breaking news
Kumuram Bheem District Latest News
-
పొర్లుదండాలతో నిరసన
ఆసిఫాబాద్రూరల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పనిచేసే డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె ఏడో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం పొర్లుదండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఏడు నెలల వేతనాలు చెల్లించాలన్నారు. సీఐటీయూ, సంఘాల నాయకులు ప్రభాకర్, కృష్ణమచారి, వసంత్ రావు, కోటయ్య, భరత్, వర్కర్లు శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ ఆధ్వర్యంలో రైల్వేల అభివృద్ధి
కాగజ్నగర్టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలోని రైల్వేలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. గురువారం కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్ –నాగ్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది వందేభారత్ రైలును సికింద్రాబాద్– నాగ్పూర్ రైలును ప్రారంభించగా, అప్పటినుంచి కాగజ్నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించాలని డిమాండ్ ఉందన్నారు. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇక్కడ వందేభారత్కు స్టాప్ సౌకర్యం కల్పించారని తెలిపారు. సికింద్రాబాద్, నాగ్పూర్కు వెళ్లేందుకు ఉపయోగకరంఅనంతరం ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్, నాగ్పూర్కు వెళ్లేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైల్వే స్టేషన్లో రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వారం రోజుల్లో నాలుగు రైళ్లకు హాల్టింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే సిర్పూర్ టౌన్ స్టేషన్లో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్– సిర్పూర్ కాగజ్నగర్ మధ్య మరో కొత్త రైలు ప్రవేశపెట్టాలని, చర్లపల్లి హౌరా వయా సిర్పూర్ కాగజ్నగర్కు కొత్త రైలు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. సంజీవయ్య కాలనీ వద్ద అండర్ బ్రిడ్జి, చింతగూడ రైల్వే క్రాసింగ్, ఈస్గాం రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయన్నారు. కొత్త రైళ్ల హాల్టింగ్తో కాగజ్నగర్ స్టేషన్లో వందకు పైగా ట్రైన్లు ఆగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సికింద్రాబాద్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం.గోపాల్, ముఖ్య సంబంధాల అధికారి శ్రీధర్, దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్నాథ్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
కేసులు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో వన్యప్రాణుల వేటకు సంబంధించిన కేసులను త్వరగా పరి ష్కరించాలని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పో లీసు కార్యాలయంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్తో కలిసి గురువారం టాస్క్ఫోర్స్ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్వో మాట్లాడుతూ పోలీస్, అటవీశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ టాస్క్ఫోర్స్ సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేయాలన్నారు. అటవీ జంతువులను వేటాడిన కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ ఎఫ్డీవో సుశాంత్ సుఖ్దేవ్, సిబ్బంది ముసవీర్, ఝాన్సీరాణి, సద్దాం తదితరులు పాల్గొన్నారు. -
ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్
కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన పత్తి పంట క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర సక్రమంగా అందించేందుకు 2025– 26సంవత్సరంలో కొనుగోళ్లు కపాస్ కిసాన్ యాప్ ద్వారా చేపట్టనున్నారు. పత్తి సాగు చేసిన రైతులు ఈ నెల 30లోగా ఈ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు పత్తి సాగుచేసిన భూమి సర్వే నంబర్, ఆధార్, ఇతర వివరాలు నమోదు చేయాలి. రెవెన్యూ అధికారుల నుంచి పత్తి పంట ధ్రువీకరణ పత్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలు అందించాలి. సాగు విస్తీర్ణంతోపాటు ఇతర వివరాలు నమోదు చేయగానే సీసీఐకి వివరాలు చేరిపోతాయి. ఏ ప్రాంతంలో ఎంత సాగు చేశారనే దానిపై అంచనా వస్తుంది. వివరాల ఆధారంగా సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతుంది. అండ్రాయిడ్ సెల్ఫోన్ లేని వారు సమీపంలోని మీసేవ కేంద్రాలతోపాటు ఏఈవోల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. -
పత్తాలాట.. కోడిపందేలు
కౌటాల మండలం గురుడుపేటకు చెందిన మహిళలు పేకాటను నియంత్రించాలని ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి వినతిపత్రం అందించారు. యువత పేకాడుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో నాటుసారా విక్రయాలు, అక్రమ దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురుడుపేట గ్రామంలోనే కాకుండా జిల్లాలోని పలు పల్లెల్లో పరిస్థితి ఇలాగే ఉంది. పత్తాలాట, కోడి పందేలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కౌటాల(సిర్పూర్): మరికొద్ది రోజుల్లో దసరా సంబురాలు ప్రారంభం కానుండగా, జిల్లాలో పేకాట, కోడి పందేలు జోరందుకున్నాయి. పోలీసుల దాడుల్లో కొందరు పట్టబడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా యువత జూద క్రీడలకు బానిసలుగా మారి అప్పులపాలవుతున్నారు. పేకాట, కోడి పందేల నిర్వహణకు ప్రత్యేక స్థావరాలు సైతం ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇదీ పరిస్థితి.. కౌటాల, వాంకిడి, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), జైనూర్ మండలాల్లో పేకాట జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గ్రామాల శివారుల్లోనూ నిత్యం స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల దాడులకు తాత్కాలికంగా భయపడినా మళ్లీ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటున్నారు. కాగజ్నగర్ పట్టణ శివారులోని ఈజ్గాం, భట్టుపల్లి, అంకుసాపూర్ ప్రాంతాలైతే పేకాట స్థావరాలకు పేరుమోశాయి. మరికొందరు బడాబాబులు ఏకంగా సరిహద్దు దాటి మహారాష్ట్రలోని దాబాల్లో రూ.లక్షలు పెడుతూ జూదంలో మునిగిపోతున్నారు. ఆది, బుధవారాల్లో మహారాష్ట్రకు..జిల్లాలోని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే పల్లెల్లో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతీ ఆదివారం, బుధవారం మహారాష్ట్రలో నిర్వహించే కోడి పందేలకు జిల్లా నుంచి పదుల సంఖ్యలో తరలివెళ్తున్నారు. దసరా పండుగకు నిర్వహించే పందేల కోసం ఇప్పటినుంచే ప్రత్యేకంగా పుంజులు పెంచుతున్నారు. రూ.వేలల్లో బెట్టింగ్ కాస్తూ అప్పులపాలవుతున్నారు. పోలీసులు పేకా ట, కోడి పందేలపై దాడులు నిర్వహించినా నిందితులపై పీటీ కేసులు మాత్రమే పెడుతున్నారు. నిందితులు కోర్టుల్లో నామమాత్రపు జరిమానా చెల్లించి బయటపడుతున్నారు. కొందరు పోలీసులు పేకాట నిర్వాహకులకు ముందుగానే సమాచారం ఇస్తూ సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి ఘటనలు కఠిన చర్యలు తప్పవు జిల్లాలో చట్టవిరుద్ధంగా పేకాట, కోడిపందేలు ఆడితే చర్యలు తప్పవు. కేసులు నమోదు చేస్తాం. వ్యసనాల బారిన పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. తరుచూ తనిఖీలు, దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీ గడిచిన ఎనిమిది నెలల్లో నమోదైన కేసులుదాడులు కేసులు నిందితులు పట్టుకున్న నగదు పేకాట 90 507 రూ.4,69,470 కోడి పందేలు 16 88 రూ.25,660 -
నేరరహిత సమాజం కోసం కృషి
ఆసిఫాబాద్అర్బన్: నేరరహిత సమాజం కోసం పోలీసులు కృషి చేయాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్టేషన్లకు వివిధ సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. కేసుల దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సీఐలు బాలాజీ వరప్రసాద్, రమేశ్, సత్యనారాయణ, సంజయ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మగువలకు బతుకమ్మ కానుక
ఆసిఫాబాద్అర్బన్: బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది. గతంలో తెల్లరేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ చీరలు అందించగా, ప్రస్తుతం ఎస్హెచ్జీ సభ్యులకు మాత్రమే ఇందిరా మహిళా శక్తి కింద అందించనున్నారు. మరో రెండు రోజుల్లో అవసరమైన స్టాక్ జిల్లాలోని గోదాంలకు చేరుకోనుంది. సద్దుల బతుకమ్మకు ముందుగానే అర్హులకు అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. నాణ్యతపై ప్రత్యేక దృష్టిజిల్లాలో మొత్తం 8,897 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,02,992 మంది సభ్యులు గా కొనసాగుతున్నారు. మహిళా సంఘాల్లో ప్రస్తు తం 18 ఏళ్లు నిండిన వారికే అవకాశం ఉంది. ‘రేవంతన్న కానుక’గా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందించనుంది. గత ప్రభుత్వ హయాంలోనూ చీరలు పంపిణీ చేసినా నాణ్యతపై విమర్శలు వచ్చాయి. గతంలో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులో పేరున్న ప్రతీ మహిళకు బతుకమ్మ చీరలు అందించారు. నాణ్యత సక్రమంగా లేకపోవడం, డిజైన్లు ఒకేరీతిలో ఉండడంతో చాలా మంది వాటిని ధరించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదట చీరల పంపిణీని నిలిపివేసింది. ప్రస్తుతం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. క్షేత్రస్థాయిలో విమర్శలు రాకుండా మన్నికైన చీరల కోసం ఒక్కోదానికి సుమారు రూ.800 వెచ్చించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి విడతలో ఒకటే..!బతుకమ్మ కానుకగా ఒక్కో మహిళకు రెండు చొప్పు న చీరల అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి విడత ఒక్కటి మాత్రమే ఇవ్వనున్నారు. మరో రెండు రోజుల్లో జిల్లాకు 1,02,992 చీరలు రానున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటిని కౌటాల, జైనూర్, రెబ్బెన మండలం రాంపూర్లోని గోదాంలలో భద్రపర్చనున్నారు. గోదాంల నుంచి ఆయా గ్రామాలకు అవసరం మేరకు సరఫరా చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో మహిళా సంఘాలు, సభ్యుల సంఖ్య, ఏయే ప్రాంతాలకు ఏ మేరకు సరఫరా చేయాలనే వివరాలను మెప్మా, సెర్ప్ సిబ్బంది సేకరించారు. ఉన్నతాధికారులకు సైతం నివేదించారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు కాగజ్నగర్ మున్సిపాలిటీలో 900 ఎస్హెచ్జీ గ్రూప్లు, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 279 గ్రూపుల్లో సభ్యులకు చీరలు అందించనున్నారు. రెండు రోజుల్లో జిల్లాకు.. బతుకమ్మ కానుకగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రభుత్వం ఉచితంగా చీరలు అందించాలని నిర్ణయింది. మరో రెండు రోజుల్లో అవసరమైన చీరలు జిల్లాకు చేరుకుంటాయి. వీటిని భద్రపరిచేందుకు వీలుగా జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గోదాంలు గుర్తించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం. – దత్తారావు, డీఆర్డీవోఅర్హులు, అవసరమైన చీరల వివరాలు మండలం ఎస్హెచ్జీ 6.30మీ. 9మీ. కాగజ్నగర్ 10,658 8,158 2,500 ఆసిఫాబాద్ 7,632 5,699 1933 వాంకిడి 8,223 5,023 3200 దహెగాం 5,988 3,588 2400 రెబ్బెన 8,061 4,661 3,400 తిర్యాణి 5,644 3,394 2,250 కౌటాల 6,965 4,179 2,786 సిర్పూర్(టి) 6,021 3,521 2,500 పెంచికల్పేట్ 2,909 1,209 1,700 బెజ్జూర్ 5,201 3,180 2,021 చింతలమానెపల్లి 5,317 3,190 2,127 జైనూర్ 6,347 2,539 3,808 కెరమెరి 5,929 2,464 3,465 సిర్పూర్(యూ) 3,658 1,583 2,075 లింగాపూర్ 3,219 1,288 1,931 మున్సిపాలిటీలుకాగజ్నగర్ 8,357 8,327 30 ఆసిఫాబాద్ 2,863 2,613 250 -
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలో గురువారం స్కూల్ గేమ్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా, జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో అండర్– 19 విభాగంలో వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, హ్యాండ్బాల్, రగ్బీ జోనల్స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 150 మంది బాలబాలికలు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ చూపిన 64 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురావు తెలిపారు. అలాగే జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో అండర్– 14, 17 విభాగంలో బేస్బాల్, సాఫ్ట్బాల్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. మొత్తం 140 మంది బాలబాలికలు హాజరు కాగా, 72 మంది క్రీడాకారులను జోనల్స్థాయికి ఎంపిక చేశామని ఎస్జీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు. ఆదిలాబాద్లో త్వరలో జరిగే జోనల్స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ అరుణశ్రీ, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ యాదగిరి, పీడీ, పీఈటీలు షేకు, మీనారెడ్డి, చిన్నక్క, తిరుపతి, సాయి, నాగమణి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులుజోనల్ స్థాయికి ఎంపికై న క్రీడాకారులు -
వాస్తు శిల్పులకు ఆదర్శప్రాయుడు
ఆసిఫాబాద్అర్బన్: నేటి వాస్తు శిల్పులకు విశ్వకర్మ ఆదర్శప్రాయుడని శాసన మండలి డిప్యూ టీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా బీసీ అధికారి సజీవన్ అధ్యక్షతన నిర్వహించిన విశ్వకర్మ జయంతికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎస్పీ చిత్తరంజన్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి హాజరయ్యారు. మొ దట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆ ర్కిటెక్చర్ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఎన్నో రాజ భవనాలు నిర్మించిన గొప్ప నైపుణ్యకారుడు విశ్వకర్మ అని కొనియాడారు. ఇంజినీరింగ్ వృత్తిదారులకే కాకుండా చేతివృత్తి కళాకారులు కూడా ఆయనను అనుసరించారని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మ న్ అలీబిన్ అహ్మద్, విశ్వబ్రాహ్మణ సంఘం నా యకులు భాస్కరచారి, వేణుగోపాల్, రాధాకృష్ణచారి, సంతోష్చారి, అశోక్చారి, సురేశ్చారి, వెంకటేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం సూపరింటెండెంట్ ప్రవీణ్తో కలిసి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రారంభించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో 15 రోజులపాటు రోజుకు నాలుగు చొప్పున ప్రతీ ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల్లో పనిచేసే గైనకాలజీ, నేత్ర, డెర్మటాలజీ, డెంటల్, తదితర వైద్యులు మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే బీపీ, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్, రక్తహీనత బారిన పడకుండా కిశోర బాలికలు, మహిళలకు అవగాహన కల్పించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఆసిఫాబాద్అర్బన్: శాంతిభద్రతలో పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణకు అత్యంత వైభవమైన ఘన చరిత్ర, అఖండమైన వారసత్వం ఉందన్నారు. గొప్ప చారిత్రాత్మక వారసత్వం, మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. ఆపరేషన్ పోలో చర్య ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. నిజాయతీగా విధులు నిర్వర్తించి జిల్లా పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, సీఐలు, ఆర్ఐ లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోషకాహారం.. ఆరోగ్యభాగ్యం
కెరమెరి(ఆసిఫాబాద్): ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో గురువారం నుంచి పోషణమాసం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణ, మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా పోషణ మాసం నిర్వహిస్తోంది. గతంలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగగా, ఈ ఏడాది మాత్రం సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 16 వరకు 30 రోజుల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ప్రస్తుతం అంగన్వాడీ ఉద్యోగులు శిక్షణలో ఉండటంతో కార్యక్రమం ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమవుతుందని అధికారులు వెల్ల డించారు. మహిళల ఆరోగ్యం, పిల్లల విద్య వంటి నినాదాలతో అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పోషకాహార లోపం.. రక్తహీనతజిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు సరైన ఆహారం తీసుకోవడం లేదు. ఫలితంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత ఉండటంతో పుట్టబోయే బిడ్డలపై ప్రభావం పడుతోంది. పాలిచ్చే తల్లులు కూడా పోషకాహారం తీసుకోకపోవడంతో చిన్నారులు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల్లో మానసిక, శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండడం లేదు. ఆయా సమస్యలను రూపుమాపడం, పోషకాహారంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏటా నెలరోజులపాటు పోషణ మాసం నిర్వహిస్తుంది. నాలుగు వారాలపాటు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమాలు ఇవే..పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్: పోషణమాసం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎనిమిదో రాష్ట్రీయ పోషణ మాసం– 2025లో భాగంగా అక్టోబర్ 16 వరకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఆర్డీవో దత్తారావు, డీఎంహెచ్వో సీతా రాం, డీపీవో భిక్షపతి పాల్గొన్నారు. భాగస్వాములు కావాలి జిల్లాలో గురువారం నుంచి పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతీ వారం షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు భాగస్వామ్యులు కావాలి. ఈ కార్యక్రమం ఈ నెల 17 నుంచే ప్రారంభించాల్సి ఉంది. అయితే అంగన్వాడీ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతుండడంతో ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నాం. – భాస్కర్, ఐసీడీఎస్ పీడీ -
‘సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె’
ఆసిఫాబాద్రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీవేజ్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు. బుధవారం సమ్మె ఆరో రోజుకు చేరుకోగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కుమురం భీం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కు మురంభీం విగ్రహానికి పూలమాల వేసి నిరసన తె లిపారు. ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఏడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతుండగా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్, సదాశివ్, వర్కర్లు గంగుబాయి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
‘సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు’
కాగజ్నగర్రూరల్: రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న స్పష్టం చేశారు. పట్టణంలోని స్టేషన్రోడ్లో గల సీపీఎం కార్యాలయంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం భూస్వాములు, జాగీర్దార్లు, రజాకార్లను తరిమికొట్టారని తెలిపా రు. ఈ పోరాటంలో ఎర్రజెండా పాత్రను కప్పిపెట్టడానికి నేటి పాలకులు ప్రజాపాలన, జాతీ య సమైక్యత, విమోచన, విద్రోహ దినం అంటూ ప్రజా పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోట శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు వనమాల పద్మ, ఎన్.పద్మ, సుదర్శన్, అంగల శ్రీనివాస్, శంకర్, సంజీవ్ పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపర్చాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఎంపికై న 13 మంది వైద్యులకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నియామక పత్రాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించినట్లు తెలిపారు. విధుల్లో చేరిన వైద్యులు సమయపాలన పాటిస్తూ నిబద్ధతతో పని చేయాలన్నారు. రోగులతో సహనంగా వ్యవహరించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని, అవసరమైన మందులు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త అవినాశ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు. -
‘చరిత్రను వక్రీకరిస్తున్న పాలకులు’
ఆసిఫాబాద్అర్బన్: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీపీఐ జెండాను జిల్లా కార్యదర్శి బద్రి సాయి ఆవిష్కరించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ సాయుధ పోరాటానికి సంబంధించి సర్వహక్కులు సీపీఐ పార్టీకే దక్కుతాయన్నారు. నాటి పోరాటంలో దొడ్డి కొముయ్యతోపాటు 4,500 మంది అమరులయ్యారని, తెలంగాణలోని గ్రామాల్లో నేటికీ నెత్తుటి ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, అమరుల జీవిత చరిత్రను తక్షణమే పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బద్రి సత్యనారాయణ, ఆత్మకూరి చిరంజీవి, ఉపేందర్, పిడుగు శంకర్, నర్సయ్య, రాజశేఖర్, శ్రీకాంత్, మహేశ్, వెంకటేశ్, అజయ్, వికాస్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సాధించిన ఉమ్మడి జిల్లా బాలుర జట్టు ఇదే ఉత్సాహంతో జాతీయ స్థాయిలో పోటీల్లోనూ రాణించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజ య భాస్కర్రెడ్డి అన్నారు. ఈ నెల 14న జనగామ జిల్లాలో జరిగిన అండర్– 14 బాల్బ్యాడ్మింటన్ పో టీల్లో ఉమ్మడి జిల్లా బాలుర జట్టు చాంపియన్షిప్ సాధించగా, మంగళవారం అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు జీఎంను కలిశారు. ఈ సందర్భంగా వారిని జీఎం అభినందించారు. క్రీడాకారులకు సహకరించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, షార్ప్స్టార్ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్వోడీ శ్రీనివాస్, డీజీఎం ఉజ్వల్కుమార్ పాల్గొన్నారు. -
తిరుగుబాటు
నిరంకుశంపై చీల విఠల్ (ఫైల్) చీల శంకర్ (ఫైల్)దండనాయకుల గోపాల్ కిషన్రావు(ఫైల్) ఏకబిల్వం నాగేంద్రయ్య(ఫైల్) బోనగిరి వెంకటేశం(ఫైల్)చిలుకూరి సీతారాం(ఫైల్)తాటిపెల్లి తిరుపతి(ఫైల్) మహారాష్ట్రలో సాయుధ శిక్షణఆసిఫాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి వెంకటే శం, తాటిపెల్లి తిరుపతి, చీల శంకర్, చీల విఠల్, ఏకబిల్వం నాగేంద్రయ్య, ఖాడ్రే శంకర్, రాంసింగ్, రేవయ్య, తాటిపల్లి తిరుపతి, ఏకబిల్వం శంకరయ్య, చందావార్ విఠల్, చిలుకూరి సీతారాం, జగన్నాథ్తో పాటు అనేక మంది యోధులు అజ్ఞాతంలోకి వెళ్లి మహారాష్ట్రలోని చాందా సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందారు. వీరికి ఆసిఫాబాద్కు చెందిన రాంచందర్ రావు పైకాజీ, సుబ్బబాబురావు, దండనాయకుల గోపాల్ కిషన్రావు, వామన్రావు వైరాగరే, ప్రభాకర్రావు మసాదే సహకరించారు. నిజాంకు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు 1948 ఏప్రిల్ 21న వామన్రావును జైలులో పెట్టారు. న్యాయవాది పైకాజీ సమరయోధులకు మానసిక ధైర్యం, ఆర్థిక సహకారాన్ని అందించడంతో ఆయనపై హత్యాయత్నం కూడా జరిగింది. చాందా క్యాంపులో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఆసిఫాబాద్కు చెందిన నాయకులు విరూర్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో పాలుపంచుకున్నారు. ఈ ఘటనలో బోనగిరి వెంకటేశం కాలికి గ్రేనేడ్ తగలగా, ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇండియన్ ఆర్మీతో కలిసి..హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసేందుకు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లబాయ్పటేల్ 1948 సెప్టెంబర్ 13న పోలీస్ యాక్షన్ ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి సైనిక బలగాలు పది యుద్ధ ట్యాంకులు, పది ట్రక్కులు, 20 ఠానే గాఢ్లు, వందలాది మంది సైనికులతో ఆసిఫాబాద్ మీదుగా హైదరాబాద్ వైపు కదిలాయి. సెప్టెంబర్ 13న చంద్రాపూర్, బల్లార్షా, దాభా(ఉప క్యాంపు) సిరొంచ క్యాంపుల నుంచి సాయుధ సమరయోధులు భారత సైన్యం బాటలో రజాకార్లపై చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించకుండా రాజురా సమీపంలోని రైల్వే వంతెనకు రజాకార్లు బాంబులు అమర్చారు. అయితే 14న రాత్రి 11 గంటలకు రైల్వే వంతెన పేల్చివేత ప్రయత్నాలను సమరయోధులు గుర్తించారు. అదేరాత్రి 12 గంటలకు ఈ విషయాన్ని కొరియర్ వ్యవస్థ ద్వారా మిలటరీకి తెలియజేశారు. 2 గంటల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ దాడి చేసి రజాకార్లను మట్టుబెట్టింది. బాంబులను సైతం తొలగించారు. తెల్లవారుజాము 3 గంటలకు విరూర్ రైల్వే స్టేషన్పై ఆసిఫాబాద్కు చెందిన బోనగిరి వెంకటేశం, మరో ఆరుగురు దాడి చేశారు. ఈ ఘటనలో కొందరికి బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు కొందరు చనిపోగా, మరికొందరు లొంగిపోయారు. 15న తెల్లవారుజామున 4 గంటలకు దాబా మీదుగా వచ్చిన మరో మిలటరీ క్యాంపు, సాయుధ పోరాట వీరులు పెన్గంగ సరిహద్దులోని లోనవెల్లి నాకాపై దాడి చేశారు. అదేరోజు రాత్రి 10 గంటలకు ఆసిఫాబాద్ సమీపంలోని బుజల్ఘాట్ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. కానీ మరుసటిరోజు స్థానికులు ఇక్కడ తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు. 16న అర్ధరాత్రి దాటిన తర్వాత సిరొంచ నుంచి వచ్చిన సైన్యం, సమరయోధులు బెజ్జూర్ ఔట్పోస్టుపై దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు. తెల్లవారుజామున దహెగాం సమీపంలో పెసరకుంట వద్ద రజాకార్లపై దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. అనంతరం బీబ్రా పోలీస్ స్టేషన్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదే రోజు స్వాతంత్య్ర సమరయోధులను ఆసిఫాబాద్ జిల్లా జైలులో పెట్టారు. 17న లొంగిపోతున్నట్లు నిజాం రాజు ప్రకటించడంతోపాటు జైలులోని వారు ఇతర ఖైదీలతో కలిసి బయటకు వచ్చారు. పోరాటంలో పాలుపంచుకున్న జిల్లాకు చెందిన అనేక మంది నాయకులను ప్రభుత్వం స్వాతంత్య్ర సమర యోధులుగా ప్రకటించింది. -
రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి అరవింద్ బాల్బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణ లో పీడీ తిరుపతి, అధ్యాపకులతో కలిసి వి ద్యార్థిని అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల్లో జనగాంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో చాప్లే అరవింద్ ఉత్తమ ప్రతిభ చూపి బంగారు పతకం కై వసం చేసుకున్నాడని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
మహిళలకు ఆరోగ్య పరీక్షలు
ఆసిఫాబాద్అర్బన్: వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట బుధవారం నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు మహిళలకు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. సెలవు దినాలను మినహాయించి మిగిలిన రోజుల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ పరీక్షలు చేయనున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే సిబ్బంది అక్కడికక్కడే మందులు సైతం అందించనున్నారు. 52 వైద్యశిబిరాలుజిల్లాలోని 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, సామాజిక ఆస్పత్రుల్లో మహిళల కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. మూరుమూల గ్రామాల ప్రజలకు దూరభారం అయితే సబ్ సెంటర్లలోనూ వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తారు. అక్టోబర్ 2నాటికి రోజుకు నాలుగు చొప్పున మొత్తం 52 శిబిరాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలకు గైనకాలజీ, కంటి, చెవి, ముక్కు, గొంతు, చర్మ, మానసిక, దంత సమస్యలపై మహిళా వైద్య నిపుణులతో పరీక్షలు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించేలా..ప్రస్తుతం మహిళలు ఇంటి పనులు, వృత్తి పనులతో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జిల్లాలో గర్భిణులను రక్తహీనత వెంటాడుతోంది. వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రుల్లో చేర్పించినా ప్రయోజనం ఉండడం లేదు. నారీమణుల్లో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్కు శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, కంటి, దంత, చర్మ, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, డెర్మటాలజీ, సైక్రియాట్రిస్ట్ వైద్య నిపుణులు సేవలందిస్తారు. బీపీ, మధుమేహం, క్యాన్సర్, టీబీ, హిమోగ్లోబిన్ లోపం పరీక్షలతోపాటు గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక పరీక్షలు చేస్తారు. అవసరమైన మందులు అక్కడికక్కడే అందిస్తారు. రక్తహీనత బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై అవగాహన కల్పిస్తారు. క్షయ నిర్ధారణ అయితే వారికి కార్డులు అందిస్తారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో అనేక ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సికిల్ ఏనిమియా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ జరిగితే వైద్యం అందిస్తారు. జిల్లాలో ఇప్పటివరకు బీపీ 9వేలకు పైగా, షుగర్ 3వేలకు పైగా, క్యాన్సర్ బారిన పడిన మహిళలు సుమారు 50 మంది వరకు ఉంటారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వైద్యశిబిరాలను జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. -
భీం వర్ధంతి ఘనంగా నిర్వహించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం జోడేఘాట్లో అక్టోబర్ 7న గిరిజన పోరాటయోధుడు కుమురం భీం 85వ వర్ధంతి ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. జోడేఘాట్లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం వర్ధంతి, దర్బార్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ హట్టి నుంచి జోడేఘాట్ వరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దర్బార్లో దరఖాస్తులు సమర్పించేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆదివాసీ గూడేల్లో నివాస గృహాలు, తాగునీటి కల్పన పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. పార్కింగ్ కోసం వినియోగించే వ్యవసాయ భూమికి పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జోడేఘాట్ విద్యార్థులు, స్థానిక ప్రజల అవసరాల కోసం పీహెచ్సీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా సభాస్థలి, పార్కింగ్, దర్బార్ స్థలాలను పరిశీలించారు. అంతకు ముందు భీం విగ్రహానికి నివాళులర్పించి, సమాధిపై పూలు చల్లారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీడీ రమాదేవి, ఈఈ తానాజీ, అదనపు డీఎంహెచ్వో మనోహర్, పీవీటీజీ ఏపీవో మెస్రం మనోహర్, జీసీసీ మేనేజర్ తారాచంద్, భీం మనుమడు కుమురం సోనేరావు, కమిటీ సభ్యులు పెందోర్ రాజేశ్వర్, మడావి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాంపై గోండు బెబ్బులి పోరు
జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజన పోరాట యోధుడు కుమురంభీం నిజాం ప్రభుత్వంపై భీకర పోరు సాగించారు. అడవిపై హక్కులు, సామాజిక న్యాయం అందించాలని కెరమెరి మండలంలోని బాబేఝరి కేంద్రంగా గిరిజనులతో అడవి నరికి 12 పోరు గ్రామాలను ఏర్పాటు చేశారు. మేకల కోసం చెట్టు కొమ్మను కొట్టిన తన స్నేహితుడు పైకు చేతి వేళ్లను జంగ్లాత్ సేరేదార్ నరికించడం, ఆదివాసీ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు కుమురం భీంను తీవ్రంగా కలచివేశాయి. ద ట్టమైన అడవుల్లోని జోడేఘాట్ కేంద్రంగా దీంతో సైన్యంతో గెరిల్లా పోరాటం సాగించాడు. నిజాం నిరంకుశత్వం, అటవీశాఖ అధికారుల అరాచకాలపై ప్రజలను చైతన్యపరిచాడు. ప్రభుత్వం విధించే పన్నులు కట్టవద్దని పిలుపునిచ్చి అప్పటి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించాడు. ఆయన మరణంతో అలజడి చెలరేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించి ఆదివాసీల కోసం అనేక చట్టాలు రూపొందించింది. -
వ్యూహకర్త.. బాపూజీ
నిజాం నిరంకుశ పా లనపై పోరాడిన వారిలో ఆసిఫాబాద్ కు చెందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ జీ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో సైతం ఆయన పాలుపంచుకున్నారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రస్తుత మహారాష్ట్రలోని రాజూరాలో ఆయన జన్మించారు. 1938లో తొలిసారి అరెస్టయ్యారు. 1941– 42లో ఖద్దరు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1947లో కింగ్కోఠి నుంచి బయటకు వచ్చిన నిజాం నవాబుపై బాంబులు విసిరిన ఘటనలో బాపూజీ నిందితుడిగా ఉన్నారు. మహారాష్ట్రలోని చాందా మిలటరీ క్యాంపులో పంజాబ్ రెజిమెంట్ మేజర్ పీస్ గుహాన్ వీరికి శిక్షణ అందించారు. అక్కడ క్యాంపు ఇన్చార్జి గోపాల్శాస్త్రి బేకర్, బల్లార్షా క్యాంప్ ఇన్చార్జిగా కేవీ కేశవులు ఉన్నారు. కొండా లక్ష్మణ్ ఈ క్యాంపులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. హైదరాబాద్ సంస్థాన్ను ఇండియన్ యూనియన్లో కలపాలనే ఉద్యమం కారణంగా ఆయన 13సార్లు అరెస్టు అయ్యారు. -
వేతనాలు ఇప్పించండి సారూ..!
ఆసిఫాబాద్రూరల్: ‘మా పెండింగ్ వేతనాలు ఇప్పించండి సారూ’ అని గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు సో మవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించా రు. వారు మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏడు నెలలు గా వేతనాలు రావడం లేదని తెలిపారు. 30 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు రెగ్యులరైజ్ చేయాలని, టైం పే స్కేల్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణమాచారి, గంగుబాయి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా.. బారులు
దహెగాం(సిర్పూర్): జిల్లాలోని రైతులకు యూరి యా కష్టాలు తప్పడం లేదు. బస్తాలు అందిస్తున్నారని తెలియగానే పంపిణీ కేంద్రాలకు తెల్లవారుజామునే పనులన్నీ వదులుకుని చేరుకుంటున్నారు. ఖాళీ కడుపుతో కార్యాలయం తెరవకముందు నుంచి క్యూలైన్లు కడుతున్నారు. జిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. పత్తితోపాటు వరి పంటకు ఎరువులు వేసే సమ యం కావడంతో సోమవారం పలు మండలాల్లో అన్నదాతలు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టాల్సి వచ్చింది. దహెగాం పీఏసీఎస్సీలో రెండు లారీ లోడ్లు 800 బస్తాలు, గిరవెల్లి రైతువేదిక వద్దకు 800 బస్తాలు రాక రైతులు బారులు తీరారు. ముందుగా టోకెన్లు తీసుకున్నవారికి ఎకరానికి ఒకటి, రెండు బస్తాలు అందించారు. పెంచికల్పేట్(సిర్పూర్): మండలంలోని ఎల్కపల్లి రైతువేదిక వద్ద యూరియా కోసం రైతులు క్యూలైన్లో బారులుతీరారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో రెండు లారీ లోడ్ల బస్తాలు రానున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా టోకెన్లు జారీ చేశారు. రెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని పీఏసీఎస్కు దాదాపు 2,200 యూరియా బస్తాలు వచ్చినా రైతుల ఆందోళనలు తగ్గడం లేదు. రైతువేదిక వద్దకు భారీ సంఖ్యలో రైతులు రాగా.. పాత టోకెన్లు పూర్తయ్యాక కొత్తవి జారీ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. పంటలు దెబ్బతింటుండగా అధికారులు బస్తాలు అందుబాటులో ఉంచుకుని టోకెన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు జాతీయ రహదారికి పైకి వచ్చి బైఠాయించారు. ఎస్సై వెంకటకృష్ణ కొత్త టోకెన్లు ఇప్పిస్తామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.స్టాక్ ఉన్నా తప్పని తిప్పలుక్యూలైన్లలో జిరాక్స్లు రెబ్బెన పీఏసీఎస్లో దాదాపు 2,200 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ప్రకటించడంతో రైతులు తెల్లవారుజామునే రైతువేదిక వద్దకు చేరుకున్నారు. అధికారులు వచ్చేందుకు సమయం పట్టడంతో పట్టాపాస్ పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లను క్యూలైన్లలో పెట్టి నిరీక్షించారు. అనంతరం టోకెన్ల వారీగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున అందించారు. ఎస్సై వెంకటకృష్ణ పంపిణీని పర్యవేక్షించారు. -
‘అమ్మ’ మొక్కను బతికించాలి
ఆసిఫాబాద్రూరల్: అమ్మ పేరుతో నాటిన మొక్కను బతికించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివా రి అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మొక్కలు నాటించారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి వారు మొక్కలు నాటారు. జి ల్లాలోని 1,065 పాఠశాలల్లో 20,327 మొక్కలు నాటినట్లు తెలిపారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటిన మొక్క ఫొటోను ఏకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ పోర్టల్లో అప్లోడ్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, ప్రిన్సిపాల్ మహేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పురుషోత్తంరావు ఆశయాలు సాధిస్తాం
కాగజ్నగర్టౌన్: ప్రజా సేవలో ప్రాణాలు త్యా గం చేసిన నేత, దివంగత ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు ఆశయాలు సాధిస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం కీడ్రా మైదానంలో సోమవారం ప్రజాబంధు పాల్వా యి పురుషోత్తం రావు స్మారక క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే హరీశ్బాబు, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పురుషోత్తం రావు 26వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పురుషోత్తం రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే నివాసం, పట్టణంలోని నౌగాం బస్తిలో నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, వీరభద్రచారి, సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఇంటి ఎదుట అంగన్వాడీల ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల స మయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం ఎ దుట సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నా ని ర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీని వాస్ మాట్లాడుతూ అంగన్వాడీలకు రూ.18వేల వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ జీవో నం.8 సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, 24 రోజుల సమ్మె కాలపు వేత నం ఇతర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. కేంద్ర ప్ర భుత్వం ఐసీడీఎస్తోపాటు విద్యా వ్యవస్థను నిర్వీ ర్యం చేసేందుకు తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్య ల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు వనిత, ఉమాదేవి, తార, రాధ, సువర్ణ, రాజేశ్వరి, చంద్రకళ, తిరుపతమ్మ తదతరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అన్నదాత
కెరమెరి(ఆసిఫాబాద్): యూరియా కోసం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ‘కావాలి కా వాలి.. యూరియా కావాలి..’ అంటూ నినా దాలు చేశారు. ఏవో యుగేంధర్, ఎస్సై మధుకర్ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. మూడు వాహనాలు వచ్చినట్లు సమాచారం ఉందని, కానీ ఒకే లోడ్ ఇక్కడ దింపారని, సాగుఎకరాల ప్రకారంగా యూ రియా పంపిణీ చేయాలని పట్టుబట్టారు. ఏవో మాట్లాడుతూ ఇండెంట్ పంపించినా ఒకటే లోడ్ వచ్చిందని, ఒకరికి రెండు బస్తాలే మాత్రమే ఇస్తామని చెప్పారు. రెండు రోజుల్లో మరో వాహనం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా సో మవారం ఉదయం 5 గంటలకే రైతులు కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 8:30 గంటలకు అధికారులు వచ్చి టోకెన్ల ప్రకారం బస్తాలు ఇవ్వడం ప్రారంభించడంతో కొంత వాగ్వాదం జరిగింది. క్యూలో ఉ న్నవారికి ఇవ్వాలని కొందరు పట్టుబట్టారు. ఏఈవో, ఎస్సై వారిని శాంతింపజేశారు. -
సమాజంలో ఇంజినీర్ల పాత్ర కీలకం
రెబ్బెన(ఆసిఫాబాద్): సమాజంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమైందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటిటౌన్ షిప్లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సృజనాత్మకతో పనిచేసే ప్రతీ ఇంజినీరు దేశానికి ఎంతో అవసరమన్నారు. సైన్స్ అంటేనే తెలుసుకోవడమని, ఇంజినీరింగ్ అంటేనే సృష్టించడం అని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ నిర్విరామంగా కొనసాగేందుకు అన్ని విభాగాలు ఎంతో అవసరమని, అందులో ఇంజినీరింగ్ విభాగం ఎంతో కీలకమన్నారు. అనంతరం సివిల్ డీజీఎం ఎస్కే మదీనాబాషాను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, డీజీఎం ఉజ్వల్కుమార్, ప్రాజెక్టు ఇంజినీరు వీరన్న, పర్సనల్ హెచ్వోడీ శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. సీహెచ్పీ ఇంజినీర్లకు సన్మానంగోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే సందర్భంగా గోలేటి సీహెచ్పీలో పనిచేస్తున్న ఇంజినర్లను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అన్నం రమేశ్, సభ్యులు మహేందర్రెడ్డితో కలిసి సీహెచ్పీ హెచ్వోడి కోటయ్యతోపాటు మిగిలిన వారిని శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. -
కోల్ ఇండియా స్థాయిలో పతకాలు సాధించాలి
రెబ్బెన: సింగరేణి క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని ఖైరిగూర ప్రాజెక్టు అధికారి నరేందర్ అన్నారు. డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ 92వ వార్షిక క్రీడల్లో భాగంగా ఆదివారం గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో డిపార్ట్మెంటల్ టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీవో నరేందర్ మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటమలు సహజమన్నారు. ప్రతీ క్రీడాకారుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ పోటీల్లో రాణించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. సింగరేణి క్రీడాకారులు కోల్ఇండియా పోటీల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శించి పతకాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్అండ్జీఏ వైస్ ప్రెసిడెంట్ రామజల్లు, డీజీఎం ఉజ్వల్కుమార్ బెహరా, ఎస్టేట్స్ అధికారి సాగర్, ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీధర్, చీఫ్ కోర్డినేటర్ శ్రీనివాస్, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోఆర్డినేటర్ అన్వేష్, జనరల్ కెప్టెన్ కిరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
● చారిత్రక సాక్ష్యాలు.. ఈ నిర్మాణాలు
వరదలను తట్టుకుని నిలిచిన ‘కడెం’కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్ట్. 18 గేట్లున్న దీని పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం దీని సామర్థ్యం 4.699 టీఎంసీలు మాత్రమే. కుడి, ఎడమ కాలువల ద్వారా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట్, హాజీపూర్ మండలాల్లోని 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తుంది. గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై 1949లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. 1958లో 9 జర్మనీ టెక్నాలజీ గేట్లతో నిర్మాణం పూర్తయింది. 1958 ఆగష్టులో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్ట్ తెగిపోయింది. అవుట్ఫ్లో సామర్థ్యం పెంచేందుకు 1969లో మరో 9 ఇండియన్ గేట్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 1995, 2022, 2023లో ప్రాజెక్ట్ సామర్థ్యానికి మించి భారీ స్థాయిలో(5లక్షల క్యూస్కెకులకు పైగా) ఇన్ఫ్లో వచ్చి గేట్లపై నుంచి వరద పారినా ఏమీ కాలేదు. అప్పటి ఇంజినీర్ల నైపుణ్యంతో నేటికీ కడెం ప్రాజెక్ట్ చెక్కుచెదరకుండా నిర్మల్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి అండగా నిలుస్తోంది. నిర్మాణ కౌశలం.. నిమ్మల ఉమ్మడి జిల్లాలో నిజాం, నిమ్మల రాజుల హయాంలో నిర్మించిన పలు కట్టడాలు చారిత్రక సాక్ష్యాలు గా దర్శనమిస్తున్నాయి. శతాబ్దాలు దాటినా చెక్కు చెదరని ఆ నిర్మాణా లు నాటి ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తున్నాయి. భారీ వరదలను సైతం తట్టుకుని నిలిచిన కడెం ప్రాజెక్టు ఇందులో ప్రత్యేకం. ఇక ఆదిలాబాద్లోని మావల చెరువు గ్రావిటీ స్పెషల్గా.. ఖానాపూర్లోని సదర్మాట్ ఆనకట్ట వారసత్వ కట్టడంగా నిలుస్తున్నాయి. నిర్మల్ బురుజులు, కోటలు, నస్పూర్లోని గడి, ఆసిఫాబాద్లోని జిల్లా జైలు నాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటుతున్నాయి. నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.వారసత్వ కట్టడంగా ‘సదర్మాట్’అప్పటి ఇంజినీర్ల గొప్పతనమే.. కడెం చాలా పురాతన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసిన ఆనాటి ఇంజినీర్ల ప్రతిభతో నేటికీ ఆయకట్టుకు సాగునీరందిస్తోంది. భారీ వరదలనూ తట్టుకుని నిలవడం అప్పటి ఇంజినీర్ల గొప్పతనమే. – ప్రవీణ్, ఈఈ, కడెం -
‘ఫొటో ఎక్స్పో’ పోస్టర్ ఆవిష్కరణ
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు నివాసంలో ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫొటో ఎక్స్పో పోస్టర్లను ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక పరికరాలపై ఫొటోగ్రాఫర్స్ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు సమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలి సతీశ్, కోశాధికారి రాచర్ల వినయ్, కాగజ్నగర్ మండల అధ్యక్షుడు అనుమల్ల రాధాకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కుందారపు రాజు, కోశాధికారి నారాయణ, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు. -
నిజాం నాటి ఆసిఫాబాద్ జైలు
ఆసిఫాబాద్: 1916లో అప్పటి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్లో గల జన్కాపూర్లో ఐదెకరాల్లో జైలు నిర్మించారు. నిజాం హయాంలో దీనిని పూర్తిగా డంగుసున్నంతో నిర్మించారు. ఇందులో మూడు బారక్లు ఉన్నాయి. సుమారు 200 మంది ఖైదీలు ఉండేలా భవన నిర్మాణం చేపట్టారు. అనంతరం కొన్నేళ్లపాటు మూసి ఉండగా మరమ్మతులు చేసి 1991 మార్చి 15న అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఎంజీ గోపాల్ తిరిగి ప్రారంభించారు. 17 ఏళ్లపాటు తిరిగి జిల్లా జైలుగా కొనసాగగా అనంతరం ఆసిఫాబాద్ జిల్లా జైలును 2008లో ఆదిలాబాద్కు తరలించి, ఇక్కడి జైలును స్పెషల్ సబ్ జైలుగా మార్చారు. -
‘సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె’
ఆసిఫాబాద్రూరల్: గిరిజన హాస్టల్ డెయిలీవే జ్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించే వర కు సమ్మె కొనసాగుతుందని మధ్యాహ్న భోజ న కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేస్తున్న ఽసమ్మె ఆది వారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పని చేస్తున్న వర్కర్లు గత 30 ఏళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏఐటీయూసీ నాయకులు టీకానంద్, చిరంజీవి, వర్కర్లు గంగుబా యి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
120 ఏళ్ల ‘నస్పూర్ గడి’
నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ పరిధిలోని విలేజ్ నస్పూర్లో 120 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడి నాటి పాలనకు సాక్ష్య ంగా నిలుస్తోంది. 1905లో నిజాం హయాంలో నస్పూర్కు చెందిన జీవీ వంశీయులు ఇనుము, కాంక్రీట్ వాడకుండా కేవలం డంగుసున్నంతో రెండంతస్తుల భవనం నిర్మించారు. చుట్టూ నాలుగెకరాల ప్రహరీ సైతం డంగుసున్నంతోనే నిర్మించడం ప్రత్యేకత. ఈ గడి కేంద్రంగా నిజాం సంస్థానాధీశులు లక్సెట్టిపేట, ఇందారం, జన్నారం, తపాలాపూర్, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, మహారాష్ట్రలోని సిరొంచ, చంద్రపూర్, మధ్యప్రదేశ్లోని బస్తర్ వరకు ఇక్కడి నుంచే పాలన కొనసాగించే వారు. స్వాతంత్య్రానంతరం ఈ కట్టడం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. కొద్ది నెలల క్రితం హెరిటేజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆధునికీకరించారు. -
క్రీడలకు దూరంగా..!
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువకులు, చిన్నారులు ఉన్నా శిక్షణ లేకపోవడంతో నైపుణ్యం మెరుగుపర్చుకోలేక పోతున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక సతమతమవుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి..జిల్లాలో మొత్తం 721 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 563, ప్రాథమికోన్నత పాఠశాలలు 100, ఉన్నత పాఠశాలలు 58 ఉండగా ఆయా పాఠశాలల్లో మొత్తం 39,246 మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ 58 ఉన్నత పాఠశాలల్లో కేవలం 24 మంది పీడీలు, నలుగురు పీఈటీలు విధులు నిర్వహిస్తున్నారు. మిగితా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేక, క్రీడలు ఆడించేవారు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. కళాశాలల్లో పీడీలు కరువు..జిల్లాలో ఉన్న 11 పభుత్వ కళాశాలల్లో ఒక్క పీడీ కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఏళ్లుగా ఈ పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. గతంలో వెలువడిన ఉద్యోగ ప్రకటనల్లో పీడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కొందరు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. వసతి గృహాల్లో, గురుకుల, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు క్రీడలు ఆడించేందుకు పీడీలు అందుబాటులో ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆడించే క్రీడా పోటీల్లో హాస్టళ్ల విద్యార్థులు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. టైంటేబుల్లో ఒక పీరియడ్..పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగిస్తే శారీరకంగా ఎదగడంతో పాటు విద్యార్థుల్లో పోటీతత్వం, స్నేహభావం, మానసిక పరిపక్వత పెరుగుతుంది. ఇందుకు అనుగుణంగా ప్రతీ పాఠశాలలో విద్యార్థుల సమయసారిణి (టైంటేబుల్)లో ఆటలకు ఒక పిరియడ్ సైతం కేటాయించారు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్ల క్రీడలపై విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఏటా ప్రభుత్వం ఆట వస్తువుల కొనుగోలు, ఆటల నిర్వహణ, క్రీడల అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు ఏటా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిస్తున్నా శిక్షకులు లేక క్రీడల్లో విద్యార్థుల నైపుణ్యం మెరుగుపడడం లేదు. క్రీడలతో మేలు విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే క్రీడలు ఆడించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఫిట్గా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడి లేకుండా చదువుల్లో సైతం రాణిస్తారు. పాఠశాల స్థాయిలోనే ప్రతీ పాఠశాలకు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటే పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. – రమాదేవి, డీఎస్వో -
అంబులెన్స్లో ప్రసవం
నార్నూర్: మండలంలోని సుంగాపూర్ పంచా యతీ పరిధి కొలాంగూడకు చెందిన దుర్వా రు క్మాబాయి అనే గర్భిణి 108 అంబులెన్స్లో ప్రసవించింది. శనివారం రాత్రి పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకోగా పురిటినొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్సులో ఆమెకు ప్రసవం చేయగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షే మంగా ఉన్నట్లు ఫైలట్ రాజ్కుమార్ తెలిపా రు. ఆమెను నార్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. అంబులెన్స్ సిబ్బందిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
వృద్ధ మహిళలకు ఆర్థిక భరోసా
ఆసిఫాబాద్అర్బన్: స్వయం సహాయక సంఘాల్లో (ఎస్హెచ్జీ) సభ్యుల వయస్సు 60 సంవత్సరాలకే పరిమితం చేయడంతో ఆ వయసు దాటిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధ మహిళల సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ –2025లో భాగంగా వృద్ధ మహిళలతోనూ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 9,644 మంది వృద్ధ మహిళలను గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. వారితో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించనున్నారు. ఒక్కో గ్రూప్లో 10 నుంచి 12 మంది సభ్యులు..ఒక్కో సంఘంలో 10 నుంచి 12 మంది సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఐదుగురు ఆపై సభ్యులతో కూడా గ్రూప్ ఏర్పాటు చేసుకోవచ్చు. తమ దైనందిన చర్యలు చేసుకునే వారు, కొంత వరకు ఇతరుల సహాయం పొందేవారు కూడా సభ్యులుగా చేరొచ్చు. సంఘం ఏర్పాటైన తరువాత గ్రూప్ పేరు మీద ఎస్బీ ఖాతా తెరిచి, తమ ఆదాయం మేరకు పొదుపు నిర్ణయించి నెలనెలా బ్యాంకులో జమ చేయాలి. సంఘాల పనితీరు ఆధారంగా ప్రభుత్వం గ్రేడింగ్ చేసి ఆర్ఎఫ్, వీఆర్ఎఫ్ నిధులను సంఘాలకు కేటాయిస్తుంది. సామాజిక మద్దతు..కుటుంబాల్లో వృద్ధులు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. సంపాదించే శక్తి సన్నగిల్లి ఆర్థిక భద్రత లేకపోవడం, అనారోగ్యం, మానసిక, శారీరక నియంత్రణ శక్తి ఉండకపోవడం, ఆత్మన్యూనతా భావం పెరగడం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సమస్యలను అధిగమించి సామాజిక మద్దతు కల్పించేందుకు 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకే సంఘాల్లో కొనసాగుతున్న వారి వయస్సు నిండితే వెంటనే గ్రూప్ నుంచి తొలగించకుండా వృద్ధుల సంఘాల్లోకి చేరుస్తున్నారు. 580 సంఘాల ఏర్పాటు లక్ష్యం..జిల్లాలో 60 సంవత్సరాల వయస్సు దాటిన 580 సంఘాలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 298 సంఘాలు ఏర్పాటు చేశారు. కొత్త సంఘాల ఏర్పాటుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. సంఘాల పేరున బ్యాంకులో ఖాతాలు తెరిపిస్తున్నారు. వారి వివరాలను ప్రత్యేక యాప్లోనూ నమోదు చేస్తున్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలి 60 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు ఆర్థిక సమస్యలు అధిగమించడానికి స్వయం సహాయక సంఘాలు ఎంతగానో తోడ్పడుతాయి. వృద్ధ మహిళలతో సంఘాలు ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 298 సంఘాలను ఏర్పాటు చేశాం. ఇంకా 292 సంఘాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. అర్హత కలిగిన వృద్ధ మహిళలకు సంఘాల్లో అవకాశం కల్పిస్తాం. ఎవరైనా ఉంటే ముందుకు రావాలి. – దత్తారావ్, డీఆర్డీవో -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్లో ఆదిలాబాద్ సత్తా
జఫర్గఢ్: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్షిప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో మెదక్ జట్టు మొదటి స్థానం, ఖమ్మం ద్వితీయ, వరంగల్ తృతీయ, ఆదిలాబాద్ జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలా బాద్ ప్రథమ, నల్లగొండ ద్వితీయ, కరీంనగర్ తృతీయ, నిజా మాబాద్ జట్టు నాలు గో స్థానంలో నిలిచా యి. ఈ జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు జయాకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి రమణ హాజరై మాట్లాడారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులకు గుర్తింపు ఉందన్నారు. అసోసియేషన్ బాధ్యులు నారాయణరెడ్డి, వీరభద్రరా వు, రవీందర్ కుమార్, వీరయ్య, కమల్కుమార్, తి రుపతి, శ్రీనివాస్రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు. -
జోహార్ వెంకటి
బెల్లంపల్లిరూరల్: ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు ఒడిశా (ఏవోబీ) రాష్ట్ర టెక్నికల్ టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు జాడి వెంకటి అలియాస్ విమల్ అలియాస్ సురేష్ అలియాస్ మంగన్న (56) అంత్యక్రియలు ఆదివారం చంద్రవెల్లిలో ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. గ్రామ శివారు చేరుకున్న మృతదేహానికి నివాళులర్పించేందుకు ప్రజాసంఘాలు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం, వివిధ పార్టీల నాయకులు, జనం భారీగా తరలివచ్చారు. ఎర్రని జెండాతో బాణాసంచా కాల్చుతూ విప్లవగీతాలు పాడుతూ నృత్యాలు చేస్తూ స్వగృహానికి తీసుకువచ్చారు. సంఘాల నాయకులు మృతదేహం వద్ద ఎర్రని జెండా కప్పి, పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. మృతదేహాన్ని చూసి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామ శివారులోని వెంకటికి చెందిన స్థలం వరకు అంతిమయాత్ర చేపట్టారు. అమరుడా లాల్ సలామ్, జోహార్ కామ్రేడ్ వెంకటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చెల్లెలు రామటెంకి సుజాత అన్న వెంకటికి తలకొరివి పెట్టింది. అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, కార్యదర్శి శాంతక్క, సభ్యులు సత్తక్క, కవిత, అనిత, రైతు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్, జిల్లా కార్యదర్శి రామడగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు వెంకటస్వామి, పూర్ణిమ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చాంద్పాషా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్, మాజీ జెడ్పీటీసీ రాంచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ నాయకులు శంకర్, స్వామి, ప్రజా కళా మండలి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆడెపు సమ్మయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, అభిమానులు ఆయనకు విప్లవ జోహర్లు అర్పించారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని అమవీరుల బంధుమిత్రల కమిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, రాష్ట్ర కార్యదర్శి శాంతక్క డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్పై కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదన కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. -
‘చలో భద్రాచలం’ విజయవంతం చేయండి
ఆదిలాబాద్రూరల్: ఈనెల 28న నిర్వహించే చలో భద్రాచలం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 9 తెగల ఆదివాసీలు విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ సంఘాల రాష్ట్రస్థాయి రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సోయం బాపూరావు, జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని చలో భద్రాచలం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 9న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ, ఆ తర్వాత ఢిల్లీలో సభ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో 9 తెగల సంఘాల నాయకులు, అడ్వొకేట్ సంఘం, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. -
మావల @ గ్రావిటీ స్పెషల్
కై లాస్నగర్: నిజాం హయాంలో ఆదిలాబాద్ పట్టణానికి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసేలా చేపట్టిన పైపులైన్, ఫిల్టర్బెడ్ నిర్మాణాలు నాటి ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా నిజాం హయాంలో ఆదిలాబాద్ వాసుల దాహా ర్తి తీర్చేందుకు పట్టణానికి పది కిలోమీటర్ల దూ రంలో గల మావల అటవీ ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. 1925లో నిర్మాణాన్ని ప్రారంభించగా 1948లో అందుబాటులోకి వచ్చింది. భారీ వరదలు, తుపానులు వచ్చినా తట్టుకుని నిలబడేలా కట్టను నిర్మించారు. ఇప్పటికీ చిన్నపాటి లీకేజీలు సైతం లేకపోవడం పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా చెరువు నుంచి ఫిల్టర్బెడ్ వరకు భూగర్భంలో నిర్మించిన ఫైపులైన్ ఔరా అనిపిస్తోంది. గ్రావిటీ ద్వారా వచ్చే చెరువు నీరు ఆదిలాబాద్ పట్టణంలోని 25 శాతం జనాభాకు తాగునీటి ఇబ్బందులను దూరం చేస్తోంది. ఫిల్టర్బెడ్ మావల చెరువు నుంచి వచ్చే నీటిని శుద్ధిచేసేలా కలెక్టరేట్ పక్కన పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫిల్టర్బెడ్ సైతం ప్రత్యేకంగా నిలుస్తోంది. చెక్డ్యాంల ద్వారా మూడు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని పంప్హౌస్ నుంచి పట్టణంలోని ట్యాంకులకు విడుదల చేస్తారు. వాటి ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోంది. దీనిని లండన్కు చెందిన ది క్యాండీ ఫిల్టర్ కంపెనీ 1947లో నిర్మించడం గమనార్హం. ఆదిలాబాద్లోని ఫిల్టర్బెడ్ గ్రావిటీ ద్వారా నీరందించే మావల చెరువు -
రెండు బైక్లు ఢీకొని ఒకరు మృతి
రెబ్బెన: మండలంలోని వంకులం స మీపంలో పెద్దవా గు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఒకరు అక్కడికక్క డే మృతి చెందా డు. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం రాపెల్లికి చెందిన సు నార్కర్ ఆనంద్రావు (47) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం కాగజ్నగర్ నుంచి బైక్పై రాపెల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో ఆయన తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరోబైక్పై ప్రయాణిస్తున్న ఎన్నం తిరుపతి, ఎన్నం కృష్ణకుమార్కు గాయాలు కాగా ప్రైవేటు వాహనంలో కా గజ్నగర్ తరలించారు. మృతుడికి భార్య, ఇ ద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య సురేఖ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామం 61వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి గాయాలయయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసా పట్టణంలోని రాహుల్నగర్కు చెందిన రోహిత్ (21), చంద్రకాంత్లు బైక్పై నిర్మల్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో అతివేగంగా, జాగ్రత్తగా నడుపుతూ నిలిపి ఉన్న ఎడ్లబండిని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రోహిత్కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 వాహనంలో నిర్మల్ తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. చంద్రకాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: మండలంలోని గురిజాల రైతువేదికలో జూలై 3న జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు రెండు నెలలకు దొంగలను పట్టుకున్నారు. పోలీసుస్టేషన్లో బెల్లంపల్లి రూరల్ సీఐ చందవోలు హనోక్ ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. గురిజాల రైతు వేదికలో రూ.1.90 లక్షల విలువ గల వీడియో కాన్ఫరెన్స్కు ఉపయోగించే ఎల్ఈడీ టీవీ, ఇతర సామగ్రి చోరికి గురైనట్లు వ్యవసాయ అధికారులు తాళ్లగురిజాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. కన్నెపల్లి మండలం జన్కాపూర్కు చెందిన మహమ్మద్ నసీమ్ బేగ్, బెల్లంపల్లి అశోక్నగర్కు చెందిన వర్మ శైలేష్లు జూలై 3న అర్థరాత్రి ఆటోలో వచ్చి బండరాయితో తాళం పగులగొట్టి ఎల్ఈడీ టీవీ, సౌండ్ బాక్స్లు, సీపీయూ, ఆంఫ్లీఫయార్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఆ సామగ్రిని బెల్లంపల్లిలో విక్రయించేందుకు వస్తున్నారు. తాళ్లగురిజాల పోలీసులు శనివారం వాహనాల తనిఖీలో ఆటోలో ఎల్ఈడీ టీవీ, సామగ్రి అనుమానస్పదంగా కనిపించడంతో సదరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఇద్దరు నిందితులను బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. తాళ్లగురిజాల ఎస్సై బండి రామకృష్ణ, ఏఎస్సై అలీ, సిబ్బంది అరుణ్, మురళీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్షాక్తో ఒకరు మృతిమందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధి యాపల్ ప్రాంతంలోని జీఎం ఆఫీస్ సమీపంలో ఆదివారం విద్యుత్ షాక్తో ఛత్తీస్గఢ్కు చెందిన సుకులాల్ యాదవ్ (31) మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. నాలుగేళ్ల క్రితం సుకులాల్ కుటుంబంతో జీవనోపాధి కోసం మందమర్రికి వచ్చారు. కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం పనికి వెళ్లడానికి వేడి అన్నం పెట్టుకున్నాడు, చల్లార్చుకోడానికి కూలర్ స్విచ్ ఆన్చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమీపంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. సుకులార్ మృతదేహాన్ని చత్తీస్గఢ్ తరలించేందుకు హిందూ శ్మశానవాటిక కేకే–ఓసీ కమిటీ సభ్యులు విరాళాలు సేకరించి రూ.70 వేలను కుటుంబసభ్యులకు అందించారు. -
అ‘పూర్వ’ కలయిక
14ఎంసీఎల్256: 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, గురువులుమంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973–74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరూ ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. వీరి అపూర్వ కలయికకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులు నర్సయ్య, కాంతయ్య, డి.నారాయణరావు, ఎస్.సూర్యనారాయణలను సన్మానించారు. పూర్వవిద్యార్థులు మంగీలాల్సోమాని, గుండా సుధాకర్, అనిల్కుమార్, సుబ్రహ్మణ్యం, జుబేర్ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. – మంచిర్యాలఅర్బన్మంచిర్యాలఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973–74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరూ ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. వీరి అపూర్వ కలయికకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులు నర్సయ్య, కాంతయ్య, డి.నారాయణరావు, ఎస్.సూర్యనారాయణలను సన్మానించారు. పూర్వవిద్యార్థులు మంగీలాల్సోమాని, గుండా సుధాకర్, అనిల్కుమార్, సుబ్రహ్మణ్యం, జుబేర్ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి’
ఆసిఫాబాద్: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ గిరిజనులకు అందాల్సిన అభివృద్ధి, సంక్షేమ, రిజర్వేషన్ ఫలాలను లంబాడాలు అనుభవిస్తున్నారన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అక్టోబర్ 6న భద్రాద్రి కొత్తగూడెం నుంచి పాదయాత్ర, 15న తహసీల్దార్ కార్యాలయాల్లో, 20న కలెక్టర్ కార్యాలయాల్లో, 30న ఐటీడీఏ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేత, నవంబర్ 9న ఉమ్మడి వరంగల్లో, డిసెంబర్ 9న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంఘం జాతీయ అధ్యక్షుడు బుర్స పోచయ్య, ప్రధాన కార్యదర్శి సిద్దబోయిన లక్ష్మీనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్లు గణేశ్, రవీందర్, నర్సింగ్రావు, నాయకులు పోడెంబాబు, దుర్గు, ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆగని నెత్తుటి త్యాగాల ధార
బెల్లంపల్లి: విప్లవోద్యమ చరిత్రలో బెల్లంపల్లికి ఎంతో ప్రత్యేకత ఉంది. పోరాటాల పురిటిగడ్డగా ప్రసిద్ధిగాంచింది. బొగ్గు గనుల క్షేత్రమైన ఈ ప్రాంతం నుంచి ఎందరో యువకులు విప్లవోద్యమంలో చేరి ఏళ్ల తరబడి నుంచి అసువులు బాస్తున్నారు. నేటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. విప్లవమే జీవితాశయంగా ఎంచుకుని సాయుధ గెరిల్లా పోరాట పంథాలో సాగుతూ పోలీసు ఎదురుకాల్పులు, అనారోగ్య సమస్యలతో ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ త్యాగాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఆ అమరుల నెత్తుటి త్యాగాలతో నల్ల నేల ఎరుపు వర్ణాన్ని పులుముకుంటోంది. అజ్ఞాతంలోకి వెళ్లి దండకారణ్యానికి ఉద్యమబాటలు వేసిన విప్లవకారుల్లో ఈ ప్రాంత అమరుల భాగస్వామ్యం ఎంతో ఉంది. త్యాగాల నెత్తుటి సాళ్లలో మొలకెత్తిన ఆ విప్లవ బీజాలు ప్రస్తుతం కానరాకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దౌర్జన్యాలు, దాష్టీకాలు సహించలేక.. విప్లవ పోరాటానికి ఆకర్శితులైన యువకుల్లో అత్యధిక మంది నిరుపేద, కార్మిక బిడ్డలే. సింగరేణి కార్మికులపై గని అధికారులు సాగిస్తున్న వేధింపులు, దోపిడీ, దౌర్జన్యాలు, అట్టడుగు వర్గాల ప్రజలు, బస్తీల్లో మహిళలపై గూండాలు సాగిస్తున్న దాష్టీకాలకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ప్రజాకంఠకులుగా మారిన గూండాలు, రౌడీలను అంతమొందించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) తరపున గని అధికారుల దోపిడీ, దౌర్జన్యాలు ఎదిరించి విప్లవమార్గంలో పయనించారు. పీపుల్స్వార్, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) నిర్మాణంలో కార్మిక, నిరుపేద వర్గాల బిడ్డలు భాగస్వాములై రహస్య జీవితంలోకి వెళ్లారు. ఆద్యులు ఆ ముగ్గురు సింగరేణి కార్మిక బిడ్డలైన గజ్జెల గంగారాం, పెద్ది శంకర్, కటకం సుదర్శన్ విద్యార్థి దశలో రాడికల్ విప్లవోద్యమాలకు ఆకర్శితులయ్యారు. విప్లవోద్యమ చరిత్రలో వీరు ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. వీరి అడుగుజాడల్లో ఎందరో యువకులు పోరు బాటపట్టారు. దశాబ్దాలుగా రహస్య జీవితం గడుపుతూ ఎన్కౌంటర్లో అమరులవుతున్నారు. ఎక్కడ జరిగిన అక్కడ బెల్లంపల్లి బిడ్డ ఎవరో ఒకరు నేలకొరగడం ఈ ప్రాంత ప్రజలను, విప్లవ సానుభూతిపరులను తీవ్రంగా కలిచివేస్తోంది. తొలి అమరుడు పెద్ది శంకర్ బెల్లంపల్లి విప్లవకారుల్లో తొలి అమరుడిగా పెద్ది శంకర్ చరిత్ర పుటలకెక్కారు. 1980లో మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా మోయిన్బిన్పేట వద్ద జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందాడు. ఆయుధాలను పరీక్షిస్తుండగా వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేనేడ్ పేలి 1981లో గజ్జెల గంగారాం అమరుడయ్యాడు. 1985లో పులి మధునయ్య సిర్పూర్ తాలూకా లోడ్పల్లి వద్ద, 1987లో బుయ్యారం వద్ద ముద్దు నారాయణ, ఈట శంకర్, మురళీ, 1999లో నస్పూర్ కాలనీలో సికాస అగ్రనేత గెల్లి రాజలింగు, 2000లో తిర్యాణి మండలం లోవగుట్ట వద్ద ఇద్దరు ఆదివాసీ దళసభ్యులతోపాటు శనిగారపు రాంచందర్, 2002లో పులిపాక లక్ష్మణ్ను హైదరాబాద్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గజ్జెల గంగారాం సోదరి గజ్జెల సరోజ దండకారణ్యంలో అనారోగ్యంతో 2013లో అమరురాలైంది. అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగిన కటకం సుదర్శన్ 2023 మే 31న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ్ బస్తర్ అడవుల్లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. 2024లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో కాసరవేణి రవి మృతి చెందగా తాజాగా ఈనెల 11న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబండ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి అసువులు బాశాడు. -
వెంకటి మృతదేహానికి వవెళ్లిన అంబులెన్స్కు దారికష్టాలు
బెల్లంపల్లి: ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జాడి వెంకటి మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన అంబులెన్స్కు దారి కష్టాలు ఎదురయ్యాయి. బంధువులు వెంకటస్వామి, జనార్దన్, గ్రామస్తుడు దామోదర్గౌడ్లు శనివారం రాత్రి వెంకటి మృతదేహంతో చంద్రవెల్లికి తిరుగుపయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజాము మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో బురదలో చిక్కుకుంది. రెండు గంటలు శ్రమించిన బయటకు రాకపోవడంతో కిలోమీటరు దూరాన గ్రామానికి చేరుకుని ఓ ట్రాక్టర్ను, కొంతమందిని తోడ్కోని వచ్చి బయటకు తీశారు. వార్దా నది బ్రిడ్జి పై నుంచి నీటి ఉధృతి కారణంగా వెనక్కి మళ్లీ మరో దారిని ఎంచుకున్నారు. కుమురం భీం జిల్లా బెజ్జూరుకు అక్కడి నుంచి కౌటాల, కాగజ్నగర్ మీదుగా సాయంత్రం 4 గంటలకు చంద్రవెల్లికి చేరుకున్నారు. అమరుల బంధుమ్రితుల కమిటీ శ్రేణులు, గ్రామస్తులు, బఽంధువులు ఊరి పొలిమేరల నుంచి వెంకటి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంబులెన్స్కు దారికష్టాలుబెల్లంపల్లి: ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జాడి వెంకటి మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన అంబులెన్స్కు దారి కష్టాలు ఎదురయ్యాయి. బంధువులు వెంకటస్వామి, జనార్దన్, గ్రామస్తుడు దామోదర్గౌడ్లు శనివారం రాత్రి వెంకటి మృతదేహాంతో చంద్రవెల్లికి తిరుగుపయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజాము మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో బురదలో చిక్కుకుంది. రెండు గంటలు శ్రమించిన బయటకు రాకపోవడంతో కిలోమీటరు దూరాన గ్రామానికి చేరుకుని ఓ ట్రాక్టర్ను, కొంతమందిని తోడ్కోని వచ్చి బయటకు తీశారు. వార్దా నది బ్రిడ్జి పై నుంచి నీటి ఉధృతి కారణంగా వెనక్కి మళ్లీ మరో దారిని ఎంచుకున్నారు. కుమురం భీం జిల్లా బెజ్జూరుకు అక్కడి నుంచి కౌటాల, కాగజ్నగర్ మీదుగా సాయంత్రం 4 గంటలకు చంద్రవెల్లికి చేరుకున్నారు. అమరుల బంధుమ్రితుల కమిటీ శ్రేణులు, గ్రామస్తులు, బఽంధువులు ఊరి పొలిమేరల నుంచి వెంకటి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
నమ్మకమైన మోసాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుత్తడి ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో మోసాలు సైతం అదే తీరుగా పెరుగుతున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో వెలుగులోకి వచ్చిన మోసాలతో సర్వత్రా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమేర్పడింది. ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కొందరు బ్యాంకు ఉద్యోగుల తీరుతో ఆయా సంస్థల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారంపై రుణాలు పొందాలన్నా, రుణ సంస్థలపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారంతో పాటు విలువైన ఆస్తులు, బ్యాంకుల్లో తనఖా పెట్టేముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కొన్నిచోట్ల మోసం ఆదిలోనే బయటపడుతుండగా మరికొన్ని చోట్ల నెలలతరబడి జరుగుతోంది. నమ్మకమున్న చోటనే.. ప్రజల్లో బ్యాంకులపై నమ్మకానికి మారుపేరుగా విశ్వాసం ఉంది. అయితే కొంతమంది సిబ్బంది తప్పటడుగులతో అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. సాధారణంగా బ్యాంకులు, ప్రైవేటు రుణసంస్థల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగదు, బంగారం వంటి లావాదేవీల్లో క్షుణ్నంగా పరిశీలనలు, తనిఖీలు ఉంటాయి. ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ప్రతీస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుంది. అంతేకాక కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంటుంది. లావాదేవీల విషయంలో ప్రతీది అత్యంత భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే అలాంటి నమ్మకున్న చోటనే ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్రమత్తమైన బ్యాంకులు, సంస్థలు చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచి–2 వ్యవహారంతో బ్యాంకర్లు, రుణసంస్థలు అప్రమత్తమై తమ సంస్థల్లోని అన్ని బ్రాంచీల్లో బంగారం నిల్వలు, రుణాల లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ ఆడిట్లతో పాటు ఈ ఘటనల తర్వాత ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖాతాదా రులు సైతం కుదవపెట్టిన బంగారం, రుణాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడికక్కడ రుణాలపై క్షుణ్నంగా పరిశీలనలు చేస్తూ తమసంస్థల పరిధిలో ఉన్న సిబ్బందిపైనా కఠిన పర్యవేక్షణ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.ఇటీవల జరిగిన ఘటనలు -
వాగులో కలిసిన ప్రాణాలు
ఆసిఫాబాద్: ఖాళీ యూరియా సంచి నలుగురి ప్రాణాలు తీసింది. ఈత రాక నీటిలో మునిగిపోతు న్న బాలుడిని కాపాడే క్రమంలో ఇద్ద రు బాలికలు, బాలుడి తల్లి ప్రాణా లు వాగులో కలిసిపోయాయి. ఈ ఘటన వాంకిడి మండలం దాభా గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాభా గ్రామానికి చెందిన తల్లి మోర్లె నిర్మలాబాయి (33), కొడు కు మోర్లె గణేశ్ (12), మరో ఇద్దరు బాలికలు వాడై మహేశ్వరి (10), ఆదె శశికళ (8) మృత్యువాత పడ్డారు. దాభా గ్రామానికి చెందిన మోర్లె మహేందర్, నిర్మలాబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు గణేశ్ ఉన్నారు. గ ణేశ్ వాంకిడి మండల కేంద్రంలోని గ్రీన్వుడ్ స్కూల్లో ఐదో తరగతి, లలిత ఆరో తరగతి చదువుతున్నారు. గ్రామానికి చెందిన ఆదె శేఖర్ దంపతులకు కూతురు శశికళతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. వాడై వార్లు దంపతులకు మహేశ్వరితో పాటు మరో కూతురు ఉంది. శశికళ, మహేశ్వరి కూడా వాంకిడిలోని గ్రీన్వుడ్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నారు. శనివారం నిర్మలాబాయి కుమారుడు గణేశ్, కూతురు లలితతో కలిసి యూరియా సంచులు శుభ్రం చేసేందుకు గ్రామ సమీపంలోని వాగుకు వెళ్లింది. రెండో శనివారం సెలవు కావడంతో సమీప బంధువులైన బాలికలు మహేశ్వరి, శశికళ వీరితో పాటు వాగుకు వెళ్లారు. నిర్మల వాగునీటిలో సంచులు శుభ్రం చేస్తుండగా ఓ సంచి వాగులో కొట్టుకుపోయింది. దానిని పట్టుకునేందుకు గణేశ్ వాగులోకి దిగి లోతుగా ఉండడంతో మునిగిపోయాడు. ఒడ్డున ఆడుకుంటూ గమనించిన మహేశ్వరి, శశికళ కూడా వాగులోకి దిగి నీట మునిగారు. వాగులోకి దిగి వీరి ముగ్గురిని రక్షించే క్రమంలో నిర్మలాబాయి కూడా నీట మునిగింది. ఇదంతా గమనిస్తున్న నిర్మలాబాయి కూతురు లలిత అరుస్తూ సమీప పంట పొలాల వద్దకు వెళ్లగా గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. నీట మునిగిన నలుగురిని బయటకి తీయగా, అప్పటికే వారు విగతజీవులయ్యారు. వాగునీటిలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. చదువుతో పాటు అన్నింటిలో ముందుండే చిన్నారులు శశికళ, మహేశ్వరి, గణేశ్ మృతి చెందిన ఘటన కుటుంబీకులు, గ్రామస్తులను కంటతడి పెట్టింది. తల్లి, కొడుకుతో పాటు మరో ఇద్దరు బాలి కలు విగత జీవులుగా మారడంతో గ్రామస్తులు, బంధువుల రోదనలు సంఘటనా స్థలంలో మిన్నంటాయి. సీఐ సత్యనారాయణ, వాంకిడి, కెరమెరి ఎస్సైలు మహేందర్, మధూకర్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. నిర్మల భర్త మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి
ఆసిఫాబాద్: రాజీ మార్గంలోనే కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా సెషన్స్ జడ్జి ఎంవీ రమేశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదా యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అ దాలత్లో 8,811 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు పక్షాలు రా జీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే పై కో ర్టుకు అప్పీల్కూ వెళ్లే అవకాశం ఉండదని తెలిపా రు. రాజీ అయిన కేసుల్లో అదేరోజు అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 7,974 ప్రిలిటిగేషన్ కేసులు, 581 ఎస్టీసీ అడ్మిషన్, 191 సీసీ అడ్మిషన్, 40 సీసీ కాంప్రమైజ్ కేసులతోపాటు మరిన్ని కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రూ.2,36,68,862 అవార్డు, రూ.18,15,350 జరిమానా, రూ.4,62,080 బ్యాంక్ చెల్లింపులు, రూ.17,39,995 ఈ చలానాలు విధించినట్లు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి కే యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి రాపర్తి రవీందర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో.. సిర్పూర్(టి): మండల కేంద్రంలోని జూనియర్ సివి ల్ కోర్టు పరిధిలోని 405 కేసులు పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ కోర్టు సిర్పూర్(టీ) ఇన్చార్జి మెజి స్ట్రేట్ అనంతలక్ష్మి తెలిపారు. ఆన్లైన్లో జాతీయ లోక్అదాలత్ నిర్వహించినట్లుపేర్కొన్నారు. -
స్టేషన్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వేస్టేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. శని వారం ప్రత్యేక రైలులో కాగజ్నగర్ స్టేషన్కు వచ్చిన ఆయనకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బా బు స్వాగతం పలికారు. అనంతరం వారు స్టేషన్లో ని సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా జీ ఎం మాట్లాడుతూ.. ఈనెల 18న సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు (20102) కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో హాల్టింగ్ కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే స్టేషన్లో వసతుల పరిశీలన కు వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం స్టేషన్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని జీఎంకు ఎ మ్మెల్యే హరీశ్బాబు వినతిపత్రం అందజేశారు. స్టే షన్లోని మూడో ప్లాట్ఫాంపై కనీస వసతులు క ల్పించాలని, షెడ్లు నిర్మించాలని, టికెట్వెండింగ్ మి షన్ లేదా టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరా రు. మూడు ప్లాంట్ఫాంలకు మూడు లిఫ్ట్లు ఏర్పా టు చేయాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రయాణికులకు అనుగుణంగా వెడల్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప భక్తుల కోసం కేరళ ఎక్స్ప్రెస్ రైలును కా గజ్నగర్లో నిలుపాలని, చర్లపల్లి నుంచి వయా కా గజ్నగర్ మీదుగా హౌరాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని, పాటలీపుత్ర, గోరఖ్పూర్, అమృత్భారత్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని విన్నవించారు. ఇందుకు జీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జీఎంను ఎమ్మెల్యేతోపాటు రైల్వే యా త్రి సేవా సమితి, రైల్వే ఉద్యోగుల సంఘం, బీజేపీ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సన్మానించారు. కాగజ్నగర్ రైల్వే క్వార్టర్స్లో నివాసముంటున్న ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలు జీఎంకు సమస్యలు వివరించారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకుని వానాకాలంలో ఉరుస్తున్నాయని, ఇళ్లలోకి నీరు చేరుతోందని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి మున్సిపల్ కమిషనర్ రాజేందర్తో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కరించాలని సూచించారు. జీఎం వెంట డీఆర్ఎం గోపాలకృష్ణన్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్కే శర్మ, సీనియర్ డీఎం కోఆర్డినేటర్ డీఎస్ రామారావు, సికింద్రాబాద్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నవీన్కుమార్, డీవోఎం సురేశ్, డీసీఎం సఫాలీ, ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్ దాసు, జీఆర్పీలు సురేశ్, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. -
రోడ్డు పనుల్లో నాణ్యత లోపం
కెరమెరి: ఏజెన్సీ ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు ని ర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తోందని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ తెలిపారు. డీ ఆర్డీవో, అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడమే కారణమని ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో జిల్లా సలహాదారు కనక ప్రభాకర్, నాయకులు మడావి పురుషోత్తం, జ్యోతిరాంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కొన్నిచోట్ల రోడ్లు నిర్మించకున్నా నిర్మించినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరో పణలున్నాయని తెలిపారు. అక్రమాలపై కలెక్ట ర్ వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన అధికా రులపై చర్యలు తీసుకోకుంటే తుడుందెబ్బ ఆ ధ్వర్యంలో నిరసనలు చేపడతామని పేర్కొన్నా రు. ఈ విషయమై డీఆర్డీవో దత్తారాంను సంప్రదించగా.. రోడ్లు మంజూరు చేసే అధికారం తనకు లేదని, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయే అవసరం అంతకన్నా లేదని వివరించారు. -
ఎమ్మెల్యేను కలిసిన ఆర్అండ్బీ సీఈ
కాగజ్నగర్ టౌన్: ఆర్అండ్బీ సీఈ రాజేశ్వర్రెడ్డి శనివారం సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబును మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలోడి, సల్గుపల్లి మధ్య ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని సీఈని కోరారు. దీంతో కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు మండలాలకు పూర్తిగా డబుల్ రోడ్డు సౌకర్యం కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి పీఆర్ఐఎం నిధుల మంజూరుకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పిస్తానని తెలిపారు. వెంటనే సర్వే పూర్తి చేసి ప్రతిపాదనలు పంపించాలని కోరారు. స్పందించిన సీఈ పనుల వేగవంతం చేయడానికి ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారు. -
22 నుంచి బ్రహ్మోత్సవాలు
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని డౌనల్ ప్రాంతంలోగల శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 22నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గంగు సత్యనారాయణ తెలిపారు. ఈనెల 22న పల్లకీసేవ, 23న కల్పవృక్ష వాహన సేవ, 24 సూర్యప్రభ వాహన సేవ, 25న హంస వా హన సేవ, 26 శేష వాహన సేవ, 27న హనుమంత వాహన సేవ, 28న అశ్వ వాహన సేవ, 29న గజ వాహన సేవ, 30న సింహ వాహన సేవ, అక్టోబర్ 1న గరుడ వాహన సేవ, 2న ద సరా రోజు రథోత్సవం, శ్రీనివాస్ కల్యాణ మ హోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోజూ రాత్రి 7.30 నుంచి వాహన సేవ ప్రారంభమవుతుందని, భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
సార్లొస్తే ఓపెన్.. వెళ్లాక తాళం
కాగజ్నగర్ రైల్వేస్టేషన్ను శనివారం రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ్, ఇతర అధికారులు తనిఖీ చేశారు. ఈ సమయంలో 2, 3 ప్లాట్ఫాంలపై ఉన్న మల్టీపర్పస్ స్టాళ్లను అధికారులు హడావుడిగా తెరిపించారు. చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్బాటిళ్లు అందుబాటులో ఉంచారు. వారు వెళ్లాక వెంటనే మూసివేశారు. వీటిని నిత్యం మూసి ఉంచుతుండగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికధరకు బయటి నుంచి కొని తెచ్చుకుంటున్నారు. స్టాళ్లను నిత్యం తెరిచి ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. – కాగజ్నగర్ టౌన్ -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ వసతిగృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని హాస్టల్స్ డైలీవేజ్ వర్కర్స్ యూనియర్ రాష్ట్ర అధ్యక్షు డు ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ వసతిగృహాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యూనియన్ జిల్లా కార్యదర్శి వసంత్రావు, కోశాధికారి రాంబాయి, వర్క ర్లు గంగుబాయి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి దినపత్రిక ఎడిటర్, బ్యూరో ఇన్చార్జి, విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దాడులను ఉపేక్షించొద్దు. దీని వెనుక రాజకీయ నాయకులు ఎవరున్నా విచారణ చేపట్టి శిక్షించాలి. ఏపీలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. – దుర్గం దినకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న మీడియా గొంతు నొక్కడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్పై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిచడం సరికాదు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం. – భగత్ మహేందర్, అడ్వకేట్మీడియా గొంతు నొక్కడం సరికాదు -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ఆసిఫాబాద్రూరల్: చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఎస్వో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం క్రీడామైదానంలో శుక్రవారం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు ప్రారంభించారు. షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురువేందర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు 120 మంది క్రీడాకారులు హాజరు కాగా, ఇందులో ఉత్తమ ప్రతిభ చూపిన 24 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో మహబూబాబాద్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా కోచ్ రాకేశ్, పీడీలు రాజశేఖర్, యాదగిరి, చిరంజీవి, శిరీష, సునీత, హరిక తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఉపాధిహామీ పథకం ఏపీవోలు, సెర్ప్ ఏపీఎంలు, హౌజింగ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో వసతుల కల్పన, మొక్కల పెంపకం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎన్నికల సంబంధిత అంశాలు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖలవారీగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుని, లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వందశాతం ప్రారంభించాలన్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ లేకుండా గుంతలు పూడ్చాలని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టే చర్యల్లో భాగంగా ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారీ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, మైనార్టీ సంక్షేమ అధికారి నదీం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘ఓపెన్’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఈ నెల 22 నుంచి 28 వరకు నిర్వహించే ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ జూనియర్ కళాశాల, పదో తరగతి వారికి బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కొనసాగే ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 63 మంది, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే పదో తరగతి పరీక్షలకు 145 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి తిర్యాణి(ఆసిఫాబాద్): రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని గిన్నెధరి ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోగులతో మర్యాదగా వ్యవహరించాలని, విష జ్వరాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేశ్, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
జలం.. జర భద్రం!
కాగజ్నగర్ పట్టణానికి చెందిన రాథోడ్ అంకిత్(15) గత నెల 31న ఇద్దరు స్నేహితులతో కలిసి కోసిని డ్యాం చూసేందుకు వెళ్లాడు. అంకిత్ స్నానం చేసేందుకు డ్యాంలోకి దిగగా, లోతు ఎక్కువ ఉండడంతో నీటిలో గల్లంతై మృతి చెందాడు. చేతికందిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కౌటాల(సిర్పూర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, వార్ధా, పెన్గంగ, పెద్దవాగు నదుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, బావులు కూడా నిండుగా ఉన్నాయి. ఈ సమయంలో యువకులు సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల వద్ద పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టడంతో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏటా ఘటనలు పునరావృతమవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ముఖ్యంగా కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), బెజ్జూర్ మండలాల్లోని పె న్గంగ, ప్రాణహిత, వార్ధా నదుల వద్ద సాన్నాలకు వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కో ల్పోవడం కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఏటా ప్రమాదాలు..ఖాళీ సమయాలు, సెలవు రోజుల్లో ఈత సరదా కోసం బాలురు, యువకులు వ్యవసా య బావులు, చెరువులు, కుంటల వద్ద వెళ్తున్నారు. కొందరు వచ్చీరాని ఈత కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు ఊబిలో కూరుకుపోయి శ్వాస విడుస్తున్నారు. చెరువులు, కుంటల్లో మొరం కోసం ఇష్టారాజ్యంగా తవ్వకాలతో ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఇవేవీ గమనించకుండా చేపల వేటకు వెళ్లిన వారు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. జలాశయాల్లో నీరు అధికంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా కాపలాదారు(లస్కర్)ల పర్యవేక్షణ ఉండాలి. నీటిలోకి దిగకుండా నియంత్రించాలి. ప్రవాహ ఉధృతి ఉన్నచోట, లోతైన చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఉపాధి పను ల కింద నిర్మించి చెక్డ్యాంలు, కుంటలు, ఫారంపాండ్లు ఉన్న చోట స్థానికంగా పంచాయతీ అధికా రులు దండోరా ద్వారా హెచ్చరికలు జారీ చేయాలి. కానీ యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. నదుల పరీవాహకంలో ప్రమాదాలుకౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణ హిత నది మొదలై.. చింతలమానెపల్లి మండలం రణవెల్లి, భూరెపల్లి, కోర్సిని, దిందా, చిత్తాం, గూడెం, బూరుగూడ, బెజ్జూర్ మండలం సోమిని, తలాయి, పెంచికల్పేట్ మండలంలోని మురళీగూడ, దహెగాం మండలం మొట్లగూడ, రాంపూర్ గ్రామాల వరకు ప్ర వాహం ఉంటుంది. అలాగే పెన్గంగ నది సి ర్పూర్(టి) మండలం హుడ్కిలి, టోంకిని, వెంకట్రావుపేట, లోనవెల్లి, కౌటాల మండలంలోని వీరవెల్లి, తాటిపల్లి, వీర్ధండి, గుండాయిపేట వరకు ప్రవహిస్తుంది. సమీప గ్రా మాల్లోని ప్రజలు నిత్యం ఇక్కడికి సాన్నాల కోసం నదుల వద్దకు వెళ్తుంటారు. మహారా ష్ట్రకు నాటు పడవల్లోనూ ప్రయాణాలు సాగి స్తుంటారు. నదుల ఒడ్డున రక్షణకు నీటి జాకె ట్లు, గాలి నింపిన ట్యూబ్లు ఎక్కడా ఏర్పా టు చేయలేదు. ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్న పరీవాహక ప్రాంతాల్లోనే తరచూ ప్ర మాదాలు నమోదవుతున్నాయి. స్నానాలకు అనువైన ప్రదేశాలను గుర్తించడం లేదు. ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయడం లేదు. ఉన్నతా ధికారులు స్పందించి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవలి ఘటనలుపిల్లలపై దృష్టి సారించాలి బాలలు ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో కలిసి స్నానాలకు వెళ్తుంటారు. వర్షాకాలం నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. నదులు, వాగుల వద్దకు పంపించొద్దు. రెవెన్యూ, పంచాయ తీ, పోలీస్శాఖల ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ఎండీ వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్నగర్ -
పత్రికా స్వేచ్ఛపై దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని న్యాయవాదులు, ఉద్యమ సంఘాల నాయకులు తెలిపారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగడం, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టుల గొంతును నొక్కేసేలా వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని పేర్కొన్నారు.బెల్లంపల్లి: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం పత్రిక రంగం. పత్రికల్లో నిరాధారణమైన, అసత్యమైన వార్తా కథనాలు వస్తే వివరణ కోరవచ్చు. సదరు పత్రిక బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలు, అణచివేత విధానాలకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్పై అక్రమ కేసులు పెట్టడం సరైన విధానం కాదు. ఏదైనా సరే చట్టానికి లోబడి వ్యవహరించాలి. కానీ వేధింపులకు గురిచేసే ధోరణి ఏమాత్రం మంచిది కాదు. పత్రికా స్వేచ్ఛను కాలరాయాలనుకోవడం అవివేకం అవుతుంది. – అంకెం శివకుమార్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పత్రిక స్వేచ్ఛను కాలరాయొద్దు -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే..
ఆసిఫాబాద్అర్బన్: మీడి యా స్వేచ్ఛకు ఆటంకం కలిగించొద్దు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మీడియాపై అణచివేతకు పాల్ప డిన ఘటనలు లేవు. తప్పు డు వార్తలు రాస్తే వివరణ అడగాలి. అంతేగాని దౌర్జన్యానికి దిగడం సరికాదు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. సాక్షి పత్రిక ఎడిటర్పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. – రాపర్తి రవీందర్, ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆసిఫాబాద్అర్బన్: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అతి ముఖ్యమైంది. ఒకరు బహిరంగంగా చెప్పిన దానిని వార్తగా ప్రచురిస్తే సాక్షి పత్రిక ఎడిటర్పై కేసు పెట్టడం సమంజసం కాదు. కక్ష సాధింపు చర్యలను సమాజం హర్షించదు. రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్న ఈ ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం, తప్పుడు కేసులు పెట్టడం అప్రజాస్వామికం. – బోగె ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమాజం హర్షించదు -
పంటల డిజిటల్ సర్వే
వాంకిడి(ఆసిఫాబాద్): పంటల వివరాలు ఇకపై పక్కాగా ఉండనున్నాయి. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభమైంది. ఏటా ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించి పంట వివరాలు నమోదు చేస్తుంది. అధికారులు రైతులతో మాట్లాడి పంట వివరాలు సేకరిస్తుండగా, అందులో కచ్చితత్వం ఉండటం లేదు. పంట ఉత్పత్తులు అమ్మకానికి వచ్చే సమయంలో కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు తలెత్తేవి. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంతో క్లస్టర్ల వారీగా ఏఈవోలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి సర్వే నంబర్ల ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించి ఏఈవోలకు అందించింది. ఈ యాప్లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఒక సర్వే నంబరులో ఏ పంట ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారనేది కచ్చితమైన వివరాలు తెలియనున్నాయి. క్లస్టర్కు రెండు వేల ఎకరాలు..జిల్లాలో మొత్తం 70 క్లస్టర్లు ఉండగా 64 క్లస్టర్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయనున్నారు. ఒక్కొక్క వ్యవసాయ విస్తరణ అధికారి 2000 ఎకరాల్లో డిజిటల్ సర్వే నిర్వహించాలి. మహిళా వ్యవసాయ విస్తరణ అధికారులుగా ఉన్న క్లస్టర్లలో 1800 ఎకరాలను సర్వే చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా 70 క్లస్టర్ల పరిధిలో మొత్తం 4.42 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. ప్రస్తుతం చేపడుతున్న డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా 1,21,050 ఎకరాలకు సంబంధించిన పంట వివరాలు నమోదు చేయనున్నారు. మిగిలిన పంట వివరాలను గతంలో మాదిరి సాధారణ సర్వే చేపడతారు. డిజిటల్ సర్వేతో పంట వివరాలు నమోదు చేస్తుండటంతో కచ్చితత్వం ఉండనుంది. పంట ఉత్పత్తులు క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 4.42 లక్షల ఎకరాల సాగుభూమి..జిల్లాలో 4.42 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా రైతులు ఉండగా అత్యధికంగా పత్తి పంట పండిస్తున్నారు. 3.30 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుంది. వరి 56 వేల ఎకరాలు, కంది 36 వేల ఎకరాలు. మిగతా 23 వేల ఎకరాల్లో పెసర, కందులు, వేరుశనగ, ఆయిల్పామ్, మొక్కజొన్న, మిర్చి, పండ్ల తోటలు, కూరగాయలు వంటి తదితర పంటలు సాగు చేస్తున్నారు. గడువులోగా పూర్తి చేస్తాం జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. అక్టోబర్ 20 తేదీలోగా సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచనలు చేశాం. ఒక్కొక్క ఏఈవో 2000 ఎకరాల్లో పంట వివరాలు నమోదు చేస్తారు. డిజిటల్ సర్వేతో పంట ఉత్తత్తుల కచ్చితమైన వివరాలు తెలుస్తాయి. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారిఅక్టోబర్ 20 వరకు గడువు..పంట సాగులో కచ్చితత్వం కోసం ప్రభుత్వం డిజిటల్ సర్వే విధానాన్ని తీసుకువచ్చింది. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వివరాలు నమోదు చేయాలి. ఒక సర్వే నంబరులో ఎన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారో గుర్తించి వేర్వేరుగా సేకరిస్తారు. రైతు పేరు, సాగు చేస్తున్న పంట ఎన్ని ఎకరాల్లో ఉంది, రైతు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, పంటకు సంబంధించిన ఫొటో వంటి వివరాలను ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ సర్వే అక్టోబర్ 20 లోగా పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఏఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సర్వే అనంతరం వివరాలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. తద్వారా వివరాల నమోదులో తప్పిదాలు ఉంటే రైతులు పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సవరణల అనంతరం తుది జాబితాను ప్రదర్శిస్తారు. దీని ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు తప్పనున్నాయి. -
‘కార్మిక హక్కుల సాధనకు పోరాటం’
రెబ్బెన(ఆసిఫాబాద్): దేశవ్యాప్త బొగ్గు పరిశ్రమలు, సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుతున్నామని కోల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి మండ రమాకాంత్ అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయం ఎదుట బీఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎం విజయ భాస్కర్రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమల పరిరక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జూలై 23 నుంచి సెప్టెంబర్ 17 వరకు దేశవ్యాప్త ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, ప్రభావిత గ్రామాల ప్రజలను చైతన్యపరుస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బొగ్గు బకాయిలు రూ.42,732 కోట్లను వెంటనే చెల్లించాలని, బొగ్గు ఉత్పత్తిలో 50 శాతం పర్మినెంట్ కార్మికుల ద్వారా తీయాలని డిమాండ్ చేశారు. 2024– 25 సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలపై 40 శాతం వాటా చెల్లింపు తేదీని ప్రకటించాలన్నారు. కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్లపై ఐటీ రీయింబర్స్మెంట్ చెల్లించాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించి, క్వార్టర్లు కేటాయించాలని కోరారు. కార్యక్రమాల్లో బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులుగౌడ్, పెన్షనర్స్ అసోసియేషన్ కేంద్ర కార్యదర్శి లగిశెట్టి కమలాకర్, నాయకులు తాళ్లపెల్లి రాములు, శంకర్, రాజుయాదవ్, చందు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
ఆసిఫాబాద్: జిల్లాలో అగ్నిప్రమాదాల్లో ఆస్తులు బూడిదవుతున్నాయని, అగ్నిమాపక సి బ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం లేదని గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఫైర్.. ఫెయిల్!’ కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై ఆ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్డ్రిల్తో వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, ప్రవీణ్, శరత్, రాము, తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. -
సందర్శించి.. పరిశీలించి
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం గిరి జనశాఖ డీడీ రమాదేవి సందర్శించారు. తరగతి గదులు, వంట గదులను పరిశీలించి వి ద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీఆర్టీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. అంతకు ముందు పాటగూడ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. త్వరలో పాఠశాల భవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఎంపీడీవో అంజద్పాషా, హెచ్ఎం పంచఫుల పాల్గొన్నారు. -
ముమ్మాటికీ కక్ష పూరితమే..
ఏపీలో కూటమి సర్కారు చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం ముమ్మాటికీ కక్షపూరిత చర్యలే. తక్షణమే ఈ చర్యలను నిలిపివేయాలని జర్నలిస్టు సంఘాల నుంచి హెచ్చరిస్తున్నాం. – ఆర్.ప్రకాశ్రెడ్డి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొంతు నొక్కడం సరికాదుమంచిర్యాలటౌన్: వార్తలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలే గానీ, ఆయా జర్నలిస్టులపై కేసులను పెట్టడం సరికాదు. ‘సాక్షి’ ఎడిటర్తోపాటు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతునొక్కడంను మా సంఘం ఖండిస్తుంది. – మిట్టపల్లి మధు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీయూడబ్ల్యూజేఎస్) జిల్లా అధ్యక్షుడు -
పాతవారికే కిసాన్ సమ్మాన్
రెబ్బెన(ఆసిఫాబాద్): వ్యవసాయాన్నే నమ్ముకుని పంటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరాల పరిమితి లేకుండా రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో ఆర్థికసాయం అందిస్తోంది. 2019లో పథకాన్ని ప్రారంభించగా. ఆ సమయంలో నమోదైన రైతులకే పథకం వర్తిస్తోంది. ఆ తర్వాత పట్టా పాసుపుస్తకాలు పొందిన వారికి లబ్ధి చేకూరడం లేదు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా భూమిని పొందిన వారు, ఇతరుల నుంచి భూమి కొనుగోలు చేసి కొత్త పట్టాలు పొందిన వారు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఏటా వందల సంఖ్యలో కొత్త రైతులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పథకంలో చేర్చడం లేదు.తగ్గుతున్న అర్హుల సంఖ్య..2019లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదార్లు, విదేశాల్లో నివాసం ఉండే వారిని ఈ పథకం నుంచి మినహాయించింది. ప్రారంభంలో భూపరిమితిని విధించి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా రూ.6వేల సాయాన్ని మూడు విడతల్లో అందించారు. ఏడాది గడిచాక భూ పరిమితిని తొలగించి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్కో రైతుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేసింది. పాత రైతులకే తప్ప కొత్తవారికి ఈ పథకంలో అవకాశం కల్పించడం లేదు. ఫలితంగా వేలాదిమంది కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థికసాయానికి దూరమవుతున్నారు. కొత్తవారికి అవకాశం లేకపోవడంతో క్రమంగా అర్హుల సంఖ్య తగ్గిపోతోంది. వ్యవసాయ శాఖ అధికారుల క్షేత్ర పరిశీలనలో మరణించిన రైతుల పేర్లు తొలగింపు, భూముల అమ్మకాలు, కుటుంబ సభ్యుల పేరిట భూములను విరాసిత్ చేయడంతో రైతుల సంఖ్య తగ్గింది. ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరడం, ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదార్లు.. ఇలా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వివరాలు బహిర్గతం కావడంతో వారికీ పథకం నిలిపివేసింది. పథకం ప్రారంభంలో దాదాపు 68వేల మంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందగా, కొన్నినెలల క్రితం కేంద్రం విడుదల చేసిన 20వ విడత కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో జిల్లాలో అర్హులైన రైతుల సంఖ్య 33,369కి తగ్గింది. ఆరేళ్లలో అర్హుల సంఖ్య సగానికి పడిపోయింది.చిన్న, సన్నకారు రైతులకు మేలుపీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు కలుగుతోంది. అయితే ఈ పథకంలో కొత్తగా పట్టా పాసుపుస్తకాలు అందుకున్న వారికి చోటు కల్పించకపోవడంతో వేలాది మంది ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో 1,42,155 మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 33,369 మందికే కిసాన్ సమ్మాన్ ద్వారా ఆర్థిక లబ్ది చేకూరుతోంది. అర్హులు కూడా పెట్టుబడి కోసం అప్పులపై ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా(రైతుబంధు) పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. గత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతుల వివరాల నమోదుకు నిర్దిష్టమైన తేదీని నిర్ణయించాయి. అప్పటివరకు పట్టాలు పొందిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పేర్లు నమోదు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొత్త రైతును కూడా కిసాన్ సమ్మాన్లో చేర్చలేదు.ఉత్తర్వులు వస్తే నమోదు చేస్తాంకేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కొత్తగా పట్టా పాస్పుస్తకాలు పొందిన రైతుల పేర్లను నమోదు చేసుకోవడం లేదు. గతంలో నమోదైన వారికి మాత్రమే ఏడాదికి రూ.6వేల నగదును మూడు విడతల్లో అందిస్తోంది. కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వస్తే తప్పకుండా పేర్లు నమోదు చేస్తాం. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి -
యూరియా పంపిణీలో ఇష్టారాజ్యం
రెబ్బెన(ఆసిఫాబాద్): యూరియా కోసం రైతులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. అధికారులు మాత్రం పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టోకెన్లు ఉన్నవారికి కాకుండా బస్తాలను దాచిఉంచి దొంగచాటున అధికార పార్టీ నాయకులకు అందించారని గురువారం రెబ్బెన పీఏసీఎస్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఇన్చార్జి సీఈవో శేషారావును నిలదీశారు. 43 బస్తాలు తరలింపురెబ్బెన పీఏసీఎస్కు ఇటీవల లారీ లోడ్ యూరియా రాగా వ్యవసాయశాఖ అధి కారులు రైతులకు టోకెన్లు జారీ చేశారు. బస్తాలన్నింటినీ పంపిణీ చేయకుండా 43 బస్తాలు మిగిలించారు. రెండు రోజుల్లో మరో లోడ్ రానుందని, వాటితో కలిిపి ఈ 43 బస్తాలను అందిస్తామని అన్నదాతలకు చెప్పి పంపించారు. అయితే మండలానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఏసీఎస్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి గోడౌన్లోని 43 యూరియా బస్తాలను గురువారం ఉదయ మే గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లారు. దానికి పీఏసీఎస్ సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించిట్లు తెలుస్తోంది. నలుగురు నాయకులు పది బస్తాల చొప్పున, మరో పార్టీ నాయకుడు 3 బస్తాలు తీసుకెళ్లారు. రోజుల తరబడి నిరీక్షిస్తున్న వారిని పక్కనపెట్టి నాయకులకు అందించడంపై పీఏసీఎస్ వద్ద రైతులు సీఈవోను నిలదీశారు. బస్తాలను తిరిగి తెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పీఏసీ ఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ రైతులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. నాయకులపై పోలీసులకు ఫిర్యాదుపీఏసీఎస్ గోడౌన్లో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను బెదిరించి తీసుకెళ్లిన నాయకులపై సీఈవో శేషారావు ఎస్సై చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం కార్యాలయం తెరవక ముందే అటెండర్ తిరుపతితోపాటు తనను మండలానికి చెందిన నలుగురు నాయకులు బస్తాలు ఇవ్వాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నాయకులు తీసుకెళ్లిన బస్తాల్లో 23 బస్తాలు పీవోఎస్లో ఎంట్రీ చేసినవి ఉండగా, మిగిలిన బస్తాలు ఎంట్రీ లేకుండానే బెదిరించి తీసుకెళ్లినట్లు తెలిపారు. సక్రమంగా పంపిణీ చేయాలిరైతులకు సక్రమంగా పంపిణీ చేయాలని పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్ డిమాండ్ చేశారు. రెబ్బెన పీఏసీఎస్ ఎదుట విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఏసీఎస్ సిబ్బందిని బెదిరించి 43 బస్తాలు తీసుకెళ్లడం సిగ్గు చేటన్నారు. కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, నాయకులు పందిర్ల మధునయ్య తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి సీఈవో శేషారావు సస్పెన్షన్రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్లో ఇన్చార్జి సీఈవోగా పనిచేస్తున్న శేషారావును సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు ఉత్తర్వులు జారీ చేశారు. పీఏసీఎస్కు సరాఫరా అయిన యూరియా బస్తాల పంపిణీలో శేషారావు అలసత్వం ప్రదర్శించడంతోపాటు గోడౌన్లో నిల్వ ఉంచిన 43 యూరియా బస్తాలను పీవోఎస్ యంత్రంలో నమోదు చేయకుండానే గురువారం గుట్టుచప్పుడు కాకుండా అధికార పార్టీ నాయకులకు పంపిణీ చేశారు. దీనిపై మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన ఫిర్యా దు మేరకు శేషారావును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన స్థానంలో దహెగాం పీఏసీఎస్లో స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జి.జీవన్కుమార్కు ఇన్చార్జి సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. -
పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో రైతులకు యూరియా పకడ్బందీగా పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో గురువారం వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన పంట నష్టంపై సర్వే సక్రమంగా చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు నివేదికలు అందాయని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అర్హుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. త్వరలో జిల్లాకు వచ్చే యూరియా పంపిణీలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద పరిస్థితిని సమీక్షించాలన్నారు. సమావేశంలో డీఏవో శ్రీనివాసరావు, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకట్, మనోహర్, మిలింద్కుమార్ పాల్గొన్నారు. మెరుగైన సేవలకు వైద్యుల నియామకంజిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్యుల నియామక ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. తెలంగాణ వైద్య వి ధాన పరిషత్ పరిధిలోని జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి, సామాజిక ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న 23 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్), ఎంబీబీఎస్ పోస్టుల భర్తీ కోసం గురువారం కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు నిర్వహించామని పేర్కొన్నారు. 15 మంది హాజరు కాగా, ఇద్దరు స్పెషలిస్టులు, 11 మంది ఎంబీబీఎస్ వైద్యులను ఎంపిక చేశామన్నారు. -
కేసులు ఎత్తివేయాలి
ఆసిఫాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. నిరంకుశంగా వ్యవహరించడం సమంజసం కాదు. కథనాలపై అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ కోరాలి. కానీ అక్రమ కేసులు పెట్టడం సరికాదు. సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించి సాక్షి ఎడిటర్పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. లేనిపక్షంలో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ఉద్యమిస్తాం. – అబ్దుల్ రహమాన్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు -
విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి
కాగజ్నగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని అదనపు కలెక్ట ర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. కాగజ్నగర్ మండలం అనుకోడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరగతి గదిలో ఫౌండేషనల్ లెటర్స్ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక పద్ధతులు అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు పర్శ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి
ఆసిఫాబాద్అర్బన్: విధి నిర్వహణలో అమరులైన అటవీశాఖ ఉద్యోగుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ టిబ్రేవాల్ అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని అట వీశాఖ కార్యాలయంలో అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఏటా అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో షేక్ హైదర్, గౌస్ మొహినొద్దీన్, కొండల్రావు, శ్రీహరి అనే అటవీ అధికారులు వివిధ ఘటనల్లో మృతి చెందారని గుర్తు చేశారు. మూడు దశాబ్దాలో దాదాపు 32 మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అడవుల సంరక్షణకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్, తెలంగాణ జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, రేంజ్ అధికారి ఝాన్సీ రాణి, ఏవో వెంకటకృష్ణ, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర
పాతమంచిర్యాల: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ భయానక పరిస్థితులు సృష్టిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తోందని జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతికదాడులతోపాటు పోలీసు కేసులతో తీవ్ర అణచివేతకు గురి చేస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో చేస్తున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. తాజాగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ పత్రికాస్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలను జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
కాగజ్నగర్ స్టేషన్ పరిశీలించిన డీఆర్ఎం
కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ డీఆర్ఎం ఆర్.గోపాలకృష్ణన్ పరిశీలించారు. వందేభారత్ రైలు హాల్టింగ్ కోసం స్టేషన్లోని సౌకర్యాలపై ఆరా తీశారు. ప్లాట్ఫాం నం.1లో ప్రయాణికుల కుర్చీల ఎత్తు పెంచాలని సూచించారు. అ డ్డంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని ఆదేశించారు. క్యాంటీన్ పక్క నుంచే వెళ్లే ఫ్లై ఓవర్ వంతెనకు పరదాలు ఏర్పాటు చేసి, దుమ్ము రాకుండా చూడాలన్నారు. అనంతరం డీఆర్ఎంను రైల్వే యాత్రి సేవా సమితి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. రైల్వే యాత్రి సమితి అధ్యక్షుడు ప్రయాగ్ తివారి మాట్లాడుతూ వందేభారత్ రైలు హాల్టింగ్ ఇవ్వడం అభినందనీయమన్నారు. తమిళనాడు, కేరళ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు సైతం హాల్టింగ్ ఇవ్వాలని డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించాలని వినతి కాగజ్నగర్ రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగుల మహిళలు డీఆర్ఎంకు సమస్యలు విన్నవించారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని, వ ర్షాలకు వరద వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చిమొక్కలు పెరిగినా పట్టించుకోవడం లేదన్నా రు. రాత్రిపూట పోలీసు సెక్యూరిటీ కల్పించాలని కో రారు. విడతలవారీగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆర్డీఎం హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నవీన్కుమార్, డీవోఎం సురేశ్, డీసీఎం సఫాలీ, పీఆర్వో పవన్ బల్దేవ్, ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్.దాసు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ‘పాల్వాయి’
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని డయాలసిస్ కేంద్రాన్ని విస్తరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు బుధవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో కలిశారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన 90 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల డయాలసిస్ కేంద్రంలో ఐదు పడకలు మాత్రమే ఉన్నాయని, దీనిని 10 పడకలుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో డయాలసిస్ కేంద్రం మంజూరు చేయాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సిర్పూర్ మాజీ జెడ్పీటీసీ నీరటి సత్యనారాయణ ఉన్నారు. కూరగాయల సాగుతో లాభాలుకెరమెరి(ఆసిఫాబాద్): రైతులు తమకున్న సాగు భూమిలో కొంతస్థలంలో కూరగాయలు సాగుచేసిలాభాలు సాధించవచ్చని బెల్లంపల్లి ఉద్యానవన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి అన్నారు. మండలంలోని పెద్దసాకడ గ్రామంలో బుధవారం చిక్కుడు సాగులో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంట సాగు, అధిక వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఆత్రం బల్లార్ షా సాగు చేస్తున్న వంకాయ తోటను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, రైతులు కేంద్రె బాలాజీ, కుమురం న్యానేశ్వర్, ఆడ రాంచందర్ తదితరులు ఉన్నారు. -
‘ఉత్తమ’ టీచర్లకు సన్మానం
ఆసిఫాబాద్రూరల్: జిల్లా ఉత్తమ టీచర్లుగా ఎంపికై న 55 మంది ఉపాధ్యాయులను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే బుధవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి సన్మానించారు. ముందుగా మాజీ ఉ ప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందించి శాలువాలతో సన్మానించారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సజీవన్, డీటీడీవో రమాదేవి, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, ఎస్వోలు శ్రీనివాస్, మధుకర్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్.. ఫెయిల్..!
ఆసిఫాబాద్: అగ్నిప్రమాదాల్లో రూ.లక్షల విలువైన ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. మున్సిపాలిటీల్లో అంతంత మాత్రంగానే సేవలందుతుండగా, మారుమూల గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్ సకాలంలో చేరుకోకపోవడంతో ఆస్తులు కాలిబూడిదవుతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, సరిపడా సిబ్బంది లేకపోవడంతో సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో 15 మండలాలకు ఒకే అగ్నిమాపక కేంద్రం ఉండగా, కాగజ్నగర్లో మరొకటి ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రం పరిధిలో 7 నుంచి 8 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాణితోపాటు ఏజెన్సీ మండలాలు ఉండగా, కాగజ్నగర్ కేంద్రం ద్వారా కాగజ్నగర్, బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, దహెగాం, సిర్పూర్(టి) మండలాలకు సేవలందిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంట పత్తి కావడంతో వివిధ ప్రాంతాల్లో సుమారు 30 వరకు జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. గత ఐదేళ్లలో జిల్లాలో 164 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోగా.. రూ.2,10,28,800 ఆస్తి నష్టం వాటిల్లింది. ఒకరు మృతి చెందారు.శిథిలావస్థలో భవనాలుజిల్లా కేంద్రంలో 1984లో అగ్నిమాపక కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వివేకానంద చౌక్ సమీపంలోని పాత గ్రామ పంచాయతీలో కార్యాలయం కొనసాగగా, అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట స్థలం కేటాయించి కొత్త కార్యాలయం నిర్మించారు. దశాబ్దాలు గడుస్తుండటంతో ఈ భవనం ప్రసుత్తం శిథిలావస్థకు చేరింది. స్లాబు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. మరోవైపు కాగజ్నగర్ పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయానికి సొంత భవనం లేదు. ఈజ్గాం రహదారిపై పాత నవోదయ భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనం సైతం శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రం ఏర్పాటు అనంతరం కొత్తగా ఆస్పత్రులు, పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, పరిశ్రమలతోపాటు అనేక ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ నిర్మాణ సమయంలో యజమానులు సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు సంబంధిత శాఖ అధికారులు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.వేధిస్తున్న సిబ్బంది కొరతజిల్లా కేంద్రంలోని అగ్ని మాపక కేంద్రంలో 16 మంది సిబ్బందికి ప్రస్తుతం 10 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఐదు ఫైర్మెన్లు, ఒక ఫైర్ ఫిట్టర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో రెండు అగ్నిమాపక వాహనాలతో పాటు ఒక రెస్క్యూ వాహనం ఉంది. కాగజ్నగర్లో ఒక అగ్నిమాపక వాహనం, బుల్లెట్ బైక్ ఉంది. ఇరుకు వీధుల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు బు ల్లెట్ బైక్పై వెళ్లి మంటలార్పుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. శీతాకాలం, వేసవిలో మరిన్ని అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.సర్వం కోల్పోతున్నాంలింగాపూర్ మండలంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే 50 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఆసిఫాబాద్ లేదా ఉట్నూర్, ఆదిలాబాద్ నుంచి ఫైరింజన్ రావాలి. అగ్నిప్రమాదాల్లో సర్వం కోల్పోతున్నాం. గతేడాది మామిడిపల్లిలో షార్ట్ సర్క్యూట్తో రైతు తెలంగ్రావు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పత్తితీత పనులు ప్రారంభమైతే ఇంట్లోనే నిల్వ చేసుకుంటారు. ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. – జాటోత్ రాహుల్, లింగాపూర్సిబ్బంది కొరత ఉందిజిల్లా కేంద్రంలోని ఫైర్స్టేషన్లో సిబ్బంది కొరత ఉంది. భవనం శిథిలావస్థకు చేరింది. జిల్లాలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే వెంటనే 87126 99190, 87126 99191 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్తున్నాం. – కార్తీక్, ఫైర్ అధికారి, ఆసిఫాబాద్ -
ఐలమ్మ స్ఫూర్తితో అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్అర్బన్: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి గా జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఇతర జిల్లా అధికారులతో కలిసి ఐలమ్మ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ భూమి, భుక్తి, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్, ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి సజీవన్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కడతల మల్లయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి ఆసిఫాబాద్రూరల్: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అడ గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ సౌజన్యంతో మత్స్యకారులకు వలలు, టార్చ్ లైట్లు, బోట్లు, పెట్టేలు, ఇతర పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ సీఈవో రాజేంద్రబాబు పాల్గొన్నారు. పాఠశాలలకు ప్రొజెక్టర్లు అందజేత జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో పది పాఠశాలలకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రొజెక్టర్లు పంపిణీ చేశారు. గత సంవత్సరం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెట్ సంస్థ సైన్స్ ల్యాబ్ వాహనం అందించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డిజిటల్ తరగతులతో నాణ్యమైన విద్య
కాగజ్నగర్టౌన్: విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా నాణ్యమైన విద్య అందించాలని విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నా రు. కాగజ్నగర్ పట్టణంలోని జెడ్పీఎస్ఎస్ పెట్రోల్ పంప్ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించాలన్నారు. పఠనంపై ఆసక్తి కలిగేలా పాఠ్యపుస్తకాలు, గ్రంథాలయాల్లోని పుస్తకాలను అరగంట పాటు గట్టిగా చదవడం అలవాటు చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలోని మంచినీటి సదుపాయం, వంటగదులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, పెంచికల్పేట్ ఎంఈవో తోట రమేశ్బాబు, ప్రధానోపాధ్యాయుడు వెంకట రాజయ్య, ప్రమీలదేవి, పర్శ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్సు) కె.వెంకటేశ్వర్లు అన్నారు. ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డితో కలిసి బుధవారం ఖైరిగూర ఓసీపీని సందర్శించారు. ఓసీపీ వద్ద పనిస్థలాలు తనిఖీ చేశారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖైరిగూర ఓసీపీ వెళ్లే మార్గమధ్యలోని పావురాల గుట్ట వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. త్వరగా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. నూతనంగా చేపట్టే గోలేటి ఓసీపీ పనుల పురోగతిని సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో పీవో మచ్చగిరి నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, గోలేటి ఓసీపీ పీవో ఉమాకాంత్, డీజీఎం సివిల్ ఎస్కే మదీనాబాషా, మేనేజర్ శంకర్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’లో ఈ నెల 8న ప్రచురితమైన ‘రెచ్చిపోతున్న ఇసుకాసురులు’ అనే కథనానికి అధికారులు స్పందించారు. రెబ్బెన మండలం పులికుంట వాగు నుంచి ఎలాంటి ప్రభు త్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. మైనింగ్ ఏడీ గంగాధర్, ఎంవీఐ మోహన్ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లతో పా టు సరైన ధ్రువపత్రాలు లేని రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తోందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పదోన్నతితో మరింత బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్: పదోన్నతితో ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్కుమార్ అన్నారు. జోడేఘాట్ రేంజ్ ఎఫ్బీవోగా విధులు నిర్వర్తించి ఎఫ్ఎస్వోగా పదోన్నతి పొందిన స్వప్నకు జిల్లా కేంద్రంలో బుధవారం పదోన్నతి చిహ్నం అందించారు. ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి ఒక డీఆర్వో, ముగ్గురు సెక్షన్ ఆఫీసర్లు జిల్లాకు వచ్చారని తెలిపా రు. అలాగే జిల్లాలో ఒక సెక్షన్ అధికారికి పదోన్నతి లభించిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారులకు టీకా తప్పనిసరి
● డీఎంహెచ్వో సీతారాం కెరమెరి(ఆసిఫాబాద్): రెండేళ్లలోపు చిన్నారులకు టీకా తప్పనిసరిగా వేయించాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. మండలంలో ని చౌపన్గూడ గ్రామంలో బుధవారం ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వ్యాధుల నివారణకు చిన్నారులకు టీకాలు వేయించాలని సూచించారు. రూ.5వేల విలువైన రక్త పరీక్షలు ప్రాథమిక కేంద్రాల్లో ఉచితంగా చేస్తారని, రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. నిల్వ నీటితో దోమలు వృద్ధి చెందుతాయని, మురుగునీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. బాలింతలు, గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీఎంవో శ్యాంలాల్, సీహెచ్వో సంపత్, హెచ్ఈవో సోము, సూపర్వైజర్ సంపూర్ణ, ఏఎన్ఎం వందన, హెచ్ఏలు వసంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అడ’కు తాత్కాలిక మరమ్మతులు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ప్రధానమైన కుమురంభీం(అడ) ప్రాజెక్టు ఆనకట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.43 లక్షలు మంజూరు చేసింది. ప్రమాదకరంగా ఉన్న 200 మీటర్ల మేర కట్టపై పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. బీటలువారి.. ప్రమాదకరంగా మారి రూ.882 కోట్ల అంచనాలతో ఆసిఫాబాద్ మండలంలో కుమురంభీం ప్రాజెక్టును నిర్మించారు. 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో 45,500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే ప్రాజెక్టు 2011లో పూర్తికాగా, కొన్నేళ్లకే ఆనకట్టపై పగుళ్లు ఏర్పడ్డాయి. మట్టి కొట్టుకుపోకుండా నాలుగు సంవత్సరాల నుంచి ఆనకట్టపై కవర్లు కప్పి ఉంచుతున్నారు. ఆనకట్ట ఎత్తు 45 మీటర్లు కాగా, ప్రస్తుతం పైభాగం నుంచి రెండు, మూడు మీటర్ల లోతు వరకు పగుళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.43 లక్షల నిధులు కేటాయించింది. బీటలువారిన 200 మీటర్ల పొడవు మేర ఆనకట్టపై మూడు మీటర్ల లోతు వరకు మట్టిని తొలగించి మళ్లీ గ్రావెల్తో నింపుతామని అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మరిన్ని నిధులు కావాల్సిందే.. అడ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.688 టీఎంసీలు మాత్రం నిల్వ ఉంచుతున్నారు. డెడ్ స్టోరేజీ 1.423 టీఎంసీలు. మిగిలిన నీటినే సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. బుధవారం ఇన్ఫ్లో 683 క్యూసెక్కులు ఉండగా ఒక గేటును 0.3 మీటర్లు పైకెత్తి 629 క్యూసెక్కులు కిందికి వదులు తున్నారు. 38 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ నీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.19 కోట్లు అవసరమని మూడేళ్ల క్రితం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ నేటి వరకు నిధులు మాత్రం రాలేదు. ప్రస్తుతం వ చ్చిన నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టనుండగా, కాలువల పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. మరిన్ని నిధులు ఇస్తేనే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందని రైతులు చెబుతున్నారు. మిగిలిన ప్రాజెక్టులూ అంతే.. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో పంట పొలాలు బీళ్లుగానే ఉంటున్నాయి. ప్రధానమైన ప్రాజెక్టులు వట్టివాగు, జగన్నాథ్పూర్ తదితర ప్రాజెక్టులు ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం లేదు. పుష్కలంగా నీరున్నా కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు చేపట్టడం లేదు. ప్రధాన ప్రాజెక్టుల ద్వారా కేవలం 10 శాతం మాత్రమే సాగు నీరందుతుంది. జిల్లాలో చాలా మంది రైతులు ఆరుతడి పంటలకే పరిమితం అవుతున్నారు.200 మీటర్ల మేర..కుమురంభీం ప్రాజెక్టు ఆనకట్ట తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.43లక్షలు మంజూరు చేసింది. దెబ్బతిన్న 200 మీటర్ల మేర ఆనకట్టపై పనులు చేపడతాం. వర్షాకాలం పూర్తయిన తర్వాత మరమ్మతులు ప్రారంభిస్తాం. – గుణవంతరావు, ఇరిగేషన్ ఈఈ -
35శాతం లాభాల వాటా చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోలేటి సీహెచ్పీలో మంగళవారం ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లో మాట్లాడారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు వెంటనే ప్రకటించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సింగరేణిలో తిరిగి తీసుకువచ్చిన మెడికల్ బోర్డును మార్చి నుంచి నిలి పివేసినా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రభుత్వ సంఘంగా చెప్పుకునే ఐఎన్టీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తేవడం లేదన్నారు. కాంట్రాక్టు కా ర్మికులకు లాభాల నుంచి వాటా రూ.20వేలకు పెంచాలన్నారు. ఇప్పటికై నా కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏరి యా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రావు, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మంగీలాల్, ఏరియా కార్యదర్శులు సంపత్, వెంకటేశ్వర్లు, సమ్మయ్య, శ్రీనివాస్, వెంకన్న, మురళీకృష్ణ, విద్యాసాగర్ పాల్గొన్నారు. -
పుస్తకం చదువుదాం రండి!
ఆసిఫాబాద్రూరల్: జైనూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పదో తరగతి విద్యార్థులు పాఠ్యపుస్తకం చదవలేకపోవడంతో ఆయన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు చదవడంలో వెనుకబడిపోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చి, విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేందుకు రాష్ట్ర సమగ్ర శిక్ష రూం టు రీడ్ ఇండియా ట్రస్ట్ సహకారంతో విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిరోజూ పుస్తక పఠనానికి అరగంట కేటాయిస్తున్నారు. చదవడంపై ఆసక్తి కలిగించేలా ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. పాఠశాలల్లో గ్రంథాలయాలు..జిల్లాలో 721 ప్రభుత్వ పాఠశాలు ఉండగా, 39,246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతీ పాఠశాలలో ఉపాధ్యాయులు రోజుకో అరగంట సమయం పఠనానికి సమయం కేటాయిస్తున్నారు. విద్యార్థులకు వార్త పత్రికలతోపాటు కథల పుస్తకాలు, ఇతర సాహిత్యం, జీవిత చరిత్ర వంటి పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. రూమ్ టు రీడ్ ఇండియా సహకారంతో ఇటీవల ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన పుస్తకాల సేకరణతోపాటు గ్రంథాలయాల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ సైతం అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు ఆసక్తి కలిగేలా చిన్న కథలు చెప్పడం ద్వారా వారిలో ఆసక్తి పెంచాలి. పాఠశాల, గ్రామస్థాయిలో కథల రచన పోటీలు నిర్వహించాలి. సృజనాత్మకత పెంచేందుకు..పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకతతో చదవ డం, రాయడం వస్తే విద్యార్థులు చదువులో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ పెంచడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. సాహిత్య, కథల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఇది మేథో సామర్థ్యాన్ని పెంచడంలోనూ తోడ్పడుతుంది. విద్యార్థుల్లో విషయ అవగాహన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలని, అరగంటపాటు విద్యార్థులతో నచ్చిన పుస్తకాలు చదివించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలపై పట్టు సాధించేందుకు ఉపయోగపడుతుందని వారు పేర్కొంటున్నారు. -
తప్పనిసరిగా నిర్వహించాలి
ప్రతీ పాఠశాలలో తప్పని సరిగా అరగంట పఠన కార్యక్రమం నిర్వహించా లి. విద్యార్థుల్లో సృజనా త్మకత, భావవ్యక్తీకరణ, చదవడంపై మరింత ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. దీని ద్వారా చదవడం అలవాటుగా మా రుతుంది. జిల్లాలోని అన్ని పాఠశాలలో పకడ్బందీగా అమలు చేయాలి. – శ్రీనివాస్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విద్యార్థులతో చదివిస్తున్నాం... మా పాఠశాలలోని విద్యార్థులతో కథల పుస్తకాలు, న్యూస్ పేపర్లు 30 నుంచి 40 నిమిషాలపాటు చదివిస్తున్నాం. దీని ద్వారా పిల్లలకు చదవడం అలవాటుగా మారుతుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో కనీస అభ్యసన స్థాయి పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. – అడ్లూరి లావణ్య, ఉపాధ్యాయురాలు, రెబ్బెన -
యూరియా కోసం రైతుల రాస్తారోకో
కాగజ్నగర్రూరల్: యూరియా బస్తాలు ఇవ్వడం లేదని కాగజ్నగర్లోని భట్టుపల్లి చౌరస్తా వద్ద రైతులు మంగళవారం రాస్తారోకో చేశారు. ప్రభుత్వం తగినంత పంపిణీ చేయడం లేదని, అలాగే అధికా రులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించా రు. టోకెన్లు పంపిణీ చేసి బస్తాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. వ్యవసాయ పనులను వదులు కుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఆందోళన చేసిన ప్రతీసారి రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. ఏవో రామకృష్ణ స్పందించి.. రెండు రోజుల్లో యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విర మించారు. నాయకులు పొన్న రమేశ్, ముజామిలుద్దీన్ అహ్మద్ మద్దతు తెలిపారు. -
బురద రోడ్డు.. దిగబడిన బస్సు
టీఎస్ఎస్ కళాకారుల జిల్లా కార్యవర్గం ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో మంగళవారం పౌర సంబంధాల అధికారి వై.సంపత్కుమార్ అధ్యక్షతన తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్ఎస్) జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుడిసెల బాపురావు, గౌరవ అధ్యక్షుడిగా మోహన్నాయక్, ఉపాధ్యక్షురాలిగా వెన్నెల, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం, కోశాధికారిగా సోమశేఖర్, సహాయ కార్యదర్శిగా శిరీషను ఎన్నుకున్నారు. డీపీఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. -
కాళోజీ జీవితం ఆదర్శం
ఆసిఫాబాద్అర్బన్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందిరికి ఆదర్శం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ కాళోజీ కేవలం కవి మాత్రమే కాదని, స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజ సేవకుడు, సంఘ సంస్కర్త, తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ(ఎంటీ) అంజన్న, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. 13న జాతీయ లోక్ అదాలత్ఆసిఫాబాద్, సిర్పూర్(టి) కోర్టుల్లో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలి పారు. యాక్సిడెంట్, దాడి, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న దొంగతనం, డ్రంకెన్ డ్రైవ్, ఇతర కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారలు, నేరస్తులు సంబంధిత పోలీస్ స్టేషన్, కోర్టు కానిస్టేబుల్ను సంప్రదించాలని సూచించారు. -
కాలినడకన వెళ్లి.. సూచనలు చేసి
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం డొంగర్గాం గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని డీఎంహెచ్వో సీతారాం పరిశీలించారు. ఆ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో దొడ్డిగూడ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు గుట్ట ప్రాంతం గుండా సిబ్బందితో నడుచుకుంటూ వెళ్లారు. గ్రామస్తులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. దోమలు వ్యాపించకుండా నిల్వ నీటిని తొలగించాలన్నారు. గర్భిణులు, బాలింతలు సకాలంలో టీకాలు తీసుకుంటే తల్లీబిడ్డకు అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
కాళోజీ ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి నిర్వహించారు. ఎస్పీ కాంతిలాల్పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఎదుర్కొన్న కష్టాలను కాళోజీ నవలల ద్వారా తెలియజేశారన్నారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మొదళ్లకు కదలిక తీసుకొస్తుందని చాటి చెప్పారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, డీటీవో రాంచందర్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇసుక లభ్యతపై నివేదికలు రూపొందించాలిజిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి నదులు, వాగులు, చెక్డ్యాములు, ప్రాజెక్టులు, చెరువుల్లో ఇసుక లభ్యతపై రెవెన్యూ గనులు, భూగర్భ శాఖ, నీటిపారుదల శాఖ, అటవీశాఖ, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయికి వెళ్లి అంచనాలు రూపొందించి ఈ నెల 20లోగా నివేదికలు సమర్పించాలన్నారు. వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా సర్వే కమిటీ నివేదికను టీజీఎండీసీ పంపిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని తెలిపారు. జైనూర్లో సాండ్ బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గనుల శాఖ ఏడీ గంగాధర్, ఇరిగేషన్ ఈఈ గుణవంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. ఏరియాలోని ఖైరగూర ఓసీపీ వద్ద రక్షణ, ప్రథమ చికిత్సపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 55వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా ఇటీవల బెల్లంపల్లి ఏరియాకు ప్రథమ చికిత్సలో సింగరేణి వ్యాప్తంగా మొదటి బహుమతి, రక్షణలో గ్రూప్ త్రీలో ప్రథమ బహుమతి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో బహుమతులు ప్రదర్శించారు. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రక్షణ పరికరాలు ధరించకుండా పనులు చేయడం ప్రమాదమని పేర్కొన్నారు. ప్రథమ చికిత్సపై ప్రతీ ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఖైరగూర ఓసీపీకి బహుమతులు రావడంపై అధికారులు, ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బయ్య మొగిళి, పీవో మచ్చగిరి నరేందర్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, సేఫ్టీ అధికారి గౌతమ్ రాజేశ్రెడ్డి, సంక్షేమ అధికారి రజినికుమార్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు ప్రాదేశిక ఓటర్ల తుది జాబితా
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న ప్రాదేశిక ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15 జెడ్పీటీసీ, 127 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 6న ముసాయిదా జాబితా ప్రదర్శించామని, అభ్యంతరాలు పరిశీలించి 10న తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలిభూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, భూకొలతల అధికారి సోమేశ్వర్ రావుతో కలిసి తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, మండల సర్వేయర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, పోర్టల్ ద్వారా ఐదు వేల వరకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తులు రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పదిరోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
పీజీసెట్లో 63వ ర్యాంకు
కాగజ్నగర్రూరల్: మండలంలోని రాస్పెల్లి గ్రామానికి చెందిన బొమ్మళ్ల రాజయ్య, ఇందిర దంపతుల కు మారుడు ప్రవీణ్ సో మవారం విడుదలైన పీజీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విభాగంలో 63వ ర్యాంక్ సాధించాడు. స్వగ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివి 10 జీపీఏ సాధించాడు. ఇచ్చోడలోని టీజీ డబ్ల్యూఆర్జేసీలో ఇంటర్ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని సిటి కళాశాలలో బీఎస్పీ పూర్తి చేశాడు. అనంతరం ఉచిత కోచింగ్ తీసుకుని పీజీ ప్రవేశ పరీక్షల్లో 63వ ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో చదువుకుని ర్యాంక్ సాధించడంపై ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్రూరల్: సమాజంలో ప్రతీఒక్కరికి విద్య ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో జిల్లాస్థాయి వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ఐక్యత, సామాజిక బాధ్యత, విద్య ప్రాముఖ్యతను అందరికీ వివరించాలన్నారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. వ్యాసరచన పోటీల్లో కాగజ్నగర్ మైనార్టీ గురుకులానికి చెందిన అద్నాన్, జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ చెందిన వైష్ణవి చిత్రలేఖన పోటీలు, సాహితి స్లోగన్లో ప్రథమ బహుమతులు సాధించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఎంఈవో సుభాష్, ప్రిన్సిపాళ్లు మహేశ్వర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖాదీ గ్రామోద్యోగ్ ఆధ్వర్యంలో వృత్తి విద్య శిక్షణ పొందిన అభ్యర్థులకు గోలేటి టౌన్షిప్లోని సీఈఆర్ క్లబ్లో సోమవారం రాత పరీక్షలు నిర్వహించారు. ఏరియాలోని గోలేటి టౌన్షిప్, మాదారం టౌన్షిప్లోని కమ్యూనిటీ హాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోలేటిలోని కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన సింగరేణి సేవా సమితి సమన్వయకర్త డీఎస్ శివకుమార్ సందర్శించారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సేవా సమితి ద్వారా గోలేటిలో ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మాదారంలో మగ్గం, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సులు నిర్వహించారు. శిక్షణ పొందిన మహిళలు పరీక్షలకు హాజరయ్యారు. కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, సింగరేణి సేవా సమితి ఏరియా కోఆర్డినేటర్ అంజయ్య, శిక్షకులు శ్రీదేవి, రూప, శైలజ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రికి వినతి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మి అనే మహిళ పెద్దపులి దాడిలో మృతి చెందిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీశ్బాబు కోరారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రికి సమస్యను వివరించారు. లక్ష్మి మృతి చెందిన సమయంలో ఉన్నతాధికారులు కొంత నగదుతోపాటు ఐదెకరాల సాగుభూమి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దోతుల శ్రీనివాస్, మృతురాలి కుటుంబ సభ్యులు వసంతరావు, విమల, వాసుదేవ్ ఉన్నారు. -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు విన్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ మండలం జంబుగకు చెందిన డోంగ్రి రాంబాయి తన తండ్రి పేరుతో ఉన్న భూమిని వారసులమైన తమకు తెలియకుండా ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దీనిపై విచారణ చేపట్టాలని కోరింది. రెబ్బెన మండలం కొండపల్లికి చెందిన గుర్లె సత్తయ్య తమ గ్రామం నుంచి జాతీయ రహదారికి ఉన్న అప్రోచ్ రోడ్డుకు మరమ్మతు చేయాలని కోరాడు. రేకుల ఇంటిలో నివాసం ఉంటున్న దివ్యాంగుడినైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన రమేశ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ మంగ కోరింది. తన భర్త మరణించాడని, వితంతు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన జాదవ్ రోహిణి విన్నవించింది. తనకు జారీ చేసిన పెన్షన్ పుస్తకంలో ఆధార్ నంబర్ సరిచేయాలని కాగజ్నగర్ మండలం భట్టుపల్లికి చెందిన చాపిడి మీరాబాయి అర్జీ సమర్పించింది. జైనూర్ మండలం బూసిమెట్ట క్యాంపునకు చెందిన వృద్ధులు తమకు పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.బ్యాంకు రుణం ఇవ్వడం లేదు మేము జిల్లా కేంద్రంలోని రాజంపేటకు చెందిన లక్ష్మీ మహిళా సంఘం సభ్యులం. ఐదు నెలల క్రితం పాత రుణం బ్యాంకులో చెల్లించాం. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఈ ఏడాది మళ్లీ బ్యాంకు రుణం ఇవ్వలేదు. అధికారులు వెంటనే రుణం మంజూరు చేయాలి. – రాజంపేట మహిళలు, మం.ఆసిఫాబాద్ -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీంచి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పైరవీలు లేకుండా పోలీసుల సేవలు వినియోగించుకుంటూ, సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దుఆన్లైన్ ఆఫర్లు, వివిధ ప్రకటనల పేరుతో వచ్చే ఏపీకే ఫైల్స్, లింక్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్ద ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. ఆన్లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ఫేక్ లింక్స్తో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా సైబర్ మోసగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి లింక్స్ ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని, మోసపూరిత లింక్స్ గుర్తిస్తే 1930కు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాల నియంత్రణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, ప్రజలు మోసాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ఆసరా పింఛన్లు మంజూరు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేసి, ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారికి పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి థామస్ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఒంటరి మహిళలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, అలాగే క్యాన్సర్, ఎయిడ్స్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.15వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. హామీ అమలు చేయకుంటే ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. అలాగే ఎమ్మెల్యేల ఇళ్లు కూడా ముట్టడిస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో ఇన్చార్జి మల్లేశ్, జాతీయ ఉపాధ్యక్షుడు కేశవ్రావు, నాయకులు మూర్తి, శ్రీశైలం, విఠల్, మహేశ్, రాజయ్య, మల్లమ్మ, పెంటుబాయి, గోపాల్, మనోహర్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు
ఆసిఫాబాద్: మహిళలపై లైంగిక వేధింపులు నిరో దించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పని ప్రదేశాలు, సమాజంలో మహిళలపై ఎదురయ్యే లైంగిక వేధిపుల నిరోధానికి పోష్ యాక్ట్ 2013 అమలు చేస్తూ గౌరవంగా పనిచేసుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధింపులకు పాల్పడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. బాధితులు కమిటీలో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో సీతారాం, జిల్లా సమన్వయకర్త శారద, డాక్టర్ అనూషరాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సీఐ కాళ్లపై పడిన రైతు
పంటలకు కావాల్సిన యూరియా బస్తాలు అందించేలా చూడాలని రెబ్బెన మండలం నవేగాంకు చెందిన ఓ రైతు సీఐ సంజయ్ కాళ్లపై పడి వేడుకున్నాడు. సోమవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తుండగా అక్కడికి సీఐ సంజయ్ వచ్చారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తూ తమను ఇబ్బందులపాలు చేస్తున్నారని, వెంటనే యూరియా ఇచ్చేలా చూడాలని రైతు సీఐ కాళ్లపై పడ్డాడు. అక్కడే ఉన్న సిబ్బంది అతడిని పైకి లేపారు. పీఏసీఎస్కు వచ్చిన ఒక్క లారీ లోడు యూరియా టోకెన్లు ఉన్నవారిలో సగం మందికి కూడా సరిపోలేదు. -
కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: ఎన్సీడీ ప్రోగ్రాంలో ఆన్లైన్ ప నుల నుంచి విముక్తి కల్పించాలని జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉపేందర్ మాట్లాడుతూ పదేళ్లుగా ఏఎన్ఎంలు ఎన్సీడీ ఆన్లైన్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజుకు 12 గంటల పాటు విధుల్లో ఉండటంతో వారిపై పనిభారం పడుతుందని పే ర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్సీడీ ప్రోగ్రాం నుంచి ఏఎన్ఎంలకు విముక్తి కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, ఏఎన్ఎం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంతోషి, ప్రధాన కార్యదర్శి పుణ్యవతి, ఏఎన్ఎంలు సునీత, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
యూరియా వెతలు
రెబ్బెన/కాగజ్నగర్రూరల్: యూరియా కోసం జిల్లా రైతుల వెతలు తీరడం లేదు. ఎరువులు వేసే అదును దాటిపోతుండటంతో అన్నదాతలు వ్యవసాయ సహకార సంఘాల కార్యాయాల ఎదుట బారులుదీరుతున్నారు. సరిపడా పంపిణీ చేయకపోవడంతో ఆందోళనలకు దిగుతున్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్కు వచ్చిన యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా సోమవారం అధికారులు కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 40 నిమిషాలపాటు రోడ్డుపై ధర్నా చేయడంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలకు మూడో దఫా మందులు వేయాల్సి ఉండగా యూరియా కోసం పీఏసీఎస్కు వచ్చామన్నారు. టోకెన్లు ఉన్నప్పటికీ యూరియా అందించకుండా కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలను వదిలేసి.. బస్తాల కోసం రోజుల తరబడి పీఏసీఎస్ చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. విషయం తెలుసుకున్న సీఐ సంజయ్ ఘటనాస్థలికి చేరుకుని రైతులకు సర్దిచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో వ్యవసాయ శాఖ, పీఏసీఎస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగజ్నగర్లో ఆందోళనయూరియా కోసం టోకెన్లు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు సోమవారం కాగజ్నగర్లో ఆందోళనకు దిగారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. టోకెన్లు జూలై, ఆగస్టులోనే ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు బస్తాలు అందించలేదని ఆరోపించారు. సుమారు గంట వరకు ఆందోళన కొనసాగించారు. ‘ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు కష్టాలు’కాగజ్నగర్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు యూరియా కష్టాలు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కాగజ్నగర్ పట్టణంలో సోమవారం రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. జూలై, ఆగస్టులో టోకెన్లు ఇచ్చి ఇప్పటివరకు యూరియా పంపిణీ చేయకపోవడం సరికాదన్నారు. పొలాల్లో పని చేసుకోవాల్సిన రైతులు రోడ్లు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నామని చెబుతున్నారన్నారు. సరిపడా అందుబాటులో ఉంటే రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు యూరియా బస్తా ఒకటి రూ.700 చొప్పున బ్లాక్లో అమ్ముకుంటూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. లారీలు వచ్చినా బయోమెట్రిక్ మిషన్లు లేవనే కారణంతో యూరియా ఇవ్వడంలేదని, ఈ విషయాన్ని ఆయన జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్రావు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వ్యవసాయ, పీఏసీఎస్ అధికారులతో మాట్లాడారు. దీంతో యూరియా బస్తాలను రైతులకు అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లెండుగురె శ్యామ్రావు, కొంగ సత్యనారాయణ, మండల కన్వీనర్ అంజన్న, రాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విధానాలతో పత్తి రైతులకు నష్టం
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలోని పత్తి రైతులకు రానున్న రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యదర్శి రాజన్న అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల కార్యదర్శులు రవి, మల్లేశ్తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పత్తి పంటపై 11 శాతం టారిఫ్ను సున్నకు తగ్గించడంతో దేశంలోని రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికా వంటి దేశాల నుంచి దేశానికి పత్తి పోటెత్తితే స్థానిక పంటకు సరైన ధర దక్కదన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్దిష్ట విధానం లేకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. కలెక్టరేట్ సిబ్బంది వ్యవహారంపై ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ జిల్లాకు ప్రాణాధారమైన అడ ప్రాజక్టుకు మరమ్మతులు లేకపోవడంతో 45వేల ఎకరాలకు కనీసం నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు దుర్గం దినకర్, కార్తీక్, రాజేందర్, ఆనంద్, టీకానంద్ పాల్గొన్నారు. -
జీపీవోలు వచ్చేశారు..!
ఆసిఫాబాద్: గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాలో 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసేందుకు 59 మంది గ్రామ పాలనాధికారులను నియమించింది. గ్రామస్థాయిలోని వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగులనే తాజాగా జీపీవోలుగా తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆసక్తి గల ఉద్యోగులకు అర్హత పరీక్షలు నిర్వహించగా, ఉత్తీర్ణులైన వారిని ఒక్కో క్లస్టర్కు ఒకరు చొప్పున నియమించనున్నారు. ఈ నెల 6న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి ఎంపికై న గ్రామ పాలనాధికారులకు నియామక పత్రాలు అందించారు. జిల్లాకు 59 మంది అధికారులను కేటాయించగా, జిల్లా నుంచి 52 మంది, మంచిర్యాల నుంచి ఏడుగురిని కేటాయించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న 16 మంది ఉద్యోగులు కూడా ఎంపికయ్యారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పర్యవేక్షణలో జిల్లా నుంచి 52 మంది హైదరాబాద్కు ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లి హైటెక్స్లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకున్నారు. త్వరలో వీరికి పోస్టింగ్ ఇవ్వకున్నారు. ఇక నుంచి జీపీవోలు గ్రామ రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా మారనున్నారు. భూభారతి చట్టంలో భాగంగా ప్రతీ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లో వీరు సహాయకారిగా పని చేయనున్నారు. పల్లెల్లో సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై విచారణ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూముతోపాటు పరిపాలన వ్యవహరాలన్నీ వీరే పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ కేడర్లో జీపీవో పోస్టులను సృష్టించగా, వీరు 11 రకాల జాబ్చార్ట్ అనుసరించనున్నారు. జిల్లాకు 59 మంది.. జిల్లాకు 59 మంది గ్రామ రెవెన్యూ అధికారులను కేటాయించారు. వీరిలో 52 మంది కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి, మంచిర్యాల నుంచి ఏడుగురు నియామకమయ్యారు. వీరికి క్లస్టర్లు కేటాయించాల్సి ఉంది. – లోకేశ్వర్రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్పకడ్బందీగా విధులు నిర్వహిస్తా ఏడాదిగా జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. జీపీవో నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాసి ఎంపికయ్యాను. గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంతో పాటు భూభారతి చట్టం అమలుకు కృషి చేస్తా. గ్రామ పాలనాధికారిగా పకడ్బందీగా విధులు నిర్వర్తిస్తా. – రాజు, జీపీవో, భూపాల్పల్లివిధులు ఇవే..గ్రామస్థాయిలో భూ ఖాతా నిర్వహణ, పహా ణిల నమోదు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ తోపాటు అన్నిరకాల భూముల నిర్వహణ, మార్పులు చేర్పులు గ్రామ పాలనాధికారులే చేపట్టనున్నారు. వక్ఫ్బోర్డు, అసైన్డ్, దేవాదా య, లావణి భూముల నిర్వహణ చూస్తారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద భూ ముల పరిరక్షణ, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, ఆక్రమణలపై ప్రభుత్వ యంత్రాంగం తీసుకునే చర్యలకు సహకరిస్తారు. భూ ముల ఖాతాల నిర్వహణ, మార్పులు, చేర్పు ల నమోదు. దరఖాస్తుదారులకు భూసర్వే సేవలు, ప్రకృతి విపత్తులు జరిగితే నష్టంపై అంచనా, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణ, జనన, మరణాల విచారణ, ఎన్నికల సమయంలో గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. జిల్లాకు 59 మంది అధికారులను కేటాయించగా వారికి క్లస్టర్లు కేటాయించాల్సి ఉంది. -
ఘనంగా భాద్రపద పౌర్ణమి
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారతోపాటు ఖమాన గ్రామంలోని నాగ్సేన్ బుద్ధ విహారలో ఆదివారం భాద్రపద పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బౌద్ధ భిక్షువు భరద్వాజ్ ఆధ్వర్యంలో విహారాల్లో పూజలు చేశా రు. మహిళలకు అష్ట శీల్ ఉపోసత్ దీక్ష ప్రసాదించారు. మూడు నెలలపాటు నిర్వహించే వర్షవాస్ కాలంలో వచ్చే పౌర్ణమిలను ఎంతో పవిత్రంగా భావించి మహిళలు అష్టాంగ మా ర్గాలు పాటిస్తూ ఉంటారని తెలిపారు. రమాబాయి మహిళా మండలిలోని 30 మంది మహిళలు అష్టశీల్ ఉపోసత్ దీక్ష తీసుకున్నారు. భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, నాయకులు దుర్గాజీ, జయరాం ఉప్రె, శ్యాంరావు దుర్గె, పాండూజీ జాడె, కిషన్ ఖోబ్రగడె ఉన్నారు. -
ఆదివాసీ గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలి
ఆసిఫాబాద్: ఆదివాసీ గ్రామాల్లో వైద్య శిబిరా లు న్విహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజ న సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలు జ్వరాలతో మంచా న పడ్డారని, హాస్టల్ విద్యార్థులు కూడా జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. వైద్యుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, మెడికల్ షాపుల యజమానులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సహకరించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి తనుషా, నాయకులు సక్కు, మడావి నాగోరావు, తొడసం శంభు, నెర్పెల్లి అశోక్, కోట శ్రీనివాస్, మడావి గణపతి, టీకానంద్ పాల్గొన్నారు. -
పకడ్బందీ చర్యలు.. ప్రశాంత నిమజ్జనం
కౌటాల(సిర్పూర్): జిల్లాలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. గతేడాది కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగు వద్ద నిమజ్జనం సమయంలో ఇద్దరు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీస్ శాఖ ప్రత్యేక దృషి సారించింది. పక్కా ప్రణాళికతో పది రోజుల ముందు నుంచే శాంతికమిటీల సమావేశాలు నిర్వహించడంతోపాటు యువకులకు మండపాల ఏర్పాటుకు అనుమతులు, విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మండపాల వద్ద మద్యం తాగడం, పేకాటడం, అసభ్యకరమైన నృత్యాలను నిషేధించారు. అలాగే అమాయకులు మోసపోతున్నారని గుర్తించి ఈ ఏడాది లక్కీలాటరీలపైనా నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం తగిన ఏర్పాట్లు చేసి వేడుకలు పూర్తి చేశారు. శోభాయాత్రలను ఎస్పీ కాంతిలాల్ పాటిల్తోపాటు ఏఎస్పీ చిత్తరంజన్ బైక్పై తిరుగుతూ రాత్రిపూట సైతం పర్యవేక్షించారు. వెయ్యికిపైగా విగ్రహాలుఈ ఏడాది జిల్లాలో వెయ్యికి పైగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో అధికార యంత్రాంగం నిమజ్జనానికి వాగుల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా పరిధిలో మొత్తం 1,026 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయగా.. చివరి మూడు రోజుల్లోనే 900కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. పోలీసులు ప్రణాళిక ప్రకారం బ్లూకోల్డ్ సిబ్బంది వద్ద ఉన్న ట్యాబ్లతో గణపయ్య మండపం ఫొటో తీసి ఆన్లైన్ ద్వారా జియోట్యాగింగ్ చేశారు. గణేశ్ శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి నిరాకరించారు. అలజడులు జరగకుండా రెండు రోజులపాటు వైన్స్లను మూసి మద్యం అమ్మకాలపై దృష్టి సారించారు. ఉత్సవాల్లో ఎస్పీతో పాటు అదనపు ఏస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలు, 8 మంది సీఐలు, ముగ్గురు ఆర్ఐలు, 19 మంది ఎస్సైలు, ఆరుగురు ఆర్ఎస్సైలు, 295 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. కీలకమైన కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో నిమజ్జన ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు సైతం చేపట్టారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలు సమన్వయంతో నిమజ్జన ప్రక్రియను ఆదివారం వేకువజాము వరకు విజయవంతంగా పూర్తిచేశారు. అందరి సహకారంతోనే.. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనాలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేశాం. క్షేత్రస్ధాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి అభినందనలు. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేశాం. ఇదే స్ఫూర్తితో జిల్లావాసులు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ సహకరించాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీ -
ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన ప్రసవం
ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివా రం అర్ధరాత్రి క్లిష్టమైన ప్రస వం చేశారు. వైద్యులు తెలి పిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలానికి చెందిన భీంబాయి శనివారం రాత్రి వాంకిడి ఆస్పత్రి నుంచి ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యుడు సందేశ్ ఆధ్వర్యంలో డెలివరీ కోసం యత్నించారు. అయితే బ్రీచ్ ప్రజెంటేషన్(ఎదురుకాళ్లు) సమస్య ఎదురుకావడంతో మంచిర్యాలకు పంపించేందుకు నిర్ణయించారు. కానీ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆగిపోయారు. ఆపరేషన్ చేయాల్సి ఉండగా క్లిష్టమైనా తీవ్రంగా శ్రమించి భీంబాయికి సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఆ తర్వాత పాపను పరీక్షల కోసం మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి పంపించారు. కీలకంగా వ్యవహరించిన నర్సింగ్ అధికారి కవ్వాల రజితకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఆఫ్రిన్, ఆసియా పాల్గొన్నారు. -
‘జీఎస్టీ స్లాబ్ మార్పులతో ఊరట’
కాగజ్నగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ స్లాబ్ మార్పులు పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగిస్తాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ సామాన్యులకు బీజేపీ ప్రభుత్వం వస్తుసేవలపై పన్ను(జీఎస్టీ)లో మార్పులు తీసుకురావడంతో నూనెలు, టీవీలు, ఆరోగ్య ఉత్పత్తులు, హెల్త్ ఇన్సురెన్స్ల వంటి వాటిపై జీఎస్టీ పన్నుభారం తగ్గుతుందన్నారు. ప్రధానంగా విద్యా సామగ్రిపై జీఎస్టీ 12 శాతం ఉండగా పూర్తిగా తొలగించిందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, మండల అధ్యక్షుడు అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నాయకులు కిరణ్, బేబీ, చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, మనోహర్గౌడ్, రమేశ్, అరుణ్లోయ పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న ఇసుకాసురులు!
రెబ్బెన మండలం గోలేటికి వెళ్లే దారిలోని పులికుంట వాగు వద్ద ఆదివారం కనిపించిన దృశ్యమిది. సెలవురోజున కూడా ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. అనుమతి ఉన్నా నిబంధనల ప్రకారం సెలవు రోజుల్లో తరలించేందుకు వీలుండదు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. తిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లాలో కొద్దిరోజులుగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా దొరికిందే అదనుగా ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో అక్రమ రవాణా బహిరంగ రహస్యమే అయినా.. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా ‘మాములు‘గా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రకృతి అందాలకు నెలవైన జిల్లా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు ఇసుక తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. భారీ వర్షాలకు మేటలురెబ్బెన మండలం పులికుంట, లక్ష్మిపూర్, రాంపూర్, గంగాపూర్ వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని పెద్దవాగు, చీలాటిగూడ, భీంపూర్, తుంపెల్లి, చిర్రకుంట, కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి, పెద్దవాగుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నాణ్యమైన ఇసుక మేటలు వేసింది. దీనిని వ్యాపారంగా మలుచుకున్న కొంతమంది దళారులు సంబంధింత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం వందల ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల వాగులోని వంతెన పిల్లర్లను ఆనుకుని తవ్వకాలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచిఉంది. గతంలో అడ్డూఅదుపు లేని ఇసుక తవ్వకాలతోనే కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి వంతెన పిల్లర్లు కుంగి బ్రిడ్జి కూలిపోయిందనే ఆరోపణలు వచ్చాయి. సెలవు రోజుల్లో సైతం..జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. 6,736 ఇళ్లు మంజూరు కాగా, 2,420 ఇల్లు బేస్మెంట్ దశ దాటాయి. దీంతో జిల్లాలో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. అధికారులు అడపాదడపా దాడులు చేస్తుండగా పలు ట్రాక్టర్లు పట్టుబడుతున్నాయి. అయినా దళారులు పట్టించుకోకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పేరుతో లాభాల మత్తులో ఈ దందా కొనసాగిస్తున్నారు. గత వారం రెబ్బెన మండలం గోలేటికి వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న పులికుంట వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా ఐదు ట్రాక్టర్లను స్థానిక తహసీల్దార్ పట్టుకున్నారు. వాటికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. అయినా మరుసటి రోజు నుంచే అక్కడ ఇసుక రవాణా యథావిధిగా కొనసాగుతుండటం గమనార్హం. దందా నడుస్తున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. అనుమతులు తప్పనిసరిఇసుక రవాణా కోసం సాధారణంగా రెవెన్యూ శాఖ నుంచి డీడీ రూపంలో నగదు చెల్లించి అనుమతి తీసుకోవాలి. ఒక వేళ సంబంధింత శాఖ నుంచి అనుమతి ఉన్నా అది కార్యాలయాల పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవాణా చేయాలి. కానీ అక్రమార్కులు అవేమీ పట్టించుకోవడం లేదు. ఉదయం ఐదు గంటల నుంచే మొదలుకుని అర్ధరాత్రి దాటినా దందా సాగిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో ఓ పార్టీకి చెందిన పెద్దస్థాయి వ్యక్తి అండదండలు ఉండటంతో అక్రమ రవాణా అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ ఏడీ గంగధర్ను సంప్రదించగా ఆయన స్పందించలేదు. దందా అరికట్టడంలో అధికారులు విఫలం జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా దందాను అరికట్టడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకెళ్తున్నామని చెప్పి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోకుండా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నామమాత్రంగా దాడులు చేస్తూ ఒకటి, రెండు ట్రాక్టర్లు పట్టుకుని చేతులు దులుపుకొంటున్నారు. – దుర్గం దినకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు -
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకా లు సాధించారని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియ ర్ యోగాసన పోటీల్లో కాగజ్నగర్లోని ఫాతి మా కాన్వెంట్ హైస్కూల్కు చెందిన ఆరో తరగతి విద్యార్థి సీహెచ్ శ్రీయాన్ సుపైన్ ఫోజు విభాగంలో బంగారు పతకం సాధించగా, లెగ్ బ్యాలెన్స్ విభాగంలో కౌటాల జెడ్పీ హై స్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థి అఖిల్సింగ్ వెండి పతకం సాధించారన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు ఈ నెల 28న విజయవాడలో నిర్వహించే జాతీ యస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించిందని పేర్కొన్నారు. శ్రీయాన్, అఖిల్సింగ్ను తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా కోచ్ ఏడుకొండ అభినందించారు. -
‘పెట్టుబడిదారులకే కేంద్రం వత్తాసు’
కెరమెరి: పెట్టుబడిదారులకే కేంద్ర ప్రభుత్వం వత్తా సు పలుకుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పాలకులు మారినా కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ధనవంతుల కోసం ప్రభుత్వాలు చేసే నిర్ణయాల మూ లంగా కార్మికవర్గం ఇబ్బందుల పాలవుతోందని పే ర్కొన్నారు. వారికి కనీస ఉద్యోగ భద్రత, వేతనా లు, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఐసీడీఎస్, ఎండీఎం తదితర రంగాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమావేశంలో నాయకుడు కూటికల ఆనంద్రావు అంగనవాడీలు, ఆశ కార్యకర్తలు, ఐకేపీ వీవోఏలు ఉన్నారు. -
మరింత చేరువలో సాంకేతిక పరిజ్ఞానం
తిర్యాణి: ఏఐ ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరి జ్ఞానం మరింత చేరువైందని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు. శనివారం మండలంలో ని గంభీరావుపేటలోగల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, మ ధ్యాహ్న భోజనంలో నాణ్యత, తరగతుల నిర్వహణ ను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి ఓపీ వి వరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, క్రమం తప్పకుండా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచి, మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించి నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. వసతుల కల్పనకు చర్యలుఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని తిర్యాణి బ్లాక్లో అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్ దిపక్ తివారీ తెలిపారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడా రు. తాగునీరు, మూత్రశాలలు, ఫ్యాన్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు తదితర అంశాలను ఇంజినీరింగ్, సంబంధిత అధికారులు పర్యవేక్షించి అవసరము న్న చోట అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించా రు. అంగన్వాడీ భవన నిర్మాణానికి తహసీల్దార్తో సమన్వయం చేసుకుని స్థలాలు గుర్తించాలని తెలి పారు. అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణ, డీఐఈవో కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటి కల నెరవేర్చుకోవాలి
దహెగాం: లబ్ధిదారులు ఇందిరమ్మ పథకాన్ని సద్వి నియోగం చేసుకుని సొంతింటి కల నెరవేర్చుకోవా లని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు సూచించా రు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో 500 ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. మండలంలో పైలట్ గ్రామమైన దిగిడకు 12 ఇళ్లు మంజూరు కాగా, నిర్మాణాలు చివరి దశలో ఉ న్నాయని తెలిపారు. మండలానికి 244 ఇళ్లు మంజూరు కాగా, 207 నిర్మాణాలు ఇదివరకే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 37 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించామని పేర్కొన్నారు. మండలానికి మరో 150 ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం ఇస్తుందని, స ర్వే పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మండలంలోని పెసరికుంట, మొట్లగూడ పంచాయతీలకు పక్కా భవన నిర్మాణాల కోసం రూ.20 లక్షల చొప్పున ఈజీఎస్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. కల్వాడ నుంచి ఒడ్డుగూడ వరకు డబుల్ రోడ్డు మంజూరైందని, త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఒడ్డుగూడ నుంచి కర్జి వరకు రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కోత్మీర్ నుంచి దహెగాం వరకు నిలిచిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పెంచికల్పేట్ వెళ్లే దారిలోని చిన్న వంతెన వద్ద హైలెవల్ వంతెన నిర్మాణం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సహకార సంఘం చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజ య్ తహసీల్దార్ మునవార్ షరీఫ్, ఎంపీడీవో రా జేందర్, బీజేపీ మండలాధ్యక్షుడు లగ్గామ దామోదర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
తీరనున్న పేదోడి సొంతింటి కల
ఆసిఫాబాద్అర్బన్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించింది. ఇచ్చిన నమూనా ప్రకారం ఇంటిని లబ్ధి దారులే నిర్మించుకోవాలని నిర్ణయించింది. ఇందు కు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ప్రభుత్వ సాయం అందించనున్నట్లు ప్రకటించింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. ఈలెక్కన జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు 3,500 చొప్పున 7వేల ఇళ్లు మంజూరు కా వాల్సి ఉండగా ఇప్పటివరకు 6,736 మాత్రమే మంజూరయ్యాయి. లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూ రు పత్రాలు అందజేసింది. జిల్లాలో 4,918 ఇళ్ల నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేశారు. గత నెలలో 925 ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. మొదట మంచి ముహూర్తాలు లేకపోవడం, నిబంధనలు కఠినంగా ఉండడంతో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు లబ్ధి దారులకు అవగాహన కల్పించడంతో ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి నిర్మాణాలు ప్రారంభించారు. ముందుగా పనులు కొంత నెమ్మదించినా వెంటవెంట బిల్లులు వస్తుండడంతో లబ్ధిదారులు పనుల్లో వేగం పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం లబ్ధిదారులకు సుమారు రూ.24.16 కోట్ల బిల్లులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేసింది. నిబంధనల ప్రకారమే నిర్మించాలి జిల్లాలోని అర్హులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలి. నిర్మాణ దశల ప్రకారం ప్రభుత్వం వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తోంది. – వేణుగోపాల్, హౌసింగ్ పీడీ జిల్లాలో ‘ఇందిరమ్మ’ వివరాలు మంజూరైన ఇళ్లు 6,736 మార్కింగ్ చేసినవి 4,918 బేస్మెంట్ దశలో.. 2,420 స్లాబ్ దశలో.. 30 గోడల దశలో.. 116 -
చట్టాలపై అవగాహన అవసరం
వాంకిడి: మహిళలు, బాలికలు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజు సూచించారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 10రోజుల పాటు జిల్లాలో ప్ర త్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసి న అవగాహన కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమశాఖ అధికారి భాస్కర్తో కలిసి పాల్గొని మాట్లాడారు. అణిచివేతలకు గురవుతున్న ఆయా వర్గాల మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకుని వాటి ని అధిగమించాలని సూచించారు. వరకట్న వేధింపుల నిషేధ చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, పోక్సో, మహిళల అక్రమ రవాణా, లింగ సమానత్వం, ప్రాథమిక హక్కులతో పాటు నూతనంగా అమలులోకి వచ్చిన వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పా టు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 1098, 1811, 112, 14567, 1930, 100 హెల్ప్లైన్ నంబర్ల ద్వారా అందించే సే వలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవేందర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య పాల్గొన్నారు. -
ప్రత్యేక రైలు వేస్తారా..!
గత ఏడాది సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చిన ఇంటర్సిటీ రైలులో కనిపించిన దృశ్యమిది. ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉండడంతో కాలు తీసి కాలు పెట్టే అవకాశం లేకపోయింది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చుని తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా సెలవుల్లోనూ పండుగ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య ప్రత్యేక రైలు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉత్తర తెలంగాణ ప్రాంత రైలు మార్గాల్లో పండుగలు, పర్వదినాల్లో రెట్టింపు ప్రయాణికులతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరా కు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వి ద్యాసంస్థలకు సెలవులతో విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామాలు, పట్టణాలకు వెళ్తుంటారు. రద్దీ పెరిగి సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్నగర్ వరకు ఈ ప్రాంత ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆంధ్రా వైపేనా..ప్రత్యేక రైళ్లు వేస్తున్నప్పటికీ ఆంధ్రాలోని కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూ రు నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సంక్రాంతితోపాటు ఇతర పండుగ సమయాల్లో ఆంధ్రా వై పు స్పెషల్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు కొత్త రైలు ఊసే లేకుండా పోతోంది. మరోవైపు బస్సుల్లో పండుగ స్పెషల్ పేరిట అ దనపు చార్జీ వసూలు చేస్తుంటారు. మహిళలకు ఎ క్స్ప్రెస్, ఆర్డినరీ ఉచిత ప్రయాణంతో బస్సులు రద్దీ గా ఉంటున్నాయి. తక్కువచార్జితో ఎక్కువ దూరం ప్రయాణించే సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వరకు రోజూ స్పెషల్ట్రైన్ నడపాల్సి ఉంది. రద్దీగా సికింద్రాబాద్ రైళ్లుప్రస్తుతం హైదరాబాద్కు ఉదయం వెళ్తున్న భాగ్యనగర్, మధ్యాహ్నం బీదర్ ఇంటర్సిటీ, కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి ఉదయం 9:25గంటలకు దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తర్వాత భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వరకు మధ్యలో కాగజ్నగర్ వైపు వెళ్లడానికి ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. ఈ నెల 21నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించనుండగా వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. స్పెషల్ ట్రైన్ నడపాలి పండుగ సమయాల్లో రైళ్లలో విపరీత రద్దీ ఉంటోంది. మంచిర్యాల, సికింద్రాబాద్ మధ్య సెలవుల్లో ప్రయాణా లు అధికంగా ఉంటాయి. దీంతో రైళ్లలో వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పండుగ పూట ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి ప్రత్యేక రైళ్లు నడపాలి. – పౌడల సుమన్, రైలు ప్రయాణికుడు, మందమర్రి కొత్త రైలు నడిపితే మేలుమూడో లైన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతీరోజు ఉదయం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 10.35గంటలకు బయలుదే రి, కాజీపేటకు 12.40గంటల వరకు జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్ మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్ 3.45వరకు చేరుకునేలా ఓ రైలు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయంత్రం 5గంటలకు సిర్పూర్ కాగజ్నగ ర్ నుంచి బయలుదేరి బెల్లంపల్లి, మంచిర్యా ల, రామగుండం, పెద్దపల్లి జంక్షన్, జమ్మికుంట, కాజీపేట మీదుగా సికింద్రాబాద్ వర కు రాత్రి 10గంటలకు చేరుకోవాలి. ఈ రైలు కు పలు స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే వేలాది గ్రామాల ప్రజలకు ఉపయోగపడనుంది. మొదట ప్రయోగాత్మకంగా రైలును ఆరంభించి, రద్దీకి అనుగుణంగా రెగ్యులర్గా నడిపితే వేలాదిమందికి ఉపయోగపడనుంది. -
సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: మండలంలోని మడావిగూడ, చిన్నుగూడ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని తెడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కోరారు. శనివారం ఆయా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు రోడ్డు సౌకర్యం, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీసం అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. గర్భిణులు, ప్ర జలకు అనారోగ్య సమస్యలెదురైతే నరకయాతన అనుభవించక తప్పదని పేర్కొన్నారు. గ తంలో పలుసార్లు అధికారులకు వినతిపత్రాచ్చినా ప్రయోజనం లేకపోయిందని ఆరోపించారు. వర్షం వస్తే మట్టి రోడ్లపై మోకాళ్ల లోతు బురద ఉంటుందని, అధికారులు వెంటనే స్పందించి రహదారులు నిర్మించాలని, కనీస వసతులు కల్పించాలని కోరారు. -
ఎస్టీయూ జిల్లా కార్యవర్గం
ఆసిఫాబాద్రూరల్: ఎస్టీయూ జిల్లా కార్యవర్గాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో రాష్ట్ర కార్యదర్శి సదానందంగౌడ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అ ధ్యక్షుడిగా పుర్క మానిక్రావు, ప్రధాన కార్యదర్శిగా తుకారాం, గౌవవాధ్యక్షుడిగా సంతో ష్, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్, అన్నపూర్ణ, అదనపు ప్రధాన కార్యదర్శిగా బాదిరావు, కార్యదర్శులుగా అహ్మద్, శారద, స్రవంతి, ఆర్థిక కార్యదర్శులుగా నగేశ్, లక్ష్మణ్ ఎన్నికయ్యా రు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి
ఆసిఫాబాద్అర్బన్: దుకాణాదారులు, హోటల్ ని ర్వాహకులు ఆహార భద్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాలని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ సర్టిఫైడ్ శిక్షకురాలు భార్గవి కంచర్ల సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్స్లో దు కాణాదారులు, హోటళ్ల నిర్వాహకులకు ఎంసీఈడీ (మహారాష్ట్ర సెంటర్ ఫర్ ఆంత్రపెన్యూర్ షిప్ డెవలప్మెంట్) ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన ఆహార రంగులు, ఉప్పు వి నియోగించవద్దని, మంచినూనెను మూడుసార్ల కంటే ఎక్కువగా మరిగించి వాడొవద్దని సూచించారు. హోటల్ నిర్వాహకులు, వంటి సిబ్బంది ఆర్నెళ్లకో సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపా రు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం–2006ను తె లుసుకోవాలని, ఆరోగ్యకర నూనెలు, పదార్థాలు వినియోగిస్తే మార్కెట్లో బిజినెస్ పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మహేందర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ అ చ్యుత్కుమార్, సభ్యులు శ్రీనివాస్, విజయ్, మహే శ్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీఎం నుంచి కలుషిత వాయువులు!
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) గురువారం అర్ధరాత్రి కలుషిత వాయువులు వెలువడ్డాయని స్థానిక ప్రజలు ఆరోపించారు. సర్దార్బస్తి, నిజాముద్దీన్ కాలనీ, ఓల్డ్కాలనీ, ద్వారకానగర్, మార్కెట్ ఏరియా, లారీ చౌరస్తా, నౌగాం బస్తి, బాలాజీనగర్, పెట్రోల్పంప్ ఏరియాల్లో పొగ నిండిపోవడంతో పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. దుర్వాసన రావడంతోపాటు తల తిప్పడం, విపరీతమైన దగ్గు వస్తుందని పట్టణ ప్రజలు వాపోయారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మిల్లు నుంచి వారానికి రెండుసార్లు రాత్రి లేదా ఉదయం 4 గంటల సమయంలో కలుషిత వాయువులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు యజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గేటు ఎదుట ధర్నా సిర్పూర్ పేపరు మిల్లుతో వస్తున్న కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, యాజమాన్యం స్పందించడంలేదని పట్టణంలోని ఓల్డ్కాలనీ, న్యూకాలనీ, పలు కాలనీల ప్రజలు శుక్రవారం ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ మిల్లు కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంటపాటు ధర్నా చేయగా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో డౌన్డౌన్ అంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. -
సాగులో సలహాలు..
పెంచికల్పేట్(ఆసిఫాబాద్): వర్షాకాలం పంటలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వీరితోపా టు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ అఫైర్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్లో రిజిస్టర్ అయిన భా రతి అగ్రికల్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్త, బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి న అభ్యర్థులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖను సమన్వయం చేసుకుంటూ గ్రామీణ రైతులకు మట్టి పరీక్షలు, శాసీ్త్రయ పద్ధతుల్లో పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, పంటల ఉత్తత్తి, మార్కెటింగ్పై మెలకువలు వివరిస్తున్నారు. మూడు మండలాల్లో సేవలుకేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారతి అగ్రికల్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సేవలు ప్రారంభించింది. జిల్లాలోని పెంచికల్పేట్, సిర్పూర్(టి), కాగజ్నగర్ మండలాల్లో సంస్థ ఏప్రిల్ నుంచి సేవలు ప్రారంభించింది. ఈ మూడు మండలాల్లో ఫార్మరీ రిజిసీ్ట్రలో నమోదు చేసుకున్న రైతులు 1100 మంది ఉన్నారు. ప్రతీ మూడు మండలాలకు సదరు సంస్థ ఒక అగ్రిసైంటిస్టుతోపాటు పంట చేలను సందర్శించి రైతులకు సలహాలు అందించడానికి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన 11 మంది అభ్యర్థులను నియమించింది. వీరు ఎంపిక చేసిన రైతుల పంట పొలాలను నిత్యం సందర్శిస్తున్నారు. పొలాల్లో మట్టిని సేకరించి సాయిల్ టెస్టు నిర్వహించారు. దుక్కిలో ఎరువుల వాడకం, విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల పిచికారీ, చీడపీడల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో కలిసి చేలను సందర్శిస్తూ పత్తి, వరి, మిర్చి పంటలకు సోకుతున్న తెగుళ్ల వివరాలను నమోదు చేస్తున్నారు. సాగు యాజమాన్య పద్ధతులపైనా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు ఉపయోగంజిల్లాలోని మూడు మండలాల్లో ప్రస్తుతం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేలను సందర్శిస్తున్నారు. పంటలకు సోకిన చీడపీడలను గుర్తించి రైతులకు అక్కడిక్కడే అవగా హన కల్పిస్తున్నారు. ఎలాంటి తెగులు సోకింది.. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవా లి.. ఎలాంటి మందులు వాడాలి.. తదితర విషయాలు విరిస్తున్నారు. జిల్లాలో యూరి యా కొరత నేపథ్యంలో నానో యూరియా వాడకంలో శిక్షణ అందించారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగంతో కలిగే అనర్థాలను ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారీ చేయాల్సిన రసాయనిక మందుల మోతాదు గురించి వివరిస్తున్నారు. ఇప్పటివరకు 2000 వరకు మట్టి పరీక్షల కార్డులు పంపిణీ చేశారు. -
వినాయకా.. వెళ్లి రావయ్యా
ఆసిఫాబాద్అర్బన్: తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. లంబోదరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచిన ఆసిఫాబాద్ పట్టణవాసులు నిమజ్జనం కోసం పెద్దవాగుకు తరలించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తిగీతాలకు నృత్యాలు చేశారు. వివిధ కాలనీల్లో కొలువుదీరిన 60 విగ్రహాలను వివేకానందచౌక్, అంబేడ్కర్చౌక్, గాంధీచౌక్, బ్రాహ్మణవాడ, రావులవాడ, రాజంపేట, కంచుకోట మీదుగా ప్రత్యేక వాహనాల్లో శోభాయాత్రగా పెద్దవాగుకు తరలించారు. ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలో పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా బజార్వాడీ సమర్థసాయి గణేశ్ మండలి వద్ద ఎస్పీ కాంతిలాల్ పాటిల్ స్వామివారికి పూజలు చేశారు. ఏఎస్పీ చిత్తరంజన్తో కలిసి బైక్పై తిరుగుతూ బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలతో పెద్దవాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. లడ్డూ వేలం.. అ‘ధర’హో..బ్రాహ్మణవాడ సార్వజనిక్ గణేశ్ మండలి వద్ద నిర్వహించిన వేలంపాటలో స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని సింగాడె అశోక్ రూ.12,516కు దక్కించుకోగా, స్వామి వారి మెడలోని హారాన్ని నిమ్మకంటి సంతోష్ రూ.16,400కు దక్కించుకోన్నారు. వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని కాచం గణేశ్ రూ.34,516కు, కరెన్సీ మాలను ముత్యాల ప్రదీప్ రూ.29,516కు దక్కించుకున్నారు. వేడుకలను ఆర్డీవో లోకేశ్వర్రావు, తహసీల్దార్ రియాజ్ అలీ, మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్షించారు. ఆసిఫాబాద్రూరల్: మండలంలోని మోతుగూ డ, బూర్గుడతోపాటు పలు గ్రామల్లో శుక్రవా రం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. శిశుమందిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని వాగులో నిమజ్జనం చేశారు. -
దసరాలోపు ఎనిమిది రైళ్లకు హాల్టింగ్
కాగజ్నగర్టౌన్: దసరాలోపు కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఎనిమిది ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఎనిమిది రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు కృషి చేశారన్నారు. సికింద్రాబాద్– ముజఫర్పూర్ వరకు వయా కాగజ్నగర్ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, బెంగళూరు– ధానాపూర్ల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్– గోరక్పూర్ మధ్య నడిచే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు– పాటలీపుత్ర మధ్య నడిచే పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ రైళ్లు కాగజ్నగర్ స్టేషన్లో నిలపనున్నారని తెలిపారు. దీంతో ఉత్తరాన బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు దక్షిణాన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. అలాగే మన ప్రాంతంలోని బెంగాళీలకు ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను తగ్గించడంతో దేశంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. స్మార్ట్కార్డులు, సిమెంట్, ఇనుము, వాహనాలకు జీఎస్టీ శాతం తగ్గించడంతో ఆర్థిక వ్యవస్థ ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనగర్ వీరభద్రచారి, పట్టణ అధ్యక్షుడు శివ, మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, బాల్క శ్యామ్, అరుణ్లోయ, తిరుపి, సంతోష్, సదానందం, కోట వేణు, సాయి, చిట్టంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ఆరోగ్య రక్షణకు వైద్యశిబిరాలు
తిర్యాణి(ఆసిఫాబాద్): వర్షాకాలంలో వ్యాధులు ప్ర బలే అవకాశం ఉండటంతో ప్రజల ఆరోగ్య రక్షణకు గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని డీఎంహెచ్వో సీతారాం తెలిపారు. మండలంలోని కన్నెపల్లి, తలండి, చింతపల్లి గ్రామాల్లో వైద్యశిబిరాలను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విషజ్వరాలను అరికట్టేందుకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. పోషకాహారం తీసుకుంటూ శుద్ధమైన నీటిని తాగాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు పల్లవి, వెంకటేశ్, అక్షిత, సిబ్బంది ఉన్నారు. -
సేవల్లో మేటి!
వాంకిడి(ఆసిఫాబాద్): అత్యవసర సమయంలో సేవలందించడంలో 108 వాహనాలు మేటిగా నిలుస్తున్నాయి. ఆపద వేళ ఒక్క ఫోన్ కాల్తో క్షణా ల్లో ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల ప్రాణాలు నిలుపుతున్నాయి. గర్భిణులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 108 అంబులెన్స్లు 15 ఉండగా, 102 వాహనాలు మరో 15 ఉన్నాయి. మండలాల వారీగా ఆయా ఆస్పత్రుల వద్ద అత్యవసర సేవలకు సిద్ధంగా ఉంటూ పేదలకు సంజీవనిలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు ఈ వాహనాలు వరంలా మారాయి. బాధితుల నుంచి ఫోన్కాల్ వచ్చిన 15 సెకన్ల వ్యవధిలోనే ప్రయాణం ప్రారంభించి నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుతున్నాయి. జిల్లాలో 108, 102 వాహనాల ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 36,805 మంది లబ్ధి పొందారు. 108 సేవలు కీలకం..రోడ్డు ప్రమాదాలు, గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించడంలో 108 సేవలు అత్యంత కీలకం. జిల్లాలో 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 15 వాహనాలు సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు వరకు 108 వాహనాల ద్వారా జిల్లాలో 11,083 మంది సేవలు పొందారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు చేర్చడమే కాకుండా వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్న జిల్లాలో ప్రసవాలు చేయడంలో కూడా సిబ్బంది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పురిటినొప్పులు ఎక్కువైన సందర్భంలో మార్గమధ్యలో వైద్యుల సూచనలతో ప్రసవం చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలు కాడుతున్నారు. 2025లో జనవరి నుంచి ఆగస్టు వరకు 47 మంది గర్భిణులకు 108 వాహనంలో ఆస్పత్రులకు వెళ్లకముందే మార్గమధ్యలో ప్రసవం చేశారు. డెలీవరీ అనంతరం సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. ‘అమ్మ’కు 102 సేవలు108 అంబులెన్స్లతోపాటు జిల్లాలో 102 వాహనా లు ఉత్తమ సేవలందిస్తున్నాయి. 102 వాహనాలు ప్రవేశపెట్టిన తర్వాత గర్భిణులకు మెరుగైన సేవలు అందుతున్నాయని అనడంలో సందేహం లేదు. ఈ వాహనాల ద్వారానే గర్భిణులు ప్రతినెలా మంత్లీ చెకప్లకు సులభంగా ఆస్పత్రులకు వెళ్తున్నారు. మారుమూల గిరిజన మండలాల వారు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రితోపాటు ఆదిలాబాద్లోని రిమ్స్ కు వెళ్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సురక్షితంగా ఇంటి వద్ద దించుతున్నారు. గర్భం దా ల్చిన మహిళల పేర్లను ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు నమోదు చేసుకుని నెలనెలా 102 వాహనాల ద్వారా సమయానుసారంగా సేవలందిస్తున్నారు. ప్రసవం అనంతరం కూడా తల్లీబిడ్డలను ఇళ్లకు చేరుస్తున్నారు. ఈ ఏడాది 102 వాహనాలు 11,335 ట్రి ప్పులు తిరిగినట్లు అధికారులు వెల్లడించారు.108లో ప్రసవంకౌటాల(సిర్పూర్): మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన గర్భిణి జంగంపల్లి రేణుకకు శుక్రవారం రాత్రి పురుటి నొప్పులు రాగా 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని గర్భిణిని కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ పిట్టల విజయ్, పైలట్ సురేశ్ వాహనంలో సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. క్షణాల్లో ఘటనాస్థలికి.. పకడ్బందీ ప్రణాళికతో 108 వాహనాలు ఫోన్ ద్వారా సమాచారం అందిన కొన్ని క్షణాల్లోనే ఘటనా స్థలికి చేరేలా 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నాం. గర్భం దాల్చిన మహిళలకు మొదటి నెల నుంచే 102 వాహనాల ద్వారా సేవలందిస్తాం. నెలవారీ చెకప్లు, ప్రసవం అనంతరం ఇంటికి చేర్చే వరకు సేవలు పొందవచ్చు. సరైన కండిషన్లో ఉన్న వాహనాల్లో పైలట్తో పాటు ఒక ఈఎమ్టీ ఉండి అత్యవసర సేవలు అందిస్తారు. ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు అత్యవసర సమయాల్లో గర్భిణులకు డెలీవరీ చేస్తారు. జిల్లాలోని ప్రజలు అత్యవసర వాహనాల సేవలు వినియోగించుకోవాలి. – సతీశ్కుమార్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ -
నవోదయ విద్యాలయంలో ఘనంగా టీచర్స్ డే
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణంలోని పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను నవోదయ విద్యాలయానికి పంపిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను శ్రద్ధగా చదివి విద్యార్థులు ఉన్నత శిక్షఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తుందని తెలిపారు. అంతకుముందు వి శ్రాంత ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రేపాల కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దవాగు వద్ద గణేశ్ నిమజ్జన ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాలను అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. నిమజ్జన ఘాట్ల వద్ద ట్రాఫిక్, ఇతర డ్యూటీల కోసం 600 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించామన్నారు. సీసీ కెమెరాలు, బోట్లు, డీడీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. మద్యం తాగి వేడుకల్లో పాల్గొనవద్దన్నారు. మండపాల నిర్వాహకులు, భక్తులు విద్యుత్పై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను తక్షణమే సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై ఉదయ్కిరణ్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, సిబ్బంది ఉన్నారు. -
పంచాయతీ కార్మికుల ధర్నా
రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ వాసుదేవ్కు వినతిపత్రం అందించారు. ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో సుమారు 4 నుంచి 6 నెలలుగా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీవితబీమా సౌకర్యం రూ.5 లక్షలు కల్పిస్తామని ప్రభుత్వం మెమో జారీ చేసి డీపీవోలకు పంపించినా నేటికి అనేక జిల్లాల్లో అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మికులకు రూ.19వేల వేతనం చెల్లించాలని, అప్పటిలోగా జీవో 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 51ని సవరించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమే శ్, దేవాజీ, వెంకటేశ్, శ్రీనివాస్, శంకర్, సత్తయ్య, అన్నాజీ, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ ము న్సిపాలిటీ పరిధిలో విద్యుత్ స్తంభా లు, తీగలు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందంటూ ‘మేలుకోకుంటే కాటేస్తయ్’ అనే శీర్షికతో ఆగస్టు 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం పట్టణంలోని ఇందిరా మార్కెట్ ఏరియాలో ని కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు, అక్కడి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నూతన స్తంభాలు ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వంగి ఉన్న స్తంభాలతో ప్రమాదం పొంచి ఉందని పలు మార్లు ‘సాక్షి’లో వార్తలు ప్రచురితం కావడంతో నూతన స్తంభాలు ఏర్పాటు చేశారు. అలాగే వినా యక నిమజ్జన శోభాయాత్ర రోజు విద్యుత్శాఖ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన 12 మంది సిబ్బందికి విధులు కేటాయించామని ఏఈ కమలాకర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎఫెక్ట్ -
ఆకట్టుకున్న జిల్లాస్థాయి కళోత్సవ్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలిక ల ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో 15 మండలాల నుంచి 12 కళారూపాల్లో సుమారు 300 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నా రు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చిన్నతనం నుంచి ఒక కళను అలవాటు చేసుకుని సాధన చేయాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే కళోత్సవ్ పోటీల్లో జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో రాథోడ్ సుభాశ్, హెచ్ఎం జనార్ధన్, న్యాయనిర్ణేతలు కిల్లి వెంకట్రావు, వెంకన్న, వెంకటేశ్వర్లు, రాజనర్సు బాబు, శ్రీనాథ్, పద్మ, శ్రీలత, సురేశ్, శేఖర్, శంకర్, వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైనవిద్యతోపాటు రుచికరమైన పోషకాహారం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు పరిశీలించారు. వంట మనుషులతో మాట్లాడి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న మెనూ వివరాలు తెలుసుకున్నారు. వంట చేసే సమయంలో పరిశుభ్రత పాటించాలని, తాజా కూరగాయలు, నిత్యావసర వస్తువులు వినియోగించాలని సూచించారు. శుద్ధమైన తాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల స్థానంలో బోధించిన తీరును పరిశీలించారు. గణితం ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలు తెలుసుకున్నారు. పదో తరగతి ఇంగ్లిష్, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆదేశించారు. -
పెండింగ్ ఉంచొద్దు
కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లు రాలేదు. ప్రభుత్వం ఇకపై బిల్లులు, వేతనాలు పెండింగ్లో ఉంచొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించాలి. పాఠశాలల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. – కమల, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, మోతుగూడ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్యికులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నిర్ణయించడం హర్షణీయం. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. గత ప్రభుత్వం పాఠశాలల్లో అమలు చేసిన అల్పాహారానికి సంబంధించి బిల్లులు నేటివరకు రాలేదు. అవి త్వరగా చెల్లించాలి. నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు సవరించాలి. – కృష్ణమాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ -
తగ్గుముఖం పట్టిన పెన్గంగ వరద
సిర్పూర్(టి): పెన్గంగలో వరద ఉధృతి గు రువారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టింది. సిర్పూర్(టి) మండలం హుడ్కిలి సమీపంలోని వంతెన వద్ద వరద తగ్గడంతో హుడ్కిలి, జక్కాపూర్, మాకిడితోపాటు మ హారాష్ట్ర గ్రామాలకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. వెంకట్రావ్పేట్– పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని పెన్గంగ నదిపై ఉన్న వంతెన వద్ద వరద తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ రహీముద్దిన్, ఎస్సై కమలాకర్ పెన్గంగ నది వరద ఉధృతిని పరిశీలించారు. దరఖాస్తుల ఆహ్వానం వాంకిడి: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025– 26 విద్యాసంవత్సరానికి అతిథి అధ్యాపకుడి నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.కనకయ్య తెలిపారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ బోధించేందుకు పీజీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం, ఇతరులు 55 శాతం మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీహెచ్డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 9 సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
గురుభ్యోనమః
అక్షరాన్ని నేర్పే గురువు జీవితానికి మార్గాన్ని చూపిస్తారు. అలాంటి టీచర్ ప్రతిఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారు. క్రమశిక్షణ నేర్పించి.. జ్ఞానజ్యోతులు వెలిగించి భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తారు. రేపటి పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవలకు గుర్తుగా ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. నేడు మాజీ రాష్ట్రపతి, ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసి, బోధనలో ఉత్తమంగా నిలుస్తున్న ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.ఇంటింటికీ తిరిగి.. ప్రవేశాలు పెంచికెరమెరి: మండలంలోని గోయగాం ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాలు పెంచడంలో ఉపాధ్యాయుడు రవితేజ ఎనలేని కృషి చేశారు. కుటుంబ సమగ్ర సర్వేలో భాగంగా ఇంటింటికీ తిరిగారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. సొంత ఖర్చుతో కరపత్రాలు ముద్రించి బడిబాట కార్య్రమంలో భాగంగా గ్రామంలో ప్రచారం చేశారు. గతేడాది 40 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 73కు చేరింది. ఎల్కేజీ, యూకేజీ తరగతులు సైతం ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో తెలుగు నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తీసుకురావడంతో గోయగాం పాఠశాల ప్రైవేట్కు దీటుగా కొనసాగుతోంది. -
వంట తంటాకు చెల్లు!
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం వండుతున్న నిర్వాహకుల తంటాలు ఇక తీరనున్నాయి. ప్రతినెలా బిల్లులను ప్రభుత్వం గ్రీన్ చానల్ ద్వారా చెల్లించనుంది. ప్రస్తుతం జిల్లాలో 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఐదు నెలల వంట బిల్లులు, ఆరు కోడిగుడ్డు బిల్లులు, మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నా యి. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది. జిల్లాలో ఇలా..జిల్లాలోని 994 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో గిరిజన పాఠశాలలు 262, ప్రభుత్వ లోకల్బాడి పాఠశాలులు 732 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో సుమారు 45 వేల మందికి ప్రతీరోజు మధ్యా హ్న భోజనం అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వారికి ఒక్కొక్కరికి రూ.6.19, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వారికి రూ.9.29, తొమ్మి ది, పదో తరగతి వారికి రూ.10.67 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. అదనంగా కోడిగుడ్డుకు రూ.6, గౌరవ వేతనం కింద నిర్వాహకులకు రూ.మూడు వేలు చెల్లిస్తున్నారు. వంట బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్రం ప్రభుత్వం 60శాతం భరిస్తోంది. అయితే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారికి మధ్యాహ్న భోజనం బిల్లులు ప్రభుత్వం సక్రమంగానే జమ చేస్తోంది. 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన బిల్లులు మాత్రం నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. చెల్లింపుల్లో తీవ్ర జాప్యంప్రస్తుతం ఉన్న బిల్లుల చెల్లింపుల విధానంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గౌరవ వేతనాలు, బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అప్పులు చేసి వంట చేయాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, వంట నూనె, ఇతర నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం చెల్లించే బిల్లులు సరిపోవడం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించాలని కోరుతున్నారు. గ్రీన్ చానల్ విధానం అయితే..గ్రీన్ చానల్ విధానం అయితే మధ్యాహ్న భోజన బిల్లులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతినెలా ఆన్లైన్ యాప్ ద్వారా నేరుగా ఖాతాలో జమ చేస్తారు. ఏడాది మొత్తానికి అవసరమైన బిల్లులకు నిధులు కేటాయిస్తారు. నిధులకు ఇబ్బందులు లేకుండా ఖాతాల్లో జమ చేస్తారు. విద్యాశాఖ ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాల నమోదు కోసం యాప్ రూపొందించింది. ప్రస్తుతం అందులో వివరాలు నమోదు చేస్తున్నారు. గ్రీన్ చానల్ విధానం అమల్లోకి వస్తే ప్రతినెలా ఏ పాఠశాలలో.. ఎంత మంది కార్మికులకు ఎంత బిల్లు చెల్లించాలనే విషయం స్పష్టం తెలుస్తుంది. ప్రధానోపాధ్యాయుడు ఆమోదం తెలిపిన తర్వాత, ఎంఈవో సరిచూసుకుని ఆమోదిస్తే ట్రెజరీ శాఖ ప్రతినెలా నిర్వాహకుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. -
మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని జెండాగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అంకుసాపూర్ పాఠశాలను సందర్శించారు. హాజరుపై ప్రతిరోజూ సమీక్షించాలిఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై ఎంఈవో లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ స మీక్షించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం దహెగాం, బెజ్జూర్, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండలాల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోగా విద్యార్థుల హాజరుపై ప్రధానోపాధ్యాయులతో సమీక్షించాలన్నారు. 50 శాతం విద్యార్థులు గైర్హాజరవుతున్నారని, దీనిపై తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు సైతం ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కావొద్దన్నారు. సమావేశంలో పాఠశాలల సమన్వయకర్త అబిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
రెబ్బెన(ఆసిఫాబాద్): నిర్మల్లోని దివ్యగార్డెన్స్లో నిర్వహించే 6వ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు గురువారం తరలివెళ్లారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏడు కొండలు గురువారం రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికై న క్రీడాకారుల జాబితా విడుదల చేసి, ఎంపికై న వారిని ఆసిఫాబాద్ నుంచి నిర్మల్కు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరో తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్, జూనియర్ చాంపియన్షిప్ శుక్రవారం నుంచి ఈ నెల 7 వరకు జరగనున్నాయని తెలిపారు. జిల్లా క్రీడాకారులు ప్ర తిభచూపి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులురాష్ట్రస్థాయి యోగా పోటీలకు బాలుర విభాగంలో ట్రెడిషనల్ యోగాలో మనవ్బార్, ఫార్మర్డ్ బెండ్ చిత్యాల శ్రీయాన్, ట్విస్టింగ్ యోగా శ్రీయాన్ గౌడ్, బ్యాక్వర్డ్ బెండ్ యోగా బొసెల్లి ప్రతిఖ్, లెగ్ బ్యాలె న్స్ బట్టి అకిల్సింగ్, హ్యాండ్ బ్యాలెన్స్ నాగ చైతన్య, సుపిన్ఫోజ్ చిట్యాల శ్రీయాన్, అర్టిస్టిక్ సింగల్ అశ్విత్ యాదవ్, ఆర్టిస్టిక్ డబుల్ ఆదర్శ్, సాయి రోహిత్, రిథమిక్ ఫేర్ అశ్విత్, త్రినాథ్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో ట్రెడిషనల్ యోగాలో సాయి ప్రణీత, ఫార్వర్డ్ బెండ్ రసకట్ల స్లోక, ట్విస్టింగ్ వనపర్తి అఖిల, ఆర్టిస్టిక్ సింగల్ కుమ్మరి శ్రీవల్లి ఎంపికయ్యారు. -
సృజనాత్మకతకు కేరాఫ్
వాంకిడి: సృజనాత్మకతతో బోధిస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ పరిజ్ఞానం పెంచుతున్నారు వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు వడ్లూరి రాజేశ్. ప్రస్తుతం ఆయన ఆసిఫా బాద్ మండలం జన్కాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంట సాగు విధానంపై మొక్కల ఎదుగుదల, చీడపీడల వృద్ధి తదితర వివరాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటున్నారు. సృజనాత్మకతతో విద్యనందిస్తున్న ఆయనకు హర్యానాలోని ఫరిదాబాద్ యూనివర్సిటీకి చెందిన మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అందించింది. రాష్ట్రస్థాయిలో టీచర్స్ బెస్ట్ ప్రాక్టిసెస్లో ఎంపికై ప్రతిభ చూపారు. జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పలుమార్లు ఎంపికయ్యారు. 2024లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులతో కలిసి హాజరయ్యారు. 2024లో హైదరాబాద్లో నిర్వహించిన సైన్స్ డ్రామాలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. పిల్లలకు సృజనాత్మకతతో బోధిస్తే అంశాలపై పట్టు సాధించి, ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఉపాధ్యాయుడు రాజేశ్ చెబుతున్నారు. -
స్కాలర్షిప్ విడుదల చేయాలని ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: ఆరేళ్లుగా పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ను ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ 18 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. విద్యా సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ గురుకులాలకు పక్కా భవనాలు మంజూరు చేయాలన్నారు. వసతిగృహాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని, సరిప డా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశా రు. ధర్నా అనంతరం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు సుంకరి సా యి, కార్తీక్, కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, అనుమతి లేకుండా విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయానికి వచ్చే ప్రజలను అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. -
పాఠశాలల వివరాలు యాప్లో నమోదు చేయాలి
కాగజ్నగర్టౌన్: స్వచ్ఛహరిత విద్యాలయ యాప్ లో పాఠశాలల వివరాలు నమోదు చేయాలని జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలో ఎమార్సీ భవనంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హరిత విద్యాలయం శిక్షణ కా ర్యక్రమంలో మాట్లాడారు. యాప్లో తప్పనిసరిగా ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తదితర వివరాలు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలల్లో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణ సృష్టి, విద్యార్థుల్లో శుభ్రత అలవాట్లు పెంపొందించే విధానాలను వివరించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో కేంద్ర బృందం పరిశీలన అనంతరం ర్యాంకులు కేటాయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి జాడి దేవాజీ, ఎంఈవో వాసాల ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్పర్సన్లు మామిడా ల తిరుపతయ్య, శాంతికుమార్ పాల్గొన్నారు. 104 ఉద్యోగుల నిరసన ఆసిఫాబాద్అర్బన్: 17 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 104 ఉద్యోగులు నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ 104 ఉద్యోగులను పీహెచ్సీ, టీబీ ఆఫీస్, టీ హాబ్ వంటి విభాగాల్లో విధుల్లో ఉంచారని తెలిపారు. కానీ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి వేతనాలు విడుదల చేయలేదన్నారు. ఉద్యోగుల కొ నసాగింపుపై కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. ఇప్పటికై నా డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణ యూనైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర, ఉద్యోగులు రాజేశం, ప్రశాంత్, సత్యనారాయణ, తిరుపతి, రమేశ్, రమాదేవి, లలిత, లీలావతి, సూర్యకళ, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
దహెగాం(సిర్పూర్): రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఫర్టిలైజర్ యజమానులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాంలను బుధవారం తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కృత్రిమ ఎరువుల కొరత సృష్టించొద్దన్నారు. రైతులకు కనిపించేలా స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. నకిలీ ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సాగులో ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించాలన్నారు. ఆయన వెంట ఏవో రామక్రిష్ణ తదితరులు ఉన్నారు. -
నడవని రైలు.. తీరని తంటాలు!
సిర్పూర్(టి): సికింద్రాబాద్, కాజిపేట, బల్లార్హా మధ్య ఎప్పుడు ఏ రైలు రద్దవుతుంతో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఏడాది కాలంగా థర్డ్ లైన్ పనులు, రైల్వే ట్రాక్ మరమ్మతులు, ఇతర సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ అధికారులు రైళ్లు నిలిపివేస్తున్నారు. గత నెల 29న భారీ వర్షాలు, వాతావరణ మార్పులు అంటూ కరీంనగర్– సిర్పూర్(టి) పుష్పుల్ ప్యాసింజర్ రైలు, కాజిపేట్–బల్లార్షా రామగిరి ప్యాసింజరు, కాజిపేట్– సిర్పూర్(టి) సింగరేణి ప్యాసింజరు, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్తోపాటు పలు రైళ్లు ఒకరోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, తిరిగి ఆగస్టు 30న పునఃప్రారంభించారు. మూడో లైన్ పేరుతో.. సికింద్రాబాద్– బల్లార్షాల మధ్య నూతనంగా చేపట్టిన మూడో రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు ప్రకటించారు. కానీ థర్డ్లైన్ పనులు, ఇతర మరమ్మతులు, స్టేషన్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం పేరుతో ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నారు. అధికారుల అనాలో చిత నిర్ణయాలతో జిల్లా ప్రయాణికులతోపాటు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సరిహద్దుకు సమీపంలో ఉన్న మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు పట్టణ ప్రాంతాలకు సిర్పూర్(టి), కాగజ్నగర్ రైల్వేస్టేషన్ల నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. బల్లార్షా వరకు నడిచే రైళ్లలో వందలాది మంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ప్రయాణిస్తుంటారు.ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణంరైళ్ల సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు, బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నాం. ఆర్థికంగా భారం పడుతుంది. రైల్వే అధికారులు స్పందించి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, నాగ్పూర్ ప్యాసింజరు రైళ్లను పునరుద్ధరించాలి. – నులిగొండ మహేశ్, సిర్పూర్(టి) ఇబ్బంది పడుతున్నాంబల్లార్షా– సికింద్రాబాద్ మధ్య రైళ్లు తరుచూ రద్దు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ప్రతీ రోజు నడిచే రైళ్లు కూడా ఎప్పుడు రద్దవుతున్నాయో తెలియడం లేదు. తరచూ రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలి. – నగ్రాడె రాజు, సిర్పూర్(టి) హాల్టింగ్ మళ్లీ ఎప్పుడో..?భాగ్యనగర్ రైలు గతంలో సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ మీదుగా నడిచింది. ప్రస్తుతం సికింద్రాబాద్– కాగజ్నగర్ వరకు మాత్రమే కొనసాగుతోంది. కాజిపేట్– నాగ్పూర్ ప్యాసింజర్కు సిర్పూర్(టి)లో స్టాప్ లేదు. గతంలో నాగ్పూర్ ప్యాసింజర్గా ఉండగా ప్రస్తుతం కాజిపేట్– నాగ్పూర్ అజ్నీ ప్యాసింజర్ రైలుగా పిలుస్తున్నారు. సిర్పూర్(టి) రైల్వేస్టేషన్లో గతంలో హాల్టింగ్ ఉన్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, నాగ్పూర్ ప్యాసింజర్కు ప్రస్తుతం ఎందుకు హాల్టింగ్ కల్పించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో మరిన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అలాగే కోవిడ్ సమయంలో మార్చి 2020లో లాక్డౌన్ విధించగా అప్పుడు రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. లాక్డౌన్ అనంతరం పునఃప్రారంభించినా సిర్పూర్(టి)లో ఆపడం లేదు. కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ తదితర మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.