breaking news
Kumuram Bheem District Latest News
-
కుమురం భీం
7ప్రకృతి ఒడిలో ‘మహా’ జాతర వార్ధా నది ఒడ్డున ఉన్న శ్రీసిద్ధి హనుమాన్ ఆలయంలో ఏటా మహాశివరాత్రికి జాతర నిర్వహిస్తారు. ఇరురాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతుంటారు. 9లోuజిల్లాలో ఎండల తీవత్ర క్రమంగా పెరుగుతుంది. పగటి పూట వేడిగా ఉంటుంది. రాత్రి చల్లటి వాతావరణం కొనసాగుతుంది. నేడు బొగ్గు గనుల్లో సమ్మె అన్ని బొగ్గుగనుల్లో గురువారం సమ్మె జరుగనుంది. నూతన లేబర్కోడ్లు రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 8లోuగురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
జన్కాపూర్లో ఉద్రిక్తత
ఆసిఫాబాద్: జన్కాపూర్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కేంద్రంలోకి గంటకోసారి ఏజెంట్లను పార్టీల వారీగా పంపడానికి పోలీ సులు నిర్ణయం తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ వారికి ఎక్కువగా అనుమతిస్తున్నారని, తమ ను అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జాబరి రవీందర్ ఆరోపించారు. ఆయనతోపాటు బీజేపీ నేతలు డ్యూటీలో ఉన్న తిర్యాణి ఎస్సై వెంకటేశ్ను ప్రశ్నించారు. ఎస్సై వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుండగానే.. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాంగ్రెస్ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు అన్ని పార్టీ ల నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. మీడియాపై ఆంక్షలు జిల్లా కేంద్రంలో పలుచోట్ల పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. ఉర్దూ పాఠశాలలోకి వెళ్లేందుకు మీడియా ప్రతినిధులను గస్తీ కానిస్టేబుల్ నిరాకరించడంతో.. అక్కడే ఉన్న లింగాపూర్ ఎస్సై గంగన్న సర్దిచెప్పారు. జన్కాపూర్ పోలింగ్ కేంద్రం గేటు వరకే మీడియాకు అనుమతి ఉందని తెలిపారు. ఆర్డీవో లోకేశ్వర్రావు దృష్టికి సమస్య వెళ్లింది. ఆర్డీవో ఫోన్లో జోనల్ అధికారిని ఆదేశించడంతో మీడియా ప్రతినిధులను అనుమతించారు. స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్, ఇతర సీఐలు బందోబస్తును పర్యవేక్షించారు. -
అప్పుడు పంచాయతీ.. ఇప్పుడు మున్సిపల్
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ పట్టణం ఎన్నో ఒడిదొడుకుల మధ్య పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించింది. కొన్నేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. దశాబ్దాల చరిత్ర ఉన్న పట్టణంలో బుధవారం తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. గతంలో పలుమార్లు పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లు ప్రస్తుతం బల్దియా ఎన్నికల్లోనూ ఓటుహక్కు వినియోగించుకున్నారు.మేధావులు రాజకీయాల్లోకి రావాలిఆసిఫాబాద్ రాజకీయాలు చాలా మారాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి మేధావులు తప్పకుండా రావాలి. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో పోలింగ్ తక్కువగా నమోదవుతుంది. ప్రజలు ఓటు వేయడానికి ముందుకు రావడంలేదు. కనీసం 95శాతం పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘం చొరవ చూపించాలి. – శ్రీలేఖ, గృహిణి -
యూరియా కోసం ఆందోళన వద్దు
దహెగాం: యూరియా కోసం రైతులు ఆందో ళన చెందవద్దని, యాసంగి సాగుకు సరిపడా నిల్వలు ఉన్నాయని డీఏవో వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు యూరియా బుకింగ్ యాప్పై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యూరి యా బుకింగ్ చేసుకున్న రైతులకు సకాలంలో అందించాలన్నారు. అలాగే భూమి ఉన్న ప్రతిఒక్కరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అనంతరం మన గ్రోమోర్ సెంటర్ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఏవో రామకృష్ణ, ఏఈవోలు సుష్మిత, ఆదిత్య, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
గంటల వారీగా పోలింగ్ సరళి (ఓట్లు, శాతం)
ఆసిఫాబాద్13,927 2,203 (15.82%) 5,553 (39.87%) 8,596 (61.72%) 10,117 (72.64%) 10,817 (77.67%)కాగజ్నగర్ 51,205 5,219 (10.19%) 13,487 (26.34%) 22,466 (43.87%) 28,620 (55.89%) 32,937 (64.32%)మొత్తం ఓటర్లు -
పోలింగ్ వివరాలు
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశా యి. కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యా లెట్ బాక్స్ల్లో నిక్షిప్తమైంది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటలలోగా వచ్చిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లకు సీలు వేసి పోలీసు బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తరలించారు. ఓటేసిన 43,754 మంది.. రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డుల్లో 65,132 మంది ఓటర్లు ఉన్నారు. 113 పోలింగ్ కేంద్రాల్లో 43,754 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ పెంచేందుకు అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవడంతో యువకులు, మహిళలు ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. రెండు మున్సిపాలిటీల్లో సగటున 70.99 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్లో 13,927 మందికి 10,817(77.67శాతం) మంది, కాగజ్నగర్లో 51,205 మంది ఓటర్లకు 32,937(64.32శాతం) మంది ఓటు వేశారు. ఆసిఫాబాద్ ప ట్టణంలో అత్యధికంగా మూడో పోలింగ్ బూత్లో 88.29శాతం పోలింగ్ న మోదు కాగా, అత్యల్పంగా ఐదో పోలింగ్ బూత్లో 63.86శాతం పోలింగ్ నమోదైంది. కాగజ్నగర్లోని పలు వార్డుల్లో పోలింగ్ 60శాతం దాటలేదు. ఎమ్మెల్యే హరీశ్బాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ స్కూల్, జెడ్పీ బాలురు, బాలికల పాఠశాలల్లోని కేంద్రాలకు 200 మీటర్ల దూరం నుంచి పోలీసులు వాహనాలు అనుమతించలేదు. పరిశీలించిన కలెక్టర్, అధికారులు జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, ఇతర అధికారులు పరిశీలించారు. జన్కాపూర్ జెడ్పీ పాఠశాల, ఉర్దూ పాఠశాల, జెడ్పీ హైస్కూల్ను కలెక్టర్ తనిఖీ చేసి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా రెండు మున్సిపాలిటీల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలురు, బాలికల పాఠశాలను అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. పట్టణంలోని 12వ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట ఐఎఫ్ఎస్ అధికారి భార్గవ్ కుమార్ ఉన్నారు. కాగజ్నగర్లోని కేంద్రాలను ఎస్పీ నితిక పంత్, ఆసిఫాబాద్లోని కేంద్రాలను ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించారు. కాగజ్నగర్లో ఓటు వేసేందుకు ఓటరు వెంట వచ్చిన అతడి కుమార్తెతో ఎస్పీ ముచ్చటించారు.జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాల వద్ద బారులు తీరిన ఓటర్లుజాబితాలో తన వివరాలు తెలుసుకుంటున్న మహిళపదో వార్డులో పోలీసుల బందోబస్తురెండు కర్రల సాయంతో ఓటు వేసేందుకు వస్తున్న వృద్ధుడుఅంచనాల్లో తలమునకలుఎన్నికలు ముగియడంతో అభ్యర్థులు అంచనాల్లో తలమునకలయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థుల విజయావకాశాలపై చర్చలు ఊపందుకున్నాయి. గెలుపోటములపై ఎవరికి వారే ధీమాతో ఉన్నా.. లోలోన ఆందోళనతో ఉన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 94మంది, కాగజ్నగర్లో 130 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఈ నెల 13న విడుదలయ్యే ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. చైర్మన్ పీఠం కోసం స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.వృద్ధురాలిని వీల్చైర్లో తీసుకొస్తూ..మున్సిపాలిటీ మొత్తం ఓటర్లు పోలైనవి మహిళలు పోలైనవి పురుషులు పోలైనవి ఇతరులు పోలైనవి ఆసిఫాబాద్ 13,927 10,817 7,103 5,483 6,822 5,333 02 01కాగజ్నగర్ 51,205 32,937 26,193 16,831 25,004 16,101 08 05 -
సీఎం కప్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని బాబాపూర్లో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడాపోటీల్లో ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ సుకన్య తెలిపారు. పాఠశాల ఆవరణలో మంగళవారం క్రీడాకారులు వైష్ణవి, హిమబిందు, సుజాత, బిక్కుబాయి, కీర్తన, సంధ్యారాణి, నందిని, స్వర్ణను అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 9న సిర్పూర్(యూ)లో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో బాలికలు ప్రతిభ చూపి మొదటి బహుమతి కై వసం చేసుకున్నారని తెలిపారు. -
మున్సి‘పోల్స్’కు భారీ బందోబస్తు
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించనున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఇప్పటికే జిల్లా కేంద్రం, కాగజ్నగర్ పట్టణంలో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. మద్యం, నగదు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువుల తరలింపును అడ్డుకునేందుకు రెండు పట్టణాల్లో నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడంతో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతూ భద్రత కట్టుదిట్టం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి పోలింగ్ తీరును పర్యవేక్షించనున్నారు. జిల్లాలో 34 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించగా, ఆసిఫాబాద్లో 17, కాగజ్నగర్లో 17 కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలపై మరింత నిఘా ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. సిబ్బంది కేటాయింపు ఇలా..ఎన్నికల నిర్వహణకు 800 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో నలుగురు డీఎస్పీలు, ఏఎస్పీ స్థాయి అధికారులు, 12 మంది సీఐలు, ఆర్ఐలు, 38 మంది ఎస్సైలు, 108 మంది టీజీఎస్పీ ప్రత్యేక బెటాలియన్ పోలీసులు, 516 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 75 మంది హోంగార్డులు, 25 మంది అటవీశాఖ సిబ్బంది, జైళ్లశాఖ, ఆర్టీసీ, పీటీఎస్, మెట్రాలజీ సిబ్బందిని కేటాయించారు. 10 రూట్ మొబైళ్లు, 306 స్ట్రైకింగ్ ఫోర్స్, రెండు ఎఫ్ఎస్టీ బృందాలు, 4 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా విచక్షణతో ఓటు వేయాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. పోలింగ్ కేంద్రాలు తనిఖీ ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఎస్పీ నితిక పంత్ తనిఖీ చేశారు. ఆసిఫాబాద్లోని జెడ్పీ సెకండరీ పాఠశాల(బాలికలు), జెడ్పీఎస్ఎస్ ఉర్దూ, జెడ్పీ సెకండరీ ఉన్నత పాఠశాల (బాలుర), కాగజ్నగర్లోని శిశుమందిర్ ఉన్నత పాఠశాల, సుప్రభాత్ పాఠశాల, బాలభారతి పాఠశాల, అన్వర్ ఉర్దూ ఉన్నత పాఠశాల, స్మైల్ కిడ్స్ పాఠశాలల్లో ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు. -
నేడే పుర పోరు
జిల్లాలో పురపోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. గెలుపు మాదే అని ధీమాతో ఆయా పార్టీలు ఉండగా, ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మున్సిపల్ కౌన్సిలర్గా బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తు ఈ నెల 13న తేలనుంది.ఆసిఫాబాద్: జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20, కాగజ్నగర్లో 30 వార్డులు ఉన్నాయి. 65,132 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రెండు మున్సిపాలిటీల పరిధిలోని 50 వార్డుల్లో 113 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆసిఫాబాద్లో 9 ప్రాంతాల్లో 28 పోలింగ్ స్టేషన్లు, కాగజ్నగర్లో 28 ప్రాంతాల్లో 85 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 113 మంది పోలింగ్ అధికారులతోపాటు 20 శాతం అదనపు పీవోలతో 136 మందికి విధులు కేటాయించారు. ఆసిఫాబాద్లో 34 మంది, కాగజ్నగర్లో 102 మంది ఉన్నారు. అలాగే 339 మంది ఏపీవోలు, 20 శాతం అదనపు ఏపీవోలతో 407 మందిని నియమించారు. 25 మంది రిటర్నింగ్ అధికారులు, 25 మంది ఏఆర్వోలను నియమించగా, ఒక్కో విభాగంలో ఏడుగురిని రిజర్వ్లో ఉంచారు. 13 మంది జోనల్ అధికారులు, ఇద్దరు ఎఫ్ఎస్టీ, నలుగురు ఎస్ఎస్టీలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు షురూమున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటరు కార్డుతో ఓటు వేయవచ్చు. ఆ కార్డు లేకుంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు, పాన్కార్డు, బ్యాంకు/పోస్టాఫీస్ పాస్బుక్, పట్టాదార్ పాస్బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, పెన్షప్పత్రం(ఫొటోతో), ఉద్యోగ ఐడీకార్డు(పబ్లిక్ సెక్టార్)లో ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో అధిక సీట్లు మహిళలకు కేటాయించగా, చాలావరకు కొత్తవారు బరిలో నిలిచారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం పరిసమాప్తం కాగా.. అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. కలెక్టర్ కె.హరిత పర్యవేక్షణలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కేంద్రాలకు తరలిన సిబ్బందిమున్సిపల్ ఎన్నికల సిబ్బంది మంగళవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల వసతిగృహం, కాగజ్నగర్లోని పాత బాలవిద్యామందిర్లో ఏర్పాటు చేసిన కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని రిటర్నింగ్ అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సిబ్బంది సామగ్రితో పోలీసు భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు, సిబ్బందికి వసతుల కల్పన, కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ, పోలీసుల బందోబస్తు తదితర ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ప్రతీ రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని ఆర్వోలకు అందించనున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సామగ్రి, సిబ్బందిని పంపిణీ కేంద్రాలకు సురక్షితంగా చేర్చేందుకు ప్రణాళిక రూపొందించారు. మున్సిపాలిటీల వివరాలుమున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు ఓటర్లు పోలింగ్ కేంద్రాలు ఆసిఫాబాద్ 20 94 13,927 28 కాగజ్నగర్ 30 130 51,205 85 -
‘ఇందిరమ్మ’ బిల్లు తారుమారు
వాంకిడి: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల వివరాల నమోదులో జరిగిన తప్పిదంతో బిల్లులు తారుమారైన ఘటన వాంకిడి మండలం ఖమాన గ్రామంలో చోటుచేసుకుంది. అర్హులుగా గుర్తించిన ఒకే వాడకు చెందిన ఇద్దరు లబ్ధిదారుల పేర్లు ఒకేలా ఉండటంతో.. ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారి ఖాతాకు బదులుగా మరొకరి ఖాతాలో మొదటి విడత బిల్లు జమ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఖమాన గ్రామానికి చెందిన లోబడె సాయికుమార్, లోబడె సోని దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కొన్ని నెలల క్రితం పనులు ప్రారంభించి ఇటీవల బేస్మెంట్ పనులు పూర్తిచేశారు. అధికారులు పనుల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేశారు. దంపతులు బిల్లుల గురించి ఆరా తీయగా, అధికారులు బ్యాంకులో తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఖాతాలో నగదు జమ కాకపోవడంతో తిరిగి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బిల్లులు వేరేవారి ఖాతాల్లో జమ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తప్పిదం జరిగిందిలా..ఖమాన గ్రామంలోని తేలివాడలో లోబడె సాయి కుమార్, లోబడె సోని పేర్లతో రెండు కుటుంబాలు ఉన్నారు. వీరి పేర్లు అర్హుల లిస్ట్–1లోనే ఉన్నాయి. లోబడె సాయి కుమార్(తండ్రి పేరు శ్రావణ్) భార్యకు ఇంటి మంజూరు పత్రం అందించారు. కానీ ఈ బిల్లు రూ.లక్ష మాత్రం లోబడె సాయికుమార్(తండ్రి పేరు పెంటు) భార్య ఖాతాలో జమయ్యాయి. వివరాల నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తప్పిదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సొంతింటి కోసం ఉన్న పందిరిని తొలగించి అప్పు తెచ్చి పనులు ప్రారంభించామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు అందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఎంపీడీవో పాటిల్ జ్యోత్స్నను వివరణ కోరగా.. బిల్లుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పిదం ఎక్కడ జరిగిందో గుర్తిస్తామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
రెబ్బెన: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ చాంద్ పాషా పిలుపునిచ్చారు. ఈ నెల 12న నిర్వహించే సార్వత్రిక సమ్మె పోస్టర్లను మంగళవా రం మండలంలోని గోలేటిలో ఆవిష్కరించారు. ఆ యన మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే రద్దు చేసిన 44 చట్టాలను యాథావిధిగా అమలు చేయాలని డి మాండ్ చేశారు. కార్మికులకు కట్టుబానిసలుగా త యారు చేయడానికే కేంద్రం నూతన లేబర్ కోడ్ల ను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తిరుపతి, ఏరియా అధ్యక్షుడు పోశం, ప్రధాన కా ర్యదర్శి శ్రీనివాస్, కార్మికులు శారద, మల్లేశ్వరీ, సునీత, కుమార్, భీమేశ్, ప్రభాకర్, రాజు, జగదీష్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. -
ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించాలని వినతి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని డిపో నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాలైన కొండగట్టు, వేములవాడకు ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఆసిఫాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ఆర్టీసీ డీఎం రాజశేఖర్కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్కు రాత్రిపూట మరో బస్సు అదనంగా నడిపించాలని, గతంలో రద్దు చేసిన నిజామాబాద్ బస్సును ప్రారంభించాలని కోరారు. కొండగట్టు, వేములవాడకు వెళ్లే సర్వీసులను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ నుంచి రాత్రి 11 గంటల సమయంలో సూపర్ డీలక్స్ తప్పితే మరొకటి లేదని పేర్కొన్నారు. డీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ధర్మపురి వెంకటేశ్వర్లు, బోనగిరి మురళీధర్, సీహెచ్ రాజు, పత్తి రవి, మహేశ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా మంగళవారం ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎ న్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆహ్లాదమేది.. ఆటలేవి?
కౌటాల మండలం వీర్ధండి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలోని 15 చెట్లను ఈ నెల 1న అదే గ్రామానికి చెందిన వ్యక్తి నరికేశాడు. గ్రామానికి దూరంగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో రక్షణ లేకుండా పోయింది. ఐదేళ్లుగా పెంచిన చెట్లను నరికి వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని పంచాయతీ సిబ్బంది పేర్కొంటున్నారు. అధికారుల పట్టింపులేని కారణంగా వనంలోని చెట్లను నరకడంతో పాటు పశువులను వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కౌటాల: ప్రకృతి అందాలతో పల్లెలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. గ్రామీణ వాసులకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదం అందించాలనే లక్ష్యంతో ఖాళీ స్థలాలను గుర్తించి వీటిని ఏర్పాటు చేశారు. కాగా అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఆహ్లాదం పంచాల్సిన పార్కులు గ్రామాలకు దూరంగా ఉండడంతో రక్షణ లేకుండా పోతోంది. వీటితో పాటు గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో పల్లెకో క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. కానీ క్రీడా మైదానాల్లో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. పార్కులకు రక్షణేది..!జిల్లాలోని చాలా వరకు పల్లె ప్రకృతి వనాలు గ్రా మాలకు దూరంగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఉపయోగపడటం లేదు. అధికారులు సైతం వీటి వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగా కొన్ని ప్రకృతి వనాల్లోని మొక్కలు ఎండిపోగా, మరికొన్ని చోట్ల విపరీతంగా గడ్డి పెరగడంతో అగ్ని ప్రమాదాల్లో చెట్లు కాలిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 335 గ్రామ పంచాయతీల పరిధిలో 1100 వరకు పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. వీటికి రక్షణ లేకపోవడంతో వనాల్లోని చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. వేసవి కాలం సమీపిస్తుండడంతో వనాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆటల్లేవ్..గ్రామీణ యువతకు అందుబాటులో మైదానాలు ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు నిర్ణయించింది. కానీ అధికారుల ఆర్భాటంతో అనేక చోట్ల ఆయా గ్రామాలకు కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరంలో మైదానాలు ఏర్పాటు చేశారు. దీంతో అటు వైపు ఎవరూ వెళ్లకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రభుత్వం క్రీడా పరికరాలు అందించినా ఆడేందుకు అనువైన స్థలాలు లేకపోవడంతో అవి మూలకే పడేయాల్సిన పరిస్థితి ఉందని యువకులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 878 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో ఉండే వీటిలో ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఆటలు ఆడాలని ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఆదిలో అధికారులు హడావుడి చేయడంతో దాదాపు అన్నిచోట్ల సరైన స్థలం లేకపోవడంతో పాఠశాలల మైదానాల్లోనే ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రామాల్లో సరిగా చదును చేయకపోవడంతో రాళ్లు, రప్పలతో ఆడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.ప్రకృతి వనాలపై దృష్టి గ్రామీణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం పార్కులను ఏర్పాటు చేసింది. పార్కుల్లో చెత్తాచెదారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తాం. వనాల్లోని చెట్లను నరికి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. క్రీడా మైదానాల్లో వసతులు కల్పిస్తాం. వేసవి దృష్టా పంచాయతీ సిబ్బంది వనాల్లో చెత్త లేకుండా చూడాలి. – భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారికౌటాల మండలంలోని కనికి గ్రామ శివారులో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. కేవలం క్రీడా ప్రాంగణం అనే బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ఈ ప్రాంగణంలో ఆటలు ఆడేందుకు క్రీడా సామగ్రి కూడా ఏర్పాటు చేయలేదు. సమాధులు ఉన్న ప్రదేశంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో అటు వైపు క్రీడాకారులు కన్నెత్తి చూడడం లేదు. దీంతో మైదానం నిరుపయోగంగా మారింది. -
ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్/కాగజ్నగర్రూరల్: మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్కు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, కాగజ్నగర్ పట్టణంలోని డీఏవీ(పాత బాలవిద్యామందిర్ పాఠశాల)లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్రూమ్, కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన నీడ, కుర్చీలు, తాగునీరు, భోజన వసతి కల్పించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, తహసీల్దార్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తిఆసిఫాబాద్: మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాధారణ పరిశీలకుడు అలోక్ కుమార్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి మూడో విడత ర్యాండమైజేషన్ చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రిజర్వ్ టీంతో కలిపి 35 టీంలు, కాగజ్నగర్లో మున్సిపాలిటీలో 102 టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. -
వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించాలి
రెబ్బెన: ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను గడువులోగా అధిగమించాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) తిరుమల్రా వు అన్నారు. ఖైరిగూర ఓసీపీని సోమవారం ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డితో కలిసి సందర్శించారు. ఓసీపీలో ఏర్పాటు చేసిన ఇన్ఫిట్ క్రషర్ కన్వేయర్ బెల్ట్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇన్ఫిట్ క్రషర్ కన్వేయర్ బెల్ట్తో బొగ్గు రవాణా వేగవంతం అవుతుందన్నారు. వాహనాల వినియోగం, చమురు వాడకం తగ్గనుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ఏరియాను అగ్రభాగాన నిలపడంపై అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి తిరుపతి, పీవో మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమ ల్లు, గోలేటి ఓసీపీ పీవో ఉమాకాంత్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
I‘ఉపాధి’ కల్పనలో భేష్ ఉపాధిహామీ పనుల కల్పనలో తిర్యాణి మండలం ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.27 లక్షల పనిదినాలు కల్పించారు. IIIలోuఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. తెల్లవారుజామున చల్లగా ఉంటుంది. తీర్థయాత్రలకు ‘స్పెషల్’ రైళ్లు..! తీర్థయాత్రల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మార్చి 21, ఏప్రిల్ 14 తేదీల్లో హైదరాబాద్లో వీటిని ప్రారంభించనున్నారు. IIలోuమంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
మూగబోయిన మైక్లు
ఆసిఫాబాద్: కాలనీల్లో వారం రోజులుగా మోత మోగిస్తున్న మైకులు మూగబోయాయి. సోమవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ముఖ్య నాయకులతో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికలకు మరికొన్ని గంటల గడువు మాత్రమే ఉండటంతో ప్రలోభాలతో మభ్యపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 27న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ బల్దియాల్లో 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ జనరల్, కాగజ్నగర్ బీసీ మహిళకు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.. హోరెత్తించిన ముఖ్య నేతలుమున్సిపల్ ఎన్నికల్లో గెలుపును అన్ని పార్టీలు ప్రతి ష్టాత్మకంగా తీసుకోవడంతో ముఖ్య నేతలంతా ప్ర చారంతో హోరెత్తించారు. ఆయా పార్టీలకు చెందిన జిల్లా ఇన్చార్జీలు పట్టణాల్లో మకాం వేశారు. నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారం సాగించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎ మ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు విశ్రాంతి లేకుండా కాలనీల్లో తమ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు. ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. సర్వేల ద్వారా టికెట్లు కేటాయించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండానే అధిక స్థానాలు కై వసం చేసుకున్నామని, ఈ సారి కారు గుర్తు దూసుకెళ్తుందని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కాగజ్నగర్లో కుడిఎడమగా ఉన్న అదే పార్టీకి చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సైతం ఒకటిగా ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ ఏకంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రచార సభ నిర్వహించింది. ఎంపీ గోడం నగేశ్, జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, అరిగెల నాగేశ్వర్రావులు సైతం ప్రచారంతో హోరెత్తించారు. మద్యం, నగదు పంపిణీపై ఫోకస్ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాల ప ర్వం మొదలైంది. చివరి అస్త్రంగా అభ్యర్థులు మద్యం, నగదు పంపిణీపై ఫోకస్ పెట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నాలుగు రోజులుగా ఆ యా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఉదయం అ ల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడంతోపాటు కొంత నగదు ఇస్తూ మ చ్చిక చేసుకునే యత్నం చేశారు. విద్య, ఉద్యోగాలు, ఇతర కారణాలతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసిఫాబాద్, కా గజ్నగర్ పట్టణాలకు చెందినవారు ఎక్కువగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వారి రైలు, బస్సు చార్జీలు భరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యాన్ని రహస్య ప్రాంతాలకు డంప్ చేసినట్లు సమాచారం. పోలీసులు జిల్లా కేంద్రంలో తనిఖీలు చేపట్టగా ఓ హోటల్లో రూ.87 వేల విలువైన మద్యం లభించింది. -
మొదటిసారి ఓటు వేయనున్న యువత
ఆసిఫాబాద్అర్బన్: మరికొద్ది గంటల్లో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. యువత తొలిసారి ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అభివృద్ధిపై దృష్టి సారిస్తూ.. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసే నీతివంతులైన నాయకులకు ఓటు వేస్తామని చెబుతున్నారు. బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకుంటామని, ప్రజలంతా తప్పనిసరిగా ఓటు వేయాలని సూచిస్తున్నారు.నీతివంతులకే పట్టంఅందుబాటులో ఉండే వారికే.. ఎన్నికల సమయంలో పార్టీలు, కులమతాలకు అతీతంగా నీతివంతుడైన నాయకుడికి ఓటు వేయాలి. డబ్బులు తీసుకోకుండా గెలిపించాలి. భవిష్యత్లో అతడు అవినీతికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇచ్చిన హామీలను పరిశీలించి ఓటు వేస్తా. – సాయికృష్ణ, ఆసిఫాబాద్ పార్టీలకు అతీతంగా ఎల్లప్పుడు ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలు పరిష్కరించేవారికే తొలిఓటు వేస్తా. ప్రజాప్రతినిధులు ఒత్తిడికి తలొగ్గకుండా పనిచేస్తేనే కాలనీలు అభివృద్ధి చెందుతాయి. ప్రజలు సైతం ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలి. – ప్రద్యుమ్న(శ్రేయస్), బీటెక్, ఆసిఫాబాద్యువత పాలకులుగా మారాలి ప్రశ్నించేతత్వం కావాలి ప్రస్తుతం యువత రాజ కీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. నూత న ఆలోచనలతో ప్రజల కు సేవ చేసేందుకు యువత పాలకులుగా మారాలి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో యువతీ యువకులు పోటీ చేయడం ఆనందంగా ఉంది. తొలిసారి ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నా.. – శ్వేత, బీటెక్, ఆసిఫాబాద్ అవినీతి, అక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించేతత్వం యువతలో రావాలి. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి. చదువుకుని చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేస్తా. – నిఖిత, బీటెక్, ఆసిఫాబాద్ -
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలన
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సోమవారం ఎస్పీ నితిక పంత్ పరిశీలించారు. కేంద్రంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(బాలికలు), ఉర్దూ జెడ్పీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పో లింగ్ రోజు తీసుకోవాల్సిన భద్రతపై పోలీసు అధి కారులతో చర్చించారు. సీఐ బాలా జీ వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీశ్, మున్సిపల్ కమిషనర్ గజానంద్ తదితరులు ఉన్నారు. 712 మందితో పటిష్ట బందోబస్తుఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ ఎన్నికలను 712 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్కు 48 గంటల ముందు నుంచి బుధవారం వరకు సైలెంట్ పీరియడ్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ప్రచారం, ర్యాలీలు, లౌడ్ స్పీకర్లు, సమావేశాలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. -
పగలు ఎండ.. రాత్రి చలి
దహెగాం: జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండగా మరోవైపు రాత్రిపూట చలి తీవ్రత సైతం కొనసాగుతోంది. ఆదివారం తిర్యాణి మండలం గిన్నెధరిలో కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, కౌటాలలో 32.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు చల్లగా ఉంటూ క్రమంగా మధ్యాహ్నం వరకు ఎండ వేడి పెరుగుతోంది. పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలువాతావరణ మార్పులతో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండగా ఉంటోంది. రాష్ట్రంలో దిగువ స్థాయిలో ఆగ్నేయ గాలులు వీచినప్పటికీ ఈశాన్య గాలులు, తూర్పు గాలులు దిగువ స్థాయిలో రావడంతో ఈ మార్పులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గాలుల తీవ్రతతో చలిలోనూ హెచ్చుతగ్గులు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 30 నుంచి 33 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 9 నుంచి 15 మధ్య కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి తిర్యాణి మండలం గిన్నెధరిలో కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలు ఉండగా, సిర్పూర్(యు)లో 10, కెరమెరి 11, వాంకిడి, తిర్యాణి, కెరమెరి ధనోర, బెజ్జూర్లో 12 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని మండలాల్లో 30 డిగ్రీలు దాటాయి. కెరమెరి, బెజ్జూర్, పెంచికల్పేట్, ఆసిఫాబాద్, కౌటాల మండలాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. చలి, ఎండతో ప్రజలు జలుబు, దగ్గుతో ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి పంటలపైనా ప్రభావం..వాతావరణ మార్పుల ప్రభావం యాసంగి పంటలపై పడుతోంది. చలి, ఎండతో పంటల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. వరి పంటకు అగ్గి తెగులు సోకే ప్రమాదం ఉండగా, మొక్కజొన్నను కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. చలి తీవ్రత నేపథ్యంలో వరి సాగు చేసే రైతులు రాత్రి నీళ్లను వదిలేసి ఉదయం మోటరు వేసి గోరువెచ్చని నీటిని అందించాలని సూచిస్తున్నారు. మరో వారం రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.ప్రాంతం కనిష్ట గరిష్ట (డిగ్రీల (డిగ్రీల సెల్సియస్) సెల్సియస్) గిన్నెధరి 9.7 30.9 సిర్పూర్(యు) 10.4 30.0 కెరమెరి 11.7 32.7 వాంకిడి 12.0 30.6 తిర్యాణి 12.4 30.6 ధనోరా 12.4 31.4 బెజ్జూర్ 12.7 32.1 రవీంద్రనగర్ 13.6 31.4 కాగజ్నగర్ 13.7 30.5 ఎల్కపల్లి 13.8 32.4 లోనవెల్లి 13.8 31.4 వంకులం 13.9 31.1 కుంచవెల్లి 14.0 31.3 ఆసిఫాబాద్ 14.4 32.1 కౌటాల 14.8 32.4 జైనూర్ 15.3 30.3 లింగాపూర్ 15.4 30.1 -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
కాగజ్నగర్రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీకులు అలోక్కుమార్ అన్నా రు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలె ట్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు, కాగజ్నగర్ పట్టణంలోని 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించాల ని ఆయన అధికారులకు సూచించారు. ప్ర శాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సమన్వయంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ తిరుపతి, ఎన్నికల అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వలస ఓటర్లకు గాలం
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రతీ ఓటు కీలకం కానుంది. ప్రతీ అంశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో 65,110 ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 35,285 మంది ఉండగా, పురుషులు 31,815 మంది ఉన్నారు. మొత్తంగా 3,470 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరిలో విద్యార్థులు, పలువురు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. అంతేకాకుండా అద్దె నివాసాల్లో ఉండే ఓటర్లు ఇళ్లు మారినా, ఓటరుగా నమోదై ఉన్నారు. వారందరినీ గుర్తించి ఓట్లు పొందేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థుల తరపున ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 5వేల మందికి పైగానే..జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లలో సుమారు 5వేల మందికిపైగానే ఉన్నత చదువులు, ఉద్యోగాల రీత్య హైదరాబాద్, వరంగల్, చంద్రాపూర్, ఇతర పట్టణాల్లో ఉంటున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్లో ఉంటున్నారు. వీరందరిని పోలింగ్ రోజు రప్పించేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వారి సంబంధీకుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి వారితో మాట్లాడుతున్నారు. పోలింగ్ రోజు తప్పకుండా వచ్చి ఓటు ద్వారా తమకు మద్దతు తెలపాలని వేడుకుంటున్నారు. అందుకోసం ఓటర్ల కు రానుపోను ఖర్చులు చెల్లించడంతో పాటు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ముందుగానే అడ్వాన్స్లు కూడా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వార్డు కష్టాలు..మున్సిపాలిటీ పరిధిలో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అనేక మంది ఓటర్లు అద్దె నివాసాల్లో ఉంటూ వివిధ పనులకు వెళ్తుంటారు. వీరిలో చాలా వ రకు ఇళ్లు మార్చారు. కానీ ఓటు బదిలీ మాత్రం జరగకపోవడంతో పాత వార్డులోనే ఓట్లు ఉన్నాయి. వీ రిని వెతికేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. వార్డుల వారీగా బాధ్యులను నియమించారు. వారు ఏ ఓటరు ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారో తెలుసుకొని వారిని కలుస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థులే నేరుగా వెళ్లి కలుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. -
తారాస్థాయికి మున్సిపల్ ప్రచారం
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం జిల్లాలో తారాస్థాయికి చేరింది. ప్రచారానికి కేవలం ఒకే రోజు మిగిలి ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచార స్పీడు పెంచాయి. పక్కా ప్రణాళికతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు పుర ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జిల్లాస్థాయి నాయకులు ఇంటింటికీ ప్రచారం కొనసాగిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాలనీల్లో పలుకుబడి ఉన్న నాయకులతో ప్రచారం చేస్తున్నారు. పరస్పర విమర్శలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు జిల్లా ఇన్చార్జీలను నియమించి, రోజూవారీగా బలబలాల తీరుపై అంచనా వేస్తున్నారు. వార్డుల్లో మందు, విందుతో పాటు ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఆదివారం కొన్ని వార్డుల్లో అల్పహారంతో పాటు భోజనాలు ఏర్పాటు చేసి, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్గత పొత్తులపై దృష్టిజిల్లాలో ఆసిఫాబాద్లో 20, కాగజ్నగర్లో 30 వా ర్డులున్నాయి. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ 19, బీఆర్ఎ స్ 20, బీజేపీ 18, జనసేన 8, బీఎస్పీ 3, సీపీఎం 1 తో పాటు 22 మంది స్వతంత్రులు బరిలో ఉండగా, కాగజ్నగర్లో బీజేపీ 30, బీఆర్ఎస్ 30, కాంగ్రెస్ 29, బీఎస్పీ 8, జనసేన 2 స్థానాలతో పాటు 23 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు సంబంధం లేకుండా చైర్మన్కు స్ప ష్టమైన మెజార్టీరాని పక్షంలో తీసుకునే నిర్ణయాలపై గుట్టుగా సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది.అభ్యర్థుల్లో టెన్షన్పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుండగా, అంతకు ముందు 48 గంటల ముందు నుంచి ప్రచారానికి తెరపడనుంది. ప్రచారానికి కేవలం 24 గంటలే సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ఒక్కో వార్డుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారంతో పాటు నజరానాలు, తాయిలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్కు రెండు రోజుల ముందు నుంచే మద్యం దుకాణాలు మూసి వేయనుండడంతో అభ్యర్థులు మద్యం సమకూర్చుకుంటున్నారు. గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక ప్రచార రథాలతో కాలనీలు మైకులతో హోరెత్తిస్తున్నాయి. -
విద్యావ్యవస్థ బలోపేతానికే మద్దతు
ఆసిఫాబాద్రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సమస్యలపై విద్యార్థులు, నిరుద్యోగులతో ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం డిబేట్ నిర్వహించారు. జిల్లా విద్యా వ్యవస్థలో చాలా వెనుకబడి ఉందని, ఉద్యోగ అవకాశాలు లేక జిల్లా యువత అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు సంయుక్తంగా కృషి చేసి జిల్లాను విద్యారంగంలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. జిల్లాలో సాంకేతిక విద్య కోసం ఇంజినీరింగ్, ఐటీఐ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. యువత సమస్యలపై స్పందించి, నిరుద్యోగులకు అండగా నిలిచేవారికే ఓటు వేస్తామని పేర్కొంటున్నారు.గ్రంథాలయంలో పుస్తకాలతో పాటు కనీసం 10 కంప్యూటర్లు ఏర్పాటు చేయాలి. ప్రతీ జాబ్లో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంది. చదువుతో పాటు కంప్యూటర్పై అవగాహన ఉండాలి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, కన్జ్యూమర్ కోర్టు, సెషన్స్ కోర్డులు లేక ఆదిలాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే కోర్టులు ఏర్పాటు చేయాలి. – సాయికృష్ణ, ఎల్ఎల్బీ నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించాలంటే నిరుద్యోగులకు నూతన సాంకేతిక, పరిజ్ఞానం అవసరం. స్కిల్ పెంపొందించుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇవ్వాలి. గ్రూప్, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ అందించాలి. – శివ, టీటీసీ ఆదిలాబాద్ కోర్టులకు వెళ్తున్నాంస్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరం -
‘ప్రజల కోసం పోరాడే సీపీఎంను గెలిపించండి’
ఆసిఫాబాద్అర్బన్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఎం పార్టీ అభ్యర్థులను ము న్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించా లని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అనేక కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేవన్నారు. డ్రెయినేజీలు, రహదారులు సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో కాలనీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో సీసీఎం పార్టీ బరిలోకి దిగిందని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజన్న, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, ఆనంద్, కార్తీక్, టీకానంద్, మాలశ్రీ, రాజేందర్, 10వ వార్డు అభ్యర్థి భారత్జాడే, నాయకులు కృష్ణమాచారి, నిఖిల్, తిరుపతి, నైతం రాజు, నితిన్, రవిదాస్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాజుకు బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఫొటో ఫినాఎక్స్ పో ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఫొటో పరివార్ ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్–2026 వేడుకల్లో మంచిర్యాలకు చెందిన జక్కుల రాజుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ నిర్మాత భరద్వాజ్, ఫొటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి, ఎడిట్ పాయింట్ రమేశ్, ఫొటోగ్రఫీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాపల్లి శ్రీనివాస్ గౌడ్, కలర్స్ సతీశ్ చేతుల మీదుగా బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజును జిల్లా అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. అవార్డు అందుకుంటున్న రాజు -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
రెబ్బెన: దేశ వ్యాప్తంగా ఈనెల 12న చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, ఓబీ, కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు పాల్గొ ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఖైరిగూర ఓసీపీ ఓబీ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధి శ్రీనివాస నాయుడుకు సమ్మె నోటీస్ అందించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలు గా తయారుచేయాలని కార్పొరేటర్లకు అనుకూలంగా లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. వెంటనే లేబర్కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను తిరిగి అ మలు చేయాలన్నారు. సింగరేణిలో నూతన బొగ్గు బావులను ఓపెన్ చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనంగా రూ. 26వేలు చెల్లించా లని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి సింగరేణి యా జమాన్యమే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చె ల్లించాలని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఓబీ కార్మికులను పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఐటీ నుంచి మి నహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్ర భుత్వం అవలంభిస్తున్న ప్రైవేటీకరణ చర్యలను కా ర్మికులు పోరాటాలతో అడ్డుకోవాలన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు సాగర్గౌడ్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
రెబ్బెన: పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఖైరిగూర ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్ అన్నా రు. పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గోలేటి టౌన్షిప్లో ని భీమన్న స్టేడియంలో జిల్లాస్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశా రు. ఎస్సై వెంకటకృష్ణ, గోలేటి సర్పంచ్ అజ్మీ ర బాబురావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాసరావు, ఎంఈవో వెంకటేశ్వర్లుతో కలిసి క్రికెట్ పోటీలు ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్ర స్తుత కాలంలో విద్యార్థులకు చదువుతో పా టు నైతిక విలువలను పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలన్నారు. అనంతరం క్రీడాకారుల ను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి, టీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, నాయకులు ఉప్పల నరసింహాచారీ, జ్ఞానేశ్వర్, శ్రావణ్కుమార్, వినోద్కుమార్, శ్రీకాంత్, బత్తుల సదానందం, వెంకటేశ్వర్లు, ప్రకాశ్, యాదగిరి, వినేష్, రవి, వివిధ సంఘాల నాయకులు తిరుపతి, శ్రావణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహిస్తాం
కాగజ్నగర్రూరల్: మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తిరుపతి పేర్కొన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ‘సాక్షి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: పోలింగ్ బూత్లలో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు. కమిషనర్: ఓటర్లకు మంచినీరు, టెంట్, విద్యుత్ సౌకర్యాలను కల్పించాం. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాం. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో ముగ్గురు సభ్యులకు అదనంగా డ్యూటీలు కేటాయించాం. ప్రశ్న: ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారా? కమిషనర్: ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించాం. ప్రశ్న: ఎన్నికల కోడ్ ఉల్లంఘన, బెల్ట్షాపుల నిర్వహణపై ఏమైనా నిఘా పెట్టారా? కమిషనర్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రత్యేక నిఘా పెట్టాం. బెల్ట్షాప్లను నివారించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం. ప్రశ్న: అభ్యర్థుల ఖర్చుల వివరాల కోసం ప్రత్యేకంగా ఏమైనా బృందాలను కేటాయించారా? కమిషనర్: కౌన్సిలర్ అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ప్రత్యేకంగా ఆరుగురు సభ్యులతో ఒక టీం ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. ప్రశ్న: ఎన్నికల నిర్వహణ కోసం ఎంతమంది సిబ్బందిని కేటాయించారు. కమిషనర్: ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు 85 మంది పోలింగ్ అధి కారులతో పాటు ఒక్కో కేంద్రంలో మరో ముగ్గురు సిబ్బందిని కేటాయించాం. సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం. ప్రశ్న: పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలపై మీ వైఖరి ఏంటి? కమిషనర్: పట్టణంలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి పోలీసు ల సహకారంతో ఆయా ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నాం. రాత్రిళ్లు కూడా నిఘా పెట్టి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ రోజు మరింత కట్టుదిట్టం చేస్తాం. ప్రశ్న: పట్టణంలో ఎన్ని వార్డులు ఉన్నాయి. ఎన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. కమిషనర్: పట్టణంలో 30 వార్డులు ఉండగా, 85 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. -
బరిలో యువత
ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో యువత పోటీలో ఉన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేస్తామో మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నారు. వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చేందుకు ముందుడి పని చేస్తామని హామీ ఇస్తున్నారు. మొదటిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువతకు అవకాశం ఇవ్వాలని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పార్టీలు అవకాశం ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో గట్టి పోటీ..ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో యువత గట్టి పోటీని ఇవ్వనున్నారు. వార్డులోని యువతను ఏకంచేసి గెలుపు దిశగా ప్రచారం చేస్తున్నారు. వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్లు, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి యువత మెర్రే ఆకాష్ 3 వార్డు, తస్కిన్ 5వార్డు (బీటెక్), మోహన్ 2వ వార్డు, కార్తీక్, బాలకృష్ణ 4వ వార్డు, కాంగ్రెస్ నుంచి భీంరావు 1వ వార్డు, సాయి 3వ వార్డు, రాజ్కుమార్ 4వ వార్డు, రాపర్తి కార్తీక్ 11వ వార్డు, స్నేహ 13వ వార్డు, జనసేన నుంచి క్రాంతి కుమార్ 6వ వార్డు, పవన్ కళ్యాణ్ 9వ వార్డు, సాయి కిరణ్ 11వ వార్డు, సారిక 14వ వార్డు (బీజేపీ), కావ్య 7వ వార్డు (బీజేపీ), సోని 19వ వార్డు (స్వతంత్ర) నుంచి పోటీలో ఉన్నారు. -
పనిచేసే వారికే పట్టం
ఆసిఫాబాద్అర్బన్: నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. తమ కాలనీలను అభివృద్ధి చేసే వారికే పట్టం కడతామని ఈ సందర్భంగా పట్టణ వాసులు స్పష్టం చేస్తున్నారు. పార్టీలు ఏవైనా ఫర్వాలేదు కానీ ప్రజలకు సేవ చేసే మంచి నాయకుడికి తమ మద్దతు ఉంటుందని పేర్కొంటున్నారు. రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీరు, పారిశుద్ధ్య నివారణతో పాటు పలు కాలనీల్లో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, నూతనంగా ఎన్నికయ్యే కౌన్సిలర్లు పరిష్కరించాలని కోరుతున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన డిబేట్లో పాల్గొని పలువురు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
గుడ్టచ్ బ్యాడ్టచ్పై అవగాహన కల్పించాలి
చింతలమానెపల్లి: బాలికల సంరక్షణలో గుడ్టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించడం ఎంతో కీలకమని మహిళా సాధికారత కేంద్రం సమన్వయ కర్త శారద అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం, కేజీబీవీలో సర్పంచ్ మేకల పోచక్క అధ్యక్షతన మహిళలు, బాలికలకు అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేటీ బచావో, బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమాలను బాలికల సంరక్షణలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. జెండర్ స్పెషలిస్ట్ రాణి మాట్లాడుతూ బాలికలపై లైంగిక వేధింపుల కు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తారన్నారు. ఆర్థిక అక్షరాస్యత నిపుణుడు సాగర్ మాట్లాడుతూ సైబర్ క్రైం మోసాలు, రక్షణ మార్గాలు, సుకన్య సమృద్ధి యోజన పథ కం గు రించి వివరించారు. కార్యక్రమంలో చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి, సూపర్వైజర్లు అరుణ, కరుణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురా లు ప్రమీల, ఉపసర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పోరు రసవత్తరం
ఆసిఫాబాద్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్ర చార రథాలతో కాలనీల్లో రికార్డు చేసిన ఆడియోలతో మైకులు హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలు కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్ర ధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సారి మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతుండడంతో గెలుపుకోసం ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల ఇన్చార్జీలు వార్డుల్లో పర్యటిస్తూ గెలుపోటములపై బేరీ జు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పట్టు నిలుపుకేందుకు యత్నిస్తుండగా, మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ముందుకెళ్తోంది. మెజా ర్టీ కౌన్సిలర్ స్థానాలను దక్కించుకునేందుకు ప్రధా న పార్టీలు పోటీ పడుతున్నాయి. సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తుండగా గులాబీ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో వైఫల్యాలంటూ అధికార కాంగ్రెస్ను విమర్శిస్తూ ప్రచారం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఆపార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నేతల పర్యటనఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కాగజ్నగర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో 50 కౌన్సిలర్ స్థానాలుండగా యాభై శాతం మహిళలకు కేటాయించారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 10 వార్డులు మహిళలకు కేటాయించగా, కాగజ్నగర్లో 30 వార్డులుండగా 15 వార్డులు మహిళలకు కేటాయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మహిళలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భార్యలు బరిలో ఉన్న ప్రాంతాల్లో భర్తలతో పాటు కుటుంబసభ్యులు, సమీప బంధువులు ప్రచారం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, మాజీ అధ్యక్షుడు విశ్వ ప్రసాదరావు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి బీఆర్ఎస్ గెలుపుకోసం, బీజేపీ నేత వన్నేషన్ వన్ ఎలక్షన్ అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు తమపార్టీ చైర్మన్ స్థానం కై వసం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగజ్నగర్ బల్దియాపై కాంగ్రెస్ పట్టు నిలుపుకునేందుకు ఎమ్మెల్సీ దండె విఠల్, బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, బీఆర్ఎస్ గెలుపుకోసం మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కృషి చేస్తున్నారు. మిగిలింది రెండు రోజులేజిల్లాలో ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు రోజు లే మిగిలింది. పోలింగ్కు 48 గంటల ముందు ప్ర చారం నిలిపివేయనున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని 2,3,11 వార్డుల్లో ఎన్నికలు రసవత్తరంగా మారా యి. అభ్యర్థులను మచ్చిక చేసుకునేందుకు మద్యం, విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడం లేదు. గెలుపుకోసం అభ్యర్థులు, నేతలు పాట్లు పడుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ముందుగానే ప్రణాళికతో మద్యం బాటిళ్లు సమకూర్చుకుంటున్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ఆసిఫాబాద్: ప్రకృతి సిద్ధమైన వ్యవసాయాన్ని ప్రో త్సహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శనివా రం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. అధిక మోతాదులో యూరి యా, డీఏపీ వాడకం తగ్గించాలని సూచించారు. ప శువుల పేడ, ఇతర సేంద్రియ ఎరువులను వినియోగించి పంటలు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి, సహాయ సంచాలకులు మనోహర్, మిలింద్ కుమార్, ఏఈవోలు పాల్గొన్నారు. పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలిఆసిఫాబాద్రూరల్: పాఠశాలల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2024లో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద జిల్లాలో ఎంపికై న 720 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులు వందశాతం పూర్తి చేయాలన్నారు. గ్రామ సమాఖ్య భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణ ప నులను స్థానిక సర్పంచుల భాగస్వామ్యంతో త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదన పు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీవో దత్తరావు, డీటీడీవో రమాదేవి, డీఎంహెచ్వో సీతారాం, ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, ఈఈ ధర్మేందర్, విద్యాశా ఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలిరెబ్బెన: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్య మైన విద్యతో పాటు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. గంగాపూర్లో గల కేజీబీవీని తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పదోతరగతి విద్యార్థులను వార్షిక ప రీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. లక్ష్మీపూర్లో నర్సరీ నిర్వహణను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. తహసీల్దార్ సూర్యప్రకాష్, తదితరులు ఉన్నారు. ప్రారంభానికి సిద్ధం చేయాలిఆసిఫాబాద్రూరల్: క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసి ప్రారంభానికి సిద్దం చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆస్పత్రి పనులను పరిశీలించారు. -
ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు...
కాగజ్నగర్రూరల్: కొంతకాలంగా ఒకే పార్టీ లో ఉంటూ ఎడ మొహం, పెడ మోహంగా ఉంటున్న బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒకే వేదిక సాక్షిగా ఒక్కటయ్యారు. సర్సిల్క్కాలనీలో నిర్వహించిన ప్రచార సభలో వారిద్దరూ కరచాలనం చేసుకుని పక్కపక్కనే కూర్చున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా వీరిద్దరూ ఒక్కటి కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది. కాగజ్నగర్ మున్సిపాలిటీలో అధిక స్థానాలను గెలుచుకుని చైర్మన్ పదవి స్థానా న్ని బీఆర్ఎస్ ఖాతాలో జమ చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. -
పల్లెల్లో కుష్ఠు కలకలం!
చింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కుష్ఠు విస్తరిస్తుండడం కలకలం రేపుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 115 మంది బాధితులున్నట్లు వైద్యులు తెలిపారు. చింతలమానెపల్లి మండలంలోని ఓ గ్రామంలో 30మందికి కుష్ఠు సోకినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రేతో వ్యాప్తి చెందుతుంది. దీర్ఘకాలికంగా చికిత్స తీసుకోని రోగి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సన్నిహితంగా మెలిగేవారికి వ్యాధి సోకుతుంది. వ్యాధిగ్రస్తుడి తుంపర్ల ద్వారా క్రిములు గాలిలోకి చేరి ఇతరులకు సోకే అవకాశముంటుంది. సాధారణ స్పర్శ అంటే.. చేతులు కలపడం, కలిసి భోజనం చేయడం ద్వారా కుష్ఠు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. బాధితుల గుర్తింపునకు ‘స్క్రీనింగ్’ చర్మంపై తెల్లటి, ఎర్రటి మచ్చలు కనిపించడం.. మచ్చలున్న చోట స్పర్శ లేకపోవడం.. చేతులు, కాళ్లలో నొప్పి, మంటగా ఉండడం.. వేళ్లు వంకరగా మారడం లాంటివి వ్యాధి లక్షణాలు. వీటిని గుర్తిస్తే అనుమానించవచ్చు. వెంటనే ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలను సంప్రదించాలి. అక్కడ పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఉప కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అలాగే, వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం స్క్రీనింగ్ పరీక్షలు, ప్రత్యేక సర్వేలు చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రజల సహకారం అవసరం కుష్ఠు నివారణకు ప్రజల సహకారం అవస రం. వైద్యారోగ్యశాఖతో పాటు అన్ని శాఖల సిబ్బంది, అధికారులు కృషి చేయాలి. ఎక్కడైనా అనుమానిత లక్షణాలుంటే వైద్యసిబ్బందికి వారి సమాచారం ఇవ్వాలి. వ్యాధి సోకినవారు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. చికిత్స అందించేందుకు వైద్యులు అందుబా టులో ఉన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉ చితంగా మందులు అందజేస్తున్నాం. వైద్యశి బిరాలు నిర్వహించి బాధితులను గుర్తించడంతోపాటు చికిత్స చేస్తున్నాం. – సీతారాం, జిల్లా వైద్యాధికారి, కుమురంభీం ఆసిఫాబాద్ఇదీ.. జిల్లాలో పరిస్థితిజిల్లావ్యాప్తంగా కుష్ఠు విస్తరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరిగిన ట్లు చెబుతున్నారు. గ్రామీణ మండలాల్లో వ్యాధి విస్తరిస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో గతంలో ఒక గ్రామంలో తక్కువ సంఖ్యలో ఉన్న వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రస్తుతం 30కి చేరినట్లు సమాచారం. వ్యాధిపై అవగాహన లేకపోవడం, ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతోనే కుష్ఠు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. కుష్ఠు సోకిన వారిపై వివక్ష చూపే అవకాశం ఉండడంతో వ్యాధిగ్రస్తులు వివరాలు బహిర్గతం చేయడం లేదని వైద్యాధికారులు వెల్లడించారు. కానీ ఇది కూడా వ్యాధి మరింత విస్తరించేందుకు కారణమవుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి సీతారాం, వైద్య బృందం గ్రామాల్లో వ్యాధిగ్రస్తులు గుర్తింపునకు పరీక్షలు నిర్వహించారు. వ్యాధి తగ్గాలంటే తగిన సలహాలు, సూచనలు పాటించాలని, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అనుమానిత లక్షణాలుంటే ధైర్యంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. జిల్లాలో ఏపీఎంవో, డీపీఎంలను నియమించి చికిత్స అందిస్తున్నారు. కాగజ్నగర్, ఆసిఫా బాద్లో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. బాధితులతో ప్రజలు, సమాజం ఎలాంటి వివక్ష చూపకుండా అండగా నిలవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రకాశ్రావుతో కలిసి ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 9,057 ఇళ్లు మంజూరు చేయగా, 7,757 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. మిగిలిన 1,300 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు తెలుసుకున్నామన్నారు. పైలెట్ గ్రామాల్లో ఇళ్లు మంజూరు చేసి ఏడాది పూర్తయిందని, మార్చి 31 వరకు పనులు ప్రారంభించని వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులు వేగవంతం చేసి మార్చిలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందన్నారు. ఆధార్ సక్రమంగా లేకపోవడం, సాంకేతిక సమస్యలు, అటవీ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలిఆసిఫాబాద్రూరల్: కుట్టు మిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. జన్కాపూర్లో గల మండల సమైక్య భవనంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ కేంద్రం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 24,765 జతల ఏకరూప దుస్తులు కుట్టి అందించనున్నట్లు తెలిపారు. గడువులోగా యూనిఫాంలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆసిఫాబాద్: అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల వ్యయ పరిశీలకుడు దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అభ్యర్థులతో వ్యయ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఖర్చులను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. ఖర్చుల వివరాలను నిర్దిష్ట కాల పరిమితిలోగా సమర్పించాలన్నారు. ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహణ, రికార్డుల సంరక్షణ, ఖర్చుల పరిమితులపై అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఎన్నికల వ్యయ నోడల్ అధికారి నదీమ్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, మాస్టర్ ట్రైనర్ ఊషన్న, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. కాగజ్నగర్రూరల్: ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చుల వివరాలను సకాలంలో సమర్పించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు దేవేందర్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఖర్చుల పరిమితులు, ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహణ, రికార్డుల సంరక్షణపై అవగాహన కల్పించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
● కాలనీల్లో గడపగడపకూ వెళ్తున్న అభ్యర్థులు, నేతలు ● దావత్లతో ఓటర్లకు గాలం ● పుర పీఠం దక్కించుకునేందుకు భారీగా ఖర్చు
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు వాడవాడలా.. గడపగడపకూ ప్రచారం చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మందు, విందులతోపాటు దావత్లు ఇస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. సాయంత్రం వేళల్లో మద్యం బాటిళ్లతో విందులు జరుపుకొంటున్నారు. మహిళలు పోటీ చేస్తున్న చోట వారి భర్తలు, సోదరులు, బంధువులు ప్రచారం చేస్తుండగా, భర్తలు బరిలో నిలిచిన వార్డుల్లో భార్యలు, కుటుంబ సభ్యులతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు కార్యకర్తలు, అనుచరులను కూడా వెంట తిప్పుకోవాల్సి రావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. భోజనం, ప్రయాణం, మద్యం, ఇతర అవసరాలకు చేస్తున్న ఖర్చు హద్దులు దాటుతోంది. ఖర్చులు భరిస్తూ..ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 13,927 మంది ఓటర్లు, కాగజ్నగర్లోని 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తొలిసారి చైర్మన్ పీఠం కై వసం చేసుకునే దిశగా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు కొంతమంది ఇప్పటికే వార్డుల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను మచ్చిక చేసుకున్నారు. వారి ఖర్చులు కూడా భరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీసీ జనరల్, కాగజ్నగర్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలు చైర్పర్సన్ పీఠంపై గురి పెట్టారు. ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనలతో ప్రధా న పార్టీలు గోప్యంగా ప్రచారం చేసుకుంటున్నాయి. పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు మాత్రం ఏ మా త్రం వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేశాయి. కాలనీల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించారు. ఉదయం తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం సాయంత్రం వరకు వార్డులు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. కుటుంబ సమేతంగా గడపగడపకూ వెళ్తూ ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు. అధికార యంత్రాంగం సన్నద్ధంజిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ కె.హరిత పర్యవేక్షణలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లతో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కలెక్టర్ ఎన్నికల విభాగం అధికారులతో పలుసార్లు సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో 65,110 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా 113 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆసిఫాబాద్లో 28, కాగజ్నగర్లో 85 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 113 మంది పోలింగ్ అధికారులతోపాటు 20 శాతం అదనపు పీవోలతో 136 మందిని నియమించారు. ఆసిఫాబాద్లో 34 మంది, కాగజ్నగర్లో 102 మంది ఉన్నారు. 339 ఏపీవోలు 20 శాతం అదనపు ఏపీవోలతో 407 మందిని నియమించారు. వీరిలో ఆసిఫాబాద్లో 101 మంది, కాగజ్నగర్లో 306 మంది ఉన్నారు. 25 మంది రిటర్నింగ్ అధికారులు, 25 మంది ఏఆర్వోలను నియమించగా, ఒక్కో విభాగంలో ఏడుగురిని రిజర్వ్లో ఉంచారు. 13 మంది జోనల్ అధికారులను నియమించారు. 2 ఎఫ్ఎస్టీ, 4 ఎస్ఎస్టీలను నియమించారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
కౌటాల: మహిళల ఆర్థికాభివృద్ధే తమ లక్ష్యమని డీఆర్డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లోని మహిళా సంఘాల సభ్యులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించడానికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల అందిస్తున్నామన్నారు. రుణలక్ష్యాలను ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిరక్షరాస్యులైన మహిళలకు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా చదువు నేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏపీఎంలు వినేశ్, మోహన్లాల్, సిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్ర బలగాల్లో పల్లె కుర్రోళ్లు
పెంచికల్పేట్: కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు సాధించిన పెంచికల్పేట్ మండలంలోని పలు గ్రామా లకు చెందిన ఐదుగురు యువకులను శుక్రవారం ఎస్సై అనిల్కుమార్ స్థానిక పోలీస్టేషన్లో శాలు వాతో ఘనంగా సన్మానించారు. పోతపల్లి గ్రామాని కి చెందిన ఎల్కరి రాజశేఖర్ సీఐఎస్ఎఫ్, ఎల్లూర్ గ్రామానికి చెందిన దుర్గం కిరణ్ సీఆర్పీఎఫ్, దుర్గం చిరంజీవి సీఐఎస్ఎఫ్, రౌతు సంతోష్ సీఐఎస్ఎఫ్, పుల్గం ప్రవీణ్ సీఐఎస్ఎఫ్గా ఉద్యోగాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్సై మాట్లాడుతూ యువత వీరిని ఆదర్శంగా తీసుకొని పోలీసు ఉద్యోగ సాధనకు పాటుపడాలన్నారు. ప్రభుత్వ కొలువులు సాధించడానికి శ్రమించాలని సూచించారు. సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వేతనాలు మహా ప్రభో..
ప్రధాన డిమాండ్లు ఇవే..తిర్యాణి: మిషన్ భగీరథ(గ్రిడ్) పథకం కింద ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరాలో కాంట్రాక్టు కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ పథకంలో చాలీచాలని వేతనాలతో వీరు విధులు నిర్వహిస్తున్నారు. అవికూడా సక్రమంగా విడుదల చేయకపోవడంతో కుటుంబ పోషణకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే నిరవధిక సమ్మె బాట పట్టనున్నట్లు కార్మికులు స్పష్టం చేస్తున్నారు. త్వరలో వేసవి ప్రారంభం కానుండటంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు అందకపోతే తీవ్రమైన తాగునీటి కటకట ఏర్పడే ప్రమాదం ఉంది. ఇబ్బందుల్లో కార్మికులు..జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో కాంట్రాక్టు పద్ధతిలో వాల్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, సూపర్వైజర్లు, కూలీలుగా సుమారు 600 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. సూపర్వైజర్లకు రూ.15 వేలు, మిగిలిన వారికి రూ.13 వేల చొప్పున చెల్లిస్తున్నారు. వీరందరూ విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో బైక్ల్లో పెట్రోల్ పోయించుకోవడానికి కూడా డబ్బులు లేక అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ వేతనాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని పేర్కొంటున్నారు.పట్టించుకోవడం లేదు ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రతినెలా క్రమంతప్పకుండా వేతనాలు చెల్లించాలని పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అప్పు చేసి విధులకు హాజరవుతున్నాం. వెంటనే అధికారులు స్పందించాలి. – దుర్శెట్టి సతీశ్, మిషన్ భగీరథ కార్మికుడు త్వరలో ఆందోళనలు మిషన్ భగీరథలో కాంట్రా క్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించా లి. గ్రీన్ చానెల్ ద్వారా కనీ సం రూ.26 వేల వేతనం చెల్లించాలి. రెండు, మూ డు రోజుల్లో వేతనాలు విడుదల చేయకపోతే కార్మికులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం. – బోగే ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
జిల్లా కేంద్రంలో ఫ్లాగ్మార్చ్
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ నితిక పంత్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. 60 మంది పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఓటర్లకు భరోసా కల్పించా రు. ఎస్పీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సభాస్థలి పరిశీలన
కాగజ్నగర్రూరల్: మున్సిపల్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా శనివారం కాగజ్నగర్ ప ట్టణానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రానుండగా, సభాస్థలిని శుక్రవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పరిశీలించారు. మొద ట హనుమాన్ మందిర్ వద్ద సభను నిర్వహించాలని అనుకున్నా.. అనివార్య కారణాలతో మళ్లీ ఎస్పీఎం గ్రౌండ్కు మార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్పీఎం గ్రౌండ్లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సభకు నా యకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ సంకల్ప సభ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర సీఎం ప్రచారానికి వస్తున్నారని పేర్కొన్నారు. -
కఠినంగా కోడ్..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) రూపొందించింది. భారత రాజ్యాంగంలోని 243–కె, 243–జెడ్ఏ విభాగాల కింద స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఈ మార్గదర్శకాలు అమలు చేస్తోంది. అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా, పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ నియమావళి ఉపయోగపడుతుంది. ఎన్నికల్లో నేరాలు, అక్రమాలు, అవినీతి, వంచన, లంచగొండి తనం, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులను నివారించడం నిబంధనల లక్ష్యం. ఈ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటినుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తారు. నిబంధనలు ఇవే.. -
ఢిల్లీలో ఉపాధ్యాయుల ధర్నా
నిర్మల్రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన యాదవ్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని, జాతీయ విద్యా విధానం పునఃసమీక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, నాగభూషణ్, బాజారెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
దండేపల్లి: జన్నారం మండలం సింగరాయిపేటకు చెందిన బొజ్జిరావ్ అనే యువకుడిని గురువారం అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో యువకుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తాళ్లపేట రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కారణం లేకుండా ఎందుకు అదుపులోకి తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. బొజ్జిరావ్తో పాటు కొమ్ముగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్దకు అధికసంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తహసీనొద్దీన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి గిరిజనులు, అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ విషయమై తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావు మాట్లాడుతూ బొజ్జిరావ్ సింగరాయిపేట బీట్పరిధిలోని 345 కంపార్ట్ మెంట్లో 8 చెట్లను నరికాడని, పైగా గతంలో అటవీశాఖ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడని, సుధాకర్ గతంలో తానిమడుగు బీట్లో చెట్లునరికి తప్పించుకు తిరుగుతుండడంతో గురువారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి ఇద్దరి ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్రూరల్: మండలంలోని రాణాపూర్ గిరిజన పాఠశాల విద్యార్థులు సికిందర్, కృష్ణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు భూక్య రమేశ్ తెలిపారు. ఈ నెల 4న మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లిలో జరుగనున్న పోటీల్లో సదరు విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, జిల్లా క్రీడల అధికారి భూక్యా రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. జెట్టక్కను సాగనంపిన గ్రామస్తులుకడెం: ఊరు కీడు తొలగిపోయి, అంతా మంచే జరగాలని మండలంలోని సారంగపూర్ గ్రామస్తులు గురువారం జెట్టక్కను సాగనంపారు. పాత బట్టలు ధరించి, చీపుర్లు, చాటలతో నృత్యం చేస్తూ గ్రామ పొలిమేర దాటించారు. కా ర్యక్రమంలో సర్పంచ్ కోల తేజస్విని శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నమ్మించి మోసగించిన ఒకరికి పదేళ్ల జైలు ఆసిఫాబాద్రూరల్: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేశ్ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఆసిఫాబాద్కు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు బొమ్మెన ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగిసిన రోబోటిక్స్ శిక్షణమంచిర్యాలఅర్బన్: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో సోహం అకాడమీ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ (ఆర్ఐఏ) కార్యక్రమం గురువారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న 101 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, పాఠశాలకు రోబోటిక్స్ కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధి నవ్యశ్రీ, హెచ్ఎం రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధుల్లో ఉన్నారా?
నిర్మల్ఖిల్లా: ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులు దరఖాస్తు ఫారం–12కు ఎన్నికల విధుల ధ్రువీకరణపత్రాన్ని జతచేసి సంబంధిత మున్సిపాలిటీలో రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత సంబంధిత రిటర్నింగ్ అధికారి ఫారం–15, 16, 17, 18 పత్రాలను దరఖాస్తుదారులకు అందిస్తారు. వీటిలో ఫారం–15 ఓటర్ వివరాలతో కూడిన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సంతకం చేసి ఇవ్వాలి. దానిపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అవసరం. ఫారం–16 కవర్–ఏ లో పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇది తెలుపు రంగులో ఉండి దానిపై బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య ఉంటుంది. ఫారం–17 కవర్ బిలో రిటర్నింగ్ అధికారి చిరునామా ఉంటుంది. దీనిపై ఓటరు సంతకం చేసి అందజేయాల్సి ఉంటుంది. ఫారం–18లో ఓటరు తన ఓటుహక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేసే పూర్తి వివరాలు ముద్రితమై ఉంటాయి. సంబంధిత ఎన్నికల సిబ్బంది దరఖాస్తులు సమర్పించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ఆదిలాబాద్: రైల్వేలో మౌలిక సదుపాయాల కల్ప నకు కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, ఇందుకు అనుగుణంగా అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపడుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా క్రూలాబీ, రన్నింగ్ రూమ్, వంటశాలను నిర్మించినట్లు తెలిపారు. ఆయన వెంట నాందేడ్ డివిజన్ డీఆర్ఎం ప్రదీప్ కామ్లే, తదితరులు ఉన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేయాలి ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు గణేశ్ పాటిల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం ఉన్నారు. -
ఇంటికి చేరిన బండి దాదా
మందమర్రిరూరల్: సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శిగా పనిచేసి ఇటీవల అజ్ఞాతం వీడిన బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా బుధవారం రాత్రి మందమర్రి మూడోజోన్లోని తన ఇంటికి భార్య హేమతో కలిసి చేరుకున్నారు. 25 ఏళ్ల ఆజ్ఞాత వాసం, పదిపహేనేళ్ల జైలు జీవితం అనుభవించిన ఆయనను గురువారం ‘సాక్షి’తో పలు విషయాలు వెల్లడించారు. అనారోగ్య కారణాలతో అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇంటిస్థలం ఇవ్వాలని కోరుతున్నాడు. బండి ప్రకాష్ దంపతులు మందమర్రికి వచ్చిన విషయం తెలియడంతో అతని సన్నిహితులు, చిన్ననాటి మిత్రులు కలిసి గత స్మృతులు గుర్తు చేసుకున్నారు. -
కుమురం భీం
7‘నిర్వహణ’ గాలికేనా? నిర్ణీతకాలం పాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లు సక్రమంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 9లోu ప్రణాళికతో చదవాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వందశాతం ఫలితాల సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. 9లోu ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. పగలు వేడిగా, రాత్రి చల్లగా ఉంటుంది. తెల్లవారుజామున చలి ప్రభావం పెరుగుతుంది. శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 -
సమయపాలన పాటించకుంటే చర్యలు
ఆసిఫాబాద్: సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదా యంలో గల పలు ప్రభుత్వ కార్యాలయాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆబ్కారీ, పౌర సరఫరాలు, వ్యవసాయ, భూగర్భజలాలు, మత్స్య, వైద్యారోగ్య, విద్య, భూకొలతల శాఖల కార్యాలయాలను సందర్శించారు. హాజరు రిజిస్టర్లు పరిశీ లించి గైర్హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది డిప్యూటేషన్పై పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. హాజరైన అధికారులు సైతం రిజిస్టర్లో సంతకం చేయకపోవడాన్ని గుర్తించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగై న సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఇక నుంచి విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐఎఫ్ఎస్ అధికారి భార్గవ్కుమార్ ఉన్నారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలిమున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో ఉంటాయని, ప్రతీ అంశంపై అవగహన ఉండాలన్నారు. పీవో డైరీలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలని, రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని జోనల్ అధికారులకు నివేదించాలని ఆదేశించారు. సామగ్రి, బ్యాలెట్ పత్రాలను సరిచూసుకోవాలన్నారు. కార్యక్రమంలో సాధారణ ఎన్నికల పరిశీలకుడు అలోక్కుమార్, ఆర్డీవో లోకేశ్వర్రావు, ట్రెయినీ ఐఎఫ్ఎస్ అధికారి భార్గవ్కుమార్, పీవోలు, ఏపీవోలు, మాస్టర్ ట్రైయినర్లు పాల్గొన్నారు. -
ఖర్చుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ఎన్నికల పరిశీలకుడు దేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, వీడియో సర్వేయలెన్స్, సీఎంసీ బృందాలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని, రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సరైన అనుమతి పత్రాలు పరిశీలించాలన్నారు. అనుమతి పత్రాలు లేకుంటే నగదు సీజ్ చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిఘా పెట్టాలని, పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రచార ప్రకటనలు, ప్రసార సాధనాల్లో వచ్చే చెల్లింపు వార్తలపై ప్రతిరోజూ నివేదికలు అందించాలన్నారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు నిల్వ వివరాలు, అమ్మకాల నివేదికలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో లైజనింగ్ అధికారి నదీమ్ తదితరులు పాల్గొన్నారు. -
సామగ్రి పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను గురువారం సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలకు సమర్థవంతంగా సామగ్రి పంపిణీ చేయాలన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, నీడ, విద్యుత్ సరఫరా, కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని సూచించారు. సీసీ కెమరాలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎన్నికల విభాగం సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ప్రగతికే పట్టం!
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ మున్సిపాలి టీలో సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రత్యేక జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా ఆశించిన అభివృద్ధి కానరావడం లేదు. పట్టణంలో 20 వార్డుల్లో సుమారు16 వేల జనాభా ఉంది. బల్దియాకు ఏటా రూ.కోటి కి పైగా ఆదాయం సమకూరుతోంది. అయినా కాలనీల్లో సదుపాయాలు మెరుగుపడటం లేదు. ముఖ్యంగా డ్రెయినేజీలు, సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తొలి సారి ఎన్నికలు జరుగుతున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పట్టణ ప్రగతికి కృషి చేసేవారికే పట్టం కడతామని పట్టణవాసులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పిల్లల పార్క్లో గురువారం ఉదయం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన డిబేట్లో వాకర్స్ మున్సిపల్ పరిధిలోని సమస్యలను ఏకరువు పెట్టారు. పట్టణ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. నూతనంగా కొలువుదీరే పాలకవర్గాలు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని వారు కోరారు. ‘సాక్షి’ డిబేట్లో పాల్గొన్న వాకర్స్ వైద్యసేవలు మెరుగుపర్చాలి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపర్చాలి. ముఖ్యంగా డెంటల్ సేవలు అందడం లేదు. రూ.కోట్లు వెచ్చించి ఆధునికీకరించినా స్థానికులకు ఉపయోగపడటం లేదు. ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యులను నియమించాలి. – సొన్నాయిల శంకర్, విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ -
మనమే టాప్..
రెబ్బెన: బొగ్గు ఉత్పత్తిలో బెల్లంపల్లి ఏరియా దూసుకుపోతోంది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా ‘బెల్లంపల్లి’ లక్ష్య సాధనలో ముందుంది. మరోవైపు బొగ్గు రవాణాలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 54 రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. వార్షిక లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఏరియా ఒక్కసారి మాత్రమే వందశాతం వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగా.. గతేడాది కేవలం 3 శాతం తగ్గింది. కానీ ఈసారి ఎలాగైనా లక్ష్యాన్ని అధిగమించాలని సింగరేణి అధికారులు చర్యలు చేపడుతున్నారు. పెరుగుతున్న ఉత్పత్తి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అర్ధ వార్షికం వరకు ఉత్పత్తి మందగించినా.. ఆ తర్వాత నాలుగు నెలలుగా బెల్లంపల్లి ఏరియా ఉత్పత్తిలో ముందు వరుసలో ఉంది. ఏరియాలో ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీలో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోంది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మిగిలిన ప్రాంతాలతో పోల్చితే బెల్లంపల్లి ఏరియాలోని బొగ్గు గనుల ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదవుతుంది. గతేడాదితో పోల్చితే ఈసారి అత్యధికంగా వర్షాలు పడ్డాయి. దాదాపు 50 రోజులకు పైగా ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యం 35 లక్షల టన్నులుగా నిర్ణయించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో ఉత్పత్తి లక్ష్యం కాస్త తగ్గించి.. మిగిలి న కాలంలో పెంచుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. వర్షాలు పడే నాలుగు నెలలు నెలవారీ లక్ష్యాన్ని 2 లక్షలు, మిగిలిన నెలల్లో 3.5లక్షలుగా నిర్ణయించారు. అయితే సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నెలలో కేవలం 37 శాతం ఉత్పత్తి సాధించగలిగారు. తర్వాత నుంచి వానలు తగ్గుముఖం పట్టడంతో వేగం పెంచారు. అక్టోబర్ నుంచి జనవరి వరకు ప్రతినెలా వందశాతం లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ప్రారంభంలో వార్షిక ఉత్పత్తి సాధన 87 శాతం ఉండగా.. ప్రస్తుతం 96 శాతం ఉంది. రవాణాలో భేష్ బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తితోపాటు రవాణాలోనూ భేష్ అనిపించుకుంటోంది. రవాణాలో గుండెకాయగా మారిన గోలేటి సీహెచ్పీ రికార్డులు నమోదు చేస్తోంది. బెల్లంపల్లి ఏరియా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనవరి 28న ఒక్కరోజే ఏకంగా ఆరు రేకుల (24,014 టన్నులు) బొగ్గు రవాణా చేసి కొత్త రికార్డు నెలకొల్పారు. ఏరియా గరిష్ట బొగ్గు రవాణా ఇప్పటి వరకు కేవలం 5 రేకులు మాత్రమే. ఇప్పటికే గోలేటికి కంపెనీ వ్యాప్తంగా ఉత్తమ సీహెచ్పీగా పేరుంది. తాజాగా మరోసారి రికార్డులకెక్కింది. ఖైరిగూర ఓసీపీలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును యాజమాన్యం లారీల ద్వారా గోలేటి సీహెచ్పీ వరకు సరఫరా చేశారు. అక్కడి నుంచి రైలుమార్గం ద్వారా వినియోగదారులకు సకాలంలో నాణ్యమైన బొగ్గును తరలిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియా 27,91,337 టన్నుల బొగ్గును సరఫరా చేసింది.2025–26లో బెల్లంపల్లి బొగ్గు ఉత్పత్తి వివరాలు (లక్షల టన్నుల్లో) నెల టార్గెట్ సాధించింది శాతంఏప్రిల్ 3.50 2.74 78 మే 3.50 3.04 87 జూన్ 2.00 2.62 131 జూలై 2.00 2.00 100 ఆగస్టు 2.00 1.36 68 సెప్టెంబర్ 2.00 0.74 37 అక్టోబర్ 3.00 3.03 101 నవంబర్ 3.50 3.53 101 డిసెంబర్ 3.50 3.92 112 జనవరి 3.50 4.30 123 ఐదేళ్లలో ఏరియా సాధించిన వార్షిక ఉత్పత్తి(లక్షల టన్నుల్లో) సంవత్సరం టార్గెట్ సాధించింది శాతం2021–22 33.50 24.42 73 2022–23 35.00 29.20 83 2023–24 36.50 37.50 103 2024–25 38.50 37.50 97 2025–26 35.00 27.29 96 (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) -
7న కాగజ్నగర్కు మహారాష్ట్ర సీఎం
కాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7న కాగజ్నగర్ పట్టణానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రానున్నారు. పాత హనుమాన్ దేవాలయం వద్ద సభాస్థలిని గురువారం ఎస్పీ నితిక పంత్ పరిశీలించారు. హెలిప్యాడ్ను పరిశీలించి భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, ిసీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి ఉన్నారు. సభాస్థలికి ఎమ్మెల్యే హరీశ్బాబు భూమిపూజ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా హాజరుకానున్న సభాస్థలి వద్ద గురువా రం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు భూమిపూజ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల కు పట్టణంలోని పాత హనుమాన్ దేవాలయం వద్ద సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రజలు కాషాయ జెండా వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షు డు శివకుమార్, నాయకులు శ్రవంతబాయి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామానికో సమైక్య భవనం
కెరమెరి: స్వయం సహయక మహిళా సంఘాలకు గ్రామాల్లో ప్రత్యేక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పక్కా భవనాలు మంజూరు చేసింది. వీబీ జీ రామ్ జీ(జాతీయ ఉపాధి హామీ పథకం) నిధులతో ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించింది. పొదుపు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వర్క్ షెడ్లుగా, మహిళా సంఘాల అవసరాలకు వినియోగించనున్నారు. వర్క్ షెడ్లలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టడం, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగించనున్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు సొంత భవనాలు లేకపోవడంతో గ్రూపు సభ్యుల ఇంటి వద్ద, ఆరు బయట, చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కా భవనాలతో వారి సమస్య పరిష్కారం కానుంది. మార్చి 31 నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. స్థలాల ఎంపికకు తీర్మానంజిల్లాలోని 15 మండలాల పరిధిలో 386 వీవోలు ఉన్నాయి. 885 ఎస్హెచ్సీల పరిధిలో 93,895 మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇందులో 222 వీవోలకు పక్కా భవనాలు మంజూరయ్యాయి. గ్రామైక్య సంఘాల భవనాల కోసం స్థలాల ఎంపిక దాదాపుగా అన్ని మండలాల్లో పూర్తయ్యింది. సొంత భవనాల నిర్మాణం కోసం స్థలాల కోసం పంచాయతీలు తీర్మానం చేసి మండల పరిషత్ ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ పంపించాయి. ప్రభుత్వ స్థలాలు, శిఖం భూములు, దాతలు అందించే స్థలాలను గుర్తించారు. స్థలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పంచాయతీ భవనాలపైన మొదటి అంతస్తుగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 240 నుంచి 300 గజాల వరకు స్థలాలను కేటాయించాలని సూచించింది. ఇప్పటికే పలుచోట్ల భూమిపూజ కూడా చేశారు. మండలాల్లో ఆహార నిల్వ కేంద్రాలుగ్రామీణ సమాఖ్య భవనాలతోపాటు 15 మండలాల్లో ఆహార నిల్వ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. రైతులు పండించిన పంటలను ఈ కేంద్రాల్లో భద్రపర్చుకోవచ్చు. బియ్యం, పప్పులు పాడవకుండా నిల్వ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. తేమ లేని వాతావరణం, పురుగు మందు వినియోగం ద్వారా నష్టాన్ని తగ్గించాలని ఒక్కో మండలానికి ఒక భవనం మంజూరు చేశారు. నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.30 లక్షలు కేటాయించారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా స్థల సేకరణ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఆసిఫాబాద్ మండలంలో రౌట సంకేపల్లి గ్రామం పంచాయతీలో ఆహార నిల్వ కేంద్రం నిర్మించనుండగా.. కాగజ్నగర్లో జగన్నాథ్పూర్, పెంచికల్పేట్లో బొంబాయిగూడ, రెబ్బనలో గంగాపూర్, తిర్యాణిలో గోయగాం పంచాయతీల్లో నిర్మిస్తుండగా, మిగిలిన పది మాత్రం మండల కేంద్రాల్లోనే నిర్మించనున్నారు. వీటికి జిల్లాలో మొత్తం రూ.4.50 కోట్ల ఉపాధిహామీ నిధులు వెచ్చించనున్నారు. ఎంతో ఉపయోగకరం జిల్లాలో 222 గ్రామ సంఘాలకు, 15 మండలాల్లో ఆహా ర నిల్వ కోసం పక్కా భవనాలు మంజూరయ్యాయి. గ్రామ సంఘ భవనాల్లో మ హిళలు సమావేశాలు, కుట్లు ఇతర పనులు నిర్వహించుకోవచ్చు. రైతులు పండించిన ఆహార ధా న్యాల నిల్వ కోసం ఆహార నిల్వ కేంద్రాలను విని యోగించుకోవచ్చు. మార్చి 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించాం. – దత్తారావు, డీఆర్డీవో -
బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏజీఎం ఫైనాన్స్గా విధులు నిర్వర్తిస్తున్న మురళీధర్ కార్పొరేట్ ఏరియాకు బదిలీ అయ్యారు. బుధవారం అడ్మిన్ భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్టీపీపీ జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ ఆయనను శాలువాలతో సత్కరించారు. మురళీధర్ ఎస్టీపీపీకి అందించిన సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఎంవోఐ ప్రెసిడెంట్ పంతుల, డీజీఎంలు అజాజుల్ల ఖాన్, శివ ప్రసాద్, వేణు గోపాల్, పర్సనల్ డీజీఎం కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
విధుల నుంచి సీఆర్పీ తొలగింపు
ఆదిలాబాద్టౌన్: విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడాన్ని ప్రస్తావిస్తూ ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఆర్పీ’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవో ఎస్.రాజేశ్వర్ స్పందించారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్న పి.రవీందర్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈవో సమర్పించిన నివేదిక ప్రకారం సదరు ఉద్యోగి ఓ రాజకీయ పార్టీలో చేరడమే కాకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లుగా వివరించారు. -
గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నెన్నెల: మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పాటి, బోగంపల్లిలకు రోడ్డు నిర్మాణంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి కిషన్ అన్నారు. ఎంపీడీవో అబ్దుల్హైతో కలిసి బుధవారం గ్రామాలను సందర్శించారు. అక్కడి ప్రజలు ఈ నెల 2న కలెక్టర్ కుమార్దీపక్ను కలిసి రోడ్డు నిర్మించాలని, గిరివికాస్ బోర్లకు కరెంట్ కనెక్షన్లు, సాగులో ఉన్న వారికి పోడు పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామాలను సందర్శించిన అధికారులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణం, గిరివికాస్ బోర్లకు కరెంట్ కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పనుల్లో హాజరుశాతం పెంచాలని సూచించారు. వారి వెంట మన్నెగూడం సర్పంచ్ బానోతు మధుకర్, ఏపీఓ నరేష్, గిరిజన నాయకులు కొడిపె శంకర్ తదితరులు ఉన్నారు. -
అమ్మో.. బూచోళ్లు..!
దారి తప్పుతున్న బాల్యం మైనర్లు లైంగికదాడులు, నేరాలకు పాల్పడడం ఆందోళన కలిగించే అంశం. నేరాలు పెరగడానికి కుటుంబ విలువలు పడిపోవడం, మానవత్వం విలువలు తెలియకపోవడం కారణాలుగా మారుతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లోని తాత, నానమ్మ, అమ్మమ్మ ఎదుగుతున్న పిల్లలకు విలువలు తెలియజేసేవారు. మారుతున్న జీవనశైలీలో పాశ్చాత్య, యాంత్రీక జీవన విధానంతో పిల్లలకు మంచీ చెడు చెప్పేవారు కరువయ్యారు. ఆలోచనలు పరిమితమై అవగాహన కోసం ఆస్పత్రులు, పాఠశాలలపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్న మగపిల్లలకు మంచీ చెడు వివరించే వారు లేక మైనర్లుగా ఉన్నప్పటి నుంచే నేరాలకు పాల్పడుతున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల చింతలమానెపల్లి మండలంలో అఘాయిత్యానికి పాల్పడిన బాలుడు(16) దారి తప్పి జులాయిగా తిరుగుతున్నట్లు తెలిసింది. ఎదిగే పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తల్లిదండ్రులు వృత్తి, ఉద్యోగాల నిర్వహణలో వారిని పట్టించుకోకుండా ప్రోగ్రెస్ రిపోర్టు పరిశీలించి సరిపెట్టడంతో ఇతర విషయాలకు ప్రభావితం అవుతున్నారు. 14 నుంచి 16ఏళ్లలోనే మద్యం, మత్తు పదార్థాల వ్యసనాలకు లోనై నేరాలకు పాల్పడుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన అవసరం పిల్లల భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది. లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేందుకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 202320242022చిన్నారులపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన లేకపోవడం, ప్రలోభాల ఆశచూపి లైంగికదాడులకు పాల్పడడం అవగాహన లేమిని సూచిస్తున్నాయి. మరోవైపు మైనర్ బాలురు అఘాయిత్యాలకు పాల్పడడం భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలో ఓ మైనర్ బాలుడు బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు రూ.10 ఆశచూపి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత ఏడాది ఏప్రిల్లో దహెగాం మండలంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. తల్లిదండ్రులు, సమాజం చిన్నారుల భద్రతపై సరైన చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. – చింతలమానెపల్లికుమురంభీం జిల్లాలో పోక్సో కేసుల వివరాలు మైనర్లు అయినా చట్టాలు కఠినమే.. చట్టం ప్రకారం 18ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. కానీ తీవ్రమైన నేరాలకు పాల్పడిన సందర్భంలో చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవు. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో పోక్సో వంటి కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడితే బాలుడికి 16 సంవత్సరాలు ఉన్నప్పటికీ అడల్ట్గానే గుర్తిస్తారు. దీని ప్రకారమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. -
ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమే
ఆసిఫాబాద్అర్బన్: క్యాన్సర్, క్షయ వంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమేనని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ 2.0లో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ విస్తరించకుండా వైద్యారోగ్యశాఖ, మహిళాశిశు సంక్షేమశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 128 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అనంతరం సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డేవిడ్, శిక్షణ ఐఎఫ్ఎస్ అధికారి భార్గవ్కుమార్, డీఎంహెచ్వో సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. చిత్తడి నేలల గుర్తింపుతో ఆక్రమణకు అడ్డుకట్ట ఆసిఫాబాద్: చెరువులను చిత్తడి నేలలుగా గుర్తించి, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో చిత్తడి నేలల గుర్తింపుపై డీఎఫ్వో నీరజ్కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, కాగజ్నగర్ ఎఫ్బీవో అప్పయ్య, ట్రెయినీ ఐఎఫ్ఎస్ భార్గవ్కుమార్తో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూర్ చెరువును చిత్తడి నేలగా గుర్తించడం ద్వారా ఆక్రమణకు గురికాకుండా కట్టడి చేశామన్నారు. నీటి సామర్థ్యం పెంచడం ద్వారా సాగునీరు, పశువులకు తాగునీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. తిర్యాణి మండలం చెలిమెల ప్రాజెక్టును చిత్తడి నేలగా గుర్తించి, అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీవో భిక్షపతి, డీఏవో వెంకటి, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, ఇరిగేషన్ ఈఈలు గుణవంత్రావు, ప్రభాకర్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ఇంద్రవెల్లి: విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై సాయన్న తెలిపిన వివరాల మేరకు మండలంలోని దనోరా(బి) గ్రామానికి చెందిన మదురే అక్షయ్ (30), అదే గ్రామానికి చెందిన పసరే ఆకాష్ గౌరపూర్ శివారులోని ఓ రైతు వ్యవసాయ చేనులో బెల్టుషాపు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు 11 కేవీ వైర్లకు కొండీల ద్వారా విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాష్ సమాచారంతో గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బాసర గోదావరిలో మృతదేహం లభ్యంబాసర: బాసర గోదావరిలో యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. తానూర్ మండలంలోని దాగా గ్రామానికి చెందిన పీకలకర్ బాలాజీ (34) మద్యానికి బానిసై మానసిక స్థితి కోల్పోయాడు. ఈనెల 1న ఇంటినుంచి బయటకు వెళ్ళి తిరిగిరాలేదు. బుధవారం గోదావరినదిలో మృతదేహం గుర్తించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు భోజన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
సాత్నాల: యువత మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని జైనథ్ సీఐ శ్రావణ్ అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా బుధవారం బేల మండలంలోని సైద్పూర్లో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. సీఐ మా ట్లాడుతూ ప్రజలు, యువత గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల ని సూచించారు. మహిళలను గౌరవించాలని, గృహహింస చర్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, బేల ఎస్సై ఎల్.ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పొర్లు దండాలతో పోడు రైతు నిరసన
ఖానాపూర్: అటవీశాఖ అధికారులు తన ఎడ్ల జతను నిర్భందించడాన్ని నిరసిస్తూ మండలంలోని తర్లపాడుకు చెందిన పోడు రైతు భూమన్న బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపాడు. కొన్ని దశాబ్దాలుగా సాగులో ఉన్న తన భూమిలో అట వీశాఖ అధికారులు జేసీబీతో గుంతలు తవ్వి మొక్కలు నాటడంతో పాటు అక్రమంగా పోడుభూమి సా గు చేసుకుంటున్నానని తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. గత నెల 21న తీసుకువచ్చిన ఎడ్లను ఇప్పటికీ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఆటల్లో గెలుపోటములు సహజం
ఆదిలాబాద్: ఆటల్లో గెలుపోటములు సహజమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్, ఆర్చరీ ఫైనల్ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడినవారు కృంగిపోకుండా క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొని, విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతీ క్రీడాకారుడు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించే దిశగా పాటుపడడమే కాకుండా సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు. -
వేర్వేరు చోట్ల కలప పట్టివేత
ఇచ్చోడ: పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అక్రమంగా తరలిస్తున్న ఫర్నీచర్ను బుధవారం పట్టుకున్నట్లు సిరిచెల్మ టైగర్ జోన్ అటవీశాఖ అధికారి నాగవత్ స్వామి తెలిపారు. ఉట్నూర్ మండలంలోని వడోని గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ దయానంద్ కలపతో తయారు చేసిన ఫర్నీచర్ను ఐచర్ వ్యాన్లో తరలిస్తుండగా నిర్మల్ జిల్లాలోని మొండిగుట్ట చెక్ పోస్టు వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో దయానంద్ అనే పోలీసు కానిస్టేబుల్ వాడోని గ్రామంలో అక్రమంగా టేకు చెట్లు నరికి ఫర్నీచర్ తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీంతో కానిస్టేబుల్ స్వగ్రామంలో తనిఖీలు నిర్వహించగా మరింత కలప లభ్యమైందన్నారు. తనిఖీల్లో దాదాపుగా రూ.2.5 లక్షల కలపను స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బోథ్: మండలంలోని నిగిని గ్రామ పరిధిలో బుధవారం రూ.22,268 విలువైన కలపను పట్టుకున్న ట్లు ఎఫ్ఆర్వో ప్రణయ్కుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన బొజ్జ సురేష్, మడావి బాపురావు ఇళ్లల్లో సోదాలు చేయగా కలప లభ్యమైనట్లు పేర్కొన్నారు. అక్రమంగా అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తున్న షేక్ మొయిన్ వద్ద నుంచి రూ.2,479 విలు వైన కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో అటవీ శాఖ సిబ్బంది అనిల్, గోవింద్, ఎఫ్ఎస్వో ముమ్తాజ్, నాగోరావు పాల్గొన్నారు. తలమడుగు: మండలంలోని కుచులాపూర్లో బుధవారం కలప పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన రమేశ్ ఇంట్లో తనిఖీ చేయగా రూ.50 వేల విలువైన కలప లభ్యమైందన్నారు. కలపను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ గులాబ్సింగ్, ఆర్ఓ ప్రమోద్ కుమార్, బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్, శరత్రెడ్డి, పాల్గొన్నారు. గుడిహత్నూర్: మండలంలోని ముత్నూర్లో బుధవారం అక్రమంగా నిల్వఉంచిన రూ.20 వేల విలుౖ వెన కలపను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఎఫ్ఎస్వో ఇమ్రాన్, ఎఫ్బీవోలు ప్రశాంత్, విశ్వజిత్ ముత్నూర్ గ్రామానికి చెందిన గాటాడే దశరథ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కలప దుంగలు లభ్యం కావడంతో స్వాధీనం చేసుకొని ఇచ్చోడ టింబర్ డిపోకు తరలించి దశరథ్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
దహెగాం: ఉపాధిహామీ పథకంలో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో దత్తారావు అన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద దహెగాం మండలంలో రూ.7.96 కోట్లతో చేపట్టిన పనులపై నాలుగు రోజులుగా గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం సభ్యులు తనిఖీల అనంతరం గ్రామ సభల్లో వివరాలు సేకరించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం 15వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు నగదు రికవరీ చేస్తామన్నారు. మండల వ్యాప్తంగా 432 పనులకు రూ.7.96 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 24 పంచాయతీల్లో నిర్వహించిన తనిఖీ నివేదికలను సభ్యులు చదివి వినిపించారు. పలు పంచాయతీల్లో పనికి వెళ్లకున్నా కూలీలకు డబ్బులు చెల్లించడం, పనుల రికార్డులు సక్రమంగా లేకపోవడం, నాటిన మొక్కలను సంరక్షించకపోవడం, కూలీల సంతకాలు లేకపోవడం వంటి తప్పిదాలను గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన మండల కేంద్రానికి చెందిన టీఏ రాజేశ్పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు టీఏలు, ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రూ.25 వేలు జరిమానా వేయడంతోపాటు రూ.1.62 లక్షల నగదు రికవరీకి ఆదేశించారు. నలుగురు మేట్లను తొలగిస్తున్న ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్టీఏ వేణు, ఎస్ఆర్పీ రవియాదవ్, అంబుడ్స్ పర్సన్ సాయిశ్రీ, క్యూసీ రమేశ్, పీఆర్ఏఈ ఆత్మారాం, ఏపీవో కల్పన తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దండేపల్లి: ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాలలో నిర్వహించిన సబ్ జూనియర్ వాలీబాల్ ఎంపిక పో టీల్లో దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉ న్నత పాఠశాల విద్యార్థులు వినయ్, అక్షిత, ప్ర సన్న అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎంఈవో, పాఠశాల హెచ్ఎం మంత్రి రాజు తెలిపారు. ఈ నెల 5 నుంచి ని జామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సదరు వి ద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. కోలిండియా హాకీ పోటీలకు ఎంపిక శ్రీరాంపూర్: కోలిండియా హాకీ పోటీలకు ఎంపికై న సింగరేణి జట్టులో శ్రీరాంపూర్ క్రీడాకారులకు చోటు దక్కింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బి లాస్పూర్లో ఈ నెల 4, 5 తేదీల్లో జరుగనున్న కోలిండియా హాకీ పోటీలకు ఎస్సార్పీ ఓసీపీకి చెందిన ఈపీ ఆపరేటర్ తోట సురేశ్, సెక్యూరిటీగార్డులు ఈర్ల సదయ్య, అగ్గి నాగరాజు, జీ నరేందర్ (కోల్ కట్టర్, ఆర్కే 7), బెల్లం తిరుపతి (జనరల్ అసిస్టెంట్, ఎస్సార్పీ ఓసీపీ), జీ. శ్రీకాంత్(ఎంవీ డ్రైవర్, ఐకే ఓసీపీ), ఎల్.రాజేశ్(కోల్ కట్టర్, ఆర్కే 7) ఎంపికయ్యారు. రైల్వేస్టేషన్లో మైనర్ బాలిక గుర్తింపుఆదిలాబాద్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పదిహేనేళ్ల మైనర్ బాలికను జీఆర్పీ పోలీసులు బుధవారం గుర్తించారు. మధ్యాహ్నం సమయంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తిరుగుతున్న బాలికను పోలీసులు గుర్తించి వివరాలు అడగగా హైదరాబాద్లోని సురారం, గండిమైసమ్మ ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. అనంతరం పునరావాసం కోసం జిల్లా చైల్డ్ హెల్ప్లైన్ అధికారులకు అప్పగించినట్లు తెలి పారు. బాలికను గుర్తించిన జీఆర్పీ పోలీసులు టి.ప్రభాకర్, భగవాండ్లు, కె.ప్రవీణ్ కుమార్ను పలువురు రైల్వే సిబ్బంది అభినందించారు. కోతుల దాడిలో మహిళకు గాయాలుబాసర: బాసర ఆలయంలో ఎన్ఎంఆర్గా విధులు నిర్వహిస్తున్న గోదావరిపై బుధవారం కోతులు దాడి చేశాయి. ఆలయ పరిసరాలు శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కోతులు దాడి చేయడంతో సదరు మహిళకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాసర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సదరు మహిళపై కోతులు దాడి చేయడం ఇది రెండోసారి. ఆలయ పరిసరాల్లోంచి కోతులను తరలించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. -
బాలురకు సైతం అవగాహన కల్పించాలి
బాలికలు, అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పిస్తున్నాం. దీంతోపాటు తప్పుగా ప్రవర్తిస్తే జరిగే పరిణామాలను బాలురు, అబ్బాయిలకు సైతం వివరిస్తున్నాం. అదుపు తప్పి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు, శిక్షలను బాలురకు తగిన వయసులో వివరించాలి. మైనర్లు అయినా నేరాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. – బూర్ల మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి పిల్లలపై పర్యవేక్షణ ఉండాలి నేటి పరిస్థితుల్లో చిన్నారులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో బాలికలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాని లైంగిక దాడుల బారిన పడకుండా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు అనే విషయంలోనూ స్పష్టత ఉండాలి. ఇంటి చుట్టుపక్కల వివాదాస్పద, మత్తు వ్యసనాలకు లోనైన వ్యక్తులు ఉంటే వారి వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి. డబ్బులు, బహుమతులు వంటి వాటికి ప్రలో భాలకు గురికాకుండా పిల్లలు, టీనేజీ అమ్మాయిలకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ కుటుంబాల్లో చాలామంది పిల్లలను ఇంటి వద్దే ఉంచి తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తగిన బాధ్యత కలిగిన వారి పర్యవేక్షణలో చిన్నారులు ఉంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా చూడవచ్చు. – కవిత అజయ్, మానసిక వైద్య నిపుణులు -
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యమని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం రెండోరోజూ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో అమలు చేయాలని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, ఏటీడీవో చిరంజీవి, రిసోర్స్పర్సన్లు కృష్ణ, నారాయణమూర్తి, రాజేంద్ర ప్రసాద్, గణపతి తదితరలు పాల్గొన్నారు. -
ఒకే కుటుంబం.. ఒకే పార్టీ
సెర్ల విజయ, 13వ వార్డు(బీజేపీ అభ్యర్థి)దూడల అశోక్, 10వ వార్డు(బీఆర్ఎస్ అభ్యర్థి)దూడల లక్ష్మి, 16వ వార్డు(బీఆర్ఎస్ అభ్యర్థి)సెర్ల(ఎగ్గె) సారిక, 14వ వార్డు(బీజేపీ అభ్యర్థి)ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ ఎన్నికలు పలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఆయా కాలనీల్లో స్థానికంగా మంచి పేరున్న కుటుంబాల నుంచి అభ్యర్థులను బరిలో దింపాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తల్లీకూతుర్లు, భార్యాభర్తలు పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది. 13వ వార్డు నుంచి సెర్ల విజయ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండగా, ఆమె కుమార్తె సెర్ల(ఎగ్గె) సారిక 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పదో వార్డు నుంచి దూడల అశోక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, అదే పార్టీ నుంచి 16 వార్డు అభ్యర్థిగా ఆయన భార్య దూడల లక్ష్మి బరిలో నిలిచారు. ఒకే పార్టీ ఒకే కుటుంబానికి వేర్వేరు వార్డుల్లో అవకాశం కల్పించగా, ప్రజల సేవకై పోటీలో నిలిచినట్లు అభ్యర్థులు తెలిపారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ అన్నారు. ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డీఎం రాజశేఖర్కు సమ్మె నోటీసులు అందించారు. ఆయన మాట్లాడుతూ వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, వృద్ధిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020 కార్మికులు పోరాడి సాధించుకున్న హ క్కులను నీరుగారుస్తాయని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు దివాకర్, లక్ష్మణ్, ప్రవీణ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
కాగజ్నరగ్టౌన్: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. పట్టణంలోని బాలవిద్యామందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూం, కౌంటింగ్ హాళ్లను బుధవారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డిప్యూటీ ఈఈ రమాదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారం.. పరుగు
ఇంటింటా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పజిల్లా కేంద్రంలోని ఆరోవార్డులో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలువార్డు నం.16లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుఆసిఫాబాద్: బరిలో ఉన్న అభ్యర్థులు తేలడంతో మున్సిపల్ ప్రచార వేడి పెరిగింది. నేతలు పట్టణాల్లోని ప్రతీ కాలనీకి.. గడపగడపకూ వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ తరుణంలో ఇన్నాళ్లూ అంటిముట్టనట్లు ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం ఒకటవుతున్నారు. కలహాలు పక్కన పెట్టి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతూ ప్రచారం చేస్తున్నారు. చేతులు కలిపిన కాంగ్రెస్ నేతలు తొలిసారి ఎన్నికలు జరిగే జిల్లా కేంద్రం ఆసిఫాబాద్పై పట్టు నిలుపుకొనేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్నమొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉన్న జిల్లా కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఎన్నికల వేళ ఒక్కటై ప్రచారం చేస్తున్నారు. బుధవారం అధికార పార్టీ నేతలు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, ఇతర నేతలు జన్కాపూర్, దస్నాపూర్, బజార్వాడీతోపాటు పలు కాలనీల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ముఖ్య నేతలంతా కలిసి ప్రచారంలో పాల్గొనడం స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.రంగంలోకి ముఖ్యనాయకులుకాగజ్నగర్రూరల్: ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ముఖ్యనాయకులు రంగంలోకి దిగారు. కాగజ్నగర్ పట్టణంలో బుధవారం అన్ని పార్టీల నుంచి నేతలు ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. ఓటర్లతో అప్యాయంగా మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థించారు. రెండు రోజుల క్రితం మెదక్ ఎంపీ రఘునంద్నావు, ఆధ్యాత్మిక వేత్త రాధామనోహర్దాస్లు కాగజ్నగర్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. గురువారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పట్టణంలోని ఓల్డ్కాలనీ, కాపువాడ, సర్దార్బస్తీ, సంజీవయ్య కాలనీల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. మిగితా పార్టీల అభ్యర్థులు కూడా ముఖ్య నేతలతో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇంటింటా ప్రచారం వార్డు నం.14, 27 అభ్యర్థులు చిమ్మని రేణుక, జవజి కవితలకు మద్దతుగా ఎమ్మెల్సీ దండె విఠల్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, కాగజ్నగర్ మున్సిపాలిటీలో డ్రెయినేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు 3, 4, 10, 12, 16, 26, 28 వార్డుల్లో పర్యటించారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని, బీజేపీ అభ్యర్థులకు మద్దతు పలకాలని విన్నవించారు. యూఐడీఎఫ్ కింద రూ.18.70 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చామని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాగునీటి వసతి కోసం కేంద్ర ప్రభుత్వ రూ.35 కోట్లు కేటాయించిందని తెలిపారు. 18, 28 వార్డుల్లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వార్డు నం.29 లో ప్రచారం చేశారు.సమయం తక్కువగా ఉండటంతో ప్రచారం పరుగులు పెడుతోంది. ఆయా వార్డుల్లో పర్యటిస్తూ కుల సంఘాలు, మహిళలు, యువత మద్దతుతో గంపగుత్తగా ఓట్లు తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా తటస్తులను తమవైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా, వాట్సాప్ను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో అభ్యర్థి సొంత ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్ల మద్దతు పొందుతున్నారు. అధికార పార్టీకి దీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పాగా వేసేందుకు బీజేపీ వన్ ఎలక్షన్, వన్ నేషన్ జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు పావులు కదుపుతున్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
ఆసిఫాబాద్అర్బన్: ప్రశాంత వాతావరణంలో ము న్సిపల్ ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల సాధారణ పర్యవేక్షకుడు అలోక్కుమార్ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవా గు తీరంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు, ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు వద్ద ఉన్న చెక్పోస్టును బుధవారం నోడల్ అధికారి అశ్వక్ అహ్మద్తో కలిసి తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్పోస్టులోని సిబ్బంది ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో లైజనింగ్ అధికారి ప్రణయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
బోధన సాగాలి.. భవిష్యత్ మెరవాలి
ఆసిఫాబాద్రూరల్: ఉన్నత చదువులు చదివి రోగులకు సేవలందించాలని నర్సింగ్ కోర్సులో చేరిన విద్యార్థినులు పడరాని పాట్లు పడుతున్నారు. గతేడాది డిసెంబర్లోనే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. పలు ఘటనల అనంతరం బుధవారం నుంచి మొదలయ్యాయి. మరోవైపు వ్యక్తిగత పనులు చేయించుకోవడం, వేధింపుల ఆరోపణలతో ప్రిన్సిపాల్ను ఈ నెల 1న కలెక్టర్ సస్పెండ్ చేయడం కలకలం రేపింది. వైద్యారంగాన్ని మరింత మెరుగుపర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో వైద్యకళాశాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే జిల్లాకు వైద్యకళాశాలతో పాటు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల మంజూరైంది. 2024 డిసెంబర్ 2న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్లో నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ క్రమంలో 2025– 26 విద్యాసంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్(నాలుగేళ్ల కోర్సు)లో 60 సీట్లకు 58 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ప్రస్తుతం సెకండియర్ విద్యార్థినులు 39 మంది ఉన్నారు. ప్రిన్సిపాల్పై వేధింపుల ఆరోపణలు బైపీసీ పూర్తిచేసిన వివిధ ప్రాంతాలకు చెందిన వి ద్యార్థులు బీఎస్సీ నర్సింగ్లో చేరారు. అయితే బాలి కలతో ప్రిన్సిపాల్ వ్యక్తిగత పనులు చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉండగా, ఎలాంటి టైం టేబుల్ పాటించలేదని తెలుస్తోంది. బట్టలు ఉతికించడం, గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, వీధి కుక్క పిల్లలకు పాలు తాగించడం వంటి పనులు చేయించేవారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఓ విద్యార్థినిని కుక్క కాటు వేయడంతో భయంతో ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. బోధన సిబ్బందికి సైతం ఇతర పనులు అప్పగించారని తెలుస్తోంది. గత డిసెంబర్ నుంచి తరగతులు ప్రారంభం కా వాల్సి ఉంది. కానీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే కనీసం బోధన కొనసాగలేదని సమాచారం. కలెక్టర్ దృష్టికి చేరడంతో ఈ నెల 1న కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేధింపుల విషయాన్ని సీరియస్గా తీసుకుని ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశారు. విద్యార్థినులకు ఇబ్బందులు రానీయొద్దు ఆసిఫాబాద్రూరల్: నర్సింగ్ విద్యార్థినులకు ఇబ్బందులు రానీయొద్దని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. హాస్టల్ వసతి, తరగతి గదులు, మరుగుదొడ్లు, మెస్పాటు బోధన, హాజరు శాతం తదితర వివరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సక్రమంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రేమ్కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. బోధన సిబ్బంది కొరతప్రస్తుతం మొదటి సంవత్సరంలో 60 మందికి 58 మంది, ద్వితీయ సంవత్సరంలో 60 మంది 39 మంది మొత్తం 97 మంది విద్యార్థినులు ఉన్నారు. 24 బోధన సిబ్బంది ఉండాల్సి ఉండగా, కేవలం ఐదుగురితో నెట్టుకువస్తున్నారు. 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కళాశాలలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అసోసియెట్ ప్రొఫెసర్, బోధన సిబ్బంది 21 మంది ఉండాలి. ఇదే వసతి గృహంలో ప్రభుత్వ వైద్యకళాశాలకు చెందిన 50 విద్యార్థినులకు సైతం వసతి కల్పించారు. వారందరికీ సరిపడా మరుగుదొడ్లు, గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తరగతులు సక్రమంగా నిర్వహిస్తాం విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా సక్రమంగా తరగతులు నిర్వహిస్తాం. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధన తరగతులను బుధవారం నుంచి ప్రారంభించాం. విద్యార్థినులకు అన్ని సౌకర్యాలతో కూడిన బోధన అందిస్తాం. – ప్రేమ్దాస్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల -
సమ్మె నోటీసు అందజేత
కౌటాల: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నామని మంగళవారం మండ ల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ని ఆశవర్కర్లు అధికారులకు సమ్మె నోటీసు అందించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ ఆశవర్కర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా రెగ్యులర్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశా రు. నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు, నిబంధనలు రద్దు చేయాలని, ఆశవర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశవర్కర్లు అనిత, మోగ్రా, రాజేశ్వరి, సునీత, అర్చన, నిర్మల, చంద్రకళ, జ్యోతి, నవీన తదితరులు పాల్గొన్నారు. -
వెనక్కి తగ్గని రెబెల్స్
రెండు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో కాంగ్రెస్ నుంచి మెంగ్రె మోహన్, వైరాగడే గోవిందు కాంగ్రెస్ టికెట్లు ఆశించగా పార్టీ అధిష్టానం మెంగ్రె మోహన్కు బీఫాం ఇచ్చింది. దీంతో వైరాగడే గోవిందు రెబెల్గా బరిలో నిలిచారు. 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సాయికి బీఫామ్ దక్కగా.. అప్పటి వరకు టికెట్ ఆశించిన తపాసె శ్రీనివాస్ రెబెల్గా బరిలో ఉన్నారు. అలాగే 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది రాపర్తి రవీందర్కు టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ టికెట్ ఆశించిన రామగిరి సంగీత సైతం బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ 11వ వార్డు అభ్యర్థి రాపర్తి రవీందర్ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో అదే వార్డులో రెబెల్గా ఉన్న సంగీతను ఉపసంహరించుకోవాలని పార్టీ నేతలు నచ్చజెప్పినప్పటికీ వెనక్కి తగ్గలేదు. చివరికి బరిలో నిలిచేందుకే మొగ్గు చూపారు. 10వ వార్డులో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఓయూ జేఏసీ నాయకుడు అనిల్కుమార్ తన తల్లి కామ్రె భాగ్యలక్ష్మిని బరిలో నిలిపారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కాగజ్నగర్టౌన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని కౌసర్నగర్ మసీద్ నుంచి బాలాజీనగర్ బోర్డు మీదుగా రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు పలు వీధుల గుండా మంగళవారం పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించా రు. ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 11న జరిగే ము న్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు చేపతున్నామని తెలిపారు. బెదిరింపులకు పాల్పడడం, అక్రమ రవాణా చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, ప్ర చారాలు నిర్వహించొద్దన్నారు. డబ్బులు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్ర యత్నాలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో నాలుగు చెక్పోస్టులు ఏ ర్పాటు చేసి, సమస్యాత్మక వార్డులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు సుధాకర్, చంద్రశేఖర్, సందీప్కుమార్, కల్యాణ్, రాజు, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. -
అటవీ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు
పెంచికల్పేట్: మండలంలోని గుండెపల్లిలో అటవీశాఖ అధికారులను మంగళవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కిచెన్ షెడ్ నిర్మాణానికి గ్రామస్తులు భూమిపూజ చేసి పునాది పనులు ప్రారంభించారు. సోమవారం రాత్రి అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో పనులు చేపడుతున్నారని పునాది కూల్చివేశారు. ఉద యం గ్రామానికి వచ్చిన అటవీశాఖ అధికారులను గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికి ది గారు. ఏళ్లుగా నివాసం ఉంటున్న గ్రామంలో అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అటవీశాఖ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామని సర్దిచెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. -
మందకొడిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్
దహెగాం: దేశాభివృద్ధిలో అన్నదాతల ప్రాముఖ్యత గుర్తించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల మాదిరిగానే వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో భాగంగా ఆధార్ తరహాలోనే పదకొండు అంకెలతో కూడిన యూనిక్ ఫార్మర్ ఐడీ కేటాయిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఐదు నెలలైనా రైతుల వివరాల నమోదు 50శాతం దాటలేదు. సంక్షేమ పథకాలకు తప్పనిసరి..జిల్లాలోని 15 మండలాల్లో 1,16,552 మంది రైతులు పట్టా పాస్పుస్తకాలు కలిగి ఉన్నారు. 59,392 మంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోగా, 58,921 మందికి ఐడీ క్రియేట్ అయ్యింది. పీఎం కిసాన్ వంటి ఇతర కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. క్లస్టర్ల వారీగా ఏఈవోలు రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. జనవరి 29 వరకు జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ 50.96 శాతమే పూర్తయ్యింది. జైనూర్, కౌటాల, లింగాపూర్, సిర్పూర్(యు), తిర్యాణి మండలాల్లో మాత్రమే 60 శాతానికి చేరుకుంది. మిగతా మండలాలు కెరమెరిలో 50 శాతం పూర్తికాగా, బెజ్జూర్, సిర్పూర్(టి), వాంకిడి, పెంచికల్పేట్, ఆసిఫాబాద్, కాగజ్నగర్, దహెగాం, రెబ్బెన, చింతలమానెపల్లి మండలాల్లో సగం కూడా దాటలేదు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించకపోవడంతోనే ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలురైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమీ పంలో ఉన్న ఏఈవోలు, మీసేవ కేంద్రాల వద్దకు వెళ్తుండగా.. వారికి అనేక సాంకేతిక సమస్యలు ఎ దురవుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఓటీపీ సమయానికి రాకపోవడం, రైతులకు ఫోన్లు లేకపోవడం, ఉన్నా ఆధార్ లింకు కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఒకే రైతుకు రెండుచోట్ల భూమి ఉండడం, భూమి ఉన్న వారు స్థానికంగా లేకపోవడం, మరణించిన వారి పేరుపై భూమి ఉండి కుటుంబ సభ్యులు విరాసత్ చేయించుకోకపోవ డం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసా య అధికారులు చెబుతున్నా రు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ వివరా ల నమోదుకు ప్రస్తుతం తుది గడువు లేదని, వచ్చే పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతా ల్లోకి జమ చేసే ముందు గడు వు పెట్టే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఉపయోగాలు ఇవే..ఫార్మర్ రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డు, పట్టా పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్ లింకు అయిన మొబైల్ నంబర్తో స్థానిక ఏఈవోలను సంప్రదించాలి. అలాగే మీసేవ కేంద్రాల్లో సైతం రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకసారి ఐడీ పూర్తయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చు. పీఎం కిసాన్ సాయం పొందేందుకు ఐడీ తప్పనిసరి చేశారు. ఒకే ఐడీ ఉండడం ద్వారా లబ్ధిదారుకు నేరుగా బ్యాంకు ఖాతాలోకి ఆర్థికసాయం అందిస్తారు. బీమా, రాయితీలు, రుణాలు, పథకాలు త్వరగా అందుతాయి. భవిష్యత్తు పథకాల ప్రయోజనాలు స్పష్టమైన గుర్తింపుతో పక్కదారి పట్టే అవకాశం ఉండదు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ వివరాలు(జనవరి 29 వరకు)మండలం పట్టా పాసుపుస్తకం రిజిస్ట్రేషన్ శాతం జైనూర్ 3,914 2,728 69.70 కౌటాల 7,547 5,111 67 లింగాపూర్ 2,586 1,746 67 సిర్పూర్(యు) 3,423 2,162 63 తిర్యాణి 6,920 4,153 60 కెరమెరి 4,607 2,585 56 బెజ్జూర్ 8,483 4,175 46 సిర్పూర్(టి) 7,147 3,516 49 వాంకిడి 9,085 4,352 47 పెంచికల్పేట్ 5,688 2,718 47 ఆసిఫాబాద్ 11,965 5,619 46 కాగజ్నగర్ 12,920 5,853 45 దహెగాం 12,357 5,180 41 రెబ్బెన 12,073 5,056 41 చింతలమానెపల్లి 7,837 3,206 40 -
ఇక సమరమే..!
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీల నాయకులు చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులను పోటీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లోని 50 వార్డుల నుంచి 290 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 66 మంది ఉపసంహరించుకున్నారు. మొత్తంగా రెండు బల్దియాల్లో 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపసంహరణ పర్వం ముగియడంతో అభ్యర్థులు సమరానికి సిద్ధమవుతున్నారు. బుధవారం నుంచి ప్రచారంలో వేగం పెంచనున్నారు. ఆసిఫాబాద్లో 94 మంది..ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 120 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 26 మంది ఉపసంహరించుకున్నారు. 94 మంది బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 19 మంది, బీఆర్ఎస్ 20 మంది, బీజేపీ 18, జనసేన 08, బీఎస్పీ ముగ్గురు, సీపీఐ ముగ్గురు, సీపీఎం ఒకరు, 22 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. 19వ వార్డులో కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. మొత్తంగా ఒక్కో వార్డులో సగటున నలుగురు, ఐదుగురు పోటీ పడుతున్నారు. అత్యధికంగా 11వ వార్డులో ఎనిమిది మంది బరిలో ఉండగా, వార్డు 3, 4, 12, 19లో అత్యల్పంగా ముగ్గురి మధ్యే పోటీ ఉంది. 08, 14 వార్డుల్లో ఏడుగురు, 09, 18 వార్డుల్లో ఆరుగురు, 1, 10, 13, 15, 21 వార్డుల్లో ఐదుగురు, 2, 5, 6, 7, 16, 17 వార్డుల్లో నలుగురు చొప్పున పోటీ పడుతున్నారు. కాగజ్నగర్లో 130 మందికాగజ్నగర్ మున్సిపాలిటీలోని 30 వార్డులకు మొత్తం 170 మంది 230 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 40 మంది పోటీ నుంచి తప్పుకోగా, 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి రోజు 34 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల తుది జాబితాను బల్దియా అధికారులు మంగళవారం విడుదల చేశారు. వార్డు నంబర్ 10లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. అధికార పార్టీ ఉంచి అభ్యర్థిని మున్సిపల్ బరిలో నిలుపకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల నుంచి కూడా ఇక్కడ అభ్యర్థులు పోటీలో లేరు. అతి తక్కువ మంది పోటీపడుతున్న వార్డుగా పదో వార్డు నిలిచింది. అలాగే వార్డు 11, 14, 17, 21, 26, 29లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. వార్డు నం.4, 7, 25, 27 వార్డుల్లో అత్యధిక మంది పార్టీ అభ్యర్థులతోపాటు స్వతంత్రులు బరిలో నిలిచారు.వారమే గడువుబరిలో ఉన్న అభ్యర్థులు తేలడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. పోలింగ్కు కేవలం వారం రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం అభివృద్ధి పనులపై హామీలు గుప్పిస్తున్నాయి. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి.పార్టీల వారీగా అభ్యర్థుల వివరాలు మున్సిపాలిటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ జనసేన సీపీఐ/సీపీఎం ఎంఐఎం స్వతంత్రులు/ఇతర పార్టీలు ఆసిఫాబాద్ 19 20 18 3 8 4 0 22 కాగజ్నగర్ 20 30 30 8 2 2 3 26 -
చిత్తడి నేలగా ‘బొక్కివాగు’
పెంచికల్పేట్: పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యాటక అభివృద్ధి, పక్షుల సంరక్షణకు ప్రభుత్వం చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 152 చెరువులు ఉండగా పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూర్ బొక్కివాగు ప్రాజెక్టు(చెరువు)ను అధికారులు చిత్తడి నేలగా గుర్తించారు. ఇరిగేషన్, అటవీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధికి సంయుక్త కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సర్పంచ్ చప్పిడే రవి ఆధ్వర్యంలో పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. వలస పక్షులకు ఆవాసంఎల్లూర్ గ్రామ సమీపంలో బొక్కివాగుపై 2012లో 2,500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 132 ఎకరాల్లో 2.6196 ఎంసీయూబీ సామర్థ్యంతో చెరువు నిర్మించారు. ఎల్కపల్లి, పెంచికల్పేట్ గ్రామాలకు చెందిన రైతులు చెరువు నీటితో వర్షాకాలం, యాసంగిలో పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు చెరువులో ఏడాదంతా నీటి లభ్యత ఉండటంతో శీతాకాలంలో అరుదైన విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. చెరువును ఆవాసంగా మార్చుకుంటున్నాయి. తమ సంతతిని వృద్ధి చేసుకుని వేసవి ప్రారంభంలో తిరిగి సొంత ప్రదేశాలకు తరలివెళ్తున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా పెంచికల్పేట్ రేంజ్లో అధికారులు ప్రత్యేకంగా బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అరుదైన పక్షి జాతులను గుర్తిస్తున్నారు. చెరువును చిత్తడి నేలగా గుర్తించడంతోపాటు పక్షుల సంరక్షణ కేంద్రంగా అధికారులు గుర్తించాలని నిర్ణయించిన నేపథ్యంలో పక్షి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలకు అడ్డుకట్ట..వేసవిలో చెరువులో నీటి సామర్థ్యం తగ్గిన సమయంలో కొంత మంది శిఖం భూములను సాగు చేస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మరో అరుదైన పక్షి జాతులు సంచరిస్తున్న నేపథ్యంలో పలువురు పక్షులను వేటాడుతున్నారు. ప్రభుత్వం చిత్తడి నేలగా గుర్తించిన నేపథ్యంలో ఆక్రమణలకు అడ్డుకట్ట పడి అరుదైన పక్షులకు సంరక్షణ కేంద్రంగా మారనుంది. చెరువు సంరక్షణకు చర్యలు రైతులకు సాగు నీటిని అందించాలనే సంకల్పంలో ప్రభుత్వం బొక్కివాగు చెరువును నిర్మించింది. చెరువు నిర్మాణానికి రైతుల నుంచి 132 ఎకరాల భూమి సేకరించాం. హద్దులు ఏర్పాటు చేసి చిత్తడి నేలగా గుర్తింపు ప్రక్రియలో సహకారం అందిస్తాం. – డి.తిరుపతి, తహసీల్దార్, పెంచికల్పేట్పక్షుల సంరక్షణ కేంద్రంగా.. పెంచికల్పేట్ రేంజ్ పరిధిలో అరుదైన విదేశీ పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. బొక్కివాగు చెరువులో అనేక పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. చిత్తడి నేలగా గుర్తించడంతోపాటు అరుదైన పక్షుల సంరక్షణ కేంద్రంగా చెరువు మారనుంది. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్అభివృద్ధికి అంచనాలు బొక్కివాగు ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి అంచనాలు తయారు చేస్తున్నాం. ఇటీవల రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పంచాయతీ పాలకవర్గంతో సమావేశం నిర్వహించాం. గ్రామస్తుల సహకారంతో పర్యాటక ప్రాంతంగా రూపొందించడానికి నివేదికలు తయారు చేసి అధికారులకు అందిస్తాం. – ప్రభాకర్రావు, ఇరిగేషన్ ఈఈచెరువులో బ్లాక్ హెడెడ్ ఐబిస్ పక్షులు -
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీ క్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని ఆదేశించా రు. గిరిజన విద్యాభివృద్ధికి అంకిత భావంతో పని చేయాలన్నారు. ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, ఏటీడీవో చిరంజీవి, రిసోర్స్పర్సన్లు కృష్ణ, నారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్, గణపతి తదితరలు పాల్గొన్నారు. -
రోగులతో మర్యాదగా మెలగాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రులకు ఎక్కువగా సామాన్యులు, ఆదివాసీ గిరిజనులు వస్తుంటా రని, వైద్యసిబ్బంది వారితో మర్యాదగా మెలగాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలోని వార్డులు, విభాగాలను పరిశీలించి, రోగులను అడిగి వైద్యసేవలపై ఆరా తీశారు. రక్త నిల్వల గదిని పరిశీలించి వైద్యులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన భోజనం, శుద్ధమైన తాగునీటిని అందించాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి పర్యవేక్షకుడు ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుభోద్కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం’
కాగజ్నగర్టౌన్: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ప్రచారంలో భాగంగా కాగజ్నగర్ మున్సిపాలిటీలోని ఎస్పీఎం సమీపంలో గల ప్రజాకార్యాలయం, ఓల్డ్కాలనీ, బాలాజీనగర్లో సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల సభలకు హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ఉన్నారని, మున్సిపల్ ఛైర్మన్గా కూడా బీజేపీ అభ్యర్థినే గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల పాలనలో మున్సిపాలిటీని పట్టించుకోకుండా కబ్జాలు, మట్కా, మాఫియా, ఇసుక దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదిస్తే మరిన్ని నిధులు మంజూరు చేయించుకుందామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, ఆయా వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు. -
పరిమితి దాటితే ప్రమాదమే..
కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన కస్తూరి రమేశ్, అతడి భార్య సునీత(45), కుమార్తె అక్షిత(21)తోపాటు గ్రామానికి చెందిన మరికొందరు, బంధువులు మొత్తం 25 మంది జనవరి 27న ట్రాక్టర్లో మేడారం జాతరకు బయలుదేరారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి– కేశవాపూర్ అటవీ ప్రాంతంలో రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. తల్లీకుమార్తెలు సునీత, అక్షిత ట్రాలీ కింద పడి ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. ఇలా జిల్లాకు చెందిన ప్రజలు పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కౌటాల: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఓ వైపు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రమాదమని తెలిసినా జాతరలు, శుభకార్యాలకు ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. చౌక ప్రయాణమని లారీలు, ట్రాక్టర్లు, బొలెరో, వ్యాన్లు ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రైవేట్పైనే ఆధారంమేడారం మహా జాతరకు జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివెళ్లారు. అలాగే జిల్లాలో ఇతర జాతరలు, ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. సరిహద్దులోని మహారాష్ట్రలో జరిగే వేడుకులకు జిల్లా ప్రజలు హాజరవుతుంటారు. వేలాది భక్తులు ఒకేసారి వెళ్తుండడంతో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో చాలామంది చౌకగా వస్తున్న ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని యజమానులు కూడా జాగ్రతలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రజలను తరలిస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం ఫిట్నెస్ లేని వాహనాలను వినియోగిస్తున్నారు. అధిక లోడు, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రమాదాలు జరుగుతున్నాయి. శుభకార్యాలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినా అవగాహన లేక జిల్లాలో చాలామంది వినియోగించుకోవడం లేదు. ఆగని ప్రమాదాలు..రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అధికారులు రోడ్డు నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా శుభకార్యాలు, జాతరలకు ప్రైవేట్ వాహనాలను వినియోగిస్తున్నారు. వాహనాల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలను కిక్కిరి ఎక్కిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ 29న చింతలమానెపల్లి మండలం కోయపెల్లి గ్రామం సమీపంలో శుభకార్యానికి వెళ్లి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరి గాయాలయ్యాయి. ట్రాక్టర్ అదుపు తప్పి కిందపడటంతో తొమ్మిది మంది ట్రాలీ కింద చిక్కుకున్నారు. స్థానికులు పోలీసుల సాయంతో వారిని రక్షించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో సర్వసాధారణంగా మారాయి. అయినా సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టి జరిమానాలు విధించడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పలు జాతరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలపై అధికారులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం వద్దు వాహనం నడిపే సమయంలో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండొద్దు. అతివేగం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి వెళ్తే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నిబంధనలు పాటించని ప్రైవేట్ వాహనాల యజమానులపై చర్యలు తీసుకుంటాం. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్నగర్ రెండేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలుసంవత్సరం ప్రమాదాలు మృతులు గాయాలు 2024 133 60 63 2025 267 60 74 -
డిజిటల్ బోధనతో మెరుగైన ఫలితాలు
ఆసిఫాబాద్రూరల్: డిజిటల్ బోధనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ షీ ట్స్, డాక్స్పై అవగాహన కల్పించారు. ఆయ న మాట్లాడుతూ జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలల్లో ఐసీటీ, ఏఐ ద్వారా విద్యాబోధన చే యాలన్నారు. ల్యాప్టాప్లు, ట్యాబ్లు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో రిసోర్స్పర్సన్లు జమున దాస్, సదానందం, సమ్మయ్య, రంజిత్ రాజ్, చంద్రయ్య, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ఆసిఫాబాద్రూరల్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వినోదను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కె.హరిత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశా ల, వసతి గృహాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 29 నుంచి ప్రిన్సిపాల్ ముందస్తు అనుమతి లేకుండా కళాశాలకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. డిసెంబర్ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇప్పటివరకు తరగతులు నిర్వహించలేదన్నారు. వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. -
కాగజ్నగర్లో ఇదీ పరిస్థితి..
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీల్లోని 30 వార్డుల్లో 170 మంది నామినేషన్లు వేయగా సోమవారం నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వార్డు నం.7లో రవళిక అడ్లూరి(కాంగ్రెస్), వార్డు 14లో ఫారుక్ ఉన్నీసా బేగం(బీఎస్పీ), వారు 18లో లింగంపల్లి లక్ష్మి సాయిప్రసన్న(బీఆర్ఎస్), వార్డు 29లో దిండు సునీల్గౌడ్(బీఆర్ఎస్) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. ఉపసంహరణకు వెనుకడుగుకాగజ్నగర్లో బీజేపీ నుంచి 48, బీఆర్ఎస్ 73, బీఎస్పీ 19, కాంగ్రెస్ 56, జనసేన 4, ఏఐఎంఐఎం 4, సీపీఎం2, ఐయూఎంఎల్ 3, ఐపీబీపీ 1, ఇండిపెండెంట్లు 20 మంది నామినేషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీల్లో తీవ్రమైన పోటీ ఉండడంతో నామినేషన్ల ఉపంసహరించుకునేందుకు అభ్యర్థులు ససేమిరా అంటున్నారు. బీఫామ్ తర్వాత ఇస్తాం. ఆసక్తి గలవారు ముందుగా పార్టీ పేరిట నామినేషన్లు వేయాలని చెప్పడంతో ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పుడు బీఫామ్ ఇవ్వకుంటే తప్పుకుంటారా? ఇండిపెండెంట్లుగా బరిలో నిలుస్తారా అనేది మంగళవారం సాయంత్రం తేలనుంది. ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులు ప్రకటిస్తారు. ప్రధాన పార్టీలు సర్వేల్లో విజయావకాశాల ఆధారంగా టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైన చోట అభ్యర్థులను సైతం మార్చుతున్నారు. తొలుత అనుకున్నవారు ప్రచారం చేస్తుండగానే.. ఫోన్ చేసి టికెట్ ఇవ్వడం లేదని సర్దిచెబుతున్నారు. ఇలాంటి వారిని బీఫామ్ ఇచ్చేముందే పోటీ నుంచి తప్పుకోవాలని కోరే అవకాశం ఉంది. -
అధికారుల ర్యాండమైజేషన్ పూర్తి
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్లో సోమవారం ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ అధికారుల మొదటి విడత ర్యాండమైజేషన్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం 20 శాతం అదనపు సిబ్బందితో కలిసి 153 మంది పోలింగ్ అధికారులు, 146 సహాయ పోలింగ్ అధి కారులు, 285 మంది ఇతర సిబ్బందిని ఎంపిక చేశామని తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ఇతర ఎన్నికల అధి కారులతో కలిసి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హరిత హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషర్లు గజానంద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లు లేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలిపొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం స్పష్టంగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి సోమవారం తహసీల్దార్లు, బూత్ స్థాయి అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్షించారు. బూత్స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించాలన్నారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు, తహసీల్దా ర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. అనంతరం తహసీల్దార్లతో భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదాబైనామాలపై సమీక్షించారు. భూభారతిలో పట్టా మార్పిడి, విరాసత్ కోసం వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ధ్రువపత్రాల దరఖాస్తులను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులో పరిష్కరించి, జారీ చేయాలని ఆదేశించారు. -
అడవుల రక్షణలో నిర్లక్ష్యం చూపొద్దు
చింతలమానెపల్లి: అడవుల రక్షణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చూపొద్దని డీఎఫ్వో నీరజ్కుమార్ అన్నారు. చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని బీట్లను సోమవారం ఎఫ్డీవో అప్పయ్యతో కలిసి పరిశీలించారు. బాలాజీ అనుకో డ, గంగాపూర్, ఖర్జెల్లి నర్సరీలను సందర్శించారు. దిందా, బందెపల్లి బీట్లలో స్వాధీనం చేసుకున్న పోడు భూములు, దిందా ప్లాంటేషన్ను పరిశీలించారు. సోలార్ పిట్ల నిర్వహణ, అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఖర్జెల్లి రేంజ్లో అటవీ అధికారులు -
ఇంటర్ ప్రయోగ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన 15 కేంద్రాల్లో సోమవారం ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 463 మంది విద్యార్థులకు 447 మంది హాజరుకాగా, 16 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 599 మందికి 533 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించిన పరీక్షకు జనరల్ విభాగంలో 384 మందికి 375 మంది హాజరు కాగా తొమ్మిది మంది పరీక్ష రాయలేదు. ఒకేషనల్ విభాగంలో 595 మందికి 582 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో రాందాస్ వాంకిడి, ఆసిఫాబాద్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
టాలెంట్ టెస్టులతో విద్యార్థుల్లో పోటీతత్వం
కాగజ్నగర్టౌన్: టాలెంట్ టెస్ట్లు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచుతాయని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఓల్డ్)లో తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిస్ఠాన్ సౌజన్యంతో విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ టాలెంట్ టెస్ట్లతో పోటీ పరీక్షలపై అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థులు లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. టాలెంట్ టెస్టులో సిర్పూర్(టి) జెడ్పీఎస్ఎస్ విద్యార్థి అయ్ ప్రథమ స్థానంలో నిలవగా, జెడ్పీఎస్ఎస్ రాస్పెల్లికి చెందిన కార్తీక్ ద్వితీయస్థానం, జెడ్పీఎస్ఎస్ వేంపల్లి విద్యార్థి అంజలి, జెడ్పీఎస్ఎస్ జన్కాపూర్ విద్యార్థి శ్రీకాంత్ తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్, చంద్రశేఖర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. 15 పరీక్ష కేంద్రాల్లో 4,691 మంది విద్యార్థులు హాజరుకానున్నా రు. 11 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, నాలు గు ప్రైవేట్ కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేశా రు. ఈ ఏడాది కళాశాలలకు రూ.50వేల చొప్పున నిధులు కేటాయించడంతో ఇప్పటికే రసాయన పదార్థాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు. అవకతవకలకు తావులేకుండా అన్ని కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 11 వరకు బోర్డు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామని డీఐఈవో రాందాస్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ నెపంతో కక్ష సాధింపు
ఆసిఫాబాద్అర్బన్: ఫోన్ ట్యాపింగ్ నెపంతో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని జిల్లా మున్సిపల్ ఇన్చార్జి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో సిట్ నోటీసులను బహిరంగంగా దహనం చేశారు. రహదారిపై నల్ల జెండాలతో బైఠాయించి నిరసన తెలిపారు. మొదట బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుని నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ సాధకుడిపై జరుగుతున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని వారు పేర్కొన్నారు. -
ప్రజా వ్యతిరేక బడ్జెట్
కాగజ్నగర్టౌన్: కార్మిక ప్రజలు, సామాజికంగా దోపిడీకి గురవుతున్న వర్గాలు, అలాగే దేశ ఆర్థిక ప్రయోజనాలను పక్కనపెట్టి ఈ బడ్జెట్ రూపొందించారు. 2025–26లో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, జీఎస్టీ ఆదాయాల్లో వచ్చిన లోటు, చుమురు మీద వేసే ఎకై ్సజ్ డ్యూటీ పెంపులను భర్తీ చేశారు. పన్ను ప్రతిపాదనలతో వచ్చే ఆదాయ ప్రభావాల గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో ఖర్చులు తీవ్రంగా కోతకు గురయ్యాయి. రాష్ట్రాలకు ఇచ్చే నిధులను 2025–26లో రూ.2,03,801 కోట్లు, 2026– 27లో బడ్జెట్ అంచనాల్లో రూ.59,456 కోట్ల తగ్గింపు చూపించారు. – ముంజం ఆనంద్కుమార్, సీపీఎం సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ -
చుక్..చుక్ బండి ఆగింది..
సిర్పూర్(టి): ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. రాత్రి.. సమయం ఏదైనా కూ.. చుక్ చుక్.. అంటూ రైలు కూత వినబడేది. సిర్పూర్(టి) స్టేషన్ పరిసర ప్రాంత ప్రజలు రైలు కూత ఆధారంగానే ఏ రైలు వస్తుందో కూడా చెప్పేవారు. కానీ, కొన్నిరోజులుగా ఈ కూత వినిపించడం లేదు. మూడోలైన్ నిర్మాణ పనులతో రైళ్లు రద్దు చేశారు. దీంతో రైల్వే స్టేషన్ కళ తప్పింది. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు హైదరాబాద్, నాగ్పూర్, విజయవాడ, చైన్నె వరకు రాకపోకలు సాగించేవారు. మూడోలైన్ పనుల కారణంగా ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు లేక స్టేషన్ నిరుపయోగంగా ఉంటోంది. వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. నగరాలకు రైలు సౌకర్యం..సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి నియోజకవర్గ ప్రజలు ప్రధాన నగరాలకు వెళ్లేందుకు రైళ్ల సౌకర్యం ఉండేది. గతంలో విజయవాడ, చైన్నె, నాగ్పూర్, ఢిల్లీకి వెళ్లేందుకు జనతా ఎక్స్ప్రెస్ ఉండేది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, నాగ్పూర్ ప్యాసింగర్లో హైదరాబాద్, నాగ్పూర్ పట్టణాలకు రాకపోకలు సాగించేవారు. మొదట జనతా ఎక్స్ప్రెస్ను రద్దు చేయగా.. కోవిడ్ ప్రారంభ సమయంలో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, నాగ్పూర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. కోవిడ్ ప్రభావం ముగిసినా మూడోలైన్ నిర్మాణ పనులతో పునఃప్రారంభానికి నోచుకోలేదు. సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల ప్రజలు కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణాలకు వెళ్లి ట్రైన్లు ఎక్కుతున్నారు. వారం రోజులుగా నిర్మానుష్యం..సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ నడిచే రామగిరి, సింగరేణి, పుష్పుల్ ప్యాసింజరు రైళ్లను అధికారులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజూలుగా రైళ్లు లేకపోవడంతో సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. ఘనమైన చరిత్ర కలిగిన స్టేషన్ నేడు నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు. రావడం మానేశారు.. సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడేది. రైళ్ల రద్దుతో స్టేషన్కు ప్రయాణికులు రావడం మానేశారు. ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. – నులిగొండ మహేశ్, సిర్పూర్(టి) రైళ్లు పునరుద్ధరించాలి సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి గతంలో కొనసాగిన ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించాలి. అంతరాయం లేకుండా ప్యాసింజర్ రైళ్లను కొనసాగించాలి. స్టేషన్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. – ఎల్ములే కిశోర్, నవేగాం, మం.సిర్పూర్(టి) -
‘చలో ఢిల్లీ’ విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్రూరల్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించి 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సింగ్, రవి, విజేష్, అనిల్ కుమార్, శ్రావణ్ కుమార్, రమేశ్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారంపై ఫోకస్
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఇప్పటికే సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించారు. గెలుపే లక్ష్యంగా తమ మద్దతుదారులతో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్ని వార్డుల్లో గెలుపుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో ఇప్పటికే ఓ అభ్యర్థి సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపట్టారు. వివిధ హామీలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు సవాల్గా మారాయి. ఎన్నికలు రసవత్తరంమున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలసి రావడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్యే ప్రధాన పోటీ ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీసీ జనరల్, కాగజ్నగర్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయా సామాజిక వర్గాల వారు కౌన్సిలర్లుగా బరిలో నిలిచారు. రిజర్వేషన్లు అనుకూలించిన అభ్యర్థులు తొలుత కౌన్సిలర్గా గెలిస్తే, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆశిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తొలిసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు తమ గెలుపుకోసం ఖర్చుకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు. 3న తుది జాబితాగతనెల 28 నుండి 30 వరకు జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు మందకొడిగా దాఖలైన నామినేషన్లు, రెండోరోజు, చివరి రోజు అధికంగా దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీ పడ్డారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 166 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో శనివారం ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రారంభించారు. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ పూర్తవడంతో తుది జాబితా వెలువడనుంది. గెలుపు దిశగా...మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠాలను కై వసం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అధినేతలు జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీల జిల్లా ఇన్చార్జీలు జిల్లా కేంద్రంలో మకాం వేసి అభ్యర్థులను సమన్వయం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా ప్రధాన పార్టీలకు రెబల్స్తో తలనొప్పిగా మారింది. అధికార కాంగ్రెస్ లో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించక పోవడంతో పోటీ చేస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. టికెట్లు దక్కని వారు స్వతంత్రులు గా పోటీలో ఉండగా కొంతమంది పార్టీ ని వీడి ప్రతి పక్ష పార్టీ కండువా వేసుకుంటున్నారు. దీంతో ఆయా వార్డుల్లో సొంత పార్టీ రెబల్స్ తలనొప్పిగా మారింది. రెబల్స్ ను పోటీ నుంచి తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 2 రోజు ల గడువు ఉంది. ప్రచార పర్వం మొదలుకావడంతో మున్సిపాలిటీల్లో మైకుల మోత మోగనుంది. అభ్యర్థులను ఖరారు చేయని పార్టీలుకాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మూడు రోజులు కొనసాగింది. ఇక ప్రధాన పార్టీలు అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్ మున్సిపాల్టీలో 20 వార్డులకు 10 నామినేషన్లు దాఖలు కాగా కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 23, బీజేపీ 17, బీఎస్పీ 3, సీపీఐ 3, సీపీఎం 1, స్వతంత్రులు 31, జనసేన 5, కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు 230 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ 48, కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 73, బీఎస్పీ 19, జనసేన 4, సీపీఐ(ఎం)2, ఏఐఎంఐఎం 4, ఐయూఎంఎల్ 3, ఐపీబీపీ1, ఇండిపెండెంట్ 20 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని వార్డుల్లో తీవ్రమైన పోటీ కనిపిస్తుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజే బీఫాంలను అభ్యర్థులకు అందించేందుకు కసరత్తు చేస్తున్నాయి. -
తెలంగాణ సాయుధ పోరు నుంచి.. రంగనాథ్రావు
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపా త్ర పోషించిన డాక్టర్ రంగనాథ్రావు బొల్లా న్వార్ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆవిర్భావంతోనే ఎన్నికల బరిలో నిలిచారు. నాడు నిజాం నిరంకుశానికి వ్యతి రేకంగా ఉద్యమించిన సీపీఐపై అప్పట్లో నిషేధం విధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున మున్సిపల్ బరి లో నిలిచారు. అధ్యక్షుడిగా విజయం సా ధించి 1952 నుంచి 1961 వరకు దాదాపు దశాబ్దకాలం పాటు పట్టణ ప్రజలకు సేవలందించారు. ఈక్రమంలో అదేపార్టీ తరఫున 1957 లో ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రజల మద్దతుతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మరోసారి మున్సి పల్ బరిలో నిలిచి గెలుపొందారు. 1967 ను ంచి 1972 వరకు చైర్మన్గా సేవలందించా రు. పదవులు చేపట్టినప్పటికీ అధికార దర్ప ం ప్రదర్శించకుండా సామాన్యుడివలే కాలినడకన తిరిగేవారని ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. -
‘సమగ్ర సవరణ’ పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్ఓలు, సబ్కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బూత్ స్థాయి అధికారులు ఇంటింటా తిరుగు తూ వివరాలు సేకరించాలన్నారు. ఓటరు జాబితా లో ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలన్నారు. కలెక్టర్, ఎన్నికల అధికారి కె.హరిత మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో 678 మంది బూత్స్థాయి అధికారులు, 68 మంది సూపర్వైజర్లు వివరాలు సేకరిస్తున్నారన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావ్ పాల్గొన్నారు. దేశానికి సేవలందించాలి ఆసిఫాబాద్: దేశపౌరులు దేశానికి తమవంతు సేవలు అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అధికారులు, అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతనెల 24 నుంచి 31 వరకు మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అధికారులు వాంకిడి మండలం బంబార, రెబ్బెన మండలం గోలేటి, సిర్పూర్(టి), కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో పర్యటించి వివిధ విషయాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేశారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలుఆసిఫాబాద్: గంజాయి సాగు చేసినా అక్రమ రవా ణాకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు.. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రా వు, కాగజ్నగర్ డీఎస్పీ వహీదొద్దీన్తో కలిసి మాదకద్రవ్యాల వినియోగం, నివారణ, గంజాయి అక్రమసాగు, రవాణాపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలన్నారు. అటవీ, పోలీస్ శాఖల అధికారులు నిఘా మరింత పటిష్టం చేయాలన్నా రు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్ట ర్ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి అడెపు భాస్కర్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్, డీఎంహెచ్వో సీతారాం, డీఏవో వెంకటి పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలిఆసిఫాబాద్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్సమావేశ మందిరంలో పరిశ్రమలు, గనులు, భూగ ర్భ నీటి వనరులు, బ్యాంక్, విద్యుత్, గిరిజన సంక్షే మ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత, ఔ త్సాహికులకు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అ వకాశాలు కల్పించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారికి రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఎం అశోక్ పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలిఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావ్, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్తో కలిసి రహదారి భద్రతపై సమావేశం నిర్వహించారు. -
గల్లీ నుంచి అసెంబ్లీకి
వారంతా ఒకప్పుడు గల్లీ నుంచి ఎన్నికై న వారే.. కౌన్సిలర్లు, చైర్మన్లుగా పట్టణవాసులకు సేవలందించి శాసనసభలోనూ అడుగు పెట్టారు. అంచెలంచెలుగా అసెంబ్లీ స్థాయికి ఎదిగి తమదైన మార్కు చూపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురిపై ప్రత్యేక కథనం. – కై లాస్నగర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్) అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షిద్ ఆదిలాబాద్ మున్సిపాలిటీకి నిర్వహించిన రెండో ఎన్నికల్లో మసూద్ హైమద్ ఖుర్షిద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1965 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మున్సిపల్ పరిధిలో అందించిన సేవలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఈ క్రమంలో 1972లో కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయన ను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. -
నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్
కెరమెరి: ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ముందు నిర్వహించే ప్రయోగ పరీక్షలను ఈ నెల 2 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 11 ప్రభుత్వ, 4 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 15 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగనున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్ పరీక్షలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,691 మంది హాజరుకానున్నారు. గతనెల 21, 22 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిషు ప్రయోగ పరీక్షలు నిర్వహించగా 25 నుంచి 31 వరకు ఫ్రీఫైనల్ పరీక్షలు కొనసాగాయి. ఒకే రోజు రెండు పరీక్షలుఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్ రెండు సెషన్స్లలో కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్లో 20 నుంచి 25 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కుల పేపర్ ఉంటుంది. అందులో 11 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లే. ఇందుకు విద్యార్థులు కసరత్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల నిఘా నీడలోగతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ అధికారులు మాధ్యమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితంగా ఆయా కళాశాలల్లో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలు నిఘా నీడలో కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగిన ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, ప్రీఫైనల్ పరీక్షలు సీసీ కెమెరాల మధ్య కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్కో కాలేజీలో 16 సీసీ కెమెరాలను అమర్చింది. అధ్యాపకుల బోధన తీరు, విద్యార్థుల క్రమశిక్షణ, ఇతరత్రా కార్యకలాపాలను రాష్ట్ర అధికారులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం అయింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్స్ పరీక్షలు కూడా నిఘా నీడలో కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆయా కళాశాల అధ్యాపకులు విద్యార్థులను సంసిద్ధం చేశారు. ఏర్పాట్లు పూర్తి చేశాం రేపటి నుంచి ప్రారంభమయ్యో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగుతాయి. జిల్లాలోని 15 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నాం. 4,619 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి. – రాందాస్, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి -
ఆసిఫాబాద్లో కాషాయజెండా ఎగురవేయాలి
ఆసిఫాబాద్: తొలిసారి జరుగుతున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కషాయ జెండా ఎగురవేయాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నిక ల ఇన్చార్జి అరిగెల నాగేశ్వర్రావు, జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంతో కలిసి కౌన్సిలర్ అభ్యర్థులు, కన్వీ నర్లు, ప్రభారీలకు మున్సిపల్ ఎన్నికలపై దిశా నిర్దే శం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఓటర్లకు వివరించాలన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల పా లన చూశారని, బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, కోవ విజయ్, కోశాధికారి కిరణ్, కొట్నాక విజయ్, సుంకరి పెంటయ్య, రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీల పేరుతో మభ్యపెడుతున్న కాంగ్రెస్కాగజ్నగర్టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం కాగజ్నగర్లోని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు నివాసంలో ఎన్ని కల్లో పోటీచేసే అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించామన్నారు. మున్సిపాలిటీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగజ్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం రూ.35 కోట్ల నిధులు మంజూ రు చేసిందన్నారు. పట్టణంలో డ్రెయినేజీల నిర్మా ణం సరిగా లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి కృషి చేస్తామన్నారు. కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో వందేభారత్, కేరళ ఎక్స్ప్రెస్తో పాటు పలు రైళ్ల హాల్టింగ్కు కృషి చేసినట్లు తెలిపారు. స మావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు రక్షణ కల్పించాలి
దహెగాం: మండలంలోని రాళ్లగూడకు చెంది న ఆత్మకూరి కళావతిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి మహిళలకు రక్షణ క ల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత అన్నారు. శనివారం బాధిత కుటుంబా న్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు నెలల క్రితం ఇదే మండలంలోని గెర్రె గ్రామంలో నిండు గర్భిణి తలాండి శ్రావణి కులదురహంకార హత్య మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. జిల్లాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు, పిల్లల చదువుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వినోద, జిల్లా సహాయ కార్యదర్శి నంది పద్మ, నాయకులు షాహీన్, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు. -
చివరిరోజు పోటాపోటీ
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు చివరిరోజు శుక్రవారం 110 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కాంగ్రెస్ నుంచి 27, బీఆర్ఎస్ 23, బీజేపీ 17, బీఎస్పీ 03, సీపీఐ 03, సీపీఐఎం 01, స్వతంత్రులు 31, జనసేన నుంచి 05 నామినేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఆసిఫాబాద్ బల్దియాలో మొత్తం నామినేషన్ల సంఖ్య 160కి చేరింది. ఇక కాగజ్నగర్లో రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు 131 మంది అభ్యర్థులు 176 నామినేషన్లును శుక్రవారం దాఖలు చేశారు. బీజేపీ నుంచి 48, కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 73, బీఎస్పీ 19, జనసేన 4, సీపీఐ(ఎం) 2, ఏఐఎంఐఎం 4, ఐయూఎంఎల్ 3, ఐపీబీపీ 1, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి 20 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 230కి చేరింది. అభ్యర్థులకు నాయకుల మద్దతు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆయా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చారు. ఆఖరు రోజు కావడంతో అభ్యర్థులతోపాటు ఆయా కాలనీల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం రోడ్డు రద్దీగా మారింది. -
బాలికలను రక్షిద్దాం.. చదివిద్దాం
ఆసిఫాబాద్అర్బన్: బాలికలను రక్షించుకుందా మని, వారిని ఉన్నత చదువులు చదివించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దామని కలెక్టర్ కె.హరిత పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవానికి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ధనిక దేశమైన అమెరికాలో కూడా ఇంతవరకు ఒక మహిళకు అధ్యక్ష పదవి లభించలేదని, కానీ భారతదేశంలోని మహిళలు రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలుగా రాణిస్తున్నారని తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు. బాలికలు ప్రదర్శించిన సంప్రదాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఏవో వెంకటేశ్వర్లు, డీజీసీడీవో శకుంతల, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, క్రీడల అధికారి శంబు, మహిళా సాధికారత సమన్వయకర్త శారద, సభ్యులు రాణి, మమత, సఖి సిబ్బంది, షీటీం సభ్యులు పాల్గొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఆసిఫాబాద్: ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం లైంగిక వేధింపుల నిరోధక చట్టం పాస్– 2013పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో వేధింపులకు గురైతే బాధితులు నిర్భయంగా హెల్ప్లైన్ నంబర్కు స మాచారం అందించాలని సూచించారు. కార్యాలయాలు, పని ప్రదేశాల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాది అంజలి దేవి పాస్ చట్టం– 2013లోని సెక్షన్లను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ
కౌటాల: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి, ఉపాధ్యాయులతో కలిసి చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించా లని, సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫి బ్రవరి 5న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఏ ఐజేఏసీటీవో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఎంఈవో హన్మంతు, నరసింహచారి,ఇందురావు, రావుల వినోద్, గుణాకార్, సంపత్, రాజు, మ ణి,సబీనా, రాణి, తిరుమల, దత్త పాల్గొన్నారు. -
ఎలా వెళ్లాలంటే..
అలాగే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పోలీసులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తాండూర్, బెల్లంపల్లి, మంచిర్యాల వైపు నుంచి వచ్చే భక్తుల 2, 3 వీలర్ వాహనాలు రెబ్బెన ఫ్లైఓవర్ మీదుగా పుంజుమేరగూడ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద గల మార్గం నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి ద్వారా సింగల్గూడ, గంగాపూర్ గ్రామం మీదుగా చేరుకోవాలి. కారు, బస్సులు వంటి వాహనాలు రెబ్బెన బస్టాండ్ వద్ద యూటర్న్ తీసుకుని గంగాపూర్ రైల్వేగేట్ ద్వారా జాతరకు చేరుకోవాలి. ఆసిఫాబాద్, కాగజ్నగర్ వైపు నుంచి వచ్చే భక్తుల బైక్లు, ఆటోలు పుంజుమేరగూడ వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్బంక్ వద్ద ఉన్న యూటర్న్ వద్ద నుంచి సింగల్గూడ, గంగాపూర్ మీదుగా రావాలి. కార్లు, బస్సులు రెబ్బెనలోని గంగాపూర్ రైల్వేగేట్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. జాతర నుంచి బయటకు వచ్చే వాహనాలన్నీ న్యూ ఆర్చీ నుంచి వెంచర్ మార్గం ద్వారా పల్లవి బ్రిడ్జి వైపు నుంచి జాతీయ రహదారికి చేరుకోవాలి. ఆసిఫాబాద్, కాగజ్నగర్ వైపు వెళ్లే వాహనాలు గోలేటి ఎక్స్రోడ్ వద్ద ఉన్న యూటర్న్ ద్వారా తమ మార్గానికి చేరుకోవాలి. పాత గంగాపూర్ కమాన్ వైపు నుంచి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. జాతర రూట్ మ్యాప్ -
ఉద్యోగుల కృషికి నిదర్శనం
రెబ్బెన: రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా చే యడం సీహెచ్పీ ఉద్యోగుల కృషికి నిదర్శమని జీఎం విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి సీహెచ్పీని సందర్శించి అధికారులు, ఉద్యోగులను శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఒక్కరోజే 24,104 టన్నుల (ఆరు రేకులు) బొగ్గు రవాణా చేయడం అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, సీహెచ్పీ హెచ్వోడీ కోటయ్య, ఇంజినీర్ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. -
ఎన్నికలపై ప్రత్యేక నిఘా
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడంపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెండు పట్టణాల్లో నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా లౌడ్స్పీకర్లు, మైక్సెట్లు వినియోగించడం, ర్యాలీల నిర్వహణపై దృష్టి సారించారు. సోషల్ మీడియాలో ప్రచారం, పోస్టులపై ఫోకస్ పెట్టారు. అలాగే పరిమితికి మించి నగదు, ఖరీదైన వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. చెక్పోస్టులు ఇక్కడే.. ఆసిఫాబాద్ పరిధిలో రెండు, కాగజ్నగర్ పరిధిలో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు, రాజంపేట సమీపంలో అటవీశాఖ చెక్పోస్టు, భట్టుపల్లి ఎక్స్రోడ్డు, వినయ్గార్డెన్ సమీపంలో అగ్రికల్చర్ చెక్పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. సంబంధిత అధికారుల లిఖితపూర్వక అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించడం నిషేధించారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు, రూ.10వేల కంటే విలువైన వస్తువులు తరలించాలన్నా తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సిందే. కాగా, ఎన్నికలు ముగిసే వరకు చెక్పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగుతాయని, పోలీసు ఫ్లాగ్మార్చ్ నిర్వహిస్తామని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. -
● ముగిసిన నామినేషన్ల స్వీకరణ ● పోటీలో ఎక్కువగా కొత్త అభ్యర్థులే.. ● రెబల్స్ను పోటీ నుంచి తప్పించేలా ప్రధాన పార్టీల పావులు
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం చివరిరోజు కావడంతో కొత్త అభ్యర్థులతోపాటు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసినవారు కూడా అదనపు సెట్లు వేశారు. మరోవైపు రెబల్స్ను పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీలు బుజ్జగింపులకు తెరలేపాయి. ఆసిఫాబాద్లో 20 వార్డులు, కాగజ్నగర్లో 30 వార్డులు ఉన్నాయి. రిజర్వేషన్లు కలిసి రావడంతో మహిళలు, యువత, కొత్త అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీకి ఆసక్తి చూపారు. అయితే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పోటీలో లేకపోగా, కొత్త అభ్యర్థులు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైంది. టికెట్లు ఖరారైన కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించారు. తమను గెలిపించాలని గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన అనంతరం ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువిచ్చారు. అదేరోజు తుది జాబితా ప్రకటించనున్నారు. పూర్తికాని టికెట్ల కేటాయింపు కీలక ఘట్టం నామినేషన్ల పర్వం పూర్తయినా ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితా ఖరారు చేయలేదు. బీఫామ్లు అందించలేదు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రకటించారు. మరోవైపు టికెట్ దక్కుతుందని ఆశించి ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. టిక్కెట్ దక్కని అభ్యర్థులు బరిలో ఉంటారా.. రెబల్గా మారతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నామినేషన్లు పూర్తికావడంతో ప్రధాన పార్టీల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. రెబల్స్, బలమైన ప్రత్యర్థులను తప్పించేందుకు ప్రధాన పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు. తమ అభ్యర్థిని సులువుగా గెలిపించుకునేందుకు జనసేన, స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్లోని రెండువర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని సమన్వయం చేయడంపై జిల్లా నాయకత్వం కసరత్తు చేస్తోంది. చైర్పర్సన్ పదవిపై గురి ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవి బీసీ జనరల్కు, కాగజ్నగర్ మున్సిపాలిటీలో బీసీ మహిళకు కేటాయించారు. ప్రధాన పార్టీల్లో ఈ పదవి కోసం పలువురు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధా న పార్టీలు సమర్థులై ఉండి, చదువు, ఆర్థిక స్థోమత, సమాజంలో గుర్తింపు ఉన్న అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు ఉన్నారు. ఆసిఫాబాద్లో అధికార కాంగ్రెస్ నుంచి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నుంచి ప్రముఖ న్యాయవాది రాపర్తి రవీందర్, బీజేపీ నుంచి కవల్కర్ బాబురావు చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కాగజ్నగర్లో బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ సతీమణి డాక్టర్ అనిత, బీఆర్ఎస్ నుంచి మాజీ చైర్పర్సన్ విద్యావతి, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారంతా వార్డు కౌన్సిలర్గా గెలవడానికి యత్నిస్తున్నారు. ఇప్పటి నుంచే కొంతమంది వార్డు సభ్యులకు ఆర్థికంగా సహకరిస్తూ, మద్దతు కూడగట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మూడు రోజుల జాతరకు ముస్తాబు
రెబ్బెన: ప్రకృతి ఒడిలో కొలువైన బాలాజీ వెంకన్న జాతరకు సమయం ఆసన్నమైంది. రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మూడురోజులపాటు నిర్వహించే వేడుకుల కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం నుంచి సో మవారం వరకు జాతర మహోత్సవం జరగనుంది. మొదటి రోజు స్వామి వారి కల్యాణం, రెండోరోజు రథోత్సవం, మూడో రోజు భక్తులకు దర్శనంతో జా తర ముగియనుంది. ఉమ్మడి జిల్లా భక్తులతోపాటు కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తుడి కోసం గుట్టలో కొలువై.. గంగాపూర్ శివారులోని గుట్టపై స్వామి కొలువైన తీరు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలను గ్రామస్తులు ఈ విధంగా చె బుతుంటారు. 16వ శతాబ్దానికి పూర్వం గంగాపూర్కు చెందిన ముమ్మడి పోతాజీ చిన్నతనం నుంచి కాలినడకన తిరుమల తిరుపతికి వెళ్లి మాఘశుద్ధ పౌర్ణమి రోజు వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించేవాడు. తిరిగి కాలినడకనే స్వగ్రామానికి వచ్చేవాడు. కాలక్రమేనా వయస్సు పైబడటం, ఆరోగ్యం క్షీణించడంతో ఒక ఏడాది తిరుపతి వరకు వెళ్లలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో స్వామి వారు పోతాజీ కలలో కనిపించి గ్రామ పొలిమేరలోని గుట్టలో కొలువై ఉన్నానని.. తన కోసం ఆలయం నిర్మించాలని కోరినట్లు చెప్పుకుంటారు. ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినాన నీకోసం, నీలాంటి భక్తుల కోసం దర్శనం ఇస్తానని చెప్పి నిష్క్రమించారు. ఆ తర్వాత గంగాపూర్ వాగులో పుణ్నస్నానం ఆచరించి గుట్టను తొలగవగా.. లోపల స్వామి పట్టెనామాలు దర్శనమిచ్చాయి. అప్పటి నుంచి ప్రతీ మాఘశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారు ఆలయంలో కొన్ని గడియలు కొలువు తీరి ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. శోభాయమానంగా అలంకరణ ఆలయంతోపాటు పోతాజీ సమాధి, ముఖద్వారాని కి రంగులు వేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, హెల్త్ క్యాంపులు, అంబులెన్సులు ఏర్పాటు చేశారు. రథోత్సవానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్నగర్, చెన్నూర్, గోదావరిఖని తదితర ప్రాంతాల నుంచి భక్తుల కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. అతిపెద్ద జాతర ఆలయంలో మూడు రోజుల జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. జిల్లాలో జరిగే అతిపెద్ద జాతర ఇది. మంగళవారం నుంచి గురువారం వరకు భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు పూర్తి చేశాం. – వేణుగోపాల్ గుప్తా, ఆలయ ఈవో అంగరంగ వైభవంగా.. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. స్వామి, ఆమ్మ వార్ల కల్యాణంతో మహోత్సవం ప్రారంభమవుతుంది. రెండోరోజు ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని నిర్వహిస్తాం. మూడోరోజు స్వామి వారి దర్శనం ఉంటుంది. – కొమ్మెర గణేష్శర్మ, ఆలయ అర్చకులు -
అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి
రెబ్బెన: వేంకటేశ్వర జాతర నేపథ్యంలో పోలీ సు అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో విధు లు నిర్వర్తించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జాతరకు 282 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రెబ్బెన మండలం గంగా పూర్లో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక డ్యూటీ సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేయాలని, మహిళలు, పిల్లల భద్రతపై దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, స్పెషల్ బ్రాంచి సీఐ సతీశ్, రెబ్బెన, వాంకిడి సీఐలు సంజయ్, సత్యనారాయణ, ఎస్సైలు వెంకటకృష్ణ, వెంకటేశ్, ఆర్ఐ ఆంజన్న పాల్గొన్నారు. -
వనదేవతలకు మొక్కులు
కాగజ్నగర్ మండలం నందిగూడ శివారులోని పెద్దవాగు ఒడ్డున సమ్మక్క– సారలమ్మలు కొలువుదీరారు. పడిగిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి రావడంతో ఆసిఫాబాద్, రెబ్బెన, బెజ్జూర్, కౌటాల, సిర్పూరు(టి) మండలాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జాతర కమిటి అధ్యక్షుడు తుమ్మ రమేశ్, సభ్యులు శ్రీనివాస్, కోట శంకర్, వెంకటేశ్ పాల్గొన్నారు. – కాగజ్నగర్టౌన్ -
‘బెల్టు’ జోరు.. నాణ్యత బేజారు
చింతలమానెపల్లి: జిల్లాలో బెల్టు షాపుల జోరు కొనసాగుతోంది. అయితే ఇటీవల ఆయా దుకాణాల్లో మద్యం నాణ్యతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసాల తీరు, వాసన అనుమానాస్పదంగా ఉంటోందని మందుబాబులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు మద్యం విక్రయాల పరంగా ఒక ప్రత్యేకత ఉంది. తక్కువ జనాభా ఉన్నా మద్యం విక్రయాల్లో ఇతర జిల్లాలతో పోటీ పడుతోంది. ఆసిఫాబాద్ డివిజన్లో 16, కాగజ్నగర్ డివిజన్లో 16 లైసెన్స్డ్ మద్యం దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా అదనంగా మున్సిపాలిటీల్లో బార్ అండ్ రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నూతన దుకాణాలు ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు రూ.11.20 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అడ్డూఅదుపు లేకుండా నిర్వహణ జిల్లావ్యాప్తంగా లైసెన్స్డ్ దుకాణాలు ఉండగానే.. ప్రతీ గ్రామంలోనూ బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. జనాభాను అనుసరించి ఒక్కో గ్రామంలో 20కి పైగా ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లేకపోవడంతో కొన్నిచోట్ల దేశీదారు, నాటుసారా సైతం విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి కల్తీ మద్యం విక్రయదారులకు వరంలా మారింది. కొందరు కల్తీ మద్యాన్ని నేరుగా బెల్టు షాపులకే సరఫరా చేస్తున్నారు. చింతలమానెపల్లి మండల కేంద్రంతోపాటు రవీంద్రనగర్, గూడెం గ్రామాల్లో మద్యం దుకాణాలు ఉన్నాయి. పక్క మండలాలైన కౌటాల, బెజ్జూర్, కాగజ్నర్ నుంచి ఇక్కడికి మద్యం సరఫరా చేస్తున్నారు. అమ్మకాలు పెంచే క్రమంలో ఎక్సైజ్, పోలీసు శాఖలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వ్యాపారులు నేరుగా బెల్టు దుకాణాలకు కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు మద్యం కన్నా కల్తీ మద్యాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నారు. బెల్టు దుకాణాల నిర్వాహకులు సైతం కల్తీని గుర్తించలేకపోతున్నారు. సరిహద్దు మండలాల గుండా.. చింతలమానెపల్లి, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్, దహెగాం మండలాలు జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. మహారాష్ట్రలో లిక్కర్ ధరలు తెలంగాణతో పోలిస్తే ఎక్కువ. రూ.వెయ్యి పలికే ఫుల్బాటిల్ మహారాష్ట్ర సుమారుగా రూ.200 ఎక్కువగా ఉంటుంది. రూ.2వేల ధరలో లభించే బాటిల్ మరో రూ.300 ఎక్కువగా ఉంటోంది. మరోవైపు గడ్చిరోలి జిల్లాలో మద్య నిషేధం అమలులో ఉంది. దీంతో ఈ మండలాల నుంచి కల్తీ మద్యం తరలించడం ఆదాయ వనరుగా మారింది. బెల్టు దుకాణాలతోపాటు మహారాష్ట్రకు కల్తీ మద్యం తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎకై ్సజ్ అధికారులు నిఘా పెడుతున్నామని చెబుతున్నా.. అసలు మద్యం మాటున కల్తీ సరఫరా అవుతోందని తెలుస్తోంది. పలువురు మద్యం వ్యాపారులపై గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. కాగజ్నగర్ పట్టణంలో గతంలో భారీగా కల్తీ మద్యం సైతం పట్టుబడింది. ఆరోగ్యంపై ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో మద్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసాలు, వాసన అనుమానాస్పదంగా ఉంటోంది. ఇలాంటి మద్యం తాగితే తీవ్రమైన అనర్థాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె, కాలేయం, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై కాగజ్నగర్ డివిజన్ ఎకై ్సజ్ సీఐ రవి కుమార్ను వివరణ కోరగా.. కల్తీ మద్యంపై నిఘా ఉంచామని తెలిపారు. అనుమానం వచ్చిన సందర్భంలో సంబంధిత మద్యం బాటిళ్లను తీసుకుని ఎకై ్సజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. నెలవారీగా మద్యం దుకాణాలలో తనిఖీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. -
పార్టీలకు ‘టికెట్’ టెన్షన్!
కాగజ్నగర్టౌన్: ప్రధాన పార్టీలకు టికెట్ తలనొప్పులు మొదలయ్యాయి. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు ఉండటంతో ఎవరికి బీఫామ్ ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆశావహులు ప్రధాన పార్టీల నాయకుల చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. కొన్నివార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేసినా చివరి నిమిషం వరకు ప్రకటించేందుకు అధిష్టానాలు సాహసం చేయడంలేదు. ఎదుటి పార్టీల అభ్యర్థి బలాబలాలను అంచనా వేస్తున్నారు. కానీ గడువు తక్కువగా ఉండటంతో ఇప్పటికే కొందరు బీంఫామ్ లేకుండా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పోటీలో ప్రధాన పార్టీలుఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20, కాగజ్నగర్లో 30 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగజ్నగర్ పట్టణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తోపాటు బీఎస్పీ, జనసేన, ఎంఐఎం పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్లు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి రెండువర్గాల నాయకులు పోటీకి సై అంటున్నారు. వారిలో అభ్యర్థిని ఎంపిక చేయడం వీరికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ దండె విఠల్ నాయకులతో కలిసి జాబితా ఖరారు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు. విజయావకాశాలు ఉన్న అభ్యర్థులను బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్నవారికే..మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఎన్నికల్లో ఆర్థికంగా ఉన్నవారిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఉత్సాహంగా ఉన్నవారికి ఖర్చులపై ముందుగానే స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఒక్కో వార్డు నుంచి పోటీచేసే వారు కనీసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నట్లు సమాచారం. అయితే స్థానికంగా పట్టు ఉన్నవారిని బరిలోకి దింపి.. సత్తా చాటాలని పార్టీలు భావిస్తున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. బీఫామ్ ఎవరికో..?కాగజ్నగర్ మున్సిపల్ ఎన్నికలు ఆయా పా ర్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మున్సిపల్లోని 30 వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఆయా పార్టీల నాయకులు బీఫామ్ ఎవరికివ్వాలో అంతర్మథనంలో ఉన్నారు. ఆశావహులను సున్నితంగా తిరస్కరించకపోతే రెబల్గా పోటీచేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల నుంచి బీఫామ్ దక్కకుంటే బీఎస్పీ, జనసేన, ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందువల్ల మందుగానే నామినేషన్లు వేస్తున్నారు. బీఫారాలు ఇవ్వడానికి ఉపసంహరణ వరకు గడువు వరకు ఉండటం వారికి కలిసి వస్తోంది. -
రెండుసార్లు పనిచేశా
1967– 1972, 1980– 1984 మధ్య రెండుసార్లు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేశా. ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్లుగా మెతి చాంద్, జూపాక నర్సయ్యలు, కౌన్సిల్లో 20 మంది కౌన్సిలర్లు ఉండే. 1972 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాగజ్నగర్ ఎస్పీఎం గ్రౌండ్కు వస్తే వెండితో తులాభారం వేశారు. అప్పుడు కౌన్సిలర్లు నిబద్ధత, నిజాయతీతో పనిచేశారు. ఏపనైనా మాట ఇస్తే చేసేవాళ్లం. ప్రధాన కాలువకు అటు వైపు నుంచి మున్సిపల్ కాలనీలు ఉండేవి. మున్సిపల్ కార్యాలయం హనుమాన్ మందిర్ సమీపంలోని ఎస్పీఎం క్వార్టర్లో ఉండేది. పట్టణంలో అన్ని వార్డుల్లో దాదాపు మట్టి, బండలతో రోడ్లు, మురుగు కాలువలు ఉండేవి. ఇప్పుడు అన్ని వార్డుల్లో సిమెంటు రోడ్లు వచ్చినయ్. ఇందిరా మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు అక్కడ నివసిస్తున్న వారికి మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో నో లాస్, నో ప్రాపర్టీ కింద తీర్మానం చేసి ద్వారకానగర్, కౌసర్ నగర్ ఏరియాల్లోని ఓ రైతు వద్ద రూ.167కు కొనుగోలు చేశాం. అందరికీ ఇండ్ల స్థలాలు అందించాం. ఎన్నికల్లో మనిషిని చూసి మంచివాడు, మనవాడు, అందుబాటులో ఉంటాడు అని ఓటు వేసి గెలిపించేవారు. ఇప్పుడున్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పోటీ చేయడం డబ్బుతో కూడుకున్న పని. మనుషుల్లో స్నేహం, బంధాలు, ఆప్యాయతలు ఏమీ లేవు. ఆ జమానాలో రూ.200, రూ.500 ఖర్చు చేసి గెలుపొందాను. – వనమాల రాములు(కౌన్సిలర్ రాములు), మాజీ కౌన్సిలర్ -
అభిమానంతో ఇండిపెండెంట్గా గెలిపించారు
1987లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏరియాల్లో అందరూ కలిసి అభిమానంతో కౌన్సిలర్గా నిలబెట్టి గెలిపించారు. అప్పుడు ఈఎస్ఐ కాలనీ నుంచి పెట్రోల్ పంప్ ఏరియా వరకు వార్డు ఉండేది. కాలనీవాసులు ‘ముబీన్ బాయ్ మీకు అండగా మేముంటాం’ అంటూ ఇండిపెండెంట్గా ఒక పైసా కూడా ఖర్చులేకుండా గెలిపించారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. 1987లో బుచ్చిలింగం చైర్మన్గా ఉన్నప్పుడు 20 మంది కౌన్సిర్లలో నేను ఒకడిని. మా హయాంలో పట్టణంలో రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాజీవ్గాంధీ చౌరస్తాగా నామకరణం చేశాం. అంతకుముందు బాబీ హోటల్గా ఉండేది. మాజీ ఎంపీ నర్సారెడ్డి మంచి మిత్రుడుగా ఉండే. ఆయన అండదండలతో పట్టణంలో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేశాను. గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో బోర్డు మెంబర్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ అవార్డులను అందుకున్నాను. – ముబీన్, మాజీ కౌన్సిలర్ -
ఆసిఫాబాద్కు దశాబ్దాల చరిత్ర
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అనేక ఉద్యమాలకు ఇది కేంద్రంగా నిలిచింది. జనగామ పేరుతో ఉన్న ఈ ప్రాంతానికి 1907 నిజాం కాలంలో ఆసఫ్ జాహి వంశం పేరు మీదుగా ఆసిఫాబాద్గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే మార్గంలో ఉన్న రెబ్బెనలోని రైల్వే స్టేషన్కు ఆసిఫాబాద్ రోడ్గా పేరు పెట్టారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా కొనసాగింది. ఆ తర్వాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్కు తరలిపోయింది. అయినా 1961 వరకు మున్సిపాలిటీగానే ఉంది. అనంతరం మేజర్ గ్రామ పంచాయతీగా స్థాయి మార్చారు. ఆర్టీసీ డిపో, జైలు ఏర్పాటుఆసఫ్ జాహీ వంశం పేరున ఏర్పడిన ఆసిఫాబాద్కు నిజాం సర్కార్ అధిక ప్రాధాన్యత నిచ్చింది. ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానంలో ఏర్పాటు చేసిన తొలి మూడు బస్డిపోల్లో మొదటిది ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు ఇక్కడి డిపోకు ఇంగ్లాడ్ నుంచి తెప్పించిన ఏడు అల్బీనీయన్ బస్సులు కేటాయించారు. నిజాం హయాంలోనే అప్పటి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్లోని జన్కాపూర్లో ఐదెకరాల్లో సుమారు 200 మంది ఖైదీలను ఉంచేలా జిల్లా జైలు నిర్మించారు. కొద్దికాలం పాటు జైలు నిర్వహణ లేదు. మరమ్మతుల అనంతరం 1991 మార్చి 15న అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఎంజీ గోపాల్ తిరిగి ప్రారంభించారు. అనంతరం 2008లో ఆదిలాబాద్కు తరలించి, ఇక్కడి జైలును స్పెషల్ సబ్ జైలుగా మార్చారు. సాయుధపోరాటంలో పట్టణవాసులునిజాం నిరంకుశ పాలనను అంతమొందించేందుకు జరిగిన సాయుధ పోరాటంలో ఆసిఫాబాద్ పట్టణవాసులు కీలక పాత్ర పోషించారు. ఇక్కడి యువత కాంగ్రెస్ అతివాద నాయకుల నేతృత్వంలో 1947 సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్నారు. పట్టణానికి చెందిన బోనగిరి వెంకటేశం, చీల శంకర్, చీల విఠల్, ఖాడ్రే శంకర్, రాంసింగ్, రేవయ్య, తాటిపెల్లి తిరుపతి, ఏకబిల్వం శంకరయ్య, చందావార్ విఠల్, జగన్నాథ్ మహారాష్ట్రలోని చాందాలో సాయుధ శిక్షణ పొందారు. రాంచందర్ రావు పైకాజీ, సుబ్బబా బురావు, దండనాయకుల గోపాల్ కిషన్రావు, వామన్రావు వైరాగరే, ప్రభాకర్రావు మసాదే ఉద్యమాలకు సహకారం అందించారు. నాటి పోరాటయోధులను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించింది.తొలి సర్పంచ్ పైకాజీనిజాం కాలంలో ఆసిఫాబాద్కు తొలి సర్పంచ్గా రాంచందర్రావు పైకాజీ సేవలందించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది సంగర్స్ బాల్కిషన్రావు కొన్నేళ్లు పనిచేశారు. పైకాజీ వారసుడు దండనాయకుల రమేశ్బాబు 1970 వరకు సర్పంచ్గా కొనసాగారు. 1980 నుంచి 2000 వరకు తుజాల్పూర్ లక్ష్మి నారాయణగౌడ్ పనిచేయగా, అనంతరం ఎస్టీ రిజర్వ్ కావడంతో 2002, 2015లో మర్సోకోల సరస్వతి గెలుపొందారు. 2006, 2015లో కోవ లక్ష్మి(ప్రస్తుత ఎమ్మెల్యే) రెండుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిలిచిపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. 2024లో మున్సిపాలిటీగా ఏర్పాటు2016లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా మారింది. పంచాయతీ కావడంతో సాంకేతికంగా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చాలని 2018లో శాసన సభ తీర్మానించింది. 2019లో ఆగస్టు 2న ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. అయితే ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాక బల్దియా ప్రతిపాదనల్లో ఏజెన్సీ అంశం అడ్డంకిగా మారింది. అనంతరం పట్టణం నుంచి రాజంపేటను ప్రత్యేక పంచాయతీగా విడదీసి ప్రతిపాదనలు పంపడంతో 2024 ఫిబ్రవరిలో అప్పటి గవర్నర్ తమిళసై ఆమోదించారు. జిల్లా కేంద్రం 3,831 ఎకరాల విస్తీర్ణం(17.02 చదరపు కిలోమీటర్లు), 16,597 మంది జనాభా కలిగిన 20 వార్డులతో మున్సిపాలిటీగా అవతరించింది. ఆసిఫాబాద్ పట్టణం, గొడవెల్లి, జన్కాపూర్ ప్రాంతాలు కలిపి బల్దియాగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలిసారి ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
నామినేషన్లకు నేడే ఆఖరు
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: జిల్లాలో మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. రెండోరోజు గురువారం ఆసిఫాబాద్లో 45, కాగజ్నగర్లో 49 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య 104కు చేరింది. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీకి ఉత్సాహం చూపారు. కాగజ్నగర్లో గురువారం బీజేపీ నుంచి 9, కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 19, బీఎస్పీ 4, జనసేన 1, ఐయూఎంఎల్ 1, ఇండిపెండెంట్ 2 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కేంద్రాన్ని నోడల్ అధికారి అశ్వక్ అహ్మద్తో కలిసి రాష్ట్ర సాధారణ పరిశీలకుడు కుమార్ పరిశీలించారు. శుక్రవారం చివరిరోజు కావడంతో సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన వారిని లోపలికి అనుమతించాలని అధికారులకు సూచించారు. పొరపాట్లకు తావివ్వకుండా నిబంధనల మేరకు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణకు 15 కౌంటర్లుకాగజ్నగర్ పరిధిలో నామినేషన్ల స్వీకరణకు 15 కౌంటర్లు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ కె.హరిత తెలిపారు. కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని గురువారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణంలోని డీఏవీ లక్ష్మిపథ్ సింఘానియా పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ తిరుపతి, తహసీల్దార్ మధుకర్, సిబ్బంది ఉన్నారు. మొత్తం నామినేషన్లుమున్సిపాలిటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ ఇతర పార్టీలు/ మొత్తం ఆసిఫాబాద్ 17 14 11 1 7 50 కాగజ్నగర్ 15 19 12 4 4 54 -
జాతరకు పటిష్ట బందోబస్తు
రెబ్బెన: గంగాపూర్లో బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 31 నుంచి నిర్వహించే జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం సందర్శించి జాతర ఏర్పాట్లపై ఆరా తీశారు. దేవా లయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, వాహనాల పార్కింగ్ కోసం కేటాయించి స్థలాలను పరిశీలించారు. మూడు రోజులపాటు జాతర మహోత్సవం సాఫీగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రత ఏర్పాట్లు, అత్యవసర సేవలు, భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ సతీశ్ పాల్గొన్నారు. -
మాట మీద ఉండేవాళ్లం
2000 సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందాను. అందరం మాట మీద ఉండే వాళ్లం. ఏదైనా పని చేయాలంటే అనుకోని చేసేవాళ్లం. పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా నిర్ణ యాలు తీసుకునేవాళ్లం. మున్సిపాలిటీ లో ప్రధానంగా ఒకే బీటీ రోడ్డు ఉండగా, అది ప్రధాన పెట్రోల్పంప్ నుంచి పేపర్ మిల్లు వరకు ఉండేది. అప్పట్లో కాలనీల్లో ఎక్కువగా తాగునీటి సరఫరా, మురుగు కాలువలు సమస్యలు ప్రధానమైనవి. మా పాలన హయాంలో రోడ్లు, 20 వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టాం. అప్పుడు 16వ వార్డు జనరల్ ఉండడంతో ఆ వార్డు నుంచి పోటీచేసి గెలుపొందాను. జూపాక నర్సయ్య రెండుసార్లు చైర్మన్గా కొనసాగారు. వారి హయాంలోనే మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుత నాయకులు పట్టణాభివృద్ధికి కృషి చేయాలి. – కలికోట రమణయ్య, మాజీ కౌన్సిలర్ -
సమ్మక్క తల్లి ఆగమనం
వనదేవతలు వనం వీడి జనంలోకి వచ్చారు. గురువారం సమ్మక్క తల్లి ఆగమనంతో జాతర పరిపూర్ణమైంది. రెబ్బెన మండలం గోలేటి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్ శివారులోని కంకల వనం నుంచి సమ్మక్క తల్లిని పూజారులు దేవర వినోద్, గొల్లపల్లి సత్తమ్మ తీసుకువచ్చి గంగాపూర్ వాగు ఒడ్డున ఉన్న గద్దెలపై ప్రతిష్టించారు. అలాగే గోలేటి పరిధిలోని పల్లవి ఫ్యాక్టరీ సమీపంలో ఇగురపు స్వామి కంకసిల్ల, కుంకుమ బరిడి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకువచ్చారు. పల్లవి ఫ్యాక్టరీ వెనకాల ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెలను గురువారం రాత్రి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి, గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వనదేవతలకు బంగారం సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో ఖైరిగూర పీవో నరేందర్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, డీజీఎం సివిల్ మదీనాబాషా, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మండల అధ్యక్షుడు కేసరి కిషన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. – రెబ్బెన సమ్మక్కను తీసుకువస్తున్న పూజారులుపూజలు చేస్తున్న జీఎం విజయ భాస్కర్రెడ్డి -
‘కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారు’
కాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కాగజ్నగర్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దాసోజు శ్రావణ్ అన్నారు. పట్టణంలోని వినయ్గార్డెన్లో గురువారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని అధినేత కేసీఆర్ సాధించడంతోనే ఈ రోజు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేకనే దొంక తిరుగుడు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. 24 నెలల్లో రెండుసార్లు సిట్ నోటీసులు ఇవ్వడం చరిత్రలోనే మొదటిసారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు సీపీ రాజ్కుమార్, శ్యాంరావు, సలీం, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నాయకులతో సమావేశంఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రావణ్ గురువారం ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆయనకు స్వాగతం పలికారు. దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ బుర్స పోచయ్య, నాయకులు అలీబిన్ అహ్మద్, మర్సోకోల సరస్వతి, జీవన్, సురేశ్, బాలకృష్ణ పాల్గొన్నారు. -
నిబద్ధతతో పని చేసేవాళ్లం
‘ అప్పుడు నిబద్ధత, నిజాయతీతో పనిచేసేవాళ్లం. ఎవ్వరికై నా ఏ పనైనా చేస్తామని మాట ఇస్తే చేసేవాళ్లం. పట్టణంలో అన్నీ మట్టిరోడ్లే ఉండే. ప్రస్తుతం చాలా మారింది. రాజకీయాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి..’ అని కాగజ్నగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పనిచేసిన పట్టణానికి చెందిన వనమాల రాములు, ముబీన్ కౌన్సిలర్, కలికోట రమణయ్య అన్నారు. మొదటి తరంలో కౌన్సిలర్గా పనిచేసిన వనమాల రాములును ఇప్పటికీ కౌన్సిలర్ రాములుగానే స్థానికులు పిలుస్తుంటారు. మున్సిపల్ అభివృద్ధి, పాలకవర్గం, ఎన్నికలు తదితర అంశాలపై గురువారం వారు ‘సాక్షి’తో ముచ్చటించారు. – కాగజ్నగర్టౌన్ -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఆసిఫాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. కలెక్టరేట్ సముదాయంలోని మహిళాశిశు సంక్షేమం, జిల్లా ఖజాన, ముఖ్యప్రణాళిక, పౌరసరఫరాల శాఖ, వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ విభాగం కార్యాలయాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. సిబ్బంది రాకపోకల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమయ పాలన పాటించని అధికారులు, సిబ్బందిని ఉపేక్షించబోమన్నారు. ఆలస్యంగా వచ్చేవారిని సీసీకెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మార్చి 15లోగా పనులు పూర్తిచేయాలిఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు మార్చి 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో గురువారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇంజినీరింగ్, అటవీశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సెర్ప్ ఏపీఎంలతో సమీక్షించారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులు మార్చి 15లోగా పూర్తి చేయాలన్నారు. రూ.10లక్షలతో గ్రామ సమాఖ్య భవనాలను నిర్మించేందుకు జిల్లాలో 222 భవనాలను మంజూరు చేశామని తెలిపారు. మండలానికి ఒకటి చొప్పున రూ.30లక్షలతో ఫుడ్ గ్రెయిన్ స్టోరేజీ గోదాంల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సర్పంచుల సహకారంతో పనులు వేగవంతం చేయాలన్నారు. సంపూర్ణత అభియాన్ 2.0లో భాగంగా బాలికలకు ప్రత్యేక మూత్రశాలలు నిర్మించాలని సూచించారు. -
మినీ ఇండియా.. ‘కాగజ్నగర్’
కాగజ్నగర్ పట్టణంకాగజ్నగర్టౌన్: పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్నగర్ మున్సిపాలిటీకి ప్రత్యేక చరిత్ర ఉంది. 1932లో నిజాం కాలంలో సర్సిల్క్ పరిశ్రమ, సిర్పూర్ పేపర్ మిల్లును స్థాపించారు. అప్పటివరకు కొత్తపేట గ్రామంగా ఉండగా ఆ తర్వాత నోటిఫైడ్ ఏరియాగా మారింది. పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి, ఉద్యోగం నిమిత్తం కార్మికులు వలసవచ్చి స్థిరపడ్డారు. బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, నేపాల్ తదితర ప్రాంతాల చెందిన వారు ఇక్కడ నివాసం ఉండటంతో పట్టణాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. భిన్న సంస్కృతుల ప్రజలు కలిసిమెలిసి ఆచారాలకు అనుగుణంగా పండుగలు జరుపుకొంటారు. దసరా నవరాత్రుల్లో దుర్గామాత, వినాయక నవరాత్రుల్లో వినాయక చవితి, ఛట్పూజలు, బతుకమ్మ, తదితర పండగలు ఘనంగా నిర్వహిస్తారు. 1958లో మున్సిపాలిటీ ఏర్పాటు భారీ పరిశ్రమలైన సర్సిల్క్ నుంచి నూలు వస్త్రం, ఎస్పీఎం నుంచి కాగితం దేశవిదేశాలకు ఎగుమతి చేసిన ఘన చరిత్ర పట్టణానికి ఉంది. బిర్లా యాజమాన్యం అతిథుల కోసం సర్సిల్క్ ఏరియాల్లో అప్పట్లోనే ప్రత్యేకంగా ఎయిరోడ్రమ్ను ఏర్పా టు చేసింది. పట్టణంలో అధిక భాగం సర్సిల్క్ క్వార్టర్లు, మరోవైపు ఎస్పీఎం క్వార్టర్లతో ఉన్న కొత్తపేట అభివృద్ధి చెందింది. కాగితం పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడంతో కాగజ్నగర్(హిందీలో కా గజ్ అంటే కాగితం, నగర్ అంటే పట్టణం)గా నామకరణం చేశారు. 1958లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పట్లో పట్టణ జనాభాకు అనుగుణంగా మట్టి రోడ్లు, ఓ ప్రధాన రోడ్డు ఉండేది. కాలక్రమేణా జనాభాకు అనుగుణంగా పట్టణాభివృద్ధి జరిగింది. 70వేలకు పైగా జనాభా కాగజ్నగర్ పట్టణంలో 1967లో 20 వార్డులు ఉండేవి. ప్రధానంగా కాలనీల్లో మురుగుకాలువలు, మట్టి రోడ్లు ఉండేవి. ఆ తర్వాత 20 నుంచి 30 వార్డులకు విస్తరించారు. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం సుమారు 70 వేలకు పైగా జనాభా ఉంది. 2020 ఎన్నికల్లో 44,946 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 51,205 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,004, మహిళలు 26,193 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. 1967లో తొలి ఎన్నికలు కాగజ్నగర్ మున్సిపాలిటీ 1967లో ఎన్నికలు జరగగా జనరల్ అభ్యర్థి మోటీచంద్ చౌర్దియా మొదటిసారి చైర్మన్గా ఎన్నికయ్యారు. 1972– 81 వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. 1981–86లో జూపాక నర్సయ్య, నక్కబాపు చైర్మన్లుగా పనిచేశా రు. 1987లో మూడోసారి జరిగిన ఎన్నికల్లో బుచ్చి లింగం విజయం సాధించారు. మళ్లీ 1995లో నర్స య్య రెండోసారి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2000లో సులేమాన్ బిన్ సయిద్ ఎన్నిక కాగా, చివ రి తొమ్మిది నెలలు దస్తగిరి పదవిలో కొనసాగారు. 2010 నుంచి 2014 వరకు మళ్లీ ప్రత్యేకా ధికారి పాలన కొనసాగింది. 2014లో సీపీ విద్యావతి, 2020లో సద్దాంహుస్సేన్ చైర్మన్లుగా కొనసాగారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కాగజ్నగర్టౌన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. కాగజ్నగర్ పట్టణంలో నామినేషన్ల కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల లోపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. భట్టుపల్లి చౌరస్తా, వినయ్ గార్డెన్, ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చెక్పోస్టులను పరిశీలించారు. కార్యక్రమంలో బ్రాంచ్ ఎస్సై సతీశ్, సీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి పాల్గొన్నారు. సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్లుకాగజ్నగర్టౌన్: అభ్యర్థుల సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తెలిపారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామి నేషన్లు స్వీకరించాలని, అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాలన్నారు. వేచి ఉండేందుకు కుర్చీలను ఏ ర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, అధికారులు రఫీక్, సిబ్బంది పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో జాప్యం!
తిర్యాణి: పంచాయతీల్లో పన్నుల వసూళ్లు ఊపందుకోలేదు. గడువు సమీపిస్తున్నా ఇంకా నెమ్మదిగా సాగుతోంది. దీంతో గడువులోగా పన్నుల లక్ష్యం సాధించడం గగనంగా మారింది. పంచాయతీల్లో నిధుల్లేక పాలకవర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరు పన్నులు వసూళ్లు. మేజర్ పంచాయతీలను మినహాయిస్తే చాలా పల్లెలకు ఇంటి పన్నులే ఆధారం. 2025– 26 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలల గడువు మాత్రమే ఉంది. జిల్లాలో ఇప్పటివరకు లక్ష్యంలో కేవలం 31.8 శాతం మాత్రమే సాధించారు. నెల క్రితం వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనుల్లో అధికారులు బిజీగా గడిపారు. ఇప్పుడిప్పుడే వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది ఉదయం నుంచి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రూ.6.05 కోట్ల లక్ష్యంజిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీల నుంచి ఆస్తి పన్నులు, పన్నేతర చార్జీల రూపంలో రూ 6.05కోట్లు వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు రూ.1.91 కోట్లు మాత్రమే వసూళ్లు జరిగాయి. జిల్లాలో అత్యధికంగా ఆసిఫాబాద్ మండలంలో 56 శాతం, పెంచికల్పేట్లో 53 శాతం, కెరమెరిలో 50 శాతం వరకు పన్ను వసూళ్లయ్యాయి. మరోవైపు అత్యల్పంగా చింతలమానెపల్లి మండలంలో 14 శాతం, జైనూర్లో 22 శాతం, తిర్యాణిలో 23 శాతం పన్నులు వసూళ్లయ్యాయి. తిర్యాణి లాంటి కొన్ని మండలాల్లో ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు తమను గెలిపిస్తే ఐదేళ్లపాటు ఇంటి పన్నులను తమ సొంత డబ్బులతో చెల్లిస్తామని సర్పంచ్ అభ్యర్థులు హామీలు గుప్పించారు. దీంతో పన్ను వసూళ్లలో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పన్నులే కీలకం..పల్లెలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు తదితర పనులు కోసం పన్నుల రూపంలో వచ్చిన నిధులను వినియోగిస్తారు. ట్రాక్టర్, వాటర్ ట్యాంక్ నిర్వహణతోపాటు మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలకు ప్రభుత్వం కేటాయించే నిధులు ఉపయోగపడుతాయి. కానీ రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పంచాయతీ సంబంఽధించిన నిధులు విడుదల చేయలేదు. ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా మారింది. మండలాల వారీగా పన్నుల వసూలు(రూ.లలో)మండలం లక్ష్యం వసూళ్లు శాతం ఆసిఫాబాద్ 41,65,020 23,06,852 56 బెజ్జూర్ 34,98,241 8,29,718 24 చింతలమానెపల్లి 28,10,373 4,02,192 14 దహెగాం 28,61,982 8,28,061 29 జైనూర్ 36,09,932 6,85,325 22 కాగజ్నగర్ 65,79,487 22,54,057 35 కెరమెరి 37,60,562 18,89,315 50 కౌటాల 59,52,533 17,24,261 29 లింగాపూర్ 10,85,994 3,85,758 36 పెంచికల్పేట్ 14,13,294 7,46,175 53 రెబ్బెన 84,99,381 21,47,340 26 సిర్పూర్(టి) 43,82,448 19,53,379 45 సిర్పూర్(యూ) 10,56,175 4,75,498 45 తిర్యాణి 35,47,860 7,90,943 23 వాంకిడి 73,29,795 17,70,759 24 ప్రత్యేక కార్యాచరణతో వసూళ్లుజిల్లాలో దాదాపు 50 శాతం వరకు ఇంటి పన్నుల వసూళ్లు పూర్తయ్యాయి. కానీ 31.8 శాతం సంబంధించిన పన్నుల వివరాలను ఆన్లైన్ చేశాం. మిగతావి త్వరలోనే ఆన్లైన్లో పొందుపరుస్తాం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలోగా వందశాతం పన్నులు వసూలు చేయాలని ఇప్పటికే పంచాయతీ సిబ్బందికి సృష్టమైన ఆదేశాలు జారీచేశాం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. జిల్లా ప్రజలందరూ సహకరించి సకాలంలో పన్నులు చెల్లించాలి. – భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి -
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం
ఆసిఫాబాద్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఆర్వోలు, ఏఆర్వోలను నియమించి, వారికి శిక్షణ అందించామన్నారు. ఆసిఫాబాద్లోని 9 ప్రాంతాల్లో 28 పోలింగ్ స్టేషన్లు, కాగజ్నగర్లోని 28 ప్రాంతాల్లో 85 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో, వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. ఆసిఫాబాద్కు రెండు స్టాటిస్టిక్, ఒక ఫ్లయింగ్ సర్వేయలెన్స్ బృందాలు, కాగజ్నగర్కు రెండు స్టాటిస్టిక్, ఒక ఫ్లయింగ్ సర్వేయలెన్స్ బృందాలు పని చేస్తున్నాయని వివరించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని, కాగజ్నగర్లో పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయిస్తామని, పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామని, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడంతో ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ర్యాలీల అనుమతి కోసం 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. లౌడ్స్పీకర్లకు ఎస్డీపీవోల వద్ద అ నుమతి పొందాలని, లైసెన్సుడ్ ఆయుధాలు కలిగి న వారు డిపాజిట్ చేయాలని, ఇతర వివరాలకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మొబైల్ నం. 87126 70505లో సంప్రదించాలని తెలిపారు. నామినేషన్ తిరస్కరింపబడితే ఆసిఫాబాద్ ఆర్డీవో, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ను సంప్రదించాలని సూచించారు. రాజకీయ పార్టీలు సహకరించాలి ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్రూమ్ నం.85008 44365 ద్వారా ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గద్దెలపైకి సారలమ్మ
రెండేళ్లకొకసారి వచ్చే వన దేవతల జాతర మహోత్సవం బుధవారం సారలమ్మ రాకతో మొదలైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ఒడిబియ్యం, ఎత్తు బంగారం, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోళ్లు, మేకలను బలిచ్చి పూజలు చేశారు. కంకల వనం నుంచి పూజారులు దేవార వినోద్, గొల్లపెల్లి సత్తమ్మ రెబ్బెన మండలం లక్ష్మిపూర్ శివారులో గద్దెల వద్ద సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజును ప్రతిష్టించారు. అలాగే గోలేటి పంచాయతీ పరిధిలోని పల్లవీ ఫ్యాక్టరీ వెనక భాగంలో ఉన్న గద్దెల వద్ద పూజారి ఇగురపు స్వామి సారలమ్మను గద్దైపె ప్రతిష్టించారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ పంచాయతీ పరిధిలోని కేస్లాపూర్ వన దేవతలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా భరిణి, పసుపు, కంకవనం తదితర పూజా సామగ్రితోపాటు బంగారం(బెల్లం) ఎత్తుకుని ఇంటి నుంచి వచ్చి పూజలు చేశారు. గోలేటి శివారులోని గద్దెలను సర్పంచ్ అజ్మీర బాబురావు దర్శించుకుని పూజలు చేశారు. – ఆసిఫాబాద్రూరల్/రెబ్బెన -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
రెబ్బెన: తమిళనాడులోని ఈరోడ్ ఎక్సెల్ కాలేజ్లో బుధవారం నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే 70వ జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మిటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ఆటతీరు ప్రదర్శించి జిల్లా జట్టును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపారన్నారు. వీరిలో షార్ప్స్టార్ బాల్బ్మాడ్మింటన్ అసోసియేషన్ నుంచి బాలుర విభాగంలో పిరిసింగులు సాయిచరణ్, సీహెచ్ గోపాలకృష్ణ, దామెర ప్రేందీప్, బాలికల నుంచి పూదరి శ్రావ్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, కోశాధికారి శంకర్, సెపక్తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, మహేందర్రెడ్డి, భాస్కర్ అభినందించారు. -
మున్సిపల్ పోరుకు నగారా
ఆసిఫాబాద్/కాగజ్నగర్టౌన్: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 11న పుర పోరు జరగనుంది. 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షె డ్యూల్ విడుదల చేశా రు. జిల్లాలో ఆసిఫా బాద్, కాగజ్నగర్ ము న్సిపాలిటీలు ఉన్నాయి. ఆసిఫాబాద్ పట్టణంలో 20 వార్డులు ఉండగా 13,927 మంది ఓటర్లు(పురుషులు 6,822, మహిళలు 7,103, ఇతరులు ఇద్దరు) ఉన్నారు. అ లాగే కాగజ్నగర్ పట్ట ణంలోని 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు(పురుషులు 25,004, మహిళలు 26,193, ఇతరులు 8 మంది) ఉన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 85008 44365 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. పోలింగ్ కేంద్రాల సమాచారం కోసం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి నామినేషన్లు15 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. నేటి(బుధవారం) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 1న అభ్యంతరాల స్వీకరణ, 2న వాటి పరిశీలన, 3 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అదేరోజు పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రదర్శిస్తారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహిస్తారు. 12న అవసరమైన చోట్ల రీపోలింగ్ ఉంటుంది. 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్, కాగజ్నగర్ మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వేషన్ అయ్యింది. నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్తోపాటు పారిశ్రామిక ప్రాంతం కాగజ్నగర్లో పట్టు నిలుపుకోవాలని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కాలనీల్లో పెరిగిన పర్యటనలుఎన్నికల నేపథ్యంలో కాలనీల్లో నేతల పర్యటనలు పెరిగాయి. ప్రధాన పార్టీల నాయకులు ప్రజాసమస్యలు అడిగి తెలుసుకుంటూ సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. రెండు పురపాలికల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మహిళా సంఘాలను సంప్రదిస్తున్నారు. మరో వైపు పార్టీ బీంఫాం కోసం నాయకుల ఇళ్ల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. రిజర్వేషన్లు ఇలా.. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ రిజర్వేషన్ వార్డులు జనరల్ 06, 09, 15, 17 జనరల్ మహిళ 07, 13, 14, 18, 19, 20 బీసీ జనరల్ 02, 03, 11 బీసీ మహిళ 05, 08 ఎస్సీ జనరల్ 01, 10 ఎస్సీ మహిళ 16 ఎస్టీ జనరల్ 04 ఎస్టీ మహిళ 12 కాగజ్నగర్ మున్సిపాలిటీ జనరల్ 05, 08, 10, 11, 24, 26 జనరల్ మహిళ 06, 07, 09, 14, 18, 20, 21, 23, 27 బీసీ జనరల్ 15, 16, 17, 22, 29 బీసీ మహిళ 01, 03, 04, 13 ఎస్సీ మహిళ 12, 19 ఎస్టీ జనరల్ 02, 25, 28 ఎస్టీ జనరల్ 30 ఆశావహుల జోరుఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆశావహులు టికెట్ల వేటలో జోరు పెంచారు. సమయం తక్కువగా ఉండటంతో పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఆయా పార్టీలో ఏళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న వారితోపాటు కొత్తవారు టికెట్లు ఆశిస్తున్నారు. రిజర్వేషన్లు కలిసొచ్చిన సామాజిక వర్గానికి చెందిన వారు పదవుల కోసం ఉవ్విళ్లురుతున్నారు. ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, కోనేరు కోనప్ప అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో బీఫాంలు ఎవరికి దక్కుతాయనేది కొన్నిరోజుల్లో తేలనుంది. మరోవైపు టికెట్లు దక్కనివారు స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ‘మోడల్’ విద్యార్థి
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని బోయిని వర్షిని జాతీయస్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. పాఠశాల ఆవరణలో మంగళవారం పీడీ తిరుపతితో కలిసి విద్యార్థిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 18 వరకు ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎ ఫ్ అండర్– 14 నెట్బాల్ పోటీల్లో వర్షిని ఉత్తమ ప్రతిభ చూపిందన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలో నాందేడ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీవర్ధన్, వెంకటేశం పాల్గొన్నారు. -
తాత్కాలిక ఏర్పాట్లతోనే సరి..!
రెబ్బెన: ప్రసిద్ధిగాంచిన రెబ్బెన మండలం గంగాపూర్లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అసౌకర్యాల మధ్యే భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. కేవలం జాతర సమయంలోనే అధికారులు, పాలకుల హడావుడి కనిపిస్తోంది. తాత్కాలిక ఏర్పాట్లతో చేతులు దులుపుకొంటున్నారు. మహోత్సవం పూర్తయిన తర్వాత ఇటువైపు కన్నెతి చూడడం లేదు. దీంతో ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా జాతర నిర్వహణ, ఇతర ఖర్చులకే నిధులు హారతి కర్పురంలా కరిగిపోతున్నాయి. అభివృద్ధికి మాత్రం ఒక్క రూపాయి ఉపయోగపడటం లేదని భక్తులు ఆగ్రహిస్తున్నారు. దారే ప్రధాన సమస్యగంగాపూర్ శివారులో స్వయంభూగా వెలిసిన శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు రెండో తిరుపతిగా భావించి ఆలయానికి వస్తుంటా రు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 31 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఇతర రోజుల్లోనూ భక్తుల తా కిడి అధికంగా ఉంటుంది. కానీ దారి సమస్యతో తి ప్పలు తప్పడం లేదు. గంగాపూర్ వాగుపై ప్రధాన రోడ్డు నుంచి ఆలయం వరకు వంతెన సౌకర్యం కల్పించాలని ఏళ్లుగా వేడుకుంటున్నారు. జాతర స మయంలో తాత్కాలిక దారి సౌకర్యం కల్పిస్తున్నా రు. వర్షాకాలంలో వాగు ప్రవాహానికి అది కొట్టుకుపోతోంది. ఆలయం వరకు వాహనాలు వెళ్లే వీలు లేక ప్రముఖులు సైతం వాగులో నుంచి నడిచి వెళ్లాల్సి వస్తోంది. తలనీలాలు, వ్రతాలు, ఇతర శుభకా ర్యాలకు వచ్చే భక్తులు దారి సౌకర్యం లేక ఆలయం వరకు సామగ్రిని మోసుకెళ్తున్నారు. ఆలయం వెను క భాగంలో ఉన్న గుట్ట పైనుంచి గతంలో దారి కో సం ఏర్పాట్లు చేసినా వర్షాలకు దెబ్బతిని వినియోగంలో లేకుండా పోయింది. కలగానే మండపంమూడు రోజుల జాతర మహోత్సవంలో భాగంగా పౌర్ణమికి ఒక్కరోజు ముందు వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. గతంలో రూ.25లక్షల నిధులతో కల్యాణ మండపం మంజూరైనా పనులు పూర్తికాలేదు. దాతల సహకారంతో సిమెంట్ పూతలు పూర్తి చేశారు. అది అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగపడుతోంది. స్వామి వారి కల్యాణాన్ని వాగులో టెంట్ల కింద నిర్వహిస్తున్నారు. అలాగే మూడేళ్ల క్రితం క్యూలైన్ల మండపం నిర్మాణం కోసం రూ.50లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రె బ్బెనలోని రైల్వేగేట్ నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్డు పనులు సైతం పెండింగ్లోనే ఉన్నాయి. అధి కారులు, పాలకులు ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.ఆలయం ఎదుట వాగులో తాత్కాలికంగా వేసిన దారి ఆలయంపై పట్టింపేది..?జాతర ఖర్చులు ఆలయానికి వచ్చే ఆదాయాన్ని హారతి కర్పూరంలా కరిగిస్తున్నాయి. తైబజార్, పార్కింగ్, బస్టాండ్ వంటి అవసరాలకు ఆలయానికి సొంత స్థలం లేదు. రైతుల నుంచి అద్దెకు స్థలానికి తీసుకుంటున్నారు. మూడు రోజుల కోసం పార్కింగ్, తైబజార్ నిర్వహణ స్థలానికి దాదాపు రూ.5లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఆలయం ముందు, వాగుపై తాత్కాలిక రోడ్డు సౌకర్యం కోసం ట్రాక్టర్లతో మట్టిని పోసి చదును చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా సింగల్గూడ, పాత కోల్యార్డుల వైపు ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేసి దారి మళ్లిస్తున్నారు. ఆయా రోడ్ల కోసం వందల ట్రిప్పుల మట్టి పోస్తున్నా.. వర్షాకాలంలో వర్షాలకు రోడ్లు నీటిపాలవుతున్నాయి. మరోవైపు జాతరకు వారం రోజుల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారులు.. మహోత్సవం పూర్తయ్యాక కన్నెత్తి చూడరనే అపవాదు ఉంది. సాధారణ రోజుల్లో కనీస వసతులు ఉండవు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు స్వామి వారి సన్నిద్ధిలో బస చేసేందుకు నేటికీ ఏర్పాట్లు లేవు. వసతి గదులు ఏర్పాటు చేస్తే భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్నా అటువైపు దృష్టి సారించడం లేదు. -
విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని పాడిబండ దిశామోడల్ స్కూల్ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం ప్రజలకు కలిగించాలన్నారు. పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలిపదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారితో కలిసి ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు సమయం తక్కువగా ఉందని, విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంఈవోలు తమ పరిధిలోని పాఠశాలలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎంఈవోలు సుభాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్తో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టాలన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటా యింపులో బాధ్యతాయుతంగా వ్యవహరించాల ని సూచించారు. కార్యక్రమంలో శిక్షకులు ఊశన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలిమున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అ న్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, డీజీపీ శివధర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, అదన పు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికలపై సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలు చేయాలని, ఫ్లయింగ్ స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్తో కలిసి వీడియోకాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్రూం, కౌంటింగ్ కేంద్రాల్లో భద్రత చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు గజానంద్, తిరుప తి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
‘టీబీజీకేఎస్ హయాంలోనే కొత్త హక్కులు’
రెబ్బెన: జాతీయ సంఘాలను కాదని సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్కు గుర్తింపు హోదా కల్పిస్తే తమ హయాంలోనే కొత్త హక్కులు సాధించామని ఆ యూనియన్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు అన్నారు. టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం గోలేటి టౌన్షిప్లోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో టీబీజీకేఎస్ పతకం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 2003లో ప్రొ.జయశంకర్ చేతుల మీదుగా టీబీజీకేఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తిరిగి తీసుకువచ్చామని అన్నారు. కేసీఆర్ సహకారంతో ఇంక్రిమెంట్, ఉచిత విద్యుత్, కార్మి కుల తల్లిదండ్రులకు ఉచితవైద్యం వంటి అనేక సౌ కర్యాలు అందించామని తెలిపారు. గత రెండేళ్లుగా సింగరేణిలో ఉన్న సంఘాలు యాజమాన్యంతో కు మ్మౖక్కై కార్మికులను ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. సీహెచ్పీలో శ్రీనివాస్, వర్క్షాప్లో మంగీలాల్, సత్యనారాయణ జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, సెంట్రల్ నాయకులు సమ్మయ్య, శ్రీ నివాస్, ఫిట్ కార్యదర్శులు వెంకటేశ్, రమేశ్, శ్రీని వాస్, గణపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
గనులు పరిశీలన
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన డోర్లి–1, డోర్లి–2 ఓసీపీలు, ఉత్పత్తి సాధిస్తు న్న ఖైరిగూర ఓసీపీని అదనపు కలెక్టర్ డేవిడ్ సందర్శించారు. ఫైనల్ మైన్ క్లోజర్ తనిఖీల్లో భాగంగా మూతపడిన గనితోపాటు పరిసర ప్రాంతాలు, సమీప గ్రామాల్లో చేపట్టిన పర్యావరణ, ప్రజాహిత పనులు, కట్టడాలు, రోడ్లు, వంతెనలు పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్, గోలేటి ఓసీపీ పీవో ఉమాకాంత్, సర్వే అధికారి అఫ్సర్పాషా, ఎస్టేట్స్ అధికారి సాగర్, మేనేజర్ మహేశ్ పాల్గొన్నారు. -
నాగోబా సన్నిధిలో భక్తజనం
ఇంద్రవెల్లి: నాగోబా ఆలయంలో సోమవారం భక్తజన సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో ఉ మ్మడి జిల్లా నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జీఎస్టీ కమిషనర్ వై.శ్రీలీల నాగోబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు శాలువాతో సత్కరించి నాగోబా ప్రతిమ అందజేశారు. నేడు నాగోబా జాతర హుండీ లెక్కించనున్నట్లు దేవదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, పూజరి మెస్రం శేక్నాథ్, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవా న్ని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీ వో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ ఆశ్రమాలు, గు రుకులాల విద్యార్థులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఎకో టూరిజం శాఖ పరిధిలో కుంటాల, ఉట్నూర్ కోట, అడ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్న ట్లు తెలిపారు. అనంతరం కేబీ కాంప్లెక్స్ క్రీడా మై దానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించా రు. విద్యార్థులు పలు సినీ, దేశభక్తి గీతాలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఐటీడీఏ పరిధిలో ఉద్యోగులకు బెస్ట్ అప్రిషియేషన్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కర్తవ్య్పథ్లో మనోళ్లు
భీమిని: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలోని కర్తవ్య్పథ్లో నిర్వహించిన వేడుకల్లో భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన ఇద్దరు కళాకారులు పాల్గొని ఒగ్గుడోలు విన్యాసం ప్రదర్శించారు. సౌత్ జోన్ సెంటర్ నుంచి 30 మందిని ఎంపిక చేయగా అందులో వీగాం గ్రామానికి చెందిన బొప్పనపల్లి రవి, అమరగొండ అజయ్ ఉన్నారు. వీరిద్దరూ ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, జాతీయ పురస్కార గ్రహీత ఒగ్గు రవి నేతృత్వంలో ఈ నెల 8న ఢిల్లీ వెళ్లి రిహార్సల్స్ చేశారు. కర్తవ్య్పథ్ వేదికగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ఒగ్గు డోలు ప్రదర్శనకు తమకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని రవి, అజయ్ పేర్కొన్నారు. -
ఉత్తమ ఉద్యోగికి సన్మానం
శ్రీరాంపూర్: సింగరేణి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికై న కంది సమ్మిరెడ్డిని సోమవారం కొత్తగూడెంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కంపెనీ సీఎండీ కృష్ణభాస్కర్ సన్మానించారు. ఆర్కే న్యూటెక్ గనిలో ఎస్డీఎల్ ఆపరేటర్గా పనిచేస్తున్న సమ్మిరెడ్డి ఎస్డీఎల్ ద్వారా రక్షణతో కూ డిన అధిక ఉత్పత్తికి కృషి చేయడంతో పాటు మెరుగైన మస్టర్లు కలిగి ఉండటంతో కంపెనీ ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఇతర అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రపతి పతకానికి ఎంపికమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యా ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 2026 సంవత్సరానికిగానూ భార త ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాబితాలో వెంకటరాములు చోటు దక్కించుకున్నారు. అసాధారణ సేవలకు గుర్తింపుగా లభించిన ఈ అత్యున్నత పురస్కారంపై బెటాలియన్ అధికారులు, సిబ్బంది వెంకటరాములును ప్రత్యేకంగా అభినందించారు. నలుగురికి ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతిఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నలుగురికి ఎక్సైజ్ ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎం.రాజేశ్వర్, ఆదిలాబాద్ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, నిర్మల్ జిల్లా ఎకై ్సజ్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి.ముత్యం, కుమురంభీం ఆసిఫాబాద్ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న డి.రాజశేఖర్కు ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతులు లభించాయి. ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణంబెల్లంపల్లి: మేడారం సమ్మక్క–సారలక్క జాతరకు భక్తులను సురక్షితంగా చేరవేయడం కోసం ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. సోమవారం బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మేడారం జాతర బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బెల్లంపల్లి బస్టాండ్ నుంచి 79 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపీ రవికుమార్, ఆర్టీసీ ఎండీ రాజశేఖర్, ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్ డిపో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
డీలర్ల వద్దే వాహన రిజిస్ట్రేషన్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యతలను ప్రభుత్వం షోరూమ్ డీలర్లకు అప్పగించింది. దీంతో వాహనాదారులకు మధ్యవర్తి ప్రమేయం లేకుండా ఉండడమే కాదు ఖర్చు, సమయం ఆదా అవుతుంది. వాహనదారులకు ఇకపై రిజిస్ట్రేషన్ కష్టాలు దూరం కానుండగా.. రవాణా శాఖ అధికారులకు పనిభారం తగ్గింది. ప్రభుత్వం రవాణా శాఖ, డీలర్ షోరూమ్ను అనుసంధానం చేస్తూ ఓ కొత్త సాఫ్ట్వేర్తో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ద్విచక్ర వాహన షోరూమ్లు 20కి పైగా ఉండగా ఇందులో 12 షోరూమ్లకు మాత్రమే వాహన రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు. వివిధ కంపెనీల కార్ల షోరూమ్లు ఉన్నా ఒక్క షోరూమ్ మినహా మిగతా వాటి ప్రధాన షోరూములన్నీ కరీంనగర్లోనే ఉన్నాయి. ఇక్కడ కారు కొన్నా రిజిస్ట్రేషన్కు కరీంనగర్ వెళ్లాల్సిందే. ద్విచక్ర వాహనాలు రోజుకు 30 నుంచి 60 వరకు, ఐదు నుంచి పది వరకు కార్లు విక్రయిస్తున్నారు. గతంలో వాహనం విక్రయించిన సమయంలో అన్ని కార్యకలాపాలు, లావాదేవీలు పూర్తి చేసి తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం ఇచ్చేవారు. ఆ పత్రాలు తీసుకుని వాహనదారుడు రిజిస్ట్రేషన్ కోసం ర వాణా శాఖకు వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం కొంత డబ్బు ఖర్చు, ఓ మధ్యవర్తి ప్రమేయం ఇలా స మయం వృథా అయ్యేది. ఇప్పడు ఆ సమస్యలేవీ ఉండవు. వాహన డీలర్ వద్దే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ప్ర త్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్యాన్సీ నంబర్కు అదనపు రుసుం వాహనాలకు కోరుకున్న, ఫ్యాన్సీ నంబరు కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్తో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఇందుకు అదనపు రుసుంచెల్లిస్తే నంబ ర్ను రవాణా శాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కొంత సమయం పడుతుందని, అప్పటివరకు నిరీక్షించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.


