breaking news
Kumuram Bheem District Latest News
-
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలోని గంగాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న పెయింటింగ్, తరగతి గదుల మరమ్మతులను పరిశీ లించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. తరగతి గదిలో కూర్చొని పాఠాలు విన్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటేశ్వర్లు, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం లతీఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శ్రావణిది కుల దురహంకార హత్యే
దహెగాం(సిర్పూర్): నిండు గర్భిణి తలాండి శ్రావణిది ముమ్మాటికీ కుల దురహంకార హత్యేనని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుస్రం నీలాదేవి అన్నారు. మండలంలోని గెర్రె గ్రామంలో మంగళవారం శ్రావణి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆధునిక యుగంలో కులం పేరుతో హత్యకు పాల్ప డడం సిగ్గు చేటన్నారు. గర్భిణిని హత్య చేసిన ఆమె మామ శివార్ల సత్తయ్యతోపాటు సహకరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ పరిహారం అందించాలని కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ మండలంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సీపీఎం, టీఏజీఎస్, డీవైఎఫ్ఐ, ఏఐఏడబ్ల్యూయూ, ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీపీఎం నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్, నాయకులు నేర్పెల్లి అశోక్, కార్తీక్ తదితరులు ఉన్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
ఆసిఫాబాద్అర్బన్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీసీఎంఎస్ చైర్మన్లు దేవయ్య, విశ్వనాథ్తో కలిసి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, ప్రాథమిక సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రాల్లో రైతుల కోసం తాగునీరు, నీడ, టార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయాధికారులు పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ కౌటాల, దహెగాంలో అదనపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఏవో వెంకటి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలిఆకాంక్షిత బ్లాక్లో భాగంగా తిర్యాణి మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి తిర్యాణి మండలంలో చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్వో సీతా రం, డీటీడబ్ల్యూవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త అబిద్ అలీ, తిర్యాణి ఎంపీడీవో మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అజ్ఞాతం వీడిన బండి దాదా
మందమర్రిరూరల్: మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సంఘం(సికాస) కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాస్ ప్రభాత్ అజ్ఞాతం వీడారు. కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం వరకు ఎదిగిన నేత అనారోగ్యంతో లొంగుబాట పట్టారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మందమర్రి పట్టణంలోని మొదటిజోన్కు చెందిన అప్పటి సింగరేణి ఉద్యోగి రామారావు, అమృతమ్మ దంపతులకు నలుగురు సంతానం కాగా.. ప్రకాష్ రెండో సంతానం. స్థానిక కార్మెల్ హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంటి సమీపంలోని కటికె దుకాణాల ఏరియా అంటే అప్పట్లో నక్సలైట్లకు అడ్డాగా ఉండేది. నక్సలైట్ల అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ(రాడికల్ విద్యార్థి సంఘం), రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్) పోటాపోటీగా కార్యకలాపాలు సాగించేవి. గ్రామాలకు తరలిరండి అనే కార్యక్రమానికి ఆకర్షితుడైన ప్రకాష్ ఆర్ఎస్యూతోపాటు అప్పటి ఎనిమిది మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా కేకే–2 గనిలో చేస్తున్న సమ్మెలో సికాస నాయకులతో చురుగ్గా పాల్గొన్నాడు. 1984లో అప్పటి ఏఐటీయూసీ నేత అబ్రహం హత్య కేసులో శిక్ష పడగా ఆదిలాబాద్ సబ్ జైల్కు వెళ్లాడు. ఇతర కేసుల్లో ఉన్న అప్పటి పీపుల్స్వార్ నాయకులు నల్లా ఆదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్తయ్యలతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం హైదరాబాద్లో అజ్ఞాతంలో ఉంటూ హేమను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు. 1992లో హైదరాబాద్లో పోలీసులకు చిక్కడంతో జైలుకు వెళ్లాడు. 2004 సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతోపాటు విడుదలయ్యాడు. వరంగల్ జైలులో ఉండగా పీపుల్స్వార్ రాష్ట్ర కమిటీ సభ్యులతో సంబంధాలు ఏర్పడడంతో 2004లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతిచర్చల్లో పాల్గొన్నాడు. చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం నేతగా ఎదిగాడు. కుటుంబ సభ్యుల ఆనందంబండి ప్రకాష్ లొంగిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. అనేకసార్లు ఎన్కౌంటర్లలో మృతిచెందా డని వార్త వినాల్సి వచ్చింది. అజ్ఞాతం వీడి లొంగి పోయి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనారోగ్యం.. ప్రకాష్కు వయసు పైబడడం, ఆరోగ్యం సహకరించకపోవడం, దేశవ్యాప్తంగా పలు ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు కుంగదీశాయి. దీంతో రెండు మూడు నెలల క్రిత మే లొంగుబాటు ప్రక్రియ ప్రారంభించాడు. మావోయిస్టు అగ్రనేతలతో చర్చించి కేంద్ర కమిటీ సభ్యుడిగా వచ్చే అవకాశాన్ని వదులుకుని తన ఆయుధాన్ని పార్టీకి అప్పగించి 20రోజుల క్రితమే లొంగుబాటు కోసం పోలీసుల ఆదీనంలోకి వచ్చినట్లు సమాచారం. డీజీపీ సమక్షంలో లొంగిపోవడంతో ఆయన పేరిట ఉన్న రివార్డు రూ.25లక్షలు అందజేశారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి అధికారులు, ఉద్యోగులకు సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమని ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించారు. సింగరేణి కార్పొరేట్ ఐటీ డీజీఎం ఎం.శ్రీనివాస్రావు, మేనేజర్ నానా ఫర్నవీస్ ఉదయం ఉద్యోగులకు, మధ్యాహ్నం అధికారులకు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పించారు. జీఎం మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ పాస్వర్డ్లు, కుటుంబ సభ్యుల ఫొటోలను ఆన్లైన్లో పెట్టొద్దన్నారు. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, గోలేటి ఓసీపీ ప్రాజెక్టు అధికారి ఉమాకాంత్, డీవైసీఎంవో పాండు రంగాచారి, ఏరియా ఐటీ మేనేజర్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
తుపాను.. దడ!
కౌటాల మండలం యాపలగూడకు చెందిన రాంటెంకి శ్రీకాంత్ మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. ఎర్ర రేగడి నేల కావడంతో త్వరగానే పత్తితీతకు వచ్చింది. కానీ మోంథా తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో పత్తి తడిసి నేలరాలింది. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చేతికందే సమయంలో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కౌటాల(సిర్పూర్): మోంథా తుపాను ప్రభావం జిల్లాపై పడింది. సోమవారం రాత్రి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారమంతా ఆకాశం మబ్బులు పట్టి ఉంది. మరో రెండు రోజులపాటు మోస్తరు వానలు పడే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాత ఆగమాగం..ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.40 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి, 60వేల ఎకరాల్లో వరి పంట, ఇతర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం రైతులు పత్తి ఏరడంతోపాటు వరికోతలు ప్రారంభించారు. మొక్కజొన్న నూర్పిడి చేసి మార్కెట్కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలకు నష్టం జరుగుతోంది. ముఖ్యంగా కౌటాల మండలంలో పత్తి తడిసి నల్లబడుతుండగా, దహెగాం, పెంచికల్పేట్ మండలాల్లో వరి నేలకొరిగింది. కొందరు రైతులు మబ్బుల కారణంగా వరికోతలు వాయిదా వేసుకున్నారు. ప్రారంభం కాని కొనుగోళ్లుఓ వైపు పత్తి చేతికందుతుండగా.. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు నేటికీ ప్రారంభం కాలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. జిల్లాలో 18 జిన్నింగ్ మిల్లులు ఉండగా ఏడు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సీసీఐ కేంద్రాల్లో 12శాతం తేమతో క్వింటాల్కు రూ.8,110 మద్ద తు ధర అందుతుంది. సాధారణంగా రైతులు సీజన్ ప్రారంభంలో పంటల సాగు కోసం వ్యాపారుల కొంత మొత్తం నగదును పెట్టుబడి కోసం అప్పుగా తీసుకుంటారు. కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో అప్పులు తీర్చేందుకు తక్కువ ధర కు వ్యాపారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. కొందరు వ్యాపారులు తేమ పేరుతో రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. అకాల వర్షాలకు తేమ ఉందని, రంగు మారిందని సాకులు చెబుతున్నారు. క్వింటాల్కు రెండు, మూడు కిలోల తరుగు తీస్తున్నారు.సోమవారం నమోదైన వర్షపాతం(మిల్లీమీటర్లలో)ప్రాంతం వర్షపాతం కౌటాల 21.0 సిర్పూర్(టి) 13.1 రెబ్బెన 10.4 కాగజ్నగర్ 9.7 ఆసిఫాబాద్ 9.2 దహెగాం 8.9 తిర్యాణి 7.9 పెంచికల్పేట్ 7.7 చింతలమానెపల్లి 6.8 బెజ్జూర్ 6.7నవంబర్లో ప్రారంభిస్తాం నవంబర్ మొదటి వారంలో జిల్లాలో సీసీఐ కేంద్రాలను ప్రారంభిస్తాం. రైతులు తొందరపడి తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దు. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులందరూ కపాస్ కిసాన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలి. పంట అమ్మిన వెంటనే ఖాతాల్లో నగదు జమ చేస్తాం. – అశ్వక్ అహ్మద్, ఏడీ మార్కెటింగ్ శాఖ తక్కువకే అమ్ముకుంటున్నాం రెండెకరాల్లో పత్తి సాగు చేస్తున్న. సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నాం. అకాల వర్షాలకు తడిసిన పత్తిని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అధికారులు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం క్వింటాల్కు రూ.15 వేల మద్దతు ధర కల్పించాలి. – వసంత్రావ్, ముత్తంపేట్, కౌటాల -
స్కిల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్నగర్టౌన్: దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీ ణ కౌశల్ యోజన ద్వారా ప్రారంభించిన స్కిల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో గల సుప్రభాత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్ను మంగళవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్కిల్ సెంటర్ను యువకులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోని నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాగజ్నగర్లో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఎంతో సహకరించారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రంలో గ్రామీణ, పట్టణ నిరుద్యోగులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పించి నైపుణ్య శిక్షణ అందిస్తారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈడీ ఈజీఎంఎంఏ కృష్ణన్, డీఆర్డీవో దత్తారావు, తహసీల్దార్ మధుకర్, పాఠశాల చైర్మన్ ఘనపురం మురళీధర్, రిటైర్డ్ హెచ్ఎం తోట వినోద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కోతులను నియంత్రించాలని ఆందోళన
కెరమెరి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలో కొన్నేళ్లుగా బీభత్సం సృష్టిస్తున్న కోతులను నియంత్రించాలని మంగళవారం వివిధ సంఘాల నాయకులు, వ్యాపారులు ఆందోళన తెలిపారు. అంబేడ్కర్ చౌక్ నుంచి రేంజ్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎఫ్ఆర్వో మజారొద్దీన్కు వినతి పత్రం అందించారు. కోతులు చిన్నారులపై దాడులు చేస్తు న్నా నియత్రణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఉన్నతాధికారులతో పాటు ఎంపీడీవో, పంచాయతీ అధికారులతో చర్చిస్తామని ఎఫ్ఆర్వో హామీ వారికి ఇచ్చా రు. కార్యక్రమంలో నాయకులు కూటికల ఆనంద్రావు, రాథోడ్ రమేశ్, గిత్తే తిరుపతి, వినేశ్, తుకారాం, సుజాయిత్ఖాన్, స్వామి, సుధాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తొలగిన అనిశ్చితి
కాగజ్నగర్టౌన్/కాగజ్నగర్రూరల్: సిర్పూర్ పే పర్ మిల్లు కార్మిక గుర్తింపు ఎన్నికల విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగింది. ఆదిలాబాద్లో మంగళవారం కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 15 గుర్తింపు కార్మిక సంఘాలు హాజరు కావాల్సి ఉండగా, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ జాతీయ సంఘాలతోపాటు మరో ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్పీఎం ప్రతినిధులు మాత్రం హాజరు కాలేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫోన్లో ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తుది ఓటరు జాబితాను అందించాలని సూచించారు. నవంబర్ 3లోగా జాబితా అందిస్తామని ఎస్పీఎం యాజమాన్యం హామీ ఇచ్చిందని కార్మిక సంఘాల నాయకులు వె ల్లడించారు. కొన్నేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోవడంతో కార్మికులు, వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు మోక్షంమిల్లు పునఃప్రారంభం నుంచి ఏడేళ్లుగా ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. పలుమార్లు సంఘాల నాయకులు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్) రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో స్పష్టత వచ్చింది. కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎన్నికల పక్రియను వేగవంతం చేస్తామని రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. హాజరుకాని ఎస్పీఎం ప్రతినిధులుఆదిలాబాద్లో జరిగిన సమావేశానికి ఎస్పీఎం తరుఫున ప్రతినిధులు హాజరు కాలేదు. గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేకనే హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో పలువురు కార్మిక సంఘం నాయకులు రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రతినిధులను ఫోన్లో సంప్రదించాలని పట్టుబట్టారు. చివరికి ఫోన్లోకి అందుబాటులోకి వచ్చిన ప్రతినిధులు తుదిజాబితా అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. -
తోటల పనులు ప్రారంభించాలి
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్లోని 379, 380 కంపార్ట్మెంట్లో ఆక్రమణలు తొలగించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధిహామీ పథకం ద్వారా వెదురు, యూకలిప్టస్ తోటల పెంపకం పనులు ప్రారంభించాలని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ సూచించారు. తాళ్లపేట అటవీ రేంజి కార్యాలయంలో తహసీల్దార్, ఎంపీడీవో, అటవీ శాఖ సిబ్బందితో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు 380 కంపార్ట్ మెంట్లో గిరిజనులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్, డీఆర్వో సాగరిక, ఎఫ్ఎస్వో రాజేందర్ పాల్గొన్నారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బేల మండలం బోదిడి గ్రామానికి చెందిన కుమరం దేవరావు తనకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన వెంకటమ్మ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాల మండలం రెబ్బన గ్రామానికి చెందిన శిరీష ఎంబీబీఎస్ చదువు కోసం ఫీజు మంజూరు చేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. -
మధుకర్ కేసులో చర్యలు తీసుకోవాలని వినతి
వేమనపల్లి: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో కారకులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ను కోరా రు. సోమవారం ఆయన మధుకర్ కుటుంబ స భ్యులతో కలిసి కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రిని కలిశారు. మధుకర్ కు టుంబానికి అండగా ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంపెల అజయ్కుమార్, నాయకులు సత్యనారా యణ, మధునయ్య, వెంకాగౌడ్, లస్మయ్య, ఏట వెంకటేష్, రవికుమార్ పాల్గొన్నారు. -
హామీలు సరే.. అమలేది..!
బెల్లంపల్లి: రెండున్నర దశాబ్దాల క్రితం వరకు భూగర్భ బొగ్గుగనులు, విభాగాలు వేలాదిమంది కార్మికులతో విరాజిల్లిన బెల్లంపల్లి ప్రస్తుతం కళ తప్పింది. ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు, మానవ వనరులు అపారంగా ఉన్నా అభివృద్ధి కరువైంది. ఎన్నికల సమయంలో నాయకులు, పాలకులు ఇచ్చే హామీలు అమలుకు నోచుకోక నిరుద్యోగం పెరిగిపోతోంది. పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ ఎప్పుడో..! బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తామని గత రెండున్నర దశాబ్దాల కాలంగా పాలకులు, నాయకులు హామీలు ఇస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇంజినీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయించి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో, ప్ర స్తుత కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ అంశం ఎన్నికల నినాదంగా మారింది. ఈ విషయంలో అడుగు ముందుకు పడక విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యవసాయ కళాశాల బెల్లంపల్లి కేంద్రంగా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఏర్పాటై పంటల సాగులో సూచనలు, సలహాలు అందిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. కేవీకేకు అనుబంధంగా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ కళాశాల మంజూరుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా పాలకులు యోచించడం లేదు. అగ్రికల్చర్/హార్టికల్చర్ కళాశాల మంజూరైతే విద్యార్థులు, రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రెండున్నర దశాబ్దాల క్రితం బెల్లంపల్లికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మంజూరు కాగా అప్పటి పాలకుల పట్టింపులేని తనంతో జగిత్యాలకు తరలిపోయింది. బొగ్గు ఆధారిత పరిశ్రమలేవీ..? రెండో బొగ్గుట్టగా ప్రసిద్ధి గాంచిన బెల్లంపల్లిలో బొ గ్గు ఆధారిత పరిశ్రమల ఊసు లేకుండా ఉంది. బొ గ్గు గనులతో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో రకరకాల కారణాలతో గనులన్నీ మూ త పడగా, వేలాది మంది కార్మికులు ఇతర ఏరియాలకు వెళ్లారు. గనులు మూతపడి, కార్మికులు బదిలీ కావడంతో బెల్లంపల్లి వైభవం మసకబారింది. ఈ క్రమంలో అర్ధంతరంగా మూతపడ్డ భూగర్భ గనుల్లో ఇంకా ఏళ్ల తరబడి తవ్వకాలు జరిపినా తరగని బొగ్గు నిక్షేపాలు ఉన్నా వెలికితీతలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. ఈ కారణంగా బొగ్గు ఆధారిత పరి శ్రమలు ఏర్పాటు కాక నిరుద్యోగులు, కార్మికుల పి ల్లలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. బెల్లంపల్లి పట్టణం నర్సింగ్ కళాశాల లేనట్లే..! ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో 275 పడకల సామర్థ్యం కలిగిన ఏరి యా ఆసుపత్రి, ప్రభుత్వ పరంగా వంద పడకలతో కూడిన ఏరియా ఆసుపత్రులు బెల్లంపల్లిలో ఉన్నాయి. ఏటా వందలాది మంది ఈ ప్రాంత విద్యార్థినులు నర్సింగ్ విద్య అభ్యసించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ అవకాశం అందుబాటులో లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు అందుబాటులో ఉండడంతో బాలికలు పోటీ పడి చేరుతున్నారు. అదే తీరుగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయించాలనే డిమాండ్ ఉన్నా పట్టింపు చేయడం లేదు. జాడలేని మెడికల్ కళాశాల.. ఆర్టీసీ బస్డిపో.. బెల్లంపల్లికి పూర్వ వైభవం తీసుకు రావడానికి మెడికల్ కళాశాల, ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని హామీలిచ్చిన పాలకుల నోటి వెంట ప్రస్తుతం ఆ మాట రావడం లేదు. మెడికల్ కళాశాల మంజూరు అవుతుందో లేదో తెలియదు కానీ కనీసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తగినంతమంది వైద్యులు, సిబ్బందిని నియమించడంలోనూ విఫలం అవుతున్నారు. ఆర్టీసీ బస్డిపో మంజూరు చేయిస్తానని చేసిన వాగ్దానం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదనే అసంతృప్తి ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
ఖానాపూర్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు శాంతినగర్ కాలనీకి చెందిన కోమటిపెల్లి నడిపి పోశెట్టి (50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. సోమవారం ఉదయం గాంధీనగర్ శివారులోని నల్ల పోచమ్మ ఆలయ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన శ్రీరాముల శ్రీకాంత్(44) పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య వాణిశ్రీ, కూతురు శ్లోక ఉన్నారు. గతకొంత కాలంగా భార్య అనారోగ్యం బారిన పడింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మనస్తాపానికి గురైన శ్రీఖాంత్ ఈ నెల 19న మావల ప్రాంతంలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. కుటుంబీకులు పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఈ నెల 20న హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈయన గతంలో మాజీ మంత్రి జోగు రామన్న వద్ద పీఏగా పనిచేశారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో కాంస్య పతకం
బెల్లంపల్లి: యాదాద్రి భువనగిరిలో ఈ నెల 24 నుంచి 26వరకు స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులు సత్తా చాటారు. సీఎస్ఎన్ఆర్ గౌడ్ జూనియర్ కళాశాలలో అండర్–19 విభాగంలో ప్రతిభ చూపి కాంస్య పతకం గెలుచుకున్నారు. క్రీడాకారులను సోమవారం కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్కుమార్, ఎస్జీఎఫ్ అండర్–19 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెక్రెటరీ బాబురావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ హరీష్, సంక్షేమ గురుకుల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రమేష్, పీఈటీలు అల్లూరి వామన్, రాజేందర్ పాల్గొన్నారు. -
తాండూర్లో తెల్లకాకి దర్శనం
తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్లోని ఓ ఇంటి వద్ద ఇటీవల తెల్తరంగు హౌస్క్రో(దేశీయ కాకి) కనిపించింది. ఈ విషయమై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ(హెచ్వైటీఐసీఓఎస్) సభ్యుడు, వన్యప్రాణి పరిరక్షకుడు శ్రీపతి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొన్ని భాగాలు తెల్లగా ఉన్న కాకులు మాత్రమే కనిపించగా.. పూర్తి తెల్లకాకి కనిపించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకి ల్యూసిజం అనే అరుదైన జన్యు పరిస్థితిని కలిగి ఉంది. దీని వల్ల పక్షి రెక్కలు పూర్తిగా తెల్లగా మారినప్పటికీ కళ్ల రంగు సహజంగా ఉంది. అల్బినిజంలో కళ్లతో సహా శరీరమంతా తెల్లబడుతుంది. కానీ ల్యూసిజంలో కళ్లు సాధారణంగా ఉంటాయి. ఇదే రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా. సహజత్వానికి భిన్నంగా ఉన్న రూపం వల్ల ఇతర కాకులతో సంబంధాలు, సంతాన ఎంపిక ప్రభావితం కావడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ చాలా తెలివైన కాకులు వాటి సామాజిక బంధాలు, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వల్ల ఆ ఇబ్బందులను అధిగమిస్తాయి. తెల్లరంగు కాకి పెద్ద వయస్సు వరకు జీవించడం దాని అనుకూల సామర్థ్యానికి నిదర్శనమని వైష్ణవ్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ
ఆదిలాబాద్: ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించిన రాష్ట్రస్థాయి వుషూ ఉమెన్స్ లీగ్ పోటీల్లో ఆరు పతకాలతో ప్రతిభ కనబరిచారు. సీనియర్ విభాగంలో ఆకోజివార్ శృతి బంగారు పతకం సాధించగా, జూనియర్ విభాగంలో ముంగటివారి ప్రజ్ఞ, వడ్నాల కీర్తన రజత పతకాలతో మెరిశారు. అలాగే జూనియర్స్ విభాగంలో రావుల అవంతిక కాంస్య పతకం సాధించగా, సబ్ జూనియర్స్ విభాగంలో సుంకు ఘనశ్రీ, కాంక్ష కాంస్య పతకాలు కై వసం చేసుకున్నట్లు మాస్టర్ వీరేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంపై జిల్లా క్రీడా శాఖ అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
వలపువల విసిరి.. రూ.8లక్షలు దోచేసి
ఆదిలాబాద్టౌన్: అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వలపు వలతో రూ.8లక్షలు స్వాహా చేసిన ఘరానా ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. సోమవారం వన్టౌన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంత్ ఈ నెల 25న వన్టౌన్లో ఫిర్యాదు చేశాడు. తన వివాహాం కోసం బాధితుడు యూబ్యూబ్లో పరిశీలించగా కృష్ణవేణి అనే అమ్మాయి ఫొటోతో రూపావత్ శ్రావణ్కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజీ అనే మోసగాడిని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడైన మంజీ కృష్ణవేణి పేరిట మహిళా గొంతుతో మాట్లాడి తాను ధనవంతురాలినని తన ఆస్తులు కోర్టులో ఉన్నాయని నమ్మించాడు. న్యాయవాదికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తన వివాహాం తర్వాత ఆస్తులు, వ్యాపారాలను పూర్తిగా చూసుకోవాలని చెప్పాడు. ఈ క్రమంలో బాధితుడు విడుతల వారీగా మోసగాడికి రూ.8లక్షలను ఆన్లైన్లో పంపించాడు. తిరిగి డబ్బులివ్వాలని అడుగగా వారు నిరాకరించారు. దీంతో బాధితుడు మోసపోయినట్లుగా గ్రహించి సైబర్ విభాగం 1930కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన వన్టౌన్ పోలీసులు సైబర్ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సూర్యాపేట జిల్లాకు పంపించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లుగా వివరించారు. వారిలో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రాంచంద్రాపూరం తండాకు చెందిన మాలోత్ మంజీ, భుక్యా గణేశ్, రూపావత్ శ్రావణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.1.50లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రేంకుమార్, సైబర్ సెల్ ఎస్సై గోపీకృష్ణ, వన్టౌన్ ఏఎస్సై గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్ తదితరులున్నారు. -
మనమూ చేద్దాం... మారథాన్
మామడ: నేటి పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం కారణంగా శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడితో మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. నడక, జాగింగ్, రన్నింగ్ చేయడం మర్చిపోతే పనిఒత్తిడి వలన ఆందోళన, చికాకుతో పాటు బీపీ, షుగర్ వ్యాధుల బారినపడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతీరోజు క్రమం తప్పకుండా నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో వాకింగ్, మారథాన్, యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ఇంగ్లండ్కు చెందిన రన్నర్ జాక్ సెయింట్ ఇటీవల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లు మారథాన్ చేపట్టారు. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోగా మారథాన్ రన్నర్ల బృందం ఆయనకు ఘనస్వాగతం పలికింది. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ దానిని అధిగమించాల న్న ధృడసంకల్పంతో మారథాన్ చేస్తున్నట్లు తెలి పారు. 60 రోజుల పాటు రోజుకు 60 కిలోమీటర్ల దూరం పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత ఆసక్తి... సుదీర్ఘ దూరం నడకను మారథాన్గా పేర్కొంటారు. 42.196 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 6 గంటల్లో, 21 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల సమయంలో పూర్తి చేస్తారు. మారథాన్లో పాల్గొనడం శ్రమ అనుకుంటే 10 కి.మీ, 5కి.మీ, 3 కి.మీల క్లబ్లలో చేరుతున్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాలకు చెందిన రన్నర్లు హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తదితర పట్టణాల్లో నిర్వహిస్తున్న మారథాన్ పోటీలలో పాల్గొంటున్నారు. -
కన్నతల్లి కాదనుకుంది..!
కాగజ్నగర్టౌన్: నవమాసాలు కడుపున మోసింది.. బిడ్డను భూమి మీదకు తెచ్చేందుకు పురిటి నొప్పులు తట్టుకుంది. ఏమైందో ఏమోగాని పొత్తిళ్ల పాలు తాగుతూ సేదతీరాల్సిన పసికందును ఆ తల్లి కాదనుకుంది. రైలులో ఓ ప్రయాణికుడికి అప్పగించి దిగి వెళ్లిపోయింది. దీంతో రెండు నెలల ప్రాయంలోనే ఆ పసికందు మాతృప్రేమకు దూరమైంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్తున్న ధానాపూర్ ఎక్స్ప్రెస్ రైలులోని వెనుకవైపు ఉన్న జనరల్ బోగీలో గుర్తు తెలియని మహిళ సుమారు రెండు నెలల వయస్సు ఉన్న పాపతో కాజిపేట రైల్వే స్టేషన్ వరకు వచ్చింది. మళ్లీ వస్తానని చెప్పి ఓ ప్రయాణికుడికి పాపను అప్పగించి కిందికి దిగింది. రైలు కదిలినా సదరు మహిళ రాకపోవడంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్ వరకు చూసిన అతడు కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. వారు ఆ పాపను సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో అప్పగించాలని సూచించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పాపను తమ ఆధీనంలోకి తీసుకోని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్కు విషయం తెలియజేశారు. వెంటనే జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది స్టేషన్కు చేరుకుని పాపను ఆసిఫాబాద్లోని బాలరక్ష భవన్కు తరలించారు. అక్కడి నుంచి జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్లోని శిశు సంక్షేమ గృహానికి తీసుకెళ్లారు. చట్టబద్ధంగా శిశుగృహం ద్వారా పాపను దత్తత ఇస్తామని ఆయన తెలిపారు. బాల రక్షభవన్ సిబ్బంది శ్రవణ్కుమార్, జమున, చంద్రశేఖర్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గుర్తింపు ఎన్నికలు జరిగేనా..?
కాగజ్నగర్రూరల్: పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎంలో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని సిర్పూర్ పేపర్ మిల్లులోని 15 కార్మిక సంఘాలకు లేఖలు పంపించారు. యూనియన్ నాయకులు, ఎస్పీఎం యాజమాన్యంతో కార్మిక శాఖ అధికారులు చర్చలు జరుపనున్నారు. 2018లో మిల్లు పునఃప్రారంభం2014లో సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడగా 2018లో జేకే యాజమాన్యం ప్రభుత్వ రాయితీతో పునఃప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతేడాది ఆగస్టులో ఎన్నికల నిర్వహణ కోసం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్)ను రిటర్నింగ్ అధికారిగా నియమించారు. రిటర్నింగ్ అధికారి పేరుతో మిల్లులోని కార్మిక సంఘాలకు వార్షిక నివేదికను సమర్పించాలని లేఖలు పంపారు. మిల్లులోని కార్మిక సంఘాల అండర్ టేకింగ్ సర్టిఫికెట్, అప్లియేషన్ సర్టిఫికెట్, యూనియన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బైలాస్, వార్షిక రిటర్న్స్, ఖాతా బుక్, కార్మికుల మెంబర్షిప్, రిజిస్టర్ బుక్, బ్యాంక్ ఖాతా వివరాలు, మినిట్స్ బుక్ తదితర వివరాలను డీసీఎల్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఆయా కార్మిక సంఘాలు తమ నివేదికలను అందజేశాయి. కానీ ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. నష్టపోతున్న కార్మికులుఎస్పీఎంలో గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. మిల్లులో కనీసం క్యాంటీన్ సౌకర్యం కూడా లేదు. కార్మికుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా పండుగ సమయంలో యాజమాన్యం ఇష్టారీతిన బోనస్ అందిస్తోంది. గుర్తింపు యూనియన్ ఉంటే సమస్యల పరిష్కారానికి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు కార్మిక శాఖ అధికారులు మంగళవారం ఆదిలాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు త్వరగా నిర్వహించాలి ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ చొరవచూపాలి. మంగళవారం ఉమ్మడి సమావేశానికి రావాలని లేఖలు పంపించారు. సమావేశంతో సరిపెట్టకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందించి ఒత్తిడి తెచ్చాం. ఈ మేరకు స్పందించి సమావేశం నిర్వహించడం సంతోషకరం. – కూశన రాజన్న, ప్రధాన కార్యదర్శి, మజ్దూర్ యూనియన్(ఈ2510) తగ్గిన పర్మినెంట్ కార్మికుల సంఖ్యమిల్లులో 2013లో గుర్తింపు ఎన్నికలు జరుగగా అప్పట్లో 1,050 మంది పర్మినెంట్ కార్మి కులు ఓటర్లుగా ఉన్నారు. ప్రస్తుతం పర్మినెంట్ కార్మికులుగా 397 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిల్లులో స్టాఫ్, కాంట్రాక్టు కార్మి కులు, పర్మినెంట్ కార్మికులు, దినసరి కూలీ లు ఉన్నా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప ర్మినెంట్ కార్మికులకు మాత్రమే ఓటుహక్కు ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు యాజ మాన్యం పర్మినెంట్ కార్మికుల తుది జాబితా ను కార్మిక శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మిల్లు యాజమాన్యం వివరా లు అప్పగించలేదు. దీంతో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
దహెగాం(సిర్పూర్): అడవులతోపాటు ప్లాంటేషన్లోని మొక్కలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని సీఎఫ్ ఎఫ్డీపీటీ కవ్వా ల్ రిజర్వ్ శాంతారాం అన్నారు. దహెగాం మండలం గిరవెల్లి బీట్లోని చంద్రపల్లి, ఒడ్డుగూడ గ్రామ సమీపంలో గల ప్లాంటేషన్లను సోమవారం పరిశీలించారు. ప్లాంటేషన్లో మొక్కల ఎదుగుదలపై సంతృప్తి వ్యక్తం చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులకు హాని తలపెట్టొద్దన్నారు. అడవుల్లో చెట్లను నరికితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్, ఎఫ్డీవో దేవిదాస్, ఎఫ్ఆర్వో బానేశ్, ఎఫ్ఎస్వో సద్దాం, ఎఫ్బీవోలు తదితరులు పాల్గొన్నారు. -
శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: దహెగాం మండలం గెర్రె గ్రామంలో హత్యకు గురైన తలండి శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ శ్రావణితోపాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయినందున రెండు హత్యలకు సంబంధించిన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్లో నిందితుడి కుటుంబ సభ్యుల పేర్లు పొందుపర్చి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల పరిహారం, ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మాలశ్రీ, అశోక్, శ్రీనివాస్, ఆనంద్, దుర్గం దినకర్, టీకానంద్, కార్తీక్, పురుషోత్తం, నిఖిల్, శ్రీకాంత్, సాయి, సాయికృష్ణ, వినోద, అనిత, కమల, లక్ష్మి, గెర్రె, చిన్న రాస్పల్లి, ఒడ్డుగూడ తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
ఉత్కంఠగా సాగిన లక్కీడ్రా
ఆసిఫాబాద్: నెల రోజులుగా ఉత్కంఠగా సాగి న మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. భారీ బందోబస్తు మధ్య సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో షాపుల కేటా యింపు కోసం లక్కీడ్రా నిర్వహించారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్, ఎకై ్సజ్ శాఖ ఉద్యోగుల సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే స్టీలు డబ్బాలో ఒక్కో దుకాణానికి గెజిట్ నంబర్ ప్రకారం ల క్కీడ్రా నిర్వహించారు. షాపుల వారీగా ప్లాస్టిక్ కాయిన్లు తీశారు. జిల్లా వ్యాప్తంగా 32 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. లక్కీడ్రా ద్వారా 25 దుకాణాలను కేటాయించా రు. పదికంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన ఏడు షాపుల లక్కీడ్రాను వాయిదా వేశారు. మహిళలకు మూడు షాపులులక్కీడ్రాలో షాపులు దక్కించుకున్న ఫుల్జోష్ లో ఉండగా, రూ.లక్షలు వెచ్చించి టెండర్లు వేసినా అదృష్టం కలిసిరాని వారు నిరాశతో వెళ్లి పోయారు. ఒక్కో షెడ్యూల్కు రూ.3 లక్షలు వెచ్చించినా దుకాణాలు పొందలేకపోయామ ని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ముహూర్తం, మంచిరోజులు చూసుకుని దరఖాస్తులు వేసినా ఫలితం లేకుండాపోయింది. కొందరు 10 నుంచి 12 మంది వరకు గ్రూపులుగా ఏర్ప డి టెండర్లు దాఖలు చేశారు. గ్రూపులో ఉన్న వారికి ఎంతో కొంత ముట్టజెప్పి భాగస్వామ్యం తగ్గించుకునే ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయి. మరోవైపు పలువురు మహిళలు సైతం టెండర్లలో దుకాణాల కోసం పోటీపడ్డారు. ఈ ఏడాది ముగ్గురు మహిళలు దుకాణాలు దక్కించుకున్నారు. వైన్స్లు దక్కించుకున్న వారు వెంటనే 25 శాతం లైసెన్స్ ఫీజు చెల్లించేలా అక్కడే బ్యాంకు సిబ్బందితో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 1 నుంచి మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు. జిల్లాలో పది కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన జైనూర్లోని రెండు షాపులు, సిర్పూర్–యూ, రెబ్బెన, గోలేటి, కాగజ్నగర్, రవీంద్రనగర్ దుకాణాల లక్కీడ్రాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ వెల్లడించారు.వైన్స్లు పొందిన వారు వీరే..జిల్లాలోని 25 దుకాణాలను లక్కీడ్రా ద్వారా కేటాయించారు. గెజిట్ ప్రకారం నంబర్ 01 షాపును చునార్కర్ వసంత్రావు దక్కించుకోగా, 02 గుజాల అశోక్, 03 తోట వినోద్, 04 తొగరి జగన్, 05 పల్లె సంతోష్ కుమార్, 06 బుర్ర రజిత, 07 మల్యాల సుదర్శనమ్, 08 గాలె సంతోష్, 11 రుకుం ప్రహ్లాద్, 12 బోనగిరి నరేశ్, 13 రంగు రవీందర్గౌడ్, 15 ముద్దసాని అశ్విని, 16 సుంకర్ లక్ష్మణ్ కుమార్, 17 చల్లా శ్రీకాంత్ రెడ్డి, 18 దాసరి వైకుంఠం, 19 రాచర్ల వైకుంఠం, 20 మౌల్కార్ విఠల్, 21 బండి నికిత, 23 కుమురం నగేశ్, 24 రంగు ఉపేంద్రాచారి, 25 పల్లె సంపత్కుమార్, 26 లెండిగురె విఘ్నేశ్, 27 బోయిరె బావాజీ, 28 రామగోని మల్లికార్జున్గౌడ్, 29వ షాపును బట్టకుంట మల్లేశ్ దక్కించుకున్నారు. -
అవినీతి లేని సమాజంలో వేగంగా అభివృద్ధి
రెబ్బెన(ఆసిఫాబాద్): అవినీతి లేని సమాజంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. గోలేటిలోని జీఎం కార్యాలయం ఆవరణలో సోమవారం విజిలెన్స్ వారోత్సవాల సమావేశం ఏర్పాటు చేశారు. జీఎం విజయ భాస్కర్రెడ్డితో కలిసి విజిలెన్స్ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పారదర్శకత ఉన్న సంస్థ సింగరేణి అని అన్నారు. అవినీతికి తావులేకుండా అన్ని కార్యకలాపాలు పూర్తి పారదర్శకతతో సాగుతున్నాయని తెలిపారు. అనంతరం ఉద్యోగులతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తామని, నిజాయతీగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు కిరణ్, డీజీఎం ఉజ్వల్కుమార్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్వోడీ శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో గల జీ1 కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్ దీపక్ తివారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయిల్పామ్ విక్రయించేందుకు వీలుగా తోటకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామానికి చెందిన పోతిని చిన్న వెంకటస్వామి దరఖాస్తు అందించారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామ శివారులో కొనుగోలు చేసిన భూమికి పట్టా పాసుపుస్తకం మంజూరు చేయాలని మండల కేంద్రానికి చెందిన పాముల నందు కోరాడు. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ అనుషాబాయి వేడుకుంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన పాలకుర్తి సంతరక్క, కాగజ్నగర్ పట్టణంలోని న్యూకాలనీకి చెందిన మాధవి వేర్వేరుగా అర్జీలు అందించారు. ఆన్లైన్లో తన భూమి ఇతరుల పేరుతో నమోదైందని, దీనిని సవరించాలని బెజ్జూర్ మండలం సోమిని గ్రామాని కి చెందిన అల్లూరి లింగయ్య దరఖాస్తు చేసుకున్నా డు. రెబ్బెన మండలం కొండపల్లిలో బుద్ధనగర్లో 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేయాలని వేడుకున్నారు. ఐదో తరగతి వరకు చదివిన తనకు ఐటీడీఏ ఆధ్వర్యంలో కిరాణం ఏర్పాటుకు రుణం మంజూరు చేయాలని తిర్యాణి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన టేకం పోసుబాయి కోరింది.ఇల్లు మంజూరు చేయాలి దివ్యాంగుడినైన నేను డిగ్రీ వరకు చదివా. సొంత భూమితోపాటు ఉండేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. ప లుమార్లు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. ఉన్నతాధికారులు నా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.– పాలకుర్తి రాజ్కుమార్, ముత్యంపేట, మం.కౌటాల అటవీ హక్కు పత్రాలు ఇప్పించండి తిర్యాణి మండలం మాణిక్యాపూర్, లొద్దిగూడ శివా రులో నాలుగెకరాల భూమిని సాగు చేసుకుంటున్నా. ప్రభుత్వం చాలా మందికి పట్టాలు మంజూరు చేసింది. ఏళ్లుగా భూమిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నిరుపేదనైన తనకు కూడా అటవీ హక్కు పత్రాలు ఇప్పించాలి. – టేకం మారుతి, లొద్దిగూడ, మం.తిర్యాణి -
కేంద్రె బాలాజీకి రైతునేస్తం అవార్డు
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు కేంద్రె బాలాజీని మరో అవార్డు వరించింది. హైదరాబాద్లోని స్వర్ణ భారతి భవనంలో ఆదివా రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా రైతు నేస్తం అవార్డు అందుకున్నారు. అనంత రం శాలువాలతో సత్కరించారు. రైతునేస్తం ఫౌండేషన్ 21వ వార్షికోత్సవం సందర్భంగా సేంద్రియ వ్యవసాయం చేయడంతోపాటు ఆధునిక పద్ధతుల్లో వివిధ పంటలను సాగు చేస్తున్న బాలాజీని అవార్డుకు ఎంపిక చేశారు. -
వెడ్మ రాము పోరాటం మరువలేనిది
తిర్యాణి(ఆసిఫాబాద్): ఆదివాసీల హక్కుల సాధన కోసం జల్, జంగల్, జమీన్ నినాదంతో కుమురం భీంతో కలిసి వెడ్మ రాము చేసిన పోరాటం మరువలేనిదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. తిర్యాణి మండలం ఎదులపహాడ్ గ్రామంలో ఆదివారం వెడ్మ రాము 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మహనీయుల పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఎదులపహాడ్ గ్రామంలో రాము విగ్రహంతోపాటు స్మృతివనం ఏర్పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వెడ్మ రాముకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీటీడీవో రమాదేవి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం సంతోష్, మాజీ జెడ్పీటీసీలు చంద్రశేఖర్, వెడ్మ కమల, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు అనిల్గౌడ్, హన్మండ్ల జగదీశ్, ఆత్రం భీంరావు, మర్సుకోల తిరుపతి, తొడసం శ్రీనివాస్, చహకటి దశ్రు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికో లక్కు..!
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్అర్బన్: మద్యం దుకా ణాల కేటాయింపునకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం లక్కీడ్రా నిర్వహించనున్నారు. గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం ఆశించిన విధంగా వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2026– 27 సంవత్సరానికి జిల్లాలోని 32 మద్యం దుకాణాలు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రారంభంలో వ్యాపారుల నుంచి స్పందన అంతంతే ఉండటం, రాష్ట్రంలో బీసీ బంద్ నిర్వహించడంతో గడువు పొడిగించారు. ఈ నెల 23 వరకు గడువు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య సైతం పెరిగింది. 2023 అక్టోబర్లో అప్పటి ప్రభుత్వం 32 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 1,020 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల చొప్పున రూ.20.40 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం 32 దుకాణాలకు 680 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంతో పోలిస్తే 340 దరఖాస్తులు తక్కువగా వచ్చినా.. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు ఉండటంతో ఆదాయం రూ.20.40కోట్లు వచ్చింది. దరఖాస్తు ఫీజు రూ.లక్ష పెంచడంతో దరఖాస్తులు తగ్గినా ఆదాయం అంతే మొత్తం సమకూరింది. ఉదయం 10 గంటలకు ప్రారంభంగతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా లక్కీడ్రా విధానంలో దరఖాస్తుదారులకు మద్యం షాపులు కేటాయించనున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి వైన్స్ల కేటాయింపు ప్రారంభం కానుంది. తాగునీరు, జనరేటర్, మైక్ సెట్తోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. ఎకై ్సజ్ శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం సీరియల్ నంబర్ 01 నుంచి లక్కీడ్రా ప్రారంభిస్తారు. షాపు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభించుకోవచ్చు. లైసెన్స్ ఫీజులో ఆరో వంతు మొదటి విడతగా 28లోగా చెల్లించాలి. 25 వైన్స్లకే లక్కీడ్రాజిల్లాలోని మద్యం దుకాణాలకు అత్యధిక దరఖాస్తులు రాగా.. మరికొన్ని షాపులకు మద్యం సింగిల్ డిజిట్ దాటలేదు. జిల్లాలోనే అత్యధికంగా గూడెం వైన్స్కు 67 దరఖాస్తులు రాగా, రెబ్బెన మండలం గోలేటిలోని వైన్స్కు మూడు మాత్రమే వచ్చాయి. జైనూర్(30) దుకాణానికి ఏడు దరఖాస్తులు రాగా, జైనూర్(31) 8, సిర్పూర్(యూ)(32 ) 9, గోలేటి(10 ) 3, కాగజ్నగర్(14) 7, రెబ్బెన(09) 6, రవీంద్రనగర్(22) షాపునకు 5 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడు దుకాణాలకు లక్కీడ్రా నిలిపివేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ తెలిపారు. సోమవారం 25 దుకాణాలకు మాత్రమే లక్కీడ్రా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
కాగజ్నగర్టౌన్: శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. కాగజ్నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణకు సహకరించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 55 బైక్లను సీజ్ చేశారు. అలాగే పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా వ్యాపారులు రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. కాగజ్నగర్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు శ్రీకాంత్, లక్ష్మణ్, కల్యాణ్, పోలీసులు పాల్గొన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
దహెగాం(సిర్పూర్): దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన నిండు గర్భిణి శ్రావణిని కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశా రు. ఆదివారం గ్రామంలో శ్రావణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకుందనే అక్కసుతో గిరిజన యువతిని హత్య చేయడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఒడ్డుగూడకు చెందిన పశువు ల కాపరి బుజాడి రామన్నపై దాడి చేసిన ఎఫ్ఎస్వో సద్దాంపై చర్యలు తీసుకోవాలన్నా రు. అటవీశాఖ అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు అన్వర్, సుజాయిల్ఖాన్, దిలీప్, బక్కయ్య, అచ్యుత్ తదితరులు ఉన్నా రు. -
కొత్తరూపు
రహదారులకుఆసిఫాబాద్: జిల్లాలోని రహదారులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. రవాణాను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రహదారులను విస్తరించడంతోపాటు కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆసిఫాబాద్–ఉట్నూర్ రోడ్డుతోపాటు గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనుంది. జిల్లాలో 30 రహదారులకు మహర్దశ పట్టనుంది. కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో పక్కా రోడ్లు నిర్మించాలని ప్రజలు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం హ్యామ్(హైబ్రిడ్ యాన్యూ టి మోడల్) విధానంలో మొదటి దశలో ఈ రోడ్లు నిర్మించనుంది. త్వరలోనే టెండర్లు పిలుస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 140.66 కిలోమీటర్లు..జిల్లా వ్యాప్తంగా 30 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా 140.66 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆసిఫాబాద్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోవింద్పూర్ వరకు 2.40 కిలోమీటర్లు నిర్మించనున్నారు. అలాగే పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఈదులవాడ వరకు 4.80 కి.మీ.లు, పీఆర్ రోడ్డు నుంచి వట్టివాగు ప్రాజెక్టు వరకు 3.40 కి.మీ.లు, వీవీపీ రోడ్డు నుంచి కౌటగూడ 5.25, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పర్శనంబాల 5, కెరమెరి మండలం ఎన్టీఆర్రోడ్డు నుంచి సావర్ఖేడా 4.45, కెలి– కె నుంచి బాలాపటార్ ఏసాపూర్ 6.90, ఓడీఆర్ అనార్పల్లి నుంచి శంకర్గూడ వయా కరంజీవాడ 4.50, వాంకిడి మండలం వీఆర్ఎస్ నుంచి జంబుల్దరి 265 ఎన్హెచ్ నుంచి కోమటిగూడ 3.80, పీఆర్రోడ్డు నుంచి ముకాసిగూడ వయా సరండి 9.30, పీఆర్ రోడ్డు నుంచి మర్కగూడ 1, జైనూర్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జామిని 0.95, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పవార్గూడ పొలాస 3.05, సిర్పూర్(యూ) మండలం ఆర్ఎఫ్రోడ్డు మహాగావ్ నుంచి గుమ్నూరు– బి వయా ధనోరా చాపరి 5.80, పీడబ్ల్యూడీ రోడ్డు పవార్ నుంచి దేవుడుపల్లి 1.30, లింగాపూర్ మండలం రామునాయక్ తండా నుంచి ఎల్లాపటార్ గోండుగూడ 3.15, అలీగూడ నుంచి పిక్లాతండా వయా గుమ్మునూరు కాంచన్పల్లి, కొత్తపల్లి 13.20, చింతలమానెపల్లి మండలం గుడ్లబోరి నుంచి బాబాసాగర్ వయా సైబాపూర్ 2,, కౌటాల నుంచి కోర్సిని వయా రణవెల్లి 10, కౌటాల మండలం గుడ్లబోరి నుంచి బాబాపూర్ వయా సైదాపూర్ 3.30, కాగజ్నగర్ మండలం ఆర్అండ్బీ రోడ్డు నుంచి కొత్త సార్సాల 0.90, ఆర్అండ్బీ రోడ్డు నుంచి వంజరి 2.70, బెజ్జూర్ మండలం జెడ్పీ రోడ్డు నుంచి ముంజంపల్లి 1.46, పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి నుంచి ఎల్లూరు 2.20, దహెగాం మండలం పీపీరావు కాలనీ నుంచి సుర్దాపూర్ 8.60, సిర్పూర్(టి) మండలం ఎన్హెచ్ నుంచి శివపూర్ వయా షేక్ అహ్మద్గూడ, ఎండీఆర్ నుంచి పొడస వరకు 1.80 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. మొరుగుపడనున్న రవాణాజిల్లాలో కొత్తగా మంజూరైన రహదారుల నిర్మాణం పూర్తయితే రవాణా సేవలు మెరుగుపడనున్నాయి. జిల్లా కేంద్రం నుంచి ఉట్నూర్ వెళ్లే రహదారిపై గుంతలు పడి, కంకర తేలి ప్రయాణం నరకప్రాయంగా మారింది. 70 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పడుతుంది. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని యజమానులు వాపోతున్నారు. మారుమూల ప్రాంతాలకు సక్రమంగా దారులు లేకపోవడంతో అంబులెన్స్లు వెళ్లలేని పరిస్థితి. ముఖ్యంగా గర్భిణులను అత్యవసర సమయంలో ఆస్పత్రులకు తరలించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ మండలంలో ఓ గర్భిణి వాగులోనే ప్రసవించిన విషయం తెలిసిందే. కొత్త దారులు మంజూరు కావడంతో సేవలు మెరుగుపడతాయని ప్రజలు ఆశిస్తున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ఆసిఫాబాద్ నుంచి కెరమెరికి వెళ్లే రహదారి -
మన్కీ బాత్లో భీం ప్రస్తావన
ఆసిఫాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆది వారం నిర్వహించిన మన్కీ బాత్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పోరాట వీరుడు కుమురంభీం గురించి ప్రస్తావించారు. స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ రాజ్యంలో నిజాంకు వ్యతిరేకంగా ఆదివాసీ అయిన కుమురం భీం పోరాడినట్లు వివరించారు. పన్నుల వసూళ్ల కోసం నిజాం నియమించిన అధికారి సిద్దిఖీ ఆదివాసీ మహిళలపై దాడుల కు పాల్పడ్డాడని, ప్రజల నుంచి భూములు లాక్కున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి అకృత్యాలను సహించని కుమురంభీం అతడిని హతమార్చారన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వందల కిలోమీటర్ల దూరంలోని అస్సాంలో వెళ్లిపోయారని తెలిపారు. ఈ నెల 22 కుమురంభీం జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 40 ఏళ్ల జీవితకాలంలోనే ఆదివాసీల కోసం ఎన్నో పోరాటాలు సాగించారని వివరించారు. కుమురంభీం ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని పీఎం తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. అలాగే భగవాన్ బీర్సా ముండా కూడా ఆదివాసీల కోసం పోరాటాలు చేశారని కొనియాడారు. ఇలాంటి వ్యక్తుల చరిత్ర గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. -
అన్నదాతకు ఆపద
కౌటాల(సిర్పూర్): రైతాంగాన్ని ప్రకృతి పగబట్టింది. పత్తితోపాటు వరి, సోయా, మొక్కజొన్న పంట లు అకాల వర్షానికి తడిసి దెబ్బతింటున్నాయి. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు, మబ్బులు రైతులను భయపెడుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. పత్తి పంట చేలలోనే తడిసి ముద్దవుతుండగా, వరి పంట నేలవాలుతోంది. కోతలు పూర్తయిన సోయాను ఆరబెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తెగుళ్ల, యూరియా కొరత నేపథ్యంలో దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం అకాల వర్షాలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. తడిసిన పంటలు..జిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానమైన పత్తిని ఈ ఏడాది 3.40 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. శనివారం పెంచికల్పేట్ మండలంలో 14.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, దహెగాంలో 13.3 మి.మీ. లు, చింతలమానెపల్లిలో 10.2, లింగాపూర్లో 7.7, తిర్యాణిలో 5.2, సిర్పూర్(టి)లో 5.1 మి.మీ.ల వర్షం కురిసింది. కూలీల కొరత ఉండటంతోపాటు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోవడంతో పత్తితీత పనులు జోరందుకోలేదు. పంట మొ త్తం చేలలోనే ఉంది. శుక్రవారం సాయంత్రం, శని వారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పంట తడిసి నేలరాలుతోంది. మబ్బులతో నల్లబారే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొంచి ఉన్న వాన ముప్పుప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. దీంతో ఆకాశం మబ్బులు పట్టి ఉంటోంది. మరో రెండు, మూడు రోజుల పా టు ఇదే స్థితి కొనసాగవచ్చు. పలు ప్రాంతాల్లో వర్షం కురిసే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పత్తి దెబ్బతినడంతోపాటు పొట్ట దశలో ఉన్న వరి గింజలు నాపగా మారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట తడిసింది మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాను. మొదటి సారి పంట తీయడానికి సిద్ధమవుతుండగా అకాల వర్షం కురిసింది. పంటంతా చేనులోనే తడిసి ముద్దయింది. కొంతవరకు నేలరాలగా, చెట్లపై ఉన్నది నల్లగా మారుతోంది. న ల్లగా మారితే కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రారు. అధికారులు ఇప్పటికై నా సీసీఐ కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలి. అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి. – శంకర్, రైతు, యాపలగూడ -
ఆదర్శం.. ‘చారిగాం’
ఒక్కతాటిపై నడుస్తాం గ్రామంలో అందరం ఒక్కతాటిపై నడుస్తాం. ఏ సమస్య వచ్చినా ఒక్కచోట చేరి చర్చించుకుంటాం. మద్యంపానం, గుడుంబా తయారీని ఏళ్ల క్రితమే నిషేధించాం. ఇక్కడ ఎవ్వరూ కూడా గుడుంబా తయారు చేయరు.. తాగరు. గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో నిత్యం పూజలు నిర్వహిస్తాం. – మొర్ల పోచయ్య, చారిగాంకాగజ్నగర్టౌన్: పట్టణానికి కూతవేటు దూరంలో కాగజ్నగర్ మండలం చారిగాం గ్రామం గు డుంబా నిషేధంలో ఆదర్శంగా నిలుస్తోంది. పూ ర్వీకుల నుంచి వారు నిషేధాన్ని పాటిస్తున్నారు. గ్రామంలో సుమారు 234 మంది నివాసం ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ చేయొద్దని.. బెల్టుషాపులు నిర్వహించొద్దని పెద్దలు తీర్మానం చేశారు. దానిని ఇప్పటికీ యువకులు కొనసాగిస్తున్నారు. స్థానికులు ప్రధానంగా కూరగాయలు పండిస్తూ పట్టణంలో విక్రయించి జీవనం సాగిస్తున్నారు. స్థానిక యువకులు ఎవరైనా బయట తాగినట్లు తెలిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి మాలధారణ చేయిస్తున్నారు. అధ్యాత్మిక చింతనతో మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నారు. -
పింఛన్ల పునరుద్ధరణకు సదరం శిబిరాలు
ఆసిఫాబాద్అర్బన్: దివ్యాంగ పింఛన్ల పునరుద్ధరణ కోసం ప్రత్యేక సదరం శిబిరాలు నిర్వహిస్తామని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్లు, డీఆర్డీఏ అధికారులు, డీపీఎంలు, ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. సెర్ప్ సీఈవో మాట్లాడుతూ అంగవైకల్య నిర్ధారణ కోసం సదరం క్యాంపులు ఏర్పా టు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 600 మంది దివ్యాంగుల పింఛన్ పునరుద్ధరణకు జైనూర్, కౌటాల మండలా ల్లో ప్రత్యేక అంగ వైకల్య నిర్ధారణ పరీక్ష నిర్వహించేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, వీవోఏలు, సీసీలు, ఏపీఎంలతో స్లాట్ బుకింగ్పై అవగాహన కల్పిస్తామన్నారు. దివ్యాంగులతో పాటు వారికి సహాయకులుగా వచ్చే వారికి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. సమావేశంలో డీపీఎం రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. -
సమరం!
గుడుంబాపైపోలీసులకు సమాచారం ఇస్తాం గుడుంబాకు బానిసలైన వ్యక్తుల జీవితాలు నాశనం అవుతున్నాయి. కర్జి గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి గుడుంబాకు బానిసై ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో యువకులం ఏకమై గ్రామంలో గుడుంబాను నిషేధించాలని ప్రతిజ్ఞ చేశాం. గ్రామంలో గుడుంబా విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇస్తామని హెచ్చరించాం. – మధుకర్, కర్జి, మం.దహెగాం నిషేధిస్తూ తీర్మానం చేశాం మద్యానికి బానిసలుగా మారడంతో ఆర్థికంగా నష్టపోవడంతోపాటు కుటుంబ కలహాలకు దారి తీస్తుంది. గ్రామంలో శనివారం సమావేశమై మద్యపానం నిషేధించాలని తీర్మానం చేశాం. ఎవరైనా మద్యం, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తే వారికి రూ.50 వేల జరిమానా విధిస్తాం. ప్రస్తుతం ఉన్న స్టాక్ను మూడు రోజుల్లో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చాం. – బోరే నగేశ్, రాంపూర్, మం.దహెగాం నేరాలకు పాల్పడే అవకాశం మురుగునీరు, వివిధ కుళ్లిన పదార్థాలతో గుడుంబా తయారు చేస్తారు. మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో గుడుంబా అమ్మితే కేసులు నమోదు చేస్తాం. తయారీ కేంద్రాల సమాచారం ఉంటే పోలీసులకు అందించాలి. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్నగర్దహెగాం/కౌటాల: విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం, గుడుంబా, ఇతర మత్తు పదార్థాలు గ్రామాల్లో అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. ఆర్థికంగా కుటుంబాలు ఛిన్నాభిన్నం కావడమే కాకుండా మత్తులో యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సకల సమస్యలకు కారణమైన గుడుంబాపై పల్లెల్లోని యువత, మహిళలు యుద్ధం ప్రారంభించారు. కుటుంబాలను విచ్ఛినం చేస్తున్న గడుంబా, ఇతర మత్తు పదార్థాలను నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. కర్జి గ్రామంలో ఇటీవల జునుగరి రాజన్న గుడుంబాకు బానిసై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికులు ముందుకొచ్చి ఈ నెల 22న గ్రామంలో గుడుంబా అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించి, నిషేధానికి తీర్మానం చేశారు. కేసులు నమోదు చేస్తున్నా..జిల్లాలో గుడుంబా కట్టడికి పోలీసుశాఖ విస్తృతంగా దాడులు చేస్తూ.. నిందితులపై కేసులు నమోదు చేస్తోంది. అయినా కొందరు మారుమూల అటవీ ప్రాంతాలను అడ్డాలు మార్చుకుంటూ నాటుసారా తయారు చేస్తున్నారు. కాగజ్నగర్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి 200 మందిపై కేసులు నమోదు చేశారు. 1200 లీటర్లకు పైగా నాటుసారా, రెండు వేల కిలోలకు పైగా బెల్లం, పటికను పట్టుకున్నారు. పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. శనివారం కాగజ్నగర్ మండలం తుంగమడుగులో పోలీసులు 20 లీటర్ల గుడుంబా, మరో మూడు వేల లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 30 కిలోల బెల్లం, పట్టికను పట్టుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే పూర్తిస్థాయిలో గుడుంబా నిర్మూలన సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. -
హాజరు అంతంతే..!
కెరమెరి మండలం రాంజీగూడ గిరిజన ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో 119 మంది విద్యార్థులు చదువుతున్నారు. దసరా సెలవుల తర్వాత విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లారు. దీపావళి పండుగ దాటినా ప్రస్తుతం హాజరు శాతం అంతంత మాత్రమే ఉంది. ప్రస్తుతం పాఠశాలలో కేవలం 69 మంది ఉన్నారు. ఉపాధ్యాయులకు గ్రామాలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.వాంకిడి మండలం పెద్దపుల్లారలో విద్యార్థులతో మాట్లాడుతున్న రాంజీగూడ సీఆర్టీలుకెరమెరి మండలం హట్టి గిరిజన ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో 356 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన గిరిజన విద్యార్థులు ఎక్కువ మంది దండారీ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ప్రస్తుతం పాఠశాలలో కేవలం 173 మంది మాత్రమే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ఇలాగే ఉంది. కెరమెరి(ఆసిఫాబాద్): దసరా సెలవులు ముగిసి దాదాపు 20 రోజులు దాటింది. ఆ తర్వాత దీపావళి పర్వదినం కూడా ముగిసింది. అయినా జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు తరచూ ఫోన్లు చేస్తున్నా అనుకున్న రీతిలో స్పందన రావడంలేదు. దీంతో ప్రతిరోజూ విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు అరకొరగా ఉన్న పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడికి రావాలని అవగాహన కల్పిస్తున్నారు. 13,126 మంది విద్యార్థులు జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు 332 ఉండగా, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 13,126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి ఈ నెల 3 వరకు సెలవులు ప్రకటించింది. సెలవుల కంటే ముందు ఒకటి, రెండు రోజుల ముందే విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నెల 4న పాఠశాలలు పునఃప్రారంభం కాగా, ఆ రోజే విద్యార్థులు యథావిధిగా తరగతులకు హాజరుకావాల్సి ఉంది. కానీ నాలుగు రోజుల క్రితం వరకు హాజరు 40 శాతం కూడా దాటలేదు. రెండు రోజులుగా కొంతమంది వస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన తర్వాత పిల్లల కోసం ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. ‘గిరి’ గ్రామాల్లో దండారీ ఉత్సవాలుఆశ్రమ పాఠశాలల్లో చదివే వారిలో ఆదివాసీ విద్యార్థులే అధికంగా చదువుకుంటున్నారు. దీపావ ళి పండుగ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో ఈ నెల 15 నుంచి దండారీ ఉత్సవాలు ప్రారంభమయ్యా యి. ఏడాదికి ఒక్కసారి నిర్వహించే ఉత్సవాలను ఆదివాసీలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నా రు. ఇంటిల్లిపాది భాగస్వాములవుతున్నారు. ఈ ఏడాది ఉత్సవాల్లో విద్యార్థులు కూడా పాలుపంచుకుంటున్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే 20 రోజులకు పైగా విద్యార్థులు బడికి దూరంగా ఉన్నారు. గైర్హాజరు ప్ర భావం ఎక్కువగా పదో తరగతి విద్యార్థులపై పడుతోంది. ఈ నెల 24 నుంచి ఎస్ఏ1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని గ్రామాల్లో దండారీ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆదివారం తర్వాత హాజరు పెరిగే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేశ్కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితాను మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించామన్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.33 కోట్ల ఓటర్లను మ్యాపింగ్ చేశామని వివరించారు. మొదట మ్యాపింగ్ చేసిన కేటగిరీ ఏ జాబితాను బీఎల్వో యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, అనంతరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్లో నమోదు చేస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేటగిరీల వారీగా బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చామన్నారు. సహాయ ఎన్నికల అధికారి సమక్షంలో రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్యాంలాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశవర్కర్లకు రూ.25వేల వేతనం చెల్లించాలి
కాగజ్నగర్టౌన్: ఆశవర్కర్లకు కనీస వేతనంగా నెలకు రూ.25వేలు చెల్లించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో శనివారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లాస్థాయి మూడో మహాసభలు నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశ వర్కర్ల సేవలను డబ్ల్యూహెచ్వో, ఇతర అంతర్జాతీయ సంస్థలు గుర్తించినా కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. రూ.50లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు జీవో విడుదల చేయలేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, అంత్యక్రియల ఖర్చు, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు స్వరూప, వివిధ మండలాల ప్రతినిధులు రజిని, పద్మ, రమ, నవీన, ఓమల, సునీత, శోభ, శకుంతల తదితరులు పాల్గొన్నారు. -
‘బెజ్జూర్’లో అవినీతి.. మంచిర్యాలలో ఏసీబీ దాడి
బెజ్జూర్(సిర్పూర్): బెజ్జూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఏసీఎస్ కార్యదర్శి నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ జిల్లా ఇన్చార్జి సహకార అధికారి(డీసీవో) రాథోడ్ భిక్కునాయక్ ఏసీబీకి చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. బెజ్జూర్ పీఏసీఎస్లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వెంకటేశ్వర్గౌడ్ అవినీతి కి పాల్పడ్డారని సంఘ డైరెక్టర్లు గతేడాది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం సహకార సంఘంలో రూ.1.24 కోట్ల నిధులు పక్కాదారి పట్టినట్లు నిర్ధారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కార్యదర్శిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడంతోపాటు పెండింగ్ వేతనాలు ఇప్పించేందుకు వెంకటేశ్వర్గౌడ్ నుంచి డీసీవో భిక్కునాయక్ రూ.7లక్షల లంచం డిమాండ్ చేశాడు. మొదటి దఫా రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని, వెంకటేశ్వర్గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వల పన్ని శనివారం మంచిర్యాలలోని ఎక్బాల్ హైమద్నగర్లో అద్దెకుంటున్న రాథోడ్ భిక్కునాయక్ ఇంట్లో లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. బెజ్జూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతి ఆరోపణలతో ఒకరు సస్పెండ్ కాగా మరో జిల్లా అధికారి ఏసీబీకి పట్టుపడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
ముగ్గురు వేటగాళ్లపై కేసు
వాంకిడి: వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి బుధవారం రాత్రి జైలుకి తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ధరావత్ భీమా, గుర్నులె తిరుపతి, నగోషే బీర్సావ్ అనే ముగ్గురు వ్యక్తులు జోగాపూర్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చుతుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి విద్యుత్ తీగలను స్వాధీనం చేసుకొని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్ధార్ తెలిపారు. దాడుల్లో డిప్యూటీ రేంజ్ అధికారిని ఝాన్సిలక్ష్మి, ఎఫ్ఎస్వో సాయి చరణ్, ఎఫ్బీవోలు ప్రభాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● ఉమ్మడి జిల్లాలో చెక్పోస్టుల ఎత్తివేత ● కార్యాలయాల్లోనూ ఏజెంట్లను నిలువరిస్తే మేలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖలో అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రాష్ట్రంలో రవాణా శాఖ చెక్పోస్టులు ఎత్తివేయడంతో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న తనిఖీ కేంద్రాలను బుధవారం సాయంత్రం నుంచే అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుగా జాతీయ రహదారులు–44, 61, 363పై జైనథ్ మండలం భోరజ్, తానూర్ మండలం బెల్తరోడ, వాంకిడిలోని చెక్పోస్టులు పూర్తిగా తొలగించారు. మూడు నెలల క్రితమే రవాణా శాఖలో తనిఖీ కేంద్రాలను ఎత్తి వేసి పూర్తిగా ఆన్లైన్ ఆధారిత వాహన పన్నుల వసూళ్లు, జరిమానాలు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా చెక్పోస్టులు అనధికారికంగానే కొనసాగుతూ వస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో లెక్కకు మించి ఉన్న రూ.1.26లక్షల నగదు భోరజ్ వద్ద, రూ.5,100 వాంకిడి చెక్పోస్టు వద్ద, బెల్తరోడ చెక్పోస్టు వద్ద రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఇవే చెక్పోస్టుల్లో దాడులు జరుగగా.. అనధికారికంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని కేసులు నమో దు చేశారు. తరచూ దాడులు, తనిఖీలు జరిగినా ఈ కేంద్రాల్లో సాగిన అవినీతిని నిలువరించలేకపోయారు. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల లక్ష్యాలు పూర్తి స్థాయిలో చేరడం లేదు. తాజాగా కేంద్రాలను ఎత్తివేయడంతో వాహన యజమానులు, డ్రైవర్ల నుంచి అనధికార వసూళ్లు పూర్తిగా తగ్గనుంది. కార్యాలయాల్లో ఏజెంట్ల హవా ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ఏజెంట్లు, మధ్యవర్తుల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏజెంట్ల పేరుతో వాస్తవ చార్జీల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అంతా తెలిసి కూడా ఈ అనధికార వసూళ్లను ప్రోత్సహిస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, వినియోగదారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విధించిన రుసుం, పన్నుల కంటే అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. చాలామందికి రవాణా శాఖ నిబంధనలపై అవగాహన లేమితో విద్యావంతులు సైతం మధ్యవర్తులతోనే కార్యాలయాలకు వెళ్తున్నారు. చాలా సేవలు ఆన్లైన్లో చేసుకోవచ్చు. సులువుగా పని పూర్తవుతుందనే కారణంతో ఏజెంట్లను ఆశ్రయిస్తున్న పౌరులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్లు షోరూంల్లోనే చేసుకునే వెలుసుబాటు ఇవ్వాలి. నిరక్షరాస్యులు సైతం కార్యాలయాల్లో సేవలు పొందేలా ఏర్పాట్లు, కార్యాలయాల్లో మధ్యవర్తులను కట్టడి చేస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఆధునిక సేవలను వినియోగించి దళారుల వ్యవస్థను తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా ఉమ్మడి జిల్లా కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేస్తే అక్రమ వసూళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. బెల్తరోడాలో.. తానూరు: బెల్తరోడా చెక్పోస్టులోని ఫర్నిచర్ను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అధికారులు, సిబ్బంది ఫర్నిచర్తోపాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. చెక్పోస్ట్ను ఎత్తివేసినట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఫైళ్లు తరలింపు.. ఆదిలాబాద్టౌన్: అధికారులు ఆఘమేఘాలపై బో రజ్ చెక్పోస్టు వద్ద కార్యకలాపాలు నిలిపి వేశారు. బోర్డులు, బారికేడ్లు తొలగించారు. కంప్యూటర్లు, రశీదులు, ఆర్థిక పరిపరమైన రికార్డులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాని(డీటీసీ)కి తరలించారు. నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది పని చేస్తున్నారు. వీరు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే వారు. వీరిని డీటీసీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి వీరికి ఇతర బాధ్యతలు అప్పగించనున్నారు.కమిషనర్ ఆదేశాల మేరకు తొలగింపు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వాంకిడి రవాణా చెక్పోస్టును బుధవారం సాయంత్రం 5 గంటలకు తొలగించాం. చెక్పోస్టులో ఉన్న కంప్యూటర్లు, రి కార్డులను జిల్లా కార్యాలయానికి తరలిస్తాం. ఇకపై ఇక్కడ రవాణా శాఖ సిబ్బంది ఎవరూ పనిచేయరు. ఎవరైనా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలి. – రాంచందర్, డీటీవో, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆన్లైన్లో సేవలు.. వాంకిడి: చెక్పోస్టుల ద్వారా అందించిన సేవలను ఇకపై www. transport. telangana. gov. in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ద్వారా టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలు లభ్యమవుతాయి. సేవలపై చెక్పోస్ట్ సిబ్బంది కొన్ని నెలలుగా వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు చెక్పోస్టు వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
రెబ్బెన(ఆసిఫాబాద్): పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీటీసీవోఏ క్లబ్లో స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా బుధవారం స్వచ్ఛత శ్రమదానం చేపట్టారు. ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో ఉన్న చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు ఇంటి మాదిరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలన్నారు. ఏరియాలో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్కు బదులు పేపర్ గ్లాస్లు, మట్టి వస్తువులను వినియోగించా లని సూచించారు. స్వచ్ఛతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శి మారం శ్రీనివాస్, అధికా రుల సంఘం ఏరియా ప్రతినిధి ఉజ్వల్కుమార్ బెహరా, ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్వోడీ శ్రీనివాస్, డీజీఎం సివిల్ ఎస్కే మదీనా బాషా, ఇన్చార్జి ఎన్విరాన్మెంట్ అధికారి రమేశ్, సెక్యూరిటీ అధికారి శ్రీధర్, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, ఎస్టేట్స్ అధికారి సాగర్, ఐటీ మేనేజర్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో బుధవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి హ్యాండ్బాల్, ఖోఖో పోటీలు రసవత్తరంగా సాగాయి. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి అండర్– 14, 17 హ్యాండ్బాల్ పోటీలకు జిల్లా నుంచి వందమంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ చూపిన 16 మంది బాలురు, 16 మంది బాలికలను జోనల్స్థాయికి ఎంపిక చేశామన్నారు. అలాగే అండర్– 14, 17 ఖోఖో ఎంపిక పోటీలకు 200 మంది క్రీడాకారులు హారు కాగా, 24 మంది బాలబాలికలు జోనల్స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపా రు. అండర్– 14 బాలబాలికల జోనల్స్థాయి పోటీలు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో నిర్వహిస్తామని, అండర్– 17 పోటీలు ఆదిలాబాద్ కొనసాగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్ద వ్, డీఎస్వో షేకు, ప్రిన్సిపాల్ జంగు, పీడీ మీనారెడ్డి, కోచ్లు అరవింద్, విద్యాసాగర్, తిరుమల్, పీఈటీలు లక్ష్మణ్, శారద, హరీశ్, భవ్య, సరోజ తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల కోసం పోరాడిన వీరులు
ఆసిఫాబాద్రూరల్: హక్కుల కోసం ఆదివాసీ వీరు లు కుమురంభీం, ఎడ్ల కొండు అలుపెరగని పోరా టం చేశారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. కుమురంభీం స్వస్థలం ఆసిఫాబాద్ మండలం పాత రౌట సంకెపల్లిలో బుధవారం భీం జయంతి, అతని సహచరుడు ఎడ్ల కొండు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. డీటీడీవో రమాదేవి, మాజీ జెడ్పీటీసీ నాగేశ్వర్రావు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, ఆదివాసీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల సాధన కోసం కుమురంభీం ప్రాణాలను త్యాగం చేశారన్నారు. గిరిజన వీరులను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. భీం పుట్టిన గ్రామం రౌటసంకెపల్లి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డీటీడీవో మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చట్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, ఆదివాసీ నాయకులు అర్జు, కోవ విజయ్, వెంకటేశ్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఎడ్ల కొండు వారసులు బక్కయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు అడ్డుకట్ట..!
ఆసిఫాబాద్అర్బన్: ఉపాధిహామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూలీలకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. జాబ్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధిస్తున్నారు. ఇందుకోసం ఎన్ఆర్ ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉపాధిహామీ కింద పనిచేస్తున్న కూలీల ఆధార్ కార్డు, జాబ్కార్డు వివరాలను నమోదు చేసి ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తిచేయని కూలీలు ఉపాధి పనులకు దూరం కానున్నారు. 1,22,602 మంది ఈకేవైసీ పూర్తి జిల్లాలోని 335 పంచాయతీల పరిధిలో జిల్లాలో ఉపాధిహామీ పథకంలో 1,65,316 మంది కూలీలు ఉన్నారు. ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్లో కూలీల ఫొటోలు అప్లోడ్ చేయాలి. కానీ కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎఫ్ఏలు) నకిలీ, పాత ఫొటోలను అప్లోడ్ చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. పనులకు హాజరుకాకున్నా పాత ఫొటోలు పెడుతున్నారు. ఒకరి పేరుపై మరొకరు పనులకు వెళ్లినా హాజరు వేస్తున్నారు. మరోవైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయటపడుతున్నాయి. నిధులు పక్కదారి పడుతున్నట్లు తేలినా రికవరీ అంతంత మాత్రంగానే ఉంటోంది. వీటన్నింటికీ చెక్పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 1,22,602 మంది ఈకేవైసీ పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత యాక్టీవ్ కూ లీలు పనికి రాగానే ఒకసారి, పనులు పూర్తయిన త ర్వాత మరోసారి ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చే స్తారు. కూలీల వివరాలు యాప్లో నమోదు కాకపో తే పనులకు వెళ్లినా హాజరువేయలేరు. పనిప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతంలో తీసిన ఫొటోను అప్లోడ్ చేస్తే జీపీఎస్ సిస్టం గుర్తిస్తుంది. తప్పుడు హాజరుగా నిర్ధారిస్తుంది. ఈకేవైసీ వందశాతం పూ ర్తయితే ఈజీఎస్లో అవకతవకాలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా వివరాలు మండలం మొత్తం ఈకేవైసీ పూర్తి కూలీలు చేసుకున్నవారు ఆసిఫాబాద్ 13,493 10,723 బెజ్జూర్ 12,215 9,005 చింతలమానెపల్లి 10,587 7,813 దహెగాం 13,585 10,094 జైనూర్ 12,523 8,299 కాగజ్నగర్ 12,308 10,712 కెరమెరి 14,450 8,420 కౌటాల 13,697 11,010 లింగాపూర్ 7,976 5,812 పెంచికల్పేట్ 6,567 5,321 రెబ్బెన 11,295 7,113 సిర్పూర్(టి) 7,900 6,552 సిర్పూర్(యూ) 7,548 4,621 తిర్యాణి 9,914 7,925 వాంకిడి 11,205 9,177 -
గుడుంబా నిర్మూలనకు కదిలిన యువత
దహెగాం(సిర్పూర్): గుడుంబా నిర్మూలనకు దహెగాం మండలం కర్జి గ్రామ యువత నడుం బిగించారు. బుధవారం యువకులు ఇంటింటికీ వెళ్లి గుడుంబా తాగడంతో కలిగే దుష్ప్రభావాలను వివరించారు. గ్రామంలో నాటుసారా తయారు చేసినా, విక్రయించినా పోలీసులకు సమాచారం అందించి కేసులు నమోదు చేయిస్తామని విక్రయదారులను హెచ్చరించారు. అనంతరం గ్రామంలో గు డుంబాను పూర్తి నిర్మూలించాలని స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. యువకులు మాట్లాడుతూ గుడుంబాను తాగడంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కోలుకోవడం లేదన్నారు. కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గుడుంబా విక్రయాలు మానుకోవాలని వారు హెచ్చరించారు. -
మెడికల్ బోర్డు.. అన్ఫిట్..!
శ్రీరాంపూర్: సింగరేణిలో మెడికల్ బోర్డు నిలిచి పోయి ఏడు నెలలు గడుస్తోంది. దీంతో వ్యాధుల బారిన పడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనారోగ్యం కారణంగా డ్యూటీలు చేయలేకపోతున్న కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారిని ప్రతీ నెల బోర్డుకు పిలిచి స్క్రీనింగ్ చేస్తారు. వారి డిజిగ్నేషన్, జబ్బు తీవ్రతను బట్టి అన్ఫిట్(ఇన్వాలిడేషన్) చేయడమో, అండర్గ్రౌండ్ నుంచి సర్ఫేస్కు లేదా హయ్యర్ సెంటర్ రెఫరల్ అని ఇస్తారు. కంపెనీలో ఇంతటి ప్రా ముఖ్యత ఉన్న మెడికల్ బోర్డును చివరిసారిగా ఈ ఏడాది మార్చి 21న నిర్వహించారు. అప్పటి నుంచి రెగ్యులర్ బోర్డు నిర్వహించలేదు. కానీ హయ్యర్ సెంటర్ రెఫరల్ కేసులకు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో మెడికల్ బోర్డు నిర్వహించారు. వారు కూడా అప్పటికే నెలల తరబడి నిరీక్షించారు. మొత్తంగా 55మందిని బోర్డుకు పిలువగా వారిలో 54మంది హాజరయ్యారు. వీరిలో ఐదుగురిని మాత్రమే అన్ఫిట్ చేసి మిగతా వారిని డ్యూటీలు చేసుకోవాలని సూచించారు. కారుణ్య నియామకాలు అమలైన తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో అన్ఫిట్ కావడం ఇదే మొదటిసారి. మున్ముందు నిర్వహించే రెగ్యులర్ మెడికల్ బోర్డుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. కార్మికుల నిరీక్షణ రెండేళ్ల సర్వీసు మిగిలిన కార్మికులు ఎక్కువ శాతం మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. వీరితోపాటు గనుల్లో, బయట జరిగిన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారు కూడా బోర్డుకు దరఖాస్తులు అందజేస్తుంటారు. వీరందరిని ప్రతీ నెల చివరిలో బోర్డుకు పిలిచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏడు నె లలుగా బోర్డు నిలిచిపోవడంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జబ్బు కారణంగా కొందరు డ్యూటీలు కూడా సక్రమంగా చేయడం లేదు. బోర్డు నిర్వహించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా జా ప్యం చేయడం వల్ల వేతన నష్టం చవిచూడాల్సి వ స్తోందని వాపోతున్నారు. ఇప్పటికే పైరవీ ఆరోపణలతో అబాసుపాలవుతున్న మెడికల్ బోర్డు నేడు జాప్యం వల్ల మరిన్ని విమర్శలు ఎదుర్కోంటోంది. మెడికల్ బోర్డు జాప్యంతో కారుణ్య నియామకాలు పొందే డిపెండెంట్ల సర్వీసు లాస్ అవుతోందని కా ర్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రక్షాళన అయ్యేనా..? మెడికల్ బోర్డుపై వస్తున్న అవినీతి, ఆరోపణల నేపథ్యంలో బోర్డును ప్రక్షాళన చేయడానికి జాప్యం జ రుగుతుందా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోపక్క కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరగడం, దానికి సరిపడా కొత్తగనులు లేకపోవడంతో ము న్ముందు కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తే ఎక్కడ వీరిని సర్దుబాటు చేస్తామనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బోర్డును మరింత కఠినతరం చేసి కారుణ్య నియామకాల సంఖ్య తగ్గిస్తారా..? అలా చేయడానికేనా ఇటీవల నిర్వహించిన హయ్యర్ సెంటర్ రెఫరల్ బోర్డులో ఎన్నడూ లేనంతగా కొద్దిమందిని మాత్రమే అన్ఫిట్ చేసి ఉంటారని భావిస్తున్నా రు. ఏదేమైనా ఏళ్ల తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న కారుణ్య ఉద్యోగాలు ప్రమాదంలో పడితే గెలిచిన సంఘాలతోపాటు ప్రభుత్వం కూడా భవిష్యత్లో అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంటనే ఏర్పాటు చేయాలి వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. కంపెనీ, ప్రభుత్వ తీరు చూస్తే కారుణ్య ఉద్యోగా లను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రతీ నెల నిర్వహించాల్సిన మెడికల్ బోర్డును ఏడు నెలలుగా నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గెలిచిన సంఘాలు దీనిపై నోరుమెదపకపోవడం శోచనీయం. – కేతిరెడ్డి సురేందర్రెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి -
కుమురం భీం
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెల్లవారుజామున తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది.7సమస్యల్లో ప్రభుత్వ పాఠశాల! లింగాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సమస్యలు వెంటాడుతున్నాయి. భవ నం కూడా శిథిలావస్థకు చేరింది. తరగతి గదుల్లో ఫ్లోరింగ్ పగిలిపోయింది. సమస్యల పరిష్కారమెప్పుడో..! క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. వేతన పెంపు, క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిబంధనలు పాటించాలి
చింతలమానెపల్లి(సిర్పూర్): ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాల డీలర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) వెంకటి అన్నారు. మండలంలోని రణవెల్లి, రవీంద్రనగర్, చింతలమానెపల్లి గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు, నిల్వలు పరిశీలించారు. డీఏవో మాట్లాడుతూ రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పురుగుమందులు వాడే విధానం లేబుళ్లపై ముద్రించి ఉంటుందని, రైతులు గమనించాలని సూచించారు. తనిఖీ చేస్తున్న డీఏవో వెంకటి -
బైక్పై వెళ్లి.. తనిఖీ చేసి
కెరమెరి(ఆసిఫాబాద్): సరైన రహదారి సౌకర్యం లేని కెరమెరి మండలం ఇందాపూర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి బైక్పై వెళ్లి సందర్శించారు. మధ్యాహ్న భోజనంతోపాటు ఉపాధ్యాయు ల డైరీ, విద్యార్థుల రిజిస్టర్లు, ఇతర రికార్డులు తనిఖీ చేశారు. కూలేందుకు సిద్ధంగా గదులను పరిశీలించారు. వంట గది నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవో అంజద్పాషాను ఆదేశించారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తర్వాతే అదనపు తరగతి గదిని హ్యాండోవర్ చేసుకోవాలని సూచించారు. నూతనంగా తీసుకువచ్చిన టీవీని ప్రారంభించారు. అనంతరం గోయగాం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఈవో ఆడే ప్రకాశ్, ఉపాధ్యాయులు శ్రావణ్కుమార్, రమేశ్, భరత్రావు, అరుణ్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. -
దీపావళి.. ఆనందకేళి
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: జిల్లావ్యాప్తంగా ప్ర జలు సోమవారం దీపావళి పండుగను ఆనందో త్సాహాల మధ్య జరుపుకొన్నారు. ప్రజలు, వ్యాపారులు ఇళ్లు, దుకాణాలను మామిడి తోరణాలు, పూ లు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సాయంత్రం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని సాయి బాబా మందిర్, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, కేస్లాపూర్ హనుమాన్ మందిర్ తదితర ఆలయాలను భక్తులు సందర్శించారు. శిర్డీ సాయి మందిరంలో అర్చకులు మధుకరశర్మ, సాయిశర్మ ఆధ్వర్యంలో ఉదయం ధనలక్ష్మీ, సరస్వతీ దేవి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ధనలక్ష్మీ, సరస్వతీ దేవి పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో వ్యాపారులు నిర్వహించిన లక్ష్మీ పూజలకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు హాజరయ్యారు. పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్లో పెద్దఎత్తున బంతిపూల అమ్మకాలు జరిగాయి. స్వీట్ హౌజ్లు, బట్టల దుకాణాలు, జువెల్లరీ షాపులు కొనుగోలుదారులతో కిటికిటలాడాయి. కాగజ్నగర్లో నరకాసుర దహనంనరక చతుర్దశిని పురస్కరించుకుని కాగజ్నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తాలో సోమవారం నరకాసుర దహనం ఘనంగా నిర్వహించారు. శ్రీరామచంద్ర జీయర్స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ నరకాసుర వధతో మనలోని దుష్టశక్తులను పారదోలాలన్నారు. నరకాసుర దహనంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్బాబు, శ్రీరామచంద్ర జీయర్స్వామిలక్ష్మీ పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మికాగజ్నగర్లో దీపాలతో చిన్నారి -
కొనుగోళ్లకు సమాయత్తం!
దహెగాం(సిర్పూర్): వానాకాలం సీజన్ సంబంధించిన వరిధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఈ నెలాఖరులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కేంద్రాల ప్రారంభానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వివిధ మండలాల్లో మరో పది, ఇరవై రోజుల్లో వరికోతలు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సహకార సంఘాల ఆధ్వర్యంలో 18, ఐకేపీ ఆధ్వర్యంలో 22 కేంద్రాలను ప్రారంభిస్తారు. మొదటి రకం ధాన్యానికి రూ.2,389, రెండో రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లించనున్నారు. గతేడాది మాదిరిగానే సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 నగదు బోనస్గా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తగ్గిన సేకరణ లక్ష్యంజిల్లాలోని రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్, వాంకిడి, దహెగాం, పెంచికల్పేట్, బెజ్జూర్, కౌటాల, కాగజ్నగర్, సిర్పూర్(టి), చింతలమానెపల్లి మండలాల్లో 56 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో ఈ ఏడాది నాట్లు ఆలస్యమయ్యాయి. అలాగే గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది. పొట్ట దశ లో ఉన్న పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు ఈ వానాకాలం సీజన్లో 44,532 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గతేడాది 57 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం పెట్టుకున్నా.. కేవలం 10,695 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. దీంతో ఈ ఏడాది లక్ష్యం తగ్గించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో కఠిన నిబంధనల నేపథ్యంలో రైతులు ఎక్కువగా ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. గతేడాది ప్రైవేట్ వ్యాపారులకు వరిధాన్యం అమ్ముకున్నారు. జమకాని బోనస్యాసంగి సీజన్లో సాగుచేసిన వరి సన్నరకం ధాన్యానికి సంబంధించి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు జమ కాలేదు. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. బోనస్కు 12,090 మంది రైతులు అర్హులు కాగా, వారికి రూ.2.80 కోట్ల నగదు పెండింగ్లో ఉంది. ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు విడుదల చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. -
అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలి
కాగజ్నగర్రూరల్: గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో ఈజ్గాం పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాగజ్నగర్ మండలం నజ్రుల్నగర్ విలేజ్ నం.12లో ఉజ్జల్ బక్షి, రవీందర్ బక్షి అనే ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతూ, గ్రామానికి చెందిన దీపక్ మండల్, సూరజ్, నితీశ్ మండల్పై దాడి చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, గ్రామంలో గంజాయి అమ్మకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు మమతా రానా, కార్యదర్శి కాజల్ బిస్వాస్, గీతాహల్దార్, సుచిత్ర, పార్వతి, భార్గవి, హల్దార్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె
ఆసిఫాబాద్రూరల్: సమస్యలు పరిష్కరించేవరకు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్ల సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం 40వ రోజుకు చేరింది. ఆయన మాట్లాడుతూ డైలీ వేజ్ కార్మికులకు ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనా లు అడిగితే కార్మికులను తొలగిస్తామని సర్క్యులర్ జారీ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో కార్మికులు సునీత, రమేశ్, కోటయ్య, రాంబాయి, శివరాం, ప్రేమ్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి
ఆసిఫాబాద్అర్బన్: పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్లో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహించారు. మొదట పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరుల కుటుంబ సభ్యులను పలకరించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. పోలీసులు కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ దేశవ్యాప్తంగా వీరమరణం పొందిన పోలీసుల పేర్లు చదివి వినిపించారు. అమరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ శంకర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఆర్ఐ ఎంటీవో అంజన్న, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘శ్రావణిది కుల దురహంకార హత్యే’
దహెగాం(సిర్పూర్): దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలాండి శ్రావణిది కుల దురహంకార హత్యేనని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సరోజన అన్నా రు. సోమవారం శ్రావణి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ కుమారుడు తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తండ్రి సత్తయ్య కక్ష పెంచుకుని, నిండు గర్భిణి శ్రావణిని హత్య చేశాడని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్ష ల పరిహారం, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేఏఎన్పీఎస్ రాష్ట్ర కోశాధికారి మోహనకృష్ణ, నా యకులు చక్రవర్తి, ఎస్.లక్ష్మయ్య, కృష్ణన్న, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
కార్తీక పూజలకు ముస్తాబు
కాగజ్నగర్టౌన్: కోరిన కోర్కెలు తీర్చే భక్తు ల కొంగుబంగారం కాగజ్నగర్ మండలంలో ని ఈజ్గాం శివమల్లన్న స్వామి దేవాలయం ప్రత్యేక పూజలకు ముస్తాబైంది. కార్తీక మా సం సందర్భంగా ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వరకు పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గర్రెపల్లి వేణుగోపాల్ గుప్తా తెలిపారు. లోక కల్యాణార్థం నెల రోజులపాటు ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాజప, రుద్రహో మం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు రూ.151 చెల్లించి పూజ ల్లో పాల్గొనవచ్చని, అలాగే నవంబర్ 16న జరిగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే దంపతులు రూ.501 చెల్లించాలని సూచించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనే వారు ప్రమిదలు తీసుకురావాలన్నా రు. భక్తులు సంప్రదాయ దుస్తులైన దోవతి, పంచె, కండువాలతో రావాలని కోరారు. -
స్వచ్ఛ పాఠశాలలే లక్ష్యంగా..
కెరమెరి(ఆసిఫాబాద్): రోజుకో వినూత్న కార్యక్రమాలతో రాష్ట్ర విద్యాశాఖ ముందుకు సాగుతోంది. విద్యార్థులకు చదువే కాదు.. పాఠశాలల పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శద్ధ తీసుకునేలా చర్యలు చేపడుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 17నుంచి స్వచ్ఛతాపక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని (స్థానిక సంస్థల) జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో కార్యక్రమం ప్రారంభమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 31వరకు కొనసాగే ఈ కార్యక్రమం రోజుకో తీరుగా కొనసాగనుంది. ఎంఈవోల పర్యవేక్షణలో.. స్వచ్ఛతాపక్వాడా కార్యక్రమాలు ఎంఈవోల పర్యవేక్షణలో కొనసాగుతాయి. పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ.. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకుంటూ.. ‘మన పాఠశాల.. మ న బాధ్యత’ అనే సందేశాన్ని ఇవ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యం. పరిశుభ్రత, పచ్చదనం, విద్యార్థుల చురుకుదనం ఆధారంగా చివరలో అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేసి ‘స్వచ్ఛ పాఠశాల పురస్కా రం’ అందించనున్నారు. ఇప్పటికే విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ, క్లీన్ ఇండియా, బ్యూటీఫుల్ ఇండియా అంటూ నినాదాలు చేయించారు. పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాలను ప్రధానోపాధ్యాయులు డాక్యుమెంటేషన్ చేసి జిల్లా కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలివే..18, 21న: పరిసరాల పరిశుభ్రతపై అవగాహన. 22న: హరిత దినోత్సవం నిర్వహించాలి. విద్యార్థులతో మొక్కలు నాటించాలి. 23న: పాఠశాలను సమాజానికి చేరువ చేయాలి. స్థానికులు, విద్యావేత్తలతో విద్యార్థులను మమేకం చేయాలి. స్వచ్ఛత ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేయాలి. 24న: హ్యాండ్ వాషింగ్ డేలో భాగంగా విద్యార్థులకు చేతులు శుభ్రం చేసే విధానాలను నేర్పించాలి. 25న: స్వచ్ఛతపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించాలి. 27న: వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించాలి. విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. 28న: పాఠశాల స్థాయిలో స్వచ్ఛతపై ఎగ్జిబిషన్ డే నిర్వహించాలి. 29, 30న: ఉపాధ్యాయులు విద్యార్థులతో స్వచ్ఛతపై ప్రణాళిక, కార్యాచరణ విధానాన్ని సిద్ధం చేయాలి. 31న: చివరిరోజు ప్రముఖులను ఆహ్వానించాలి. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేయాలి. -
‘గుస్సాడీ’కి దేశవ్యాప్త గుర్తింపు
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. కెరమెరి మండలం సాకడ(బి) గ్రామంలో మంగళవారం నిర్వహించిన దండారీ ఉత్సవాలకు హాజరయ్యారు. గుస్సాడీలకు పాదాభివందనం చేసి, మహిళలతో కలిసి దండారీ ఆడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏత్మాసూర్ దేవత ఆది వాసీలకు ఎంతో పవిత్రమైందన్నారు. ప్రతీ దండారీకి ప్రభుత్వం రూ.15వేలు ఇస్తామని ప్రకటించినా ఇప్పటికీ అందించలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతీ దండారీకి రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. నాయకులు మర్సకోల సరస్వతి, మోతీరాం, అంబాజీరావు, బీర్శావ్, తుకారాం, లింబారా వు, దంబిరావు, సీతారాం పాల్గొన్నారు. -
చెదరని నెత్తుటి జ్ఞాపకాలు
ఖానాపూర్: ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న 19 మంది పోలీసులు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈనెల 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సాక్షి కథనం. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే నక్సలైట్లు విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఖానాపూర్లో అమరుల స్తూపం ఖానాపూర్ పోలీస్ష్టేషన్లో పోలీసు అమవీరుల స్మారకార్థం స్తూపం లేదు. పోలీస్స్టేషన్ ఆవరణలో వేపచెట్టు కింద కొన్నేళ్లుగా శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచారు. 2008లో అప్పటి సీఐ, ఎస్సైలు స్మారక స్తూప నిర్మాణానికి కృషిచేశారు. ప్రస్తుత సీఐ అజయ్తోపాటు ఎస్సై రాహుల్ గైక్వాడ్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. సంఘటనల వివరాలివే.. -
జన్నారం అందాలు చూసొద్దాం..
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో అందాలు ఆస్వాదిస్తూ.. వన్యప్రాణులు, రకరకాల పక్షులు, జంగిల్ సఫారీ ప్రయాణం ద్వారా పర్యాటకులు వీక్షించేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడడంతో సఫారీ ప్రయాణానికి గ్రీన్సిగ్నల్ లభించింది. మూడు నెలల విరామం తర్వాత అక్టోబర్ 1 నుంచి జంగిల్ సఫారీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వచ్చి అడవులు చూసి మురిసిపోతున్నారు. పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం మధ్య గడుపుతున్నారు. వీకెండ్ రోజుల్లో గదులు ఫుల్గా ఉంటున్నాయని పర్యాటక అధికారులు పేర్కొంటున్నారు. 15 రోజుల్లో 600 పైగా మంది జంగిల్ సఫారీ మొదలైన 15 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 600 పైగా మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చారని అధికారులు తెలిపారు. నిజామాబాద్, హైదరాబాద్ నుంచి బస్సుల్లో వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నారు. రాత్రి హరిత రిసార్ట్లో బస చేసి ఉదయం జంగిల్ సఫారీ ద్వారా వన్యప్రాణుల పరుగులు, పచ్చని అడవులను అస్వాదిస్తున్నారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్క్యాంపు, అధ్యయన కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అడవుల్లో నిర్మించిన కుంటల్లో పక్షుల కిలకిలలు చూసి మురిసిపోతున్నారు. చెడిపోయిన దారులు.. గేట్ నంబర్ 1 నుంచి సుమారు 15 కి.మీ దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట ప్రాంతాల్లో చుక్కల దుప్పులు, నీలుగాయిలు, అడవి దున్నలు, రకరకాల పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో సఫారీ దారి చెడిపోయినట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు. అటవీశాఖ దృష్టిసారించి సఫారీ దారిని బాగు చేయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు సైతం కల్పించాలని కోరుతున్నారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
భీమారం: ఆర్థిక ఇబ్బందుల కారణంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆమె కథనం ప్రకారం..భీమారంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాలిపల్లి తారక్ (19) మంచిర్యాలలో కొన్ని నెలలుగా కారు మెకానిక్ పని నేర్చుకున్నాడు. శిక్షణ అనంతరం భీమారంలో సొంతంగా కారు మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించున్నాడు. ఈ విషయాన్ని తండ్రి రమేశ్కు చెప్పగా అంత డబ్బు లేదని తర్వాత ఏర్పాటు చేద్దామనడంతో తారక్ మనస్తాపం చెందాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో మరో గదిలోకి వెళ్లి తలుపు వేసి గడియ పెట్టుకున్నాడు. అనుమానంతో తండ్రి రమేశ్ తలుపు బాదిన ఎంతకు తీయకపోవడంతో కిటీకి నుంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. తలుపులు బద్దలుకొట్టి వెళ్లి తారక్ కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఘటన స్థలానికి ఎస్సై శ్వేత చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొడేటి రవి.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
వార్డెన్ ఆత్మహత్యాయత్నం
లక్సెట్టిపేట:మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్, నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన రాజగోపాల్ ఈనెల 18న సాయంత్రం తన ఇంటి వద్ద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17న ఇంటికి వెళ్లిన రాజగోపాల్... 18వ తేదీ సాయంత్రం బాత్రూంలోకి వెల్లి యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 252కి పెంచేలా రాజగోపాల్ కృషి చేశాడు. అయితే ఆమేరకు బిల్లులు రాకపోవడంతో రూ.7 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. అయినా బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. దీనిపై సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చాతరాజు దుర్గాప్రసాద్ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నిర్మల్కు వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఏఎస్డబ్ల్యూవో సురేశ్ను వివరణ కోరగా ఈనెల 17న తన తల్లి ఆరోగ్యం బాగాలేదని రాజగోపాల్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. -
క్వారీ గుంతలో పడి యువ రైతు మృతి
మంచిర్యాలక్రైం: క్వారీలో గుంతలో ప్రమాదవశాత్తు పడి యువరైతు మృతిచెందినట్లు ఎస్సై మజారోద్దిన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొడప గంగు–భారతి దంపతుల కుమారుడు యాదవరావు(25). తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఉన్న నాగారం శివారులోని పత్తి చేనులో నీరు పట్టేందుకు శనివారం సాయంత్రం యాదవరావు అక్కడికి వెళ్లాడు. కరెంట్ మోటారుకు మరమ్మతు చేపడుతున్నాడు. ఈక్రమంలో మోటారు పంప్ను నీటిలో బిగించేందుకు క్వారీలో దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
యూనివర్సిటీ ఫుట్బాల్ పోటీలకు సోమగూడెం యువకుడు
కాసిపేట:మండలంలోని సోమగూడెంకు చెందిన గురునాథం శంకర్ యూనివర్సిటీస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ బాదె శేఖర్ తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతన్న శంకర్ ఈనెల 18న హన్మకొండలో జరి గిన కాకతీయ యూనివర్సిటీ అంతర్ విశ్వవి ద్యాలయ పోటీల్లో ప్రతిభకనబర్చాడు. హైదరాబాద్లో జనవరిలో నిర్వహించే సౌత్జోన్ అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో శంకర్ కాకతీ య యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వ హించనున్నాడు. ఈసందర్భంగా కోచ్తోపాటు తోటి క్రీడాకారులు శంకర్ను అభినందించారు. -
వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పోలీస్ డివిజన్లో గతేడాది నుంచి వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ వహీదుద్దీన్ వివరాలు వెల్లడించారు. 2024 అక్టోబర్ 30న కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన బొల్లు ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పట్టణంతోపాటు సిర్పూర్, కౌటాల, చింతలమానెపల్లి, డబ్బా గ్రామంలో జరిగిన ఐదు దొంగతనాల్లో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా శ్యాంనగర్కు చెందిన గౌతం విశ్వాస్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి 17 తులాల బంగారంతోపాటు వెండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే గడ్చిరోలి జిల్లాకు చెందిన సమీర్ మండల్తో కలిసి గౌతం విశ్వాస్ రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సమీర్ మండల్ వేరే కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడని, అతడిని కస్టడీలో తీసుకుని విచారించనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి, ఎస్సైలు సుధాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు సరికాదు
కాగజ్నగర్టౌన్: సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందని జిల్లాలోని వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా రాసే పత్రికలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ్రెడ్డి, ఇతర జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదని హితవు పలికారు.బెదిరింపులు మానుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులను బెదిరించే ధోరణి మానుకోవాలి. సమాజంలో జరిగే వాస్తవాలు బయటపెడుతున్న పత్రికలపై కక్ష సాధించడం తగదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదు. ఇకనైనా ప్రభుత్వం దాడులను ఆపాలి. – వైద్య శాంతికుమారి, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు తీవ్రంగా ఖండిస్తున్నాం నిజాలను నిర్భయంగా నిగుతేల్చే వార్తలు రాసే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. తప్పులను ఎత్తిచూపే హక్కు పత్రికలకు ఉంది. సాక్షి జర్నలిస్టులపై పోలీసులతో దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – సోయం చిన్నన్న, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేసులు ఎత్తివేయాలి ప్రజల వాణిని వినిపించే మీడి యా గొంతు నొక్క డం సరికాదు. దీనికి తగిన మూ ల్యం చెల్లించుకో వాల్సి వస్తుంది. నోటీసుల పేరుతో పోలీ సులు సాక్షి కార్యాలయం వద్ద హంగామా చేయడం అప్రజాస్వామికం. ఎడిటర్తో పాటు జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలి. – ఎన్నం నాగార్జున, ఓయూ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి -
వెలుగుల పండుగ
ఆసిఫాబాద్అర్బన్: జ్ఞానానికి.. శుభానికి ప్రతీక దీపం. అందుకే ప్రతీ శుభకార్యాన్ని జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభిస్తాం. అజ్ఞానమనే చీకటిని తరిమి జీవితాలను జ్ఞానకాంతితో నింపే మహోత్సవమే దీ పావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా ఈ వెలుగుల పండుగ జరుపుకోన్నారు. ధనలక్ష్మీ పూజలు, బొమ్మల కొలువులు, బంగారం కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఇళ్లతోపాటు వ్యాపార సముదాయాల్లో లక్ష్మీదేవి పూజలు, కేదారీశ్వర నోములు నిర్వహించనున్నారు. ఇంటి ఎదుట మామిడి తోరణాలు, పూలదండలు, రంగురంగుల విద్యుత్ లైట్లు, దీపపు ప్రమిదలతో అలంకరించనున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లు ఆదివారం సందడిగా మారాయి. గృహాల అలంకరణకు అవసరమైన సామగ్రిని కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపారు. ధనలక్ష్మీ పూజలు, నోములు, వ్రతాలు, టపాసుల కొనుగోలు చేశారు. పండుగ నేపథ్యం...ద్వాపర యుగంలో ప్రాజ్యోతిష్టపురాన్ని రాజధాని గా చేసుకొని పరిపాలించిన నరకాసురుడు దేవ, మానవ జాతిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవా డు. ధర్మానికి భంగం కలిగించే అతని చర్యలను సహించలేని భూమాత, దేవతలు, ప్రజలు శ్రీకృష్ణుడికి విన్నవించుకుంటారు. అప్పుడు కృష్ణుడు సత్యభామతో కలిసి ఆశ్వయుజ చతుర్దశి రోజు నరకాసురుడిని అంతం చేస్తాడు. ఇదే ’నరక చతుర్దశి’గా మారింది. నరకాసుర వధ అనంతరం నగరానికి తిరిగి వచ్చిన సత్యభామ, కృష్ణుడికి అమావాస్య నాడు ప్రజలు దీపాలు వెలిగించి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీపాల వెలుగులు.. బాణాసంచా మోతలుదీపావళి సందర్భంగా వివిధ ఆకృతుల్లో ఉన్న ప్ర మిదలతో వరుసగా నాలుగు రోజులపాటు దీపాలు వెలిగిస్తారు. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఇష్టం కావడంతో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ఆహ్వా నిస్తే ధనలక్ష్మీ కృప ఉంటుందని నమ్ముతారు. అనంతరం వివిధ రకాల బాణాసంచాను కాల్చి చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందంగా గడుపుతారు. ఆనందోత్సహాల పండుగ ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజును నరక చతుర్దశిగా పిలుస్తారు. దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికి ఉంది. సీ్త్రలతో అమర్యాదగా ప్రవర్తించే వారికి శిక్ష తప్పదనే సందేశం ఈ పండుగ ఇస్తుంది. యుద్ధంలో నరకాసురిడిని సంహరించడంతో రాక్షస పీడ వదిలిందని ప్రజలు ఆనందోత్సహాలతో దీపావళి జరుపుకొంటారు. – ఒజ్జల శిరీశ్శర్మ, పురోహితులు -
దరఖాస్తు గడువు పొడిగింపు
ఆసిఫాబాద్: బీసీ బంద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో లక్కీడ్రా నిర్వహించనున్నారు. గత నెల 26న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య ప్రారంభమైంది. మొదట మందకొడిగా దరఖా స్తులు రాగా నాలుగు రోజులుగా ఊపందుకున్నా యి. శనివారం జిల్లాలోని వ్యాపారులు అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 15న 47 దరఖాస్తులు, 16న 46, 17న 165, 18న 242 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల సంఖ్య 622కు చేరింది. ప్రభుత్వానికి రూ.18.66 కోట్ల ఆ దాయం సమకూరింది. అత్యధికంగా గూడెం షాపునకు 63 దరఖాస్తులు రాగా, వాంకిడి 007 దుకా ణానికి 45, వాంకిడి 008 దుకాణానికి 43, గోయగాం(తిర్యాణి) 46, గోయగాం(కెరమెరి) 46, దహెగాం షాపునకు 44 దరఖాస్తులు వచ్చాయి. రెబ్బెన, గోలేటి, జైనూర్(030, 031), సిర్పూర్(యూ), కాగజ్నగర్(014, 015, 016, 018), కౌటాల(023) షాపులకు మాత్రం పదిలోపే దరఖాస్తులు వచ్చాయి. కాగా, జిల్లాలోని మద్యం దుకాణాలకు 2019లో 763 దరఖాస్తులు రాగా, 2021లో 643, 2023లో 1020 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా 90 శాతం వరకు ఆదాయం వచ్చింది. లక్కీడ్రాకు ఏర్పాట్లుమద్యం దుకాణాల దరఖాస్తు గడువు ఈ నెల 23వరకు పెంచిన నేపథ్యంలో ఈ నెల 27న ఉదయం 10.30 గంటలకు లక్కీడ్రా నిర్వహించేందుకు ఏర్పా టు చేస్తున్నామని జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్ తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటల కు కలెక్టరేట్కు చేరుకోవాలి. దరఖాస్తుతోపాటు ఎక్సై జ్ శాఖ అధికారులు ఇచ్చిన రశీదును తీసుకురావా లని అధికారులు సూచించారు. దరఖాస్తుదారు రాలేని పక్షంలో ఆథరైజేషన్ లెటర్ ఉన్న వ్యక్తులను అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన ఎంట్రీ పాసులను అందజేస్తారు. లక్కీడ్రా నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీరు, జనరేటర్, మైక్ సెట్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎకై ్సజ్ శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం సీరియల్ నంబర్ 1 నుంచి లక్కీడ్రా తీయనున్నారు. మధ్యాహ్నం వరకు దుకాణాల కేటాయింపు పూర్తి కానుంది. -
హాస్టల్ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలి
పాతమంచిర్యాల: గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి పీఏ రాకేశ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టేకం ప్రభాకర్ మాట్లాడుతూ జీవో 69 రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు వెలిశాల కృష్ణమూర్తి, యూనియన్ జిల్లా కార్యదర్శి శ్యాంరావు, కోశాధికారి రాంబాయి, ఉపాధ్యక్షురాలు హీరాబాయి, నాయకులు తార, జంగుదేవి, బాపురావు, అరిగెల కోటయ్య, శ్యామల, పద్మ, సముద్రబాయి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ గ్రామ సభలకు శ్రీకారం
ఆసిఫాబాద్అర్బన్: ఉపాధిహామీ పథకం కింద 2026– 27 సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు డీఆర్డీవో అధికారులు కార్యాచరణ సిద్ధం చేశా రు. ఈ నెల 11 నుంచి గ్రామసభలు నిర్వహిస్తూ స్థానికుల అంగీకారంతో పనులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ నవంబర్ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత అధికారులు జిల్లాలో కూలీలకు అవసరమైన మేరకు పనులు కల్పించేందుకు లక్ష్యం నిర్దేశించనున్నారు. అక్టోబర్ 2 నుంచే గ్రామ సభలు ప్రారంభించాల్సి ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది. ఇప్పటి నుంచే పనులు గుర్తింపు2025– 26 ఆర్థిక సంవత్సరం వచ్చే ఏడాది మా ర్చితో ముగియనుంది. 2026– 27లో చేపట్టే పనులను ఇప్పటి నుంచే గుర్తిస్తున్నారు. జిల్లాలో యాక్టీవ్ జాబ్కార్డులు 62వేలు ఉండగా, 1,06,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో పని దినాల లక్ష్యం 20.86 లక్షలు కాగా, ఇప్పటివరకు 21.78 లక్షల పనిదినాలు పూర్తిచేశారు. కూలీలకు రూ.52.59 కోట్లు చెల్లించారు. 2026– 27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులను గుర్తించేందుకు జిల్లాలోని 335 పంచాయతీల్లో నవంబర్లోపు గ్రామసభలు పూర్తి చేయనున్నారు. మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించి జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అనంతరం రాష్ట్రస్థాయిలో ఆమోదానికి పంపిస్తారు. కూలీలకు వందరోజుల పని..ఉపాధిహామీ కూలీలకు ఆర్థిక సంవత్సరంలో వందరోజుల పనిదినాలు కల్పించాలనే ప్రభుత్వ ఉద్దేశం. కూలీలు అడిగిన 14 రోజుల్లోగా పని కల్పించాలి. ఎన్ఐసీ సాఫ్ట్వేర్ వివరాలు నమోదైతే పని కల్పించాల్సిందే. లేకుండా నిరుద్యోగ భృతి చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రణాళిక ప్రకారం గ్రామాలకు అవసరమైన పనులు గుర్తిస్తున్నారు. ప్రజల అంగీకారం కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పనులకు అయ్యే ఖర్చుల వివరాలతో నివేదికలు రూపొందించి తీర్మానాలు చేస్తున్నారు. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పనుల కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదిక రూపొందిస్తాం. వచ్చే ఏడాది నీటి సంరక్షణ పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే వ్యవసాయ అనుబంధ మొక్కలు పెంపకం, వ్యక్తిగత అభివృద్ధి పనులు, పశువుల షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, కోళ్లఫాం, ఫిష్పాండ్ల నిర్మాణానికి అవకాశం కలిస్తాం. – దత్తారావు, డీఆర్డీవో -
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలి
దహెగాం(సిర్పూర్): దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలాండి శ్రావణిని నిండు గర్భిణి అని చూడకుండా హత్య చేసిన శివార్ల సత్తయ్యను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టి త్వరగా శిక్షించాలని గోండ్వాన కోయ ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నన్న డిమాండ్ చేశారు. గెర్రె గ్రామంలో శ్రావణి మృతదేహానికి ఆదివారం నివాళులర్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షించా లని అక్కడే ఉన్న కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్కి వినతిపత్రం అందించారు. చిన్నన్న మాట్లాడుతూ ఇది ముమ్మూటికి కులోన్మాద హత్య అని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశా రు. కుల వివక్షను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, ఆదివాసీ సంఘాల నాయకులు ఓం ప్రకాశ్, కోట సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తు గడువు పొడిగింపు
కాగజ్నగర్ టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికిగానూ 9, 11 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కొరిపెల్లి రేణుకాదేవి శుక్రవారం తమ బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు స్థానిక శాస్త్రినగర్ కాలనీకి వెళ్లింది. చీకటి పడడంతో రాత్రి అక్కడే ఉండిపోయింది. గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 26 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అడవిలో అరుదైన ‘హైగ్రోసైబ్ పెల్లిసిడా’ జన్నారం: హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నార్త్ తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ ఎనగందుల వెంకటేశ్ శనివారం కవ్వాల్ టైగర్జోన్లో శిలీంద్ర జాతికి చెందిన అరుదైన హైగ్రోసైబ్ పెల్లిసిడాను కనుగొన్నారు. 2024లో కేరళ రాష్ట్రంలోని హైగ్రోఫోరేసి కుటుంబంలో ఒక కొత్త జాతిగా మొదటిసారి కనుగొన్నారు. చిన్న, సున్నితమైన అగారిక్ ఫంగస్ అని తెలిపారు. ఇవి సాధారణంగా గడ్డి మైదానాలు, చిత్తడి ప్రాంతాల్లో కనిపిస్తాయని, దీనిని వాక్స్కప్ అని పిలుస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్జోన్లో మొదటిసారి నిర్ధారించినట్లు ఆయన పేర్కొన్నారు. -
కన్నతండ్రినే కడతేర్చాడు..
జన్నారం: మద్యానికి బాని సైన కుమారుడు తన కన్నతండ్రినే కర్రతో కొట్టిచంపిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామ పంచాయతీలోని సేవదాస్నగర్కు చెందిన జాదవ్ శంకర్నాయక్ (60)కు ముగ్గురు కూతుర్లు, కుమారుడు సంతానం. నలుగురికి పెళ్లిళ్లు చేశాడు. శంకర్నాయక్ భార్య రేణుకాబాయి రెండేళ్ల క్యాన్సర్తో మృతి చెందింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కుమారుడు నూర్సింగ్ నాయక్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుండడంతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రితో కలిసి ఉంటున్నాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. పలుమార్లు గొడ్డలితో చంపుతానని వెంటపడగా శంకర్నాయక్ తప్పించుకున్నాడు. ఈనెల 17న కూడా గొడ్డలితో చంపుతానని వెంటపడగా స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి నూర్సింగ్ను బెదిరించి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చి రొట్టెలు చేస్తున్న తండ్రిని కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. కాలనీవాసులు నిలదీయడంతో పరారయ్యాడు. స్థానికు ల సమాచారం మేరకు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి చే రుకుని వివరాలు సేకరించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలించారు. మృతుని చిన్న కూతురు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
జాతీయస్థాయిలో గుర్తింపు హర్షణీయం
ఉట్నూర్రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి, ధర్త్తి ఆబా జన భాగీదారి పథకాలను ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో సమర్ధవంతంగా అమలు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం హర్షణీయమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 17న నిర్వహించిన జాతీయ సదస్సులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్తో పాటు జిల్లా మాస్టర్ ట్రైనర్లు అర్క వసంత్, బ్లాక్ మాస్టర్ ట్రైనర్లు రాజేశ్బాబు, నందకిషోర్ పాల్గొన్నట్లు తెలిపారు. పథకాల అమలులో వారు చేసిన కృషికి పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. -
బాసరలో శృంగేరీ పీఠాధిపతి పూజలు
బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శనివారం ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. విజయయాత్రలో భాగంగా దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈవో అంజనాదేవి ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు శ్రీసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మీ అమ్మవార్ల గర్భాలయాలలో వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేక, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణపై దిశానిర్దేశం పూజల అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతీ హిందువు కర్తవ్యమని, ధార్మిక విలువలతో జీవించడం సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం..బాసరలో నూతనంగా నిర్మించిన లలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించారు. వేలేటి రాజేందర్ శర్మ ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం వంటి కార్యక్రమాలు జరిగాయి. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అంజనాదేవి, బాసర గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులను ఆశీర్వదిస్తూ ప్రసాదాలు అందజేస్తున్న శృంగేరీ పీఠాధిపతి మహాకాళి అమ్మవారి ఆలయంలో హారతి ఇస్తున్న విధుశేఖర భారతీస్వామి -
ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరి అరెస్టు
భీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో ఈనెల 15న చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల పుటేజీ ఽఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సిరికొండ లక్ష్మణ్, మహా రాష్ట్రలోని రాజూరా తాలూకా చున్నాల గ్రామానికి చెందిన కాకట్ల కేశవరెడ్డిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో 900 గ్రాముల వెండి, 10 గ్రాముల బంగారం, రూ.3,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈఇద్దరు నిందితులపై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ఒక్క రోజులో కేసును ఛేదించిన భీమారం ఎస్సై శ్వేత, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, సిబ్బంది మల్లయ్య, కిరణ్ను సీఐ అభినందించారు. -
ఆవులు తరలిస్తున్న లారీ పట్టివేత
సాత్నాల: భోరజ్ మండలంలోని చెక్పోస్ట్ వద్ద ఆవులు తరలిస్తున్న కంటైనర్ లారీని పట్టుకున్నట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. శనివారం నాగ్పూర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కంటైనర్ను తనిఖీ చేయడంతో 25 ఆవులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఎస్సైకి సమాచారం సమాచారం అందించడంతో ఆవులను ఇచ్చోడలోని గోశాలకు తరలించారు. డ్రైవర్ గురురవాల్సింగ్పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోహన్గౌడ్, పైమా సుల్తానా, జాదవ్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు. -
సౌత్జోన్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించిన అంతర్జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాలలోని మిమ్స్లో బీకాం తృతీయ సంవత్స రం చదువుతున్న విద్యార్థిని అశ్విత పాల్గొని ప్రతిభ కనబర్చింది. నవంబర్ 21 నుంచి 23 వరకు బెంగళూర్లో జరిగే సౌత్జోన్ టోర్నమెంట్లో యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్గా వ్య వహరించనుంది. శనివారం కళా శాలలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, శ్రీధర్రావు అభినందించారు. -
అధికారి చెప్పినా ఆగని దందా
దీపావళికి స్వీట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని ఆసరా చేసుకున్న కొందరు స్వీట్ల తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో అనుమతి లేకుండా స్వీట్లు తయారు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష ఈ నెల 14న తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తుండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత వదిలేయడంతో నిర్వాహకులు మళ్లీ స్వీట్ దందా మొదలుపెట్టారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
స్వర్ణ వాగులో పడి ఒకరు మృతి
సారంగపూర్: ప్రమాదవశాత్తు స్వర్ణ వాగులోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ప్యారమూర్ గ్రామానికి చెందిన పగడపు భోజన్న (59) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. బోరిగాంలో ఉంటున్న అతని అక్క పోశవ్వ మూడు రోజుల క్రితం తన ఇంటికి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన భోజన్న తిరిగిరాలేదు. శనివారం స్వర్ణ వాగులో మృతదేహం కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహా న్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కాలయాపన
కరెంటు సమస్యలపై మంచిర్యాలఅగ్రికల్చర్: సాంకేతిక లోపమో.. మరేదైనా కారణమో తెలియదు గానీ కొందరి ఇళ్లలో కరెంటు మీటరు గిర్రున తిరుగుతోంది. రూ.వేలల్లో వస్తున్న బిల్లులతో వినియోగదారులు తల పట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు కరెంటు సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే నెలలు గడిచినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, హై ఓల్టేజ్, ప్రమాదకరంగా ఉన్నత స్తంభాలు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై ప్రతీ సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో విద్యుత్ బిల్లులతోపాటు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలతో పశువులు, మూగజీవాలు, మనుషులకు ప్రమాదం పొంచి ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దండేపల్లి మండలం విద్యుత్ స్తంభానికి షాక్ వస్తుందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అదే స్తంభానికి తగిలి పశువు, లేగదూడ చనిపోవడంతో తేరుకుని సవరించారు. వినియోగదారులు నేరుగా, ఆన్లైన్, మొబైల్ ద్వారా ఏ ఫిర్యాదు అందించినా వెంటనే పరిష్కరించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచిస్తున్నారు. అయినా కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెండు నెలలు గడిచింది.. ఆర్ఆర్నగర్లోని తన ఇంటికి గత కొన్ని నెలల నుంచి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు వస్తోందని విద్యుత్ అధికారులకు, ఆగస్టు 4న ప్రజావాణిలో ఎస్ఈకి ఫిర్యాదు చేశాను. రూ.150 చెల్లిస్తే సిబ్బంది మీటర్ను పరిశీలిస్తారని చెప్పారు. ఎన్పీడీసీఎల్ డీఈ ఆపరేషన్ పేరిట నగదు చెల్లించి రెండు నెలలైంది. వందల్లో రావాల్సిన బిల్లు వేలల్లో వస్తోంది. ఈ నెల రూ.3,882 బిల్లు చెల్లించాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. – జోగుల విజయ, మంచిర్యాల -
పేకాడుతున్న ఏడుగురు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఎరోడ్రమ్ సమీపంలో గల ఆమన్ స్విమ్మింగ్పూల్ గెస్ట్హౌస్లో శనివారం పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.23,400 నగదు, 8 సెల్ఫోన్లు, ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదుపుతప్పి కారు బోల్తా నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. స్థానికులు, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వరంగల్కు చెందిన ఐదుగురు స్నేహితులు కారులో షిరిడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వరంగల్ వెళ్లే క్రమంలో స్థానిక కంచరోని చెరువు కట్ట రహదారిపై అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ అదుపుతప్పి వైద్యుడు మృతి తరిగొప్పుల: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్ (31) మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్ కొన్నాడు. శుక్రవారం అదే బైక్పై తిరిగి మంచిర్యాలకు వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్రోడ్ సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. దీంతో అతడి తల, ఛాతి భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు. గుర్తు తెలియని వృద్ధుడు.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో నాలు గు రోజుల క్రితం అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని గమనించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తెలిసిన వారు 8712656541, 8712658667 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. మద్యానికి బానిసై ఆత్మహత్య జైనథ్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లక్ష్యంపూర్ గ్రామానికి చెందిన కార్ల శంకర్ (35) భార్య లక్ష్మి నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తండ్రి విట్టల్ తలుపు తీసి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారులు అనాధలయ్యారు. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి శనివారం జూమ్ మీటింగ్ ద్వారా జి ల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవో లు, ఉపాధిహామీ ప్రోగ్రాం అధికారులు, ఐకేపీ ఏపీఎంలు, గృహనిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఆస్తిపన్ను వసూలు, పారిశుధ్య నిర్వహణ, వారసంత వేలం డబ్బు ల వసూలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పంచాయతీ కార్యదర్శుల హాజరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,745 ఇళ్ల పనులు ఈ నెల 23వరకు ప్రారంభించాలని తెలిపారు. పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని పేర్కొన్నారు. మండల సమాఖ్య నుంచి లబ్ధిదారులకు కొంత రుణం అందించాలని, గ్రామపంచాయతీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను వసూలు చేయాలని, పంచాయతీల్లో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని సూచించారు. మరుగుదొడ్లు లేని గృహాలను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యదర్శుల హాజరుపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపా రు. అధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డివిజనల్ పంచాయతీ అధికా రి ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బంద్ సక్సెస్
ఆసిఫాబాద్అర్బన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతమైంది. బీసీ జేఏ సీ నాయకులు ముందురోజే బంద్కు సహకరించా లని కోరడంతో జిల్లా కేంద్రంలో వ్యాపారులు స్వ చ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. శనివారం ఉద యం నుంచే బీసీ జేఏసీ నాయకులు బంద్ను పర్యవేక్షించారు. ఎక్కడైనా దుకాణాలు తెరిచి ఉంటే మూసివేయించారు. పలుచోట్ల దుకాణాలు తెరిచిన వ్యాపారులు, బీసీ నాయకుల మధ్య వాగ్వాదం చో టు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ప్రతీ శనివారం నిర్వహించే వారసంతపై బంద్ ప్రభావం పడింది. పెట్రోల్ బంక్లు యథావిధిగా తెరిచి ఉన్నాయి. మ ధ్యాహ్నం 12గంటల తర్వాత వ్యాపార సముదా యాలూ తెరుచుకున్నాయి. బీసీ జేఏసీ నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీ సీలకు 42శాతం రిజర్వేషన్ అమలయ్యేదాకా ఉద్య మం కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికై నా రా జకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని మార్చుకుని బీసీల కు 42శాతం రిజర్వేషన్ అమలయ్యేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. బంద్లో వివిధ రాజకీ య పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, ఎ మ్మార్పీఎస్ జాతీయ నాయకుడు కేశవ్రావ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్ర ణయ్, బీజేపీ నాయకుడు ఖాండ్రె విశాల్, బీఆర్ఎ స్ నాయకులు బుర్స పోచయ్య, జీవన్, పార్టీలు, సంఘాల నాయకులు నారాయణ, ఆంజనేయులు, జక్కయ్య, శ్రీకాంత్, ఉమేందర్, లింగయ్య, మంగ, యాదగిరి, బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగజ్నగర్ పట్టణంలో..కాగజ్నగర్ టౌన్: కాగజ్నగర్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘం నాయకులు పట్టణంలోని రాజీవ్గాంధీ చౌరస్తా నుంచి పలు వీ ధుల గుండా ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షు డు తుమ్మ రమేశ్ మాట్లాడుతూ.. బీసీల బంద్ పి లుపునకు రాష్ట్రంలోని బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు, ఎమ్మార్పీఎస్, సీనియర్ సిటిజన్స్ సంఘాలు సంపూర్ణ మద్ధతు తెలిపాయని పేర్కొన్నారు. వెంటనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ క ల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు జరుగుతు న్న అన్యాయాన్ని ఎండగడుతూ చావోరేవో తేల్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రిజ ర్వేషన్లు సాధించేవరకూ బీసీలు ఐక్యంగా ఉండాల ని పిలుపునిచ్చారు. నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, దస్తగీర్, గోలెం వెంకటేశం, సత్యనారాయణ, తిరుపతి, వీరభద్రాచారి, నాగేశ్వర్రావు, రమణయ్య, షబ్బీర్ హుస్సేన్, గడదాసు మల్లయ్య, మాచర్ల శ్రీనివాస్, మేరాజ్ తదితరులు పాల్గొన్నారు.ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేస్తున్న బీసీ జేఏసీ నాయకులు -
ప్రయత్నం ఫలిస్తోంది
జిల్లావాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ అవశ్యకతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పార్లమెంట్లో రెండుసార్లు ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను స్వయంగా కలిసి విన్నవించాను. వారు స్పందించి అవసరమైన మాస్టర్ప్లాన్ సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవడంతో నా ప్రయత్నం ఫలించినట్లవుతుంది. త్వరలో నే పనులు వేగవంతమయ్యే అవకాశముంది. – గొడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ ‘సాక్షి’ చొరవ అభినందనీయం ‘సాక్షి’ దినపత్రిక మార్చి 5న అన్ని వర్గాలతో చర్చా వేదిక ఏర్పాటు చేసింది. ఆయా వర్గాలవారు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎయిర్పోర్ట్ సాధనకు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. అదే వేదికపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. దీంతో ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. వారు అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించడంతో లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. – సోగాల సుదర్శన్, ఎయిర్పోర్టు సాధన అడహక్ కమిటీ సభ్యుడు -
బాణాసంచా వ్యాపారులు నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్: బాణాసంచా దుకాణదారులు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని డివిజనల్ ఫైర్ అధికారి కార్తిక్ సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని జిల్లాలో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని జాగ్రత్తలు, సూచనలు చేశారు. సాక్షి: ఆసిఫాబాద్ డివిజన్లో ఎన్నిక దుకాణాలకు అనుమతులిచ్చారు? ఫైర్ అధికారి: 30 దుకాణాలకు 14రోజుల పాటు తాత్కాలిక అనుమతులిచ్చాం. సాక్షి: ఏయే ప్రాంతాల్లో అనుమతులిచ్చారు? ఫైర్ అధికారి: ఆసిఫాబాద్, జైనూర్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, గోలేటి ప్రాంతాల్లో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులిచ్చాం. సాక్షి: దీపావళి రోజు అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగితే వెళ్లేందుకు సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారా? ఫైర్ అధికారి: రెండు టీంలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి ఫైర్ స్టేషన్లో, మరొకటి గ్రౌండ్ సెక్షన్లో ఉంటుంది. 10 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సాక్షి: వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఫైర్ అధికారి: వ్యాపారులు భద్రతాప్రమాణాలు పాటించాలి. జనావాసాలకు దూరంగా బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక షాపునకు మరో షాపునకు మధ్య దూరం కనీసం మూడు మీటర్లు ఉండాలి. దుకాణంలో అగ్నిమాపక పరికరాలు, రెండు నీటి డ్రమ్ములు, పొడి ఇసుక తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. నాణ్యమైన విద్యుత్ తీగలు వాడాలి. నూనె దీపాలు, గ్యాస్ లాంటివి దుకాణాల్లో వినియోగించకూడదు. సాక్షి: పండుగ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఫైర్ అధికారి: బాణాసంచా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి. పిల్లలు పటాకులు కాల్చే సమయంలో పెద్దలు పక్కనుండాలి. పటాకులు పేలకుండా ఆగిపోతే వెంటనే వాటిని తాకకూడదు. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ను తప్పని సరిగా అందుబాటులో ఉంచుకోవాలి. -
ప్రజల గొంతుక అయిన ‘సాక్షి’
జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ అవశ్యకత.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ‘సాక్షి’ గుర్తించింది. దశాబ్దాల కల సాకారం చేయాలని సంకల్పిస్తూ వారి తరఫున గొంతెత్తింది. తొలుత చర్చా వేదికకు శ్రీకారం చుట్టింది. ‘రెక్కలపై ఆశలు’ అంటూ ఆయా వర్గాల అభిప్రాయాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా ‘మామా.. ఎయిర్పోర్ట్ వస్తే మనకేమొస్తది’ అంటూ స్థానిక యాసలో వివరించిన కథనం అందరినీ ఆలోచింపజేసింది. తద్వారా ఈ ప్రాంత పాలకులపై ఒత్తిడి పెరిగింది. వారు చట్టసభల్లో గళమెత్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించగా, పార్లమెంట్లో ఎంపీ నగేశ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం అసెంబ్లీ సాక్షిగా స్పందిస్తూ ‘ఆదిలా బాద్కు ఎయిర్పోర్ట్ తెస్తా.. అది నా బాధ్యత’ అంటూ జిల్లా వాసులకు భరోసా కల్పించారు. ఆ వెంటనే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ ఽశాఖలో భాగమైన భారత వాయుసేన(ఐఏఎఫ్) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిని ప్రస్తావిస్తూ ‘ రెక్కలొస్తున్నాయి..’ అంటూ ‘సాక్షి’ జిల్లావాసులకు తీపికబురు అందించింది. తాజాగా ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరింది. ఎయిర్పోర్టుతో పాటు ఎయిర్ఫోర్సు స్టేషన్ నిర్మాణానికి ఏఏఐ మాస్టర్ప్లాన్ సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఆ వెంటనే పనులు ప్రారంభం కానుండడంపై జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా ‘సాక్షి’ చొరవను సర్వత్రా కొనియాడుతున్నారు. -
కుమురం భీం
9రోడ్డుపైనే మురుగునీరు సిర్పూర్ పట్టణంలోని అంగడిబజార్లో మురికి కాలువలు నిర్మించలేదు. దీంతో ఇళ్లలోని మురుగునీరంతా రోడ్లపై నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 11లోu సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. కరెంట్ సమస్యలపై కాలయాపన సాంకేతిక లోపమో, మరే కారణమో గాని కొందరి ఇళ్లల్లో కరెంట్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేస్తే నెలలైనా పరిష్కారం కావడంలేదు. 10లోu ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
న్యాయ సేవా కేంద్రం ప్రారంభం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో న్యాయ సేవా కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వయోవృద్ధుల సంక్షేమం కోసం న్యాయ సేవా కేంద్రాన్ని ఏర్పా టు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం ప్యానెల్ న్యాయవాదిగా కుడ్క కిశోర్, పారా లీగల్ వ లంటీర్గా చునర్కర్ లింగయ్యను నియమించినట్లు తెలిపారు. ప్రతీ శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వర కు ఈ కేంద్రం ద్వారా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టాలి’
ఆసిఫాబాద్రూరల్: పాఠశాలలో విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సా రించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జైనూర్, సిర్పూర్, లింగాపూర్, తిర్యాణి, కెరమెరి ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు ప్రతీ పాఠశాలను సందర్శించి హాజరు శాతంపై ఉపాధ్యాయులతో చర్చించాలన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు రోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. పదో తరగతి వి ద్యార్థులపై దృష్టి సారించి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, ఎస్వో అబిద్ అలీ, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
అర్ధాకలి చదువులు!
ఇంటర్ విద్యార్థులు.. కెరమెరి(ఆసిఫాబాద్): విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. విద్యార్థులు ప్రతీరోజు కళాశాలకు వచ్చేలా ఇటీవల ఎఫ్ఆర్ఎస్ కూడా అమలు చేసింది. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుల కోసం మండల కేంద్రాలకు వస్తున్న ఇంటర్ విద్యార్థులు ఖాళీకడుపులతో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు రోజంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. జూనియర్ కళాశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి. కళాశాలకు వచ్చే కొందరు విద్యార్థులు అప్పుడప్పుడు లంచ్ బాక్సు తీసుకొస్తుండగా, మరికొందరు ఉదయం ఇళ్ల వద్దే భోజనం చేసి వస్తున్నారు. బాక్సు తెచ్చుకోని విద్యార్థులు కళాశాల ముగిసే వరకు ఆకలితో ఉంటున్నారు. దీంతో అధ్యాపకులు చెప్పే పాఠాలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 4,625 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా తగ్గుతున్న విద్యార్థులు..ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎండీఎం అమలు చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజనం అమలుకు ఎంత ఖర్చవుతుందనే వివరాలు సైతం సేకరించారు. కానీ పథకం అమలు మాత్రం జరగలేదు. ఏ ప్రభుత్వం కూడా విద్యార్థుల వినతులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఎండీఎం అమలు కాక ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. చిరుతిండ్లతో సరి..ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా వరకు పేద విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం విరామంలో స్నాక్స్, పండ్లు, టీ, కాఫీలతో తమ ఆకలిని కొంత వరకు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. గతంలో మూడు నెలలు..2020 –21 విద్యాసంవత్సరంలో అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జనవరి నుంచి మార్చి వరకు కలెక్టర్ నిధులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అలాగే 2022 –23లో అప్పటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డీఎంఎఫ్టీ నిధులతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి నుంచి మార్చి వరకు వార్షిక పరీక్షల నేపథ్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందించారు. సిర్పూర్(టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాగజ్నగర్ డివిజన్లోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరూ కూడా కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పంపిణీ చేయలేదు. ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు: 617ఒకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థులు : 491జిల్లాలోని జూనియర్ కళాశాలల వివరాలు.. -
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ అన్నారు. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల వినియోగం, పేదరిక ని ర్మూలన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే సందర్భంలో ఏవైనా సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడంతో పాటు టోల్ ఫ్రీ నం. 15100ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్, ఏడీఏ మిలింద్కుమార్, రైతులు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘నేటి బీసీ బంద్ జయప్రదం చేయండి’
ఆసిఫాబాద్అర్బన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్లో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, వివి ధ సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ రూప్నార్ రమేశ్ కోరారు. శుక్రవారం పట్టణంలోని వ్యాపారులు, కుల సంఘాల నాయకులు, ఆర్టీసీ అధి కారులను కలిసి బంద్కు సహకరించాలని విన్నవించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించ ని వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బీసీ సంఘాల జేఏ సీ నేటి బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నా రు. బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, జేఏసీ నాయకులు యాదగిరి, లవుకుమార్, నాగోసె శంకర్, షేక్ అసద్, మారుతి, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆశ్రమ’ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. శుక్రవారం మండలంలోని మోడి ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీ(మోడి)ల ను ఆమె సందర్శించారు. బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని, సీఆర్టీలకు ప్రతీనెల 1వ తే దీన వేతనాలు చెల్లించాలని, ఎంటీఎస్ వర్తింపజేస్తూ హెల్త్కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల తనిఖీల కోసం అధికా రులు ఉండగా మళ్లీ పర్యవేక్షణ నిమి త్తం తని ఖీ అధికారులను నియమించ డం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల సిబ్బంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు. -
వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శులు, ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, వీవోఏలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్(వానాకాలం) సీజన్ వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లాలో 44వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, దాదాపు 30వేల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్నారు. ఈనెల 24లోగా 40 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ.2,389, సాధారణ రకం రూ.2,369 మద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ. 500 బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తేమ శాతం నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.కొనుగోలు కేంద్రాలను ఎత్తుప్రదేశంలో ఏర్పాటు చేయాలని, సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేసి గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయ్యర్లు, తేమశాతం యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ట్యాబ్లను అందుబాటులో ఉంచి, రైతుల వద్ద నుంచి క్రమపద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం ట్యాగింగ్ చేసిన రైస్మిల్లులకు మాత్రమే తరలించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరగా దిగుమతి చేసుకునే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
విజన్ 2030తో గిరిజనుల సంక్షేమం
ఆసిఫాబాద్: విజన్ 2030తో జిల్లాలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వాంకిడి మండలం లింబుగూడ ప్రాంతంలోని బహుళార్థక ప్రయోజన కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా పీవీటీజీలకు వైద్యం, విద్య, పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ కుటుంబాలకు అధునాతన పరికరాలతో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. గిరిజన పిల్లల మానసిక ఎదుగుదలకు అవసరాలను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందించడంతో పాటు ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణా తరగతులు, సమావేశాలు, సాంస్కృతిక కూటములతో గిరిజనుల మధ్య సత్సంబంధాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా చిత్రాలను రూపొందించడంతో పాటు పురాతన లోహపు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జైనూర్ ఏటీడీవో శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
అక్షరంపై కక్ష కడుతారా..!
ఆసిఫాబాద్అర్బన్: అక్షరంపై కక్ష కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రమాదంలో పడేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. అధికారం చేతిలో ఉందని ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’పై అక్కసు చూపిస్తున్నారు. వార్తలకు భయపడి పత్రిక గొంతు నొక్కాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఖాకీలతో సర్కారు చేయిస్తున్న దమనకాండపై జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటికి పలు జర్నలిస్టు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కక్ష సాధింపు సరికాదు..ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ యాజమాన్యంపై అవలంబిస్తున్న కక్ష సాధింపు ధోరణి సరికాదని టీయూడబ్ల్యూజే టీయూడ బ్ల్యూ (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, సీనియర్ జర్నలిస్టులు రావుల శంకర్, ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీని వాస్రావులు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని, ఇప్పటికై నా సాక్షి ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో జర్నలి స్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందో ళన కార్యక్రమాలు చేపడతామని కూటమి ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ సభ్యులు ప్రకాశ్గౌడ్, శ్రీధర్, జానకీరాం, సురేశ్చారి, హనుమయ్య, రాధాకృష్ణచారి,ఽ తాటిపల్లి ఆశిష్, ముబ్బషీర్, శ్రీకాంత్, మహిళా జర్నలిస్టు గిరిజ, తదితరులు పాల్గొన్నారు.మీడియా గొంతు నొక్కడమే.. సాక్షి దినపత్రిక కు పదేపదే నోటీసులు ఇస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అంటే మీడియా గొంతు నొక్కడమే. వార్తలు రాస్తే కేసులు పెట్టడం సిగ్గుచేటు. ఒక్క కేసులో 4, 5 నోటీసులు జారీ చేయడం సమంజసం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సాక్షి దినపత్రిక యాజమాన్యంపై, జర్నలిస్టులపై కొనసాగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. – అబ్దుల్ రహమాన్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు -
భవితవ్యం.. ప్రశ్నార్థకం
సిర్పూర్(టి): సిర్పూర్(టి) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది. భవన సముదాయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాకాలంలో జూలై 29న ఖాళీ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అనంతరం వారిని ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గురుకుల భవనానికి మరమ్మతులు చేపట్టలేదు. తాత్కాలిక భవనాల కోసం అధికారులు గాలిస్తున్నారు. భవనం ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకోలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఐదు గురుకులాలకు విద్యార్థులుసిర్పూర్(టి) గురుకుల పాఠశాల, కళాశాలలో మొ త్తం 640 మంది విద్యార్థులకు పరిమితి ఉండగా ప్ర స్తుతం 490 మంది చదువుతున్నారు. భవనం శిథి లావస్థకు చేరడంతో 490 విద్యార్థులను ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాసిపేట, జైపూర్తోపాటు కోరుట్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు తరలించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. మొదట భారీ వర్షాలతో విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఆ తర్వాత ఇతర గురుకులాలకు పంపించడంతో విద్యా సంవత్సరం మధ్యలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు తాత్కాలిక ఏర్పాట్ల కోసం కౌటాల మండలం విజయనగరం గ్రామంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. భవనం మార్పునకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా, తమకు సమాచారం లేదని గురుకులాల అధికారులు చెబుతున్నారు. -
ఐటీడీఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న దినసరి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఈ మేరకు హైదరాబాద్లో గురువారం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సవ్యసాచి ఘోష్కు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో డైలీవేజ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 30 ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరంతా గిరిజనులే అయినా ఇప్పటివరకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమన్నారు. సకాలంలో వేతనాలు అందించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. -
నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి
ఆసిఫాబాద్: నూతన ఓటర్లకు తపాలాశాఖ ద్వారా గుర్తింపు కార్డులు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నా రు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికా రి మాట్లాడుతూ ఓటరు జాబితాలో వందేళ్లు కలిగిన ఓటర్లను గుర్తించి, వారి వయస్సుకు త గిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఓటరుగా నమోదైన వారికి తపాలాశాఖ ద్వారా ఓటరు కార్డులు పంపిస్తున్నామని తెలిపారు. వందేళ్లకు పైబడిన వారిని గుర్తిస్తామన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని బూత్స్థాయి అధికారులకు గుర్తింపుకార్డులు అందించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. సమావేశంలో కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, ఎన్నికల పర్యవేక్షకుడు శ్యాంలాల్, అధికారులు పాల్గొన్నారు. -
‘బీసీ బంద్కు మద్దతు ఇవ్వండి’
ఆసిఫాబాద్అర్బన్: బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఈ నెల 18న చేపట్టిన తెలంగాణ బంద్కు మద్ద తు తెలపాలని బీసీ జేఏసీ చైర్మన్ రూప్నార్ రమేశ్ కోరారు. ఈ మేరకు గురువారం రాజకీ య పార్టీల నాయకులతోపాటు కుల, వ్యాపా ర, ఇతర సంఘాల ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్రావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, మల్లికార్జున్, కిరాణ మర్చంట్ అధ్యక్షుడు గుండా ప్రమోద్కు వినతిపత్రం అందించారు. అనంతరం పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ను కలిసి బంద్కు పోలీసు శాఖ సహకరించాలని కోరారు. -
నిబంధనలకు పాతర!
కాగజ్నగర్టౌన్: దీపావళి పండుగ సమీపిస్తోంది. ఓ వైపు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతోపా టు దీపావళి పండుగ ఉండటంతో కాగజ్నగర్ పట్టణంలో నిత్యావసరాల మాటున ఇప్పటికే పెద్దఎత్తున బాణాసంచా నిల్వలు చేరుకున్నట్లు సమాచా రం. అయితే విక్రయదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్లు పొందకుండానే తాత్కాలికంగా ఎన్వోసీ లెటర్ తీసుకుని పట్టణంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాల ఏర్పాటుకు రెవె న్యూ, వాణిజ్య పన్నుల శాఖ, పోలీసుల అనుమతులు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భా రీగా గండి పడుతోంది. అధిక ధరలకు టపాసులు విక్రయించి సొమ్ము చేసుకునేలా వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. రెండు శాఖల నుంచి ఎన్వోసీ..దీపావళి పండుగకు బాణాసంచా విక్రయించేందుకు పట్టణంలోని వినయ్గార్డెన్లో ప్రత్యేక స్టాల్స్ ఏ ర్పాటు చేస్తున్నారు. బురదగూడ గ్రామ అగ్నిమాప క శాఖ, పంచాయతీ నుంచి ఏడు దుకాణాలకు ఇప్పటివరకు కేవలం ఎన్వోసీ లెటర్ మాత్రమే తీసుకున్నారు. షాపులు ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దుకాణాల మధ్య దూరం పెంచి ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది. రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించాలి. లైసెన్సులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు పాటించాలి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా బాణాసంచా నిల్వలు ఉంచినా, విక్రయించినా చర్యలు తీసుకుంటాం. సేఫ్టీ నిబంధనల ప్రకారమే దుకాణాలు ఏ ర్పాటు చేసుకోవాలి. షాపుల మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి. నీరు, ఇసుక, అగ్నిమాపక సిలిండర్ అందుబాటులో ఉంచాలి. – భీమయ్య, ఫైర్ ఆఫీసర్, కాగజ్నగర్ -
లక్ష్య సాధనపై గురి!
సంవత్సరం లక్ష్యం సాధించింది శాతం 2021– 22 33.50 24.42 732022– 23 35.00 29.20 832023– 24 36.50 37.50 1032024– 25 38.50 37.50 972025– 26 16.32 13.70 84(అక్టోబర్ 14 వరకు)రెబ్బెన(ఆసిఫాబాద్): ఓసీపీలపై అధిక వర్షాలు తీవ్ర ప్రభావం చూపడంతో బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. నెలవారీ ఉత్పత్తి సాధన కోసం అధికారులు చర్యలు చేపట్టినా వాతావరణం సహకరించకపోవడంతో ఉత్పత్తి పరంగా నష్టాలు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం వ ర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బెల్లంపల్లి ఏరియాలో ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది. గోలేటి ఓసీపీ ఇంకా ప్రారంభం కాకపోవడంతో భారమంతా ఖైరిగూర ఓసీపీపైనే ఉంది. జిల్లాలో గతేడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు 1,207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి 1,829 మిల్లీమీటర్లుగా నమోదైంది. గడిచిన రెండు నెలల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏరియా వార్షిక లక్ష్యంపై ప్రభావం ప డింది. సెప్టెంబర్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో నెలవారీ ఉత్పత్తి లక్ష్యంలో కేవలం 37 శాతం మాత్రమే సాధించగలిగారు. ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలల్లో నాలుగు లక్షల టన్నులకు కేవలం 2.74 లక్షలు మాత్రమే సాధ్యమైంది. వర్షాలను దృష్టిలో పెట్టుకుని నెలవారీ ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించినా పూర్తిస్థాయిలో సాధించలేకపోయారు. ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు20225– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బెల్లంపల్లి ఏరియాకు 35లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని యాజమాన్యం లక్ష్యం విధించింది. గత సంవత్సరం వార్షిక లక్ష్య సాధనలో అడుగు దూరంలో బెల్లంపల్లి ఏరియా నిలిచింది. దీంతో ఈసారి వందశాతం ఉత్పత్తి సాధించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వర్షాలు ఉత్పత్తి పరంగా ఏరియాను కుదేలు చేసినా సవాళ్లను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 14 నాటికి బెల్లంపల్లి ఏరియా వార్షిక ఉత్పత్తి సాధనలో 84 శాతంలో ఉంది. వర్షాలు తగ్గడంతో ఉత్పత్తిలో వేగం పెంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం ఏరియా రోజువారీ ఉత్పత్తి లక్ష్యం 10వేల టన్నులు ఉండగా డిసెంబర్ నుంచి 12వేల వరకు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదనపు ఉత్పత్తి లక్ష్యం నిర్ణయించడం ద్వారా వర్షాకాలంలో కోల్పోయిన ఉత్పత్తి నష్టాన్ని తిరిగి సాధించనున్నారు. వేగంగా ఓబీ వెలికితీతఓపెన్ కాస్ట్ల్లో బొగ్గు ఉత్పత్తి అనుకున్న స్థాయిలో జరగాలంటే అందుకు అవసరమైన బొగ్గు బెంచీలు అందుబాటులో ఉండాలి. ఓబీ పనులు అనుకూలంగా సాగాలి. అనుకున్న రీతిలో ఓబీ తీసినప్పుడే బొగ్గు బెంచ్లు సిద్ధంగా ఉంటాయి. సింగరేణిలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ వెలికితీత పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలు పనులను మధ్యలోనే వదిలేస్తూ చేతులెత్తేశాయి. దీంతో శ్రీరాంపూర్ ఓసీపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కానీ బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో ఓబీ వెలికితీస్తున్న కాంట్రాక్టు సంస్థ రోజు వారీ లక్ష్యానికి మించి ఓబీ వెలికితీస్తోంది. ప్రస్తుతం ఓబీ రోజువారీ లక్ష్యం 1.2లక్షల క్యూబిక్ మీటర్లు ఉండగా.. కాంట్రాక్ట్ సంస్థ రోజుకు 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఓబీ తొలగిస్తోంది. దీంతో ఏరియాలో డిసెంబర్ నుంచి వందశాతానికి మించి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యంత్రాల పని గంటలను పెంచడం, రోజువారీ వార్షిక లక్ష్యాన్ని పెంచడం, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పని చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.ఐదేళ్లలో బెల్లంపల్లి ఏరియా సాధించిన ఉత్పత్తి వివరాలు(లక్షల టన్నుల్లో)వందశాతం లక్ష్యం సాధిస్తాం గతేడాదితో పోల్చితే ఈసారి ఏరియాలో అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగం ఉత్పత్తిని కూడా సాధించలేకపోయాం. అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు నిర్దేశించిన లక్ష్యం వందశాతం సాధిస్తాం. ఏరియాకు ఈసారి 35 లక్షల టన్నుల లక్ష్యం ఉంది. అక్టోబర్ 14 వరకు ఏరియా 16.32 లక్షల టన్నులకు 13.66 లక్షల టన్నులు సాధించి 84శాతంలో ఉన్నాం. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. – విజయ భాస్కర్రెడ్డి, జనరల్ మేనేజర్, బెల్లంపల్లి ఏరియా -
సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత
కౌటాల(సిర్పూర్): అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కౌటాల సర్కిల్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. కార్యాలయ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రేవ్ కేసులను నాణ్యమైన దర్యాప్తు చేసి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. హత్యలు, డౌరీ డెత్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేరాలను అదుపునకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలను క్రైమ్ హాట్స్పాట్లుగా గుర్తించాలన్నారు. గంజాయి, ఇతర అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట కాగజ్నగర్ డీఎస్పీ వహిద్దుదీన్, సీఐ సంతోష్కుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు వద్దు
ఆసిఫాబాద్: అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయవద్దని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యల్లో భాగంగా వైల్డ్ లైఫ్, టాస్క్ఫోర్స్ టీం, విద్యుత్ అధికారులతో గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అనుమతి లేకుండా అటవీప్రాంతంలో విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రిజర్వ్ ఫారెస్టులో ఉన్న విద్యుత్ వైర్లు తొలగించి, రెవెన్యూ భూముల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా వేస్తున్న తీగలతో అటవీ జంతువులతోపాటు మనుషులు కూడా మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో అటవీ మండల అధికారి సుశాంత్ సుఖ్దేవ్, డీఎస్పీ వహిదుద్దీన్, అటవీ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు ముసవీర్, సద్దాం, సీఐలు రవీందర్, రాణాప్రతాప్, విద్యుత్శాఖ ఎస్ఈ శేషారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
దహెగాం(సిర్పూర్): విద్యుత్ సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిజామాబాద్ చైర్పర్సన్ ఎరుకుల నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో బుధవారం విద్యుత్ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, అధిక లోడ్ ఉన్నచోట మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలను ప్రజలు విన్నవించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. వ్యవసాయ కనెక్షన్లు, అధిక లోడ్ ఉన్న చోట ప్రత్యామ్నాయంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు వ్యవసాయ మోటర్లకు కెపాసిటర్ బిగించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ అధికారి కిషన్, ఎస్ఈ శేషారావు, డీఈ నాగరాజు, ఏవో దేవీదాస్, ఏఏవో రాజమల్లు, ఏఈ రవీందర్ పాల్గొన్నారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: రైతులు, వ్యాపారులు రుణాలు సద్వినియో గం చేసుకోవాలని స హకార బ్యాంకు ఉమ్మడి జిల్లా సీఈవో సూర్యప్రకాశ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకులో బుధవారం జిల్లాలోని సహకార బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్ని రు ణాలు మంజూరు చేశారు.. ఎంత వరకు రికవరీ చేశారు.. తదితర వివరాలు అడిగి తెలు సుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా పంటలు, వ్యవసా య పరికరాలతోపాటు వ్యాపార, హౌజింగ్, విద్య తదితర అవసరాలకు రుణాలు అంది స్తామని తెలిపారు. -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్లో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా పశువైద్యాధికారి సురేశ్కుమార్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పశువులు వ్యాధుల బారినపడుతున్నాయని తెలిపారు. రైతులు తమ ఆవులు, గేదెలు, ఎద్దులకు టీకాలు వేయించాలని సూచించారు. అలాగే పశువైద్యశాఖ అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయంలో సంప్రదించాలన్నారు. అనంతరం పశువులకు బలాన్ని అందించే మల్టీమిక్స్ పౌడర్ ప్యాకెట్లను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి మురళీకృష్ణ, సిబ్బంది మోతీరాం, సుప్రియ, పద్మ, ప్రశాంత్, వినోద్ పాల్గొన్నారు. -
పులి జాడ కోసం గస్తీ
బెజ్జూర్(సిర్పూర్): బెజ్జూర్ రేంజ్ పరిధిలోని మత్తడివాగు సమీపంలో బీట్ అధికారులు గోపాల్, స్రవంతి టైగర్ ట్రాకర్ సిబ్బందితో కలిసి పెద్దపులి ఆనవాళ్ల కోసం గాలించారు. వివిధ మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గస్తీ తిరుగుతున్నామని వారు తెలిపారు. ఇప్పటివరకు బెజ్జూర్ రేంజ్ పరిధిలోకి పెద్దపులి రాలేదని స్పష్టం చేశారు. మత్తడివాగు సమీపంలో చిరుతపులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
‘గుర్తింపు’ ఎన్నికలు నిర్వహించాలని వినతి
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపరు మిల్లులో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లేబర్ కమిషనర్ శ్రీదాన కిశోర్కు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు వినతిపత్రం అందించారు. హైదరాబాద్లోని బుధవారం కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లేబర్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. చాలా కాలంగా ఎన్నికలు జరగకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారని ఎమ్మెల్యే తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్: వానాకాలం సీజన్ వరిధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వరిధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 44 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 24లోగా అన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాల్కు రూ.2,369 చెల్లిస్తారని, సన్నరకం వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందిస్తారని తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, డీఏవో వెంకటి, డీఆర్డీవో దత్తారావు, పౌరసరఫరాల శాఖ అధికారులు స్వామి, సాదిక్ పాల్గొన్నారు. -
● మద్యం దుకాణాలకు మందకొడిగా దరఖాస్తులు ● జిల్లాలోని 32 షాపులకు ఇప్పటివరకు వచ్చినవి 166 మాత్రమే ● మిగిలింది రెండు రోజులే..
ఆసిఫాబాద్: జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు మరో రెండురోజులు మాత్రమే మిగిలిగింది. గతేడాదితో పోల్చితే ఈసారి టెండర్లకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సెప్టెంబర్ 26 నుంచి జిల్లాలోని 15 మండలాల్లో 32 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రిజర్వేషన్ల ప్రాతిపదికన గౌడ కులస్తులకు 2, ఎస్సీలకు 4, ఎస్టీలకు ఒకటి, ఏజెన్సీ ప్రాంతంలో నాలుగు దుకాణాలను ఎస్టీలకు కేటాయించారు. జనరల్ కేటగిరీలో 21 దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధారించారు. దరఖాస్తు రుసుం పెరగడంతో కొత్త వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తులు సమర్పిస్తున్నట్లు సమాచారం. 166 దరఖాస్తులు.. రూ.4.98 కోట్ల ఆదాయం జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 166 రాగా, ప్రభుత్వానికి రూ.4.98 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం ఒక్కోరోజే 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ డివిజన్లో 120 దరఖాస్తులు రాగా, కాగజ్నగర్లో 46 మాత్రమే వచ్చాయి. 11 దుకాణాలకు ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దరఖాస్తుల్లో ఆసిఫాబాద్ డివిజన్ ముందుండగా, కాగజ్నగర్ వెనుకబడింది. గతంలో దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలుగా ఖరారు చేశారు. 2021లో నిర్వహించిన మద్యం టెండర్లలో జిల్లావ్యాప్తంగా 26 మద్యం దుకాణాలకు 763 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.15.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో నిర్వహించిన టెండర్లలో 32 మద్యం దుకాణాలకు 1020 దరఖాస్తులు రాగా, రూ.20.40 కోట్ల ఆదాయం వచ్చింది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే చివరి రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.షాపు దరఖాస్తులు ఆసిఫాబాద్(001) 6 ఆసిఫాబాద్(002) 7 ఆసిఫాబాద్(003) 7 ఆసిఫాబాద్(004) 3 ఆసిఫాబాద్(005) 8 ఆసిఫాబాద్(006) 3 వాంకిడి(007) 27 వాంకిడి(008) 21 రెబ్బెన(009) 0 గోలేటి(010) 0 గంగాపూర్(011) 1 విజయనగరం కాలనీ, గోయగాం(012) 16 గోయగాం, మం.కెరమెరి(013) 22 కాగజ్నగర్(014) 0 కాగజ్నగర్(015) 0 కాగజ్నగర్(016) 2 కాగజ్నగర్(017) 4 కాగజ్నగర్(018) 1 కాగజ్నగర్(019) 1 సిర్పూర్– టి(020) 0 నజ్రూల్నగర్(021) 2 రవీంద్రనగర్(022) 0 కౌటాల(023) 0 కౌటాల(024) 25 బెజ్జూర్(025) 8 పెంచికల్పేట్(026) 0 దహెగాం(027) 13 గూడెం(028) 14 చింతనమానెపల్లి(029) 0 జైనూర్(030) 0 జైనూర్(031) 1 సిర్పూర్–యూ(032) 0 జిల్లాలో షాపుల వారీగా దరఖాస్తులు18 వరకు గడువుమద్యం దుకాణాలకు ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందించాలి. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఒకరు ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లక్కీడ్రాలో ఎన్ని దుకాణాలైనా పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. దుకాణాలు పొందిన వారు ఆరు విడతల్లో ట్యాక్స్ చెల్లించాలి. -
తూకాల్లో తేడాలు
కాగజ్నగర్టౌన్: ఇటీవల తూకాలు, కొలతల్లో మోసాలు పెరిగిపోయాయి. కొందరు వ్యాపారులు తక్కువ తూకాలతో వస్తు సామగ్రిని విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. తూనికల కొలతలు శాఖ(లీగల్ మెట్రాలజీ) అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతుండటంతో వ్యాపారుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సక్రమంగా తనిఖీలు చేపట్టలేకపోతున్నారు. కాసులకు కక్కుర్తి జిల్లాలో 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో వస్తుసామగ్రిని కొనుగోలు చేస్తారు. అయితే గ్రామీణ ప్ర జల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తు తం ప్రతీ వస్తువు కిలోల లెక్కగా మారింది. సీజనల్ పండ్లు మామిడి కాయలు, సీతాఫలం, ఆపిల్స్, ద్రాక్షపండ్లు.. ఇతర సామగ్రిని కిలోల లెక్కనే అ మ్ముతున్నారు. కొంతమంది వ్యాపారులు సరైన కాంటాతో తూకం వేసి అమ్ముతుంటే.. మరికొంద రు మాత్రం కాసులకు కక్కుర్తిపడుతున్నారు. తూ కంలో మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాళ్ల కాంటాలను ఏటా అధికారులు తనిఖీ చేయాలి. వ్యాపారులు కూడా రాళ్లపై అధికారికంగా స్టాంపింగ్ చేయించుకోవాలి. అయితే లీగల్ మెట్రాలజీ అధి కారులు కనీసం వ్యాపారులకు నిబంధనలపై అవగాహన కల్పించడం లేదు. కాంటా రాళ్లు, డిజిటల్ మిషన్లను ఏటా తనిఖీ చేసి స్టాంపింగ్ వేయకపోవడంతో వినియోగదారులు మోసపోతున్నారు. నామమాత్రపు తనిఖీలు జిల్లాలో తూనికలు కొలతల శాఖ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్యాకేజీ వస్తువుల లోపాలపై 10 కేసులు, తూనికలకు సంబంధించిన 17 కేసులు మాత్రమే నమోదు చేశారు. జిల్లాలో సుమారు 50 వరకు వే బ్రిడ్జి కాంటాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వాటిని తనిఖీ చేసిన దాఖలాలు లేవు. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువు, సామగ్రి తూకంలో తేడా రాకుండా చర్యలు తీసుకోవాల్సిన లీగల్ మెట్రాలజీ అధికారులు జిల్లాలో నామమాత్రపు తనిఖీలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెట్రోల్బంక్లు, బంగారు షాపులు, పండ్ల షాపులు, కిరాణ షాపుల్లో మోసాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.సిబ్బంది కొరత ఉందిజిల్లాలో సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నాం. ఇటీవల జిల్లాకు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టాను. ఇక నుంచి జిల్లాలోని దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు చేపడుతాం. నిబందనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటివరకు ముద్ర రుసుం రూ.5,61,000 వసూలు చేశాం. – విజయసారథి, జిల్లా ఇన్చార్జి, లీగల్ మెట్రాలజీ శాఖ -
బడుల తనిఖీలకు కమిటీలు
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయులతో కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్లోనే కమిటీ ఏర్పాటుపై కసరత్తు చేసినా ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం తనిఖీ కమిటీల ఏర్పాటుకే మొగ్గు చూపింది. పదేళ్ల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఎస్జీటీలు ప్రతిరోజూ రెండు ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేయాలి. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలను పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్లు తనిఖీ చేస్తారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 560 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 100, ఉన్నత పాఠశాలలు 60 ఉన్నాయి. 45 వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత.. పాఠశాలల తనిఖీలు, పర్యవేక్షణ బాధ్యతలను టీచర్లకు అప్పగించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాస్థాయిలో డీఈవో, మండల స్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు ఉన్నారు. మళ్లీ తనిఖీల కోసం కొత్తగా ఉపాధ్యాయులను నియమించడం సరికాదని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. మండాలనికి ఇద్దరు చొప్పున జిల్లాలో 30 మంది వరకు టీచర్లు బడులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో టీచర్ల కొరత ఉండగా, కొందరు డిప్యూటేషన్ విధానంలో చేస్తున్నారు. కమిటీల ఏర్పాటు బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులను కేవలం బోధన పనులకు ఉపయోగించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు 2009 చెబుతోందని, దానిని ఉల్లంఘించడం సరికాదని పేర్కొంటున్నారు. బోధనేతర పనులతో సతమతం ఉపాధ్యాయులు వివిధ బోధనేతర పనులతో సతమతం అవుతున్నారు. సీసీఈ రికార్డులు రాయడం, ఆన్లైన్ చేయడం, టెస్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫాం క్లాత్ వివరాలు ఆన్లైన్ చేయడం, ఎఫ్ఆర్ఎస్లో విద్యార్థుల హాజరు వేయడం, మధ్యాహ్న భోజనం వివరాలు అప్లోడ్ చేయడం, టీచర్ డైరీ రాయడం, డ్రాప్బాక్స్లు క్లియర్ చేయడం, తరగతుల వారీగా జీపీ, ఈపీ, ఎఫ్పీలు తదితర పనులు చేస్తున్నారు. నిత్యం తనిఖీలకు పాఠశాలలకు పలువురు అధికారులు వస్తుండటంతో సమయం కేటాయిస్తున్నారు. బోధనపై దృష్టి సారించలేపోతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి తెలిపారు. 83 రోజులకు రూ.81,69,099 నగదు, 91 గ్రాముల 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 79 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, ఏఈవో సుదర్శన్ పర్యవేక్షకులు శివరాజ్, తదితరులు పాల్గొన్నారు. 108 ఈఎంటీకి ఉత్తమ సేవా పురస్కారంఉట్నూర్రూరల్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 108 సిబ్బందికి రాష్ట్ర ఎంఆర్ఐ సంస్థ అందించే ఉత్తమ సేవా పురస్కారానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ 108లో మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న గణేశ్ ఎంపికయ్యారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా చేతుల మీదుగా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా ఇన్చార్జి రాజశేఖర్, పైలట్ సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల ఆవరణలో నాగుపాము కలకలం
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నాగుపాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో మూత్రశాలల సమీపంలో నాగుపామును గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులతో చెప్పా రు. ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని శాంతినగర్ కాలనీకి చెందిన స్నేక్క్యాచర్ గిరిగంటి అనిల్కు సమాచారం అందించడంతో చాకచక్యంగా పామును బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా స్నేక్క్యాచర్ అనిల్ను అభినందించారు. -
దాడి కేసులో నలుగురు..
ౖజైపూర్: మండలంలోని వేలాలలో జరిగిన దాడి కేసులో నలుగురిని రిమాండ్కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. గ్రామంలో ప్యాగ రాజ సమ్మయ్య, అతని సోదరులకు 33 గుంటల భూమి ఉంది. ఆ భూమి విషయంలో అన్న మైసయ్య, అతని కుమారులు సమ్మయ్య, నగేష్, మల్లేశ్తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఇటీవల మైసయ్య ఇల్లు నిర్మాణం చేపట్టగా రాజ సమ్మయ్య కుమారులు శ్రీనివాస్, సంతోష్, భార్య మల్లక్క భూమి వద్దకు వెళ్లి భూమిని పంచుకున్న తర్వాత ఇల్లు కట్టుకొమ్మన్నారు. ఈ విషయంలో సమ్మయ్య, నగేష్, మల్లేశ్, లక్ష్మి వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
33వ రోజుకు కార్మికుల సమ్మె
ఉట్నూర్రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. మంగళవారం గిరిజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ సమ్మె చేపట్టి 33 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో కొలాం సేవా సంఘం రాష్ట్ర అఽ ద్యక్షుడు కొడప సోనేరావు, కుంర రాజు, భీంరావు, సంజయ్, విజయ్, బీఆర్ఎస్ నాయకులు కొమ్ము విజయ్, కాటం రమేశ్, ధరణి రా జేశ్, బాజీరావు, దావుల రమేశ్ ఉన్నారు. -
ఐటీఐ గేట్కు తాళం వేసి నిరసన
మంచిర్యాలఅర్బన్: 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన కోర్సు ఫీజు చెల్లించినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో మంగళవారం డింపి ఐటీఐ గేట్కు తాళం వేసి విద్యార్థులు నిరసన తెలిపారు. కళాశాల చైర్మన్ వచ్చారన్న సమాచారంతో వెళ్లి సర్టిఫికెట్లు అడిగితే దాటవేత సమాధానం ఇవ్వడంతో గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీడీఎస్యూ, ఏఐఎస్బీ, జేవీఎస్ విద్యార్థి సంఘాల నేతలు శ్రీకాంత్, వంశీ వారికి మద్దతు తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల యజమానులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా విద్యార్థులు, విద్యార్థిసంఘాల నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ మధ్య డబ్బుల వివాదంతో సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు సర్టిఫికెట్ల సమస్య పరిష్కారంపై కొలిక్కిరాలేదు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
తిర్యాణి: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన కల్పన (28)కు తిర్యాణి మండలంలోని గంభీరావుపేటకు చెందిన సైదం శేఖర్తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కల్పన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో ఇటీవల మళ్లీ అత్తారింటికి వచ్చింది. సోమవారం మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
దండేపల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మే రకు మండలంలోని గుడిరేవు గ్రామానికి చెంది న పూసాల రాజు (36) ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య రాజేశ్వరితో గొడవపడటంతో రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన రాజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చిట్టీడబ్బులకోసం వెళ్లిన వ్యక్తి చూడగా ఉరేసుకుని కని పించాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
దండేపల్లి మండలం గుడిరేవులోని ఏత్మాసూర్ పద్మల్పురి కాకో ఆలయంగుస్సాడీలు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో మాలధారణ చేసి పది రోజుల పాటు కఠినదీక్ష చేపడతారు. దీక్ష పూర్తయ్యే వరకు స్నానం ఆచరించరు. ఒంటిపై చుక్క నీరుకూడా పడకుండా.. కాళ్లకు చెప్పులు ధరించకుండా.. ఒంటిపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా అర్ధనగ్నంగానే గడుపుతారు. నేలపైనే కూర్చోవడం, నేలపైనే పడుకోవడం వారి ఆచారం. గుస్సాడీల్లో పోరీలది మరింత ప్రాముఖ్యత. సీ్త్ర వేషధారణలో ఉండే యువకులను ఆదివాసీలు పోరీలు అని పిలుస్తారు. వారు ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఇంటిని సందర్శించినా మహిళలు మంగళహారతులు ఇచ్చి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆరాధ్యదైవం ఏత్మాసూర్ పద్మల్పురి కాకో ఆదివాసీలకు పెద్ద పండుగ దీపావళి.. ఇందులో భాగంగానే గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసూర్ పద్మల్పురి కాకో ఆలయానికి భక్తజన దండు కదులుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉన్న పద్మల్ పురి కాకో ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటారు. గుస్సాడి టోపీ ప్రత్యేకం గుస్సాడీ టోపీలను నిపుణులైన గోండులు, కొలాంలు తయారు చేస్తారు. నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు. టోపీకి చుట్టూ ముఖ్యంగా ముందు వైపు, పలు వరుసల్లో, పెద్ద అద్దాలతో, రంగురంగుల జరీ దారాలు, చక్కటి డిజైన్లు ఉన్న గుడ్డపట్టీలతో, పలు ఆకారాల రంగురంగుల చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్నిసార్లు రెండు వైపులా జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు. ఆదివాసీల మధ్య ఆత్మీయ బంధం దండారీ అంటేనే ఐకమత్యానికి నిదర్శనం. ఈ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరి నుంచి మరో ఊరికి విడిది వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రంతా నృత్యం చేస్తూ రేలారె రేలా పాటలతో పాటు గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి వినోదాన్ని అందిస్తారు. తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకుని మాన్కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రం సార్కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీలు అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతారు. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయని ఆదివాసీ పటేళ్లు పేర్కొంటున్నారు. నాలుగు సగల పేరిట ఉత్సవాలు దండారీ పండుగలో ఏత్మాసార్ పేన్ పేరిట గిరిజనులు నాలుగు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు. నాలుగు సగల అంటే గుమ్మేల, ఐదు సగల వారు అంటే ఫర్ర, ఆరు సగల వారు అంటే కోడల్, ఏడు సగల వారు అంటే తపల్ పేరిట ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. వేడుకల్లో భేటికోలా, మాన్కోలా, సదర్కోలా, కోడల్కోలా, సార్కోలా, కలివల్కోలా నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం. పేర్లు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో వారి ఆటపాటలు కూడా అంతే వైవిద్యంగా సాగుతాయి. చచోయ్ ఇట్ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి. కొలబొడితో ముగింపు దీపావళి రెండు రోజుల తరువాత గురువారం కొలబొడితో ఈ దండారీ వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా దండారీ బృందం ఇంటింటికీ వెళ్లగా గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచినంత నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తుంది. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని ఆశీ ర్వదిస్తారు. పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తా రు. అనంతరం గ్రామ పొలిమేరలో ఉన్న ఇప్పచెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. తలకు ధరించిన నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేషధారణ, అలంకరణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్ళు, మేకలను బలి ఇస్తారు. భీం దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విందు భోజనాలతో కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆదివాసీ గూడేల్లో అంగరంగ వైభవంగా సాగే దండారీ సంబరం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవితల్లి మురిసి పోనుంది. ఆదివాసీల ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పూజలతో దండారీ పండుగ ప్రారంభమైంది. దీపావళికి ముందు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో ప్రారంభమై కొలబొడితో ముగియనుంది. పక్షం రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు గూడేలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దండారిని ప్రత్యేక పండుగగా గుర్తించింది. – బజార్హత్నూర్ ఘనంగా జరుపుకుంటాం దీపావళికి పక్షం రోజుల ముందే అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఎంత పేద గిరిజనుడైనా ఈ పండుగకు ఇంటిని శుభ్రపరచడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండివంటలకు సామగ్రి సమకూర్చుకుంటారు. నెమలి ఈకలతో టోపీలు తయారు చేసుకుంటాం. దండారీ ఘనంగా జరుపుకుంటాం. – కనక లంకు మహాజన్, తుమ్ముగూడ, ఇంద్రవెల్లి పవిత్రమైన పండుగ మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పవిత్రమైన పండుగ. ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకుంటాం. గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాం. బంధువుల ఇళ్లకు వెళ్తాం. గుస్సాడీల థింసా నృత్యం, ఆడపడుచుల రేలారేరేలా నృత్యం ఆకట్టుకుంటాయి. – కొడప భీంరావ్ పటేల్, చింతలసాంగ్వీప్రోత్సాహం అందించాలి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరం రూ.15 వేలు అందించింది. ఈ సంవత్సరం కూడా ప్రోత్సాహకం అందించాలని జిల్లా సార్మేడీలు, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాను కలిసి విన్నవించాం. – మేస్రం దుర్గు, జిల్లా సార్మేడి, ఉట్నూర్ -
వ్యాధుల కాలం.. టీకాలే రక్ష!
కౌటాల(సిర్పూర్): ఏటా చలికాలంలో పశువులకు వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనుంది. ప్రత్యేక కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, పశువులకు టీకాలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలుగాలికుంటు వ్యాధి గేదెలు, ఆవులకు వైరస్తో సో కుతుంది. వ్యాధి సోకిన పశువులు బక్కచిక్కి అల్సర్ బారినపడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదా లు, నాలుకతోపాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలి. పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లేదా నార్మల్ సైలెన్ వాటర్తో శుభ్రం చేయాలి. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు యాంటీ బయాటిక్స్ మందులు, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులు వాడాలి. అలాగే గాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా పశు సంవర్థక శాఖ వైద్యుల సలహా మేరకు క్రమంతప్పకుండా ఏడాదికి రెండు సార్లు టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో కలిసి ఒకేచోట ఉంచొద్దు. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికీటకాల నివారణకు చర్యలు చేపట్టారు. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతే తాగాలి. ఒకవేళ పశువు చనిపోతే గోతిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలని పశువైద్యులు సూచిస్తున్నారు. నవంబర్ 14 వరకు టీకాలుజిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 18 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. ఏడు సబ్ సెంటర్లు ఉన్నాయి. ఆవులు 2.32 వేలు, గేదెలు 41 వేలు ఉన్నాయి. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమతో ఆర్థికంగా బలపడుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని 75 మందికి పైగా సిబ్బంది ఈ నెల 15 నుంచి నవంబర్ 14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తారు. ఉచితంగా టీకాలు వేస్తాం రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నాం. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 14 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేస్తాం. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. – సురేశ్, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి -
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
ఆసిఫాబాద్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాల్లో అధికా రులు, సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలని సూచించారు. సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్లలో నమోదైన వ్యక్తులతోపాటు గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు నిర్మూలన కోసం పోలీస్ సెర్చ్ టీములు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరా ల నిర్మూలనకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీపావళి నేపథ్యంలో బాణసంచా దు కాణాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదా లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎ స్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాగజ్నగర్ అడవుల్లోకి బెబ్బులి
దహెగాం/కాగజ్నగర్రూరల్: దహెగాం మండలంలోని పెసరికుంట, బీబ్రా సమీపంలో సోమవారం సంచరించిన పెద్దపులి కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోకి వెనుదిరిగి వెళ్లిపోయింది. ఇటీవల మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పెద్దపులి జాడను ఈజ్గాం, అనుకోడ, గన్నారం, మండువ అటవీ ప్రాంతంలో మొదట గుర్తించారు. రెండు రోజుల క్రితం రాస్పెల్లి, కొత్తసార్సాల, పాతసార్సాల మీదుగా పెద్దవాగు దాటి బీబ్రా ప్రాంతానికి వెళ్లింది. పెసరికుంట, బీబ్రా గ్రామాల మీదుగా భీమిని మండలం చినగుడిపేట వరకు చేరుకుని మళ్లీ మంగళవారం పెద్దవాగు దాటి రాస్పెల్లి బీట్ పరిధిలోని అడవుల్లోకి వెళ్లినట్లు ఎఫ్ఎస్వో సద్దాం తెలిపారు. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు గుంపులుగా వెళ్లాలని ఆయన సూచించారు. గ్రామాల్లో డప్పు చాటింపురాస్పెల్లి, కొత్తసార్సాల, పాత సార్సాల, చేడ్వాయి, దరోగపల్లి, గజ్జిగూడ, మోసం, ఆరెగూడ, బాపూనగర్, కడంబ, గన్నారం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు డప్పు చాటింపు వేస్తున్నారు. పులి జాడను కనుగొనేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు నిఘా ఏర్పాటు చేసినట్లు ఎఫ్ఆర్వో అనిల్కుమార్ వెల్లడించారు. పులి చాలా చురుకుగా ఉందని సీసీ కెమెరాలు అమర్చిన చోటు నుంచి కాకుండా దాని వెనుకవైపు నుంచి వెళ్తుందని తెలిపారు. సల్పలగూడలో పులి సంచారం! ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ పంచాయతీ పరిధిలోని సల్పలగూడ భీమన్న ఆలయం వద్ద మంగళవారం సాయంత్రం పులి సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో పంచా యతీ కార్యదర్శి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు వేయించారు. కొన్నిరోజులుగా తి ర్యాణి మండలంలో పులి సంచరిస్తోందని, అదే ఇ టువైపు రావొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. -
సమ్మె వీడని కార్మికులు
పెంచికల్పేట్(సిర్పూర్): జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి(డైలీ వేజ్) కార్మికులు సమ్మె వీడటం లేదు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకి చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిత్యం నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయం వద్ద 72 గంటల నిరసన సైతం చేపట్టారు. మరోవైపు దసరా సెలవులు ముగియడంతో విద్యార్థులు వసతిగృహాలకు చేరుకుంటున్నారు. కార్మికులు సమ్మెలో ఉండడంతో వసతిగృహాల నిర్వహణకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య పనులు, విద్యార్థులకు భోజనం వండటంతోపాటు ఇతర పనులు చేపట్టేందుకు తాత్కాలిక కార్మికులను నియమించుకుంటున్నారు. నెలరోజులుగా సమ్మెబాటగిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 46 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు. 11,560 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా వసతిగృహాల్లో పారిశుద్ధ్య పనులు, భోజనం వండటం, ఇతర పనుల కోసం సుమారు 15 ఏళ్ల క్రితం ఔట్సోర్సింగ్ విధానంలో కార్మికులను నియమించారు. ప్రస్తుతం జిల్లాలో డైలీవేజ్ కార్మికులు 410 మంది పనిచేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని హాస్టళ్లలో పనిచేస్తున్న వీరంతా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2023లో సమ్మె బాట పట్టారు. అధికారులు, ప్రభుత్వం ఇచ్చిన హామీతో అప్పుడు సమ్మె విరమించారు. హామీలు అమలు చేయకపోవడంతో తిరిగి సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మెబాట చేస్తున్నారు.ప్రధాన డిమాండ్లు.. -
పాతాళ గంగ ౖపైపెకి!
ఆసిఫాబాద్: జిల్లాలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో పాతాళ గంగ పైకొచ్చింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సగటున ఒక మీటర్ నీటిమట్టం పెరిగింది. కాగా, జిల్లాలో ప్రతీ ఏడాది 0.5 నుంచి 0.7 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఐదేళ్ల క్రితం గ్రౌండ్వాటర్ 8 నుంచి 10 మీటర్ల లోతులోనే ఉండేవి. కొన్నేళ్లుగా ఎండలు పెరగడం, సాగు కోసం అత్యధికంగా బోర్లు వినియోగించడంతో భూగర్భ జలాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలకు పాతాళ గంగ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మే నుంచి పెరుగుదలజిల్లాలోని 15 మండలాల్లో భూగర్భజల మట్టాలను కొలిచేందుకు 31 ప్రాంతాల్లో ఫిజోమీటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో గతేడాది నవంబర్లో సగటున భూ గర్భ జలాలు 6.13 మీటర్ల లోతులో ఉండగా, ఈ యేడాది 4.57 మీటర్లకు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్లో భూగర్భ జలాలు 5.91 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది 3.85 మీటర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది మే నుంచి పెరుగుదల కనిపిస్తోంది. మేలో 9.53 మీటర్లు ఉండగా, జూన్లో 8.48, జూలై 5.91, ఆగస్టు 4.57, సెప్టెంబర్లో 3.85 మీటర్లకు చేరాయి. నీటి సంరక్షణ చర్యలతోనే.. అధిక వర్షాలతోనే జిల్లాలో భూ గర్భ జలాలు పెరిగాయి. నీటి సంరక్షణకు వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం, ప్రాంతాన్ని బట్టి చెరువులు, ఇంకుడు గుంతలతో పాటు నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. – సుహాసిని, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారిసెప్టెంబర్లో భూగర్భ జల మట్టం వివరాలుప్రాంతం లోతు(మీటర్లలో) ఆసిఫాబాద్ 9.86 ఆసిఫాబాద్– 2 7.35 కొమ్ముగూడ 0.17 బెజ్జూర్ 1.70 రెబ్బెన 1 పాపన్పేట్ 2.60 దహెగాం 15.15 రాసిమెట్ట 0.55 సిర్పూర్(యూ) 0.57 జంబుగ 4 కాగజ్నగర్ 0.50 భీమన్గోంది 6.43 కెరమెరి 3.30 ఝరి 4.85 కౌటాల 1.67 లొద్దిగూడ 0.46 రవీంద్రనగర్ 0.65 కర్జవెల్లి 0.99 ఎల్కపల్లి 13.40 రెబ్బెన–1 3.29 రెబ్బెన– 2 4.72 సిర్పూర్(టి) 0.02 లోనవెల్లి 1.21 చింతకుంట 5.59 భీమ్పూర్ 1.60 పంగిడిమాదర 2.70 తిర్యాణి 8.25 సవాతి 5.90 వాంకిడి 5.05 కనర్గాం 3.66 ఇందాని 2.01 అధిక వర్షపాతం నమోదు..భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం వర్షపు నీటి సంరక్షణ, చెరువుల్లో పూడికతీత పనులతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. గ్రామాల్లో నీటి గుంతలు నిర్మిస్తున్నారు. జిల్లాలో కుమురంభీం, వట్టివాగు, ఎన్టీఆర్, అమ్మలమడుగు, తదితర జలాశయాల్లో నీటి నిల్వలతో భూగర్భ జలాలు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 1025.6 మిల్లీమీటర్లు కాగా 1175.1 మిల్లీమీటర్లు కురిసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 1076.1 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 1364.8 మిల్లీమీటర్లు కురిసింది. 27 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఇది భూగర్భ జలాల పెంపునకు దోహదపడింది. -
హోరాహోరీగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. డీఎస్వో షేకు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. అనంతరం ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి పో టీలకు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. 100, 200, 400 మీటర్ల ర న్నింగ్, లాంగ్జంప్, హైజంప్, షాట్ఫుట్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 60 మందిని జోనల్స్థాయికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, పీడీ మీనారెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, పీఈటీలు శారద, హరీశ్, రాకేశ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ జేఏసీ చైర్మన్గా రమేశ్
ఆసిఫాబాద్: బీసీ జేఏసీ జిల్లా చైర్మన్గా జిల్లా కేంద్రానికి చెందిన రూప్నర్ రమేశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్గా ప్రణయ్, వైస్ చైర్మన్లుగా ఖాండ్రే విశాల్, మాచర్ల శ్రీనివాస్, గాజుల జక్కయ్య, నికోడె రవీందర్, దీపక్ ముండే, పొన్న రమే శ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కోట వెంకన్న, బొర్కుటె తిరుపతి, లహుకుమార్, మేరాజ్, పురుషోత్తం బాలేశ్, రాపర్తి కార్తీక్, మామిడి కిరణ్, పర్రె గిరి, నాందేవ్, నాగపురి మారుతి, షేక్ అసద్, ఉమేందర్ ఎన్నికయ్యారు. -
దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్: భూసమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు, రహదారుల నిర్మాణాల్లో ముంపునకు గురైన భూముల వివరాలు, ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్బోర్డు సీలింగ్ భూములు, నిషేధిత జాబితాలోని భూముల వివరాలతో స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ దరఖాస్తును రికార్డులతో సరిచూసి సంబంధిత వారసులు, దరఖాస్తుదారుడికి నోటీసులు అందించాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘బెస్ట్ అవైలబుల్’ విద్యార్థులపై దృష్టి సారించాలిఆసిఫాబాద్రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వి ద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. వస తి గృహాల్లో సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ అధి కారి నదీమ్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికా రి మండల్ తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతులు చేపట్టాలని మంత్రికి వినతి
కాగజ్నగర్టౌన్: సిర్పూర్(టి)లోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల భవనాల కు మరమ్మతులు చేపట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు వినతిపత్రం అందించారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు. గురుకుల పాఠశాలలో చదువుతు న్న 500 మంది విద్యార్థులు విద్యా సంవత్స రం నష్టపోకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మరమ్మతుల కు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారు. -
సక్రమంగా తాగునీటిని సరఫరా చేస్తాం
కౌటాల(సిర్పూర్): గ్రామాలకు సక్రమంగా మిషన్ భగీరథ తాగునీటిని సరఫరా చేస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ ఎ.రవీందర్ అన్నారు. ఈ నెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘భగీరథ బంద్..!’ కథనానికి అధికారులు స్పందించారు. వీర్ధండి గ్రామంలోని మిషన్ భగీరథ నీటి సరఫరా పైపులు, నల్లాలను మంగళవారం పరిశీలించారు. ప్రతీ ఇంటింటికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ఇబ్బందులు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, డీఈఈ వి.రాజేశ్, ఏఈఈ సాయిసిద్ధార్థ, ఖాజా ముజహీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఎఫెక్ట్ -
బీసీ సంఘాలు ఏకతాటిపైకి రావాలి
ఆసిఫాబాద్అర్బన్: హక్కుల సాధనకు బీసీలు ఏకతాటిపైకి రావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 42శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు పోరాడాలని కోరారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించే బీసీ జేఏసీ ఏర్పాటు సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, నాయకులు బాల్దారపు మధుకర్, కమలాకర్ పాల్గొన్నారు. -
వ్యాపారిపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మద్యం టెండర్లలో నిబంధలకు విరుద్ధంగా అడ్డదారుల్లో అప్పులు ఇస్తూ దందా చేయాలని ఎత్తుగడ వేసిన వ్యాపారులపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 8న ‘సాక్షి‘లో ‘అప్పులిస్తా.. దందా చేస్తాం!’అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రూ.లక్షల కొద్ది అప్పులు ఇచ్చి, లక్కీ లాటరీలో షాపు వచ్చినా, రాకున్నా, నిర్వాహకులే లాభం పొందేలా పది కండీషన్లలో ఓ ఒప్పంద పత్రం విడుదల చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరిపి కాగజ్నగర్కు చెందిన వ్యాపారి గజ్జల శ్రీనివాస్పై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బుల పంపిణీ, బహుమతుల ఆశ చూపిస్తూ సభ్యులను చేర్చుకోవడం వంటివి నిషేధం. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీం చట్టంలో సెక్షన్ 3, 4 కింద ప్రకారం ఆయనపై కేసు నమోదైంది. మరోవైపు ఇదే తరహాలో మరికొందరు రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యాపారులు సైతం అమాయకులకు మద్యం టెండర్ల పాల్గొనేలా ముందుగా అప్పు రూపంలో ఇస్తూ తర్వాత తీసుకునే విధంగా ఎత్తువేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా లోలోపల నడుపుతున్నట్లు సమాచారం. ఎఫెక్ట్ -
జోనల్స్థాయి పోటీలకు 12 మంది ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో సోమవారం ఎస్ జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ అండర్–17 జిల్లాస్థాయి బాలుర వాలీబాల్ పోటీలకు 60 మంది క్రీడాకారులు హాజరుకాగా, 12 మంది జోనల్స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 14న నిర్మల్ జిల్లాలో జోనల్స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం కర్నూ, పీడీ, పీఈటీలు మీనారెడ్డి, రాజయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్, సుభాశ్, రాకేశ్, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయిపై డ్రోన్ నిఘా
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం అంతాపూర్ పంచాయతీ నారాయణగూడ గ్రామ శివారులో ఆదివారం రాష్ట్రంలో తొలిసారి పోలీసులు డ్రోన్ సాంకేతికత వినియోగించి పంట చేలలో సాగుచేస్తున్న పత్తిమొక్కలను గుర్తించారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో డ్రోన్ సాయంతో గాలించి ఒక్కరోజే 51 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడకు చెందిన రాథోడ్ బాలాజీపై కేసు నమోదు చేశారు. దహెగాం(సిర్పూర్): జిల్లాలో గంజాయి సాగుపై పోలీసుశాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ సాయంతో గాలించి పత్తి చేలలో పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తిస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పట్టుకోవడం గతంలో పోలీసులకు కష్టంగా ఉండేది. ఎవరైనా సమాచారం ఇస్తే దాడులు చేసి మొక్కలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమోదు చేసేవారు. కానీ ప్రస్తుతం పోలీసులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే కెరమెరి మండలం నారాయణగూడ గ్రామ శివారులో 51 గంజాయి మొక్కలను డ్రోన్ ద్వారా గుర్తించారు. ఏఎస్పీ చిత్తరంజన్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేస్తూ పత్తి చేలను పరిశీలించారు. అలాగే లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో 35 గంజాయి మొక్కలను పట్టుకున్నారు. వెయ్యికి పైగా మొక్కలు పట్టివేతజిల్లాలో మారుమూల మండలాల్లో వివిధ పంటల్లో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారు. కెరమెరి, జైనూర్, లింగా పూర్, చింతలమానెపల్లి, కౌటాల, రెబ్బెన, దహెగాం తదితర మండలాల్లో సాగు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకు 57 గంజాయి కేసులు నమోదు చేశారు. వెయ్యికి పైగా మొక్కలను స్వాధీనం చేసుకోగా, రూ.1.08 కోట్ల విలువైన 14.7 కిలోల ఎండుగంజాయిని పట్టుకున్నారు. గంజాయి సాగు, క్రయవిక్రయాల గురించి సమాచారం ఇస్తే పారితోషకం ఇస్తామని ఎస్పీ ప్రకటించారు. తద్వారా సాగు గురించి మరింత సమాచారం తెలుస్తుందని భావిస్తున్నారు. అనర్థాలపై అవగాహనగంజాయికి అలవాటు పడితే జరిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా రు. పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాలతోపాటు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, విని యోగం చట్టపరంగా నేరమని వివరిస్తున్నారు. అక్ర మ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. గంజాయి రహిత జిల్లా సాధనలో యువత, ప్రజలు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. డ్రోన్ సాంకేతిక సహాయంతో గంజాయి సాగును గుర్తిస్తున్నాం. ఆదివారం కెరమెరి మండలం నారాయణగూడలోని పంట చేలలో డ్రోన్తో గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. సాగు, రవాణా, వినియోగం, అమ్మకాలు జరిపే వారిపై నిఘా పెంచాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. యువత, ప్రజలు గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా 8712670551, డయల్ 100 నంబర్లకు తెలియజేయాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీ -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కెరమెరి మండలం గోయగాంకు చెందిన ముస్లిం మైనార్టీ మహిళలు తమ గ్రామం ఏజెన్సీ పరిధిలో ఉన్నందున గిరిజనేతర గ్రామంలో ఇళ్ల స్థలాలను ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూమికి పట్టా మంజూరు చేయాలని దహెగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన మేడి తిరుపతిగౌడ్ కోరాడు. రెబ్బెన మండలం దేవులగూడ గ్రామం నుంచి వెళ్తున్న జాతీయ రహదారిపై యూటర్న్ అవకాశం కల్పించాలని గ్రామస్తులు అధికారులకు దరఖాస్తు సమర్పించారు. రెబ్బెన మండలం పుంజుమేర గ్రామంలోని పొలాలకు వెళ్లేందుకు దారి సౌకర్యాన్ని కల్పించాలని రైతులు కోరారు. జైనూర్ మండలం రాసిమెట్ట పంచాయతీ పరిధిలోని సుంగాపూర్లో సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కొలాం గిరిజనులు విన్నవించారు. తన పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తిర్యాణి మండలం నాయకపుగుడ గ్రామానికి చెందిన మార్నేని లక్ష్మి అర్జీ అందించింది. పింఛన్లు మంజూరు చేయాలి తమ భర్తలు వివిధ కారణాలతో మరణించారని, ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామానికి చెందిన జమ్ముబాయి, ఆత్రం ఆయుబాయి, మడావి భీంబాయి, ఆత్రం ముత్తుబాయి కోరారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టర్ స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. – చౌపన్గూడ మహిళలు -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, పీఎం జన్మన్ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందన్నారు. మండల కేంద్రాల్లో చేపట్టిన మోడల్ ఇళ్లు పూర్తిచేయాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద 2,167 మంది లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలిజిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, రోడ్డు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారులు, కల్వర్టులు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీటీడీవో రమాదేవి, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని బెల్లంపల్లి ఏరియా ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్ అన్నారు. డబ్ల్యూపీఎస్ వార్షిక క్రీడల్లో భాగంగా సోమవారం గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నియర్ బై వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరంతర సాధనతో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రావు, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్, పీఈటీ భాస్కర్ పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
కాగజ్నగర్టౌన్: తూకాల్లో నిబంధనలు పాటించకపోతే వ్యాపారులపై చర్యలు తప్పవని తూనికలు, కొలతల శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి హెచ్చరించారు. సోమవారం కాగజ్నగర్ పట్టణంలోని బంగారు దుకాణాలు, పెట్రోల్ బంక్లు, ఇతర దుకాణలను తనిఖీ చేశారు. వ్యాపారులు వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు, రాళ్లు ఉపయోగించే కాంటాలకు గడువు తీరిన తర్వాత సీలు వేయించుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా తప్పుడు తూకాలతో మోసాల కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. విని యోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది సుందర్రావు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
తెరుచుకోని కమ్మర్గాం గిరిజన ఆశ్రమ బడి
పెంచికల్పేట్(సిర్పూర్): మండలంలోని కమ్మర్గాం గిరిజన ఆశ్రమ పాఠశాల దసరా సెలవులు ముగిసి పదిరోజులు గడిచినా నేటికీ తెరుచుకోలేదు. ఉపాధ్యాయుల తీరుతో విద్యార్థులు నష్టపోతున్నారు. కమ్మర్గాం ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు వందమంది చదువుకుంటున్నారు. దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో నాలుగు రోజులుగా విద్యార్థులు పాఠశాలకు వస్తున్నా.. హెచ్ఎం రవికుమార్తోపాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. టీచర్లు పాఠశాలకు రాకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హెచ్ఎం రవికుమార్ను సంప్రదించగా.. సమావేశంలో పాల్గొనేందుకు ఆసిఫాబాద్కు వెళ్లినట్లు సమాధానం ఇచ్చారు. అలాగే ఏటీడబ్ల్యూవో శ్రీనివాస్ను సంప్రదించగా జర్నీలో ఉన్నట్లు తెలిపారు. -
‘కాగజ్నగర్’లో పులి సంచారం
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ అటవీ డివిజన్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అధికారులు డప్పుచాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం పలు గ్రామాల్లో పులి సంచారంపై డప్పు చాటింపు నిర్వహించారు. గస్తీ బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశారు. అయితే కెమెరాల సహాయంతో కదలికలను పర్యవేక్షిస్తున్నప్పటికీ పెద్దపులి జాడ చిక్కడంలేదు. దీంతో పాదముద్రల ఆధారంగా బెబ్బులి ఏ వైపునకు వెళ్తుందో అంచనా వేస్తున్నారు. పెద్దపులి ఎవరికై నా కనిపిస్తే తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. రైతులు ఒంటరిగా రాత్రిపూట పంట చేలకు వెళ్లొద్దని, మధ్యా హ్న సమయంలో గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. కాగా పాదముద్రల ఆధారంగా డివిజన్లోకి కొత్తపులి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి పులి కాగజ్నగర్ డివిజన్లోకి చేరినట్లు నిర్ణయానికి వచ్చి కదలికలపై నిఘా పెట్టారు. జాడ కనుగొనేందుకు ఆయా ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటివరకు ఏ కెమెరాలోనూ పులి ఆనవాళ్లు చిక్కలేదు. కొత్త పులి జాడను కనుగొనేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని కాగజ్నగర్ ఎఫ్ఆర్వో అనిల్కుమార్ తెలిపారు. -
‘పార్టీ బలోపేతానికి కృషి’
ఆసిఫాబాద్అర్బన్/కాగజ్నగర్టౌన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రూపు విభేదాలు నివారించే దిశగా డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఏఐసీసీ పరిశీలకుడు నరేశ్కుమార్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆ దివారం జిల్లా కేంద్రంలోని రోజ్గార్డెన్, కాగజ్నగర్లోని రన్ ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించారు. సాయంత్రం ఆసిఫాబాద్ అ టవీశాఖ అతిథిగృహంలో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం అన్నివర్గాలతో సమావేశమవుతామని తెలిపారు. గ్రూపు తగాదా లు నివారించే ప్రయత్నం చేస్తామన్నారు. అధ్యక్ష పదవికి ఇప్పటివరకు 25కు పైగా నామినేషన్లు వచ్చాయని, ఇందులో ఆరు నామినేషన్లను కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని జనశక్తి ఆర్గనైజేషన్కు అందించామని తెలిపారు. అహ్మదాబాద్ సమావేశంలో జిల్లా అధ్యక్షుల ఎన్నిక చేపడతామని పేర్కొన్నారు. కాగజ్నగర్లో ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు అనిల్కుమార్, కోఆర్టినేటర్ శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
టీఏ, డీఏలు వెంటనే విడుదల చేయాలి
కాగజ్నగర్టౌన్: ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న టీఏ, డీఏ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లచ్చిరాం డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం బాధాకరమన్నారు. సమావేశంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు భానుప్రకాష్, ప్రధాన కార్యదర్శి సదాశివ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, రాష్ట్ర బాధ్యులు రాంరెడ్డి, దామోదర్, కిరణ్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
ఆసిఫాబాద్అర్బన్: డీసీసీ అధ్యక్ష ఎన్నికను ఎలాంటి అపోహలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పీసీసీ పరిశీలకులు శ్రీనివాస్, అనిల్కుమార్, జ్యోతి, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణక్క, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావ్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం స క్కుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది వారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ గెస్ట్హౌజ్లో డీసీసీ సమావేశం, మధ్యాహ్నం సిర్పూర్ నియోజకవర్గ సమావేశం, 13న జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం, 14న సాధారణ ప్రజలతో పా టు మేధావుల అభిప్రాయ సేకరణ, 19న పోటీలో ఉన్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు, పైరవీ లకు తావులేకుండా జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల్లో పర్యటించి నివేదికను అధిష్టానానికి అందించనున్నట్లు పేర్కొన్నారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండా శ్యాం, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, నాయకులు అనీల్గౌడ్, అబ్దుల్లా, మునీర్ పాల్గొన్నారు. డీసీసీల ఎంపికకు కసరత్తు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలో డీసీ సీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ), నగర అధ్యక్షుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలైంది. ఆయా జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సరైన నా యకులను ఎంపిక చేసేందుకు పార్టీ ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. ఆదిలాబాద్, నిర్మ ల్ జిల్లాలకు ఎం.అనిల్కుమార్యాదవ్(ఎంపీ), సీహెచ్.రాంభూపాల్, లకావత్ ధన్వంతి, గడ్డం చంద్రశేఖర్రెడ్డి, కుమురంభీంఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర నాయకులు డా.పులి అనిల్కుమార్, అడువాల జ్యోతి, బత్తిని శ్రీనివాస్గౌడ్ను ని యమించింది. పరిశీలకులు నాలుగు జిల్లాల పరిఽ దిలోని పది నియోజకవర్గాల్లో పర్యటించి, నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం పరిశీలకులు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పరిశీలకులకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఆసక్తి గల నాయకుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు సామర్థ్యం, డీసీసీ ఎంపికలో జిల్లా పరిస్థితులను అంచనా వేస్తూ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుల ఖరారులో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన కీలకంగా మారింది. -
కోర్టు భవన నిర్మాణం చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి భీమపాక నగేశ్కు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాలలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా విచ్చేసిన ఆయనను స్థానిక న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ.12 కోట్లతో కోర్టు భవన సముదాయాలు మంజూరు చేయగా జిల్లాకు మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కోర్టు నిర్మాణానికి కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం న్యాయమూర్తిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు బోనగిరి సతీశ్బాబు, నరహరి, ముక్త సురేశ్, రాజీవ్రెడ్డి, జగన్మోహన్ రావు, రామకృష్ణ, సత్యశ్రీలత, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.


