breaking news
Kumuram Bheem District Latest News
-
‘జీవో 252 సవరించాలి’
ఆసిఫాబాద్అర్బన్: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న జీవో 252 తక్షణమే సవరించాలని జర్నలిస్టు యూనియన్ (టీయూడబ్ల్యూజే–హెచ్–143) జిల్లా కన్వీనర్ రవి నాయక్ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రిడిటేషన్ కార్డుల్లో కోత విధించడం తగదని, గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సంతోష్కుమార్, గిరీష్, సతీష్, ఇర్పాన్, రాజు, కిరణ్, రామస్వామి, మోహన్, వెంకటేష్, పాషా, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు. -
● ఈ ఏడాది అధిక వర్షాలతో పంట నష్టం ● గణనీయంగా తగ్గిన వరి, పత్తి దిగుబడి ● కొనుగోళ్ల సమయంలో తప్పని తిప్పలు ● నష్టాలు మిగిల్చిన 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మెకర్తి గోపాల్. ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడలో గతేడాది 13 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా 170 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా 13 ఎకరాల్లో పత్తి సాగు చేయగా అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో 46 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఇతనొక్కడే కాదు జిల్లాలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు’జిల్లా కేంద్రానికి చెందిన హరందరె నాందేవ్ ఈ ఏడాది 18 ఎకరాల్లో పత్తి, మూడెకరాల్లో కంది సాగు చేశాడు. పెట్టుబడికి సుమారు రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. గతేడాది 200 క్వింటాళ్ల పత్తి, 18 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కేవలం 65 క్వింటాళ్ల పత్తి మాత్ర మే రావడంతో తీవ్రంగా నష్టపోయాడు. వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఆసిఫాబాద్: జిల్లా అత్యధిక శాతం మంది ప్రజలు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతినడంతో వ్యవసాయం పండగలా కాకుండా దండగలా మారింది. పత్తికి మద్దతు ధర లభిస్తుండడంతో ఏటా రైతులు పత్తినే అధికంగా సాగు చేస్తున్నారు. గతేడాది జిల్లాలో 4.34 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 3.42 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది వానాకాలం 4.52 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47,228 ఎకరాల్లో వరి, 3,017 ఎకరాల్లో జొన్న, 7,668 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు కాస్తా పెరిగింది. గతేడాది జిల్లాలో 1800 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ ఏడాది సుమారు 1200 ఎకరాల్లో సాగు చేశారు. వీటితో పాటు రెబ్బెన, వాంకిడి, కెరమెరి, కౌటాల, ఈజ్గాం, తదితర మండలాల్లో కూరగాయలు సైతం సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నూనె గింజల సాగు కాస్తా పెరిగింది. గతేడాది వానాకాలంలో జిల్లాలో 387 ఎకరాల్లో నూనె గింజల సాగు చేయగా, ఈ ఏడాది 1,332 ఎకరాల్లో సాగైంది. గతేడాది 3,691 ఎకరాల్లో పప్పు ధాన్యాలు సాగు చేయగా ఈ ఏడాది 21,054 ఎకరాల్లో సాగైంది. గోధుమ పంటపై రైతులు ఆసక్తి చూపడం లేదు. కూరగాయలు గతేడాది 941 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 785 ఎకరాల్లో సాగైంది. రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఏటా ఒకే రకం పంటలు సాగు చేస్తున్నారు. కొత్త పంటల వైపు మొగ్గు చూపడం లేదు. చతికిలపడ్డ పత్తి రైతులు జిల్లాలో ఈ ఏడాది 3.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 35 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. కానీ కురిసిన అధిక వర్షాలకు పత్తిచేలన్నీ నీట మునగడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. గతేడాది డిసెంబర్ నెలాఖరు వరకు సీసీఐ, ప్రైవేటులో జిల్లాలో 9,40,248 క్వింటాళ్ల కొనుగోళ్లు జరగగా ఈ ఏడాది 6,79,295 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, వర్షం ప్రభావంతో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లకు పడిపోయింది. సెప్టెంబర్లో కురిసిన ఎడతెరపిలేని వర్షాలకు వ్యవసాయ శాఖ సర్వే ప్రకారం 6,704 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. అప్పుల బాధ, ఇతర కారణాలతో జిల్లాలో 8 మంది రైతులు ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలంకారప్రాయంగా ప్రాజెక్టులు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంటలకు నీరందకపోవడంతో అలంకార ప్రాయంగా మారాయి. కుమురంభీం కుడి, ఎడమ కాల్వల ద్వారా 37,500 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉండగా అసంపూర్తి కాల్వల నిర్మాణంతో పది శాతం ఆయకట్టుకు కూడా అందని పరిస్థితి నెలకొంది. వట్టివాగు జలాశయంలో సింగరేణి ఓపెన్కాస్టు మట్టి చేరడంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఎన్టీఆర్ సాగర్, అమ్మన మడుగు ప్రాజెక్టుల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. బడ్జెట్లో కాల్వల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో రైతులకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.ప్రైవేటు వైపే మొగ్గుజిల్లాలో 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 48 వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 4,550 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. రైతులకు రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 3.64 కోట్లు చెల్లించారు. గ్రేడ్–1 రకం వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2,369 ఉండగా, ప్రైవేటులో రూ.2,300 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్కు రూ.500 చెల్లిస్తుండగా కేవలం ఖరీఫ్కు మాత్రమే పరి మితమైంది. యాసంగి వడ్లకు బోనస్ చెల్లించలేదు. ఈ క్రమంలో రైతులు ప్రైవేటుకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మిర్చి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఖమ్మం, వరంగల్, మహారాష్ట్రంలోని నాగ్పూర్, తదితర ప్రాంతాల్లో విక్రయించాల్సి వస్తుంది. దీంతో మిర్చి సాగుకు రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. యూరియా కష్టాలు ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసినా యూరియా కొరత రైతులను ఇక్కట్లకు గురిచేసింది. తెల్లవారుజామునుంచే దుకాణాల ఎదుట గంటల కొద్దీ క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితులు దాపురించాయి. సకాలంలో యూరియా సరఫరా చేయాలని జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో రైతులు ఆందోళనలు సైతం చేపట్టారు. కపాస్ కిసాన్ యాప్ ఈ ఏడాది ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ ప్రవేశ పెట్టింది. పత్తి విక్రయించే రైతులు తప్పనిసరిగా ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయాల్సి రావడంతో కౌలు రైతులు ఇబ్బందులకు గురయ్యారు. యాప్ రద్దు చేయాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. పెరిగిన కూలి రేట్లు పత్తి రైతులకు పెరిగిన కూలి రేట్లు మూలిగేనక్కపై తాటికాయ పడినట్లయింది. దిగిబడి తగ్గినప్పటికీ పత్తి ఏరివేత కూలీ రేట్లు పెంచడం రైతులకు అదనపు భారంగా మారింది. పత్తి ఏరివేతకు కిలోకు రూ.10 నుంచి రూ.12కు పెంచారు. దీంతో పాటు కూలీలను ఆటోల్లో తీసుకురావాల్సి రావడంతో రవాణా ఖర్చులు కూడా రైతులు భరించాల్సి వచ్చింది. -
ఆ‘పరేషన్’ భారం!
కెరమెరి(ఆసిఫాబాద్): జనాభాను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను ప్రోత్సహిస్తూ వచ్చేది. సర్కారు దవాఖానా ల్లో క్రమం తప్పకుండా ఆపరేషన్లు చేసేవారు. కానీ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐదేళ్లుగా కు.ని ఆపరేషన్లు నిలిచిపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుండడంతో ఆర్థికభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జి ల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్లో మినహా ఇతర మండలాల్లో కు.ని శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులు లేకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ప్రైవేటు ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలోని 15 మండలాల్లో ఈ ఏడాది సుమారు 4 వేల మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆర్థిక భారం.. ప్రభుత్వ ఆస్పత్రులో 2020 ఏప్రిల్ నుంచి కు.ని శిబిరాలు నిర్వహించడం లేదు. దీంతో చేసేదేంలేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. కొందరు కాగజ్నగర్, ఆసిఫాబాద్తో పాటు మరి కొందరు ఆదిలాబాద్, మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. ఇందుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని బాధితులు పేర్కొంటున్నా రు. కొన్ని సందర్భాల్లో స్థాయిని బట్టి ఇంకా ఎక్కువగా కూడా వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కు.ని ఆపరేషన్ల కోసం మండలాల వారీగా తేదీలను ప్రకటించి మరీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించేవారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న పీహెచ్సీల్లో కేవలం డెలివరీలు మాత్రమే చేస్తూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్కోసం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. పక్క రాష్ట్రాలకు.. జిల్లాలోని కెరమెరి, జైనూర్, నార్నూర్, వాంకిడి, సిర్పూర్(టి) తదితర మండలాలకు మహారాష్ట్ర ప్రాంతం సరిహద్దున ఉంటుంది. చంద్రాపూర్, రా జుర, జివితి, గడ్చందూర్, గడ్చిరోలి, తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లి కు.ని ఆపరేషన్ చేయించుకుంటున్నారు.ముందుకురాని గైనకాలజిస్టులుకుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు గైనకాలజిస్టులు ముందుకురావాలి. కానీ వెనుకబడిన జిల్లా కావడంతో కుమురంభీం జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పట్టణాల్లో ఉండేందుకు అలవాటు పడిన వారు మారుమూల మండలాలకు వచ్చేందుకు ఇష్టత చూపడం లేదని ఒక అధికారి పేర్కొన్నారు. కాగా గతంలో ఒక్కో కు.ని శస్త్ర చికిత్స చేస్తే ప్రభుత్వం రూ.వెయ్యి ఇచ్చేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గైనాకాలజిస్టులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు చెల్లించక పోవడంతో కూడా ఇక్కడికి రావడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రోత్సాహకాలుప్రభుత్వ ఆస్పత్రుల్లో కు.ని శస్త్రచికిత్స చేయించుకున్న వారికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసింది. ఎస్టీ, ఎస్టీ మహిళలు రూ.880, ఇతరులకు రూ.660 అందించేవారు. ఈ మొత్తం రవాణా ఖర్చులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుకు ఉపయోగపడేవి. ప్రస్తుతం ఆపరేషన్లు లేకపోవడంతో ప్రోత్సాహకాలు కూడా నిలిచి పోయాయి. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయితే రెండు రోజులు బాలింతతో పాటు అటెండర్కు రోజుకు రెండు పూటలా భోజనం అందించేవారు. కానీ ఇప్పుడు నిధుల కొరతతో భోజనం పెట్టడం మానేశారు. దీంతో డెలివరీకి వచ్చే మహిళలు ఇంటినుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు.జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు పీహెచ్సీలు 20 సీహెచ్సీలు 05 ఏరియా ఆస్పత్రులు 01 జనరల్ ఆస్పత్రి 01 -
పెరిగిన చలి తీవ్రత ముసురుకుంటున్న వ్యాధులు
78930 44538ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. చలి బారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్యాధికారి సీతారాంతో సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. పెరుగుతున్న చలి తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే డీఎంహెచ్వోను ఫోన్ ద్వారా సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు.సమయం: సోమవారం (తేదీ 29–12–2025) ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు డీఎస్వో షేకు తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎం లింబరావు, పీడీ మీనారెడ్డి, కోచ్లు అరవింద్, విద్యాసాగర్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు మౌనిక, మహేశ్వరి, అక్షిత, గంగూబా యి, అంజలి, తుకుబాయి, అర్తి ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నారాయణపేట జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి అండర్ 14 ఎస్జీఎఫ్ హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. -
ప్రతీ పంచాయతీకి 20 ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుదహెగాం: నియోజకవర్గంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి ఇరవై ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో కొత్తగా మంజూరైన 28 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45 రోజుల్లో పనులు ప్రారంభించకుంటే రద్దు చేసి ఇతరులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మండలానికి 274 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద దిగిడ గ్రామాన్ని ఎంపిక చేసి 24 ఇళ్లు మంజూరు చేయగా అందులో 17 పూర్తి దశకు చేరాయన్నా రు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నస్రుల్లాఖాన్, సర్పంచులు రాపర్తి జయలక్ష్మి, ఇస్లావత్ గోపాల్, దందెర శంకర్, శేగం భారతి, కొద్దెన మల్లక్క, ఎంపీవో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ సందీప్, బీజేపీ మండల అధ్యక్షుడు లగ్గామ దామోదర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు. -
రుచికరమైన భోజనం అందించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో సుభాష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వంటల పోటీలు నిర్వహించారు. జిల్లాలో వివిధ మండలాల నుంచి మధ్యాహ్న భోజన వంట కార్మికులు జిల్లా స్థాయి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ మండలంలో సాయిబాబా గ్రూప్కు చెందిన లక్ష్మి, పెంటుబాయి ప్రథమ బహుమతి, సిర్పూర్ ఉన్నత పాఠశాలలో వంట చేసే అంకమ్మ దేవి ఏజెన్సీకి చెందిన లక్ష్మి, కమల ద్వితీయ బహుమతి దక్కించుకున్నారు. పోటీల్లో పాల్గొన్నా వారికి ప్రశంస పత్రాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
6వ రోజుకు మున్సిపల్ కార్మికుల సమ్మె
కాగజ్నగర్టౌన్: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 6వ రోజుకు చేరుకుంది. బీఆర్ఎస్ నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తోందన్నారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని వేతనాలు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మిన్హాజ్, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, మల్లేశ్, లక్ష్మి, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
కాగజ్నగర్టౌన్: కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఎమ్మెల్సీ దండె విఠల్ కోరారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలన్నారు. ప్రతీ కార్యకర్త గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, పరిశీలకులు రియాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, నాయకులు సిడాం గణపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగీర్, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం కెరమెరి(జైనూర్): కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం జరుగుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శనివారం జైనూర్ మండలంలోని జంగాంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్రెడ్డి, ఇన్చార్జి మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అనసూయబాయి, తదితరులు పాల్గొన్నారు. -
వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని జీఎం(ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు) జి.దేవేందర్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో శుక్రవారం పర్యటించారు. ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డితో కలిసి ఖైరిగూర ఓసీపీని సందర్శించారు. ఈ సందర్భంగా ఓసీపీ వ్యూ పాయింట్ నుంచి పనిస్థలాలను పరిశీలించారు. ఉత్పత్తి సాధన, రవాణాకు రానున్న మూడు నెలలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఆయన తెలుసుకున్నారు. గోలేటి ఓసీపీ పనుల ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఖైరిగూర ఓసీపీ ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సీపీఐ ఆవిర్భావ వేడుకలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో శుక్రవా రం భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆవి ర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బద్రి సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఏర్పడిన ఈ పార్టీ ప్రజల సమస్యల పరిష్కా రం కోసం అలుపెరుగని పోరాటాలు చేసింద ని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించింద ని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్గౌడ్, నాయకులు పిడుగు శంకర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వుతో కలిసి ప్రారంభించారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో రాజకీయ జోక్యాలు తీసుకురావద్దని అన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. మంచిర్యాలకు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నామని తెలిపారు. రైతులు సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలన్నారు. రంగు మారిన సోయా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు పీజీ సీట్లు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్లు వేశామని తెలిపారు. రిమ్స్ సూపర్ స్పె షాలిటీ ఆస్పత్రికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించిందని పేర్కొన్నారు. రాజకీయాలు స్నేహపూర్వకంగా ఉండాలని, గతంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్పేయిని ప్రతినిధిగా పంపారని గు ర్తు చేశారు. అయితే ప్రధానమంత్రి రామగుండంలో జరిగిన కార్యక్రమానికి హాజరైతే అప్పటి ముఖ్య మంత్రి హాజరు కాలేదని పేర్కొన్నారు. అలాంటి రాజకీయాలు మంచిది కాదని పేర్కొన్నారు. రైతులు సాగులో రసాయనాల వాడకం తగ్గించి సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తే బాగుంటుందన్నారు. జిల్లాకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని, జి ల్లాలో 8లక్షల మందికి కార్డులు అందజేసినట్లు పే ర్కొన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు సర్వే జరుగుతుందని తెలిపారు. మార్చి వరకు పత్తి కొనుగో ళ్లు చేస్తామని పేర్కొన్నారు.జిల్లాకు ఎంత చేసినా తక్కువే..: మంత్రి జూపల్లి కృష్ణారావువెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రిమ్స్కు అవసరమైన వైద్యపోస్టులు మంజూరు చేసేలా కృషి చేస్తానని పే ర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి 10లక్షలకు పెంచినట్లు తెలిపారు. రూ.800 కోట్ల సీఎంఆర్ నిధులు విడుదల చేసిన ట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6,956 స్టాఫ్నర్స్ పోస్టులను, 4,338 వైద్య పోస్టులను భర్తీ చేసిన ట్లు తెలిపారు. రిమ్స్లో ప్రతీ రోగికి నాణ్యమైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. త్వరగా ఎయిర్పోర్టు నిర్మాణం చేపడితే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి ఒక కల్చరల్ బిల్డింగ్ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్లు మాట్లాడారు. రిమ్స్తోపాటు ఉట్నూర్, బోథ్ ఆ స్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చే యాలని, ఇచ్చోడ పీహెచ్సీని ఏరియా ఆస్పత్రి గా మార్చాలన్నారు. జన్నారంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక జీవో తీసుకొచ్చి వైద్యులకు రూ. 5లక్షల వేతనం ఇచ్చి స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రిమ్స్లో క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభంతో అత్యవసర సేవలు మెరుగుపడతా యని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, కొమురయ్య, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూ ల నర్సయ్య, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీ ఎంహెచ్వో నరేందర్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవర్పై కేసు ఎత్తివేయాలని నిరసన
ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీ డ్రైవర్పై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డిపో గేటు ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ మాట్లాడుతూ రెబ్బెన మండలం దేవులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం బాధాకరమన్నారు. ఈ విషయంలో డిపో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. డ్రైవర్ రామారావుకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రఫిక్, తాహెర్, రాజు, హరినివాస్, బాలు, విలాస్ పాల్గొన్నారు. -
బాక్సింగ్తో ఆత్మస్థైర్యం
కాగజ్నగర్టౌన్: బాక్సింగ్తో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. బాక్సింగ్ డే సందర్భంగా శుక్రవారం కాగజ్నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా సమీపంలో గల నేషనల్ ఫిట్నెస్ జిమ్, శివ బాక్సింగ్ క్లబ్లను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ, సహనం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. యువత ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని సూచించారు. కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న నివాస్ బాక్సింగ్ క్రీడను యువతకు ఇష్టంగా నేర్పుతున్నాడని ప్రశంసించారు. అనంతరం శిక్షణ పొందుతున్న బాక్సర్లను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు రమాకాంత్ యాదవ్, జాకీర్, శ్రావణ్ గౌడ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే వడ్డన!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైల్వేశాఖ ప్రయాణికులపై చార్జీల భారం మోపింది. క్రమంగా టికెట్ల రేట్లు పెంచుతూ పోతోంది. ఈ ఏడాదిలో రెండుసార్లు చార్జీలు పెంచింది. సమీప భవిష్యత్లోనూ ఇంకా చార్జీలు పెంచుతారనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల పెంచిన టికెట్ల ధరలు ఈ నెల 26నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో శుక్రవారం నుంచే రాకపోకలు సాగించిన దూరప్రాంత ప్రయాణికులపై అదనపు భారం పడింది. ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లతో పాటు స్లీపర్ క్లాస్ల చార్జీలు పెరిగాయి. అంతేకాకుండా నెలవారీగా తీసుకునే సీజనల్ టికెట్ చార్జీలు స్వల్పంగా పెంచారు. రైల్వేలో కిలో మీటర్ల దూరాన్ని బట్టి స్లాబ్ ప్రకారం చార్జీలుంటా యి. ప్రతీ 50 కిలో మీటర్ల దూరానికి అన్రిజర్వ్డ్, స్లీపర్, ఏసీ కేటగిరీలుగా లెక్కగడతారు. 215 కి.మీ. దాటితే పెంపురోడ్డు మార్గం కంటే రైలు ప్రయాణమే తక్కువ ఖ ర్చుతో వేగంగా, సౌకర్యవంతంగా వెళ్లొచ్చని పేద, మధ్య తరగతి ప్రజలు అధిక ఆసక్తి చూపిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి కీలక రైల్వే మార్గమైన కాజీపేట, బల్లార్షా సెక్షన్, ఇటు వరంగల్, విజయవాడ, చైన్నె దాకా వెళ్లే ప్రయాణికులకు దూరభారంతో రోడ్డు వెంట కంటే రైలు ప్రయాణమే ఉత్తమం. వీటితో పాటు మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబా ద్, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా మీదుగా నాగ్పూర్ అటు న్యూఢిల్లీ దాకా, ఇటువైపు సికింద్రాబాద్, వ రంగల్, ఖమ్మం, భద్రాచలం రోడ్, విజయవాడ, తి రుపతి, బెంగళూరు, చైన్నె వరకు రాకపోకలు సాగి స్తుంటారు. అయితే దూరప్రాంతాలకు వెళ్తే ప్రతీ 215 కిలో మీటర్లు దాటితే పెరిగిన రేట్లు వర్తిస్తున్నా యి. సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల నుంచి కరీంనగర్, కాజీపేట, వరంగల్, చంద్రపూర్ దాకా చార్జీలు పెరగలేదు. సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు రూ.5 పెరిగితే, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్కు రూ.15 చొప్పున ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు చార్జీలు పెరిగాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి నాగపూర్ జంక్షన్ వరకు అన్ రిజర్వ్డ్ టికెట్కు రూ.15చొప్పున, సికింద్రాబాద్ నుంచి మంచిర్యాలకు సూపర్ఫాస్ట్ స్లీపర్ క్లాస్ చార్జీ నిన్నటి వరకు రూ.210 ఉండగా, రూ.215కు చేరింది. అలాగే బెల్లంపల్లి వరకు సూపర్ఫాస్ట్ ఎక్స్ స్లీపర్ క్లాస్ చార్జీ రూ.225కు పెరిగింది. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల వరకు మెయిల్ ఎక్స్ప్రెస్లో స్లీపర్క్లాస్కు రూ.180నుంచి రూ.185కు పెరిగింది. ఇంటర్ సిటీ, భాగ్యనగర్కు మంచిర్యాల నుంచి సికింద్రాబాద్కు రూ.95నుంచి రూ.100కు చేరింది. అదే సూపర్ ఫాస్ట్కు రూ.110నుంచి రూ.115కు పెరిగింది. ఇంటర్సిటీ, భాగ్యనగర్ రైళ్లకు బెల్లంపల్లి–సికింద్రాబాద్ వరకు రూ.100 నుంచి రూ.105కు, సూపర్ఫాస్ట్ రూ.115నుంచి రూ.120కి పెరిగింది. ఇంటర్సిటీ, భాగ్యనగర్ రైళ్లకు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్కు రూ.120 నుంచి రూ.135కు, సూపర్ఫాస్ట్కు రూ.135నుంచి రూ.150కి పెరిగింది. సామాన్యుడిపై భారమే ఈ ఏడాది రెండుసార్లు చార్జీలు పెంచారు. పెరిగింది స్వల్పమే కానీ, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎక్కువ మందితో దూరప్రయాణం చేస్తే ఆర్థిక భారం పడుతుంది. – అంకిత్ ఫణిశర్మ, రైల్వే ఫోరం అధ్యక్షుడు, ఉత్తర తెలంగాణరైలు ప్రయాణ మార్గం పెరిగిన చార్జీ ఎక్స్ప్రెస్ (అన్రిజర్వ్డ్) మంచిర్యాల–నాగ్పూర్ వరకు రూ.15 సూపర్ఫాస్ట్ సికింద్రాబాద్–మంచిర్యాల రూ.5 సూపర్ఫాస్ట్ సికింద్రాబాద్–బెల్లంపల్లి రూ.15 ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్–బెల్లంపల్లి రూ.5 ఎక్స్ప్రెస్ మంచిర్యాల–భద్రాచలంరోడ్ రూ.5 ఎక్స్ప్రెస్ బెల్లంపల్లి–భద్రాచలంరోడ్ రూ.10 ఎక్స్ప్రెస్ సిర్పూర్ కాగజ్నగర్–భద్రాచలంరోడ్ రూ.15 -
నూతన కార్మిక చట్టాలు ఉపసంహరించుకోవాలి
కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూపాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేఖ విధానాలకు నిరసనగా శుక్రవారం కాగజ్నగర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కార్మికులను కట్టుబానిసలుగా చేసే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమం మాదిరిగా కార్మికులు ఐక్యంగా కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేస్తూ.. జీ రాంజీ చట్టం పేరుతో తన వాటా నిధులను 60 శాతానికి కుదించిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, జిల్లా సహాయక కార్యదర్శి వెలిశాల కృష్ణామాచారి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకానంద్, కార్తీక్, వివిధ సంఘాల నాయకులు కూశన రాజన్న, ముంజం శ్రీనివాస్, ఆనంద్కుమార్, దినకర్, మంజూల, అనిత, పద్మ, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బడుల్లో రోబోటిక్స్
పెంచికల్పేట్(సిర్పూర్): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించి నూతన ఆవిష్కరణల్లో భాగస్వాములను చేయడానికి పీఎం శ్రీ పాఠశాలలు, కళాశాలల్లో రోబోటి క్స్ విద్యను నూతనంగా ప్రవేశపెట్టారు. ఏఎండీ సంస్థ సహకారంతో సోహమ్ అకాడమీ హ్యూమన్ ఎక్స్లెన్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. అటల్ థింకింగ్ ల్యాబ్ల ద్వారా సైన్స్పై మక్కువ కల్పించడానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకం చేస్తున్నారు. జిల్లాలోని 12 పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని 475 మంది బాలికలు, 543 మంది బాలురుకు మొ త్తంగా 1,018 మందికి ప్రత్యేకంగా ల్యాబ్ల్లో ఒకరోజు శిక్షణ కల్పించారు. అనంతరం ప్రత్యేకమైన కిట్లు పంపిణీ చేశారు. సైన్స్పై మక్కువ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో ఎలక్ట్రానిక్స్పై శిక్షణ అందించడం ఉపయోగకరంగా ఉంది. రోబోటిక్స్ కిట్ల ద్వారా బోధిస్తుండటంతో సైన్స్పై మక్కువ పెరిగింది. సైన్సు ఉపాధ్యాయులతో ప్రతీ వారం రెండు పీరియడ్స్ రోబోటిక్స్పై శిక్షణ అందిస్తున్నాం. – విజయ నిర్మల, హెచ్ఎం, పీఎంశ్రీ ఉన్నత పాఠశాల, పెంచికల్పేట్ప్రత్యేక శిక్షణ అందించి..జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ రెబ్బెన, జీహెచ్ఎస్(ఓల్డ్) కాగజ్నగర్, జీహెచ్ఎస్ నజ్రూల్నగర్, టీఎంఆర్ఐఈఎస్ గన్నారం, టీజీఎంఎస్ ఆసిఫాబాద్, టీఎస్ఆర్ఐఈఎస్ ఆసిఫాబాద్, జెడ్పీహెచ్ఎస్ ఆసిఫాబాద్, జెడ్పీహెచ్ఎస్ వాంకిడి, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వాంకిడి, జెడ్పీహెచ్ఎస్ సిర్పూర్(టి), జెడ్పీహెచ్ఎస్ బాబాసాగర్, జెడ్పీహెచ్ఎస్ పెంచికల్పేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రోబోటిక్స్ విద్య బోధిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన చార్టులు, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ప్రత్యక్షంగా శిక్షణ అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ, మోటార్లు, ప్రాజెక్టుల తయారీ, సెన్సార్లు, రోబోల తయారీపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తయారు చేసిన సంబంధిత ప్రాజెక్టుల వివరాలను ప్రతినెలా యాప్లో నమోదు చేస్తున్నారు. డ్రోన్లు, బాంబ్ డిటెక్టింగ్ పరికరం, సోలార్ విద్యుత్ వీధి దీపాలు, డోర్ అన్ లాంకింగ్ సిస్టం, హీట్ గన్స్, కుట్టు మిషన్లు వంటి ప్రాజెక్టులను రూపొందించారు. పాఠశాలల్లో తరగతులతోపాటు ప్రత్యేకంగా జూమ్ ద్వారా ఆన్లైన్ శిక్షణ కల్పిస్తున్నారు. సైన్సు ఉపాధ్యాయులతో రోబోటిక్ విద్యలో మెలకువలను నేర్పిస్తున్నారు. బాలబాలికలు తాము రూపొందించిన నూతన ఆవిష్కరణలు జిల్లాస్థాయిలో నిర్వహించే సైన్స్ ఫెయిర్లో ప్రదర్శిస్తున్నారు. -
దయనీయం.. దర్జీ జీవనం
కౌటాల మండల కేంద్రంలోని ప్రగతి కాలనీకి చెందిన 55 ఏళ్ల కొండి ఓదేలు 20 సంవత్సరాలు టైలర్గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచాన పడ్డాడు. ఓదేలుకు భార్య పల్లవి, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. టైలర్ పనిచేస్తేనే పూట గడిచే ఈ కుటుంబ పెద్ద అనారోగ్యం పాలుకావడంతో పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్య ఖర్చులు, కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలు, ప్రభుత్వం స్పందించి చేయూతను అందించాలని వేడుకుంటున్నారు. కాగజ్నగర్ పట్టణానికి చెందిన శివ అనే యువకుడు దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చేతినిండా పనులు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం రోడ్డున పడింది. ఆన్లైన్ షాపింగ్, రెడీమేడ్ దుస్తుల కారణంగా సంప్రదాయ దర్జీలకు చేతినిండా పని దొరకడం లేదు. కౌటాల(సిర్పూర్): ఒకప్పుడు సందడిగా కనిపించే టైలర్ దుకాణాలు నేడు పనిలేక వెలవెలబోతున్నా యి. ఆధునిక కాలంలో ఆన్లైన్ షాపింగ్తో పాటు రెడీమేడ్ దుస్తుల రాకతో దర్జీల వద్ద బట్టలు కుట్టించుకునే వారు కరువయ్యారు. మారుతున్న కాలనుగుణంగా వృత్తిలో కొత్త ప్రయోగాలు చేస్తున్నా ఫలి తాం ఉండటం లేదు. గతంలో టైలర్ షాపులు మూ డు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లేవి. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకలకు కొత్త బట్టలను కుడుతూ ఏడాదంతా బిజీగా ఉండేవారు. ఒక్కో షాపులో పది నుంచి 12 మంది ఉపాధి పొందేవారు. నేడు ఈ పరిస్థితి మారింది. చిన్నారుల నుంచి వయస్సు మీరిన వారు కూడా రెడీమేడ్ దుస్తులు ధరిస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి టైలర్ షాపులు ఏర్పాటు చేసుకున్న వారు అప్పులపాలవుతన్నారు. వందలాది మందికి ఆధారంజిల్లాలో సుమారు 800 దర్జీ(మేరు కులస్తులు) కు టుంబాలు ఉన్నాయి. ఆసిఫాబాద్లో 280, కాగజ్నగర్లో 200, వాంకిడి, కౌటాల మండలాల్లో వంద వరకు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మండ ల కేంద్రాల్లో సుమారు నాలుగు వందల వరకు టైలరింగ్ షాపులు కొనసాగుతుండగా, గ్రామాల్లో చా లా వరకు ఉన్నాయి. కొంతమంది యువతులు, మ హిళలు కూడా టైలరింగ్ నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. వందలాది మంది టైలరింగ్పై ఆధారపడుతున్నారు. అయితే పొద్దంతా పనిచేసినా కూలి గిట్టడం లేదని చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే డ్రెస్లు కుడుతూ మిగితా సమయాల్లో ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల యూనిఫాం ఆర్డర్లు దర్జీలకు అప్పగిస్తే ఆర్థికభారం నుంచి గట్టెక్కుతామని వారు పేర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఖాళీగా ఉంటున్నాం రెడీమేడ్ దుస్తుల వాడకంతో పని లేక ఖాళీగా ఉంటున్నాం. రెండు, మూడు రోజులకు ఒక డ్రెస్సు కుడతున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దర్జీలకు ప్రభుత్వం పావల వడ్డీ రుణాలు ఇవ్వాలి. ఇళ్లు లేని వారికి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చి ఆదుకోవాలి. – లోడెల్లి శైలేష్, సీనియర్ టైలర్, కౌటాల యూనిఫామ్ల టెండర్లు ఇవ్వాలి వసతి గృహాలు, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టేందుకు స్థానిక టైలర్లకు టెండర్లు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం దర్జీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. కుల వృత్తులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. – ఎన్.సత్యనారాయణ, టైలర్, కౌటాల జిల్లాలోని దర్జీ కుటుంబాల వివరాలుమండలం కుటుంబాలు ఆసిఫాబాద్ 280 వాంకిడి 100 కాగజ్నగర్ 200 కౌటాల 100 చింతలమానెపల్లి 50 పెంచికల్పేట్ 30 దహెగాం 40 -
అంతర్జాతీయ సదస్సుకు చైతన్యకుమారి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాలలోని రాంనగర్కు చెందిన డాక్టర్ కే.చైతన్యకుమారి ఈ నెల 27, 28న ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే 62వ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో ‘భారతదేశంలో ప్రభుత్వ విధానాల రూపకల్పన–ఒక అధ్యయనం’ అనే అంశంపై ప్రసంగిస్తారు. గతంలో పలు జాతీయ స్థాయి సదస్సుల్లో ప్రసంగించిన ఆమె ఇటీవల ‘పబ్లిసిటీ పాలసీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఏ స్టడీ ఆఫ్ ఐటీడీఏ ప్రోగ్రామ్స్ ఇన్ కుమురంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్’ అనే అంశపై విస్తృతస్థాయిలో పరిశోధన చేసి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాలను భవనేశ్వర్ అంతర్జాతీయ సదస్సులో సమర్పించనున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న చైతన్యకుమారి అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక కావడంపై భర్త చంద్రయ్య, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందించారు. -
ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలి
కాగజ్నగర్టౌన్: ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు రాచకొండ నాగేశ్వర్రావు అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని వాసవీ కల్యాణ మంటపంలో గురువారం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. అనారోగ్యంతో చికిత్స పొందిన అర్చకుడికి ఆర్థికసాయంతో పాటు సేవా ట్రస్ట్ ద్వారా ఏటా రూ.4 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో మన అమ్మవారికి మన సారె కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఆర్యవైశ్య జర్నలిస్టులు, విశ్రాంత ఆర్యవైశ్య ఉద్యోగులను సన్మానించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తూడూరు అమృతసాగర్, పాలెపు మురళీధర్, సంతోష్, తూడూరు నాగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లోకరక్షకుడు యేసు
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: ప్రేమ, కరుణ, సేవాభావమే మానవాళికి అసలైన మార్గమని చాటిచెప్పిన కరుణామయుడు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి, కేక్లు కట్ చేశారు. పాస్టర్లు మాట్లాడుతూ లోకరక్షకుడు యేసు క్రీస్తు అని అన్నారు. ప్రతిఒక్కరూ ప్రేమ, కరుణ కలిగి ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ న్యూలైఫ్ ఏజీ చర్చి, జన్కాపూర్, రాజంపేట, సందీప్నగర్, జుబ్లీ మార్కెట్, కౌటాల, యాపలగూడ, కాగజ్నగర్ పట్టణంలోని సీఎస్ఐ, ఫాతిమా, పెంతెకోస్తల్, మమ్రేబ్రదమ్ చర్చీల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. పాస్టర్లు, ఫాదర్లు రాజశేఖర్, ఇమాన్యూయల్ సత్యం, జోషి, యేసుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నారుపై చలిపంజా
రెబ్బెన(ఆసిఫాబాద్): వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో పంటల దిగుబడి గణనీయంగా తగ్గింది. అయినా రైతులు కుంగిపోకుండా యాసంగి పంటల సాగు పనులు చేపట్టారు. అయితే సీజన్ ఆరంభంలోనే చలితీవ్రత వారికి తలనొప్పిగా మారింది. నెల రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. చలి పంజాకు వరినారు ఎదుగుదల మందగించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగల్ డిజిట్ నమోదు అవుతుండటంతో ఆశించిన ఎదుగుదల లేక తెగుళ్లు సోకుతున్నాయి. ఎదుగుదల లేక..దహెగాం, రెబ్బెన, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మండలాల్లో సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లోని రైతులు యాసంగి వరిసాగు కోసం పనులు ప్రారంభించారు. ముఖ్యంగా రెబ్బెన మండల కేంద్రంతోపాటు నంబాల, నారాయణపూర్, కొమురవెళ్లి, పుంజుమేరగూడ, నక్కలగూడ, కై రిగాం ప్రాంతాల్లో యాసంగి వరి సాగు చేస్తుండగా, గంగాపూర్, కొండపల్లి, నేర్పల్లి ప్రాంతాల్లో కూరగాయలు పండిస్తున్నారు. తుపాన్ కారణంగా వరికోతలు కాస్త ఆలస్యమయ్యాయి. దీంతో రైతులు నవంబర్ రెండో వారం నుంచి నార్లు పోయడం ప్రారంభించారు. అప్పటినుంచి చలి రోజురోజుకూ పెరుగుతుండటం పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాత్రి, తెల్లవారుజామున చలిగాలులు వీస్తున్నాయి. నారులో ఎదుగుదల లేక, తెగుళ్లు సోకుతున్నాయి. రైతులు నారును కాపాడుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మొలకలు ఎర్రబా రుతుండటంతో నివారణకు రెండు, మూడు రోజు కు ఒకసారి రసాయనిక మందులు పిచికారీ చేస్తు న్నారు. అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. నాట్లపైనా ప్రభావంఅధిక చలితో నారు ఎదుగుదల లేకపోవడంతో దాని ప్రభావం వరినాట్లపై పడనుంది. సాధారణంగా నారు పోసిన 25 నుంచి 30 రోజుల్లోగా నాట్లు వేసుకుంటే మంచి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. అంతకు మించి సమయం దాటితే దిగుబడి తగ్గుతుంది. ఆలస్యంగా నాటు వేసిన పంటల్లో ఆశించిన స్థాయిలో పిలకలు రావు. కొంత మంది రైతులు నారు పోసి 25 రోజులు గడుస్తున్నా చలితీవ్రత కారణంగా మొలకలు మూడు ఇంచుల ఎత్తు వరకు కూడా పెరగలేదు. అనుకున్న సమయంలోగా నాటు వేసే అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే విత్తనాల్లో మొలక శాతం తగ్గి ఒక్కో రైతు రెండు, మూడుసార్లు నార్లు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వారిపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది. మొలిచిన నారు సైతం ఎర్రబారి చనిపోతోంది. కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. మరో 20 రోజులు దాటితే తప్ప నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. అదును దాటితే కోతల సమయంలో ఆకాల వర్షాల రూపంలో మరోసారి ముప్పు పొంచి ఉండనుంది.మొలకలు రాక మరోసారి పోసుకున్న నారుమడినంబాలలో ఎదుగుదల లేని వరినారుయాజమాన్య పద్ధతులు పాటించాలి చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వరినారుపై అధిక ప్రభావం చూపుతోంది. రైతులు పంటను కాపాడుకునే యాజమాన్య పద్ధతులు పాటించాలి. రాత్రిపూట ఉన్న నీటిని తొలగించి ఉదయమే కొత్త నీరు అందించాలి. చలి ప్రభావంతో జింక్ లోపం ఏర్పడి పంటల్లో ఎదుగుదల ఉండదు. నివారించేందుకు లీటర్ నీటికి 2గ్రాముల చొప్పు జింక్ను కలిపి పిచికారీ చేయాలి. వీలైతే రాత్రిపూట వరినారుపై మంచు పడకుండా కవర్లు కప్పి ఉంచి ఉదయం తొలగించాలి. ఈ విధమైన చర్యలు చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది. – దిలీప్, మండల వ్యవసాయాధికారి, రెబ్బెన -
కుమురం భీం
7‘పల్టీ’కొట్టిన జీవితాలు మహారాష్ట్రలోని దేవాడ, సోండో గ్రామాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. పరామర్శకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కాగజ్నగర్ పట్టణంలో విషాదం నెలకొంది 8లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. పండుగకు రైలు కూతపెట్టేనా! సంక్రాంతి పండుగ సమీపిస్తుండగా ప్రత్యేక రైళ్లపై స్పష్టత లేకుండా పోయింది. హైదరాబాద్–మంచిర్యాల మీదుగా ప్రత్యేక రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 8లోu శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
శబరిమలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్అర్బన్: అయ్యప్ప స్వామి మాల ధరించి భక్తిశ్రద్ధలతో మండల దీక్ష పూర్తిచేసుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి దంపతులు బుధవారం శబరిమలకు బయలుదేరి వెళ్లా రు. ఆలయ అర్చకుడు నగేశ్, గురుస్వాములు సూర్యభాస్కర శర్మ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే దంపతులకు ఇరుముడులు ధరింపజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. మార్గమధ్యలో మంచిర్యాల జిల్లాలోని మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. -
‘పెండింగ్ వేతనాలు చెల్లించేవరకు పోరాటం’
కాగజ్నగర్టౌన్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మి కుల పెండింగ్ వేతనాలు చెల్లించేవరకు పోరా టం చేస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కా ర్యదర్శి వెలిశాల కృష్ణమాచారి స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం మూడోరోజుకు చేరింది. దీక్ష శిబిరాన్ని కృష్ణమాచారి సందర్శించి మాట్లాడారు. అధికారులు జోక్యం చేసుకుని వేతనాలు చెల్లించాలన్నారు. మున్సి పల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, నాయకులు మల్లేశ్, లక్ష్మి, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. -
హ్యాపీ క్రిస్మస్
కాగజ్నగర్టౌన్: క్రిస్మస్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా చర్చీలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ప్రాంగణాల్లో హ్యాపీ క్రిస్మస్ తోరణాలు, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని ఫాతిమా చర్చి, కాపువాడలోని పెంతేకోస్టల్ చర్చి, టీచర్స్ కాలనీలోని మమ్రే బ్రదన్ చర్చీలు గురువారం జరిగే వేడుకలకు ముస్తాబయ్యాయి. పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్నగర్లో నిజాం కాలం నుంచే సీఎస్ఐ ఆధ్వర్యంలో చర్చీలు ఏర్పాటు చేశారు. మొదట సర్సిల్క్ ప్రాంతంలోని ఫాతిమా కాన్వెంట్ సమీపంలో కృపాలయ, ఎస్పీఎం యాజమాన్యం ఆధ్వర్యంలో బాలభారతి సమీపంలో ఎస్పీఎం చ ర్చి ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ 2004లో బస్టాండ్ సమీపంలో సీఎస్ఐ చర్చిని నిర్మించారు. క్రైస్తవులు దీనిని దైవమందిరంగా భావించి వివా హ శుభకార్యాలు నిర్వహిస్తుంటారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతోపాటు నాటిక ప్రదర్శనలు, పిల్లల నృత్యాలు, కీర్తనలు చేపట్టనున్నా రు. ఉదయం నుంచి రాత్రివరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. -
ఏరియాలో సీసీవో పర్యటన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో బుధవారం కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండ్ ఓఎస్డీ, కేజీఎం ఏ.కృష్ణమోహన్రావు పర్యటించారు. ఏరియా అధికారులు ఆయనకు గోలేటిలోని జీఎం కార్యాలయంలో స్వాగతం పలికారు. డోర్లి ఓసీపీ– 2 ప్రాజెక్టు అధికారి ఎన్.ఉమాకాంత్, ఇతర అధికారులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఏరియాలో జరుగుతున్న గనుల కార్యకలాపాలు డోర్లి ఓసీపీ– 2 మైన్ క్లోజర్ యాక్టివిటీ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డోర్లి ఓసీపీ– 2 ను సందర్శించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రరావు, డీజీఎం ఉజ్వల్కుమార్ బెహారా, డీజీఎం సివిల్ ఎస్కే మదీనా బాషా, క్వాలిటీ అడిషనల్ మేనేజర్ రాజేశ్వర్, పర్సనల్ హెచ్వోడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా రాజేశ్రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటికి చెందిన న్యాయవాది జుమ్మిడి రాజేశ్ సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదించేందుకు రాజేశ్ను నియమించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. రాజేశ్ మాట్లాడుతూ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. -
మహాపూజకు రావాలని మంత్రి సీతక్కకు ఆహ్వానం
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలంలోని మహరాజ్గూడ అడవుల్లో కొలువైన జంగుబాయి అమ్మవారి ఆలయంలో ఈ నెల 30న నిర్వహించే మహాపూజకు హాజరుకావాలని మంత్రి సీతక్కను బుధవారం డీసీసీ అధ్యక్షురా లు ఆత్రం సుగుణ ఆహ్వానించారు. ములుగు జిల్లా మేడారంలో జంగుబాయి దేవస్థాన్ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఈ నెల 30న అధికారికంగా మహాపూజ, దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి తప్పనిసరిగా హాజరవుతానని మాటిచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సలాం శ్యాంరావు, కమిటీ ప్రతినిధులు మరప బాజీరావు, కొడప జాకు, పుర్క బాపూరావు, మరప కోసు తదితరులు ఉన్నారు. -
హాజరు కావాల్సిందే..!
కెరమెరి(ఆసిఫాబాద్): ఉపాధ్యాయల మాదిరిగానే ఇక నుంచి డీపీవో(డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీస్), ఎమ్మార్సీ సిబ్బంది కూడా ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) హాజరు వేయాల్సిందే. ఈ నెలలో ఉత్తర్వుల జారీకాగా, సిబ్బంది తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ముఖ గుర్తింపు హాజరుతో సిబ్బంది హాజరు విషయంలో గతంతో పోలిస్తే మరింత పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సమయపాలన పాటించేలా.. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావడం లేదు. దీంతో విద్యాశాఖ ముఖ గుర్తింపు హాజరును ప్రవేశపెట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తుండగా సత్ఫలితాలు వస్తున్నాయి. దీంతో సమగ్రశిక్ష ఉద్యోగులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ నెల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేస్తున్నారు. జిల్లాలోని డీపీవోతోపాటు 15 ఎమ్మార్సీ కార్యాలయాల్లో 12 మంది సీసీవోలు(కంప్యూటర్ కం ఆపరేటర్), 12 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 12 మంది మెసెంజర్లతోపాటు ఏపీవో, ఎస్వో, అటెండర్లు పనిచేస్తున్నా రు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లోని సిబ్బందితో కలిపి సుమారు 532 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాస్థాయిలో విధులు నిర్వర్తిస్తు న్న ఎస్వోలు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ తోపాటు పలు పథకాలు అమలు, విద్యారంగానికి సంబంధించిన వివరాల సేకరణ, ఇతర విధులు చేపడుతున్నారు. మండల పరిధిలోని విద్యాసంస్థల సమగ్ర సమాచారాన్ని జిల్లా విద్యాశాఖకు అందించడంలో ఎంఐఎస్ కోర్డినేటర్, సీసీవోలు కీలకపాత్ర పోషిస్తున్నారు. నిత్యం డీఈవో కార్యాలయ సిబ్బందితో ప్రత్యుత్తరాలు జరుపుతుంటారు. ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు డీఈవో కార్యాలయానికి నివేదిస్తున్నారు. అయితే కొన్ని కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించలేదని ఆరోపణలు రావడంతో విద్యాశాఖ అధికారులు ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొందరు చుట్టపు చూపుగా హాజరవుతూ, రిజిస్టర్లలో సంతకాలు పెట్టిపోతున్నారనే అపవాదు ఉంది. ఇంటి నుంచే కొందరు ఆన్లైన్ పనులు చేస్తున్నారని రాష్ట్రస్థాయి అధికారులు గుర్తించారు. ఉదయం, సాయంత్రం హాజరు డీపీవో స్టాఫ్, ఎమ్మార్సీ సిబ్బందితో పాటు కస్తూరి బా గాంధీ విద్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న వా రందరూ ఉదయం, సాయంత్రం ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు వేస్తున్నారు. కేజీబీవీ టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ ఉదయం 9.10 గంటలు, సాయంత్రం 4.15 గంటలకు, కార్యాలయ సిబ్బంది ఉదయం 10.30 చెక్ఇన్ కాగా... సాయంత్రం 5.00 చెక్ అవుట్ కావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ కొందరు ఉదయం మాత్రమే హాజరు వేసి సాయంత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు మంగళవారమే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వివరాలను సేకరించడంతో ఇక తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం ఎఫ్ఆర్ఎస్ను పరిశీలించనున్నట్లు సమాచారం. జనవరి 1 నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.సీఆర్పీలు ఎలా..?పాఠశాలలు తనిఖీ చేసి మండల విద్యాధికారి, డీఈవో కార్యాలయానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న సీఆర్పీ(క్లస్టర్ రిసోర్స్పర్సన్)లకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేయడంలో సందిగ్ధం నెలకొంది. చెక్ఇన్, చెక్అవుట్ ఎలా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. వీరు కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలను సందర్శించి సమాచారం సేకరిస్తారు. దీంతో పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలా.. లేక కాంప్లెక్స్ స్థాయిలో పెట్టాలా? అనేది తేలాల్సి ఉంది. ఏది అమలు చేసినా ఇబ్బందులు పడతామని సీఆర్పీలు చెబుతున్నారు. -
బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి, మాదారం ఓసీపీల ఏర్పాటుతో బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం రానుందని ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో మంగళవారం సింగరేణి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా సింగరేణి తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం సింగరేణి పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సింగరేణిలో బెల్లంపల్లి ఏరియాకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. బొగ్గు తవ్వకాలు మొదట బొగ్గుట్టలో ప్రారంభం కాగా, తర్వాత బెల్లంపల్లి లోనే మొదలయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పు డు ఏరియాలో రోజుకు 4వేల టన్నులు సాధించడమే గొప్పగా ఉండేదని, నేడు రోజుకు 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలుతున్నామని వె ల్లడించారు. కాలక్రమేణా ఒక్కో గని మూసివేతకు గురవుతూ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ సమయంలోనే యాజమాన్యం గో లేటి, ఎంవీకే ఓసీపీ ఏర్పాటుకు పూనుకుందన్నారు. గోలేటి ఓసీపీని ముందుగా ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలి పారు. అవసరమైన అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీ ద్వారానే ఉత్పత్తి సాగుతోందని తెలిపారు. ఉత్పత్తి వ్యయం తగ్గించాలియాజమాన్యం నిర్ణయం మేరకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని జీఎం విజయ భాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే వ్యయాలను తగ్గించి లా భాలను పెంచుకోవాలన్నారు. గోలేటిలోని ఉద్యో గ కుటుంబాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని బోర్లు వేశామని తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు అందరూ పాటుపడాలని కోరారు. అనంతరం ఏరియాలో ఉత్తమ ఉద్యోగులు, అధికారులను సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో పీవో నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, డీజీఎంలు ఉజ్వల్కుమార్, ఎస్కే మదీ నాబాషా, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ అధికారిగా ఎంపికై న కోటయ్యను సన్మానిస్తున్న జీఎం విజయ భాస్కర్రెడ్డిసింగరేణి తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న జీఎం విజయ భాస్కర్రెడ్డి -
వానాకాలం వడ్లకు ‘బోనస్’!
రెబ్బెన(ఆసిఫాబాద్): గతేడాది వానాకాలం సీజన్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన సన్నరకం వరిధాన్యానికి బోనస్ చెల్లించగా.. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం అందించలేదు. ప్రస్తుత వానాకాలంలో కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు జిల్లాలకు చెందిన రైతులకు బోనస్ డబ్బులు వారి ఖాతాల్లో జమ కాగా.. జిల్లాలోని రైతులకు త్వరలోనే జమ కానున్నాయి. అంతంత మాత్రంగానే కొనుగోళ్లుజిల్లాలో ఈసారి వానాకాలంలో సుమారు 50వేల ఎకరాల్లో వరిసాగైంది. అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. అయినా జిల్లా అధికార యంత్రాంగం 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో 41 ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 19 పీఏసీఎస్ ద్వారా, మి గిలిన 22 ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగాయి. అయి తే సేకరణ లక్ష్యానికి, వాస్తవ కొనుగోళ్లకు పొంతన లేకుండా పోయింది. ఆలస్యంగా కేంద్రాలను ఏర్పా టు చేయడం ఒక కారణమైతే.. ప్రభుత్వ కొనుగో లు కేంద్రాల్లో నిబంధనలు, బోనస్ వస్తుందో రాదో అనే సందేహాలతో రైతులు అమ్మకానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా సేకరించిన ధాన్యం లెక్కలు అధికారులు ఏర్పాటు చేసుకున్న లక్ష్యానికి దరిదా పుల్లో కూడా లేవు. ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాల ద్వారా 2,850 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం, 140 మెట్రిక్ టన్నుల వరకు దొడ్డురకం ధాన్యం సేకరించారు. దళారుల పాలైన ధాన్యంజిల్లాలో నవంబర్ రెండో వారం నుంచి వరికోతలు ఊపందుకున్నాయి. ఆ సమయంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో చాలా మంది ప్రైవేటు వ్యక్తులకే ధాన్యం విక్రయించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ, ధాన్యం నాణ్యత వంటి అనేక నిబంధనలు ఉండడంతో వ్యాపారుల వైపే మొగ్గు చూపారు. ప్రైవేటు వ్యక్తులు ధాన్యంలో తేమ, నాణ్యతను పట్టించుకోకుండా పచ్చి ధాన్యాన్నే కొన్నారు. సీజన్ ప్రారంభంలోనే సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.2100 చెల్లించగా, సీజన్ ముగింపు సమయానికి రూ.2,300 వరకు చెల్లించారు. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఏగ్రేడ్ ధాన్యానికి రూ.2,380, సాధారణ ధాన్యానికి రూ.2,360 మద్దతు ధర చెల్లించడంతోపాటు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. గత యాసంగికి సంబంధించిన బోనస్ రాకపోవడంతో ఈసారి చెల్లిస్తారో లేదో అనే అనుమానంతో రైతులు ప్రైవేటు వ్యక్తులకే ధాన్యాన్ని విక్రయించారు. ప్రభుత్వం బోనస్ చెల్లింపునకు చర్యలు చేపట్టడంతో వ్యాపారులకు అమ్ముకున్న అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. రూ.1.42 కోట్లు బోనస్జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం నుంచి రూ.1,42,50,000 బోనస్ రూపంలో అందనున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 2,850 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని సేకరించారు. 2,850 క్వింటాళ్లకు ఒక్కో క్వింటాల్కు రూ.500 చొప్పున మొత్తం రూ.1,42,50,000 నగదు బోనస్గా రైతుల ఖాతాలో జమ కానుంది. మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కాలేదు. రైతులు ఆందోళనకు గురవుతుండగా.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. గత యాసంగిలో రైతులకు చెల్లించాల్సిన బోనస్పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వానికి వివరాలు పంపించాం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యం వివరాలను ప్రభుత్వానికి పంపించాం. దానికి అనుగుణంగా ప్రభుత్వం జిల్లా రైతులకు బోనస్ విడుదల చేస్తుంది. అయితే జిల్లా రైతులకు ఇంకా బోనస్ డబ్బులు జమ కాలేదు. – వసంతలక్ష్మి, డీఎస్వో -
‘మీ డబ్బు– మీ హక్కు’ను వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: జిల్లా ప్రజలు మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్ జోషితో కలిసి మంగళవారం బ్యాంకర్లు, ఖాతాదారులు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్ల పైబడి బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న డబ్బును తిరిగి ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇలాంటి ఖాతాలు 65 వేలు ఉండగా, రూ.15.76 కోట్లు జమ ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 12 వరకు 254 ఖాతాల నుంచి రూ.1.34 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. మిగితా వారికి తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ఉద్యోగాలపై అవగాహన అవసరం
కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.ప్రవీణ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగాలపై అవగాహన కల్పించారు. ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పై అవగాహన పెంచుకుని ప్రణాళిక ప్రకారం చది వితే కొలువులు సాధించవచ్చన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏ ర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ ఉద్యోగాల నో టిఫికేషన్లో ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్, వివిధ అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో కళా శాల వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, శాదర, అ ధ్యాపకులు రాజేశ్వర్, దేవేందర్, లక్ష్మయ్య, నర్సింగరావు, మహేశ్, శాంభవి, విద్యార్థులు పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఆవిర్భావ వే డుకలు సాదాసీదాగా నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంగళవారం బెల్లంపల్లి ఏ రియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలి పారు. వారు మాట్లాడుతూ ప్రత్యక్షంగా, ప రోక్షంగా లక్షలాది మందికి అన్నం పెడుతున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలను కుదించడం సరికాదని అన్నారు. వేడుకలకు ఏఐటీయూసీ దూరంగోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంతో పాటు గనులు, డిపార్టుమెంట్లలో నిర్వహించి న ఆవిర్భావ వేడుకలను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బహిష్కరించింది. ఖైరిగూర ఓసీపీ వద్ద ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో సింగరేణి పనిచేస్తూ లాభాలను వృథా చేస్తోందని ఆరో పించారు. వేడుకలకు కార్మికులు, వారి కుటుంబాలను దూరం చేయడం సరికాదన్నారు. ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేషశయనరావు, రాజేష్, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొత్త షెడ్యూల్ కలిసొచ్చేనా..?
జిల్లా కేంద్రంలో చదువుకుంటున్న ‘పది’ విద్యార్థులు(ఫైల్) ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2025– 26 విద్యా సంవత్సరంలో పరీక్షలు దాదాపు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఏడు పేపర్లకు ప్రతీ పరీక్షకు మధ్య మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. విద్యార్థులకు సమయం దొరుకుతుందని విద్యాశాఖ చెబుతుండగా, అన్నిరోజులపాటు పరీక్షలు కొనసాగితే ఒత్తిడికి గురవుతారని మరికొందరు వాదిస్తున్నారు. 6,941 మంది విద్యార్థులుజిల్లాలో 58 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 15 కేజీ బీవీలు, 35 ప్రైవేట్ పాఠశాలలు, మూడు మైనార్టీ గురుకులాలు, నాలుగు పీటీజీ గురుకులాలు, 38 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, 10 సాంఘిక సంక్షేమ గురుకులాలు, రెండు ఆదర్శ పాఠశాలతో కలిపి మొత్తం 169 ఉన్నత పాఠశాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6,941 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు ఇంకా 79 రోజుల గడువు ఉంది. అక్టోబర్ నుంచే సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభం కాగా, జనవరి నుంచి ఉదయంపూట కూడా నిర్వహించనున్నారు. జనవరి నుంచి రివిజన్ కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పరీక్షల మధ్య వ్యవధిపదో తరగతి ప్రతీ పరీక్షకు మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడం, ఒత్తిడి దూరంగా ఉండటం, రివిజన్ సమయం ఉండేలా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 14న ప్రారంభయ్యే పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో ఉత్తమ ఫలితాల సాధించాలనే లక్ష్యంతో పదో తరగతి విద్యార్థులకు ఈ నెలలోగా సిలబస్ పూర్తిచేసి విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇప్పటికే అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రస్తుతం సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ ద్వారా అభ్యసన దీపికలు తయారు చేయించి అందించారు. జిల్లాలో కొన్నేళ్లుగా పదో తరగతి ఫలితాల తీరు ఆశించిన విధంగా లేదు. 2021– 22 విద్యా సంవత్సరంలో 79 శాతం ఉత్తీర్ణత సాధించగా, 2022– 23లో 75 శాతం, 2023– 24లో 83 శాతం, 2024– 25లో 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నూతన షెడ్యూల్ ప్రకారం ఫలితాలు మెరుగవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆశిస్తున్నారు.పరీక్షల షెడ్యూల్ ఇలా.. -
17 వరకు జంగుబాయి ఉత్సవాలు
కెరమెరి(ఆసిఫాబాద్): జనవరి 17 వరకు జంగుబాయి అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతాయని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ చిత్తరంజన్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి ఆదివాసీ సంఘాల నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై దృష్టి సారించడంతోపాటు 24 గంటలపాటు వైద్యశిబిరాలు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సదుపాయాల క ల్పన పనులు సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల బస కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో గిరిజన శాఖ డీడీ రమాదేవి, డీఎంహెచ్వో సీతారాం, ఎంపీడీవో సురేశ్, తహసీల్దార్ సంతోష్కుమార్, నాయకులు ఆత్రం లక్ష్మణ్, జంగు, మడావి రఘునాథ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
70వ సారి యువకుడి రక్తదానం
నెన్నెల: మండల కేంద్రం నెన్నెలకు చెందిన శ్రీరాంభట్ల సుశాంత్శర్మ సోమవారం 70వ సారి రక్తదా నం చేసి ప్రాణదాతగా నిలిచాడు. గోదావరిఖని ఏరి యా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో తలసే మియాతో బాధపడుతున్న రవికి ఓ నెగిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. మంచిర్యాల బ్లడ్బ్యాంకు వా రు ఫోన్ చేయగా వెళ్లి దానం చేశాడు. ఇప్పటికే 20 సార్లు రక్తకణాలు కూడా దానం చేశాడు. అ త్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్న వారు 8555 899987 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. రక్తదానం చేస్తున్న సుశాంత్ శర్మ -
గుండాల పంచాయతీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో
ఇచ్చోడ: మండలంలోని గుండాల పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ గ్రామంలో 2018 సంవత్సరంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవల్లో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో గ్రామంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్పంచ్ షరీఫాబితో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ఎంపీడీవో నరేశ్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. -
బాధలోనూ.. బాధ్యతలు స్వీకరణ
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న బండారి పుష్ప, భర్త బండారి రవీందర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తై గుర్తులు కేటాయించాక అనివార్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సోమవారం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రమాణం చేసేందుకు వచ్చిన సర్పంచ్ బండారి పుష్ప ఎంతో బాధతో బాధ్యతలు స్వీకరించింది. ఆ సమయంలో ఆమెతో పాటు వచ్చిన కుటుంబీకులు, పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టడం కలిచివేసింది. సర్పంచ్గా రాణించి రవీందర్ ఆశయసాధనకు కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో బండారి రవీందర్ ఫొటోతో ఆ నలుగురు సినిమాలోని ‘నేనే గెలిచాను.. నేనే గెలిచాను.. కాదు నన్ను గెలిపించారు.. ఈ ప్రపంచాన్ని గెలిపించేది.. డబ్బుకాదు ప్రేమే’ అంటూ రవీందర్ దంపతుల ఫొటోతో ఉన్న వీడియోలు వైరలయ్యాయి. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ కార్యాలయ ఏవో దామోదర స్వామి అన్నారు. కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొని ఏజెన్సీ పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి కల్పించాలని కొందరు, పింఛన్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని మరికొందరు అర్జీలు సమర్పించారు. దుర్గం శేఖర్పై మరో కేసుఆదిలాబాద్టౌన్: దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దుర్గం శేఖర్పై మరో కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. రిమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి స్టేషన్ నుంచి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని భాగ్యనగర్లో నివాసం ఉండే ఎర్రంవార్ విజయ్ ఇంట్లో ఆది వారం రాత్రి చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు చొరబ డ్డారు. బీరువా పగలగొట్టి నగదుతో పాటు బంగారం ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.లక్ష 80 వేల వరకు ఉంటుందని బాధితుడు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
ఖానాపూర్: పల్లె అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలపై పాలకవర్గాలు దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ నూతన సర్పంచులకు సూచించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమష్టిగా పనిచేసి గ్రామాలను ఉత్తమ పంచా యతీలుగా తీర్చిదిద్దాలన్నారు. మండలంలోని మ స్కాపూర్ సర్పంచ్ దొనికేని లక్ష్మి, తర్లపాడ్ సర్పంచ్ పొలంపెల్లి సచిన్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోమవారం హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్, మాజిద్, తోట సత్యం, వెంకటేశ్, నర్సయ్య, తదితరులున్నారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
సారంగపూర్: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని ధని, జామ్, ఆలూరు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీ సర్పంచులే కీలకమన్నారు. గత కొంతకాలంగా సర్పంచులు లేక అభివృద్ధి కుంటుపడిందని, ఇకపై గ్రామాల బాధ్యతలను సర్పంచులు స్వీకరించారని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి తనవంతు కృషి ఎల్లవేళలా అందిస్తానన్నారు. నిర్మల్ రూరల్: మండలంలోని 20గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు పదవీ బాధ్యతలు చేపట్టాయి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చిట్యాల, అనంతపేట, తలువేద గ్రామాల్లో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరై నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
పాన్ ఇండియా ప్రస్థానం!
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ బ్రిటీష్ కాలంలో పురుడుపోసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది. 1927లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, 1961లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం, 1991లో ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో బొగ్గుగనులు ఒక్కొక్కటిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో సుమారు 450 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలను భూగర్భశాఖ అధికారులు గుర్తించారు. 1889లో 59,671 టన్నుల బొగ్గు ఉత్పత్తితో కంపెనీ ప్రస్థానం మొదలైంది. జాతీయీకరణ తర్వాత సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉంది. కార్మికుల త్యాగాలతో మనుగడ.. సింగరేణి సంస్థ మనుగడకు కార్మికుల త్యాగాలే కారణమని చెబుతుంటారు. ప్రకృతికి విరుద్ధంగా ప్రాణాలకు తెగించి భూగర్భంలోకి దిగి చెమటోడ్చి పనిచేశారు. ఆ కష్టమే నేడు సంస్థ సింగరేణి స్థిరత్వానికి పునాదిగా నిలిచాయి. యాంత్రీకరణతో ప్రమాదాలు కొంతమేర తగ్గినా అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు లక్షా పైచిలుకు కార్మికులు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 40వేలకు చేరింది. పరిమిత స్థాయిలో వేడుకలు గతంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించగా, ఈసారి పరిమిత స్థాయిలో జరుపనున్నారు. నిధులను సైతం భారీగా తగ్గించారు. జీఎం కార్యాలయాల్లోనే వేడుకలు నిర్వహించనున్నారు. దీనిపై కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధులు తగ్గించినట్లుగా చెబుతున్నా.. గతం నుంచి వస్తున్న సంప్రదాయాలకు విలువ తగ్గిందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఆటుపోట్లను తట్టుకుంటూ దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. కార్మికుల చెమట చుక్కలతో నిలిచిన సంస్థ.. నేడు బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా గుర్తింపు సాధించింది. డిసెంబర్ 21న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.సింగరేణి వివరాలు కంపెనీ విస్తరణ : ఆరు జిల్లాలు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం భూగర్భ గనులు : 22 ఓపెన్ కాస్టు గనులు : 17 ఉద్యోగుల సంఖ్య: 42,000 నూతన బొగ్గుబావుల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నా పర్యావరణ నిబ ంధనలు, అటవీశాఖ అనుమతులు, పర్మిషన్లు, భూసేకరణ సవాల్గానే మారింది. దీంతో బొ గ్గు ఉత్పత్తితోపాటు ప్రత్యామ్నాయ రంగాలపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మూతపడిన భూగర్భ గనుల్లో మిగిలిపోయిన బొగ్గును ఓపెన్కాస్ట్ల ద్వారా తవ్వడంతోపాటు ఇతర రంగాల వైపు అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాల కోసం ఇతర ఖనిజాల అన్వేషణపై కూడా ఫోకస్ పెట్టింది. అలాగే పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులు పెడుతోంది. రాజస్తాన్లో 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. అదే రాష్ట్రంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం లభించింది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, నైనీ బ్లాక్ వద్ద 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్, మణుగూరులో జియో థర్మల్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం, బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. కర్ణాటకలో బంగారు గనుల కోసం ప్రణాళికలు సిద్ధమవుతుండగా.. అనుబంధంగా 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంపైనా దృష్టి సారించింది. -
తెల్లారిన కూలీల బతుకులు..!
జైపూర్: తెల్లవారితే గమ్యం చేరేవా రే.. పొట్టకూటి కోసం కట్టుకున్న వారిని.. కన్నవారిని విడిచి రాష్ట్రం దాటొచ్చిన వలస కూలీల బొలేరో వాహనంపైకి ప్రమాదం బొగ్గులారీ రూపంలో దూసుకొచ్చింది. గాఢనిర దలో ఉన్న కూలీలంతా ఒక్కసారిగా ఉల్కికిపడ్డారు. ఏం జరిగిందో నని నిద్ర నుంచి తేరుకునే సరికే ప్రమాదం జరిగిపోయింది. ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత పడగా.. మరో 16మందిని క్షతగ్రాత్రులను చేసింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి 20మంది కూలీలు ఆదివారం రాత్రి 10గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు బొలేరో వాహనంలో బయల్దేరారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలోని మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున 3.30 గంటలకు బొలేరో వాహనాన్ని శ్రీరాంపూర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న బొగ్గులారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా బొలేరో వాహనాన్ని ఢీకొట్టగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. దీంతో బొలేరో వాహనంలో ఉన్న 16మంది మహిళా కూలీలు, నలుగురు పురుషులు ఒకరిపైనొకరు పడి ఒత్తిడికి గురయ్యారు. చంద్రపూర్ జిల్లా సావ్లీ మండలం చాందిలిబుజ్ గ్రామానికి చెందిన మీనా(45)కు ఛాతిపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. ఇదే మండలంలోని దిగోరి గ్రామానికి చెందిన మందారీ లీలాబాయ్(65), బెంబిల్ గ్రామానికి చెందిన సోయం విమల్బాయ్(57)కు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా చనిపోయారు. క్షతగాత్రులు వీరే.. సాధనవికాస్ టేకం రేఖవిజయ్ గాత్రే, మమతలక్ష్మ ణ్, శకుంతలపుప్పేశ్వర్ టేకం, మేఘాకార్తీక్ శ్రీరామి, పౌర్ణిమ సురేశ్, ఆత్రం సుమన్బాయి, తొడాసే సలోనిఅర్జున్, టేకం వికాస్విశ్వనాథ్, నీలిమస్వప్నిల్, మాయ మాఘు సరిత జితేంద్ర మోర్లే, కల్పన దీపక్ గద్దె, విజయ్ సంతోశ్ బొడ్కావర్ గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అందరినీ 108వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై శ్రీధర్ తెలిపారు. వరి నాట్ల కోసం వలస ప్రతిఏటా వరి నాట్ల సీజన్లో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన మహిళా కూలీలు తెలంగాణలోని పెద్దపల్లి, కరీంగనర్ ప్రాంతాలకు వలస వస్తారు. కూలీలంతా బొలెరో వాహనంలో వస్తుండగా ఊహించని విధంగా లారీ రూపంలో మృత్యువు దూసుకు వచ్చింది. బొలెరో వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టడం కూలీల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ముగ్గురు చనిపోవడం, కూలీలు తెచ్చుకున్న వంట సామగ్రి, వస్తువులు చెల్లాచెదురు కావడం చూసి కంటతడి పెట్టారు. లేటేవార్ మీనా మృతిచెందగా ఆమె భార్త అనిల్ లేటేవార్ కూడా ఇదే వాహనంలో ఉన్నాడు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దిక్కుతోచని స్థితిలో కన్నీరుపెడుతూ సంఘటన స్థలంలో ఉన్నారు. -
వేతనాల కోసం బల్దియా కార్మికుల సమ్మె
కాగజ్నగర్టౌన్: వేతనాల కోసం కాగజ్నగర్ బల్దియా పారిశుద్ధ్య కార్మికులు సోమవారం విధులు బహిష్కరించి సోమవారం కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ నాలుగు నెలలుగా పెండింగులో ఉన్న వేతనాలను చెల్లించాలని, బకాయిలో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ రూ.1.50 కోట్లు చెల్లించకపోవడంతో సమ్మెకు దిగినట్లు తెలిపారు. ఏటా ఇదే తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్, మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, మల్లేశ్, రమేశ్, లక్ష్మి, ఈశ్వరమ్మ, దుర్గమ్మ, శోభ, ప్రియదర్శిని, తిరుపతి, బాపు లక్ష్మణ్, మహేందర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి వెంకటస్వామికి నివాళి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి అధికారికంగా నిర్వహించారు. వెంకటస్వామి చిత్రపటానికి ఎస్పీ నితిక పంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి నిర్వహిస్తోందని తెలిపారు. -
తెల్లవారుజామునే విధుల్లోకి మున్సిపల్ కార్మికులు
ఆసిఫాబాద్అర్బన్/కాగజ్నగర్టౌన్: తెల్లవారుజామున నాలుగు గంటలకు విధుల్లో చేరుతారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. కంపునంతా ఎత్తిపారేస్తారు. అయినా పారిశుద్ధ్య కార్మికులపై ప్రభుత్వా లు చిన్నచూపు చూస్తున్నాయి. తీవ్రమైన చలిలో అవస్థలు పడుతున్నారు. అరకొర వేతనంతో సరిపెట్టుకుంటున్నారు. గ్లౌజులు, సబ్బులు, నూనె, చెప్పులు, దుస్తులు సకాలంలో అందడం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజారోగ్యమే లక్ష్యంగా శ్రమిస్తున్నా పాలకులు కనీస శ్రద్ధ చూపడం లేదు. ప్రమాదవశాత్తు మరణించినా కార్మికులను పట్టించుకునే వారు కరువయ్యారు. చలికి గజ గజజిల్లాను చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు కశ్మీర్ను తలపించే స్థాయిలో నమోదవుతున్నాయి. మారుమూల మండలాలతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లోనూ పది డిగ్రీల సెల్సియస్లోపే ఉంటున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చలికి పడరాని పాట్లు పడుతున్నారు. చలిలోనే వణుకుతూ పట్టణాల్లోని కాలనీలను శుభ్రం చేస్తున్నారు. ‘ఆసిఫాబాద్’ మున్సిపాలిటీగా మారినా..ఆసిఫాబాద్ గతంలో మేజర్ గ్రామ పంచాయతీ. ప్రస్తుతం రాజంపేటను పంచాయతీగా, ఆసిఫాబాద్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. కానీ మున్సిపల్ పరిధిలోని కార్మికులకు నేటికీ పంచాయతీ వేతనాలనే చెల్లిస్తున్నారు. బల్దియా కార్మికులు ఉదయం 5 గంటలకే విధులకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణాన్ని శుభ్రం చేస్తున్నారు. చలిని తట్టుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. సొంత డబ్బులతో స్వెట్టర్లు, షూలు, కొనుక్కుంటున్నారు. మున్సిపాలిటీలో ప్రస్తుతం 124 మంది కార్మికులు పాత వేతనాలతోనే విధులకు హాజరవుతున్నారు. వీరిలో కొందరికి రూ.9,500, మరికొందరికి రూ.8,500, రూ.7,500, రూ.6,000 చొప్పున వేతనాలు అందుతున్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం వీరికి రూ.16,500 ఇవ్వాలి. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, హెల్త్కార్డులు, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. కాగజ్నగర్ బల్దియాలో ఇలా..కాగజ్నగర్ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 142 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. బల్దియా పరిధిలోని కార్మికులకు నెలనెలా వేతనాలు అందడం లేదు. మూడు, నాలుగు నెలలకు ఒక్కసారి ధర్నా చేస్తేనే వేతనాలను చెల్లిస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను వేతనాల్లో కోత విధించినా ఖాతాల్లో జమ చేయడం లేదు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. తెల్లవారుజామునే విధుల్లోకి చేరి రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నారు. కానీ చాలా మందికి కనీసం రక్షణ వస్తువులు కూడా అందించడం లేదు. ఫలితంగా అనారోగ్యంతో మంచం పడుతున్నారు.జాగ్రత్తలు తీసుకుంటున్నాంచలి పెరగడంతో విధులకు రావడం కష్టంగా ఉంది. జాగ్రత్తలు తీసుకుంటూ విధులకు వస్తున్నాం. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదు. మున్సిపల్ చట్ట ప్రకారం చెల్లించాలి. స్వెటర్లు, గౌజ్లు, షూలు అందించాలి. – కాశిపాక జ్యోతి, కార్మికురాలు, ఆసిఫాబాద్ ఇబ్బందులు రాకుండా చర్యలు చలి తీవ్రత పెరగడంపై కార్మికులు ఆందోళన చెందవద్దు. ఆరోగ్య రక్షణపై ఇప్పటికే అవగాహన కల్పించాం. సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తాం. కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడికి రూ.16,500 వేతనం అందుతుంది. దీనికి సంబంధించిన నివేదికలను హైదరాబాద్ కార్యాలయానికి పంపించాం. – గజానంద్, మున్సిపల్ కమిషనర్, ఆసిఫాబాద్ -
నిధుల కోత.. సాదాసీదాగా వేడుక
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఆవిర్భావ దినోత్స వం అంటే కార్మికుల పండుగ. కార్మికులు, వారి కు టుంబ సభ్యులను భాగస్వాములను చేస్తూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది కా ర్మికులు, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పి స్తున్న సిరుల తల్లి సింగరేణి సంస్థ ఆవిర్భవించిన రోజును ఆర్భాటంగా జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది యాజమాన్యం వేడుకలను పరిమితం చేయనుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదా గా నిర్వహించాలని సర్క్యులర్ జారీ చేసింది. నిధుల్లోనూ కోతడిసెంబర్ 23న బెల్లంపల్లి ఏరియాలో నిర్వహించే సింగరేణి ఆవిర్భావ వేడుకలకు ఏటా భీమన్న స్టేడి యం వేదికగా నిలుస్తుంది. స్టాల్స్ ఏర్పాటుతో మై దానం రోజంతా సందడిగా మారుతుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికోసం యాజమాన్యం ఏరియాకు రూ.2.5లక్షల కేటాయించేది. కానీ మంగళవారం నిర్వహించే వేడుకలను పరిమితం చేయడంతోపాటు నిర్వహణ నిధుల్లోనూ భారీగా కోత విధించారు. కేవలం రూ.50వేలు మాత్రమే కేటాయించారు. భీమన్న స్టేడియంలో కాకుండా జీఎం కార్యాలయం ఆవరణలోనే వేడుకలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం సింగరేణి పతాక ఆవిష్కరణ, అనంతరం కేక్ కటింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఉత్తమ ఉద్యోగులు, అధికారులను సన్మానించనున్నారు. వేడుకలు సాదాసీదాగా నిర్వహించడంపై గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతోపాటు ఇతర కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఏఐటీయూసీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఏర్పాట్లు లేకపోవడంతో భీమన్న స్టేడియం వెలవెలబోతోంది. -
నవోదయ విద్యాలయంలో గణిత దినోత్సవం
కాగజ్నగర్టౌన్: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో సోమవారం గణిత దినోత్స వం ఘనంగా నిర్వహించారు. సింగరేణి బె ల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రామానుజం చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. జీఎం మాట్లాడుతూ అతితక్కువ జీవిత కాలంలో గణిత శాస్త్ర అభివృద్ధికి రామానుజం చేసిన సేవలను కొనియాడారు. గణిత శాస్త్రానికి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. అనంతరం గణిత ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, ప్రధానోపాధ్యాయుడు కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘పర్యాటకం’ పరిచయం చేస్తే బహుమతులు
ఆసిఫాబాద్: జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాల ను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతులు అందిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం పర్యాటక శాఖ అధికారి అశ్వక్ అహ్మద్తో కలిసి 100 వీకెండ్ వండర్స్ పోస్టర్లు ఆవి ష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో పోటీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు తెలియని జలపాతా లు, పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్ పాయింట్ల వంటి 100 కొత్త గమ్యస్థానాలను గుర్తించి, వివరా లతో ఒక కాఫీటేబుల్ బుక్ రూపొందించడమే ఈ పోటీ ఉద్దేశ్యమని తెలిపారు. నేచర్ వైల్డ్ లైఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకా లు, ఫామ్ స్టేస్, రిసార్ట్స్ స్పిరిచువల్ అడ్వెంచర్ వంటి 10 విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చన్నారు. ఎంచుకున్న ప్రదేశం 3 ఫొటోలు, 60 సెకన్ల వీడి యో, రవాణా, బస, బడ్జెట్ వివరాలతో 100 పదా ల సమాచారాన్ని పోర్టల్లో పేర్కొన్న గూగుల్ ఫా మ్, సోషల్ మీడియా అకౌంట్లకు ట్యాగ్ చేయవచ్చ ని తెలిపారు. ఉత్తమ ఎంట్రీకి మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతి రూ.20 వేలతోపాటు కన్సల్టేషన్ బహుమతులుగా హరితా హోటళ్లలో ఉచిత బస కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల వారు జనవరి 5లోగా ఎంట్రీలు పంపించాలని సూచించారు. -
టెంట్ల కిందే ప్రమాణం
దహెగాం(సిర్పూర్): మండలంలోని పలు పంచా యతీల్లో కార్యాలయాలు లేక టెంట్లు, అంగ న్వాడీ కార్యాలయాల్లో పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. దిగిడలో పక్కా భవనం లేనందున అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గిరవెల్లి రైతువేదికలో, గెర్రెలో పాఠశాల భవనం, పీపీరావు కాలనీలో పాఠశాల భవనం, కమ్మర్పల్లి, బొర్లకుంటలో పాఠశాల భవనాలు, కల్వాడ అద్దె భవనం, బామనగర్లో అసంపూర్తిగా ఉన్న జీపీ భవనం ఎదుట టెంటు కింద, పెసరికుంట జీపీ భవనం లేనందున టెంటు కింద కార్యక్రమాలు నిర్వహించారు. -
సర్పంచ్ గైర్హాజరు.. చీపుర్లతో ఉప సర్పంచ్ రాక
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారానికి సర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యులు గైర్హాజరయ్యారు. ఉప సర్పంచ్ దీపక్ ముండె, ఆరుగురు వార్డు సభ్యులు మాత్రం పంచాయతీలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రోడ్లు ఊడ్చే చీపుర్లు, తట్టలతో హాజరయ్యారు. ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో జరిగిన వివాదంతోనే సర్పంచ్, వార్డు సభ్యులు కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. కోరం లేకపోవడంతో మొదటి సమావేశం వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ప్రకటించారు. -
జాతీయ యోగా, కరాటే పోటీలు
మందమర్రిరూరల్: పట్టణంలోని జాతీయ రహదారి టోల్గేట్ సమీపంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో ఇండియన్ యోగా స్కూల్, ప్రొఫెషనల్ యోగా అసోసియేషన్ (మంచిర్యాల) వారి ఆధ్వర్వంలో ఆదివారం జాతీయ యోగా, కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి యోగాభ్యాసకులతో పాటు కరాటే క్రీడాకారులు సుమారు 900 మంది పాల్గొని వారి ప్రతిభ చాటుకున్నారు. నిర్వాహకులు వెంకటేశ్, కమిటీ చైర్మన్ కొంపెల్లి రమేశ్ మాట్లాడుతూ ప్రతి రోజు గంట సమయం యోగా కోసం కేటాయిస్తే ఆరోగ్యం బాగుంటుందని, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్తో పాటు ప్రశంసాపత్రాలు అందించారు. పోటీలకు జడ్జిగా రేవెల్లి రాజలింగు వ్యవహరించగా నిర్వాహకులు రమేశ్, ప్రశాంత్గౌడ్, సుమంత్, వినోద్గౌడ్, గీతాదేవి, ఉమామహేశ్, రాజశేఖర్, రమేశ్రాజా, సీనియర్ యోగా మాస్టర్స్, కరాటే మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
నేడు దీపోత్సవం
కెరమెరి(ఆసిఫాబాద్): జంగుబాయి ఉత్సవాల్లో భా గంగా సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర పరిధి లోని కెరమెరి మండలం మహరాజ్గూడ అడవుల్లో గల ఆలయంలో సోమవారం దీపోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఎనిమి ది గోత్రాలకు చెందిన కటోడాలు, ఆదివాసీలు దేవతల విగ్రహాలను టొప్లకస నుంచి తీసుకువచ్చిన గంగాజలంతో శుద్ధి చేయనున్నారు. అనంతరం రావుడ్, పోచమ్మ ఆలయంలోని ప్రతిమలకు పూజ లు చేస్తారు. అనంతరం అమ్మవారి గుహకు చేరి దీపం వెలిగిస్తారు. ఇది నెలరోజులపాటు వెలుగుతూనే ఉండనుంది. కలెక్టర్కు ఆహ్వానంజంగుబాయి ఆలయంలో సోమవారం నిర్వహించే దీపోత్సవానికి హాజరుకావాలని ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. కలెక్టర్తో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జంగుబాయి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు మరప బాజీరావు, చైర్మన్ సలాం శ్యాంరావు, మరప కోసు, మరప ఇస్రు, నాయకులు గుండా శ్యామ్, పెందోర్ సుధాకర్, సుజాయత్ ఖాన్, విజయ, ఇందిరా పాల్గొన్నారు. -
సొంతింటిపై ‘కోర్’ దెబ్బ!
ఆదిలాబాద్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తమ సొంతింటి కల నెరవేరబోతుందని వారు ఎంతో సంబర పడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు వారి పూరి గుడిసెలను తొలగించుకున్నారు. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేసేందుకు ఆదివాసీల సంప్రదాయ బద్ధంగా డోలు వాయిద్యాలతో అధికారులను ఆహ్వానించారు. ఇంటి నిర్మాణం కోసం పునాదులు సైతం తోడుకున్నారు. కొంత మంది లబ్ధిదారులు సిమెంట్ పిల్లర్లు వేసుకున్నారు. తీరా అధికారులు ఈ ప్రాంతాం కోర్ ఏరియా అంటూ, సిమెంట్ నిర్మాణ పనులు చేపట్టడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. గుడిసెలను తొలగించుకోవడంతో ఇప్పుడు తమకు కనీసం నివాసం ఉండేందుకు ఇళ్లు లేవని, చలికాలం కావడంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 6,043 ఇళ్లు మంజూరు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీలకు 6,043 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. చాలా చోట్ల ఇంటి నిర్మాణాలను ప్రారంభించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలంలో 42 గ్రామాలు కోర్ ఏరియా ప్రాంతంలో ఉన్నాయని, లబ్ధిదారులు సిమెంట్తో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక వారు ఇంటి నిర్మాణాలను చేపట్టకుండా తాత్కాలికంగా ప్రస్తుతం గుడిసెలలో నివాసముంటున్నారు. 252 మందికి పైగా లబ్ధిదారులు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలంలో 12కి పైగా గ్రామాలు కోర్ ఏరియాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో సుమారు 252 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. సిమెంట్తో ఇండ్లను నిర్మించడానికి వీలు లేదని అధికారులు చెప్పడంతో వారు ఏం చేయాలో తోచక అయోమయంలో ఉన్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఉట్నూర్ మండలంలోని చెరువుగూడ గ్రామానికి చెందిన ఆత్రం కాశీరాం కుటుంబం. ఈ కుటుంబానికి పీఎం జన్మన్ పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో కుటుంబం వారి గుడిసెను తొలగించుకుని, కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ లెవల్లో పునాది వేశారు. అయితే అధికారులు సిమెంట్ ఇంటి నిర్మాణం చేపట్టవద్దని అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతం భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి కర్ర ఇంటిలో నివాసముంటున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తనిఖీలకు వేళాయె..
ఆసిఫాబాద్రూరల్: సమస్యలు గుర్తించి ప్రభుత్వ పాఠశాలలను గాడిన పెట్టేందుకు ప్రత్యేక బృందాలు సోమవారం నుంచి తనిఖీలు చేపట్టనున్నాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతీ అంశాన్ని పరిశీలించి వివరాలతో నివేదికలు రూపొందించనున్నారు. ఇందుకోసం జిల్లాలో 37 మందితో తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి ఇప్పటికే కలెక్టరేట్లో ప్రత్యేక శిక్షణ అందించారు. 686 పాఠశాలలు..జిల్లావ్యాప్తంగా లోకల్ బాడీ కింద 686 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 526, ప్రాథమికోన్నత 100, ఉన్నత పాఠశాలలు 60 ఉన్నాయి. తనిఖీల కోసం, సమగ్ర సమాచార సేకరణ కోసం తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలలను ఆరు బృందాలు తనిఖీ చేయనుండగా, ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఉంటారు. వీరు రోజుకు రెండు స్కూళ్లను సందర్శిస్తారు. మరో బృందం రోజుకు రెండు ప్రాథమికోన్నత పాఠశాలలను తనిఖీ చేస్తుంది. ఇక మిగిలిన రెండు బృందాలు ఉన్నత పాఠశాలల తనిఖీ కోసం కేటాయించారు. ఈ ఒక్కో బృందంలో ఎనిమిది మంది చొప్పున ఉంటారు. విద్య సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ల్యాబ్లు, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వంటి అంశాలను పరిశీలిస్తారు. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు జిల్లాలోని అన్ని పాఠశాల సందర్శించి రిపోర్టు రూపొందించాలి. యాప్లో వివరాలు అప్లోడ్ చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. -
కుమురం భీం
7ప్రారంభానికి మోక్షమెప్పుడో? వాంకిడిలోని నూతన ప్రభుత్వ ఆస్పత్రి భవనం పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. 9లోu ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తగ్గుతాయి. చలి ప్రభావం కొనసాగుతుంది. సాయంత్రం చల్లగాలులు వీస్తాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. భద్రత లేని రహదారి బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, సిర్పూర్(టి) మండలాల నుంచి కాగజ్నగర్కు వెళ్లే రహదారులు ప్రమాదకరంగా మారా యి. ప్రమాదాలు జరుగుతున్నాయి. 9లోu సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
రాజీ మార్గమే ఉత్తమం
ఆసిఫాబాద్అర్బన్: వివిధ కేసుల్లో దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్న వారు రాజీపడి పరిష్కరించుకోవడమే ఉత్తమమని సెషన్స్ కోర్టు సివిల్ జడ్జి కె.యువరాజ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఆదివా రం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని కేసులు రాజీ చేసుకున్నారని తెలిపా రు. నాలుగు బెంచ్ల పరిధిలో 11,022 కేసులను పరిష్కరించగా, రూ.55,61,865 జరి మానా చెల్లించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. రాజీమార్గంలో పరిష్కరించుకోవాలిసిర్పూర్(టి): కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు సిర్పూర్(టి) మేజిస్ట్రేట్ అజయ్ ఉల్లం అన్నారు. మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కోర్టు పరిధిలో గల సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, దహెగాం, కాగజ్నగర్, కాగజ్నగర్ రూరల్, ఈజ్గాం పోలీసుస్టేషన్ల పరిధిల్లోని 771 కేసులు లోక్అదాలత్లోకి రాగా 656 కేసులును పరిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, న్యాయవాదులు కిశోర్కుమార్, గంట కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ పేరు కొనసాగించే వరకు ఉద్యమం
ఆసిఫాబాద్అర్బన్: ఉపాధిహామీ పథకానికి తిరిగి మహాత్మా గాంధీ పేరు కొనసాగించేవరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. పథకం నుంచి గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ చౌక్ వరకు చేరుకుని రాస్తారోకో చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ గాంధీ కుటుంబం పేరు పలి కితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించే పథకాన్ని నిర్వీర్యం చేయడమే ఆ పార్టీ ఎజెండా అని ఆరోపించారు. కార్యక్రమంలో యూత్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యాం, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, నాయకులు చరణ్, ముఖిద్, కుసుమ్, సాగర్, నారాయణ, సుధాకర్, తిరుపతి, మంగ, వందన, ఇందిరాబాయి, జక్కన్న, సత్తన్న, మురళి పాల్గొన్నారు. -
కొత్త పాలన!
పాత భవనాల్లో.. ● శిథిలావస్థలో పంచాయతీ భవనాలు ఇదేం కార్యాలయం తిర్యాణి: తిర్యాణి మండలం గుండాలలో 500పైగా జనాభా ఉంది. ఇప్పటివరకు పక్కా పంచాయతీ భవనం లేదు. గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు కింద పంచాయతీ కార్యాలయం కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. రికార్డులు, ఇతర సామగ్రిని ఇక్కడే భద్రత పరుస్తున్నారు. సమావేశాలు మాత్రం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. సబ్ సెంటర్ ఎదుట ఖాళీ స్థలంలో సోమవారం పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టనున్నారు. ఆసిఫాబాద్రూరల్/రెబ్బెన: రెండేళ్లపాటు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో కొనసాగిన పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జిల్లాలోని పంచాయతీ కార్యాలయాల నిర్వహణకు పక్కా భవనాలు కరువయ్యాయి. దీంతో అద్దె, పాఠశాలలు, అంగన్వాడీ భవనాల్లోని ఇరుకు గదుల్లోనే కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. గతంలో ప్రభుత్వం కొత్తగా పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో అందుబాటులో పాత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల భవనాల్లో తాత్కాలికంగా ఏర్పా ట్లు చేసింది. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట అద్దెకు తీసుకుని కార్యాలయాలు కొనసాగించారు. ఇప్పటికీ కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో కొత్త సర్పంచులు సైతం పాత భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. 218 పంచాయతీలకే పక్కా భవనాలుజిల్లాలో మొత్తం 335 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 218 పంచాయతీలకు మాత్రమే పక్కా భవనాలు ఉండగా, మిగితా చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. -
‘రిజిస్ట్రేషన్’లో సిబ్బంది కొరత
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. గత నాలుగు నెలలుగా రెగ్యులర్ అధికారి లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కార్యాలయంలో ప్రతీరోజు 8 నుంచి 15 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గతేడాది 1,985 రిజిస్ట్రేషన్లు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 2,500 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వానికి ఏటా రూ.కోట్ల ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతీరోజు ఆదాయం వస్తున్నా పోస్టులు భర్తీ చేయడంలో సర్కారు నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. సిబ్బంది కొరతతో తిప్పలు..జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక సబ్ రిజిస్ట్రార్, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఒకరు అటెండర్ ఉండాలి. ప్రస్తుతం ఒక జూ నియర్ అసిస్టెంట్, ఒక అటెండర్తోనే నెట్టుకువస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ లక్ష్మికి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాలకు జిల్లా కేంద్రంలో ఒకే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉంది. ప్రతీరోజు అనేక మంది రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆస్తులు, ప్లాట్లు, వివాహాలు, ఈసీలతోపాటు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. స్లాట్ బుకింగ్ ద్వారా ప్రక్రియ సాగుతుంది. అలాగే స్టాంపు పేపర్లు కూడా ఈ కార్యాలయంలో విక్రయిస్తారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో అవసరాల కోసం వచ్చినవారు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకో వాలి. స్లాట్ బుకింగ్లో నిర్ణీత సమయానికి కొనుగోలు, అమ్మకందారులు, సాక్షులు హాజరైన అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. స్లాట్ సమయానికి హాజరై ఫింగర్ప్రింట్, ఫొటో, సంతకాలు చేస్తే 30 నిముషాల్లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ అందజేస్తారు. సిబ్బంది కొరత విషయమై ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ లక్ష్మిని సంప్రదించగా.. రెండు నెలలుగా ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
ప్రభుత్వం ఆందోళనలు పట్టించుకోవడం లేదు
కొలాం ఆదివాసీ గిరిజనులు ఇళ్లు మంజూరైనప్పుడు సంబరపడ్డారు. గుడిసెలను తొలగించుకుని సిమెంట్తో ఇంటి నిర్మాణం చేస్తామంటే అధికారులు అడ్డుపడుతున్నారు. వారి ఆవేదనను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం కలెక్టర్ను కలుస్తాం. – కొడప సొనేరావ్, ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారుల ప్రతిభ
ఆదిలాబాద్టౌన్: రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారులు ప్రతిభ కనబర్చారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్లోని రైల్వే నిలయం ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎకై ్సజ్, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆసిఫాబాద్ డీపీఈవో జ్యోతికిరణ్ బాడ్మింటన్లో ప్రథమ బహుమతి సాధించగా, చెస్, క్యారమ్ పోటీల్లో ఇచ్చోడ సీఐ జుల్ఫేఖార్ అహ్మద్ రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. వీరిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.రఘురాం అభినందించారు. వీరు బహుమతులు అందుకోవడంపై ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. -
సర్పంచ్ అనే నేను..
ఆసిఫాబాద్: ‘గ్రామ పంచాయతీ సర్పంచునైన/సభ్యుడినైన...........అను నేను’ అంటూ సోమవారం పల్లె పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పంచాయతీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 335 పంచాయతీలు, 2,874 వార్డు స్థానాలు ఉన్నాయి. మూడు సర్పంచ్ స్థానాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. మొత్తం 332 మంది సర్పంచులు, 2,833 మంది వార్డు సభ్యులు ప్రత్యేకాధికారుల సమక్షంలో ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిరోజు గ్రామాభివృద్ధిపై చర్చ కొనసాగించనున్నారు. ప్రమాణ స్వీకారం ఇలా.. 2024 ఫిబ్రవరి 1తో పాత పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ప్రత్యేకాధికారులు 20 నెలలపాటు ఇన్చార్జీలుగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో కొత్తగా గెలుపొందిన సర్పంచులు సోమవారం ఆయా పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి ఎన్నికల ఫలితాల ధ్రువపత్రాలు(ఫారం–15) రిటర్నింగ్ అధికారి నుంచి అందుకుని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒక్కో ప్రత్యేకాధికారికి ఒకటికి మించి బాధ్యతలుంటే పంచాయతీ కార్యదర్శులు చేయిస్తారు. అవసరమున్న చోట ఉపాధ్యాయులను నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రమాణ పత్రంపై సంతకం చేయాలి. ఆ తర్వాతే కొత్త సర్పంచులకు పూర్తి బాధ్యతలు అమలవుతాయి. సంతకాల తర్వాత జాయింట్ చెక్పవర్ ఫామ్లను సేకరించి, బ్యాంకులకు పంపుతారు. సర్పంచ్ లేకపోతే సభ్యుల సంతకాలు ముందుగా తీసుకుంటారు. ఈ ప్రక్రియలు అన్నీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 40– 41 ప్రకారం జరుగుతాయి. విధులు, బాధ్యతలుసర్పంచులు గ్రామ పంచాయతీల పరిపాలనాధికారిగా వ్యవహరిస్తూ గ్రామ సభలు నిర్వహిస్తారు. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ చేస్తారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛ భారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభ, నష్టాల రిపోర్టులు సమర్పించాలి. ఎన్నికల తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ నిర్వహించాలి. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చర్యలు చేపట్టాలి. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ఉపాధిహామీ పథకం కింద 200 రోజుల పనిదినాలు కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలని, పీఆర్సీ డబ్బులు ఇవ్వాలని, సింగరేణి ఆవిర్భావ వేడుకలు గతంలో మాదిరి జరపాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను అసంఘటిత, సంఘటిత కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, నాయకులు పిడుగు శంకర్, సుధాకర్, దత్తు, తిరుతి, నగేశ్, శ్రీనివాస్ లక్ష్మణ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
తోషం తండాలో ఇల్లు దగ్ధం
గుడిహత్నూర్: మండలంలోని తోషం తండాలో ఆదివారం తెల్లవారు జామున గ్రామానికి చెందిన రాథోడ్ గజానంద్కు చెందిన ఇల్లు అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గజానంద్ ఊరి చివరలో నివాసం ఉంటుండగా ప్రమాదం జరిగిన రోజు ఆయన కుటుంబ సభ్యులతో తన అత్తవారి ఇంట్లో నిద్ర పోయాడు. రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరగ్గా గ్రామస్తులు వెంటనే మంట లు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక దళానికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు లేక పోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సరుకులు, వస్తువులు మొత్తంగా రూ.80వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. కాగా బాధితుడు గజానంద్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు. -
ధ్యానం.. జీవనరాగం
ఆదిలాబాద్: ధ్యానం అంటే కేవలం కళ్లు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదని, ఆలోచనలు నియంత్రించుకోవడం, మనసును శాంతపరచుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడమేనని ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు. మరోవైపు పరిశోధనలు సైతం ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గడం, ఏకాగ్రత పెరగడం, నిర్ణయక సామర్థ్యం మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. నేడు ప్రపంచ ధ్యాన దినోత్సవం నేపథ్యంలో కథనం.. ఎన్నో ప్రయోజనాలు.. ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతమై ఆలోచనలపై నియంత్రణ సాధ్యమవుతుంది. ఆందోళన, కోపం, నిరాశ వంటి భావాలు క్రమంగా తగ్గుతాయి. ధ్యానం ఏకాగ్రతను పెంపొందిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత, ఆత్మవిశ్వాసం పెరగడం ధ్యానం వల్ల కలిగే మరో లాభం. ఆరోగ్యంపరంగా కూడా ధ్యానం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచడం, హృదయ ఆరోగ్యం మెరుగుపడటం, నిద్ర సమస్యలు తగ్గడం వంటి లాభాలు ధ్యానం ద్వారా సాధ్యమవుతాయి. రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా ధ్యానం సహకరిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం కదలకుండా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. మొదట్లో కొద్దిసేపు మాత్రమే ధ్యానం చేసి దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఐదు నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా పది లేదా ఇరవై నిమిషాలకు పెంచుకోవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీ రోడ్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఆటోడ్రైవర్, బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలోని బాబానగర్కు చెందిన మెడపట్ల వెంకటేష్ తన ఆటోలో బాబానగర్లోని ప్రభుత్వ పాఠశాల టీచర్లు, మరికొందరు ప్రయాణికులతో మంచిర్యాలకు వస్తున్నాడు. మంచిర్యాల నుంచి క్వారీ వైపు వెళ్తున్న ఓ కారు రాంగ్ రూట్లో వచ్చి అతివేగంగా ఆటోను ఢీకొట్టింది. ఆటోడ్రైవర్ వెంకటేష్, ఇద్దరు ప్రభుత్వ టీచర్లకు స్వల్ప గాయలయ్యాయి. కారులో న్యాయవాది లోగో, నల్గొండ జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఐడీ కార్డు లభించడం చర్చనీయాంశమైంది. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ ప్రమోద్రావును సంప్రదించగా.. ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి
నిర్మల్టౌన్: విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతకాన్ని ఆవిష్కరించి, క్రీడలను ప్రారంభించారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ క్రీడలు ఉన్నాయి. ఈ క్రీడల్లో 50 మంది బాలికలు, 100 బాలురు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, పీడీలు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. కేకే–ఓసీలో ప్రమాదం.. దెబ్బతిన్న డంపర్లుమందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీలో రెండ్రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు డంపర్లు దెబ్బతిన్న విషయం ఆలస్యంగా తెలిసింది. గురువారం రెండో బదిలీలో ఓసీలోని పని స్థలంలో షావల్ ఆపరేటర్ బొగ్గు నింపుతుండగా డంపర్ వాహన చోదకుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. వరుస క్రమంలో రావాల్సిన ఓ డంపర్ వాహన చోదకుడు తొందరపడి ముందు డంపర్ లోడ్ కాకముందే తీసుకెళ్లి నిర్లక్ష్యంగా నిలిపి డ్రైవర్ సీటు నుంచి పక్కకు వచ్చినట్టు సమాచారం. డంపర్ నిలిపినప్పుడు పాటించాల్సిన దూరం, బ్రేకులు వినియోగించకపోవడంతో ఆ డంపర్ వెనుకకు కదిలి మరో డంపర్ను ఢీకొట్టగా రెండూ దెబ్బతిన్నాయి. ఉద్యోగి నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మణుగూరు ఓపెన్ కాస్ట్ గనిలో ఇలాంటి సంఘటనే జరిగి ఓ ఆపరేటర్ మృతిచెందాడు. అధికారులు ఈ విషయాన్ని బయటకు తెలి యనీయకుండా, రక్షణ చర్యలు విఫలమైనా పట్టించుకోకుండా ఉన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
భీమారం: గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన కొత్తపల్లి గ్రామానికి చెందిన రత్న వేణుగోపాల్రెడ్డి (43) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాలు.. భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్రెడ్డి గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై రోజూ మద్యం సేవిస్తుండగా భార్య లత హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురై మద్యం సేవించిన మత్తులో భార్యతో గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి 10.30 గంటలకు ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా శనివారం మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూర్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతిదిలావర్పూర్: మండల కేంద్రం దిలావర్పూర్ సమీపంలో నిర్మల్ –భైంసా రహదారిపై టోల్ఫ్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్యారంగుల తిమ్మయ్య(45) అనే వ్యక్తి మృతి చెందినట్లు దిలావర్పూర్ ఎస్సై రవీందర్ వెల్లడించారు. భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన తిమ్మయ్య తన ద్విచక్రవాహనంపై నిర్మల్ వెళ్తుండగా సాయంత్రం దిలావర్పూర్ సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఎన్హెచ్ఏఐ అంబులెన్స్లో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తప్రావం కాగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
భూమికోసం కొట్లాట.. ఒకరికి కత్తిపోట్లు
నార్నూర్: గాదిగూడ మండలం మేడిగూడ గ్రామంలో శనివారం భూతగాదాలలో ఒకరిపై కత్తితో దాడి జరిగింది. ఎస్సై ప్రణయ్, స్థానికుల కథనం ప్రకారం.. మేడిగూడ గ్రామానికి చెందిన రామ్ సిందే, ఆకాష్ సిందేలు వరుసకు బాబాయ్ కొడుకులు. బాబాయ్ అయిన రామ్ సిందే ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి పొలం పనికి వెళ్లాడు. గమనించిన ఆకాష్ సిందే వెనకాలే వెళ్లగా, ఇద్దరు భూమి విషయంలో గొడవపడ్డారు. గొడవ పెద్దది కాగా గ్రామానికి వచ్చిన తర్వాత కూడా మాటమాట పెరిగింది. ఆగ్రహానికి గురైన ఆకాష్ సిందే తన బాబాయ్ రామ్ సిందేపై వెనుక భాగాన రెండు చోట్ల కత్తితో పొడిచాడు. అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులపై సైతం దాడికి ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రామ్ సిందేను వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రామ్ సిందే భార్య విజయమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ తెలిపారు. -
జంగుబాయి ఉత్సవాలకు వేళాయె
జంగుబాయి గుహముస్తాబైన అమ్మవారి ప్రాంగణంతెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదాస్పద ప్రాంతం కెరమెరి మండలం ముకదంగూడ గ్రామ పంచాయతీకి చెందిన మహరాజ్గూడ అడవుల్లో జంగుబాయి దేవత కొలువైంది. నియమనిష్టలతో, భాజాభజంత్రీల నడుమ ఆదివాసీలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ నెల 22 నుంచి జనవరి 17 వరకు జంగుబాయి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహరాజ్గూడ అడవుల్లో ఉన్న బోరు నుంచి పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించడంతోపాటు హాల్, పోచమ్మ ఆలయానికి రంగులు వేశారు. 20 సోలార్ విద్యుత్ లైట్లను సైతం అమర్చనున్నారు. ఆలయ క్షేత్రం వరకు సీసీ రోడ్డు కూడా వేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గమనార్హం. ఎనిమిది గోత్రాలు ఒకే వేదికపై.. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని జంగుబాయి వారసులు వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హెర్రకుంరం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. వారంతా కాలిబాట, ఎడ్లబండ్లపై వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు పుజారులుగా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతాయి. వనక్షేత్రంలో బస చేసిన పోచమ్మతల్లికి కూడా మొక్కులు తీర్చుకుంటారు. తమ ఇళ్లకు తాళాలు పెట్టి ఎనిమిది కుటుంబాలకు చెందిన ఆదివాసీలు ఈ ఉత్సవానికి తరలివస్తారు. సుమారు వెయ్యికి పైగా ఎడ్లబండ్లు వచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నైవేద్యాలు తయారు చేసి సంప్రదాయ వాయిద్యాలతో గుహలోకి వెళ్లి అమ్మ వారిని దర్శించుకుంటారు. అక్కడున్న మైసమ్మ, పోచమ్మ, రావుడ్ దేవతల వద్దకు వెళ్లి మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి వంటలు చేసి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలు చేస్తారు. దారి మధ్యలో ఉన్న టొప్లకసకు వెళ్లి పూజలు చేస్తారు. ప్రభుత్వం గుర్తింపుతో అభివృద్ధి.. ఎనిమిదేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం జంగుబాయి ఉత్సవాలకు గుర్తింపు ఇచ్చింది. ఏటా రూ.10 లక్షలు అభివృద్ధి కోసం విడుదల చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, సత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇ తర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. చేరుకోవడం ఇలా.. జంగుబాయి పుణ్యక్షేత్రానికి కెరమెరి మండలం నుంచి ఆనార్పల్లి మీదుగా ఉమ్రి వంతెన నుంచి పరందోళి మీదుగా, లేదా పరంధోళి సమీపం నుంచి ముకదంగూడ గ్రామానికి ఆనుకుని ఉన్న కచ్చా రోడ్డు గుండా వెళ్లవచ్చు. లేదా నార్నూర్ క్రాస్రోడ్డు నుంచి కొత్తపల్లి మీదుగా, ఆదిలాబాద్ నుంచి లొకారి మీదుగా జంగుబాయి క్షేత్రానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. గుహలో కొలువు.. ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి దేవత గుహలో కొలువై ఉంది. గుహ కావడంతో భక్తులు కూర్చునే వెళ్లాల్సి ఉంటుంది. గుహలో దీపం వెలుగులో దేవత భక్తులకు దర్శనమిస్తుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆదివాసీలు విశ్వసిస్తారు. పుష్యమాసంలో కనిపించిన నెలవంక నుంచి ప్రారంభమైన జంగుబాయి జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది. ఎత్తయిన గుట్టలు.. చుట్టూ అడవుల మధ్య ఆదివాసీల కొంగుబంగారంలా విరాజిల్లుతోంది జంగుబాయి పుణ్యక్షేత్రం. లక్షలాది మంది ఆదివాసీలు ఆరాధించి పూజించే జంగుబాయి దేవతా ఉత్సవాలు ఈ నెల 22న నిర్వహించే దీపస్వరూప్తో ప్రారంభం కానున్నాయి. ప్రతీ సంవత్సరం పుష్యమాసం నుంచి నెల రోజులు పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. – కెరమెరి(ఆసిఫాబాద్) -
సర్పంచ్గా ఓడినా హామీ నెరవేర్చారు..
కై లాస్నగర్(బేల): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓడినా ప్రజలకు ఇచ్చినా హామీని నెరవేర్చారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సామ రూపేష్రెడ్డి పోటీ చేశారు. తనను గెలిపిస్తే బాజీరావు మహరాజ్ ఆలయం వద్ద బోరు వేయిస్తానని హామీనిచ్చారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డి సహకారంతో ఆలయం వద్ద శనివారం బోరు వేయించారు. ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్తో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బెదుర్కర్ రవీందర్ పటేల్, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు వినోద్, మంచికంటి సాయి, ఊషన్న, సతీష్, సునిల్ పాల్గొన్నారు. కొత్తూరులో.. నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మహ్మద్ జలీల్ ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు. భీరన్న దేవుడి గుడి నిర్మాణం కోసం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు విలువ చేసే మెటీరియల్ అందజేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. -
హాజీపూర్ ఉప సర్పంచ్ రాజీనామా
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దానయ్య తన ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీడీఓ సాయివెంకటరెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. ఈ నెల 11న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం వార్డు సభ్యుల అంగీకారంతో ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఏం జరిగిందో గానీ రాజీమానా చేయగా.. ఇంకా ఆమోదం కాలేదు. సోమవారం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఉప సర్పంచ్గా దానయ్య ప్రమాణ స్వీకారం చేయాలని అధికారులు అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేయకముందే రాజీనామా చేసే అవకాశం లేదని, ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లిన మీదట రాజీనామా ఆమోదించి ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఉప సర్పంచ్ అభ్యర్థి ఎన్ని క ఉంటుందని చెబుతున్నారు. ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలుకుంటాల: మండలంలోని కల్లూరు –కుంటాల రహదారిపై శనివారం సాయంత్రం ఆదర్శ పా ఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో వారికి గాయాలయ్యాయి. స్థానిక ఆ దర్శ పాఠశాల నుంచి ఓ ఆటోలో 12 మంది వి ద్యార్థులు కల్లూరు వెళ్తుండగా వెంకూర్ స మీపంలో బోల్తాపడింది. నర్సాపూర్ (జి) మండలంలోని బూర్గుపల్లి (కె) గ్రామానికి చెందిన జాదవ్ అక్షర, వైష్విక, చాక్పెల్లి గ్రామానికి చెందిన రశ్మిత, కుంటాల మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన పడకంటి స్వాతికి గా యాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో వారిని చికిత్స నిమిత్తం భైంసా, కల్లూరు తరలించారు. ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు సాయపడ్డారు. కనిపించకుండా పోయి.. శవమై తేలి బోథ్: సొనాల మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కా ర్మికుడు బత్తుల రాము(38) గ త మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. కాగా శనివారం రాత్రి సొనాల గ్రామ డంపింగ్ యార్డు వద్ద శవమై కనిపించాడు. పక్కనే ఉన్న చెట్టుకు తాడు కట్టి ఉంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఎస్సై శ్రీసాయి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిఽశీలించారు. పంచనామా నిర్వహించి మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా భార్య బత్తుల రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రశ్మిత పడకంటి స్వాతి -
డీసీసీబీ ప్రత్యేకాధికారిగా ఆదిలాబాద్ కలెక్టర్ బాధ్యతలు
కై లాస్నగర్: ఉ మ్మడి ఆదిలా బాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రత్యేకాధికారిగా, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార శాఖ అధికారి బి.మోహన్, స హకార బ్యాంకు సీఈవో సూర్య ప్రకాశ్, డీజీఎంలు వెంకటస్వామి, భీమేందర్ తదితరులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసుఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ వివాహితను వేధిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన రోహిత్ హుస్సేన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు షీటీం ఇన్చార్జి బి.సుశీల తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ గృహిణి గతంలో ఓ సొసైటీలో పనిచేస్తున్న క్రమంలో సహఉద్యోగి రోహిత్ హుస్సేన్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆధారంగా చేసుకున్న నిందితుడు ఆమెను వేధిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో దాడులు చేస్తూ, డబ్బులు వసూలు చేసేవాడు. గతంలో నిందితుడు ఆమె ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి చేతులతో, కర్రతో దాడి చేశాడు. ఆమె ఆయన నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె చేతికి గాయమైంది. అంతేకాకుండా పలుమార్లు నగదు లాక్కొని పరారయ్యాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహిత ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు షీటీం ఇన్చార్జి తెలిపారు. -
డెంటల్ డాక్టర్ల క్రికెట్ లీగ్
నిర్మల్టౌన్: తెలంగాణ డెంటల్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం, కొండాపూర్ సమీపంలోని గ్రౌండ్లో రాష్ట్రస్థాయి డెంటల్ డాక్టర్ల క్రికెట్ లీగ్ మ్యాచ్ సీజన్ –5 నిర్వహించారు. ఈ పోటీలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఇందులో ఆ దిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ని జామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను నిర్మల్ డాక్టర్స్ అసోసియేష న్ అధ్యక్షుడు ము రళి, సీనియర్ డాక్టర్ అప్పాల చక్రధరి, రమేశ్ రెడ్డిలు ముందుగా టాస్ వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ వెంకటరమణ, డాక్టర్ అసోసియేషన్ మెంబర్స్ రామకృష్ణ, నమిత, సుభాశ్ రావు పాల్గొన్నారు. -
ఈ ఎస్వో మేడం మాకొద్దు
వాంకిడి: ‘ఈ ఎస్వో మేడం మాకొద్దు.. పాఠశాలలో ఉంటే మేమైనా ఉండాలి.. లేదా ఆవిడైనా ఉండా లి.. ఆమె టార్చర్ భరించలేకపోతున్నాం..’ అని కే జీబీవీ విద్యార్థినులు వాపోయారు. అసభ్య పదజా లంతో ఇష్టమొచ్చినట్లు తిట్టడం, తమ తల్లి దండ్రులను కించపరిచి మాట్లాడటం ఆమెకు అలవాటైందని ఆరోపించారు. వెంటనే ఎస్వోపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో శని వారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించగా ఎస్వో మీ నాపై విద్యార్థినులు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తల్లిదండ్రులతో కలిసి బయటికి వచ్చారు. ఎస్వో మేడమ్ను సస్పెండ్ చేయాలని నినదించారు. ర్యా లీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. తమను ఎస్వో కులం పేరిట తి డుతున్నారని, జ్యోతీ బాఫూలే ఫొటోలు పడేయాల ని.. మాలికులస్తులను కించపరుస్తున్నారని ఆరో పించారు. ‘ట్రాన్స్ జెండర్లు, బికారీలు మీకు తిండి దండగా.. మీ కంటే బర్రెలను పెంచుకుంటే నయం.. కనీసం పాలైనా ఇస్తాయి?..’ అని అసభ్య పదజా లంతో తిడుతున్నారని వాపోయారు. కొద్దిరోజులు గా గుడ్లు కూడా ఇవ్వడం లేదని, బండలు మోయించడం లాంటి పనులు చేయిస్తున్నారని తెలిపారు. వెంటనే ఎస్వో మేడమ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్సై మహేందర్ ఘటనా స్థలానికి తల్లి దండ్రులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. -
భద్రత భేష్
కౌటాల: జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎ న్నికలు ప్రశాంతంగా ముగియడంలో జిల్లా పోలీ స్ యంత్రాంగం పనితీరును ఉన్నతాధికారుల ప్రశంసిస్తున్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలో సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఎన్నికల సంఘం గుర్తించి అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసేది. పోలింగ్రోజు కొన్ని ప్రాంతాల్లో పలుసార్లు తోపులాటలు, దాడులు, పోటాపోటీ నినాదాలు చో టు చేసుకునేవి. ఎన్నికలకు ముందు బరిలో నిలిచి న అభ్యర్థులనూ మావోయిస్టుల పేరిట బెదిరింపులకు పాల్పడిన ఘటనలున్నాయి. కొన్ని మారుమూ ల ప్రాంతాల్లో ఎన్నికలంటే ఓ రణరంగం మాదిరి విర్రవీగుతూ చిందులేసే ప్రత్యర్థి వర్గాలుండేవి. అందుకుగాను గతంలో ఒక్కో పోలింగ్బూత్ వద్ద న లుగురైదుగురు పోలీస్ సిబ్బంది పహారా కాస్తే.. బయట ఆయా పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు మరో నలుగురైదుగురు సిబ్బంది ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్వహించిన మూడు విడతల్లో నిర్వహించినా, పోలింగ్రోజుల్లో గొడవలు జరిగే అవకాశముందని పలువురు భావించారు. కానీ, ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుంఎస్పీ నితిక పంత్ నేతృత్వంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు ప్రజల్లో వచ్చిన చైతన్యంతో జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదు. వెయ్యి మందికి పైగా విధుల్లో.. జిల్లాలోని 335 పంచాయతీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. వెయ్యిమందికి పైగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, 15మంది ఎస్సైలు, 30కి మందికి పైగా ఏ ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 800 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, 200 మంది ఇతర శాఖల సిబ్బందితో పో లింగ్ రోజు ఆయా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ముందుగానే ఓటర్లను చైతన్య పరిచి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజు ఎక్కడా.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎస్పీ నితిక పంత్ పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారు. మరోవైపు ఎన్నికల విధుల్లో భాగంగా ప్రతీ మండల కేంద్రం, పట్టణా లు, కొన్ని గ్రామాల్లోనూ పోలీసులు ముందస్తు కవాతు నిర్వహించి నిర్భయంగా ప్రజలు ఓటేయాలని అవగాహన కల్పించారు. అక్రమ రవాణాకు అడ్డుకట్టఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జి ల్లా పోలీస్శాఖ అక్రమ రవాణాపై నిఘా పెంచింది. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు మార్గాల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసింది. దీంతో పోలీసులు పంచాయతీ ఎన్ని కల్లో పటిష్టమైన నిఘా పెట్టి రూ.6.49 లక్షల వి లువైన మద్యం, గంజాయి, నగదు, చీరలు స్వాధీ నం చేసుకున్నారు. తనిఖీల్లో రూ.22వేల నగదు, రూ.1,88,156 విలువైన 324 లీటర్ల మద్యం, రూ.1,94,190 విలువైన పీడీఎస్ బియ్యం, 90 చీ రలు పట్టుకుని సీజ్ చేశారు. 18గంజాయి మొక్కలు, 2.6కిలోల ఎండు గంజాయి (విలువ రూ.2.45లక్షలు) పట్టుకున్నారు. గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన 959 మంది వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేశారు. వీరిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల పై ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు భంగం క లించేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తూ ప్రత్యేక సెల్ అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ కోసం జిల్లా కేంద్రం నుంచి ఎక్కడికై నా సకాలంలో చేరేలా రూట్ మ్యాప్ ఏ ర్పాటు చేశారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి పోలింగ్రో జు బందోబస్తు ఏర్పాటు విషయం తెలిసిందే. -
వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అవసరమైన అంశాలపై నివేదిక రూ పొందించి అందించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యుదీకరణ, తాగునీరు, ప్రహరీ, వంటశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నా రు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాణ్యమైన విద్య, ఆహారం అందించాలని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నివేదికలో పొందుపరిచి అందించాలని ఆదేశించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
ప్రజల సహకారంతోనే..
జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి 800మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, 200 మంది ఇతర శాఖల సిబ్బందితో విధులు నిర్వహించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు సహకరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశాం. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో పోలీసులతో కవాతు నిర్వహించి ప్రజలకు ఓటు విశిష్టత గురించి వివరించాం. జిల్లాలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. – నితిక పంత్, ఎస్పీ -
భవిత కేంద్రం ప్రారంభం
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కేంద్రంగా ఏర్పాటు చేసిన భవత కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శనివారం అదనపు కలెక్టర్ డీఈవో దిపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకావసరాలు గల పిల్లలకు విద్య, మానసిక, సామాజికాభివృద్ధికి భవిత కేంద్రం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్ర త్యేకావసరాలు గల పిల్లలను గుర్తించి వారికి తగిన సాయం అందించడమే భవిత కేంద్రాల లక్ష్యమని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ అభినందనస్వచ్ఛ్ ఎవం హరిత విద్యాలయ రేటింగ్లో నిలిచిన స్కూల్ ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అభినందించి ఐటీవోసీ సర్టిఫికెట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ్ ఎవం హరిత విద్యాలయాలుగా జిల్లాలో ఏడు పాఠశాలకు మంచి రేటింగ్ వ చ్చిందని తెలిపారు. విద్యాసంస్థలు విద్యాబోధనకే పరిమితం కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, హరిత జీవన విధానాలపై విద్యార్థుల్లో అవగా హన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. స్వచ్ఛ్ విద్యాలయ కార్యక్రమం ద్వారా విద్యార్థులు బాధ్యతాయుత పౌరులగా మారే లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ఈ క్రమంలో ఏడు పాఠశాలలు సమగ్ర స్కోరుతో 5.4 స్టార్ రేటింగ్ను దక్కించుకుని ఆదర్శంగా నిలిచాయని వివరించా రు. అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
వాంకిడి: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పో లీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదైన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిష్టర్లు తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి ప లు సూచనలు చేశారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వాడకంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతీ ఫిర్యాదుదారుతో మర్యాదక పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, బాలబాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్ తదితరులున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుఆసిఫాబాద్అర్బన్: వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ నితిక పంత్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని తెలిపారు. జిల్లా వ్యా ప్తంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని కోరారు. -
ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
ఆసిఫాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. కలెక్టరేట్లో శనివారం అదనపు కలెక్టర్లు దీపక్ తివా రి, డేవిడ్, గృహనిర్మాణ శాఖ పీడీ ప్రకాశ్రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహనిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీ క్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నులు వేగవంతం చేయాలని ఆదేశించారు. డీఆర్డీ వో దత్తారావు, డీఎల్పీవో ఒమర్ హుస్సేన్, హౌసింగ్ ఈఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలిజిల్లాలో ఆకాంక్షిత బ్లాక్గా గుర్తించిన తిర్యాణిని మండలంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. కలెక్టరేట్లో ఆకాంక్షిత బ్లాక్గా ఎంపికై న తిర్యాణిలో నీతిఆయోగ్ ద్వారా చేపడుతున్న మౌలిక వసతులు అంగన్వాడీ, మినీ అంగన్వాడీ భవనాలు, పాఠశా ల గదుల నిర్మాణం, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై గిరి జన సంక్షేమ, విద్య, ఆరోగ్య, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో స మీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తిర్యా ణి మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వ రగా పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలని సూచించారు. ఆస్పత్రుల్లో శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు పనులు పూర్తి చేయాలని, అంబులెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, తిర్యాణి మండల సమాఖ్య భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఎంహెచ్వో సీతారాం, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలిజిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీ వో లోకేశ్వర్రావు, మైనార్టీ అధికారి నదీమ్తో కలిసి తహసీల్దార్లు, చర్చి ఫాదర్లు, సంబంధిత శాఖల అధికారులతో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కలిగిన చర్చిలకు విద్యుద్దీపాలు, అలంకరణ కోసం ప్రభుత్వం రూ.30 వే లు ఇస్తుందని తెలిపారు. కౌటాల, కాగజ్నగర్, రె బ్బెనలో నాలుగు చోట్ల వేడుకలు నిర్వహించేందుకు రూ.4లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అంధులను ఆదుకోవడం అభినందనీయంఅంధులను ఆదుకోవడం అభినందనీయమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్తో కలిసి దృష్టిలోపమున్న 26 మందికి స్మార్ట్ కళ్లజోళ్లు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ ఆ ధ్వర్యంలో బ్లైండ్ విజన్ ఫౌండేషన్ వారు విలువైన కళ్లజోళ్లు అందిస్తున్నారని తెలిపారు. ఒక్కో కళ్లజోడు ధర రూ.40 వేలు ఉంటుందని, ఏఐ సాంకేతికత ఆధారంగా బెంగళూరుకు చెందిన జాతీయ సంస్థ ఎస్హెచ్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన ట్లు పేర్కొన్నారు. బ్లైండ్ విజన్ ఫౌండేషన్ ప్రతి ని ధులు చలపతి, సాగర్, ఆకాంక్షిత, జిల్లా బ్లాక్ సమన్వయకర్త బాలరాజు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: సైన్స్ కిట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపికైన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వార్షిక పరీక్షల్లో మరింత ఉన్నత ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయ ని పేర్కొన్నారు. సైన్స్కిట్లను డ్రీమ్ ట్రస్ట్ వారు అందించడం అభినందనీయమని తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీఈ వో దీపక్ తివారి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్: రోడ్డు భద్రత మాసోత్సవాలను విజ యవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రవాణాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, శాంతి భద్రతల డీజీపీ మహేశ్ భగవత్, ఇత ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, రవా ణా, ఇంజినీరింగ్, మున్సిపల్ విద్యుత్, వైద్యారో గ్య, విద్యాశాఖ, జాతీయ రహదారుల సంస్థ అధి కారులతో రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు ని యమాలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, రహదారులు, భవనాలు, మున్సిపల్ శాఖల అధికా రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రహదారి భద్రత మాసో త్సవాలను నెలపాటు నిర్వహించేందుకు చర్యలు తీ సుకుంటున్నామని తెలిపారు. ప్రతినెలా జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనిన్నారు. -
గుడుంబాను నిర్మూలించాలి
దహెగాం: గుడుంబాను పూర్తిగా నిర్మూలించాలని మండల కేంద్రానికి చెందిన మహిళలు, యువకులు శనివారం స్థానిక అంగడిబ జార్ నుంచి పోలీస్స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెల్లో గుడుంబా తయారు చేస్తూ మండల కేంద్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో చాలామంది గుడుంబా తాగి అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి గుడుంబా తయారీ, విక్రయాలను పూర్తిగా అడ్డుకోవాలని కోరా రు. మండల కేంద్రాన్ని గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. -
నత్తనడకన ఈ–కేవైసీ
ఆసిఫాబాద్అర్బన్: పౌర సరఫరాలశాఖ ద్వారా పే దలకు అందిస్తున్న రేషన్కార్డుల్లో నకిలీవి ఏరివేసేందుకు కార్డుదారులతో ఈ–కేవైసీ తప్పనిసరి చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ రెండేళ్ల క్రితమే పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. జిల్లాలో ఇంకా చాలామంది ఈ–కేవైసీ చేయించుకో వాల్సి ఉంది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకునేలా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవోలు, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి రేషన్ డీలర్లకు అవగాహన కల్పించారు. నూతన కార్డుదారులకు వర్తింపుజిల్లాలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నూతన రే షన్ కార్డుదారులు కూడా ఈ ఈ–కేవైసీ తప్పనిసరి గా చేసుకోవాల్సి ఉంటుంది. పాత కార్డుల్లో పేరు తొలగించుకుని వీటిలో చేరినవారు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకోకు న్నా ప్రస్తుతం రేషన్ లభిస్తుంది. కానీ, ఈకేవైసీ చే యించుకోని పక్షంలో మున్ముందు లబ్ధిదారులకు స మస్యలెదురవుతాయని అధికారులు తెలిపారు. జిల్లాలో స్పందన అంతంతే..జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 315 రేషన్ దుకాణాలు న్నాయి. వీటి పరిధిలో 1,62,422 రేషన్కార్డులున్నా యి. వీటిలో 5,33,186 యూనిట్లున్నాయి. వీరికి ప్రతీనెల 3,141 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తారు. మొత్తం రేషన్కార్డుల ఇకేవైసీ ప్రక్రియలో ఇప్పటివరకు 66శాతం ప్రక్రియ పూర్తయింది. మిగతా 34శాతం పూర్తి కావాల్సి ఉంది. ప్రతీ రేషన్కార్డు ద్వారా లబ్ధి పొందేవారు తప్పనిసరిగా త్వరగా ఈ–కేవైసీ చేయించుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. నకిలీకార్డులను ఏరివేసేందుకే..ఈ–కేవైసీ చేయించుకోని వారికి గతంలో ప్రభుత్వం బియ్యం నిలిపివేస్తామని పలుసార్లు హెచ్చరించింది. అయినా.. ఇంకా కొంతమంది జాప్యం చేస్తున్నా రు. ఇందుకు కారణం ఆధార్కు ఈ–కేవైసీ యంత్రానికి అనుసంధానం చేయడంతో బినామీ పేర్ల మీద బియ్యం తీసుకోకుండా అడ్డుకట్ట వేయడం సులభం కానుంది. దీంతో రేషన్ షాపులో బియ్యం పంపిణీ మరింత సమర్థవంతంగా అమలు కానుంది. తప్పనిసరి చేయించుకోవాలి ఈ–కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం నుంచి ఇదివరకే ఆదేశాలు అందాయి. ఇప్పటివరకు జిల్లాలో 66శాతం ప్రక్రియ పూర్తయింది. మిగతా రేషన్కార్డుదారులు కూడా తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ–కేవైసీ చేసుకునే విధానంలో ఏమైనా సందేహాలుంటే తప్పనిసరిగా సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలి. – వసంతలక్ష్మి, డీఎస్వో -
రక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికా రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో రక్షణ చర్యల ప్రణాళికల రూపకల్పనపై సమీక్షించారు. ఆ యన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ, ప్రజారక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలతోపాటు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో ప్ర జలను రక్షించేందుకు ప్రణాళికలు రూపొందించుకో వాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ప్రజలకు పునరావాసం కల్పించడం, తక్షణ వైద్యసేవలు అందించడం, ఇతర అంశాల నిర్వహణ కోసం నోడల్ అధి కారులను నియమిస్తున్నామని తెలిపారు. జాతీయ విపత్తు రక్షణ బృందం, రాష్ట్ర విపత్తు రక్షణ బృందా ల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవి డ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలిఆసిఫాబాద్రూరల్: షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,674 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనం అందిస్తుందని తెలిపారు. ఈ నెల 23లోగా పోర్టల్లో వారి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ సంచాలకుడు (ఆపరేషన్) మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సీఈ అశోక్ కుమార్, ఆసిఫాబాద్ ఎస్ఈ ఉత్తం జాడేతో కలిసి జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరగా మంజూరు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఏవో దేవిదాస్, డీఈఈలు నాగరాజు, వీరేశం, ఏడీఈలు శ్రీనివాస్, ఇర్ఫాన్ అహ్మద్, రాజేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మంచు దుప్పటి
పొగమంచుతో ఊటిని తలపిస్తున్న తిర్యాణిదహెగాంలో స్వెట్టర్లతో విద్యార్థులులింగాపూర్లో కమ్ముకున్న పొగమంచులింగాపూర్లో చలిలో తాగునీటిని తెచ్చుకుంటున్న రైతులుదట్టమైన అటవీ ప్రాంతాలు, వాగులు, ఒర్రెలతో నిండి ఉన్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచుదుప్పటి కప్పుకుంది. ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. చిన్నారులు, వృద్ధులతోపాటు రైతులు, కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజులు తీవ్రమైన పొగమంచు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాలు ఊటిని తలపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకే వణుకు మొదలవుతుండగా, ఉదయం 10 దాటినా పొగమంచు ప్రభావం వీడటం లేదు. శుక్రవారం సిర్పూర్(యూ) మండల కేంద్రంలో రాష్ట్రంలోనే రెండో అత్యల్పంగా 6.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిర్యాణి మండలం గిన్నెధరిలో 6.6, తిర్యాణిలో 7.6, కెరమెరిలో 7.9, వాంకిడి, ఆసిఫాబాద్, చింతలమానెపల్లిలో 9.4, పెంచికల్పేట్లో 9.7 డిగ్రీలుగా నమోదైంది. గురువారం సైతం సిర్పూర్(యూ)లో 5.7, గిన్నెధరిలో 6.4 డిగ్రీల సెల్సియస్గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. – తిర్యాణి/లింగాపూర్/దహెగాం -
‘సహకార’లోనూ ‘ప్రత్యేక’పాలన
కై లాస్నగర్: సహకార శాఖలోనూ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)చైర్మన్ల పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో శనివారం సొసైటీల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్గా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార బ్యాంకుకు 2020 ఫిబ్రవరి 25న ఎన్నికలు జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్ తరఫున కాంబ్లే నాందేవ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. పదవి చేపట్టిన ఏడాదికే 28 జూలై 2021న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. తర్వాత వైస్ చైర్మన్గా ఉన్న రఘునందన్ రెడ్డి కొంత కాలం ఇన్చార్జి చైర్మన్గా కొనసాగారు. అయితే 29 జనవరి 2022న తాంసి పీఏసీఎస్ చైర్మన్గా ఉన్న అడ్డి భోజారెడ్డిని చైర్మన్గా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన బీఆర్ఎస్ను వీడి హస్తం పార్టీలో చేరారు. ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అయితే డీసీసీబీ చైర్మన్లంతా సీఎం రేవంత్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఆరు నెలల పాటు వారి పదవీ కాలం పొడిగించింది. ఈ గడువు శుక్రవారంతో ముగిసింది. ఎన్నికలు జరగకపోవడంతో ఆదిలాబాద్ కలెక్టర్కు ప్రత్యేకాధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు సహకార బ్యాంకు సీఈవో సూర్య ప్రకాశ్ శుక్రవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా కేంద్ర బ్యాంకు వివరాలను వివరించారు. పీఏసీఎస్ల ఎన్నికలు జరిగే వరకూ కలెక్టర్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించనున్నారు. -
ఓటమి.. నైరాశ్యం
ఆసిఫాబాద్రూరల్: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబురాల్లో మునిగి ఉన్నారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఓడిన అభ్యర్థులు అప్పుల బాధలో ముగినిపోయారు. కొందరు తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఇటీవల చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడకు చెందిన ఓ అభ్యర్థి ఓటర్ల వద్దకు పసుపు బియ్యంతో వెళ్లగా, శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలో ఓ అభ్యర్థి తన డబ్బులు ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నాడు. పోటాపోటీగా ఖర్చులు.. తిరిగి వసూలుపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ఖర్చు చేశారు. ఫలితాలు వెలువడే వరకూ విజయం తమదే అన్న ధీమాతో అందినకాడికి అప్పు తెచ్చారు. ఖర్చు చేసిన వారిలో కొందరు గెలుపొందగా, కొన్ని పంచాయతీల్లో మాత్రం ఓటర్లు ప్రలోభాలకు లొంగలేదు. కొత్తవారితోపాటు అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం ఉన్నవారికే పట్టం కట్టారు. ఇక ఓటమి చెందిన అభ్యర్థులు అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేసిన పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అడుగు మందుకు వేసి ఓటర్ల వద్ద డబ్బులు తిరిగి వసూలు చేస్తున్నారు. ఉప సర్పంచ్ కోసం..ఉమ్మడి చెక్పవర్ ఉండటంతో జిల్లాలో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది. ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి, చిలాటిగూడ పంచాయతీల్లో రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. ఇక్కడ ఉప సర్పంచ్కు పోటాపోటీ నెలకొంది. రహపల్లి పంచాయతీ ఏజెన్సీ గ్రామం కాగా, ఇక్కడ 8 వార్డుల్లో 4 ఎస్టీ, 4 జనరల్కు రిజర్వ్ చేశారు. నాలుగు వార్డుల్లో ఎన్నికలు జరగగా, బీఆర్ఎస్ రెండు వార్డు, బీజేపీ రెండు వార్డులు దక్కించుకున్నారు. దీంతో చివరికి టాస్ వేశారు. బీజేపీ అభ్యర్థి పెంటయ్యను అదృష్టం వరించడంతో ఉప సర్పంచ్గా ప్రకటించారు. -
మావోయిస్టుల లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల, కుమురంభీం(కేబీఎం) డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ హైదరాబాద్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోగా.. ఆ వివరాలను ప్రెస్మీట్లో వెల్లడించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ చిత్తరంజన్ కూడా పాల్గొన్నారు. సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 41మంది 24ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఇద్దరే తెలంగాణకు చెందిన వారు కాగా, 24ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కేబీఎం కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు జన్నారానికి చెందిన ప్రభంజన్ ఉన్నారు. మిగతా వారంతా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వివిధ కేడర్లో పని చేస్తున్న వారు ఉన్నారు. అజ్ఞాతం వీడేందుకేనా..?వచ్చే మార్చి నెలాఖరు వరకు మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు తమ పార్టీ కేడర్ను ఇతర ప్రాంతాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. మనుగడ క్లిష్టంగా మారడంతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అలా ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్– యూ ఏజెన్సీ అటవీ ప్రాంతంలోకి కొందరు మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వారిని గుర్తించి అత్యంత గోప్యంగా పోలీసులు ఆయుధాలతో సహా హైదరాబాద్కు తరలించారు. వీరంతా ఛత్తీస్గఢ్ నుంచి ములుగు ఇతర ప్రాంతాల మీదుగా సిర్పూర్–యూ మండలం కకర్బుడ్డి, బాబ్జీపేట పరిసరాల్లో సంచరిస్తున్నారు. పెద్దదోబ, చిన్నదోబ పరిధిలో అటవీ సమీపంలోని ఓ చేనులో ఉన్న గుడిసెలో తల దాచుకున్నారు. గత కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్నారు. వీరంతా ఇక్కడికి ఎలా చేరుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ అంతర్రాష్ట్ర సరిహద్దులతోపాటు జిల్లాలు, కీలక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఉన్నాయి. ఈ తనిఖీలను దాటి ఎప్పుడు, ఎలా వచ్చారనేది మిస్టరీగా మారింది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో బలగాలు గుర్తించిన మావోయిస్టులే అజ్ఞాతం వీడారనేది ఉన్నతాధికారులు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
‘సమస్యలు పరిష్కరించకుంటే సర్వేలు బంద్’
ఆసిఫాబాద్అర్బన్: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే సర్వేలు బంద్ చేస్తామని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అ ధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆశవర్కర్లతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ఈ నెల 18న ప్రారంభమైన లెప్రసీ సర్వేకు అదనంగా డ బ్బులు చెల్లించాలని, గతంలో పెండింగ్లో ఉ న్న లెప్రసీ, పల్స్పోలియో, ఎలక్షన్ డ్యూటీల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్వో బయటకు రావాలని నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న డీఎంహెచ్వో సీతారాం మాట్లాడుతూ తన ఆధీనంలో ఉన్న డిమాండ్లు నెరవేరుస్తానని, సర్క్యులర్ కూడా జారీ చేస్తానని హామీ ఇచ్చారు. మిగితా సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు త్రివే ణి, కార్యదర్శి రాజేందర్, నాయకులు కృష్ణమాచారి, శ్రీకాంత్, స్వరూప, భారతి, ప్రమీ ల, అనసూర్య, లక్ష్మి, సులోచన పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన
సిర్పూర్(టి): మండలంలోని దుబ్బగూడ, టోంకిని, పారిగాం గ్రామాల్లో ఐకేపీ ఇందిరా క్రాంతి పథ కం కింద నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం నరసింహారెడ్డి, తహసీల్దార్లు రహీమొద్దీన్, ప్రమోద్కుమార్, ఏపీఎం చంద్రయ్య, డీటీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెంచికల్పేట్(సిర్పూర్): మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ తిరుపతి తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రభుత్వ విద్యాసంస్థల్లో నా ణ్యమైన విద్య అందుతుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలో గోయెగాం ప్రాథమిక పాఠశాల, వాంకిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. పాఠశాలల్లో పిల్లల హాజరు, ప్రీప్రైమరీ విభాగం, బోధన ప్రమాణాలు, పరిసరాలు, మధ్యాహ్న భోజ నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళిక ప్రకారం బోధించాలన్నారు. ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్న్య, ఎంఈవో శివచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
డేంజర్ ఘాట్స్..!
కెరమెరి(ఆసిపాబాద్): జిల్లాలో ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మలుపులు తిరిగి న రహదారులపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కెరమెరి ఘాట్ రోడ్డుపై 9 కిలోమీటర్ల మేర 37 మూలమలుపులు ఉండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర పరంధోళి ఘాట్ రోడ్లు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. తాజాగా గురువారం పరంధోళి ఘాట్ రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురికి గాయాలు కాగా, మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. బస్సు కుడివైపు వెళ్లి ఉంటే పెద్ద లోయలోకి పడి ఉండేది. డ్రైవర్ చాకచాక్యంతో వ్యవహరించడంతో పత్తి చేనులో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. కెరమెరి ఘాట్ రోడ్డుపై 37 మలుపులుఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్కు వెళ్లే దారిలో అందంగా కనిపించే కెరమెరి ఘాట్ రోడ్డుపై 9 కిలోమీటర్ల మేర 37 మూలమలుపులు ఉన్నాయి. ఈ రహదారిలో ఎక్కడా కూడా ప్రమాద సూచికలు లేవు. మలుపులు కూడా అతి దగ్గరగా ఉండటంతో వాహనాలు తిప్పడం కూడా కష్టసాధ్యం. పదేళ్ల క్రితం సిగ్నల్స్, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆకతాయిలు ధ్వంసం చేశారు. మూడేళ్ల క్రితం భూతద్దాలు ఏర్పాటు చేయగా ఏడాదికే కొందరు పగులకొట్టారు. ఆర్అండ్బీ అధికారుల మళ్లీ కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనుభవం ఉన్న డ్రైవర్లు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నా.. కొత్తవారికి ఇబ్బందులు తప్పడం లేదు. కెరమెరి ఘాట్ రోడ్డు జరిగిన ప్రమాదాలు..కెరమెరి ఘాట్ రోడ్డుపై మూలమలుపుల కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. మూలములుపులతో ప్రమాకరంగా కెరమెరి ఘాట్ రోడ్డుముందుకు సాగని పరంధోళి రోడ్డు నిర్మాణంతెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కొనసాగుతున్న పరంధోళి ఘాట్ రోడ్డు నుంచి 10 గ్రామాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. 18 ఏళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఉమ్రి గ్రామం నుంచి పరంధోళికి బీటీ రోడ్డు వేస్తుండగా అటవీశాఖ అనుమతులు లేవనే సాకుతో 2008లో పనులు నిలిపివేశారు. ఆ తర్వాత నుంచి దీనిని పట్టించుకోలేదు. ఈ రోడ్డుపైనే గురువారం ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. -
వామ్మో కొండచిలువ..!
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఈఎస్ఐ సమీపంలోని ఎస్పీఎం కాలనీలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. క్వార్టర్స్ ప్రాంతాల్లో గురువారం కొండచిలువ కనిపించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఎస్పీఎం క్వార్టర్స్లోని సె క్యూరిటీ సిబ్బందికి తెలపగా, వారు పాము ను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. కొండచిలువను పట్టణానికి దూరంగా అటవీ ప్రాంతానికి తరలించారు. ఎస్పీఎం క్వార్టర్స్ ఖాళీగా ఉండి పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో ఉండడంతో విషసర్పాలు తిరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. -
మార్కెట్ సౌకర్యం కల్పించాలని ధర్నా
కౌటాల(సిర్పూర్): మండల కేంద్రంలో కూరగాయలు విక్రయించడానికి మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ చిరువ్యాపారులు గురువారం కౌటాల, కాగజ్నగర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కౌటాలలో కూరగాయలు విక్రయించడానికి ప్రత్యేక స్థలం లేకపోవడంతో ప్రతిరోజూ ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అద్దెలు చెల్లించలేక ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూరగాయలు, చేపలు, చికెన్, మటన్ విక్రయించడానికి మండల కేంద్రంలో ప్రత్యేక స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థా నిక ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని వ్యాపారుల సమస్యను ఎంపీడీవో కోట ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. కౌటాల పాత పీహెచ్సీ స్థలంలో తాత్కాలికంగా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రోడ్డుకిరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయవద్దని, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని ఎస్సై వారికి సూచించారు. -
కుష్ఠుపై సమరం!
కౌటాల(సిర్పూర్): రాష్ట్రంలోనే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2028లోగా కుష్ఠు రహిత సమాజాన్ని స్థాపించాలనే ఆశయంతో అవగాహన సదస్సులు, ర్యాలీలు, సర్వేలు నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరు నెలల కు ఒకసారి వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో కుష్ఠు వ్యాధి గుర్తింపు ఉద్యమం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి సర్వే ప్రారంభించారు. 754 మంది ఆశవర్కర్లు ఇంటింటికి వెళ్లి స్క్రీనింగ్ పరీక్ష ల ద్వారా అనుమానితులను గుర్తించనున్నారు. ప్రతిరోజూ 15 కుటుంబాలను పరిశీలిస్తారు. నిర్ణీత గడువులోగా జిల్లాలోని అన్ని కుటుంబాల పరిశీలన పూర్తికాకపోతే మరో వారం రోజులపాటు కార్యక్రమాన్ని పొడిగించనున్నారు. 84 మంది వ్యాధిగ్రస్తులుజిల్లాలోని 15 మండలాల్లో ప్రస్తుతం 84 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగజ్నగర్ మండలం ఆరెగూడ, కౌటాల మండలం కన్నెపల్లి, ముత్తంపేట, చింతలమానెపల్లి మండలం గూడెం, దిందా, సిర్పూర్(టి) మండలం లో నవెల్లి, బెజ్జూర్, వాంకిడి, దహెగాం మండలాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఏటా వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ప్రభుత్వం నివారణకు చర్యలు చేపడుతున్నా ప్రజలు వైద్యపరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. మల్టీ డ్రగ్ చి కిత్స ద్వారా తీవ్రతను బట్టి 6నుంచి 12 నెలల్లో వ్యా ధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ప్రస్తుతం కాగజ్నగర్ పీహెచ్సీలో మాత్రమే కుష్ఠు వ్యాధి నివారణ విభాగం ఉంది. గురు, శుక్రవారాల్లో లెప్రసీ సొసైటీ ఆధ్వర్యంలో చికిత్స అందుతుంది. ఆశ కార్యకర్తలే బాధితులకు మందులు అందిస్తారు. వైకల్యం ఏర్ప డే అవకాశం ఉంటే ఫిజియోథెరపి కూడా చేస్తారు. గుర్తింపు సర్వే షురూ..కుష్ఠులో పీబీ(పాసిబాసిల్లరి), ఎంబీ(మల్టీబాసిల్లరి)గా కేసులు ఉంటాయి. పీబీ అంటే అనుమానిత వ్యక్తి శరీరంపై దద్దులు, రాగి వర్ణపు మచ్చలు, అవయవాల్లో స్పర్శ తక్కువగా ఉండడంతో పాటు ఇతర లక్షణాలతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎంబీ కేసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు 14 రోజులపాటు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే చేపడుతున్నారు. అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. చర్మంపై పాలిపోయిన, గోధుమ, రాగి రంగు మచ్చలు ఉండటం, కునుబొమ్మల వెంట్రుకలు రాలడం, చేతి వేళ్ల స్పర్శ కోల్పోయి వంకరపోవడం వంటి లక్షణాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం, పూర్తి ఎండీటీ చేయించడం ద్వారా కోలుకోవచ్చని పేర్కొంటున్నారు. చికిత్సతోనే నయం కుష్ఠు అంటువ్యాధి కావడంతో ప్రారంభ దశలోనే గురిస్తే మేలు. చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చు. భయం, ఆందోళనలు వీడి ప్రజలు అనుమానిత మచ్చలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేసుకోవాలి. జిల్లాలో ఈ నెల 31 వరకు గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తాం. ప్రతీ గడపకు వెళ్లి వైద్యసిబ్బంది అనుమానితులను గుర్తిస్తారు. కుష్ఠు నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి. – సీతారాం, డీఎంహెచ్వో -
జిల్లా ఎన్నికల అధికారికి సన్మానం
ఆసిఫాబాద్అర్బన్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాను గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతిగౌడ్, డీఎల్పీవోలు హరిప్రసాద్, ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో మరణించిన ఉద్యోగులకు సంతాపంఎన్నికల విధుల నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జిల్లాలోని ఆసిఫాబాద్ మిషన్ భగీరథ ఏఈ కట్టరాజు విధి నిర్వహణలో మృతి చెందినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల కోడ్ ముగిసిందని పేర్కొన్నారు. -
నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయమే గెలిచింది
ఆసిఫాబాద్అర్బన్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన కేసులను కోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో న్యాయమే గెలిచిందని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ రాజకీయ కక్షతో ఈడీని వాడుకున్న వారికి ఇదో గుణపాఠమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంలో భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
కుమురం భీం
7అభివృద్ధికి దూరంగా ‘లైన్పటార్’ కెరమెరి మండలంలోని లైన్పటార్ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది. ఏళ్లు గడుస్తున్నా రోడ్డు సౌకర్యం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లేదు. 9లోu ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఉదయం పొగమంచు కురుస్తుంది. సాయంత్రం నుంచే చలి ప్రభావం పెరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత అధికంగా ఉటుంది. టీచర్లకు ‘టెట్’షన్ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తూనే పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. 8లోu శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైన శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని మల్టీజోన్– 1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం సందర్శించారు. భద్రత చర్యలు, పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సూచనలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సంజయ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
● ముగిసిన పంచాయతీ పోరు ● మూడో విడతలో నాలుగు మండలాల్లో ఎన్నికలు ● 83.32 శాతం పోలింగ్ నమోదు
ఆసిఫాబాద్: ఉత్కంఠగా సాగిన పల్లె పోరు ముగి సింది. 15 మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. తుది విడతలో భాగంగా గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటు వేసేందుకు పల్లెజనం కదిలొచ్చారు. 83.32శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్ర కటించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్ట ర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును పర్యవేక్షించారు. 83.32 శాతం పోలింగ్ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్నగర్, తిర్యాణి మండలాల్లో 1,21,004 మంది ఓటర్లు ఉండగా, 1,00,815 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 50,817 మంది పురుషులు, 49,995 మంది మహిళలు ఓటేశారు. 83.32 శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 79.81 శాతం, రెండో విడతలో 86.64 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. 15 మండలాల్లో మూడు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో సగటున 83.27 పోలింగ్శాతం నమోదైంది. తొలివిడత ఏజెన్సీ ప్రాంతాలతో పోలిస్తే సిర్పూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రెండో విడతలో పోలింగ్ శాతం పెరిగినా, మూడో విడతలో మళ్లీ స్వల్పంగా తగ్గింది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, బీజేపీ జిల్లా నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు, ఇతర నాయకులు తమ మద్దతుదారులను గెలిపించాలని పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను అభ్యర్థించారు. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్, కాగజ్నగర్ మండలం కోసిని పంచాయతీల్లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు రాజంపేట పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, సర్పంచ్ అభ్యర్థి బుర్స పోచయ్యతోపాటు పలు వురు ఓటుహక్కు వినియోగించకున్నారు. -
సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ తనిఖీ
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ను బుధవారం రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిర్పూర్(టి) వరకు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను పొడిగించాలని, అజ్నీ ప్యాసింజర్ రైలు స్టాప్ కేటాయించాలని, ఇంటర్సిటి ఎక్స్ప్రెస్ సిర్పూర్(టి) వరకు పొడిగించాలని నూతన సర్పంచ్ వడ్డేటి నాగమణి, వార్డు సభ్యులు విన్నవించారు. స్టేషన్లో డంపింగ్యార్డు ఏ ర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించా లని కోరారు. ఈ సందర్భంగా డీఆర్ఎంను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్, వార్డు సభ్యులు సాయి, మొఖరం హుస్సేన్, అస్లాం, నాయకులు వడ్డేటి నానయ్య, మోయిజ్, పైడి విలాస్, శ్యాంరావ్, నులిగొండ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
డ్యూటీలో గురుశిష్యులు
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని మోతుగూడ పోలింగ్ కేంద్రంలో గురుశిష్యులు ఒకేచోట విధులు విధులు నిర్వర్తించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001–02లో అబ్దుల్ లతీఫ్ గణిత ఉపాధ్యాయులుగా పనిచేయగా, అదే స్కూల్లో కమలాకర్, నాగార్జున చదువుకున్నారు. ప్రస్తుతం రెబ్బెన మండలం గంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అబ్దుల్ లతీఫ్ పనిచేస్తుండగా, కమలాకర్ ఆసిఫాబాద్ ఎస్సైగా, నాగార్జున తిర్యాణి బీట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మోతుగూడలో లతీఫ్కు ఎన్నికల విధులు కేటాయించడంతో బందోబస్తుకు వచ్చిన శిష్యులను కలుసుకున్నారు. -
నగరం నుంచి పల్లెకు..
వృథా కావొద్దని.. రెబ్బెన: ప్రజాస్యామ్య పద్ధతిలో నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఓటు వృథా కావొద్దనే ఉద్దేశంతో హైదరాబా ద్ నుంచి గోలేటికి వచ్చా. ఎన్నికల జరిగిన ప్రతిసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటా. – మద్దెల రవీందర్, ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్ ఓటు ద్వారా అవకాశం రెబ్బెన: గోలేటి నుంచి వెళ్లి ఉద్యోగరీత్యా చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్లో స్థిరపడ్డాం. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వచ్చా. గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఓటుహక్కు ద్వారా ఎన్నుకునే అవకాశం ఉంది. – అరుట్ల సాగర్, ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్ కరీంనగర్ నుంచి వచ్చా.. ఆసిఫాబాద్అర్బన్: కరీంనగర్లో డిగ్రీ చదువుతున్న. ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆసిఫాబాద్కు వచ్చా. రాజంపేటలో ఓటు వేసిన. ఎంత దూరంలో ఉన్న ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును వినియోగించుకోవాలి. – టి.రమ్య, డిగ్రీ విద్యార్థిని -
మండలాలు, గంటలవారీగా పోలైన ఓట్లు, శాతం
మండలం మొత్తం ఓటర్లు 9గంటలు 11గంటలు ఒంటిగంట మొత్తం పోలైన ఓట్లు ఆసిఫాబాద్ 29,731 7,745 (26.05%) 17,253 (58.03%) 24,579 (82.67%) 25,199 (84.76%) రెబ్బెన 28,724 4,975 (17.32%) 16,590 (57.76%) 23,864 (83.08%) 24,599 (85.64%) తిర్యాణి 18,148 1,901 (10.47%) 7,003 (38.59%) 14,386 (79.27%) 15,039 (82.87%) కాగజ్నగర్ 44,401 8,308 (18.71%) 26,908 (60.60%) 34,975 (78.77%) 35,978 (81.03%) మొత్తం 1,21,004 22,929 (18.95%) 67,754 (55.99%) 97,804 (80.83%) 1,00,815 (83.32%) -
ఏరియాలో చీఫ్ సెక్యూరిటీ అధికారి పర్యటన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి బాలరాజు బుధవారం తొలిసారి పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సెక్యూరిటీ గార్డ్స్, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. వారి పనితీరు, సమస్యలు, సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరియా స్టోర్స్, గోలేటి ఆర్చీ చెక్పోస్టులు, సెంట్రల్ స్క్రాప్ యార్డ్ను తనిఖీ చేశారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా సర్వే అధికారి అఫ్సర్ పాషా, బీపీఏ ఓసీపీ మేనేజర్ మహేశ్, ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీధర్, జూనియర్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటర్లకు ఇబ్బందులు రానీయొద్దు
రెబ్బెన(ఆసిఫాబాద్): పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు రానీయొద్దని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. రెబ్బెన మండలం ఖైరిగాంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, విద్యుత్ సౌకర్యంతోపాటు ర్యాంపు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం పరిశీలనకాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం అంకుశాపూర్లోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం రాత్రి అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, అధికారులు ఉన్నారు. -
కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా కుష్ఠు వ్యాధి నిర్మూలన నోడల్ అధికారి ఇస్లావత్ శ్యాంలాల్, మండల వైద్యాధికారి వినయ్ ఉప్రే అన్నారు. ‘కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య, ఆశ కార్యక్తలకు శిక్షణ అందించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. రెండేళ్ల పైబడిన వారందరికీ భౌతిక పరీక్షలు నిర్వహించి, అనుమానితుల జాబి తా తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి పెందుర్ రవిదాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడే తుది ఫలితం!
ఆసిఫాబాద్: పంచాయతీ పోరు తుదిదశకు చేరింది. మూడో విడతలో భాగంగా ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్ మండలాల్లో బుధవారం ఎన్నికలు ని ర్వహించనున్నా రు. పోలింగ్ అ నంతరం కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నా లుగు మండలాల్లో 108 పంచా యతీలు, 938 వార్డు స్థానాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడ పంచాయతీలో రిజర్వేషన్ ఎస్సీ, రహపల్లిలో ఎస్టీకి కేటాయించారు. ఆ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో అక్కడ సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించడం లేదు. కాగజ్నగర్ మండలంల చింతగూడ, రేగులగూడ పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. ప్రస్తుతం 104 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 377 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 938 వార్డుల్లో 186 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎనిమిది స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 744 వార్డు స్థానాలకు 2,098 మంది పోటీ పడుతున్నారు. 938 పోలింగ్ కేంద్రాలునాలుగు మండలాల పరిధిలో 1,22,249 మంది ఓటర్లు ఉండగా, వీరీలో 61,282 మంది పురుషులు, 61,141 మంది మహిళలు, ఆరుగురు ఇతరులు ఉన్నారు. ఎన్నికల కోసం మొత్తం 938 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం 1,079 మంది పీవోలు, 1,241 మంది ఓపీవోలను కేటాయించగా, 795 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. మంగళవారం సాయంత్రం నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది సామగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సామగ్రి పంపిణీని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ పర్యవేక్షించగా, రెబ్బెనలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్లో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పర్యవేక్షించారు. గెలుపు కోసం పాట్లుపంచాయతీ ఎన్నికల్లో గెలుపుకోసం అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు. మొదటి, రెండో విడతల్లో అభ్యర్థులు భారీగా ఖర్చు చేసినా పలుచోట్ల గెలుపు వరించలేదు. దీంతో మూడోవిడతలో పోటీలో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. గెలిస్తే చేపట్టే అభివృద్ధి పనులపై హామీలు కురిపించడంతోపాటు కరపత్రాల్లో వివరాలు ప్రచురించారు. గ్రామాల్లో మద్యం, విందులతో ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు సాగించినా ఫలితం ఎలా ఉంటుందో తెలియక మదనపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల పైగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.సామగ్రితో పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న సిబ్బందిపోలింగ్ ప్రక్రియ ఇలా..కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: ఉద యం 6.45 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తారు. వార్డు సభ్యుడు, సర్పంచ్గా పోటీ చేసే వారి తరఫున ఒక్కో ఏజెంట్ను అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాలి. వార్డు సభ్యులకు తెల్లరంగు బ్యాలెట్, సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ కేటాయించారు. బ్యాలెట్లో సీరియల్ నంబర్, అభ్యర్థుల గుర్తులే ఉంటాయి. పోలింగ్ కేంద్రం బయట అతికించే పోస్టర్లో అభ్యర్థి పేరు, గుర్తు ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు బ్యాలెట్ బాక్స్ సీల్ చేసి లెక్కింపు జరిగే ప్రాంగణానికి తరలిస్తారు. ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రంలోకి చేరుకుని క్యూలైన్లో ఉండేవారికి అధికారులు టోకెన్లు జారీ చేసి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు. మండలాల వారీగా ఓటర్లు, ఎన్నికల అధికారులు, పోలింగ్ కేంద్రాలుమండలం మొత్తం ఓటర్లు పోలింగ్ పీవోలు ఓపీవోలు ఆసిఫాబాద్ 27 30,135 236 270 284 కాగజ్నగర్ 28 45,242 266 307 406 రెబ్బెన 24 28,724 214 247 294 తిర్యాణి 29 18,148 222 255 257 మొత్తం 108 1,22,249 938 1,079 1,241 ఆసిఫాబాద్ ఎంపీడీవో కార్యాలయంలోని పంపిణీ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది -
ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు
ఆసిఫాబాద్అర్బన్: మూడో విడత ఎన్నికలు జరిగే మండల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మంగళవారం పోలీసు బాంబు డిస్పోజ ల్ టీం, డాగ్స్క్వాడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాలు, రూట్ మ్యాపులు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు, వంతెనలు, బస్టాండ్లు, ప్రవేశ ద్వారాలను పరిశీలించారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ టీమ్స్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
విద్యార్థులకు వసతుల కల్పన
ఆసిఫాబాద్రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థులకు సకల వసతులు కల్పించి, నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో వంటశా ల, సామగ్రి నిల్వ చేసే గదులు, పరిసరాలను మంగళవారం పరిశీలించారు. ఆయన మా ట్లాడుతూ మెనూ ప్రకారం రుచికరమైన ఆహా రం అందించేందుకు తాజా కూరగాయలు, నిత్యావసరాలు వినియోగించాలని సూచించారు. వంట సరుకులు నిల్వ ఉంచే గదులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తిచేసి, వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆదేశించారు. -
తుది విడతకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్: తుది విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నిక ల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. సామగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ బుధవా రం నాలుగు మండలాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ డేవిడ్, తహసీల్దార్ రియాజ్ అలీ ఉన్నారు. -
‘తొలి’ అవకాశం ఎవరికో..?
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ నుంచి విడిపోయి నూతన పంచాయతీ రాజంపేటలో తొలి సర్పంచ్ అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పంచాయతీలో సర్పంచ్ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేయగా, 10 వార్డులో ఐదు ఎస్టీలు, ఐదు జనరల్కు కేటాయించారు. ఇక్కడ 1,964 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి విడిపోయి..1913 నుంచి 1940 వరకు ఆసిఫాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా కొనసాగింది. ఆ తర్వాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్కు తరలిపోగా, ఆసిఫాబాద్ 1961 వరకు పురపాలక కేంద్రంగా ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆసిఫాబాద్ కేంద్రంగా కుమురంభీం పేరుతో జిల్లా ఏర్పడింది. కాగజ్నగర్ పట్టణం మున్సిపాలిటీగా మారగా, ఆసిఫాబాద్ పట్టణాన్ని మేజర్ పంచాయతీగా మార్చారు. 2019 ఆగస్టు 2న ఆసిఫాబాద్ను నూతన మున్సిపాలిటీగా ప్రకటించారు. కానీ ఏజెన్సీ గ్రామం రాజంపేట్ కలిసి ఉండటంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 3న రాజంపేటను నూతన పంచాయతీగా.. ఆసిఫాబాద్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. తీవ్రంగా పోటీరాజంపేట పంచాయతీలో సర్పంచ్ స్థానం కోసం పోటాపోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి విశ్రాంత ఎంఈవో నాంపెల్లి శంకర్, బీఆర్ఎస్ నుంచి తుడుందెబ్బ నాయకుడు బుర్స పోచయ్య, బీజేపీ నుంచి ఆదివాసీ నాయకుడు మడావి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. 2012 నుంచి ప్రత్యేక పాలన కొనసాగుతుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ఓటువేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. పంచాయతీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి విడిపోయిన రాజంపేటకు నూతన పంచాయతీ అవకాశం వచ్చింది. కొత్త సర్పంచ్ పంచాయతీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలి. – బొట్టుపల్లి ప్రశాంత్, రాజంపేట ఉత్సాహంగా ఉన్నాం సొంత పంచాయతీలో ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నాం. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరించే విధంగా నూతన సర్పంచ్ పాలన కొనసాగించాలి. – చెన్నూరి శ్రీనివాస్, రాజంపేట -
ఓపీఎస్లకు కష్టకాలం!
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పాలనను చక్కదిద్దడంతోపాటు గ్రామాల పరిశుభ్రత, ప్రజలకు తాగునీటి సరఫరా వంటి పనులు సాఫీగా సాగాలంటే పంచాయతీ కార్యదర్శి కీలకం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. గ్రామపాలన సజావుగా సాగేలా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు కష్టకాలంలో ఉన్నారు. నెలలు గడుస్తున్నా చేతికి వేతనాలు అందకపోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ వైపు పంచాయతీ ఖజానాల్లో చిల్లిగవ్వ లేక, మరోవైపు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో పడరాని పాట్లుపడుతున్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు వడ్డీలకు అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. రె గ్యులర్ కార్యదర్శులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా.. వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతినెలా 1న వేతనా లు అందిస్తుండగా, ఔట్సోర్సింగ్ కార్యదర్శులకు మాత్రం ఎనిమిది నెలలుగా పెండింగ్ ఉన్నాయి. ఉత్తర్వుల జారీలో జాప్యంరాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పాలన సాఫీగా సాగించేందుకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించింది. కొన్నేళ్లుగా వారి సేవలను కొనసాగిస్తూ.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. ఈ పద్ధతిలో జిల్లాలో సుమారు 64 మంది ఓపీఎస్లు పనిచేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వీసు కొనసాగింపు ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఇది ఓపీఎస్ల పాలిటశాపంగా మారింది. వేతనాల చెల్లింపు బడ్డెట్ విడుదల అయినా సర్వీస్ కొనసాగింపు ఉత్తర్వులు రాని కారణంగా ట్రెజరీ అధికారులు వేతనాలు చెల్లించేందుకు నిరాకరించారు. నెలల తరబడి వేతనాల ఫైల్ ట్రెజరీలోనే ఉండిపోయింది. ఎట్టకేలకు ప్రభుత్వం సర్వీస్ కొనసాగింపు ఉత్తర్వులు విడుదల చేసినా.. ఓపీఎస్లకు ప్రస్తుతం వేతనాలు అందించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఔట్సోర్సింగ్ విధానంలో వేలాది మంది బోగస్ ఉద్యోగుల పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారిని ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. ఉద్యోగుల ఆధార్కార్డును ఐడీకి అనుసంధానం చేసింది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్యదర్శులకు ప్రత్యేక ఎంప్లాయ్ ఐడీ లేకపోవడంతో ట్రెజరీలో వీరికి వేతనాలు చెల్లించడం సాధ్యం కావడం లేదు. వేతనాల చెల్లింపు కోసం అధికారులు సాఫ్ట్వేర్లో వివరాలను నమోదు చేసే క్రమంలో ఎంప్లాయ్ ఐడీ అడుగుతోంది. దీంతో అందుబాటులో బడ్జెట్ ఉన్నా వేతనాలు అందుకోని పరిస్థితిలో ఓపీఎస్లు ఉన్నారు.ఎన్నికల వేళ పరేషాన్..రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా.. మూడో విడత బుధవారం నిర్వహించనున్నారు. ఈ సమయంలో పంచాయతీ ఎ న్నికల నిర్వహణ ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కార్యదర్శులపైనే పడుతోంది. నిధులు లేకపోవడంతో సొంతంగా ఖర్చుచేస్తున్నారు. అయితే రెగ్యులర్ కార్యదర్శులకు ప్రభుత్వం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తుండటంతో వారికి కాస్త ఊరట లభిస్తోంది. జీతంలో నుంచి ఎన్నికల నిర్వహణ ఖర్చులను భరిస్తున్నారు. కానీ ఓపీఎస్ల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. నెలల తరబడి వేతనాలు అందక కుటుంబ పోషణే భారంగా మారుతున్న తరుణంగా ఎన్నికల నిర్వహణ ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. ఎన్నికల సిబ్బంది, పోలీస్, పంచాయతీ సిబ్బందికి భోజనాలు, టీ ఖర్చులతోపాటు ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యం, సిబ్బంది భోజనాలు, ఇతర వసతుల కోసం ఒక్కో పంచాయతీలో కనీసంగా రూ.20వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఓపీఎస్లు అప్పులు చేసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు. -
పోటెత్తి.. ఓటేసిన పల్లెజనం
దహెగాం(సిర్పూర్): జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లె జనం పోటెత్తి ఓటువేశారు. దహెగాం, బెజ్జూర్, సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్ మండలాల్లో భారీగా పోలింగ్శాతం నమోదైంది. 1,31,278 మంది ఓటర్లకు 1,13,733 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 86.64 శాతం పోలింగ్ నమోదైంది. అ ధికారులు విస్తృతంగా అవగాహన క ల్పించడంతో పలు పంచాయతీల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. కేంద్రాలకు క్యూకట్టి..మొదటి విడత ఎన్నికలు జరిగిన గిరిజన పల్లెల్లో చలి ప్రభావంతో ఉదయం మందకొడిగా సాగింది. అయితే రెండో విడతకు మాత్రం ఉదయం నుంచే పలు కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఇక ఉదయం 9గంటల తర్వాత నుంచి భారీగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించ డం కూడా పోలింగ్కు పెరిగేందుకు కారణమైంది. అయితే పెరిగిన ఓటింగ్శాతం కొందరికి మేలు చేయగా, మరికొందరికి మాత్రం చేటు చేసింది. అత్యధికం దహెగాం.. అత్యల్పం బెజ్జూర్మండలాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా దహెగాంలో 90.44 శాతం పోలింగ్ నమోదైంది. పెంచికల్పేట్ 90.26 శాతం ఉండగా, అత్యల్పంగా బెజ్జూర్లో 83.70 శాతం నమోదైంది. -
బడి గంట @ 9:40
కౌటాల(సిర్పూర్): జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్లోపే నమోదవుతున్నాయి. దీనికి తోడు ఉదయం, రాత్రి వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పాఠశాలల పనివేళలు మార్చుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలోని విద్యార్థులకు చలి నుంచి కాస్త ఉపశమనం కలగనుంది. పనివేళలు ఇలా..కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి గ్రామీణ ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా మంచుతెరలు వీడటం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల పనివేళ్లల్లో మార్పులు చేస్తూ సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు ఉన్న పాఠశాలల సమాయాన్ని 40 నిమిషాలు పాటు పొడిగించారు. ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి మార్పు చేసిన పని వేళలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 690 ఉండగా, ప్రైవేట్ పాఠశాలలు 115 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 70,187 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉన్ని దుస్తులు, వాటర్ హీటర్లకు డిమాండ్..చలితీవ్రతకు జిల్లాలో ఉన్నిదుస్తులకు గిరాకీ పెరిగింది. వెచ్చదనం కోసం చద్దర్లు, స్వెటర్లు, మంకీ క్యాప్లు, హ్యాండ్ గ్లౌజులు, మఫ్లర్లు, సాక్సులు, కిడ్స్ స్వెట్టర్లు విత్ క్యాప్, షాత్ తదితర రకాల వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలకు సంబంధించిన వాటిని విస్తృతంగా అమ్ముతున్నారు. వినియోగదారుల అభిరుచికి తగిన రకాలను అందుబాటులో ఉంచారు. అలాగే ముఖం, చేతులు, ఇతర శరీర భాగాలు పొడిబారకుండా కోల్డ్క్రీమ్స్ వాడుతున్నారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లోని మార్కెట్లలో రూ.300 నుంచి రూ.2000 ధరకు స్వెటర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తక్కువ ధర కోసం ఎక్కువ మంది వార సంతలపై ఆధారపడుతున్నారు. మరోవైపు శీతా కాలంలో చన్నీటి స్నానాలకు ప్రజలు ఇష్టపడటం లేదు. ఎముకల కొరికే చలిలో వాటర్ ట్యాంకుల్లోని నిల్వ నీటితో ముఖం కడుక్కోవాలన్నా, కాళ్లు తడుపుకోవాలన్నా జంకుతున్నారు. దీంతో వాటర్ హీటర్లుకు డిమాండ్ పెరిగింది. రూ.1500 నుంచి రూ.5 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. స్టోరేజీ వాటర్ హీటర్లు మాత్రం 6 నుంచి 25 లీటర్ల పరిమాణం వరకు ఉండగా.. దాదాపు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు లభ్యమవుతున్నాయి. అప్రమత్తత ముఖ్యంచలికాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చర్మవ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇవి ప్రాణాంతకం కాకపోయినా చిరాకు, నొప్పులకు కారణమవుతా యి. అరికాళ్లు, పెదవులు పగలడం, చర్మం తెల్లగా పొడిబారినట్లుగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం బిరుసుగా మారుతుంది. కోల్డ్క్రీమ్లు వినియోగించడంతోపాటు నూనె ద్వారా ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, రాత్రిపూట స్వెటర్లు ధరిస్తే చర్మానికి రక్షణగా ఉంటుంది. ఐదేళ్లలోపు చిన్నారులు జలుబు, జ్వరం బాడిన పడే ప్రమాదం ఉంటుంది. ఈదురుగాలులు, పొగమంచు నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ఉదయం, రాత్రివేళల్లో బయట తిరగవద్దు, గర్బిణులు, బాలింతలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొనసాగుతున్న చలి తీవ్రత తిర్యాణి: జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత సిర్పూర్(యూ)లో 7.6 డిగ్రీ ల సెల్సియస్గా నమోదైంది. అలాగే జిల్లాలో ని తిర్యాణి మండలం గిన్నెధరిలో 8.0 డిగ్రీ లు, తిర్యాణిలో 9.1, వాంకిడి, ఆసిఫాబాద్లో 10.6, కెరమెరిలో 10.8, పెంచికల్పేట్లో 10.9, దహెగాంలో 11.1, బెజ్జూర్లో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: విశాఖపట్టణంలో డిసెంబర్ 21 నుంచి జనవరి 4 వరకు నిర్వహించే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెరిక శ్రీకాంత్ పిలుపునిచ్చా రు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పాత చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజు, ఆసిఫా బాద్ మున్సిపల్ యూనియన్ కార్యదర్శి తోట సమ్మయ్య, సభ్యులు నాగేశ్, జగ్గారావ్, దుర్గాప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
సాహు మహరాజ్కు నివాళి
వాంకిడి: రిజర్వేషన్ పితామహుడు, కోల్హాపూ ర్ సంస్థాన మొదటి మహరాజు సాహు మహరాజ్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారాలో సోమవారం నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పంచశీలలు ఆలపించా రు. అనంతరం బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశో క్ మహోల్కర్, మండల గౌరవాధ్యక్షుడు ఉప్రె జైరాం, ఎస్ఎస్డీ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్ మాట్లాడుతూ.. బీఆర్ అంబేడ్కర్ ఉన్నత విద్యకు సాహు మహరాజ్ ఆర్థికసాయాన్ని అందించారని గుర్తు చేశారు. నా యకులు శ్యామ్రావు, ప్రతాప్, రమేశ్, వివేక్, సురేశ్, నూతన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సామగ్రి తరలింపు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మండలంలో ఈ నెల 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రిని సోమవారం రాత్రి పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్లో తరలించారు. 28 పంచాయతీలకు సంబంధించిన సామగ్రిని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల అధికారులు డిస్ట్రిబ్యూషన్ పాయింట్కు వచ్చి సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. సామగ్రి తరలింపు ప్రక్రియను ఎంపీడీవో ఉజ్వల్కుమార్, ఎంపీవో గౌరీశంకర్ పర్యవేక్షించారు. -
మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్అర్బన్: మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మూడో విడత ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఫేజ్–2 ఆర్వోలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని, మొదట మారుమూల పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించాలని ఆదేశించారు. కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ వేగవంతంగా జరిగేలా చూడాలని, ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సామగ్రి సక్రమంగా పంపిణీ చేయాలి
ఆసిఫాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల సామగ్రి సక్రమంగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సోమవారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్తో కలిసి పరిశీలించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది మంగళవారం నిర్దేశిత సమయానికి తమకు కేటాయంచిన సామగ్రితో పంపిణీ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించిన సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్, పోలీసు సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తామని తెలిపారు. -
తుదిపోరుకు సంసిద్ధం
ఆసిఫాబాద్: తొలి, మలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా ముగియడంతో అధికార యంత్రాంగం తుది విడత పోలింగ్కు సంసిద్ధమైంది. ఈ నెల 17న ఆసిఫాబాద్, కాగజ్నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో ఆయా ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంతోపాటు కాగజ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెబ్బెనలోని కె గార్డెన్, తిర్యాణి ఎంపీడీవో కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు 27 రూట్లు 27 జోన్లు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్లో ఏడు జోన్లు, కాగజ్నగర్ 8, రెబ్బెన 6, తిర్యాణిలో 6 జోన్లు ఉన్నాయి. 104 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలునాలుగు మండలాల్లోని 108 పంచాయతీల్లో రెండోచోట్ల రిజర్వేషన్లు కలిసిరాక నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 104 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక 938 వార్డు స్థానాలకు 186 ఏకగ్రీవం కాగా, 8 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 744 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు మండలాల్లో 1,22,249 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 938 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 1079 మంది పీవోలు, 1241 ఓపీవోలను విధులు కేటాయించారు. ముగిసిన ప్రచారం.. ప్రలోభాలపై దృష్టిమూడో విడత ఎన్నికల ప్రచారం సోమవారం సా యంత్రం 5 గంటలకు ముగిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోపు గుంపులుగా ఉండరాదు. ప్ర చార పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాల పై దృష్టి సారించారు. ఎలాగైనా విజయం సాధించా లని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. విందులు, మద్యం, డబ్బుతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని రాజంపేట, గుండి, బూర్గుడతోపాటు కాగజ్నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లోని మేజర్ పంచాయతీల్లో పోటీ అధికంగా ఉంది. ప్రధాన పార్టీలకు సవాల్పంచాయతీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాల్గా మారాయి. తొలి, మలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు బీజేపీ మద్దతుదారులు పో టాపోటీగా విజయం సాధించారు. అన్నిపార్టీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కాయి. దీంతో మూడో విడతలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, ఎమ్మెల్సీ దండె విఠల్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇప్పటికే పల్లెలు చుట్టేశారు. చివరిరోజు కూడా ముమ్మరంగా ప్రచారం చేశారు. అలాగే ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కాగజ్నగర్ మండలంలోని పంచాయతీల్లో పట్టు నిలుపుకొనేందుకు యత్నిస్తున్నా రు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, అరిగెల నాగేశ్వర్రావు, కోట్నాక విజయ్, కేసరి ఆంజనేయులుగౌడ్తో పాటు పార్టీ ప్రముఖులు మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.అందరి దృష్టి రాజంపేటపైనే..ఆసిఫాబాద్ మండలంలో కొత్తగా ఏర్పడిన రాజంపేట పంచాయతీలో ప్రధాన పార్టీల మద్దతుదారులు రంగంలోకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి విడిపోయిన ఏజెన్సీ పంచాయతీ రాజంపేటలో కాంగ్రెస్ నుంచి విశ్రాంత ఎంఈవో నాంపెల్లి శంకర్, బీఆర్ఎస్ నుంచి తుడుందెబ్బ నాయకుడు బుర్స పోచయ్య, బీజేపీ నుంచి ఆదివాసీ నాయకుడు మడావి శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. నువ్వానేనా అంటూ పోటీ పడుతూ ప్రచారం చేశారు. ఇక్కడ 1900 పైచిలుకు ఓటర్లు ఉన్నాయి. 17న సెలవుఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థాని క, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సోమవారం తెలి పారు. ఓటుహక్కు వినియోగించుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అత్యవసరానికి లోబడి కార్యాలయానికి ఆలస్యంగా హాజరుకావడం, త్వరగా వెళ్లడం, తక్కువ వ్యవధి గైర్హాజరును వినియోగించుకోవచ్చన్నారు. ఎన్నికల కోసం వినియోగించే ప్రజాభవనాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాలకు సైతం సెలవు ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార, పరిశ్రమ యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆయన సూచించారు. మూడోవిడత ఎన్నికలు జరిగే పంచాయతీలు మండలం జీపీలు ఏకగ్రీవం బరిలో ఉన్నవారు వార్డులు ఏకగ్రీవం బరిలో ఉన్నవారు ఆసిఫాబాద్ 27 – 82 236 38 547 కాగజ్నగర్ 28 02 115 266 30 686 రెబ్బెన 24 – 89 214 26 509 తిర్యాణి 29 – 91 222 92 356 మొత్తం 108 02 377 938 186 2,098 -
ప్రశాంతంగా రెండోవిడత ఎన్నికలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా ఆదివారం ఎస్పీ నితిక పంత్, ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్ తో కలిసి ఎన్నికల సరళిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా జరిగిందన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామని పేర్కొన్నారు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో వాకీటాకీ ద్వారా పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అత్యధిక స్థానాలు బీఆర్ఎస్వే..
చింతలమానెపల్లి(సిర్పూర్): రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. ఆరు మండలాల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు సత్తా చాటగా, కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారు చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించారు. ఎవరూ ఊహించని విధంగా స్వతంత్రులు సైతం విజయ బావుట ఎగురవేశారు. ఏ పార్టీల నుంచి మద్దతు లేకున్నా స్థానికంగా వారికి ఉన్న పలుకుబడితో ఓటర్లు పట్టం కట్టారు. చింతలమానెపల్లి మండలంలో ఏకంగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఈ మండలంలో కాంగ్రెస్కు ఐదు స్థానాలు, బీఆర్ఎస్కు ఆరు, బీజేపీ ఒకస్థానం దక్కించుకోగా.. ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఆయా మండలాల్లో 20కి పైగా స్థానాల్లో సత్తా చాటారు. మరోవైపు గెలుపొందిన స్వతంత్ర సర్పంచులను పార్టీల్లోకి చేర్చుకునే ప్రయత్నాలను ప్రధాన పార్టీలు మొదలుపెట్టాయి. దూసుకెళ్లిన కారురెండో విడత ఎన్నికల్లో చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, బెజ్జూర్, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లో మొత్తం 113 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 25 మంది విజయం సాధించారు. బీఆర్ఎస్లో రెండు వర్గాలు పోటీ చేశాయి. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తోపాటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో పార్టీ మద్దతుదారులు ఏకంగా 43 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థుల తరుఫున ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు రంగంలోకి దిగి పల్లెల్లో ప్రచారం చేశారు. ఆ పార్టీ నుంచి 24 మంది గెలిచారు. బెజ్జూర్, కౌటాల మండలాల్లో ఎక్కువగా బీఆర్ఎస్ హవా కనిపించింది. కౌటాల మండలం వీరవెల్లిలో లక్కీడ్రా నిర్వహించగా కావేరి విజయం సాధించారు. పంచాయతీలోని ఎనిమిది వార్డుల్లో 532మంది ఓటర్లు ఉన్నారు. 485 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ బలపర్చిన రజినికాంత్కు 204 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి లక్కీడ్రా ద్వారా ఎన్నిక నిర్వహించగా, కావేరిని అదృష్టం వరించింది. కాగా, దహెగాం మండలం బీబ్రా పంచాయతీ, సిర్పూర్(టి), కౌటాల పంచాయతీల్లో అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. రీకౌంటింగ్ చేపట్టాలని ఆందోళనకౌటాల(సిర్పూర్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కౌటాల మండలం ముత్తంపేటలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ అనంతరం రాంటెంకి ఉష 22 ఓట్లతో తన సమీప అభ్యర్థి డోంగ్రి సరోజపై విజయం సాధించారు. అభ్యంతరం తెలిపిన డోంగ్రి సరోజ వర్గీయులు రీకౌంటింగ్ చేపట్టాలంటూ ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. అప్పటికే సిబ్బంది ప్రక్రియ ముగించుకుని వెళ్తుండగా.. వారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక సీఐ సంతోష్కుమార్ ఘటన స్థలానికి చేరుకు న్నారు. వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో విజేతలకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందించారు. గెలిచిన సర్పంచుల వివరాలుమండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్రులు బెజ్జూర్ 22 1 15 2 4 చింతలమానెపల్లి 19 5 6 1 7 దహెగాం 23 7 4 8 4 కౌటాల 20 5 11 0 4 పెంచికల్పేట్ 12 3 4 5 0 సిర్పూర్(టి) 16 4 3 5 4 -
ప్రశాంతంగా పోలింగ్
చింతలమానెపల్లి(సిర్పూర్): రెండో విడత ఎన్నికల ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదివారం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం చలి తీవ్రతతో కొంత నెమ్మదిగా సాగినా.. ఆ తర్వాత ఓటర్లు కేంద్రాలకు పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అన్ని మండలాల్లో పోలింగ్ 80 శాతం దాటింది. జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో వంద మీటర్లు, 200 మీటర్ల పరిధిని విధించి ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా బందోబస్తు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లు, కెమెరాలను అనుమతించలేదు. 86.64 శాతం పోలింగ్రెండో విడతలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 113 పంచాయతీలు, 992 వార్డులు ఉండగా.. ఒక సర్పంచ్ స్థానం, 144 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 112 పంచాయతీల్లో 438 మంది సర్పంచ్ అభ్యర్థులు, 848 వార్డు సభ్యుల స్థానాలకు 2,209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,31,278 మంది ఓటర్లకు 1,13,733 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 86.64 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పెంచికల్పేట్ మండలంలోని షెడ్వాయి, బొంబాయిగూడ పంచాయితీల్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు. పోలింగ్ తీరు.. ఆరు మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. అత్యధికంగా పెంచికల్పేట్ మండలంలో 90.26 పోలింగ్శాతం నమోదుకాగా, అత్యల్పంగా బెజ్జూర్ మండలంలో 83.70 శాతం నమోదైంది. కౌటాలలో 84.94శాతం, సిర్పూర్(టి)లో 85.43, చింతలమానెపల్లిలో 87.20శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 79.81శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో 86.64శాతం నమోదైంది. అత్యధిక పోలింగ్ నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చింతలమానెపల్లి మండలం రణవెల్లిలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిద్దేశ్వర్ అస్వస్థతకు గురికాగా సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాత్రివరకు లెక్కింపుమేజర్ పంచాయతీల్లో ఓట్లలెక్కింపు రాత్రి వరకూ కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకే పోలింగ్ ముగిసినా ఓట్లు, వార్డులు ఎక్కువగా ఉన్న చోట లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టింది. ప్రతీ మండంలో సుమారుగా ఐదు నుంచి ఎనిమిది పంచాయతీల్లో ఫలితాలు సాయంత్రం ఆరు గంటల తర్వాతే వెల్లడించారు. గత ఎన్నికల అనుభవాలతో అధికారులు దీనికి అనుగుణంగా లైటింగ్ సదుపాయం కల్పించారు. -
ఓటు మరువని వృద్ధులు
దహెగాం/చింతలమానెపల్లి: ఎన్నికల్లో వృద్ధులు ఓటుహక్కు వినియోగించుకుని బాధ్యత చాటుకున్నారు. మలి వయస్సులోనూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దహెగాం మండలం ఇట్యాలలో గొర్రెగుట్టకు చెందిన రసూల్బీ అనే 105 ఏళ్ల వృద్ధురాలికి ఓటువేయడానికి పోలీసులు సహకరించారు. బీబ్రాలో శతాధిక వృద్ధురాలు ఓటు వేశారు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ –2లో 95 ఏళ్ల దామిని గైన్ ఓటు వేశారు. ర్యాంపులు లేక దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు.బీబ్రాలో శతాధిక వృద్ధురాలిని తీసుకువస్తున్న పోలీసులుగూడెంలో ర్యాంప్ లేక వృద్ధురాలికి ఇబ్బందులు ఓటు వేసిన 95 ఏళ్ల దామిని గైన్ఓటు వేసేందుకు వెళ్తున్న వృద్ధురాలుఇట్యాలలో ఓటు వేసిన 105 ఏళ్ల రసూల్ బీరవీంద్రనగర్– 2లో వృద్ధురాలిని తీసుకెళ్తున్న యువకులు -
‘సమస్యల పరిష్కారానికి కృషి’
కెరమెరి(జైనూర్): గ్రామాల్లోని సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని డీసీ సీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నరు. జైనూర్ మండలం జెండాగూడలో నూతనంగా ఎన్నిౖకైన సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలతో ఆది వారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సమస్యలు, ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి తోడ్పాటునందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తుందని పేర్కొన్నారు. అవసరమైన గ్రామాలకు సీఎంతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. జెండాగూడ, రాసిమెట్ట, భూసిమెట్ట, సిర్పూర్(యూ)మండలంలోని ధన్నూర్ పంచాయతీ సర్పంచులు ఉయిక సంజీవ్, పి.చందన్శావ్, చందు, దుర్వ సింధు, స్పందనను సత్కరించారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, నాయకులు ముఖీద్, శ్రీనివాస్, ప్రకాశ్, మహేశ్, సిద్దు తదితరులు పాల్గొన్నారు. -
వేతన వెతలు..!
సకాలంలో చెల్లించాలి ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ప్రతినెలా 1న సకాలంలో వేతనాలు విడుదల చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య, ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నాం. ప్రభుత్వాలు మారుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. – మధుకర్, కాంటిజెంట్ వర్కర్, దహెగాం హామీలు అమలు చేయాలి ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. – ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) స్కీం పరిధిలో పనిచేస్తున్న డాటా ఎంట్రీ, కాంటిజెంట్, సహాయ సిబ్బంది, ఎకౌంటెంట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. సుమారు 60 మంది జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా విధులునేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) స్కీం కింద వివిధ విభాగాల్లో 20 ఏళ్లుగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రతినెలా వేతనాలను చెల్లించాలని కోరుతున్నారు. అలాగే మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. -
తుది విడత ప్రచారానికి నేడు తెర
ఆసిఫాబాద్రూరల్: తుదివిడత ఎన్నికల ప్రచారాని కి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17న ఆసిఫాబాద్, కాగజ్నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 108 జీపీలు ఉండగా, కాగజ్నగర్లో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 106 స్థానాలకు 377 మంది బరిలో నిలిచారు. 938 వా ర్డు స్థానాలకు 186 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగి లిన స్థానాల్లో 2,098 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగజ్నగర్ మండలాల్లో 26 సర్పంచ్ స్థానాలకు 115 మంది అభ్యర్థులు, ఆసిఫా బాద్లో 27 స్థానాలకు 82 మంది, రెబ్బెనలో 24 స్థానాలకు 89 మంది, తిర్యాణిలో 29 సర్పంచ్ స్థానాలకు 91 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు మద్యం, డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
సుద్దాలలో 14 మంది, బుద్దారంలో నలుగురు
చెన్నూర్రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని సుద్దాల గ్రామ పంచాయతీ సర్పంచ్ రి జర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించగా 14 మంది అభ్యర్థులు బరిలో ఉ న్నారు. 1,689 ఓటర్లకు గానూ 832 మంది పురుషులు, 857 మంది మహిళలు ఉన్నారు. కిష్టంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కాగా తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,029 మంది ఓటర్లకు గానూ 1,467 మంది పురుషులు, 1,562 మంది మహిళలు ఉన్నా రు. గంగారం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వుకాగా తొమ్మిది మంది బరిలో ఉన్నారు. 1,162 మంది ఓటర్లకుగానూ 578 మంది పురుషులు, 584 మంది మహిళలు ఉన్నారు. దుగ్నెపల్లి సర్పంచ్ ఎస్సీ జనరల్ రిజర్వుకాగా ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,556 మంది ఓటర్లకుగానూ 752 మంది పురుషులు, 804 మంది మహిళలు ఉన్నారు. అతిచిన్న పంచాయతీ బరిలో నలుగురు అతి చిన్న గ్రామ పంచాయతీ అయిన బుద్దారం స ర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వుకాగా నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 271 మంది ఓటర్లకుగానూ 134 మంది పురుషులు, 137 మంది మహిళలు ఉన్నారు.ఆయా పంచాయతీల్లో సర్పంచ్ పదవి ఎవరిని వరించనుందో? వేచి చూడాల్సిందే.లక్ష్మణచాంద: గత ఎన్నికల్లో మండలంలోని రాచాపూర్ గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసిన భూషి ముత్యం ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించాడు. గతంలో తాను గ్రామస్తులకు చేసిన సేవతోనే ఈసారి సర్పంచ్గా తనకు అవకాశం కల్పించారని, గ్రామాభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొంటున్నాడు.నాడు ఉపసర్పంచ్..నేడు సర్పంచ్ -
అన్నీ జనరల్ స్థానాలే..!
చింతలమానెపల్లి(సిర్పూర్): గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై పెద్దఎత్తున చర్చ సాగింది. ప్రభుత్వం బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినా.. మళ్లీ కోర్టు ఆదేశాలతో పాత పద్ధతిలోనే పంచాయ తీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో ఏళ్లుగా ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. అక్కడ పూర్తిగా జనరల్ స్థా నాలు ఉండటం గమనార్హం. సాధారణంగా కులాల ప్రాతిపదికన, రోస్టర్ పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. పూర్తి గా గిరిజన ఆదివాసీలు నివాసం ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని స్థానాలను వారికే కేటాయిస్తారు. అయితే జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో భిన్న వర్గాల ప్రజలతో భిన్న సంస్కృతి ఉంది. బెంగాలీ లు, మరాఠీలు, మార్వాడీలు, సిక్కు ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. 1950వ దశకంలో బెంగాల్ రాష్ట్ర విభజన జరిగింది. లక్షలాది మంది సంఖ్యలో బెంగాలీలు నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వం సిర్పూర్ నియోజకవర్గంలోని ఈస్గాం, చింతలమానెపల్లి మండలంలోని బాబాపూర్, సిర్పూర్(టి) సమీపంలో వారికి ఆశ్రయం కల్పించింది. అనంతరం వీరికి ఇళ్ల స్థలాలు, ఉపాధికి వ్యవసాయానికి ఐదెకరాల పంట భూమిని కేటాయించింది. వీరు ఉన్న ప్రాంతాలు క్రమంగా రవీంద్రనగర్– 1, రవీంద్రనగర్– 2, నజృల్నగర్, దుర్గానగర్, రాంనగర్ పంచాయితీలుగా ఏర్పడ్డాయి. ఈస్గాం, సిర్పూర్(టి)లో బెంగాలీలు ఉన్నప్పటికీ వారు వార్డులకే పరిమితమయ్యారు. కుల గుర్తింపు లేకపోవడంతో..బెంగాలీలు నివాసం ఉండే ప్రాంతాలన్నీ ఎలాంటి రిజర్వేషన్ లేకుండా జనరల్కు కేటాయించారు. జనరల్ మహిళ లేదా పురుషులు ఈ స్థానాల నుంచి పోటీ చేయవచ్చు. బెంగాలీలకు కుల గుర్తింపు లేకపోవడమే దీనికి కారణం. 15 సంవత్సరాల క్రితం రవీంద్రనగర్కు చెందిన కొందరు ఎస్సీ ధ్రువీకరణపై పోటీ చేసి సహకార బ్యాంకు కార్యవర్గానికి ఎంపికయ్యారు. అనంతరం వీరికి కుల గుర్తింపును ప్రభుత్వం ఇవ్వడం లేదు. పదేళ్ల క్రితం రవీంద్రనగర్ ఎంపీటీసీ స్థానాన్ని బీసీలకు కేటాయించగా అక్కడ ఎన్నికలను బహిష్కరించారు. ఇక్కడ బీసీలు ఎవరూ లేకపోయినా రోస్టర్ పద్ధతిలో ఎంపీటీసీ స్థానం బీసీలకు వెళ్లింది. బెంగాలీలలో అన్నివర్గాల ప్రజలు ఉన్నారని తమకు అన్నిరకాల కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఏళ్లు వారు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకుంటున్నారు.కుల ధ్రువీకరణ పత్రాల్లేక..కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో బెంగాలీలు నివాసం ఉండే ప్రాంతాలను జనరల్స్థానాలగా రిజర్వ్ చేస్తున్నారు. కాగజ్నగర్ మండలం దుర్గానగర్లో సర్పంచ్, 12 వార్డు సభ్యులు, నజృల్నగర్లో సర్పంచ్, 10 వార్డు సభ్యులు, రాంనగర్లో సర్పంచ్, 10 వార్డు సభ్యులు, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్– 1లో సర్పంచ్, 8 వార్డులు, రవీంద్రనగర్– 2లో సర్పంచ్, 8వార్డులు అన్నీ జనరల్ స్థానాలకు రిజర్వేషన్ అయ్యాయి. ఇక్కడ అంతా బెంగాలీలే నివాసం ఉంటున్నారు. సిర్పూర్(టి) గ్రామ పంచాయితీలో బెంగాలీ లు నివాసం ఉండే రెండు వార్డులు సైతం జనరల్కు కేటాయించారు. సిర్పూర్ నియోజకవర్గంలో మొత్తంగా బెంగాళీల నివాసం ఉండే ప్రాంతాల్లో ఐదు సర్పంచులు, 50 వార్డు స భ్యుల స్థానాలు జనరల్కు కేటాయించారు. -
‘టెంట్హౌస్’ పోలింగ్ కేంద్రాలు
రంగు రంగుల వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసిన ఇది మోడల్ పోలింగ్ కేంద్రం అనుకుంటే పొరపాటే. పక్కా భవనాలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణ కోసం తాత్కాలిక ఏర్పాటు ఇది. చింతలమానెపల్లి మండలం రణవెల్లి పంచాయతీలో ఇలా తాత్కాలికంగా టెంట్హౌస్ సామగ్రితో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. చింతలమానెపల్లి/కౌటాల: ఐదేళ్లకోసారి నిర్వహించే ఓట్ల పండుగకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేసి, ఓటర్లకు వసతులు కల్పించాల్సి ఉంది. అయితే రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే పలు ప్రాంతాల్లో పక్కా భవనాలు అందుబాటులో లేక అ ధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. కౌటా ల మండలం వీరవెల్లి పంచాయతీలో టెంట్ కింద పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 8 వార్డులో 532 ఓటర్లు ఉన్నారు. పంచాయతీ భవ నం నిర్మాణం పూర్తికాకపోవడంతో పాటు ప్రాథమిక పాఠశాలకు ఒకే భవనం ఉంది. పాఠశాల భవనంలో 4 వార్డులు, పాఠశాల ఆవరణలో టెంట్ కింద నాలుగు వార్డులకు ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సిబ్బంది ఉండేందుకు సైతం టెంట్లోనే ఏర్పాట్లు చేయడంతో.. ఆదివారం సాయంత్రం వచ్చినవారు చలికి ఇబ్బంది పడ్డారు. మోడల్ కేంద్రాన్ని మరిపించేలా..చింతలమానెపల్లి మండలం రణవెల్లికి నూతన పంచాయతీ కార్యాల యం మంజూరైంది. జీపీ కార్యాలయాన్ని తాత్కాలి కంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోకి మార్చారు. అయితే ఆ స్కూల్ భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో నూతన నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఎన్నికల నిర్వహణకు పక్కా భవనం లేకుండా పోయింది. అధికారులు తాత్కాలికంగా ఇలా పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ఆదివారం ఇక్కడ 1,660 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత
బోథ్: జిల్లాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ నెల 11 నుంచి మొక్కజొన్న కొనుగోళ్లను నిలివేశారు. మార్కెట్యార్డులో ఇప్పటి వరకు నిల్వ ఉంచిన మొక్కజొన్నను మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు మార్క్ఫెడ్ ప్రకటించింది. అయితే ఇంటివద్ద మొక్కజొన్న పంట నిల్వ ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో ఉన్న పంట మాత్రమే కొనుగోళ్లు.. ప్రస్తుత రబీ సీజన్లో మొక్కజొన్న పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. సోయాబీన్ కొనుగోలు కేంద్రాల కంటే ముందే జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనథ్, భీంపూర్, నార్నూర్ మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 11 నుంచి కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. అలాట్మెంట్ పూర్తయినందున అధికారులు కొనుగోళ్లు చేపట్టడం లేదు. అయితే ఇప్పటికే మార్కెట్కు తీసుకువచ్చిన పంటను మాత్రమే కొంటామని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా మార్కెట్కు మొక్కజొన్నలు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. 23 వేల టన్నులు కొనుగోలు జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 8 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయా కేంద్రాల ద్వారా సుమారు 23 వేల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,400 చెల్లించి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఆకస్మిక మూసివేత నిర్ణయంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలను మూసివేస్తే, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తమకు దక్కకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుందని, దీనివల్ల భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు ప్రక్రియను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నారు. -
తనిఖీలు ముమ్మరం
దహెగాం మండలం ఐనం కల్వర్టు వద్ద.. ఒడ్డుగూడ వంతెన వద్ద తనిఖీలుబస్సుల్లేక.. నిరీక్షణరెండో విడత ఎన్నికల విధులు నిర్వహించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి కాగజ్నగర్ బస్టాండ్లో శనివారం నిరీక్షణ తప్పలేదు. ఎన్నికల కోసం వారంతా సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండల కేంద్రాలకు ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే బస్టాండ్లో బస్సులు లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. చివరికి ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. – కాగజ్నగర్టౌన్ -
రెండో విడతకు రెడీ
చింతలమానెపల్లి(సిర్పూర్): రెండో విడత పంచాయతీ సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల బరిలో నిలిచిన వారిలో విజేతలెవరో కొన్ని గంటల్లో తేలనుంది. ఆదివారం ఉదయం 7గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితలు వెల్లడించనున్నారు. ఆయా మండలాల్లో 113 పంచాయతీలు ఉండగా, సిర్పూర్(టి) మండలంలో భూపాలపట్నం ఏకగ్రీవమైంది. 112 పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలతోపాటు 992 వార్డుల్లో 144 ఏకగ్రీవం కాగా 848 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు మండలాల్లో 1,31,622 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 65,847 మంది పురుషులు, 65,708 మంది మహిళలు, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు సందడిగా మారాయి. సిబ్బంది, సామగ్రిని ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు. ఆసక్తికరంగా పోటీ..పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగియగా శనివారం గ్రామాలు ప్రశాంతంగా మారాయి. అభ్యర్థులు ఆర్భాటం లేకుండా శనివారం సైలంట్గా ప్రచారం చేశారు. మద్యం, డబ్బుల పంపిణీ జోరుగా సాగింది. దహెగాం మండలంలోని బీబ్రా గ్రామంలో చీరలు, మద్యం బాటిళ్లు పట్టుబడటం కలకలం సృష్టించింది. అయితే ఆరు మండలాలలోని కొన్నిస్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు స్వగ్రామం బెజ్జూర్ మండలం రెబ్బెన కాగా, ఇక్కడ ఆయన పట్టు నిలుపుకోవడంపై దృష్టి సారించారు. కాగజ్నగర్తోపాటు కౌటాల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసం ఉంది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనే దానిపై చర్చలు సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి స్వగ్రామం దహెగాం మండలం అత్తిని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం స్వగ్రామం చింతలమానెపల్లి మండలం డబ్బా, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి స్వగ్రామం చింతలమానెపల్లి మండలం బూరెపల్లిలో ప్రచారం హోరాహోరీగా ఇక్కడి స్థానాల్లో గెలుపోటములపై నియోజకవర్గ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అలాగే మేజర్ పంచాయతీలు, ఆదాయం ఉన్న జీపీల్లో గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. పటిష్ట బందోబస్తుఆసిఫాబాద్అర్బన్: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సిబ్బందితో బందోబస్తు చేపట్ట నుంది. ఆరు మండలాల్లో ఎన్నికల కోసం 1,124 మంది పీవోలు, 1,275 మంది ఓపీవోలను కేటా యించారు. రిటర్నింగ్ అధికారులు 40 మంది, రూ ట్ అధికారులు 40 మందితోపాటు 20 మంది జోన ల్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. మొ త్తం 2,499 మంది పోలింగ్ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఇప్పటికే వీరందరికీ శిక్షణ ఇచ్చారు. ప్ర శాంత వాతావరణంలో ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించడం, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ నితిక పంత్ పర్యవేక్షణ లో డీఎస్పీ, ఎనిమిది మంది సీఐలు, 23 మంది ఎ స్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 133 మంది, కానిస్టేబుళ్లు 326 మంది, హోంగార్డులు 70 మంది, సహాయకులు 197 మంది, స్పెషల్ పార్టీ పోలీస్లు 103 మందిని బందోబస్తుకు కేటాయించారు. ఓటు వేయాలంటే.. నడవాల్సిందేసిర్పూర్(టి): మండలంలోని పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓటర్లు పంచాయతీ కేంద్రాలకు కాలినడకన వచ్చి ఓటేయాల్సిన పరిస్థితినెలకొంది. చీలపెల్లి పంచాయతీ కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పూసిగూడ గ్రామం ఉంది. చీలపెల్లి గ్రామం నుంచి పూసిగూడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. వాహనాల రాకపోకలు కూడా సాధ్యం కాదు. పూసిగూడ ఓటర్లు రెండు వాగులను దాటి వచ్చి ఆదివారం ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మేడిపల్లి పంచాయతీ ఎన్నికలకు రావన్పల్లిలో పో లింగ్బూత్ ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీలోని మేడిపల్లి, లింబుగూడ గ్రామాల ప్రజలు ఓటు వేసేందుకు రావన్పల్లికి వెళ్లాల్సి ఉంది. రోడ్డు సౌకర్యం ఉన్నా వాహనాల సదుపా యం లేదు. ద్విచక్ర వాహనా లు, కాలినడకన రావాల్సి ఉంది. అచ్చెల్లి పంచాయతీ పరిధిలోని ఆరెగూడ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరికి కూడా సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అచ్చెల్లికి కాలినడకన, ద్విచక్రవాహనాలపై వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాతైన రోడ్డు మార్గాలు అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఎన్నికలు జరిగే పంచాయతీలు, బరిలో ఉన్న అభ్యర్థులు మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు సిర్పూర్(టి) 15 78 113 273 కౌటాల 20 85 155 461 చింతలమానెపల్లి 19 67 150 402 బెజ్జూర్ 22 83 158 416 పెంచికల్పేట్ 12 49 95 220 దహెగాం 24 76 187 437 మొత్తం 112 438 848 2,209 మండలాల వారీగా ఓటర్లు, ఎన్నికల సిబ్బందిమండలం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం పీవోలు ఓపీవోలు బెజ్జూర్ 11,685 12,047 2 23,734 214 229 చింతలమానెపల్లి 12,118 11,837 0 23,955 196 227 దహెగాం 11,014 11,077 1 22,092 224 244 కౌటాల 13,796 13,560 1 27,357 209 250 పెంచికల్పేట్ 6,218 6,084 0 12,302 118 117 సిర్పూర్–టి 11,016 11,163 3 22,182 163 208 మొత్తం 65,847 65,768 7 1,31,622 1,124 1,275 -
గల్ఫ్ చట్టాలపై అవగాహన ఉండాలి
ఖానాపూర్: గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లాలనుకునే ఆశావహులు అక్కడి చట్టాలు, పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, ఎన్ఆర్ఐ అడ్వైజరీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సింగిరెడ్డి నరేష్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తిమ్మాపూర్ పద్మశాలి సంఘ భవనంలో గల్ఫ్ వెళ్లేవారికి ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడి చట్టాలు, సంస్కృతి, పని విధానాలు, భద్రతా నిబంధనలు, వేతనాలు, ఒప్పందాల వివరాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంబసీల హెల్ప్లైన్ నంబర్లు, సహాయక సంస్థల సమాచారాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిండ్ల రాజయ్య, కోఆర్డినేటర్ కంటం రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7అసౌకర్యాల వారసంత సిర్పూర్(టి) బస్టాండ్ ప్రాంతంలో ప్రతీ శని వారం వారసంత నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయి. చలి ప్రభావం కొనసాగుతుంది. చల్ల గాలులు వీస్తాయి. నత్తనడకన ‘రైల్వే’ ఆధునికీకరణ బాసర రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 8లోu ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
ఓటు వేయలేదని బెదిరింపులు.. అనుచిత వ్యాఖ్యలు
ఇంద్రవెల్లి: ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఈ.సాయన్న తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కాంబ్లే అతీష్కుమార్ ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీచేసి ఓడిపోయాడు. ఈ నెల 12 రాత్రి వ్యాపారి ఠాకూర్ దీపక్సింగ్ షేకావత్కు ఫోన్చేసి తనకు ఓటు వేయలేదని, నీతోపాటు వ్యాపారులందరి సంగతి చూస్తానని, జేసీబీతో షాపులన్నీ కూల్చివేయిస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఇంద్రవెల్లి పటేల్ మారుతి డోంగ్రేపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీపక్సింగ్ షేకావత్ ఫిర్యాదు మేరకు అతిష్కుమార్పై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వ్యాఖ్యలకు నిరసనగా వ్యాపారులు మార్కెట్ బంద్ నిర్వహించారు. ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అతిష్కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివా రం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగి సింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో 6,192 మంది విద్యార్థులకు 4478 మంది(72.2 శా తం) హాజరు కాగా, 1,718 మంది గైర్హాజరయ్యా రు. 80 సీట్లకు 4,478 మంది పరీక్ష రాసినట్లు పర్యవేక్షకుడు, నవోదయ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ వెల్ల డించారు. ఇక కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,632 మంది విద్యార్థులకు 9,91 మంది హాజరు కాగా 641 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించారు. కాగజ్నగర్లో ఇబ్బందులుకాగజ్నగర్ పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయం, సెయింట్ క్లారెట్ స్కూల్లో కేంద్రాలు ఏర్పా టు చేశారు. సెయింట్క్లారెట్ స్కూల్లో హాల్టికెట్ నంబర్లను బోర్డుపై కాకుండా గోడకు అంటించారు. హాల్టికెట్, రూం నంబర్లు వెతుక్కునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాగజ్నగర్టౌన్ సీఐ ప్రేంకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. -
చెన్నూర్లో నవోదయ పరీక్షలో మాస్ కాపీయింగ్
చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగిందని విద్యార్థులు ఆరోపించారు. రూమ్ నెంబర్ 6లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఇన్విజిలేటర్ వచ్చి వారి బంధువుల పిల్లలకు ఒకరి పరీక్ష పేపర్ను మరొకరికి ఇచ్చి రాయించారన్నారు. అంతే కాకుండా తెలియని జవాబులను పరీక్ష ముగిసే వరకు చెప్పడం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదంతా కష్టపడి చదువుకుంటే కాపీ కొట్టి పాసైన విద్యార్థులు మా భవిష్యత్ను నాశనం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే పంతుళ్లే ఇలా కాపీయింగ్కు ప్రోత్సహించడం సరికాదన్నారు. గతేడాది సైతం ఇలాగే జరిగిందని మా అబ్బాయి చెప్పాడని విద్యార్థి తండ్రి జగదీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాలలో నవోదయ ప్రవేశ పరీక్షలో జరిగిన కాపీయింగ్పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఇన్విజిలేటర్ల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
శభాష్ ..ప్రేరిత్..!
మంచిర్యాలఅర్బన్: స్మార్ట్ ఫోన్ల వినియోగం పి ల్లలపై దుష్ప్రభావాలు చూపుతున్నాయి. ఆన్లైన్ గేమ్లు, ఇతర కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్న ఈ రోజుల్లో అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటాడు మంచిర్యాలకు చెందిన ముంజం ప్రేరిత్. సాంకేతిక పరిజ్ఞానంతో త న ఆలోచనలకు పదునుపెట్టి ‘జ్ఞానయాత్ర’ పేరుతో క్విజ్యాప్ తయారుచేసి ఔరా అనిపించాడు. తయారీకి మూడు నెలలు.. మంచిర్యాలకు చెందిన ముంజం బాబురావు, చందన దంపతుల కుమారుడైన ప్రేరిత్ స్థానిక కార్మెల్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నా డు. యాప్ డెవలప్మెంట్ లెస్సెన్ (పాఠం)తో తర్ఫీదు పొందిన ఈ చిన్నారి తన ఆలోచనకు పదును పెట్టాడు. పట్టుదలతో అందివచ్చిన సాంకేతికను ఉపయోగించి రోజువారీ క్విజ్లు, బహు ళ ఎంపిక ప్రశ్నలు, స్కోర్ ట్రాకింగ్ తదితర సరదాగా నేర్చుకోవటానికి ఉపయోగపడే అంశాలతో యాప్ రూపొందించాడు. ఇందుకు మూడు నెలల సమయం పట్టిందని పేర్కొన్నాడు. యాప్తో విద్యార్థులు క్విజ్, సాధారణ జ్ఞానం, విద్యా సంబంధిత ప్రశ్నలు నేర్చుకునే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ వినియోగించే తీరును బట్టి ఉంటుందని, విద్యను సులభంగా ఆసక్తికరంగా అందించాలనే లక్ష్యంతో ఈయాప్ను రూపొందించినట్లు ప్రేరిత్ ‘సాక్షి’కి తెలిపాడు. గణితంలో ఘనుడు.. క్విజ్ యాప్ కాకుండా గణితంలో కూడా ప్రేరిత్ సత్తా చాటాడు. ఇదివరకు అలామా సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఏఏ–1లో 13 దేశాల నుంచి వెయ్యిమంది విద్యార్థులు పాల్గొనగా ప్రేరిత్ ప్రథమ స్థానం సాధించాడు. ఏడు నిముషాల్లో అత్యధిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతో అలామా సంస్థ ఆన్లైన్ సర్టిఫికెట్ అందజేసింది. -
జంట ఊర్లు.. రోడ్డే అడ్డు
సోన్ మండలం వెల్మల్, బొప్పారం గ్రామాల విషయంలో ఈ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. జంట గ్రామాలుగా పిలిచే ఈ రెండింటికీ ఓ చోట 30 అడుగుల వెడల్పున్న రహదారే సరిహద్దుగా ఉంటుంది. ప్రధాన రహదారికి ఇటు వెల్మల్, అటు బొప్పారంకు రోడ్డే పొలిమేరగా ఉంటుంది. ఈ రెండు గ్రామాలు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు 1969లో పునరావాస గ్రామాలుగా ఏర్పడ్డాయి. ఈ రెండు గ్రామాల మధ్యలో 1.5 కిలోమీటర్ల రోడ్డు పొడవునా ఇరువైపులా ఇండ్లు ఉంటాయి. కొత్తవారు ఎవరైనా వస్తే ఒకే గ్రామం అనుకుంటారు. ప్రత్యేకించి అడిగితే కానీ తెలియదు. ఈ రెండు గ్రామాలకు రెండు గ్రామ పంచాయతీలు, ఇద్దరు సర్పంచులు, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఈ రెండు ఊర్లతో పాటు, ముఠాపూర్, కుంచాన్పెల్లి కలుపుకొని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఉంటుంది. ఈ గ్రామంలో ఎప్పుడు చూసినా సందడిగానే కనిపిస్తుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
శతాధిక వృద్ధురాలు మృతి
హాజీపూర్(మంచిర్యాలరూరల్): జిల్లా కేంద్రంలోని గోసేవ మండల్ కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు బొట్ల ఆగమ్మ శనివారం మృతి చెందింది. గత జూలై 25న కుటుంబ సభ్యుల సమక్షంలో వందేళ్ల జన్మదిన వేడుకలు జరుపుకున్న వృద్ధురాలి భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఆరుగురు కుమారులు, కుమార్తె సంతానం. మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పాము కాటుకు మహిళ..తిర్యాణి: పాము కాటుకు మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన తుమ్రం జమున (58) తన సోదరుడు పర్వత్రావు ఇంటివద్ద ఉంటోంది. గురువారం చేనులో కూరగాయలు తెంపేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె కాలుకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. ముళ్లు గుచ్చుకున్నాయని భావించి ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి వాంతులు కావడంతో పాటు కాలు వాపెక్కడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పాము కాటు వేసినట్లు నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందింది. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి..మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చి కిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీ ఐ ప్రమోద్రావు తెలిపారు. ఈనెల 12న స్థానిక రైల్వే స్టేషన్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని స్థానికులు గు ర్తించి 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొ ందుతూ శనివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఽఆధారాలు లభించలేదని, బిహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలకు 8712656534లో సంప్రదించాలన్నారు. -
నత్తనడకన రైల్వే ఆధునికీకరణ
బాసర: అమృత్ భారత్ పథకం కింద బాసర రైల్వేస్టేషన్లో చేపట్టిన ఆధునికీకరణ పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలసంఖ్యలో వచ్చే యాత్రికులకు ఇబ్బందులు తప్పడంలేదు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున ఉండడం, జ్ఞానసరస్వతీ మాత ఆలయం, ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయం ఉండడంతో బాసరకు ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న బాసర రైల్వేస్టేషన్లో 2024 ఫిబ్రరి 26న అప్పటి ఎంపీ సోయం బాపూరావు, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆధునికీకరణలో భాగంగా స్టేషన్లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ నిర్మాణం, ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు పనులు చేపట్టారు. యాత్రికులు సేదతీరేందుకు విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టారు. ఆధునికీకరణలో భాగంగా బాసర రైల్వేస్టేషన్ పాత ప్లాట్ఫాంలు తొలగించారు. రెండు ప్లాట్ ఫాంలు ఉండగా ఇరువైపులా పనులు చేస్తున్నప్పటికీ ప్రయాణికులు నిలబడే పరిస్థితి ఏర్పడింది. ప్లాట్ ఫాంలపై వివిధ బోగీలను సూచించే ఎలక్ట్రానిక్ మానిటర్లు తొలగించారు. దీంతో ఏరైలు ఎక్కడ నిలుస్తుందో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. బాసరలో ఆగని వారంతపు రైళ్లు బాసర రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు 40 నుంచి 45 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అందులో వారాంతపు రైళ్లు 12765, 12766, 16734, 16733, 12720, 19714, 19713, 19302, 19301, 07605/07606, 17605,17606 ఆగడం లేదు. వీటిపై ఇప్పటికే రైల్వే మంత్రిత్వ పాటు రైల్వే ఉన్నతాధికారులకు పలువురు విన్నవించారు. -
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని ఈడెన్ గార్డెన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రెండో విడత ఎన్నికల అధికారులకు నిర్దేశిత సమయానికి సామగ్రి పంపిణీ పూర్తవుతుందన్నారు. ఇబ్బందులు లేకుండా అధికారులు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రహీమొద్దీన్, ఎంపీడీవో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు వరిధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండలంలోని కొమురవెళ్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ కేంద్రాల ద్వారా మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, నిర్వాహకులు భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.


