికతో పాటు రైల్వేలైన్ ఆవశ్యకత వివరించాం. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
వీధి కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
పెంచికల్పేట్: మండలంలోని మురళీగూడ, జిల్లెడ గ్రామాల్లో గురువారం వీధి కుక్కల దాడిలో నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న వారిపై, పనులు చేసుకుంటున్న వారిపై కుక్కలు దాడి చేశాయి. దాడుల్లో గ్రామానికి చెందిన పొర్తెటి గౌరుబాయి, కొడప చాలుబాయి, సిడె రమేశ్, ఆత్రం కమలాబాయిలు గాయపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో ఒర్రెలు పొంగి ప్రవహిస్తుండటంతో గాయపడ్డవారికి వైద్యం అందే పరిస్థితి లేదు. గాయపడ్డ వారిని సర్పంచ్ పొర్తెటి వెంకటేశ్ పరామర్శించారు. కొట్టుకుపోయిన నాటు పడవలుకోటపల్లి/వేమనపల్లి: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహించడంతో వేమనపల్లి, కల్మల్పేట గ్రామాలకు చెందిన మత్స్యకారుల 27 పడవలు వరద ప్రవాహానికి తాడు తెంచుకొని కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులు పడవల కోసం ఇంజిన్ పడవ సాయంతో నదిలో గాలింపు చేపట్టారు. మండలంలోని వెంచపల్లి గ్రామ సమీపంలో రెండు కొండల మధ్య పడవలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. -
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
బాసర: విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని, వాటి సాధన కోసం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి, సమయపాలన, నైతిక విలువలతో ముందుకుసాగాలని ప్రొఫెసర్ సాయికుమార్ పేర్కొన్నారు. గురువారం ఆర్జీయూకేటీ, బాసరలో నిర్వహిస్తున్న పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026లో ఆయన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీలోని నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, సాంకేతిక వనరులు, పరిశోధనా అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం అకాడమిక్ మార్కులకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యతను పెంపొందించుకుంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రతిభను ప్రపంచ స్థాయి నైపుణ్యంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఆర్జీయూకేటీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ, అకాడమిక్స్తో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, వారి కలల సాకారానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026 సమన్వయకర్త డా. గుజ్జరి శంకర్ ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యా విధానం, క్యాంపస్ సౌకర్యాలు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, క్లబ్లు, సాంకేతిక, వ్యక్తిత్వ వికాస అవకాశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యం మెరుగుపర్చాలి
ఉట్నూర్రూరల్: విద్యాజ్యోతి సమగ్ర ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్లోని స్థానిక బీఈడీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుల సామర్థ్య పెంపు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఆధునిక బోధనా విధానాలు, సృజనాత్మక కార్యకలాపాలు, సమర్థవంతమైన తరగతి నిర్వహణ, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మార్గాలు అనుసరించాలన్నారు. క్యాంప్ అధికారి, స్థానిక బీ.ఎడ్. కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్ రావు, సహాయ క్యాంప్ అధికారి జాదవ్ విఠల్, ఏసీఎంవో జగన్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. భారీ వర్షాలు కురుస్తున్నందున ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. కంట్రోల్ సెంటర్ సిబ్బంది, వైద్య బృందాలు 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని, సర్పంచ్లు, పటేళ్లు, ఎంపీడీవోలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అన్ని సమాచార మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. అలాగే పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5226 లేదా 08731 –275226 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
భారీ వర్షాలకు కూలిన పశువుల పాకలు
నేరడిగొండ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని కుంటాల(కె) గ్రామంలో రైతు రాథోడ్ సచిన్ కుమార్కు చెందిన పశువుల పాక కుప్పకూలింది. ఈ ఘటనలో పాకలో ఉన్న ఓ ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పశువైద్యాధికారి రాథోడ్ జీవన్కు సమాచారం అందించగా గురువారం గాయపడిన ఎద్దుకు చికిత్స అందించారు. భారీ వర్షాల సమయంలో పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని రైతులకు సూచించారు. పశువుల కొట్టం కూలి మూగజీవాలు మృతినార్నూర్: గాదిగూడ మండలం పిప్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో గురువారం కురిసిన భారీ వర్షాలకు పశువుల కొట్టం కూలిపోయింది. కొట్టంలో కట్టి ఉంచిన ఆవు, దూడ, మేక శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొడప మారు కుటుంబం జీవనోపాధికి ఆధారంగా ఉన్న పశువులను కొట్టంలో కట్టి ఉంచగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పశువుల కొట్టం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది. -
జలపాతాల పరవళ్లు
బజార్హత్నూర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల కనకాయి జలపాతం, బండ్రేవ్ జలపాతాలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ: మండలంలోని కుంటాల, కొర్టికల్ జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండకోనల మధ్య నుంచి పాలధారల వలే జాలువారుతున్న జలపాతాల అందాలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. నార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పారాఖప్పి జలపాతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. కొండల మధ్య నుంచి తెల్లని నురగలు చిమ్ముకుంటూ ఉధృతంగా కిందికి దూకుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. జలపాతం వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రజలు, యువకులు జలపాతం సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
గేట్లు ఎత్తి.. దిగువకు నీటి విడుదల
మామడ: మండలంలోని పొన్కల్ గోదావరి వద్ద ఉన్న సదర్మాట్ బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది. గురువారం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీ రెండు గేట్లు ఎత్తి గోదావరి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 1.580 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 9300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అడ 6, వట్టివాగు 4 గేట్లు.. ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ప్రాజెక్టుల్లో చేరుతోంది. కుమురం భీం (అడ) ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం సామర్థ్యం 10.393 టీఎంసీలు (238 మీటర్లు) కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 6.001 టీఎంసీలు వాటర్ లెవల్ 237.70 మీటర్లు ఉంది. వరద నీరు రావడంతో ఇన్ఫ్లో 30,423 క్యూసెక్కులు కాగా ఆరు గేట్లు 2 మీటర్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 2.480 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 36,000 క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగులు మరింత ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మత్తడి వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు.. తలమడుగు: తాంసి, తలమడుగు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మత్తడివాగు ప్రాజెక్టు ఐదు గేట్లు ఉండగా అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మత్తడి వాగు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా ఇన్ఫ్లో 38,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు అవుట్ఫ్లో 38,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
జోరువాన..!
ఆసిఫాబాద్రూరల్: ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. పంటలకు జీవం పోస్తూ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జోరువాన కురిసింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని వా వుదాం, తుంపెల్లి, గుండి, అప్పపల్లి వాగులు ఉప్పొంగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వట్టివాగు ప్రాజెక్టులోకి వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటికి వదులుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం 41.7 మిల్లీమీటర్లుగా నమోదు కాగా, తిర్యాణిలో అత్యధికంగా 108.2 మి.మీ.లు, అత్యల్పంగా వాంకిడిలో 3.8 మి.మీల వర్షం కురిసింది. గురు, శుక్రవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగజ్నగర్టౌన్: పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై వరద నిలిచి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం రెబ్బెన: వర్షం కారణంగా బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఖైరిగూర ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్ పడింది. ఓసీపీలోని హాల్రోడ్లు బురదమయంగా మారగా, క్వారీ లోపలి పనిస్థలాలు వరదతో నిండాయి. దీంతో అధికారులు ఉత్పత్తి ప్రక్రియను నిలిపివేశారు. క్వారీ లోపల చేరుతున్న నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి షిఫ్ట్ నుంచి బుధవారం రెండో షిఫ్ట్ వరకు ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోగా.. సుమారు 10వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి నష్టం సంభవించిందని సింగరేణి అధికారులు వెల్లడించారు. ఏరియాకు సుమారు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. వర్షం తగ్గుముఖం పట్టగానే ఉత్పత్తిని చేపట్టేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగాపూర్ వాగు ఉప్పొంగిన వాగులు రెబ్బెన: మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు ఉప్పొంగాయి. గుండాల, పులికుంట, గంగాపూర్, లక్ష్మిపూర్ పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సీజన్లో కురిసిన భారీ వర్షాల్లో ఇది రెండోది కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
కౌటాల: బెజ్జూర్ మండలం ఉట్ సారంగపల్లిలో నిధుల దుర్వినియోగంపై బుధవారం పంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో హరిప్రసాద్ విచారణ చేపట్టారు. సర్పంచ్ శ్రీహరి, కార్యదర్శి ధర్మయ్యను అభివృద్ధికి వినియోగించి నిధుల వివరాలపై విచారించారు. డీఎల్పీవో మాట్లాడుతూ రికార్డులు, ఎంబీలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రత్యేక అధికారి పాలనలో నిధుల వినియోగంపై పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి’ విద్యార్థులకు నాణ్యమైన విద్య
● పీవో మంద మకరందు ఆసిఫాబాద్రూరల్: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం తనిఖీ చేశారు. పీవో మాట్లాడుతూ శిక్షణకు నామమాత్రంగా హాజరు కాకుండా, అవకాశంగా భావించి వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు డిజిటల్ లిటరసీపై అవగాహన ఉండేలా బోధించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీడీవో అంబాజీ, ఏసీఎంవో ఉద్దవ్, డీవైఎస్వో శేకు, హెచ్ఎం లింబారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న పీవో మంద మకరందు -
లక్ష్యానికి చేరువగా ‘సర్’
ఆసిఫాబాద్: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(ఎస్ఐఆర్) తుదిదశకు చేరుకుంది. ఓటరు జాబితా సవరణతోపాటు సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ చివరిదశలో ఉంది. జిల్లాలో 678 పోలింగ్ స్టేషన్లు, 4,55,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 4,07,020 ఓటర్లు డిజిటలైజేషన్ ప్రక్రియ 99.86 శాతం పూర్తయింది. మరో 0.14 శాతమే పూర్తి చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్ డివిజన్లో వందశాతం డిజిటలైజేషన్ పూర్తి కాగా, కాగజ్నగర్లో 99.72 శాతం పూర్తయింది. రెండు డివిజన్లలో పురోగతి సంతృప్తికరంగా ఉంది. ఆగస్టు 10 వరకు గడువు ఉన్నప్పటికీ అధికారులు ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. బూత్లో 1200 మంది ఓటర్లు ఒక్కో పోలింగ్ బూత్లో 1200 ఓటర్లు ఉండేలా రేషనలైజ్ చేయనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటే కొత్త కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ ఆగస్టు 10 వరకు గడువు ఉంది. ఇప్పటికే ఆసిఫాబాద్ డివిజన్లో లక్ష్యం చేరుకోగా, కాగజ్నగర్ డివిజన్లో 0.28 శాతమే పూర్తికావాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ప్రతీ బూత్లోనూ జాబితా అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాల స్వీకరణకు 7 నుంచి 10 రోజుల గడువు ఉంటుంది. కొత్త ఓటు నమోదుకు ఫాం– 6, పేరు తొలగింపునకు ఫాం– 7, పేరు చిరునామా, వయస్సు సవరణకు ఫాం– 8 ఇస్తే బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారు. అన్ని రకాల అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం అక్టోబర్ 12న తుదిఓటరు జాబితా ప్రదర్శిస్తారు. తుదిజాబితా ప్రకారం కొత్త ఓటర్లకు ఈ ఎపిక్, పాత వారికి అప్డేట్ చేసిన కార్డులు అందజేస్తారు. అభ్యంతరాలు సమర్పించాలి ఆసిఫాబాద్ డివిజన్లో 2,03,532 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసి, 23,148 మంది ఓటర్లను డబుల్ కింద ఆన్లైన్ చేసి, 2,26,680 మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేశాం. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే సమర్పించాలి. ఆగస్టు 10 తర్వాత క్లెయిమ్స్, ఆబ్జెక్షన్లు సమర్పించవచ్చు. అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం. – లోకేశ్వర్రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్ -
సురక్షిత బొగ్గు ఉత్పత్తిలో సరికొత్త ఘనత
రెబ్బెన: సురక్షిత బొగ్గు ఉత్పత్తిలో బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ సరికొత్త ఘనత సాధించిందని జనరల్ మేనేజర్ శ్రీరమేశ్ అన్నారు. భద్రత వారోత్సవాల్లో ఖైరిగూర ఓసీపీ నాలుగు బహుమతులు సాధించడంతో బుధవారం ఓసీపీ వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి చరిత్రలోనే మొదటిసారి ఖైరిగూర ఓసీపీ నాలుగు పురస్కారాలు సాధించి చరిత్ర సృష్టించిందని అన్నారు. సేఫ్టీ విభాగంలో అత్యుత్తమ పనితీరు చూపి నాలుగు బహుమతులు సాధించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏరియా ఇంజినీర్లు వీరన్న, కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, మేనేజర్ శంకర్, రక్షణ అధికారి గౌతమ్ రాజేశ్వర్ రెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ముంచుకొస్తున్న గడువు
ఆసిఫాబాద్అర్బన్: అర్హులైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు అందించడం, చనిపోయిన వారు, అనర్హులను జాబితా నుంచి తొలగించడం, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలో ఇంకా పూర్తికావడం లేదు. ఓ వైపు అధికారులు ఈకేవైసీ పూర్తి చేసుకోకుంటే సరుకుల పంపిణీ నిలిపివేస్తామని చెబుతున్నా.. అవగాహన లేకపోవడం, వేలిముద్రలు పడకపోవడం, ఆధార్ నంబర్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 2014లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు గడువుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతుందడగా ఇప్పటివరకు 81శాతం ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలిన రెండు రోజుల్లో 20శాతం పూర్తి చేసేందుకు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,65,564 రేషన్ కార్డులు ఉండగా, 5,44,486 మంది లబ్ధిదారులుగా కొనసాగుతున్నారు. ఇందులో 4,42,032 మంది ఈ కేవైసీ పూర్తికాగా, మరో 1,02,454 చేయించుకోవాల్సి ఉంది. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ యజమానితోపాటు ప్రతీ లబ్ధిదారులు సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి ఈ– పాస్ యంత్రం ద్వారా వేలిముద్రలు వేయాలి. రేషన్కార్డు నంబర్, ఆధార్ నంబర్ సరిచూసుకోవాలి. ఆకుపచ్చ రంగు లైట్ వస్తే సభ్యుల కేవైసీ పునరుద్ధరణ పూర్తయినట్లే.. రేషన్ కార్డు, ఆధార్ నంబర్లు సరిపోకపోతే రిజెక్ట్గా ఎరుపు రంగు చూపుతుంది. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తికాని వారి జాబితాను అధికారులు రేషన్ డీలర్లకు పంపించారు. ఈ ప్రక్రియ పూర్తికాకుంటే లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని, గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వివరాలు మండలం లబ్ధిదారులు ఈకేవైసీ పెండింగ్ పూర్తి ఆసిఫాబాద్ 56,884 47,536 9,348 బెజ్జూర్ 31,687 26,639 5,048 చింతలమానెపల్లి 32,719 27,294 5,425 దహెగాం 29,511 24,514 4,797 జైనూర్ 34,152 26,087 8,065 కాగజ్నగర్ 1,11,385 89,287 22,098 కెరమెరి 35,975 27,505 8,470 కౌటాల 36,891 30,438 6,453 లింగాపూర్ 13,402 10,610 2,792 పెంచికల్పేట్ 16,648 13,585 3,063 రెబ్బెన 35,028 29,893 5,135 సిర్పూర్(టి) 29,205 24,364 4,841 సిర్పూర్(యు) 17,367 13,613 3,754 తిర్యాణి 23,850 17,935 5,915 వాంకిడి 39,782 32,632 7,150 వందశాతం పూర్తికి చర్యలు రేషన్కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఇప్పటివరకు జిల్లాలో 81శాతం పూర్తయ్యింది. గడువులోగా వందశాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇంటర్నెట్ లేని గ్రామాలకు సిబ్బంది వెళ్లి ఈ కేవైసీ చేపడుతున్నారు. – మహ్మద్ సాజిద్ హుస్సేన్, డీసీఎస్వో -
తుంపెల్లి వాగును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగు వద్ద వరదను కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్ వేర్వేరుగా పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలన్నారు. లో లెవల్ వంతెనల వద్ద రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం, ఇతర వివరాలకు కంటోల్ రూం నంబర్ 85008 44365, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు, పంచాయితీరాజ్, తాగునీటి సరఫరా, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, వీబీజీ రామ్జీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పంచాయతీల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులు వినియోగించాలన్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల పురోగతిపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో వర్షపాతం వివరాలు
మండలం వర్షపాతం (మి.మీ.) తిర్యాణి 108.2 లింగాపూర్ 93.4 ఆసిఫాబాద్ 17.8 రెబ్బెన 31.4 జైనూర్ 56.2 సిర్పూర్(యూ) 58.6 కౌటాల 12.8 కెరమెరి 70.4 సిర్పూర్(టి) 16.6 చింతలమానెపల్లి 23.8 పెంచికల్పేట్ 49.0 బెజ్జూర్ 36.4 దహెగాం 35.2 వాంకిడి 3.8 -
మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఆసిఫాబాద్: మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యల తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ధర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ద్వారా 2025– 26 సంవత్సరానికి ద్విచక్ర, త్రిచక్ర వాహన లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. 491 మంది గిరిజన మత్స్యకారులు దరఖాస్తు చేసుకోగా 26 మందిని ఎంపిక చేశారు. వీరికి 21 ద్విచక్ర వాహనాలు, మిగిలిన వారికి త్రిచక్ర వాహనాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. గడువులోగా డిజిటలైజేషన్ పూర్తిచేయాలి ఆసిఫాబాద్: నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందించని వారి వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుందన్నారు. ప్రతీ వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. -
డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు
కైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన సీఈవోగా చండా విశ్వేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన శ్రీధర్రెడ్డి గతేడాది సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలువురు ఇన్చార్జీలతో పాలన సాగింది. రెగ్యులర్ నియామకం కోసం ఇటీవల ప్రక్రియ నిర్వహించగా ఆరుగురు అధికారులు హాజరయ్యారు. వారిలో మెదక్ జిల్లా సహకార బ్యాంక్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వేశ్వర్ను నియమిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్చార్జి సీఈవో రవి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో
మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. వట్టివాగు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.404 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 239 మీటర్లు కాగా ప్రస్తుతం 238.30 మీటర్లకు చేరింది. 6,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, మూడు గేట్లను ఒక మీటర్ వరకు పైకెత్తి 5,400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. రాజుర, రహపల్లి, చోర్పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అలాగే కుమురంభీం(అడ) ప్రాజెక్టుకు 900 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 10.3 టీఎంసీలకు గాను ప్రాజెక్టులో 4.9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
పోడు రైతులను అడ్డుకోవద్దు
పెంచికల్పేట్: అటవీ శాఖ అధికారులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అడ్డుకోవద్దని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని పోతపెల్లి శివారులో మంగళవారం పోడు రైతులు చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తరతరాలుగా ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు లాక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఎస్టీ రైతులు సాగు భూములపై ఎలాంటి అభ్యంతరం లేదని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. రైతలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. పోడు భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, సీఐ కుమారస్వామి, ఎఫ్ఆర్వో అనిల్కుమార్, ఎస్సై అనిల్కుమార్, కాంగ్రె్స్ మండల అధ్యక్షుడు సముద్రాల రాజన్న, సర్పంచ్ ఉస్మాన్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
మరిన్ని లోకల్ రైళ్లు అవసరం
2012 నుంచి హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి మధ్య నడిచే ఇంటర్సిటి రైలును కాగజ్నగర్కు పొడిగించారు. అనంతరం ఎ లాంటి ఇంటర్సిటి రైళ్లను ప్రవేశపెట్టలేదు. నూతన ట్రిప్లింగ్ లైన్ అందుబాటులోకి రావడంతో మరిన్ని లోకల్ రైళ్లు అవసరం. సికింద్రాబా ద్, భువనగిరి, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్ స్టాప్లుగా కొత్త రైళ్లు ఏమీలేవు. కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో పిక్ లైన్ను ఏర్పాటు చేయాలి. – ఫణిరాజ్, ఉత్తర తెలంగాణ రైల్వే వినియోగదారుల ఫోరం ప్రతినిధిసౌకర్యాలు మరింత మెరుగు బల్లార్షా, కాగజ్నగర్, ఆసిఫాబాద్ రోడ్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. మూడో లైన్ పూర్తి కావడంతో బల్లార్షా నుంచి కాజీపేట వరకు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. ఇకపై ఈ సెక్షన్లో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. – భాస్కర్, చీఫ్ కమర్షియల్ బుకింగ్ సూపర్వైజర్ -
125 పులులకు ‘కాగజ్నగర్’ ఆవాసయోగ్యం
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధి 125 పెద్దపులులకు ఆవాసయోగ్యంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పులులు శాశ్వతంగా నివాసం ఉండడాన్ని శుభసూచకంగా భావిస్తున్నాం. అటవీశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జీవవైవిధ్యం కలిగిన జిల్లా అడవుల్లో పులుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. గతంలో పులుల దాడుల్లో 48 పశువులు మృతి చెందగా, బాధితుల కుటుంబాలకు రూ.30 వేల చొప్పున పరిహారం అందించాం. నేడు వారితో మొక్కలు నాటించాలని ప్రణాళిక రూపొందించాం. – అప్పయ్య, కాగజ్నగర్ డివిజన్ అటవీ అధికారి -
భారీ వర్షాలపై
అప్రమత్తంగా ఉండాలిఆసిఫాబాద్: భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి మంగళవారం అదనపు కలెక్ట ర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులు, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణహిత నదికి వరద వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల ని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, వాగులు, వంతెనల వద్ద సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. తహసీ ల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షించుకోవాలని సూ చించారు. సహాయక చర్యల్లో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 85008 44365కు సమాచా రం అందించాలని కోరారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు రోజుల్లో పూర్తి చేసుకోవాలని తెలిపారు. మూడు రోజులపాటు భారీ వర్షాలుఆసిఫాబాద్: జిల్లాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు నాగపూర్ ప్రాంతీ య వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లు కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మె రుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవస రం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, వ రద నిలిచే, లోతట్టు ప్రాంతాలు, వాగులు, నదుల సమీపాలకు వెళ్లొద్దన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు స మీపంలో ఉండొద్దని సూచించారు. స్థానిక అధికార యంత్రాంగం, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్ఆసిఫాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. తెలంగాణ జీవనోపాధుల ప్రాజెక్టు కింద తిర్యాణి, లింగాపూర్ మండలాల్లో ఎంపికైన గ్రామాల్లోని అర్హులైన గిరిజనులకు మంజూరైన ఆసరా పింఛన్ పత్రాలను కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ యువరా జ్ మర్మాట్తో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవనోపాధుల ప్రాజెక్టు కింద అర్హులైన గిరిజనులకు వందశాతం పింఛన్లు, జాబ్కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖా తాలు అందిస్తామని తెలిపారు. గిరిజనుల ఆ రోగ్యం, చిన్న పిల్లలకు టీకాలు, ఆహారభద్ర త కార్డులు, నైపుణ్యత శిక్షణ, ఆర్థిక అక్షరాస్య త పెంపుదలకు కృషి చేయాలని ఆదేశించా రు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, డీ పీఎం రామకృష్ణ, సర్పంచులు పాల్గొన్నారు. -
ఉప సర్పంచులు, వార్డు సభ్యుల నిరసన
ఆసిఫాబాద్అర్బన్: సమస్యలు పరిష్కరించా లని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఉప సర్పంచులు, వార్డులు సభ్యులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఉప సర్పంచులకు నెలకు రూ.5వేలు, వార్డు సభ్యులకు రూ.3వేల గౌరవ వేతనం చెల్లించా లని, జీవో 38ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో ఉప సర్పంచుల సంతకాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను తప్పనిసరి గా ఆహ్వానించాలని ఉత్వర్వులు జారీ చేయాలన్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచులు, వార్డు స భ్యుల పేర్లు కూడా చేర్చాలని కోరారు. ఉప సర్పంచులు దీపక్ ముండే, చిట్ల నారాయణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన మూడో లైన్..!
కాగజ్నగర్టౌన్: దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిష్టాత్మకమైన కాజీపేట – బల్లార్షా మధ్య 203 కిలోమీటర్ల మూడో రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.3000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ దేశంలోని ప్రధాన ఉత్తర, దక్షిణ గ్రాండ్ ట్రంక్ రైల్ కారిడార్కు కొత్త ఊపునిచ్చింది. ఈ నెల 22న ఆసిఫాబాద్రోడ్– సిర్పూర్ కాగజ్నగర్ మధ్య 11 కిలోమీటర్ల సెక్షన్తోపాటు విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. దశలవారీగా పనులు2015– 16లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ట్రిప్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మూడు విడతలుగా చేపట్టారు. 2016లో రాఘవాపురం– మందమర్రి మధ్య 33 కిలోమీటర్లు పూర్తి కాగా, 2020 నుంచి మిగిలిన సెక్షన్లు పనులు కొనసాగాయి. తాజాగా ఆసిఫాబాద్ రోడ్– కాగజ్నగర్ మధ్య పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో ట్రాక్ వేగ సామర్థ్యాన్ని పరీక్షించారు. కాగా, నిజాం సర్కార్ 1947 ముందు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం బీబ్రా కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. నిజాం సర్కార్ హయాంలో పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించగా దానికి బీబ్రా వంతెనగా నామకరణం చేశారు. అప్పటి నుంచి దీనిని బీబ్రా బ్రిడ్జిగానే పిలుస్తున్నారు. రైళ్ల ఆలస్యానికి చెక్ఈ నెల 24న దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల కృష్ణన్ ప్రత్యేక రైలులో ట్రిప్లింగ్ లైన్ను బల్లార్షా వరకు పర్యవేక్షించారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే ప్రధాన కారిడార్. ఇక్కడ బొగ్గు, సిమెంట్ వంటి భారీ సరుకు రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు రోజు వేల సంఖ్యలో తిరుగుతాయి. తీవ్ర రద్దీ ఉండేది. మూడో లైన్తో లైన్ సామర్థ్యం పెరిగి రైళ్ల ఆలస్యం తగ్గుతుంది. ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు వేగంగా నడిచే అవకాశం ఏర్పడుతోంది. థర్మల్ పవర్ప్లాంట్, పరిశ్రమలకు బొగ్గు, సిమెంట్ సరఫరా సాఫీగా జరగనుంది. -
బడుల్లో సమర్థవంతంగా అమలు చేయాలి
ఆసిఫాబాద్రూరల్: శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న అంశాలను బడుల్లో సమర్థవంతంగా అమలు చే యాలని డీటీడీవో అంబాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఉపాధ్యాయులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ టీచర్లు ఆధునిక బోధన పద్ధతులు, విద్యార్థి కేంద్రిత అభ్యాసన విధానాలపై పట్టు పెంచుకోవాలన్నారు. గిరిజన విద్యార్థుల విద్యా సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లల్లో ఆలోచననా శక్తి, పరిశోధన దృక్పథం, శాసీ్త్రయ వైఖరిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, లక్ష్మయ్య, కోర్స్ డైరెక్టర్ రవీందర్, ఏటీడీవో చిరంజీవి, జీసీడీవో శకుంతల, డీఎస్వో షేకు, పీడీ మీనారెడ్డి పాల్గొన్నారు. -
అడవికి రారాజు..!
చింతలమానెపల్లి: పర్యావరణ సమతుల్యతకు పెద్దపులిని నిదర్శనంగా చెబుతున్నారు. ఈ మృగాలు మనుగడ సాగించిన చోట అడవులు, వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్నట్లుగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. అడవికి రారాజుగా వెలుగొందే పులులు ప్రస్తుతం ఆవాసం కోసం పోరాటం సాగిస్తున్నాయి. తాడోబా అభయారణ్యం, కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టుకు కీలక వారధిగా ఉన్న జిల్లా అడవుల్లో మనుషుల సంచారం, పోడు సాగు, ఆవాసాలు విచ్ఛిన్నం కావడం పులుల ఉనికిని దెబ్బతీస్తున్నాయి. ఆసిఫాబాద్ డివిజన్లో పులుల స్థిర నివాసాలు లేకున్నా తాడోబా నుంచి కవ్వాల్ అభయారణ్యానికి రాకపోకలు సాగించడానికి అత్యంత కీలకం. కాగజ్నగర్ డివిజన్లోని సిర్పూర్(టి), పెంచికల్పేట్, కాగజ్నగర్ రేంజ్ల్లో పులులు కొంతకాలంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. పెద్దపులుల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం పలు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. బెబ్బులి దాడుల్లో పశువుల కోల్పోయిన బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి మొక్కలు నాటడంతో పాటు, పులులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావనను తొలగించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆహార కొరత.. తగ్గిన కదలికలుఅడవులలో శాకాహార జంతువులను విచ్చలవిడిగా వేటాడటంతో పులులకు తీవ్ర ఆహార కొరత ఏర్పడుతోంది. ప్రధాన ఆహారమైన దుప్పులు, జింకలు, అడవి పందులను కొంతమంది వేటగాళ్లు ఉచ్చులు వేసి హతమారుస్తున్నారు. ఎర జంతువుల సంఖ్య తగ్గడంతో పులులు శివారు గ్రామాల్లోకి వచ్చి పశువులపై దాడులు చేస్తున్నాయి. వేటగాళ్లపై ఐదేళ్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆహార కొరత, ఆవాసాలు తగ్గడం, ఇతర కారణాలతో జిల్లాలో పులుల కదలికలు తగ్గినట్లు తెలుస్తోంది. అడవుల్లో నిరంతరం శబ్దాలు, పెరిగిన మానవ సంచారం, సరిహద్దుల వద్ద రక్షణ లోపించడంతో పులులు మహారాష్ట్రలోని తాడోబాకు తిరిగి వెళ్తున్నట్లు సమాచారం. అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలుపులుల ఉనికిలో జిల్లాకు ఉన్న ప్రాధాన్యతను అటవీశాఖ గుర్తించి అడవులు, పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. గడ్డి మైదానాలను పెంచడంతో పాటు సహజ నీటి వనరుల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో శాకాహార జంతువుల సంఖ్య పెరిగింది. ఇటికలపహాడ్, దిందా, గూడెం తదితర ప్రాంతాలలో భారీ ఎత్తున ఆక్రమణకు గురైన అటవీ, పోడు భూములను స్వాధీనం చేసుకుని అడవులను తిరిగి అభివృద్ధి చేస్తోంది. దెబ్బతింటున్న సహజ ఆవాసాలుకాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలోని 10 రేంజ్ల పరిధిలో 2,437 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. అంకుసాపూర్, సిర్పూర్(టి) రేంజ్, కడంబా అడవుల్లో గతంలో పులులు శాశ్వత ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దాదాపు 11 వరకు ఇక్కడే సంచరించేవి. ఒక పెద్దపులి సంచరించడానికి 80 నుంచి 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవసరం. అటవీ సరిహద్దులు, అటవీ ప్రాంతాల్లో విస్తరిస్తున్న పోడు సాగు కారణంగా అడవులు ముక్కలవుతున్నాయి. సహజ వనరులు దెబ్బతినడంతో వాటి మనుగడకు విఘాతం కలుగుతోంది. అలాగే వేటగాళ్లు ఈ జంతువులను హతమారుస్తున్నారు. పెంచికల్పేట్ పరిధిలోని కే8 పులిని వేటగాళ్లు హతమార్చగా, 34 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. వాంకిడి మండల పరిధిలోని షెర్కపల్లి అడవుల్లో రెండు పులులు, రైలు ప్రమాదంలో మరో పులి మృతి చెందగా, మరికొన్ని పులులు మహారాష్ట్రకు వలస వెళ్లాయి. ప్రస్తుతం జిల్లాలో మూడు పులులు మాత్రమే ఉన్నట్లు అనధికారిక అంచనా. -
ఓవర్ టు పైలట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్ఓ (నిర్వహణ), రిపేర్ (మరమ్మతు), ఓవర్హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. – సాక్షి, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతో పాటు ఎంఆర్వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు గాను రూ.2,278 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ఈ నెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు. ప్రైవేట్ అకాడమీల దృష్టి..ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు. అకాడమీలు ఇలా..పైలెట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. -
గోడు వినండి.. గోస తీర్చండి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు అందించారు. అధికారుల ఎదుట తమ గోడు వెల్లబోసుకుని.. సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎం.డేవిడ్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్నారు. డీఆర్వో వేణుతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెంచికల్పేట్ మండలం ఎల్లూర్కు చెందిన డోంగ్రె విమల తన కుమార్తెకు భూదానం కింద ఇచ్చిన భూమికి పట్టా పాస్పుస్తకం జారీ చేయాలని కోరింది. జైనూర్కు చెందిన కుటికెల శివాజీ మండల కేంద్రంలో అదనంగా మరో మీసేవ కేంద్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. కాగజ్నగర్ మండలం దుర్గానగర్కు చెందిన సచిన్ మేసీ్త్ర తాను సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి పట్టా పాస్బుక్ మంజూరు చేయాలని విన్నవించాడు. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన నాయిని లక్ష్మయ్య తన పట్టా భూమిని ఇతరులు అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. రెబ్బెన మండలం నారాయణపూర్కు చెందిన కాటిపెల్లి కొండయ్య తన తండ్రి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పని చేస్తూ మృతి చెందాడని, వారసత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. సిర్పూర్–టి మండలం అచ్చెల్లికి చెందిన అలం చిరంజీవి తను సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమికి నక్షా జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. సిర్పూర్– టి మండలం పారిగాంకు చెందిన జుంగరి నిర్మలాబాయి ఆసరా పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంది. వీరితో పాటు పలువురు అధికారులకు సమస్యలు ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రణాళికే పెట్టుబడి!
చింతలమానెపల్లి: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో వానాకాలం సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వర్షాధార పంటల సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అత్యవసర పంటల ప్రణాళికను (కాంటింజెన్సీ క్రాప్ ప్లాన్) అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేనందున సాగు సమయం కీలకంగా మారనుంది. వర్షాలు లేకపోతే భూగర్భ జలాలు సైతం పడిపోతాయి. ఈ నేపథ్యంలో బోర్లు, బావుల్లో నీటి లభ్యత లేక పంటలకు దీర్ఘకాలికంగా నీరందించే అవకాశాలు ఉండవు. ఆగస్టు 20 వరకు పత్తి, కంది, పెసర వంటి పంటల సాగు, ఆ తర్వాత నువ్వులు, జొన్న, సజ్జ వంటి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. లోటు వర్షపాతం.. దిగుబడిపై ప్రభావం జిల్లాలో అధికారికంగా 4.56లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. ప్రధానంగా వరి, పత్తి, కంది సాగు చేస్తుంటారు. ఏటా 3 లక్షలకు పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగు, 60 వేల ఎకరాల్లో వరి, మిగతా భూముల్లో నీటి వనరులు తక్కువగా ఉండే ప్రాంతాల్లో పె సర వంటి పప్పుధాన్యాలు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 3.70 ఎకరాల్లో పత్తి, 23వేల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ ఆరంభం వరకు ఉంటుంది. పంటలకు ఈ నాలుగు నెలల్లో కురిసే వర్షపాతమే కీలకం. జూన్ 1 నుంచి జూలై 27 వరకు జిల్లాలో 503.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 378.9 మి.మీ.లు మాత్రమే కురిసింది. 25శాతం లోటు నమోదైంది. ఈ ఏడాది వరి పంట నారుమడులకే పరిమితం కాగా, నాట్లు అతి తక్కువ విస్తీర్ణంలో పూర్తి చేశారు. సాగు లక్ష్యానికి, క్షేత్రస్థాయి సాగుకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సాగు కాలంలో సగం రోజులు ఇప్పటికే గడిచిపోవడంతో సాగు, దిగుబడులపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో వర్షపాతం (మి.మీ.) నెల సాధారణం కురిసింది లోటు శాతం జూన్ 188.6 155.2 18% జూలై (26 వరకు) 304.5 221.3 27% -
త్వరితగతిన ఫిర్యాదులు పరిష్కరించాలి
● ఎస్పీ నితిక పంత్ ఆసిఫాబాద్అర్బన్: పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి స్థితిగతులు తెలు సుకున్నారు. చట్టపరంగా పరిష్కరించాలని సూచనలు చేశారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసుశాఖ దృష్టికి సమస్యలు తీసుకురావాలని సూచించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


