Kumuram Bheem District Latest News
-
అసంపూర్తిగా ‘అప్పపల్లి’
పునాది దశలోనే అప్పపల్లి వంతెన ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి వాగుపై 2024 ఏప్రిల్లో రూ.1.86 కోట్లతో వంతెన పనులు ప్రారంభించారు. పునాది దశలోనే నిలిచి ఏడాది గడుస్తున్నా మళ్లీ ప్రారంభించలేదు. వర్షాలకు అప్పపల్లి, ఆర్ఆర్ కాలనీవాసుల ఇబ్బందులు పడుతున్నారు. అంకుసాపూర్కు వెళ్లే దారిలోని వాగుపై వంతెన ఎత్తు తక్కువ ఉండటంతో వరద వంతెన పైనుంచి పారుతోంది. సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. గతేడాది వంతెన తెగిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకున్నారు. 2023లో అదే గ్రామానికి చెందిన బాలుడు వాగులో పడిపోవడంతో అతడిని రక్షించే క్రమంలో మరో వ్యక్తి మృతి చెందాడు. -
పట్టణ పేదలకు ‘ఉపాధి’ పనులు కల్పించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): పట్టణ ప్రాంత పేదల కు ఉపాధిహామీ పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీ నర్ ముంజం ఆనంద్కుమార్ అన్నారు. మండలంలోని రాంపూర్లో మంగళవారం ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కూ లీల వేతన బకాయిలు వెంటనే విడుదల చే యాలని, కూలీలకు రోజుకు రూ.600, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలనే డిమాండ్తో ఈ నెల 30న కలెక్టరేట్ ముట్టడి కార్య క్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కూలీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం, శ్రావణి, కూలీలు పాల్గొన్నారు. -
రైతులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని డబ్బా గ్రామంలో మంగళవారం అటవీశాఖ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పోడు భూములు స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు వస్తున్నారనే సమాచారంతో రైతులు భూముల వద్దకు చేరుకుని అధి కారులను అడ్డుకున్నారు. పోడు భూములు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని వారికి వివరించారు. ఎఫ్ఆర్వో ఇక్బాల్ మాట్లాడు తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అటవీ భూమి స్వాధీనం చేసుకుంటున్నామని తెలి పారు. పోడు పట్టాలు ఉన్న ఆదివాసీల భూ ములను ముట్టుకోమని స్పష్టం చేశారు. ఒక దశలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. అనంతరం ఫారెస్టు అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
తొలకరికే దారి తిప్పలు
గుండివాసుల గోస● వర్షాలకు వాగుల్లో మొదలైన వరద ● తెగిన తాత్కాలిక వంతెనలు ● రాకపోకలకు ఇబ్బందులుజిల్లాలోని వాగుల్లో తొలకరి వానలకే వరద మొదలైంది. వేసవిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మట్టిదారులు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే జిల్లాలోని పలు గ్రామాలకు రహదారి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏళ్లుగా వంతెనల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన నిర్మాణం దశాబ్దాలు గడుస్తున్నా పూర్తికావడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తాత్కాలిక వంతెన తెగిపోయింది. గ్రామస్తులకు రవాణా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. మొదట గుండి వంతెన నిర్మాణానికి 2006లో రూ.3.60 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేశారు. పిల్లర్ దశ వరకు పనులు చేపట్టారు. ఆ తర్వాత పిల్లర్ల ఎత్తు పెంచాలని 2024లో రూ.3.25 కోట్లతో టెండర్లు మళ్లీ పిలిచారు. టెండర్ ప్రక్రియ పూర్తయినా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వంతెన కోసం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన సైతం తెలిపారు. జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో గుండి గ్రామం ఉంది. వాగు ఉప్పొంగితే దుబ్బగూడ, కోమటిగూడ నుంచి 30 కిలోమీటర్లు తిరిగి ఆసిఫాబాద్ పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏటా వర్షాకాలంలో విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల వర్షానికి గుండి వాగులో తెగిన తాత్కాలిక వంతెనవాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం ఖమాన, కనర్గాం మీదుగా కాగజ్నగర్ వెళ్లే రహదారిలోని వాగుపై 2006లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి పలుమార్లు కాంట్రాక్టర్లు మారుతున్నా పనులు మాత్రం పూర్తికావడం లేదు. పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. 2023లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉప్పొంగి వంతెన కోసం నిర్మించిన పిల్లర్ల పైనుంచి ప్రవాహం వెళ్లింది. వంతెన నిర్మాణంలో మార్పు కోసం ఇంజినీరింగ్ అధికారులు కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. దానికి అనుగుణంగా మళ్లీ పనులు చేపట్టేందుకు టెండర్ వేశారు. టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు అప్పట్లో వెల్లడించారు. కానీ ఇప్పటికీ కదలిక కనిపించడం లేదు. ఏటా వర్షాకాలం ముగిసిన తర్వాత నందూప, చోర్పల్లి గ్రామస్తులు సొంతంగా రూ.వేలు ఖర్చు చేసి తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ వంతెన తెగిపోయింది. వాంకిడి మండల కేంద్రంలోని ప్రజలు ఖమాన, కనర్గాం, చోర్పల్లి, నందూప, అంకుసాపూర్ మీదుగా కాగజ్నగర్ పట్టణానికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అదే ఆసిఫాబాద్ మీదుగా వెళ్లాలంటే దాదాపుగా 40 కి.మీ.లు ప్రయాణించాలి.చొరవ చూపాలి వంతెన నిర్మాణ పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్ పిల్లర్ ఎత్తు వరకు పనులు చేసి అసంపూర్తిగా వదిలేశాడు. ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి. వంతెన పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. – రవీందర్, మాజీ ఎంపీటీసీ వంతెన నిర్మించాలి అనార్పల్లి వాగుపై వంతెన నిర్మించాలని ఏళ్లుగా అధికారులను వేడుకుంటున్నాం. గతంలో నిధులు మంజూరు కాగా, పనులు సైతం ప్రారంభించారు. కానీ అర్ధంతరంగా ఆగిపోయాయి. జూన్ ప్రారంభం కాకముందే వర్షాలు పడుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. – కుమురం బొజ్జు పటేల్, కరంజివాడ, మం.కెరమెరి కష్టాలు ఎప్పుడు తీరుతాయో.. మా ఊరికి వెళ్లాలంటే వాగుపై వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలంలో చిన్నవానకే వాగు ఉప్పొంగుతుంది. ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. వంతెన పనులు ప్రారంభించి 19 సంవత్సరాలు అవుతున్నా పనులు మాత్రం పూర్తి కాలేదు. – రవి, గుండి, మం.ఆసిఫాబాద్ 40 కి.మీ.లు తిరిగి వెళ్లాలి మా గ్రామం నుంచి నందూప మీదుగా కాగజ్నగర్ 20 కి.మీ.లు మాత్రమే ఉంటుంది. పని నిమిత్తం కాగజ్నగర్ పట్టణానికి వెళ్లాలంటే వాంకిడి, ఆసిఫాబాద్ మీదుగా 40 కి.మీ.లు తిరిగి వెళ్లాలి. వర్షాకాలం అనంతరం తాత్కాలిక వంతెన ఉండటంతో ప్రయాణం సులువవుతుంది. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి శాశ్వత వంతెన నిర్మాణం పూర్తిచేయాలి. – నగోషె కేశవ్రావు, దుబ్బగూడ, మం.వాంకిడి●ఏళ్లుగా పిల్లర్ల దశలోనే.. -
బదిలీలతో ఇక్కట్లు!?
● రిలీవ్ కాకుండా విధులకు తహసీల్దార్లు డుమ్మా ● నాలుగు మండలాల్లో నిలిచిన ధ్రువపత్రాల జారీ ● ఎఫ్ఏసీగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వని రెవెన్యూ అధికారులు ● సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల వద్ద ప్రజల పడిగాపులు ● సోమవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్ చేసిన కలెక్టర్ సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు సామాన్య ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. బదిలీ అయిన తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ సోమవా రం రాత్రి వరకు రిలీవ్ చేయలేదు. అయితే వారు తమ కార్యాలయాలకు వెళ్లకపోవడంతో పాలనపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, క ళాశాలలు తెరిచే సమయంలో విద్యార్థులకు కులం, నివాసం, ఈబీసీ, ఓబీసీ ధ్రువపత్రాలు, భూముల లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఎల్టీఆర్, ఇతర పరిశీలన సంబంధిత అంశాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 13 రోజులుగా ప్రజలు, విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సుముఖత చూపని వైనం..గత ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి పలువురు తహసీల్దార్లు పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో కొందరు తిరిగి జిల్లాకు రాగా.. మిగిలిన వారు మళ్లీ ఇక్కడ పనిచేయడానికి సుముఖత చూపలేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్లు తమ సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించడంతో ఈ నెల 15 అందరినీ బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిర్పూర్(యూ), కెరమెరి, ఆసిఫాబాద్ మండల తహసీల్దార్లతోపాటు కలెక్టరేట్ ఎన్నికల విభాగంలో పనిచేసే ఒకరు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో మరో నలుగురిని ఇక్కడికి కేటాయించారు. ఒకరు మరుసటి రోజే బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించుకోగా.. మరో అధికారి సరస్వతీ నది పుష్కర విధుల్లో ఉన్నారు. ఒక అధికారి ఇక్కడ వచ్చి రిపోర్టు చేయకుండా వేచిచూసే ధోరణిలో ఉండగా.. మరొకరు మాత్రం కలెక్టర్ వద్ద రిపోర్ట్ చేశారు. భారీస్థాయిలో పైరవీలు.. జిల్లాలో ఖాళీ ఏర్పడిన స్థానాల్లో నూతనంగా తహసీల్దార్లను నియమించకపోవడం వెనుక రాజకీయ నేతల ఒత్తిళ్లే కారణమన్న చర్చ జరుగుతోంది. జిల్లాకు వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చే క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు వెళ్లడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బదిలీపై వచ్చిన అధికారులు సైతం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అందువల్లే ఇక్కడికి వచ్చి రిపోర్టు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రం, ఆదాయ వనరుగా పేరున్న ఆసిఫాబాద్ మండల తహసీల్దారుగా పనిచేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో 15 మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు తమ సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ముందే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, కదిలించకుండా చూడాలని కోరుతూ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సైతం బదిలీల అంశంపై కసరత్తు చేసినట్లు తెలిసింది. జిల్లాలో పనిచేయని తహసీల్దార్లను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాలుగు మండలాలతోపాటు మరికొన్ని మండలాల్లోనూ తహసీల్దార్లు బదిలీ కావచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తలచిందొకటి.. జరిగిందొకటి!కలెక్టర్ బదిలీ అయిన తహసీల్దార్లకు రిలీవింగ్ ఆర్డర్ ఇస్తే.. పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో వారిని ఆపి ఉంచారు. సదరు అధికారులు మాత్రం 13 రోజులపాటు విధులకు హాజరు కాకుండా పాలన కుంటుపడేలా చేసి జిల్లా సర్వోన్నతాధికారి ఉద్దేశానికి తూట్లు పొడిచారు. బదిలీ అయిన తహసీల్దార్లు ఎవరూ కార్యాలయాలకు వెళ్లడం లేదని ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ.. వారి స్థానంలో డీటీలకు ఎఫ్ఏసీ ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. లింగాపూర్, సిర్పూర్(యూ), కెరమెరి, ఆసిఫాబాద్ మండల కార్యాలయాల్లో ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బదిలీల అంశంపై ఉన్నతస్థాయి, రాజకీయ ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో సోమవారం రాత్రి హడావుడిగా నలుగురు తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలో ఎఫ్ఏసీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం ఆసిఫాబాద్ మండలానికి మాత్రం డీటీ పోచయ్యకు తహసీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఒకటి రెండు రోజుల్లో ఆయా స్థానాల్లో పూర్తిస్థాయి తహసీల్దార్లను నియమించనున్నారని సమాచారం. -
‘సిర్పూర్’ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకాగజ్నగర్టౌన్: అసెంబ్లీలో ప్రజల సమస్యలు లేవనెత్తి, సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే హరీశ్బాబు అన్నారు. ప ట్టణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలో తన పై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యాఖ్యలు చేశారని అన్నారు. పదేళ్లపాటు 10 నుంచి 20 కిలోల ధాన్యం కటింగ్ చేయించి అక్రమంగా సంపాదించారని, సిర్పూర్ పేపరు మిల్లును వాడుకుని కార్మికులను నట్టేట ముంచారని, గుర్తింపు సంఘం ఎన్నికల గురించి ఆలోచించలేదని ఆరోపించారు. కొండపల్లిలో రెండు వేల ఎకరాలు, డబ్బా గ్రామంలో రెండు వేల ఎకరాల చొప్పున వేల ఎకరాల్లో ఫారెస్టు అధికారులు మొక్కలు నాటారని, దీనికి బాధ్యత ఆనాడు అధికారంలో ఉన్న కోనేరు కోనప్ప ది కాదా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజె క్టు నిర్మిస్తామని స్పష్టం చేశారు. కోనప్ప అసలు ఏ పార్టీలో ఉన్నాడో... ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలే ని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని సహించలేక ఆయన అసహనానికి గురవుతున్నారని అన్నారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శివ, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, అసెంబ్లీ కన్వీ నర్ గొల్లపల్లి వీరభద్రచారి, మాజీ జెడ్పీటీసీ నీరటి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మనోహర్ గౌడ్, తిరుపతి, కుమారస్వామి, తిరుపతి, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
అనార్పల్లి వాగులో వరద
కెరమెరి(ఆసిఫాబాద్): గత వారంలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు మండలంలోని అనార్పల్లి వాగులో వరద మొదలైంది. మళ్లీ మంగళవారం సైతం వర్షం పడటంతో అవతలి వైపు ఉన్న కరంజివాడ, పెద్ద కరంజివాడ, జన్కాపూర్, బోరిలాల్గూడ, శంకర్గూడ తదితర పది గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు తాత్కాలిక వంతెన సైతం కొట్టుకుపోవడంతో బైక్లు కూడా వెళ్లడం కష్టంగా మారింది. ప్రతీ అవసరానికి కెరమెరి మండల కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా, మే నెలలోనే వరద రావడంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. -
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజల సంక్షేమం కోసం అధికా రులు చిత్తశుద్ధితో పనిచేయాలని, కలెక్టర్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ గతంతో పోల్చితే ఈ ఏడాది వరి ధాన్యం సేకరణ అధికంగా జరిగిందన్నారు. భూభారతి చట్టంలో భాగంగా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలి పారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించి అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ను లక్ష్యాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఆర్డీవో దత్తారావు, గృహనిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దులో ఏనుగుల సంచారం
చింతలమానెపల్లి(సిర్పూర్): సరిహద్దుల్లో ఏనుగుల సంచారంతో జిల్లా అటవీశాఖ అప్రమత్తమైంది. గతేడాది ఏప్రిల్లో చింతలమానెపల్లి మండలం బూరెపల్లి, పెంచికల్పేట్ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు చంపిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. జిల్లా నుంచి ఏనుగు సరిహద్దు దాటేవరకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని మురుంగావ్ అటవీ ప్రాంతంలో సుమారుగా 25కు పైగా ఏనుగులు ఉన్న గుంపు తిరుగుతూ ఉంటుంది. ఈ ఏనుగుల గుంపు నుంచే జిల్లాకు గతేడాది ఏనుగు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు. తాజాగా అదే గుంపునకు చెందిన ఏనుగులు గడ్చిరోలి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించాయి. మూడు నెలల నుంచి గడ్చిరోలి జిల్లా కేంద్రం సమీపంలోని కాఠాని, వైన్గంగ నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాల సమీపంలో తిరుగుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి ఏకంగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి రావడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం కోసం సంప్రదింపులుగడ్చిరోలి నుంచి చాముర్షి వరకు ఉన్న అటవీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుకు ఆనుకుని ఉంది. గడ్చిరోలి జిల్లాలోని ఆష్టి సమీపంలోని అటవీ ప్రాంతం చింతలమానెపల్లి మండలానికి ప్రాణహిత నది మాత్రమే హద్దుగా ఉంది. గతేడాది ఇదే ప్రాంతం నుంచి ఏనుగు మన జిల్లాలోకి ప్రవేశించింది. చాముర్షి తాలూకా కేంద్రం సమీపంలోని వ్యాడ్ గ్రామంలో ఒక యువకుడిపై నెల రోజుల క్రితం ఏనుగు దాడి చేయడంతో మృతి చెందాడు. గడ్చిరోలి పట్టణానికి మన సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల రోడ్డుమార్గం ఉండగా.. అటవీ ప్రాంతం గుండా 50 లేదా 60 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర అటవీ అధికారులతో సమాచారం తెలుసుకుంటున్నారు. ఏనుగులు సంచరిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండగా.. వాస్తవాలు తెలుసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఖర్జెల్లి ఎఫ్ఆర్వో ఇక్బాల్ మాట్లాడుతూ.. సమాచారం కోసం గడ్చిరోలి జిల్లా అటవీ అధికారులతో సంప్రదించామని తెలిపారు. స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏనుగులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు తక్కువని తెలిపారు. అప్రమత్తమైన జిల్లా అటవీశాఖ -
పాత స్టేషన్.. నయా కిడ్స్జోన్
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి పోలీస్ స్టేషన్ నూతన భవనంలోకి మారిన తర్వాత పాత భవనం సీఐ కార్యాలయంగా కొనసాగిస్తున్నారు. అక్కడ ఖాళీగా ఉన్న గదులు, హాల్ పిల్లలకు ఉపయోపడాలనే ఉద్దేశంతో ఏఎస్పీ చిత్తరంజన్ సరికొత్త ఆలోచన చేశారు. చిన్నారులను ఆకర్శించేలా హాల్లో ఆట వస్తువులు, బొమ్మలు, బెలూన్స్ ఏర్పాటు చేసి కిడ్స్ జోన్గా రూపొందించారు. చెస్, క్యారమ్, కిక్ బాక్సింగ్ కిట్, బాల్స్ టబ్, జారుడు బల్ల, తదితరాలు అందుబాటులో ఉంచిన ఈ కిడ్స్జోన్ ను సీఐ సత్యనారాయణతో కలిసి ఏఎస్పీ సోమవా రం ప్రారంభించారు. ఏఎస్పీ మాట్లాడుతూ పోలీస్ క్వార్టర్లలో నివాసం ఉంటున్న పిల్లలకు ఆటలాడుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఎస్పీ ఆదేశాల మేరకు పాత పోలీస్స్టేషన్ భవనంలో కిడ్స్ జోన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 15 మంది చిన్నారులకు ఉపయోగపడేలా ఆట వస్తువులు అందుబాటులో ఉంచామన్నారు. పిల్లలు ఒకేచోట ఆడుకోవడం, వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వారిలో స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. తిర్యాణి మండలంలోని పాత పోలీస్ స్టేషన్ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థులు వినియోగించుకునేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సైలు ప్రశాంత్, మధుకర్, ఏఎస్సై పోశెట్టి, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్అర్బన్: ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా పోలీ స్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. అధికారుల దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
క్రీడాకారిణికి ఆర్థికసాయం
ఆసిఫాబాద్అర్బన్: ఆసియా కప్ అత్యాపత్యా పోటీలకు ఎంపికై న క్రీడాకారిణి గెడం సుహాసినిని జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి శాలువాతో సన్మానించారు. రూ.25 వేల ఆర్థికసాయం అందించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ గురుకుల పాఠశాలలో సెకండియర్ చదువుతున్న సుహాసిని ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు కేరళలో జాతీయస్థాయి సీనియర్ ఫెడరేషన్ అత్యాపత్యా పోటీల్లో ప్రతిభ చూపింది. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు వెస్ట్ బెంగాల్లో జరిగే ఆసియా కప్ పోటీల్లో పాల్గొననుంది. కార్యక్రమంలో నాయకులు కలాం, రవీందర్, ఖోఖో ఇండియా కోచ్ రాకేష్ పాల్గొన్నారు. -
కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాం
దహెగాం(సిర్పూర్): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అలీ, ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని ఇట్యాల గ్రామంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ జెడ్పీటీసీ రామారావు, నాయకులు గజ్జెల సురేశ్, బ్రహ్మయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో అక్రమాలు!
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న రెండు గ్రామాల రైతుల నుంచి రూ.18 కోట్లకుపైగా విలువైన పత్తి కొనుగో ళ్లు చేసినట్లు విజిలెన్స్ అధికారుల అంతర్గతంగా ని ర్వహించిన విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలి సింది. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట జిల్లాలో పని చేసిన, చేస్తున్న కార్యదర్శులు, ఏఈవోలు, కంప్యూటర్ ఆపరేటర్లను పిలిపించి విచారించారు. అలాగే పలువురు ప్రైవేటు పత్తి వ్యాపారులను సైతం పిలిచి వారి రికార్డులు పరిశీలించినట్లు తెలుస్తోంది. సీసీఐకి 18,28,900 క్వింటాళ్ల పత్తి..గత వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేసినట్లు అంచనా. పత్తి మద్దతు ధర రూ.7,521గా సీసీఐ నిర్ణయించింది. జిల్లాలో 68,267 మంది రైతులు నేరుగా సీ సీఐకి 18,28,900 క్వింటాళ్ల పత్తిని విక్రయించినట్లు సీసీఐ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటు జిన్నింగ్ మిల్లు వ్యాపారులు 1,33,800 క్వింటాళ్ల ప త్తిని కొనుగోలు చేశారు. అయితే ఇక్కడే బడా జి న్నింగ్ వ్యాపారులు సీసీఐ అధికారులతో చేతులు క లిపి అక్రమ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ప్రై వేటులో తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకునే తిరిగి రూ.7,521 ధర చొప్పున సీసీఐకి విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. విచారణ చేపట్టిన విజిలెన్స్..భారీస్థాయిలో అక్రమ కొనుగోళ్లు జరిగాయన్న ఫిరా దులు అందడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లాలో పత్తి కొనుగోళ్ల సమయంలో పనిచేసిన సీసీఐ అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు, ఆపరేట ర్లను వారం రోజుల కిందట కరీంనగర్ కార్యాలయానికి పిలిచి విచారించారు. పలు రికార్డులు పరిశీలించి.. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయించారు. అదే సమయంలో రూ.18 కోట్లకు పైగా విలువైన పత్తిని అక్రమంగా కొనుగోలు చేసిన ఇద్దరు ప్రైవేటు జిన్నింగ్ వ్యాపారులకు సంబంధించిన రికార్డులను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పక్కాగా అక్రమాలు జరినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రానికి విక్రయానికి వచ్చిన పత్తి వాహనాలు(ఫైల్) వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కు! రూ.18 కోట్లకుపైగా విలువైన పత్తి అక్రమంగా కొనుగోలు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసిన బాగోతం వివరాలు సేకరిస్తున్న అధికారులుబాగోతం జరిగిందిలా...జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసినా.. అసలు పంట ఎన్ని ఎకరాల్లో వేశారనేది నిర్ధారణ జరగకపోవడంతో అక్రమాలకు తావిచ్చినట్లు సమాచారం. ఆన్లైన్లో కచ్చితమైన పంట వివరాలు నమోదు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 17 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యాపారులు ఈ అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. ఏటా పత్తి కొనుగోళ్ల సమయంలో సీసీఐ, వ్యవసాయ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు భారీ మొత్తంలో మామూళ్లు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ ఇద్దరు వ్యాపారులే తాజాగా జరిగిన కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలకు పాల్పడి రూ.కోట్లు తమ జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ అధికారులు జారీ చేసే పంట నిర్ధారణ పత్రాలు, టీఆర్ల ఆధారంగా దోపిడీకి తెరతీసినట్లు సమాచారం. కొందరు రైతుల పేరిట రూ.18 కోట్లకుపైగా విలువచేసే పత్తిని కొనుగోలు చేసి సీసీఐకి విక్రయించినట్లు తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్నారు పత్తి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సీసీఐ, కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు, ఆపరేటర్ల నుంచి విజిలెన్స్ అధికారులు అడిగి తెలుసుకున్న మాట వాస్తవమే. అయితే కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు నా దృష్టికి రాలేదు. విజిలెన్స్ అధికారుల విచారణలో ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. వారి తుది నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. – అష్పాక్ అహ్మద్, ఏడీ, మార్కెటింగ్ శాఖ -
● ప్రజావాణిలో గోడు వెల్లబోసుకున్న అర్జీదారులు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువలా వచ్చాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చి అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్నంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద మురుగు కాలువను ఆక్రమించడంతో మురుగు నీరంతా ఇంట్లోకి చేరుతుందని, ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాగజ్నగర్ పట్టణం ఇర్ఫాన్నగర్కు చెందిన పర్రె శ్రీకాంత్ కోరాడు. తన తండ్రి పేరిట ఉన్న భూమిని ఇతరులు ఆక్రమించారని, న్యాయం చేయాలని కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన మడే లక్ష్మయ్య దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి గ్రామ శివారులోని భూమిని ఆక్రమించారని మిట్ట మల్లన్న ఫిర్యాదు చేశాడు. సింగరేణి ఉపరితల గనిలో తిర్యాణి మండలం దేవాయిగూడ గ్రామంలోని ఇళ్లను కోల్పోయామని నష్టపరిహారం ఇచ్చి ఉపాధి చూపాలని రెబ్బెన మండలం గోలేటిలోని గౌతమ్నగర్కు చెందిన బోయిని సురేందర్ దరఖాస్తు చేసుకున్నాడు. పోస్టాఫీస్లో డిపాజిట్ చేసిన రూ.లక్ష ఇప్పించాలని కాగజ్నగర్ పట్టణంలోని నజ్రూల్నగర్కు చెందిన కవిత మండల్ అర్జీ సమర్పించింది. తమ గ్రామానికి తాగునీటిని అందించాలని సిర్పూర్(యూ) మండలం రాఘవాపూర్ పంచాయతీ పరిధిలోని మారుగూడ గ్రామస్తులు కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తొలగించాలని వాంకిడి మండల కేంద్రంలోని కేబీ నగర్ కాలనీవాసులు విన్నవించారు. తన కుమార్తె పిడుగుపాటుతో మరణించిందని, ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందించాలని బెజ్జూర్ మండలం పోతెపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య కోరాడు. అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, పక్కన అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆలయ స్థలానికి హద్దులు నిర్ణయించాలిజిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ స్థలాన్ని సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు ఆలయ కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. స్థలం ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి తూర్పు వైపు నుంచి వెళ్తున్న రహదారికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గుండా వెంకన్న, కోశాధికారి పిన్నా వివేక్, డాక్టర్ మధు, రాధాకృష్ణచారి, కృపాల్, ప్రకాశ్గౌడ్ తదితరులు ఉన్నారు. -
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో సోమవారం లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ ప్రారంభానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంలో సర్వేయర్ల పాత్ర కీలకమైందన్నారు. చట్టంతోపాటు భూమి కొలతల్లో ప్రతీ అంశంపై అవగాహన ఉండాలని సూచించారు. వారసత్వ పాలు పంపకాలు, కొనుగోలు పట్టాల మార్పిడిలో సర్వేయర్లు మోకాపైకి వెళ్లి కొలతలు తీసి నక్ష సమర్పించడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు ఉండవన్నారు. 50 రోజులపాటు శిక్షకులు నేర్పించే అంశాలపై పట్టుసాధించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా భూమి కొలతల అధికారి సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పోడు సాగు అడ్డుకోవడం అన్యాయం
● సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుపెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం జైహింద్పూర్ గ్రామ శివారులో సోమవారం అటవీశాఖ అధికారులు పోడు భూములను దున్ని చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నారనే విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్బాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోడు రైతులతో మాట్లాడారు. కొత్తగా అటవీ భూమిని ఆక్రమించవద్దని పేర్కొన్నారు. పోడు రైతులను ఇబ్బంది పెట్టి వారి జీవనోపాధికి అంతరాయం కలిగించవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ సంవత్సరం ఫారెస్ట్ ల్యాండ్ రిట్రీవల్ పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటేది లేదని ఫారెస్ట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దానికి అనుగుణంగా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని పోడు రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, అండగా నిలిచి పంటల సాగుకు సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన పిప్పిరి హేమంత్(16) పెద్దవాగులో ఈతకు వెళ్లి మృతి చెందినట్లు కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. హేమంత్ ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకుని, ఆ తర్వాత పెద్దవాగుకు స్నానం చేసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కు టుంబ సభ్యులు పరిసరాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. పెద్దవాగులో ఆదివారం మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి పిప్పిరే చరణ్దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
కమీషన్ల కోసమే ‘కాళేశ్వరం’ నిర్మాణం
బెజ్జూర్(సిర్పూర్): బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ విఠల్ అన్నారు. సుశ్మీర్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు రియాజ్, అన్నయ్య గౌడ్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యంకౌటాల: కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమ ని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ జెడ్పీటీసీలు శారద జగ్గాగౌడ్, పుష్పలత, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, మండల అధ్యక్షులు విశ్వేశ్వరరావు, గంగారాం పాల్గొన్నారు. -
వీడేనా..?
అటవీ చిక్కులు లింగాపూర్ మండలం జాములధార గ్రామం నుంచి పంగిడిమాదార గ్రామం వరకు 10 కి.మీ.ల రోడ్డు ఉంది. గతంలో ఈ రోడ్డు బీటీతో వేశారు. కానీ ఇసుక వాహనాల రాకపోకలతో మట్టిరోడ్డులా మారింది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీ అనుమతులు లేక నిర్మాణానికి నోచుకోలేదు. ఆ రోడ్డు పూర్తయితే రెండు మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. మధ్యలో ఉన్న సుమారు 20 అనుబంధ గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుతాయి. ఇది తిర్యాణి మండలంలోని లొద్దిగూడ, కౌటాగాం, గీసిగూడ, కేరిగూడ, తాటిగూడ గ్రామాలకు వెళ్లే రహదారి. ఐదళ్ల క్రితం బీటీరోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీ అనుమతులు అడ్డుగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. నిధులు మంజూరు కావడంతో అధికారులు సర్వే సైతం నిర్వహించారు. అనుమతులు లేక ప్రారంభానికి నోచుకోలేదు. వర్షాకాలంలో వాహనాల రాకపోకలు అటుంచితే కనీసం కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా మారుతుంది. వాంకిడి(ఆసిఫాబాద్): ‘పంచాయతీరాజ్, రోడ్లు భవనాల పరిధిలో చేపట్టే రహదారుల పనులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలి. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అనుమతులు జారీ చేయాలి. అవసరమైతే అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగేలా చూడాలి..’ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ అనుమతులపై ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలివి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రగతికి అటవీ అనుమతులు అడ్డంకిగా మారిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రుల సమావేశంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అనుమతులు లేక అర్ధంతరంగా నిలిచిన రోడ్ల నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా తొలగని అడ్డంకులు ప్రగతికి దూరంగా మారుమూల గ్రామాలు మంత్రుల సమీక్షతో చిగురిస్తున్న ఆశలు వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఐదేళ్ల క్రితం రూ.7కోట్లు మంజూరు చేసింది. ఖమాన గ్రామం నుంచి సర్కేపల్లి వరకు 9 కిలోమీటర్ల దారి నిర్మించాల్సి ఉండగా అటవీ అనుమతులు అడ్డురావడంతో 6 కి.మీ.లు మాత్రమే పనులు పూర్తి చేశారు. ఖమాన నుంచి మారెపల్లి వరకు పూర్తి కాగా.. అక్కడి నుంచి సర్కేపల్లి వరకు పనులు నిలిచిపోయాయి. మూడు కిలోమీటర్ల మేర మూడు ఒర్రెలు ఉండగా ఏటా భారీ వర్షాల సమయంలో అటు వైపు గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి. రోడ్డంతా బురదమయంగా మారి అత్యవసర సమయంలో గ్రామస్తులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. -
గుట్టలుగా డంప్!
● జిల్లాకు భారీగా నకిలీ విత్తనాలు సరఫరా ● పోలీసుల తనిఖీల్లో క్వింటాళ్ల కొద్దీ పట్టివేత సమాచారం అందించాలి గతేడాది రూ.30లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా భారీగా విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. జిల్లా అధికారి ఆదేశానుసారం అప్రమత్తతతో ఉంటూ తనిఖీలు చేపడుతున్నాం. అమాయక రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదు. నకిలీ పత్తి విత్తనాల క్రయవిక్రయాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలి. – రాణా ప్రతాప్, టాస్క్ఫోర్స్ సీఐ బెజ్జూర్(సిర్పూర్): ఈ ఏడాది సాగు పనులు ముందే మొదలయ్యాయి. జోరుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పత్తి విత్తనాలు విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు గుట్టలుగా నకిలీ విత్తనాలను జిల్లాకు తరలిస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు నకిలీ విత్తనాలు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. రెండు నెలలో పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.82 లక్షల విలువైన 27 క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. తాజాగా బెజ్జూర్ మండలం సుశ్మీర్ కృష్ణపల్లి గ్రామాల్లో రెండు క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ ఆదివారం తెలిపారు. కుక్కుడ గ్రామానికి చెందిన ప్రశాంత్, అనిల్, సుశ్మీర్ గ్రామానికి చెందిన సురేశ్, సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన అశోక్పై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. దళారులదే రాజ్యం..రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతమంది దళారులుగా ఏర్పడి అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంట గడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో తయారైన ఈ వి త్తనాల విక్రయాల్లో అధికశాతం మంది ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తులే ఉంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి పట్టు సాధించిన వారే కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ముఠాలు ఈ ప్రాంత రైతులతో సాన్నిహిత్యం పెంచుకుని న మ్మకాన్ని చూరగొంటున్నాయి. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దుగా ఉండటంతో ప్రాణహిత నది పరీవా హక ప్రాంతాల వెంట అధికారులకు చిక్కకుండా న కిలీ విత్తనాలను తరలిస్తున్నారు. ఆయా మార్గాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసినా అడ్డుకట్ట పడటం లేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలోకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి వివిధ మార్గాల ద్వారా డంప్ చేసి ఉంచుతున్నారు. అడ్రస్ లేని కంపెనీల్లో తయారైన విత్తన ప్యాకెట్లపై తయారీ తేదీ, వ్యాలిడిటీ, ఇతర వివరా లు ఉండటం లేదు. గోనె సంచుల్లో గ్రామాల్లోకి తరలిస్తున్నారు. కొందరు ఒరిజినల్ ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. లైసెన్స్ పొందిన కొందరు డీలర్ల అండదండలతోనే దళారులు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఘటనలుపోలీసుల అప్రమత్తత, టాస్క్ఫోర్స్ తనిఖీలతో ఇ టీవల రూ.లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్తోపాటు, మండల పోలీసు స్టేషన్లకు కూడా ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. ● రెండు నెలల క్రితం చింతలమానెపల్లిలో రూ. 10.50 లక్షల విలువైన 3 క్వింటాళ్ల నకిలీ విత్తనా లను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ● 15 రోజుల క్రితం రూ.12 లక్షల విలువైన నా లుగు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ● తాజాగా శనివారం రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల బీటీ– 3 నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నుంచి కాగజ్నగర్కు 20 క్వింటాళ్ల విత్తనాలను తరలిస్తున్న ఐచర్ వాహనంలో తనిఖీ చేసి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. -
విచారణ వేగవంతం
● పులిని హతమార్చిన కేసులో 30 మంది అరెస్టు ● మరికొంత మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ● ఇకనైనా వేటగాళ్ల తీరు మారేనా..?పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలతో ఈ నెల 15న పెద్దపులిని హతమార్చిన కేసు విచారణలో అటవీశాఖ అధికారులు వేగం పెంచారు. పెద్దపులి చర్మం, అవశేషాలు స్వాధీనం చేసుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంతోపాటు అగర్గూడ, ఎల్లూర్, కోయచిచ్చాల, దహెగాం మండలం చిన్నరాస్పెల్లి, అమరగొండ, గెర్రె, ఖర్జీ గ్రామాలకు చెందిన 30 మంది ఆసిఫాబాద్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఆరు నుంచి ఎనిమిది మందిని అనుమానితులను రిమాండ్కు తరలించే యోచనలో అటవీశాఖ ఉన్నట్లు సమాచారం. పెంచికల్పేట్ రేంజ్లో కే8 అడ్డా..ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పెద్దపులిని చారలు, ఇతర ఫొటోల ఆధారంగా కే 8గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని వారు చెబుతున్నారు. కాగజ్నగర్ మండలంలోని కడంబా అటవీ ప్రాంతాన్ని 2014 సంవత్సరంలో ఫాల్గుణ పెద్దపులి ఆవాసంగా మార్చుకుంది. రెండు విడతల్లో ఫాల్గుణ ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. దీనికి పుట్టిన కే8 పెద్దపులి ఆరు నెలల వయస్సు నుంచి పెంచికల్పేట్ రేంజ్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. బెజ్జూర్ మండలంలోని మత్తడి, ఏటిగూడ, పాపన్పేట్, పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని లోడుపల్లి, ఎల్లూర్, మెరెగూడ, కమ్మర్గాం, దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, కుశ్నపల్లి రేంజ్ వరకు సంచరించింది. పెంచికల్పేట్ మండలం మురళీగూడ వద్ద ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు సైతం రాకపోకలు సాగించింది. కే8 పెద్దపులి 2021 సంవత్సరంలో పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. గత మూడేళ్లుగా ఈ పెద్దపులికి సరైన ఆవాసం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. అప్పటి నుంచి ఒంటరిగానే తిరుగుతోంది. దాని సంచారాన్ని అటవీశాఖ సరిగ్గా అంచనా వేయకపోవడంతోనే వేటగాళ్ల విద్యుత్ తీగలకు బలై పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. తీరు మారేనా.. కవ్వాల్ అభయారణ్యానికి మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యానికి మధ్య కారిడార్గా ఉన్న కాగజ్నగర్ డివిజన్లో అటవీశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పెద్దపులులతో పాటు పెద్దఎత్తున వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. ఘటనలు జరిగినప్పుడు హ డావుడి చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా వన్యప్రాణుల సంచారం ఎక్కువగా కాగజ్నగర్ డివిజన్లో వేటగాళ్లు రెచ్చి పోతున్నారు. సిర్పూర్(టి), బెజ్జూర్, పెంచికల్పే ట్, కౌటాలా, ఖర్జెల్లి రేంజ్ల్లో కొంతమంది వేటను వృత్తిగా మార్చుకున్నారు. విద్యుత్ తీగలు, ఉచ్చులు, విష ప్రయోగం చేసి వేటాడుతున్నారు. జిల్లాలోని పలు అనుకూల ప్రాంతాలను వెతుక్కుంటూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని తడోబా, తిప్పేశ్వర్, ఇంద్రావతి అభయారణ్యాల నుంచి పెద్దపులులు సంతానోత్పత్తికి కోసం తరలివస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, గడ్డిమైదానాలు, నిరంతరం నీటి లభ్యతతో ఈ ప్రాంతాలను ఆవాసంగా మార్చుకున్నాయి. గడిచిన పదేళ్లలో వాటి సంఖ్య గణనీయం పెరిగింది. పులుల సంరక్షణకు నిధులు కేటాయిస్తున్నా అధికారులు వాటి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. కాగజ్నగర్ డివిజన్లోని దరి గాం ప్రాంతంలో రెండు పెద్దపులులు, తాజాగా ఎ ల్లూర్ అటవీ ప్రాంతంలో మరో పులి వేటగాళ్ల వి ద్యుత్ తీగలకు బలికావడంతో ఆందోళన కలిగిస్తుంది. కే 8 పెద్దపులిని హతమార్చిన ఘటనలో అట వీశాఖ దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎ న్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వేటను వృత్తిగా మార్చుకున్న వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు అటవీప్రాంత సమీప ప్రాంతాల్లో వన్యప్రాణులతో ఘర్షణ వాతావరణం తగ్గించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖఆసిఫాబాద్రూరల్: రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అవసరమైన అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నా రు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క, అటవీ శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి నదీంతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్డీవో లోకేశ్వర్, సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అటవీ శాఖ అనుమతుల జారీ, అటవీ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల పరిధిలో చేపట్టే రహదారి నిర్మాణ పనులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. జిల్లా అటవీ అధికారులతో సమీక్షించి చేపట్టిన చర్యలు, పనుల పురోగతిపై ఈ నెల 28వ తేదీలోగా నివేదిక అందించాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్దోత్రే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జిల్లాలో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులలో అవసరమైన అటవీ అనుమతుల కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
కాగజ్నగర్రూరల్: మండలంలోని బురదగూడ గ్రామానికి గత కొద్దిరోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదని శనివారం కాగజ్నగర్ –ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా తమకు మిషన్ భగీరథ నీరు రావడంలేదని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఎంపీడీవో కోట ప్రసాద్ స్పందించి గ్రామానికి చేరుకుని పరిశీలించారు. బురదగూడ గ్రామానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేశారు. అదేవిధంగా పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. -
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలి..
కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టు కుంగిపోయిన నేపథ్యంలో ప్రాణహిత నీటిని వినియోగించుకోవడానికి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణమే పరిష్కారం. ప్రాణహిత నదిపై గతంలో ప్రతిపాదించిన మేరకు ప్రాజెక్టు నిర్మించాలి. జిల్లాలోని వ్యవసాయ భూములకు, ఇతర అవసరాలకు నీటిని అందించవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తాం. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్యే -
ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో రెండోదశ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగి సింది. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు చెప్పే అంశాలను పాఠశాలల్లో కొనసాగించాలన్నారు. బోధన, అభ్యసన సామగ్రి ఉపయోగించి విద్యా బోధన చేయాలని, వచ్చే సంవత్సరం నుంచి అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్యా బోధన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. రిసోర్స్ పర్సన్ అమరేందర్, అనురాధ భాయ్, రమేశ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తెగిన గుండి వాగు తాత్కాలిక వంతెన
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని గుండి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ప్రతీ సంవత్సరం ఎండాకాలం వాగులో పైపులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తుంటారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులో నీటి ప్రవాహం ఎక్కువై వంతెన పైనుంచి నీరు ప్రహిస్తోంది. అదే గ్రామానికి చెందిన జాడి సంతోష్ ఉదయం 6 గంటలకు తన ఆటోలో ఆసిఫాబాద్ వెళ్లేందుకు వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వంతెన కుంగిపోయింది. నీటి ప్రవాహంలో ఆటో కొంతమేర కొట్టుకుపోగా ట్రాక్టర్ సాయంతో గ్రామస్తులు ఆటోను బయటకు తీశారు. కాగా ప్రస్తుతం గుండి గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. -
● ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు ● మెరిట్లిస్ట్ విడుదల చేసిన మెడికల్ కాలేజీ ● అభ్యర్థులకు వల వేస్తున్న దళారులు ● ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో వసూళ్లు
దళారుల ఎంట్రీ..వాస్తవంగా ఎంపిక ప్రక్రియ ఎలా జరిగినా.. చివరకు అభ్యర్థులకు వేతనాలు ఇచ్చేది ఏజెన్సీలే. దీంతో అర్హుల జాబితా విడుదల తరువాత కొన్ని ఏజెన్సీలకు ఈ పోస్టులను అప్పగిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం మూడు ఏజెన్సీలు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఆదిలాబాద్కు చెందిన ఓ ఏజెన్సీ ఇద్దరు రాష్ట్రమంత్రుల ద్వారా సిఫార్సు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడా ఏజెన్సీలు దళారులను రంగంలోకి దింపి ఒక్కో పోస్టును రూ. లక్షల్లో బేరం పెట్టినట్లు సమాచారం ఉంది.ఎవరినీ నమ్మొద్దు..ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుంది. వైద్య కళాశాల ఉద్యోగుల పేరు చెప్పి ఎవరైనా దళారులు పోస్టులు ఇప్పిస్తామని చెబితే నమ్మొద్దు. మా పేర్లు చెప్పి డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫిర్యాదు చేయండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాలసాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిన వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా వైద్య కళాశాల మెరిట్లిస్ట్ విడుదల చేసింది. మెరిట్లిస్ట్లోని అభ్యర్థులతో కొందరు దళారులు పోస్టులు ఇప్పిస్తామంటూ బేరసారాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. పోస్టును బట్టి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు అభ్యర్థుల నుంచి దళారులు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే మెరిట్లిస్ట్ను ప్రకటించిన మెడికల్ కాలేజీ పోస్టులను నేటి వరకు భర్తీ చేయలేదు. రెండు, మూడు రోజుల్లో తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈలోపే దళారులు రంగంలోకి దిగి బేరసారాలు చేస్తుండటంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపిక ప్రక్రియలో మార్పులు.. ప్రభుత్వం వైద్య కళాశాలలో వివిధ రకాల 52 పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాగా గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఈసారి ఔట్సోర్సింట్ పోస్టుల ఎంపిక ప్రక్రియ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను ఏజెన్సీలే చేపట్టేవి. ఏజెన్సీల నిర్వాహకులు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని పోస్టులు భర్తీ చేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జనవరిలో 52 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే దరఖాస్తులను అభ్యర్థులు నేరుగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు అందజేయాలని సూచించగా, వేలాది దరఖాస్తులు వచ్చాయి. నాలుగు నెలలుగా నాన్చుడే.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ అర్హుల జాబితాను ప్రకటించకపోవడం జిల్లా ఉన్నతాధికారుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. వైద్య కళాశాల విడుదల చేసిన మెరిట్లిస్ట్లో అత్యధికంగా డేటా ఎంట్రీ పోస్టుకు 552 మంది పోటీ పడుతున్నారు. తరువాతి స్థానం ల్యాబ్ అటెండెంట్ పోస్టుది. దీనికి 223 మంది పోటీలో ఉన్నారు. ఎలక్ట్రీషియన్కు 100 మంది, వార్డ్బాయ్కు 69, అనస్థీషియా టెక్నీషియన్కు 48, థియేటర్ అసిస్టెంట్కు 43, రేడియోగ్రఫీ టెక్నీషియన్కు 27, సిటీస్కాన్కు 24, డ్రైవర్కు 14, ఈసీజీ టెక్నీషియన్కు 13, గ్యాస్ ఆపరేటర్కు 10 మంది చొప్పున మెరిట్లిస్ట్లో ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న జిల్లా సెలెక్షన్ కమిటీ మెరిట్లిస్ట్ నుంచి 52 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే మెరిట్లిస్ట్ విడుదలై రోజులు గడుస్తున్నా అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే జాప్యం జరుగుతోందన్న వాదన విన్పిస్తోంది. -
కష్టాల కడలిలో కౌలు రైతు
● పెరిగిన విత్తన, ఎరువుల ధరలు ● ఏటా పెరుగుతున్న కౌలు ● పంట విక్రయంలోనూ ఇబ్బందులు ● జిల్లాలో 30వేలకు పైగా కౌలు రైతులుతిర్యాణి: జిల్లాలోని కౌలు రైతులకు ఏటా కష్టాల కడలి ఈదక తప్పడం లేదు. పెరుగుతున్న కౌలు ధ రలతో పాటు ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతుండడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. కౌలు రైతులు ఇప్పటికే భూ యజమానులకు డబ్బులు చెల్లించి ఆయా భూముల్లో పనులు ప్రారంభించారు. కౌలు రైతులకు ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమే కావడంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చి మరీ పంటలు సాగు చేస్తుండడంతో వారిపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వ పథకానికి దూరం..! సాధారణంగా భూమిలేని వారితో పాటు అరఎక రం, ఎకరం భూమి ఉన్నవారు ఇతర రైతుల వద్ద నుంచి భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా కౌలు రైతుల కోసం ఆత్మీయ భరోసా పేరిట రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. భూమి లేని నిరుపేద కుటుంబాలై, ఉపాధిహామీ పథకంలో 20 రోజుల పనిదినాలు పూర్తి చేసిన వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. దీంతో జిల్లాలో సగానికి పైగా కౌలు రైతులకు ఈ పథకం ఉపయోగపడడం లేదని ఆరోపణలున్నాయి. కాగా జిల్లాలో దాదాపు 30వేలకు పైగా కౌలు రైతులు ఉన్నారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రూ. 15వేల వరకు ధర.. మూడేళ్ల క్రితం వరకు కౌలు ధరలు అంతంత మా త్రంగానే ఉండేవి. కానీ క్రమంగా కౌలు ధరలు పె రుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ. 8 వేల నుంచి రూ.15 వేల వరకు కౌలు ధర ఉంది. రా ష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతుభరోసా, కేంద్ర ప్ర భుత్వం అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి భూ య జమానులకే దక్కుతోంది. దీంతో కౌలు రైతులకు ఆర్థికసాయం అందని ద్రాక్షగానే మిగులుతోంది. చివరిదాక కష్టాలే.. కౌలు రైతుకు సీజన్ ప్రారంభం నుంచి సీజన్ పూర్తయ్యే వరకు కష్టాలే ఎదురవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు కొనుగోలుతో పాటు పంటలను విక్రయించేందుకు సైతం పట్టాదారు పాసు పుస్తకాలు తప్పనిసరిగా మారాయి. ఈ క్రమంలో పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్లు ఇచ్చేందుకు భూ యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం, పండించిన పంటను అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించి కౌలు రైతులు మోసపోతున్నారు. పంట పెట్టుబడి కోసం బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. దీంతో పాటు ఒక్కోసారి ప్రకృతి ప్రకోపానికి సాగు చేసిన పంటలను నష్టపోతుండడంతో కౌలు రైతుకు ఆశించిన ఫలితం రావడం లేదు.ఐదెకరాల్లో కౌలు చేస్తున్నా..నాకు ఎకరం భూమి ఉంది. మా ఊళ్లోనే మరో ఐదెకరాలను రూ. 50 వేలకు కౌలుకు తీసుకొని పత్తి పంట వేసిన. కౌలు డబ్బులు కాకుండా పంట సాగుకు రూ.90 వేల వరకు ఖర్చవుతోంది. మొత్తంగా ఐదెకరాల్లో పత్తి సాగుకు రూ.1.40 లక్షలు ఖర్చు వస్తుంది. అకాల వర్షాలతో వచ్చిన కాత సరిగా కాయకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. గత ఏడాది పంట దిగుబడి రాక రూ. 20 వేలు నష్టపోయాను. ప్రభుత్వం రైతుభరోసా ఇచ్చి ఆదుకోవాలి. – కోట సుభాష్, కౌలు రైతు, దుగ్గపూర్, మం. రెబ్బెన -
పరీక్ష సమర్థవంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగనున్న గ్రామ పాలన అధికారి పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరిగే గ్రామ పాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నోడల్ అధికారి ఆధ్వర్యంలో పూ ర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలు, 9.20 గంటల వరకు ప్రశ్నపత్రాలు తరలించాలని తెలిపారు. పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్ చేసి జేఎన్టీయూహెచ్కు తరలించాలని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సాంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
బాలల సంరక్షణకు పాటుపడాలి
ఆసిఫాబాద్రూరల్: బాలల సంరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీసీపీవో మహేశ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రెండో విడత ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా టీ చర్లకు పోక్సో చట్టం 2012పై అవగాహన క ల్పించారు. ఆయన మాట్లాడుతూ లైంగిక దా డులకు గురైన బాలలను గుర్తించడానికి అనుసరించే విధానాలపై సూచనలు చేశారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు 1098 హె ల్ప్లైన్ను వినియోగించేలా వారికి మెలుకువలు నేర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, టీచర్లు పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. రెబ్బెన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం తరలింపులో ఏమైనా జాప్యం జరుగుతుందా.. కొనుగోళ్ల ప్రక్రియ సక్రమంగా సాగుతుందా.. తదితర వివరాలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ 17శాతం కంటే తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. రోజుల తరబడి కేంద్రాల్లో నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలన్నారు. అకాల వర్షాలతో కేంద్రాల్లో వడ్లు తడిసిపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, కొనుగోళ్ల ప్రక్రియ, ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని సూచించారు. లారీలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్రావు, ఆర్ఐలు ఉదయ్కుమార్, సౌమ్య, ఏవో దిలీప్కుమార్, ఏఈవో రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం కొనాలి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ● కౌటాల– కాగజ్నగర్ రహదారిపై రాస్తారోకోరోడ్డెక్కిన రైతులు సిర్పూర్(టి)/చింతలమానెపల్లి: ధాన్యం కొనుగోలు చేయాలని శుక్రవారం రైతులు రోడ్కెక్కారు. సిర్పూర్(టి) మండలంలోని పారిగాం గ్రామస్తులు సిర్పూర్(టి)– కౌటాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్లో వరిధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి రైతులు ఆందోళన నిర్వహించారు. ఆరు రోజులుగా రవీంద్రనగర్ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. కాంటా చేయకపోవడంతో నిల్వ ఉంచిన వడ్లు వర్షానికి తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌటాల(సిర్పూర్): అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు డిమాండ్ చేశారు. కొనుగో ళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కౌటాల– కాగజ్నగర్ ప్ర ధాన రహదారిపై ముత్తంపేట వద్ద తడిసిన ధాన్యాన్ని పోసి శుక్రవారం రైతులు చేపట్టిన రాస్తారోకోకు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీ ఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తడిసిన ధాన్యాన్ని కొంటామని చెబుతున్నారని, ఇక్కడమో తప్ప, తాలు, తేమ పేరిట తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. పంట చేతికొచ్చి నెల రోజులవుతుందని, ధాన్యం సేకరించాలని జిల్లా అధికారులకు సూచించినా పట్టించుకోకపోవడంతోనే అన్నదాతలకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్ రాస్తారోకో చేస్తున్న రైతుల ధాన్యాన్ని పరిశీలించారు. 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మకై రై తులను ముంచుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్బాబు సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్తో సెల్ఫోన్లో మాట్లాడి తడిసిన ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నాలుగు గంటలపాటు వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేందర్గౌడ్, నాయకులు మల్లయ్య, మోతీరాం, తిరుపతి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాత్రుల్లో ఇష్టారీతిన..
● యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా ● మహారాష్ట్ర నుంచి జిల్లాకు.. ● రాత్రిపూట నగరాలకు తరలింపు ● ఇరుకు వాహనాల్లో మూగజీవాల వేదననది మీదుగా తరలింపు తాటిపల్లి సమీపంలోని వార్దా నది మీదుగా మహారాష్ట్ర నుంచి వందల పశువులను కౌటాలకు తరలిస్తున్నారు. శుక్ర, శని, ఆది, సోమవారాలు నాలుగు రోజులపాటు నది వద్ద పశువుల అక్రమ రవాణా సాగుతోంది. నదిలో నీరు ప్రవహిస్తున్నా ప్రమాదకరంగా మూగజీవాలను తరలిస్తున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. – దత్తు, తాటిపల్లి, మం.కౌటాల కౌటాల(సిర్పూర్): జిల్లాలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సరిహద్దు నుంచి నది దాటించి గుట్టుగా వేలాది ఎద్దులు, ఆవులను పట్టణాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. మూగజీవాల రోదనను ఆలకించేవారు కరువయ్యారు. సంతల నుంచి డీసీఎంలు, కంటైనర్లు, బొలేరో వాహనాల్లో కుక్కి నగరాల్లోని వ్యాపారు లకు అమ్ముతున్నారు. వాహనాల్లో సరిపడా స్థలం లేక పశువుల కాళ్లు, శరీర భాగాలు విడిపోయి అల్లాడిపోతున్నాయి. మేత, నీరు లేకపోవడం ఊపిరాడ క మార్గమధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నాయి. మృతి చెందిన పశువులను అటవీ ప్రాంతాలు, రోడ్డు పక్కన పడేసి వెళ్తుండటంతో కళేబరాల దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సంతల నుంచే.. జిల్లాలో ఎద్దులు, ఆవులు కలిపి 2,93,895 వరకు ఉండగా, గేదెలు 49,445 ఉన్నాయి. ఇందులో ఏటా పదిశాతం వరకు వట్టిపోతాయి. మరికొన్ని అనారోగ్యం పాలవుతాయి. వీటిని కొందరు వ్యాపారులు రాజకీయ అండతో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కౌటాల, జైనూర్, వాంకిడి ప్రాంతాల్లో వారానికి ఒకసారి జరిగే సంతల ముసుగులోనే కొందరు వ్యవహారం నడిపిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాకు ముఠాగా ఏర్పడి వారసంతలో పశువులను తక్కువ రేటుకు కొని వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్, కరీంనగర్కు తరలిస్తున్నారు. అలాగే సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి పశువులను సంతకు తీసుకువచ్చి ఒక్కో వాహనంలో పదుల సంఖ్య వరకు అడ్డదిడ్డంగా ఎక్కిస్తున్నారు. పశువుల రవాణా కోసం అనుమతులు ఇవ్వాలని ఇటీవల కౌటాల పశువైద్యాధికారి అనుమతి కోసం భారీగా ప్రజలు రావడంతో పోలీసులతో వారిని నిలువరించాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్లో నిర్వహించే పండుగల కోసం ఇప్పటినుంచే పశువులను తరలిస్తున్నారు. 1960 జంతు పరిరక్షణ చట్టం ప్రకారం పశువులను వధించడం నేరం. వట్టిపోయిన పశువులను రైతుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు దళారులు కొంటున్నారు. వారు మాత్రం రూ.15 వేల నుంచి రూ.20 వేలకు అమ్ముకుంటున్నారు. మాంసంతోపాటు చర్మం, కొమ్ములు, ఎముకలు ఇతర భాగాలు చెప్పులు, వాయిద్య పరికరాలు, ఎరువుల తయారీలో వినియోగిస్తారు. భారీగా విక్రయాలు జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ, రవాణా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెక్పోస్టుల ఏర్పాటు పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్శాఖ చర్యలు చేపట్టింది. ఆరు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. సిర్పూర్(టి) మండలం పెద్దబండ వద్ద, చింతలమానెపల్లి మండలం ఆడేపల్లి ఎక్స్రోడ్డు, బెజ్జూర్ మండలం సలుగుపల్లి ఎక్స్రోడ్డు, కాగజ్నగర్ మండలం వంజరీ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే జైనూర్ మండలం రాణి రుద్రమదేవి చౌక్, వాంకిడి టోల్ప్లాజా వద్ద చెక్పోస్టులు ఉన్నాయి. పశువుల అక్రమ రవాణాను ఆరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.వాంకిడి, కౌటాల, జైనూర్ మండలాల్లోని పశువుల సంతల్లో దళారులు పశువులను కొనుగోలు చేసి రాత్రి వేళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. సిర్పూర్(టి) నుంచి కాగజ్నగర్ వరకు, రెబ్బెన నుంచి మంచిర్యాల జిల్లా దాటే వరకు ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. కొంతమంది రాత్రి వేళల్లో రహదారులపై తిరిగే పశువులు, ఒంటరిగా ఉండేవాటిని, రైతులు ఇంటి సమీపంలో కట్టి ఉంచిన వాటిని లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ దందాలో వాటాలు అందరికీ అందుతుండటంతో చీకటి వ్యాపారం గప్చుప్గా సాగుతోంది. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకాగజ్నగర్టౌన్: రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణల్లోని స్టాక్ రిజిస్టర్ వివరాలు, రసీదు పుస్తకాలు పరిశీలించారు. అనంతరం మా ట్లాడుతూ దుకాణాల్లో ఎరువులు, విత్తనాల ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతిరోజూ దుకాణాలను వ్యవసాయాధికారులు తనిఖీ చేసి, నివేదికలు అందించాలని సూచించారు. ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్, ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లుల పేరిట ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి, మాతృమూర్తులను గౌరవించుకుందామన్నారు. పట్టణాల్లో గుర్తించిన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అర్హులను ఎంపిక చేయాలి రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులను ఎంపిక చేసి, జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 నాటికి అర్హులకు మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. అనంతరం మున్సి పల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన క్యాంటీన్ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ కిరణ్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీరాం, అమృత మిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివరాలు పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
‘మావో’ళ్లు ఎట్లున్నరో..!
ఇప్పటికీ కీలక స్థానాల్లో కొందరు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇర్రి మోహన్ రెడ్డి: సెంట్రల్ బ్యూరో, కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు. బండి ప్రకాశ్: సింగరేణి కోల్బెల్ట్ కమిటీ సెక్రెటరీ, ఇటీవల కేంద్ర కమిటీలో చేరారు. మైలారపు అడెల్లు: స్టేట్ కమిటీ సభ్యుడు, కుమురం భీం, మంచిర్యాల కమిటీ ఇన్చార్జి. సలాకుల సరోజ: సీనియర్ నాయకురాలు, పార్టీ ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతలు. జాడి వెంకటి, పుష్పలత: సీనియర్ నాయకులు, దండకారణ్యంలో బాధ్యతలు. చౌదరి అంకుబాయి, లచ్చన్న, తూము శ్రీనివాస్: సీనియర్ కేడర్గా కొనసాగుతున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు వామపక్షవాద ఉద్యమానికి బలమైన కేంద్రంగా ఉండేది. ప్రతీ గ్రామం నక్సలైట్లకు ఆశ్రయంగా మారిన రోజులు గతంలో ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ జిల్లా మావోయిస్టు ప్రభావ రహిత ప్రాంతంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు ’ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ పరిస్థితిలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు ఇంకా సిద్ధాంతంతో పోరు బాటలోనే నడుస్తున్నారు. వారి ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉనికి కోల్పోతున్న ఉద్యమం ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమం బలంగా సాగింది. ప్రస్తుతం దాని ఉనికి దాదాపు క్షీణించింది. వందలాది మంది కార్యకర్తలు ఎన్కౌంటర్లలో మరణించడం లేదా లొంగిపోవడం జరిగింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్(ఆనంద్, 69) 2024 జూన్లో మరణించారు. సీనియర్ నాయకులైన ఒగ్గు సత్వాజీ, కాసర్ల రవి (అశోక్), కంతి లింగవ్వ, గడ్డం మధూకర్, సుమన్, రవిబాబు వంటి వారిని పార్టీ కోల్పోయింది. మూల దేవేందర్రెడ్డి అరెస్టయ్యారు. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవులో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్క మరణించారు. మావోయిస్టు రహిత జిల్లాగా.. కేంద్ర హోంశాఖ ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం తెలంగాణలో భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే ఈ జాబితాలో కొనసాగుతోంది. గతంలో నిర్మల్ నుంచి బెజ్జూరు వరకు, బొగ్గు గనులు, అడవులు, గిరిజన ప్రాంతా ల్లో మావోయిస్టు కార్యకలాపాలు సాగేవి. పీపుల్స్వార్ గ్రూప్ ద్వారా సింగరేణిలో సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య) బలంగా పనిచేసిన రోజుల్లో ఎన్కౌంటర్లు తరచూ జరిగేవి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుభూతిపరుల బలంతో ఉద్యమం విస్తరించింది. కొత్త నియామకాలతో విద్యావంతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, గత రెండు దశాబ్దాలలో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ ఉనికి దాదాపు క్షీణించింది. ఇప్పుడు అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మినహా ఎలాంటి కార్యకలాపాలు కనిపించడం లేదు. కుటుంబాల్లో ఆందోళన.. దండకారణ్యం, అబూజ్మడ్ వంటి ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన నాయకుల ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి బలమైన ఉద్యమం ఇప్పుడు దాదాపు అంతరించిన స్థితిలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణ, ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, జిల్లాలో గతంలో ఉన్న సానుభూతి, కార్యకలాపాలు గణనీయంగా తగ్గడం, భవిష్యత్తులో ఈ ఉద్యమం పూర్తిగా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యమంలో ఉమ్మడి జిల్లా వాసులు దశాబ్దాలుగా అడవుల్లోనే.. వైభవం నుంచి ఉనికి కోల్పోతున్న దశకు.. ‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో సర్వత్రా చర్చఉమ్మడి జిల్లాకు చెందిన మావోయిస్టులు(ఫైల్) -
నది ఒడ్డున.. దందా
కౌటాల మండలం తాటిపల్లి సమీపంలో వార్దా నది సరిహద్దున మహారాష్ట్ర ప్రాంతం ఉంది. మహారాష్ట్రలోని దళారులు తాటిపల్లి వార్దా నది మార్గంలో కౌటాల పశువుల వారసంతకు పశువులను తరలిస్తున్నారు. చంద్రపూర్, ఛతీస్గఢ్, గడ్చిరోలి జిల్లాలతోపాటు సిందేవాయి, వాడ్సా, భ్రమపూరి ప్రాంతాల నుంచి వందల పశువులను నదిలో నుంచి ప్రమాదకరంగా తాటిపల్లి ఒడ్డుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ఓ ముఠా వాహనాల్లో తరలిస్తుండగా.. కొందరు ఎద్దులను జతలు కట్టి కౌటాలకు రోడ్డు మార్గంలో తీసుకెళ్తున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన పశువులను మరో రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ వ్యవహారమంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని వివిధ గ్రంథాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం హైదరాబాద్లో గ్రంథాలయ డైరెక్టర్ శ్రీహరికి జిల్లా సంఘం నాయకులు వినతిపత్రం అందించారు. పార్ట్టైం స్వీపర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ వేతనాల్లో తారతమ్యాలు లేకుండా అన్ని జిల్లాల్లో ఒకేవిధంగా చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.20వేలు అందించాలని, అర్హత, సర్వీసుకు అనుగుణంగా కేటగిరీ పోస్టుల్లోకి తీసుకోవాలన్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మధు, సభ్యులు సలీం, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సన్మానం
ఆసిఫాబాద్రూరల్: నెట్బాల్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను జిల్లా కేంద్రంలోని తన నివా సంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ మాట్లాడుతూ నెట్బాల్ బాల్ ట్రెడిషన్లో జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు సాయిదీక్ష, రోహాన్, ఫాస్ట్ ఫైలో వంశీవర్ధన్ ప్రతిభ చూపారని తెలిపారు. జాతీయస్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నెట్బాల్ జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కార్మికులకు అన్యాయం చేస్తున్న గుర్తింపు సంఘం’
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో కార్మికులపై అధిక పనిభారం మోపుతున్నా.. కనీసం స్పందించకుండా గుర్తింపు సంఘం కార్మికులకు అన్యాయం చేస్తోందని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు అన్నారు. కైరిగూడ ఓసీపీలో శుక్రవారం హెచ్ఎంఎస్ నాయకులు పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మేనేజర్ శంకర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏరియాలో ఐఈడీ ప్రకారం కార్మికుల సంఖ్య తక్కువగా ఉందని, విరమణ పొందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించడం లేదన్నారు. ఇచ్చిన హామీలు మర్చి పోయి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈపీ ఆపరేటర్లు ఏ గ్రేడ్ వాహనాలు నడుపుతున్నందున ఖాళీలతో సంబంధం లేకుండా ఏ గ్రేడ్ పదోన్నతులు కల్పించాలన్నారు. ఓసీపీలో టెక్నీషియన్ల కొరతను నివారించాలని, బదిలీపై వచ్చిన సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లకు ఆర్థికనష్టం జరగకుండా బేసిక్, కేటగిరీ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా ఆర్గనైజర్ ఎస్కే ఇనూష్, ఫిట్ కార్యదర్శి రామకృష్ణ, ఎస్అండ్పీసీ ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి కిష్టస్వామి, ఆర్గనైజర్ బొట్ల కిష్టస్వామి పాల్గొన్నారు. -
రూ.లక్షల్లో వసూళ్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నిరుద్యోగులను ఓ సంస్థ నట్టేట ముంచింది. గత ఏడాది జూన్ విద్యాసంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకులాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆశ చూపి రూ.లక్షలు వసూలు చేసింది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘విద్యాంజలి 2.0’ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద ఓ స్వచ్ఛంద సంస్థ స్కూల్, కాలేజీ, వసతిగృహాల్లో సిబ్బంది నియామకాలంటూ పలు రకాలుగా ప్రచారం చేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసింది. స్వీపర్ నుంచి టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్, ఏఎన్ఎంలు, వాచ్మెన్, వంటమనుషులు పలు రకాల పోస్టులు ఉన్నాయని, వేతనం నెలకు రూ.10వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుందని నమ్మబలికింది. దీంతో విద్యాశాఖలో నిజంగానే ఉద్యోగాలుగా భావించి అనేకమంది అప్పులు చేసి మరీ ఉద్యోగాల్లో చేరారు. వీరితో మరికొంతమందిని చేర్చారు. నెలలు గడుస్తున్నా వారికి జీతాలు రాకపోవడంతో అసలు కథ బయటపడింది. అనుమానం వచ్చి నిలదీయడంతో సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్నారు. అప్పటికే పది నెలల దాక పని చేయడం గమనార్హం. ఎలా చేర్చుకున్నారో..? విద్యాశాఖతో సంబంధం లేని ఓ ప్రైవేటు సంస్థ ఆయా స్కూళ్లు, కాలేజీలు, వసతిగృహాల్లో సిబ్బందిని నియమించుకోవాలని చెబితే సంబంధిత బాధ్యులు ఎలా చేర్చుకున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. స్కూళ్ల హెచ్ఎంలు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, హాస్టళ్ల ఇన్చార్జీలు సిబ్బందితో నెలల తరబడి విధులు నిర్వర్తించుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆయా చోట్ల రిజిస్టర్లు పెట్టి హాజరు సైతం తీసుకున్నారు. తీరా జీతం కోసం అడిగితే ఆ సంస్థ చేర్చుకోమని చెబితే విధుల్లోకి తీసుకున్నామని సంబంధిత విద్యాధికారులు అంటున్నారు. అధికారులను సైతం ఆ సంస్థ ఏదైనా ప్రలోభాలకు గురి చేసిందా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు విద్యాంజలి పథకం తమ విద్యాసంస్థలో అమలవుతుందా? లేదా? జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తెలుసుకోకుండానే సిబ్బందిని ఎలా విధుల్లోకి తీసుకున్నారనేది సందేహాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ పథకం ఎంపిక చేసిన చోట్ల, స్వచ్ఛందంగా ఎలాంటి జీతభత్యాలు చెల్లించకుండా నిర్వహించేది. దీని గురించి అవగాహన లేక ఓ సంస్థ చెప్పిన అబద్ధాన్ని నమ్మేస్తూ ఆర్థికంగా నష్టపోయారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో ఓ సంస్థ నియామకాలు రూ.లక్షలు కట్టి నెలల తరబడి డ్యూటీ చేసిన వైనం జీతం లేక మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అనేక మంది బాధితులు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వంద మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలామంది బయట చెప్పుకుంటే అవమానంగా భావించి వివరాలు వెల్లడించడం లేదు. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మధ్యవర్తులుగా పని చేసి రెండు జిల్లాల నుంచి అనేక మందిని చేర్పించారు. ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర చోట్ల బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేశారు. గతేడాది ఈ సంస్థ నిరుద్యోగులను మఽభ్యపెడుతున్న తీరుపై ‘సాక్షి’లో కథనం ప్రచురించగా, కొందరు చేరేందుకు వెనుకాడారు. అయినా డబ్బులు వస్తున్నాయని, కమీషన్ల ఆశతో సంస్థ సీఈవోగా ఉన్న ఓ వ్యక్తి, ఆయన కింద జిల్లా కో ఆర్డినేటర్లు, ఇన్చార్జీలు నమ్మిస్తూ అందరినీ బురిడీ కొట్టించి రూ.కోట్లు వసూలు చేసి పరారయ్యారు. ఇంతా జరిగి నా బాధితులు ఎక్కడా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం లేదు. కానీ నమ్మి డబ్బులు పెట్టిన వారి ఇంటికి వెళ్లి గొడవలు చేస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మధ్యవర్తులు సైతం ఆ సంస్థను నమ్మి నిండా మునిగామని, తమ వద్ద కూడా డబ్బులు లేవని వాపోతున్నారు. -
బోధన మెరుగుపర్చుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు బోధన తీరు మెరుగుపర్చుకోవాలని శిక్షణ ప్రత్యేకాధికారి, అదనపు డైరెక్టర్ శ్రీనివాసచారి అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి గురువారం డీఈవో యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలన్నారు. ప్రధానోపాధ్యాయులు నా యకత్వ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, అబిద్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, శిక్షణ కేంద్రం ఇన్చార్జి రమేశ్, రిసోర్స్పర్సన్ అనురాధ పాల్గొన్నారు. -
అర్హులకే ‘రాజీవ్ యువవికాసం’
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో అర్హులైన వారికి రాజీవ్ యువవికాసం పథకం వర్తింపజేస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్జోషితో కలిసి గురువారం వెరిఫికేషన్, బ్యాంక్ సిబిల్ స్కోర్ పరిశీలన ప్రక్రియపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను క్షు ణ్నంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలన్నా రు. సిబిల్ స్కోర్ పరిశీలనలో బ్యాంకర్లు నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం ఆసిఫా బాద్ మండలం గుండి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి పురో గతిపై సమీక్షించారు. గ్రామంలో ప్రత్యేక నిధుల కింద మంజూరైన పనులు వేగవంతం చేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగ్రావు, ఎంపీడీవో శ్రీనివాస్, మండలస్థాయి అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మెమో ఇచ్చినా.. అదే తీరు!
● కాగజ్నగర్ సబ్ డివిజన్లో చర్చనీయాంశంగా ఓ పోలీసు అధికారి వ్యవహారం ● ఇసుక, పశువుల వ్యాపారులతో మాటామంతి ● ‘సాక్షి’ కథనాలపై చర్చసాక్షి, ఆసిఫాబాద్: శాంతి భద్రతలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇసుక, జూదం, పశువుల అ క్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి. కానీ కాగజ్నగర్ పో లీస్ సబ్డివిజన్లో పనిచేస్తున్న సదరు అధికారి మాత్రం అందుకు భిన్నంగా అక్రమార్కులతో చే తులు కలపడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆ అధికారికి జిల్లా ఎస్పీ వార్నింగ్ మెమో జారీ చేసినా అతని పనితీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. యథేచ్ఛగా అక్రమాలు కాగజ్నగర్ నియోజకవర్గంలోని ఓ కీలక పోలీసు స్టేషన్కు ఆయన బాస్. ఆ స్టేషన్ పరిధిలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఇసుక దందా.. జూదం సరేసరి. క్వారీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కంకర తరలించే లారీల సంగతి చెప్పనక్కరలేదు. ఆయన సర్కిల్ స్టేషన్ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకు ఆదాయ మార్గాలను బాగా అన్వేషించి.. వ్యాపారులపై దాడులు చేసి హడావుడి చేశారు. ఆ తర్వాత అక్రమార్కులు ఎవరెవరు ఎంత ముట్టజెప్పాలన్న విషయంలో వారి మధ్య ఓ ఒప్పందం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఒప్పందంలో భాగంగానే పశువులను అక్రమంగా తరలించే వ్యక్తులు, ఇసుక రవాణాదారులు ఆ పోలీసు అధికారికి ప్రతినెలా రూ.15 లక్షల వరకు మామూళ్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది. కంకర వ్యాపారుల నుంచి ఆ అధికారికి నెల మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే నలుగురు, ఐదుగురిపై కేసులు నమోదు చేసి మమా అనిపించేస్తున్నారని అక్కడ పనిచేసే పోలీసువర్గాలు బాహాటంగానే చర్చించుకోవడం గమనార్హం. ‘సాక్షి’ కథనాలపై చర్చ ఈ నెల 16న ‘సాక్షి’లో ‘ఖాకీకి అవినీతి మరక’ అనే శీర్షిక పేరిట ఒక కథనం ప్రచురితమైంది. దీనిపై పోలీసు జిల్లా బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే రోజు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న సదరు పోలీసు అధికారి ట్రాక్టర్ యజమానులు, పశువుల అక్రమ రవాణా వ్యాపారులతో మాట్లాడారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని సెల్ఫోన్లో చూపి ‘మాది ఫ్రెండ్లీ పోలీసింగే.. కానీ ‘సాక్షి’లో కథనం వచ్చింది. కాబట్టి పై అధికారులకు మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇసుక, పశువుల అక్రమ రవాణాపై దాడులు చేస్తున్నాం.’ అని స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే ఇటీవల పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయాలని కోరుతూ బుధవారం కొందరు ట్రాక్టర్ యజమానులు అటు తహసీల్దార్ను, ఇటు పోలీసు అధికారులను కలిసి వేడుకోగా.. ఇదిగో ఈ రోజు కూడా ‘సాక్షి’లో ‘ఇసుక దందా’ పేరిట కథనం వచ్చింది. మీ ట్రాక్టర్లను వదలడం కుదరదని చెప్పినట్లుగా తెలుస్తోంది. వార్నింగ్ మెమో.. పశువుల అక్రమ రవాణా కట్టడిలో అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే నివేదికల నేపథ్యంలో కాగజ్నగర్ డివిజన్లో పనిచేస్తున్న ఆ పోలీసు అధికారికి జిల్లా ఎస్పీ వార్నింగ్ మెమో ఇచ్చారు. మరోమారు ఇది పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా అధికారి తీరులో మార్పు రాలేదని నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే నివేదికలు ఉన్నతాధికారులకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ డివిజన్లో పనిచేస్తున్న మరికొంత మంది అధికారులపై త్వరలోనే చర్యలు ఉండనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
మహనీయుల చరిత్ర భావితరాలకు అందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: మహనీయుల చరిత్ర, వారి త్యాగాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం భాగ్యరెడ్డి వర్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమశాఖ జిల్లా అధికారి సజీవన్, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసిన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ అని కొనియాడారు. కుల సంఘాల నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, రేగుంట కేశవ్రావు, అలీబిన్ అహ్మద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని ఎస్పీ డీవీ శ్రీని వాసరావు అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సమసమాజ నిర్మాణం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, డీపీవో ఏవో శ్రీనివాస్రెడ్డి, ఎంటీఏ ఆర్ఐ అంజన్న, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, మహిళా ఎస్సై లావణ్య, ఆర్ఎస్సై రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లారీలు రాక.. ధాన్యం కదలక
అకాల వర్షానికి మొలకలు వచ్చిన వరి ధాన్యాన్ని చూపుతున్న ఈ రైతు పేరు పోతురాజుల సుగుణాకర్. భీమిని మండలంలోని కేస్లాపూర్ గ్రామం. దహెగాం మండలం బొర్లకుంట శివారు సుమారు ఎనిమిది ఎకరాల్లో దొడ్డురకం వరి సాగు చేశాడు. కోతలు పూర్తయిన తర్వాత బొర్లకుంటలో వారం రోజులు ఆరబెట్టి.. పదిరోజుల క్రితం దహెగాం కొనుగోలు కేంద్రానికి తరలించాడు. మూడు రోజుల క్రితం అకాల వర్షానికి వడ్లు తడిసాయి. బుధవారం మరోసారి తడవడంతో మొలకలు కూడా వచ్చాయి. ‘ప్రైవేటుకు అమ్ముకున్నా మంచిగ ఉంటుండే.. సర్కారు కేంద్రంలో అమ్మితే ధర వస్తదని అనుకుంటిని.. వానతో ఇరవై బస్తాల వరకు నష్టం వాటిల్లింది..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా.. కొనుగోళ్లలో జాప్యం కారణంగా జిల్లా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.దహెగాం(సిర్పూర్): జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతాంగాన్ని నిండా ముంచుతున్నాయి. సోమవారం కురిసిన వర్షంతో ధాన్యం ఓసారి తడిసిపోగా, బుధవారం మరోసారి కురిసిన భారీ వర్షానికి మరోసారి తడిసింది. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే మొలకలు వస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఓ వైపు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిరోజూ కేంద్రాలను తనిఖీ చేస్తూ నిర్వాహకులకు చెబుతున్నారు. కానీ కాంటా పూర్తయిన తర్వాత బస్తాలు మిల్లులకు తరలించడానికి లారీలు పంపించడంలో శ్రద్ధ చూపడం లేదు. తరలించిన ధాన్యాన్ని సైతం మిల్లర్లు త్వరగా అన్లోడ్ చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి జల్లులు పడినా ధాన్యం పంపకండి అంటూ కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. 10 మిల్లులకు ధాన్యం.. జిల్లాలో 20వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, కొనుగోళ్ల కోసం 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికొచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేయగా, పౌరసరఫరాల శాఖ 10 వేల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటి వరకు 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పది మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. గురువారం మన జిల్లాలోనే కాకుండా పెద్దపల్లిలోని మిల్లులకు సైతం ట్యాగింగ్ ఇచ్చి వడ్లు తరలించారు. బుధవారం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలను సైతం పంపించారు. అయితే అక్కడి మిల్లుల నిర్వాహకులు ఏమైనా కోత విధిస్తారా.. అనే సందేహం రైతుల్లో నెలకొంది. తేమ శాతం పెరిగే అవకాశం ఉండటంతో ఎలాంటి కొర్రీలు విధిస్తారో అంటూ చర్చించుకుంటున్నారు. షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి వరకు వర్షం పడగా, మరో మూడు రోజులపాటు పడే అవకాశం ఉండటంతో కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న వడ్లు -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో గురువారం ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ దయం నిర్వహించిన మొదటి సంవత్సరం ప రీక్షకు జనరల్ విభాగంలో 551 మంది విద్యార్థులకు 511 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 53 మందికి 42 మంది హాజరయ్యారు. మొత్తం 604 మందికి 553 మంది పరీక్షలు రాయగా, 51 మంది గైర్హాజరయ్యా రు. సెకండియర్ పరీక్షకు జనరల్ విభాగంలో 201 మందికి 189 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 11 మందికి 8 మంది హాజరయ్యారు. మొత్తం 212 మందికి 197 మంది పరీక్ష రాయగా, 15 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో కళ్యాణి తెలిపారు. కాగజ్నగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, వసుంధర కళాశాలను తనిఖీ చేశారు. -
స్కావెంజర్ల వేతనాలు విడుదల చేయాలని వినతి
రెబ్బెన/ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన స్కావెంజర్లకు పెండింగ్ వేతనాలు విడుదలయ్యేలా చూడాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ లతీఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారితోపాటు డీఈవో యాద య్యకు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గత విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించామన్నారు. ప్రారంభంలో మూడు నెలల వేతనాలు మాత్రమే విడుదల చేసి, ఆపై అందించలేదని తెలిపారు. ఐదు నెలల వేతనాలు విడుదల చేయాలని కోరారు. అలాగే జిల్లాలోని 50 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేశామని, శిక్షకులకు రూ.3వేల చొప్పున పారితోషకం ప్రభుత్వం నుంచి అందాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ వీరశంకర్, అసోసియేట్ అధ్యక్షుడు పర్ష చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో గురువారం హనుమాన్ జయంతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుడు ఒజ్జల శిరీష్శర్మ గణపతిపూజ, స్వస్తి పుణ్యహవచనము, నవగ్రహారాధన, రుద్రాభిషేకం, ఫల, పత్ర, పుష్పార్చన, మంగళహారతి, మహా మంత్రపుష్పం, మహాదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి దంపతులు, అదనపు కలెక్టర్ డేవిడ్ దంపతులు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, నాయకులు బాలేశ్గౌడ్, మల్లేశ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. -
కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో అకాల వర్షం, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సీజన్కు సన్నద్ధం అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. జనజీవానానికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావు కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వాగుల వైపు ఎవరూ వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలతోపాటు మరో మూడు అదనంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఖరీఫ్లో విత్తనాలు, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎస్వో వినోద్, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో బాల్య వివాహాల ని ర్మూలనకు చర్యలు తీసుకోవాలని జువైనల్ జస్టిస్ బోర్డు చైర్పర్సన్ అనంతలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో నాల్స చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చి ల్డ్రన్ స్కీం– 2024పై బుధవారం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ యువరాజతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు బాల్య వివాహ నిషేధ చట్టం– 2006 సెక్షన్ 13 ప్రకారం ఇక నుంచి జూనియర్ సివిల్ జడ్జి ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేయాలని ఆదేశించారు. బాలల హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలకు ఉపేక్షించొద్దన్నారు. హక్కుల రక్షణకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీపీవో మహేశ్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
గోవులను కబేళాలకు తరలిస్తే చర్యలు
● డీఎస్పీ రామానుజంకాగజ్నగర్టౌన్: గోవులను కబేళాలకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం అన్నారు. పట్టణంలోని టౌన్ పోలీస్టేషన్లో బుధవారం కబేళాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పశువైద్యాధికారి ఫిట్ఫర్ స్లాటర్ సర్టిఫైడ్ చేసిన పశువులను మాత్రమే కబేళాలకు తరలించాలని సూచించారు. వేస్టేజ్ను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని, పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. బక్రీద్ సందర్భంగా సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పశుౖవైద్యాధికారి పరిమళ, సీఐ ప్రేమ్కుమార్, ఎస్సై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నకిలీ పత్తి విత్తనాలపై నిఘానకిలీ పత్తి విత్తనాలు, ఎరువులపై నిఘా ఉంచామ ని, రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామానుజం హెచ్చరించారు. పట్టణ పోలీస్టేషన్లో బుధవారం ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించిన వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. కాగజ్నగర్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
టీకాలతో వ్యాధులు దూరం
ఆసిఫాబాద్రూరల్: సకాలంలో టీకాలు వేసుకోవడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండొచ్చని డీఎంహెచ్వో సీతారాం అన్నారు. ఆసిఫాబాద్ మండలం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంకుసాపూర్ గ్రామంలో బుధవారం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ ఈ నెల 28లోగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. అవసరం ఉన్న ప్రతిఒక్కరికి టీకాలు వేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి సంపత్, పారా మెడికల్ అధికారి శ్యాంలాల్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు వర్షాకాలం ప్రారంభంలోగా పూర్తి చేయడంపై దృష్టి సారించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద చేపట్టిన పనులు జూన్ 11లోగా పూర్తి కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థుల సౌకర్యం కోసం తాగునీరు, మరుగుదొడ్లు, పెయింటింగ్, చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, హౌసింగ్ డీఈ వేణుగోపాల్, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. బ్యాంకర్లు రుణలక్ష్యాలు సాధించాలిఆసిఫాబాద్రూరల్: బ్యాంకర్లు తమకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీఆర్డీవో దత్తారావు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రాజేశ్వర్జోషితో కలిసి బుధవారం వివిధ బ్యాంకుల మేనేజర్లతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి సిబిల్ స్కోర్ పరిశీలించి నివేదిక అందించాలన్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,233 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. -
‘సప్లిమెంటరీ’కి సర్వం సిద్ధం
● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ● జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటుఆసిఫాబాద్రూరల్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2,292 మంది విద్యార్థులు హాజరు కానుండగా, జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్లో 1,487 మంది పరీక్షలు రాయనుండగా, ఇందులో జనరల్ విద్యార్థులు 1,348 మంది, ఒకేషనల్ 139 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 805 మంది పరీక్షలు రాయనుండగా, ఇందులో జనరల్ విద్యార్థులు 709 మంది, ఒకేషనల్లో 96 మంది ఉన్నారు. కేంద్రాలు ఇవే..ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియిర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూల్, కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వసుంధర జూనియర్ కళాశాలతోపాటు జైనూర్, కెరమెరి, కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే పరీక్షలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. ఫస్టియిర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏడు కేంద్రాల్లో 75 మంది ఇన్విజిలేటర్లు, ఏడుగురు సీఎస్లు, ఏడుగురు డీవోలు, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను నియమించారు. అలాగే కలెక్టర్, అదనపు కలెక్టర్ కూడా పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. నిర్భయంగా పరీక్షలు రాయాలి సప్లిమెంటరీ పరీక్షలకు 2,295 మంది హాజరు కా నున్నారు. నిర్వహణ కోసం అన్నిఏర్పాటు పూర్తి చేశాం. మాస్ కాపీయింగ్కు తావులేకుండా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నా యి. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి. – కళ్యాణి, డీఐఈవో -
పెండింగ్ సమస్యలకు సత్వర పరిష్కారం
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో నెలకొన్న పెండింగ్ సమస్యలకు సత్వరమే పరిష్కార మార్గం చూపిస్తామని జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ నాయకులతో స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి జీఎం కమిటీ సభ్యులతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. పలు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారంపై చర్చించారు. గోలేటి టౌన్షిప్కు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని, గోలేటి నుంచి ఎక్స్రోడ్ వరకు లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. గోలేటి సీహెచ్పీ, ఏరియా వర్క్షాప్లో మ్యాన్ పవర్ కొరతను పరిష్కరించేందుకు జనరల్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. గోలేటి డిస్పెన్సరీలో కూల్వాటర్ సౌకర్యం కల్పించాలని, మాదారం టౌన్షిప్కు రెండో షిఫ్టులో ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని జీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కై రిగూడ ప్రాజెక్టు అధికారి నరేందర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, డీవైజీఎం సివిల్ ఎస్కే మదీనా బాషా, అకౌంట్స్ అధికారి రవికుమార్, సీహెచ్పీ ఎస్ఈ కోటయ్య, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, జీఎం కమిటీ సభ్యులు శేషశయనరావు, రాజేష్, మారిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కుప్పల వద్ద రైతుల తిప్పలు
● అకాల వర్షానికి తడిసిన ధాన్యందహెగాం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం బస్తాలు చూపుతున్న ఈ రైతు పేరు చపిలె దేవాజీ. మంగళవారం సుమారు 150 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పెట్టారు. కాంటా పూర్తయినా మిల్లుకు తరలించకపోవడంతో బుధవారం అకాల వర్షానికి బస్తాలన్నీ తడిచిపోయాయి. ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఆగమాగమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. దహెగాం/పెంచికల్పేట్/కౌటాల: యాసంగిలో ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి ధాన్యం వర్షార్పణం అవుతోంది. అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నెలలపాటు కష్టపడి పండించిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతోంది. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం, రెండు రోజులుగా ఆకాశం మబ్బులు పట్టిఉండటంతో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత దహెగాం మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పూర్తయినా లారీలు రాకపోవడంతో బస్తాలు కదలడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రాత్రిపూట అంధకారంలో గడిపారు. పెంచికల్పేట్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కాపాడుకోవడానికి రైతులు టార్పాలిన్లు కప్పారు. గాలి దుమారానికి కవర్లు కొట్టుకుపోయి ధాన్యం తడిసింది. కౌటాల మండలంలో సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాండ్గాం, వీరవెల్లి, కౌటాల, ముత్తంపేట, గుడ్లబోరి గ్రామాల్లో నూర్పిడి చేసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. వీరవెల్లిలోని కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తడవకుండా కవర్లు కప్పడానికి రైతులకు తిప్పలు తప్పలేదు. మూడు రోజులుగా సాయంత్రం మబ్బులను చూసి ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకోవడం, ఉదయం మళ్లీ ఎండకు తీయడం ఇబ్బందిగా మారింది. గురుడుపేట సహకార సంఘం ఆధ్వర్యంలో కౌటాల, ఐకేపీ ఆధ్వర్యంలో సాండ్గాం, వీరవెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇటీవలే ప్రారంభించారు. సరిపడా స్థలం లేకపోవడంతో రైతులు ఇళ్ల వద్దనే ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
దహెగాం(సిర్పూర్): కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాల ని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు లగ్గాం, హత్తిని, కల్వాడ తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమ శాతం పరిశీ లించారు. అనంతరం మాట్లాడుతూ ఆరబెట్టి న ధాన్యాన్ని కాంటా చేసి వేగంగా మిల్లులకు పంపించాలన్నారు. అకాల వర్షాలతో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీసీవో బిక్కు, డీసీఏవో మహ్మద్, డీటీలు రాజ్కుమార్, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. -
‘లేబర్ కోడ్లు రద్దు చేయాలి’
ఆసిఫాబాద్అర్బన్: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు కార్మిక సంఘాలు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. ఉపాధిహామీ, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్ వంటి పథకాలకు అధిక నిధులు కేటాయించాలని కోరా రు. డిమాండ్ల సాధన కోసం జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేందర్, సభ్యులు కృష్ణమాచా రి, వివిధ సంఘాల నాయకులు శ్రీకాంత్, ప్ర భాకర్, కోటయ్య, పద్మ, రాజు, సమ్మయ్య, తిరుపతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభం రోజే పంపిణీ!
ఆసిఫాబాద్రూరల్: పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల యూనిఫాం వస్త్రం జిల్లాకు చేరుకోగా, కుట్టు పని కోసం మహిళా స్వయం సహాయ సంఘాలకు అందించారు. ఈ నెల 25 వరకు కనీసం ఒక జత యూనిఫాం అయినా సిద్ధం చేయాలని వారిని ఆదేశించింది. ఇక పాఠ్య పుస్తకాల పంపిణీని సైతం వేగవంతం చేసింది. ఇప్పటికే జిల్లాకు 83శాతం పుస్తకాలు చేరుకోగా, మంగళవారం నుంచి ఈ నెల 31లోగా మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. జిల్లాకు చేరిన 2,95,530 బుక్స్జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలు(స్థానిక సంస్థలు) ఉన్నాయి. వీటిల్లో 60,779 మంది విద్యార్థులకు అన్నిరకాల పాఠ్య పుస్తకాలు 3,54,570 వరకు అవసరం ఉంటాయి. ఇప్పటి వరకు 2,95,530 పాఠ్యపుస్తకాలు(83 శాతం) జిల్లాకు చేరుకున్నాయి. వీటిని జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో గోదాంలో నిల్వ చేశారు. మరో 59,040 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని డిపో నుంచి మంగళవారం నుంచి బుక్స్ పంపిణీని ప్రారంభించారు. ఈ నెల 31 వరకు జిల్లాలోని 15 మండలాల విద్యాధికారులకు అందించనున్నారు. జూన్ 10లోగా మండల విద్యాధికారి కార్యాలయం నుంచి పాఠశాలల వారీగా పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నోటు పుస్తకాలు సైతం..2025– 26 విద్యా సంవత్సరం నుంచి అన్ని తరగతుల విద్యార్థులకు నోటు పుస్తకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని డిపో నుంచి పంపిణీ చేస్తుండగా, నోట్బుక్స్ మాత్రం హైదరాబాద్ నుంచి నేరుగా ఆర్టీసీ కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమికస్థాయిలో చదివే విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. మండలాల వారీగా.. జిల్లాలోని 60,777 మంది విద్యార్థులకు అందించేందుకు 83 శాతం పాఠ్యపుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా నుంచి ఈ నెల 31 లోపు మండలాల వారీగా పంపిణీ చేస్తాం. బుక్ డిపో నుంచి మండల విద్యా వనరుల కేంద్రానికి పుస్తకాలు తరలిస్తున్నాం. – ప్రకాశ్, జిల్లా పాఠ్య పుస్తకాల డిపో మేనేజర్ జిల్లాకు చేరిన 83శాతం బుక్స్ ఈ నెల 31 వరకు మండలాల వారీగా సరఫరా పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు అందించేలా కసరత్తు ఈ ఏడాది అన్ని తరగతులకు నోటుపుస్తకాలు అందజేతవిద్యార్థులకు సకాలంలో అందించాలి ఆసిఫాబాద్రూరల్: పాఠశాలలు పునఃప్రారంభం నాటికి సకాలంలో విద్యార్థులకు పా ఠ్యపుస్తకాలు అందించాలని జిల్లా పాఠ్య పు స్తకాల డిపో మేనేజర్ ప్రకాశ్, ఆసిఫాబాద్ ఎంఈవో సుభాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని తెలంగాణ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పుస్తకాల డిపో నుంచి వివిధ మండలాలకు పుస్తకాల పంపిణీని మంగళవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 15 మండలాలకు సంబంధించి 3,54,570 పుస్తకాలకు గాను 2,95,530 పు స్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపా రు. ఈ నెల 31వ తేదీలోపు అన్ని మండలా ల ఎంఈవోలు పుస్తకాలు తీసుకెళ్లాలని సూ చించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మహారాజ్గూడలో వరకట్న నిషేధం
లింగాపూర్(ఆసిఫాబాద్): సిర్పూర్(యూ) మండలం మహాగాం గ్రామ పంచాయతీ పరిధిలోని మహారాజ్గూడలో వరకట్నం నిషేధిస్తూ గ్రామస్తులు తీర్మానించారు. గ్రామానికి చెందిన మడావి యాదవ్రావు, చంద్రభాగ దంపతుల కుమార్తె వివా హానికి గ్రామస్తులు కుటుంబం నుంచి రూ.500 చొప్పున జమ చేసి మంగళవారం రూ.25,000 నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ మెస్రం శ్యాంరావు మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో వరకట్నం నిషేధించాలన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మహారాజ్గూడలో వరకట్న నిషేధంతోపాటు వివాహానికి గ్రామస్తులు ఆర్థికసాయం అందించాలనే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెస్రం దత్తు, ఆత్రం ఆనంద్రావు, సురోజీ, కై లాస్ తదితరులు పాల్గొన్నారు. -
పులి చర్మం, గోళ్లు స్వాధీనం
● పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం ● ఎఫ్డీపీటీ శాంతారాం కాగజ్నగర్టౌన్: పెంచికల్పేట్ అటవీ రేంజ్ పరిధిలో ఐదురోజుల క్రితం వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృతి చెందిన పెద్దపుల్లి చర్మం, గోళ్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్నగర్ ఫారెస్టు డివిజన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎఫ్డీపీటీ శాంతారాం వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు విద్యుత్ వైర్లతో ఉచ్చు ఏర్పాటు చేసి పులిని హతమార్చారని తెలిపారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. దహెగాం మండలం చిన్న రాస్పెల్లి గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో పులిచర్మం, గోళ్లు, దంతాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మృత్యువాత పడిన పులి చారలు, వయస్సు ఆధారంగా కే8 పెద్దపులిగా ప్రాథమికంగా నిర్ధారించామని, ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. వేటగాళ్లు ఉచ్చు బిగించిన ప్రాంతంలో గతంలో గ్రామం ఉండేదని, ప్రస్తుతం వేరే ప్రాంతానికి తరలిపోయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలు తీయకపోవడంతో కరెంట్ తీగల ద్వారా ఉచ్చును ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడిందన్నారు. విద్యుత్ స్తంభాలు ఆ ప్రాంతం నుంచి తొలగించాలని గతంలో కూడా విద్యుత్ శాఖ అధికారులకు సూచించామని తెలిపారు. అనుమానితులను లోతుగా విచారిస్తున్నామని, మరో రెండురోజుల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవార్, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి’ రైతులకు చేయూత
● పోడు భూముల్లో సాగుకు సర్కారు తోడ్పాటు ● ‘ఇందిర సౌర జల వికాసం’తో ముందడుగు ● ఉమ్మడి జిల్లాలో పలువురికి చేకూరనున్న లబ్ధి ● డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ వారంలో ప్రారంభం ● ఏర్పాట్లపై ఐటీడీఏ దృష్టిసాక్షి, ఆదిలాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి కుటుంబ ఆదాయం రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇందిర సౌర గిరి జలవికాసం అనే ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ పథకాన్ని ఈ వారంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ఈమేరకు లబ్ధి చేకూరనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు..రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక మంది గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం కింద పోడు వ్యవసాయం చేసుకునేందుకు భూ యాజమాన్య హక్కు ను కల్పించింది. ఆ భూముల్లో రాబోయే ఐదేళ్లల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రస్తుతం సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నల్లమల డిక్లరేషన్ ప్రకటించింది. గిరిజనుల సంక్షేమం కోసం పలు అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం సంక్రమించిన పోడు భూములకు ఈ పథకంతో లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. లబ్ధి ఇలా..పోడు భూముల్లో వంద శాతం సబ్సిడీతో సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. తద్వారా ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చి గిరి రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో బోరుబావుల స్థానంలో చేతిబావులు తవ్వించాలని ఐటీడీఏ నిర్ణయించింది. దీనికి ఇందిర సౌరజల వికాస పథకం ద్వారా సౌర పలకలు బిగించనున్నారు. శాఖల సమన్వయం..గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఇందులో అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు. తద్వారా వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎం రానున్నారు.. ఇందిర సౌర జల గిరి వికాస పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఈ వారంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి వేదికను ఖరారు చేస్తున్నాం. జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనేది పథకం ప్రారంభించిన తర్వాత స్పష్టం అవుతుంది. – ఖుష్బూ గుప్తా, పీవో, ఉట్నూర్ ఐటీడీఏఅర్హులు వీరు..అటవీ హక్కు చట్టం కింద జారీ చేయబడిన భూ యాజమాన్యం హక్కు కలిగిన ప్రతీ గిరిజన రైతును అర్హులుగా నిర్ణయించారు. సదరు రైతుకు రెండున్నర ఎకరాలు(హెక్టారు), అంతకంటే ఎక్కువ ఉంటే ఒక యూ నిట్గా మాత్రమే మంజూరు చేస్తారు. అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నట్లయితే సరిహద్దులో గల ఇద్దరి నుంచి ఐదుగురిని గ్రూప్గా ఏర్పాటు చేసి యూనిట్గా మంజూరు చేయనున్నారు. ఒకవేళ సరిహద్దులో అటువంటి రైతుల భూములు లేనిపక్షంలో ఆ రైతుకు వ్యక్తిగతంగా యూనిట్ మంజూరు చేసేలా ఇందులో ప్రణాళిక చేశారు. అభివృద్ధి పనులు ఇవి.. ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ భూముల్లో భూగర్భ, నీటి సర్వే చేపట్టి రైతుకు లబ్ధి చేకూరేలా చేతిబావులు తవ్వకం చేపట్టనున్నారు. 5 హెచ్పీ, 7.5 హెచ్పీ సోలార్ పంపుసెట్లు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యాంత్రీకరణకు సహకారం అందించనున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కోసం డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయనున్నారు. -
టీచర్లకు శిక్షణ షురూ
● ఎస్జీటీలకు మండల కేంద్రాల్లో.. ● స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా కేంద్రంలో నిర్వహణ ● ఈ నెల 24 వరకు ప్రక్రియ కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభమైంది. ఈ నెల 13 నుంచి 17 వరకు జిల్లా కేంద్రంలో డీఆర్పీలు(జిల్లా రిసోర్స్పర్సన్లు) ఎంఆర్పీ(మండల రిసోర్స్పర్సన్లు)లకు శిక్షణ కల్పించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి ఎంఆర్పీలు ఉపాధ్యాయులకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతిక, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రంలో.. ఎస్టీజీలకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఈవీఎస్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఐదోరోజు పాఠ్యాంశాయేతర అంశాలు అంటే పాఠశాలలో రికార్డుల నమోదు, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి, ప్రవేశాల పెంపు తదితర అంశాల గురించి వివరించనున్నారు. 1,663 మంది టీచర్లకు..జిల్లాలోని 15 మండలాల్లో 738 ప్రభుత్వ పాఠశాలలు(లోకల్ బాడి) ఉన్నాయి. మొత్తం 1,663 మంది ఉపాధ్యాయులకు (528 మంది ఎస్ఏలు, 1,135 మంది ఎస్జీటీలు) శిక్షణ ప్రారంభమైంది. స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల, ఆశ్రమ ఉన్నత పాఠశాల(బాలికలు), జిల్లా పరిషత్ జన్కాపూర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు)లలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఇక స్కూల్ గ్రేడ్ టీచర్లకు 15 మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. మండల కేంద్రాల్లో ఎమ్మార్సీలు శిక్షణ ఇస్తుండగా.. ఎంఈవోలు పర్యవేక్షిస్తున్నారు. భోజన వసతి కోసం ఒక్కో టీచర్కు ప్రభుత్వం రోజుకు రూ.200 అందిస్తోంది. ఉపాధ్యాయులు గైర్హాజరు కాకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు. డీఈవోతో పాటు అకాడమిక్ మానిటరింగ్ అధికారులు ఇప్పటికే పలుమార్లు జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసి మండల విద్యాధికారులకు విధివిధానాలు తెలియజేశారు. ఉపాధ్యాయులు గైర్హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో తొలిరోజు వందశాతం మంది టీచర్లు హాజరయ్యారు. గుణాత్మక విద్యనందించడమే లక్ష్యం విద్యార్థుల్లో తగిన సామర్థ్యాలు పెంచడంతోపాటు గుణాత్మక విద్యనందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగుతోంది. టీచర్లు సకాలంలో తరగతులకు హాజరై, అన్ని అంశాలపై అవగా హన పెంచుకోవాలి. ఏఐ బోధనకు సిద్ధం కావాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్ -
కట్టలేం!
ఇందిరమ్మ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో అమలు పర్చడానికి హౌసింగ్ అధికారులు అపసోపాలు పడుతున్నారు. ‘ప్రజాపాలన’లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసినా.. కొందరు నేటికీ ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడంలేదు. వారిని ఒప్పించడం అధికారులకు ‘కత్తి మీద సాము’గా మారింది. దీంతో జిల్లాలో 749 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి నోచుకోకుండా మిగిలిపోయాయి. సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రెండు నియోజకవర్గాలకు 7 వేల ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మండలాల్లో 15 గ్రామ పంచాయతీలను మొదటి దశ కింద ఎంపిక చేసి వాటిలో పైలట్ ప్రాజెక్టు కింద 1,669 ఇళ్లు మంజూరు చేశారు. మండలానికి ఒకటి చొప్పున ఇందిరమ్మ నమూనా ఇళ్లను నిర్మించాల్సి ఉండగా 13 మండలాల్లో పూర్తయ్యాయి. ఒక్కో ఇంటిని 400 చదరపు అడుగుల్లో నిర్మిస్తే రూ.5 లక్షలు ఖర్చవుతుంది. నిర్మాణ పనుల తీరు ను బట్టి నాలుగు విడతల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం డబ్బును అందజేస్తుంది. ఇప్పటి వరకు 920 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకొ చ్చారు. ఇందులో 215 ఇళ్లు పునాది దశకు చేరాయి. వీరందరికి మొదటి విడతగా రూ.లక్ష నగదు విడుదల చేశారు. లబ్ధిదారుల అనాసక్తి...మొదటి విడతలో జిల్లాకు 1,669 ఇళ్లు మంజూరు కాగా 920 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి అంగీకారపత్రాలు సమర్పించారు. కానీ 749 మంది మాత్రం నేటికీ అంగీకారపత్రాలు అందించలేదు. వెనుకబడిన జిల్లా.. గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతం కావడం వల్ల రూ.5 లక్షలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టడం వారికి భారంగా మారింద ని కొందరు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం.. ఇసుక ఆకాశన్నంటి న తరుణంలో అప్పు చేసి ఇళ్ల నిర్మాణానికి పూనుకు న్న తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఉంటే మా పరిస్థితి ఏమిటన్న వాదన కూడా ఉంది. లబ్ధి దారుల అనుమానాలపై హౌసింగ్ అధికారులు స మాధానం ఇవ్వడమే కాకుండా.. స్వయం సహాయ క సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ ఇంటి నిర్మాణానికి ముందుకు రాకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అటవీ అధికారులు అడ్డుకోవడడంతో బెజ్జూరు మండలం సుశ్మీర గ్రామం, సిర్పూరు (టి) మండంలోని రావణపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు ఆగిపోయాయి. లబ్ధిదారులు మొదటిస్థా యి (ఎల్–1) కింద చూపిన స్థలాలు అటవీశాఖ ప రిధిలోకి వస్తాయని పేర్కొంటూ స్థానిక అటవీ అధి కారులు అక్కడ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారు.జిల్లాలో ‘ఇందిరమ్మ’ పథకం అమలవుతున్న జీపీలుమండలం గ్రామ పంచాయతీ ఆసిఫాబాద్ గోవిందాపూర్ వాంకిడి జైత్పూర్ కెరమెరి కోటారి జైనూర్ మార్లవాయి సిర్పూరు(యు) పులార లింగాపూర్ జముల్దర తిర్యాణి రొంపల్లి రెబ్బెన పాసిగాం కాగజ్నగర్ మాలిని సిర్పూర్(టి) మేడిపల్లి దహెగాం డిగడ పెంచికల్పేట్ లోడుపల్లి బెజ్జూర్ సుశ్మీర చింతలమానెపల్లి బాబాపూర్ కౌటాల నాగేపల్లి దశల వారీగా నిర్మాణ చెల్లింపులు ఇలా...పునాది రూ.లక్ష రూఫ్ లెవల్ రూ.1.25 లక్షలు స్లాబ్ రూ.1.75 లక్షలు పెయింటింగ్ పూర్తయ్యాక రూ.లక్ష పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ఇళ్ల నిర్మాణానికి ముందుకురాని వైనం.. నేటికీ అంగీకారం తెలుపని 749 మంది.. రుణాలిప్పిస్తామంటున్న హౌసింగ్ అధికారులు రెండు గ్రామాల్లో అటవీ అధికారుల అభ్యంతరంఅవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో మొదటి దశలో 749 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లే దు. వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఆర్థికభారం పడకుండా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణా లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. అయినా ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాకపోతే షోకాజ్ నోటీసు జారీ చేసి అర్హుల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తాం. రెండో దశ అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. – ఆర్.వేణుగోపాల్, ప్రాజెక్టు ఆఫీసర్, హౌసింగ్ విభాగం -
విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి
కెరమెరి: నెలరోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని వార్డు నెంబర్ 1 కి చెందిన వినియోగదారులు సోమవారం స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోతోందన్నా రు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడంలేదన్నారు. ప్రస్తుతం సబ్స్టేషన్కు వచ్చినప్పటికీ బాధ్యత గల అధికారులెవరూ లేరన్నారు. స్థానికంగా ఉండాల్సిన అధికారులు జిల్లా కేంద్రాల్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఏఈ రమేశ్ రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సుధాకర్, ఫాజిల్, ఇలి యాజ్, అహ్మద్, పోషెట్టి, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
రెబ్బెన: అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజీవ్ యువ వికా సం పథకం ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ సోమవారం అడిషనల్ కలెక్టర్ డేవిడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కుమురం భీం జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు అందించాలన్నారు. ప్రధానంగా బ్యాంకులు సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు. రుణాల మంజూరు విషయంలో గతంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం బీసీ ఇన్చార్జి ఈడీగా వ్యవహరిస్తున్న అధికారిని వెంటనే ఆ బాధ్యతల నుంచి తొలగించి మరో అధికారికి అప్పగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు అన్యాయం జరిగితే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే ఇళ్లు మంజూరు చేశారని, దీంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల మధుకర్గౌడ్, సోనాపూర్ గ్రామపటేల్ కుమురం దొందేరావు, తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్రూరల్: పదోతరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 7 సెంటర్లలో 2,292 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఇందులో జనరల్ 2,057 మంది, ఒకేషనల్ 235 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఫస్టియిర్ ఉదయం 9 నుంచి 12:30 వరకు సెకండియర్ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు నిర్వహిస్తారన్నారు. జూన్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలివిద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే -
● వానాకాలం సీజన్కు చురుగ్గా ఏర్పాట్లు ● విత్తనాలు, ఎరువుల సేకరణలో వ్యవసాయశాఖ ● తొలకరికి ముందే విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు
రెబ్బెన(ఆసిఫాబాద్): వానాకాలం పంటల సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. మరో పక్షం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో రైతులు పంటల సాగుకు అవసరమైన పనుల్లో నిమగ్నమయ్యారు. నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి భూములు తడవడంతో రైతులు దుక్కులు దున్నడం, సేంద్రియ ఎరువులను పొలాల్లో చల్లడం వంటి పనులు చేపడుతున్నారు. జిల్లాలో సాగు వనరులు అంతంత మాత్రంగానే ఉండటంతో రైతులు పూర్తిగా వర్షాధార పంటల సాగునే నమ్ముకున్నారు. దీంతో ఈసారి కూడా ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తే అధిక మొత్తంలో సాగు కానుంది. సాగునీటి వసతి అందుబాటులో ఉన్న రైతులు మాత్రం వరి సాగు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సైతం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. పొడి దుక్కిలోనే విత్తనాలుజిల్లాలోని 15 మండలాల పరిధిలో సుమారు 4.45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వ ర్షాధార పంటలైన పత్తి, కంది వంటి పంటలు ఎక్కు వ విస్తీర్ణంలో సాగుచేస్తారని అధికారులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో పత్తి పంటలను సాగుచేసే రైతుల తొలకరి వర్షాలకు ముందే పొడి దుక్కిలో విత్తనాలు విత్తుతూ వస్తున్నారు. ఈసారి సైతం ఇదే పద్ధతి కొనసాగించేలా కనిపిస్తున్నారు. అయితే తేలికపాటి భూముల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం, నల్లరేగడి నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షం నమోదైన తరువాతే విత్తనాలు విత్తుకోవాలని వ్యవసాయశా ఖ అధికారులు సూచిస్తున్నారు. తొలకరి వర్షాలు ఆ శాజనకంగా పడితే విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అరకొరగా పడితే మా త్రం విత్తనాలు మొలకెత్తకుండానే భూమిలోనే చెడిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు మరోసారి విత్తనాలు విత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పొలం బాటలో రైతులువర్షాకాలం సమీపిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాల్లో పాత పంటల అవశేషాలను తొలగించడం, దుక్కులు దున్నడం, సేంద్రియ ఎరువులు తరలించడం వంటి పనులు చేపడుతున్నారు. జూన్ మొదటివారంలో తొలకరి వర్షాలు పడక ముందే పత్తి విత్తనాలను విత్తుకునేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. చాలా మంది రైతులు అవగాహన లేక వరికొయ్యలకు నిప్పు పెడుతున్నారు. దీంతో భూముల్లో ఉన్న సూక్ష్మపోషకాలు నశించి దిగుబడి తగ్గుతోంది. వరికొయ్యలను కాల్చడం కంటే భూమిలోనే కలియదున్నితే పంటలకు ఎంతో మేలు కలుగుతుందని అధికారులు చెప్పుతున్నారు. దుక్కి దున్ని సిద్ధంగా ఉంచిన చేనువానాకాలం సీజన్కు కావాల్సిన విత్తనాలు పత్తి ప్యాకెట్లు 6,70,727 వరి (క్వింటాళ్లలో) 14,215 కంది (క్వింటాళ్లలో) 1217.2 అవసరమైన ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో)యూరియా 60,081 డీఏపీ 40,052 ఎంవోపీ 10,011 ఎస్ఎస్పీ 20,025 కాంప్లెక్స్ 20,025 -
సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శం
ఆసిఫాబాద్అర్బన్: దక్షణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట రథసారధి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దినకర్ అన్నారు. సుందరయ్య 40వ వర్ధంతి ని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కా ర్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దినకర్ మాట్లాడు తూ 1932లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి తన ఇంటి నుంచే పోరాటం ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో నాయకులు కోట శ్రీనివాస్, రాజేందర్, కార్తీక్, టీకానంద్, కృష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు
● ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావ్ఆసిఫాబాద్అర్బన్: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఇతరులను కించపర్చేలా పోస్టులు చేస్తే గ్రూప్ అడ్మిన్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్సై, సీఐలతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనవసర విషయాలను, రాజకీయ నాయకుల, కులమతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను, ఇతరుల మనోభావాలను కించపర్చేలా పోస్టులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పదోన్నతితో గుర్తింపుపోలీసు శాఖలో పదోన్నతి పొందడం ద్వారానే గుర్తింపు లభిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావ్ అన్నారు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మీర్ ఉస్మాన్ అలీ, కౌటాల హెడ్ కానిస్టేబుల్ బాబాజీకి ఏఎస్సైలుగా పదోన్నతి లభించడంతో సోమవారం తన కార్యాలయంలో చిహ్నం అలంకరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఐ ఎంటీవో అంజన్న, సీసీ కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వ చ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆసిఫాబాద్ పట ణం సందీప్నగర్కు చెందిన దుర్గం సంగీత తన కూతురుకు దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం ఎల్లారంకు చెందిన ఆరిందుల సుధాకర్ తాను కొనుగోలు చేసిన భూమికి పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని, జైనూర్ మండలం సోనుపటేల్ గూడకు చెందిన మిశ్రమ తూర్పుబాయ్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఆసిఫాబాద్ మండలం రహపల్లికి చెందిన మారిశెట్టి గురువయ్య తన భూమికి కొలతలు చేయించాలని, జైనూర్ మండలం ఊసేగాంకు చెందిన మడావి శ్యాంసుందర్ తనకు గ్రామ పంచాయతీలో కామాటీగా ఉపాధి కల్పించాలని దరఖాస్తులు సమర్పించారు.● కలెక్టర్ వెంకటేష్ దోత్రే -
గోలేటి ఓసీపీని త్వరగా ప్రారంభించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా చేపట్టబోయే గోలేటి ఓసీపీని త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సోమవా రం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సింగరేణి సీఅండ్ఎండీ బలరాంను మర్యాదపూర్వకంగా కలి శారు. గోలేటి ఓసీపీ ఏర్పాటు పనులను వేగంగా చేపట్టి ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో ఒకప్పుడూ సింగరేణి గనులతో కళకళాడిందని ఆ సమయంలో ఎంతో మందికి ఉపాధి దొరికిందన్నారు. ప్రస్తుతం ఏరి యాలో ఒక్క గని మాత్రమే ఉండగా మరో మూడేళ్లలో ఆ ఒక్క ఓసీపీ సైతం మూతపడనుందన్నారు. ఈ సమయంలో జిల్లాలో కొత్తగా సింగరేణి గనుల ఏర్పాటు ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సింగరేణి నిధులు కేటాయించాలని కోరారు. -
చేరువైన ఏసీబీ..
● సీసీసీ నస్పూర్లో నేడు కార్యాలయం ప్రారంభం ● అవినీతి నిరోధంలో కొత్త అడుగు ● హర్షం వ్యక్తం చేస్తున్న రెండు జిల్లాల ప్రజలు మంచిర్యాలక్రైం/నస్పూర్: మంచిర్యాల జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో, నస్పూర్లో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యాల యం ఏర్పాటుతో మంచిర్యాల, కుమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లోని అవినీతి అధికారుల్లో భయం నెలకొంది. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ కార్యాలయం ఉండేది. 160 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజలు ఫిర్యాదుల కోసం ఇబ్బందులు పడేవారు. జిల్లాల పునర్విభజనతో ఏసీబీ కార్యాలయాన్ని కూడా తా జాగా విభజించారు. మంచిర్యాల నస్పూర్లోని పాత పోలీస్ స్టేషన్ భవనంలో ఏసీబీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయం అవినీతిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టనుంది. దూర భారం తగ్గింపుగతంలో ఆదిలాబాద్లోని ఏసీబీ కార్యాలయం మంచిర్యాల, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలకు దూరంగా ఉండేది. ఫిర్యాదు చేయాలంటే ఒక రోజంతా ప్రయాణం చేయాల్సి వచ్చేది. నస్పూర్లో కొత్త కార్యాలయం ఏర్పాటుతో ప్రజలు, అధి కారుల ఇబ్బందులు తగ్గనున్నాయి. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి సోమవారం కార్యాలయాన్ని ప్రా రంభించనున్నారు. 14 మంది సిబ్బందితో నడిచే ఈ కార్యాలయం రెండు జిల్లాల్లో నిఘాను బలోపేతం చేస్తుంది. సమర్థవంతమైన నిర్వహణగతంలో ఒకే డీఎస్పీ ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ల బాధ్యతలు నిర్వహించడంతో పర్యవేక్షణ సమర్థంగా సాగలేదు. ఇప్పుడు స్థానిక డీఎస్పీ విజయకుమార్ నేతృత్వంలో మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది, ఇది ఫిర్యాదులపై త్వరిత చర్యలకు దోహదపడుతుంది. పెరుగుతున్న అవినీతి.. జిల్లా కోల్బెల్ట్, రియల్ ఎస్టేట్, భూ సెటిల్మెంట్ వ్యాపారాలతో సందడిగా ఉంటుంది. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, మైనింగ్, సింగరేణి వంటి శాఖలపైఅవినీతి ఆరోపణలు ఉన్నాయి. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కేసుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ సేవకు లంచం డిమాండ్ సర్వసాధారణమైంది. ఫిర్యాదుల సంఖ్య పెరిగే అవకాశం.. కలెక్టరేట్ సమీపంలో ఏసీబీ కార్యాలయం ఏర్పడటంతో ఫిర్యాదుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రజలు లంచం డిమాండ్పై సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. ఏసీబీ అధికారులు అక్రమ ఆస్తులపై దృష్టి సారించనున్నారు.నిర్భయంగా ఫిర్యాదు చేయండి.. అవినీతి అధికారుల వేధిపులకు గురయ్యేవారు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. ఎవరికీ లంచం ఇవ్వకూడదు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదు చేయచ్చు. 24/7 నస్పూర్లోని ఏసీబీ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాల ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్ 9154388963కు ఫిర్యాదు చేయచ్చు. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ, మంచిర్యాల -
డ్రంకెన్ డ్రైవ్పై ఫోకస్
● ప్రమాదాల నివారణకు వాహనాల తనిఖీ ● జిల్లా వ్యాప్తంగా 1,785 కేసులు నమోదు ● నాలుగు నెలల్లో 646 మందికి జరిమానా నిబంధనలు పాటించాలి మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు. రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలి. ప్రమాదాల నివారణకు నిత్యం డ్రంకెన్డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఎవరైనా మద్యం సేవించి వాహనాన్ని నడిపి ప్రమాదాలకు కారణమైతే కేసులు నమోదు చేస్తున్నాం. డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారస్ చేస్తున్నాం. గత నాలుగు నెలల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 1,785 మందిపై కేసులు నమోదు చేశాం. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టబడితే తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కుమురంభీం ఆసిఫాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి. – డీవీ శ్రీనివాస్రావ్, ఎస్పీ ఆసిఫాబాద్అర్బన్: మద్యం సేవించి వాహనాలు న డిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై పోలీ స్శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా కేసులు నమోదు చేయడంతోపాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారస్ చేయనుంది. ప్రమాదా లను నివారించేందుకు జిల్లాలో ప్రతీరోజు ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో అధికారులు డ్రంకెన్డ్రైవ్, వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. గత నాలుగు నెలల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 1,785 మందికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్న్లిచ్చారు. 646 మందికి రూ.9,33,331 జరిమానా విధించారు. మిగతా 1,139 కేసులు వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. డ్రంకెన్డ్రైవ్ కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఎస్పీ పోలీస్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా..జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. గ్రామాల్లో కళాబృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పట్టుబడితే శిక్షలు తప్పవుజిల్లాలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే పోలీస్శాఖ వారిపై కఠినంగా వ్యవహరించనుంది. దశలవారీగా శిక్షల మోతాదును కూడా పెంచనుంది. తాగి వాహనాలు నడపవద్దని, తద్వారా జరిగే ప్రమాదాల కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు చితికిపోయే అంశాలపై పోలీస్శాఖ కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. పట్టుబడిన వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ కోర్టులో హాజరు పరుస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రెండోసారి పట్టుబడితే సేవించిన మద్యం మోతాదును బట్టి తప్పనిసరిగా శిక్షలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణపై, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారికి నిరంతరం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులు పాటించాల్సిన నియమాలను వివరిస్తున్నారు. దీనిపై నిరవధిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. -
పోరాటాలతోనే గుర్తింపు
రెబ్బెన: ప్రజలు, కార్మికులు, కర్షకుల సమస్యలపై పోరాటాలతోనే ఎర్రజెండా పార్టీ సీపీఐకి గుర్తింపు ఉంటుందని పార్టీ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ అన్నారు. గోలేటి టౌన్షిప్లోని కేఎల్ మహేంద్రభవన్లో ఆది వారం సీపీఐ మండల 4వ మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన ముందుగా అరుణపతాకా న్ని ఎగురవేశారు. అనంతరం సత్యనారా యణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, రైతుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర సీపీఐ కి ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో సీపీ ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోమారం తిరుపతి, బోగే ఉపేందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్బాబు, తదితరులు పాల్గొన్నారు. మండల కార్యవర్గం ఎన్నికసీపీఐ మండల కార్యదర్శిగా రాయిల్ల నర్స య్య, సహాయ కార్యదర్శులుగా జగ్గయ్య, బుద్దాజీ, కోశాధికారి గా నారాయణ, గోలేటి పట్టణ కార్యదర్శిగా మారం శ్రీనివాస్, సహా య కార్యదర్శిగా దుర్గం సాయి, కోశాధికారిగా చల్లూరి అశోక్ను ఎన్నుకున్నారు. -
ఆగని వేట
● అడవుల నుంచి మైదాన ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ● వేటగాళ్ల తీగలకు బలి ● కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు ● అడ్టుకట్ట వేయలేక పోతున్న అటవీశాఖపెంచికల్పేట్: జిల్లాలో వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట పడటం లేదు. అటవీశాఖ అధికారుల నిఘా వైఫల్యంతో నిత్యం ఎక్కడో ఒకచోట అటవీ జంతువులు వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్ తీగలకు బలవుతున్నాయి. రాత్రి వేళల్లో అటవీ సమీప ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చి యధేచ్ఛగా దుప్పులు, జింకలు, మెకాలు, కొండగొర్రెలు వంటి వన్యప్రాణులను హతమారుస్తున్నారు. వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ వేటనే వృత్తిగా మార్చుకున్నారు. అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా వారి తీరులో మార్పు రావడం లేదు. తాజాగా పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని ఎల్లూర్ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం పెద్దపులిని హతమార్చిన వేటగాళ్లు చర్మం, గోర్లు, దంతాలను ఎత్తుకెళ్లారు. అటవీ సమీప ప్రాంతాల్లో నిత్యం వేట...జిల్లాలో విస్తృతమైన అటవీ సంపదతో పాటు సహ జ నీటి వనరులు, నిరంతరం ప్రవహించే పెద్దవా గు, ప్రాణహిత నదులు ఉన్నాయి. దీంతో అనేక రకాల వన్యప్రాణులు ఆవాసంగా మార్చుకుని జీవ నం సాగిస్తున్నాయి. రెండు నెలలుగా అటవీ ప్రాంతంలోని సహజ నీటి వనరులు ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణులు ఆహారం, నీటి కొరకు మైదా న ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇదే అదనుగా భావి స్తున్న వేటగాళ్లు వాటిని హతమారుస్తున్నారు. మారుమూల గ్రామాల్లో జరిగే సంఘటనలు గ్రామస్తుల సహకారంతో బయటికి వస్తే అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అటవీశాఖ అధికారుల అదుపులో నిందితులు?ఎల్లూర్ అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలతో పెద్దపులిని హతమార్చిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిచ్చి న సమాచారంతో అటవీశాఖ అధికారులు పులి చ ర్మం, దంతాల కొరకు ఆదివారం ప్రత్యేక బృందా లు సెర్చ్ ఆపరేషన్ చేశారు. పెంచికల్పేట్ శివారులోని పంట పొలాలు, ఎల్లూర్ అటవీ ప్రాంతంలో అధికారులు గాలించారు. కొత్తగూడ గ్రామానికి చెందిన పలువురు అనుమానితులను శనివారం అదుపులోకి తీసుకోగా వారిలో ఏడుగురిని విచారించిన అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎ ల్లూర్ గ్రామానికి చెందిన ముగ్గురు, పెంచికల్పేట్ గ్రామానికి చెందిన ముగ్గురు, అగర్గూడ గ్రామాని కి చెందిన ఇద్దరితో పాటు దహెగాం మండలంలోని రాస్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురిని అటవీశాఖ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.విద్యుత్ తీగలతోనే వేట...డివిజన్ పరిధిలోని కాగజ్నగర్, పెంచికల్పేట్, బెజ్జూర్, కర్జెల్లి, సిర్పూర్(టి), కౌటాల మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో నిత్యం వే ట సాగుతుంది. అటవీ ప్రాంతాల నుంచి వె ళ్తున్న విద్యుత్ తీగలకు బైండింగ్ వైర్లను తగి లించి కిలోమీటరు వరకు కంచెగా ఏర్పాటు చేసి వన్యప్రాణులను హతమారుస్తున్నారు. పెంచికల్పేట్ రేంజ్లోని మెరెగూడ, ఎల్లూర్, కోయచిచ్చాల, అగర్గూడ, లోడుపల్లి, కొండపల్లి ప్రాంతాల్లో సైతం విద్యుత్ తీగలు అటవీ ప్రాంతాల సమీపంలో ఉండటం వేటగాళ్లకు అదునుగా మారింది. అనుమానితులను విచారిస్తున్న అధికారులు?దహెగాం: పెంచికల్పేట మండలంలోని ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి పులి మృతి చెందడంతో ఒడ్డుగూడ, కర్జి, బామానగర్, చినరాస్పెల్లితో పాటు పలు గ్రామాలకు చెందిన పలువురు అనుమానితులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో మండల కేంద్రానికి చెందిన ఓ డ్రైవర్ ఇంట్లో సైతం అధికారులు సోదాలు నిర్వహించారు. అతన్ని అదుపులో తీసుకుని చినరాస్పెల్లి ప్లాంటేషన్ వద్ద వదిలేశారు. కాగా అతని సెల్ఫోన్ తీసుకెళ్లినట్లు తెలిసింది. -
బీసీ గురుకుల ‘సీవోఈ’
● ఉమ్మడి జిల్లాకు ఒకటి మంజూరు ● ఆదిలాబాద్ పరిధిలో లక్సెట్టిపేటలో బాలుర కళాశాల ● ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి.. ఆదిలాబాద్రూరల్: బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో మహాత్మజ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో 11 పాఠశాలలను ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని ఇంటర్మీడియెట్ వరకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చేరింది. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్సెట్టిపేటలో బీసీ సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) సైతం అందుబాటులోకి రానుంది. ఇక్కడి విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్కు ధీటుగా ఫలితాలు సాధిస్తుండడంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. శిక్షణ.. ఎంపిక ఇందులో ఇంటర్మీడియెట్తో పాటు జేఈఈ మెయిన్స్, నీట్, ఐఐటీ తదితర పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీటిలో ప్రవేశాలకు గాను 75 శాతం బీసీ విద్యార్థులకు, 25 శాతం ఇతరులకు కేటాయించనున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదివిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జిల్లాలో 22 బీసీ గురుకులాలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2017లో 11 మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలను ప్రారంభించగా ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చేరింది. ఇందులో 11 బాలికలు, 11 బాలుర కళాశాలలు ఉన్నా యి. వీటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గాను శనివారం వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి.. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను యూని ట్గా తీసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు సీవోఈలు అందుబాటులో కి రానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బాలుర సీవోఈ ప్రారంభం కానుంది. అలాగే నిజామాబాద్లో బాలికల సీవోఈ ఏర్పాటు కానుంది. ఒక్కో దానిలో 160 (ఎంపీసీ 80, బైపీసీ 80) సీట్లు అందుబాటులో ఉంటాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. – ఎస్ శ్రీధర్, మహాత్మాజ్యోతి బాపూలే గురుకులాల ఆర్సీవో ఒక్కో సీవోఈలో 160 సీట్లు ..కొన్నేళ్లుగా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో సీవోఈలు కొనసాగుతున్నాయి. బీసీ సంక్షేమశాఖ పరిధిలోనూ హైదరాబాద్లో బాలురు, బాలికల సీవోఈలు ఒక్కోటి చొప్పున నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 10 సీవోలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అందుబాటులోకి తెస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకుని రెండు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బాలుర, నిజామాబాద్లో బాలికల సీవోఈలను ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో సీవోఈలో ఎంపీసీలో 80సీట్లు, బైపీసీలో 80 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. -
సిబిల్ స్కోర్ నిబంధన వద్దు
ఆసిఫాబాద్అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు మంజూరు చేసేందుకు విధించిన సిబిల్ స్కోర్ నిబంధన వెనక్కి తీ సుకోవాలని జాతీయ మానవ హక్కుల కమి టీ జిల్లా చైర్మన్ రమేశ్ కోరారు. శనివారం జి ల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రాజవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు ద ఫాలుగా మాత్రమే రుణాలు అందించారని, పదేళ్లలో నిరుద్యోగ యువకులు ఎలాంటి ఉ పాధి లేకుండా నష్టపోయారని తెలిపారు. రా జీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ నిబంధన విధించడంతో మారుమూల గ్రా మాలకు చెందిన పేద యువకులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా సిబిల్ స్కోర్ నిబంధన ఉపసంహరించుకోవాలని, అర్హుల జాబితా పకడ్బందీగా రూపొందించాలని డిమాండ్ చేశారు. -
ఉల్లాస్తో అక్షర వెలుగులు
కెరమెరి(ఆసిఫాబాద్): రాష్ట్రంలో వందశాతం అక్షరా స్యత సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాయి. ఇందుకు నూతన విద్యావి ధానం–2020లో భాగంగా ‘ఉల్లాస్’ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్ది సొసైటీ) అనే నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. గతంలో ఉన్న సాక్షరభారత్ స్థానంలో దీనిని అమల్లోకి తె చ్చింది. బడిబయటి పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించనుంది. సెల్ఫ్హెల్ప్ గ్రూపుల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నే ర్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందుకు ప్రత్యేక యాప్ రూపొందించింది. జిల్లా, మండల, పాఠశా ల స్థాయిల్లో కార్యక్రమాన్ని జూన్ నుంచి అమలు చే యనుంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వగా.. ఈ నెల 20న గ్రామసభలు నిర్వహిస్తా రు. 21నుంచి 25 వరకు గ్రామాల్లో సర్వే నిర్వహించి ఏ స్థాయిలో.. ఎందరు నిర్లక్షరాస్యులున్నారు.. పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయిల్లో ఎందరున్నారు..? అనే విషయాలను సేకరిస్తారు. ఓపెన్ స్కూలింగ్ ద్వారా బోధనకేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షరభారత్ కార్యక్రమాన్ని పదేళ్ల కాలపరిమితితో ప్రారంభించగా 2018 లోనే ముగిసింది. ఆ తర్వాత 2020లో కొత్త విద్యావిధానం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా అందరికీ విద్య అందించేందుకు 2022నుంచి 2027 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు న్యూఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ) లో భాగంగా డిపార్టమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ‘ఉల్లాస్’కు రూపకల్పన చేసింది. ప్రాథమిక, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత క ల్పించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమంపై అవగాహన, జీవన నైపుణ్యాలు పెంపొందించి తద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడ మే లక్ష్యంగా ఉల్లాస్ను తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ కార్యాచరణ ప్రారంభమైంది. 100శాతం అక్ష్యరాస్య త సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా 14 ఏళ్ల వ యస్సు పైబడిన వారిని, డ్రాపౌట్స్, బడీడు పిల్లల ను గుర్తించి ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)లో ప్రవే శం కల్పిస్తారు. పరీక్షలు రాయించి ఉత్తీర్ణులయ్యేలా చూస్తారు. 15 ఏళ్లు పైబడిన వారిని ఓపెన్ ఇంటర్లో జాయిన్ చేయించి ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీ సుకుంటారు. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకూ చదవడం, రాయడం నే ర్పిస్తారు. త్వరలో ఇన్స్ట్రక్టర్లను నియమిస్తారు. ప్రత్యేక యాప్ రూపొందించి..ఉల్లాస్ కార్యక్రమం అమలుకు ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. డీఆర్డీవో ద్వారా సెల్ఫ్హెల్ప్ గ్రూపుల్లోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వివరాలు యాప్లో అప్లోడ్ చేస్తారు. సులభంగా చదవడం, రాయడం నేర్పించేందుకు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ‘అక్షర వాచకం’ పుస్తకాన్ని త్వరలో రూపొందించనున్నారు. రోజుకు రెండు గంటల చొప్పున.. నిరక్షరాస్యులకు రోజులో రెండు గంటల చొప్పున 200 గంటలు బోధిస్తారు. తరగతుల నిర్వహణకు పాఠశాలలు, ప్రభుత్వ కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ సెంటర్లను గుర్తించి డిజిటల్ కంటెంట్తో కంప్యూటర్, టీవీలను సమకూర్చనున్నారు. జిల్లా నిరక్షరాస్యులు కు.ఆసిఫాబాద్ 22,494ఆదిలాబాద్ 26,312నిర్మల్ 31,323మంచిర్యాల 30,636 జిల్లాల వారీగా నిరక్షరాస్యుల వివరాలు సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 20న గ్రామసభలు 21 నుంచి 25 వరకు సర్వే ప్రక్రియ జూన్ నుంచి కార్యక్రమం ప్రారంభంవందశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా కార్యాచరణ తయారుచేశాం. ఈ నెల 20న గ్రామసభలు, 21నుంచి 25 వరకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తాం. ఇందులో ఏయే స్థాయికి చెందిన వారు ఏమేం చదివి ఉన్నారో గుర్తిస్తాం. పూర్తిస్థాయిలో ఉల్లాస్ను విజయవంతం చేసేందుకు మండల, జిల్లా స్థాయి అధికారులను సమన్వయపరుస్తాం. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు కూడా భాగస్వాములు కావాలి. – కటుకం మధూకర్, ఉల్లాస్ ప్రోగ్రాం అధికారి, కుమురంభీం ఆసిఫాబాద్ -
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
ఆసిఫాబాద్అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్ నుంచి జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, గృహ నిర్మాణశాఖ అధికారులతో పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అర్హుల జాబితా, రాజీవ్ యువ వికాసానికి అర్హుల ఎంపిక, తాగునీటి సరఫరా, నమూనా ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణం, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం, ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంపుదల తదితర అంశాలపై అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటిని 400నుంచి 600 చదరపు గజాల్లో మాత్రమే నిర్మించాలని సూచించారు. రాజీవ్ యువ వికాసానికి అర్హులను ఎంపిక చేసి జాబితా రూపొందించి జిల్లా స్థాయి క మిటీకి అందించాలన్నారు. అర్హులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఉపాధిహా మీ పనులకు కూలీల సంఖ్య పెంచాలని, పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీటిని అందించాలని పేర్కొన్నా రు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఉపాధిహా మీ పనుల్లో భాగంగా సామాజిక ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షతిగౌడ్, జిల్లా సంక్షేమాధికారి సజీవన్, జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీనారాయణ, మైనార్టీ సంక్షేమాధికారి నదీమ్, డీటీడీవో రమాదేవి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ భుజంగ్రావ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులతో సమీక్ష -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
దహెగాం: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రా మాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీస్తున్నా రాత్రి వేళ రైతులు కొనుగోలు కేంద్రాల వ ద్దకు పరుగులు తీశారు. ధాన్యం తడవకుందా టా ర్పాలిన్లు కప్పారు. గాలి ఎక్కువగా ఉండటంతో టా ర్పాలిన్లు లేచి ధాన్యం తడిసింది. ధాన్యం కుప్పల కింద వర్షపు నీరు చేరింది. కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం 20 రోజులుగా ఆరబెడుతున్నా తూకం వేయడంలేదని రైతులు ఆరోపించారు. తూకం వేసిన ధాన్యం లోడింగ్ చేయడం లేదని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. భారీ వర్షం కారణంగా అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. వాతావరణం చల్లబడింది. అకాల వర్షాలకు రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు. పెంచికల్పేట్ మండలంలో..పెంచికల్పేట్: మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. చేడ్వాయి, ఎల్కపల్లి, ఎల్లూర్, కొండపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కౌటాల మండలంలో.. కౌటాల: మండలంలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని సాండ్గాం గ్రామంలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిచిపోయింది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ఆ రబోసిన ధాన్యం తడవకుండా రైతులు కవర్లు కప్పడానికి తిప్పలు పడ్డా రు. సాండ్గాం, ముత్తంపేట, వీరవెల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేయాలని కోరుతున్నారు. -
పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పె యింటింగ్ పనులు పూర్తి చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి మాట్లాడా రు. బాడిబాటకు ముందే అమ్మ ఆదర్శ పాఠశాలల పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. పాఠశాలల్లో పనులు పూర్తయినప్పటికీ గదులకు రంగులు వేయలేదని పేర్కొన్నారు. సమగ్ర సర్వే విజయవంతంగా పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. సర్వేకు సంబంధించిన రెమ్యునరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఉ షన్న, కోశాధికారి రమేశ్, నాయకులు సుభా ష్, సంతోష్, అరవింద్ తదితరులున్నారు. -
ధాన్యాన్ని వెంటవెంటనే తరలించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం రెబ్బెన మండలం ఇందిరానగర్ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ గడువులోపు పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తహసీల్దార్ రామ్మోహన్, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, సివిల్ సప్లయ్ అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా చేయాలి
లింగాపూర్: ప్రతీ గ్రామానికి మిషన్ భగీరథ నీరు సక్రమంగా ఆందించాలని మిషన్ భగీ రథ ఎస్ఈ రవీందర్ సూచించారు. మండలంలోని వంకామద్ది, గుంమ్నూర్, జాముల్ధర, నాయక్పోడ్గూడ, మారుగూడతోపా టు సిర్పూర్ (యూ) మండలంలోని భీమన్గుట్ట, శెట్టిహడప్నూర్ గ్రామాలను ఆయన శని వారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లా డి భగీరథ నీటి సరఫరా గురించి తెలుసుకున్నారు. ప్రతీ గ్రామానికి మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా చేయాలని అధి కారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆయన వెంట వాటర్గ్రిడ్ ఈఈ రాకేశ్, ఈఈ సిద్దిక్, డీఈ నరేశ్, ఏఈఈ క్రాంతితేజ, ఏఈ అరవింద్ ఉన్నారు. -
పులులకు రక్షణ కరువు
● కాగజ్నగర్ డివిజన్లో టైగర్ల హతం ● విద్యుత్ తీగలు, విషప్రయోగంతో వేట ● సంరక్షణలో అటవీఅధికారుల విఫలం ● తాజాగా ఎల్లూర్ అడవిలో పులి హతం పెంచికల్పేట్: జిల్లాలోని కాగజ్నగర్ డివిజన్లో పులులకు రక్షణ కరువైంది. గతేడాది జనవరిలో కా గజ్నగర్ రేంజ్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో కే15, ఎస్9 అనే పెద్ద పులులను విషప్రయోగంతో హతమార్చడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచల నం రేపింది. తాజాగా పెంచికల్పేట్ రేంజ్ పరిధి లోని ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల విద్యుత్ తీగలకు పెద్దపులి మృతి చెందడంతో అటవీ అధికా రుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పెంచికల్పేట్ రేంజ్లో.. పెంచికల్పేట్ రేంజ్లో రెండు నెలలుగా వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. వేసవి నేపథ్యంలో దాహంతో అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న వన్యప్రాణులను వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి హతమారుస్తున్నారు. మార్చిలో నందిగామ, అగర్గూడ, లోడుపల్లి, కొండపల్లి గ్రామాల్లో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయి, చుక్కల దుప్పిని వేటాడిన 11 మందిని పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకచోట నుంచి మరొక చోటికి ఎలా?తునికాకు సేకరించటానికి వెళ్లిన కూలీలు ఇచ్చిన స మాచారంతో సిబ్బంది పులి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రిజర్వ్ ఫారెస్టులో అచేతనంగా పడి ఉ న్న పులి తెల్లవారేసరికి ఘటనా స్థలానికి సుమారు 400మీటర్ల దూరంలో ఒర్రెలో పాతిపెట్టిన స్థలాన్ని అధికారులు గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది. పాతిపెట్టిన పులి చర్మం, గోర్లు, మీసాలు, దంతాలు లేక పోవడంతో ముఠా పక్కగా హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రాంతానికి దగ్గరలోనే పంట పొలాల్లో ఉన్న విద్యుత్ తీగలతో హతమార్చారు.అదుపులో అనుమానితులువేటగాళ్ల విద్యుత్ తీగలకు పులి మృతి చెందడంతో ఈ నెల 17న ఉదయం పెంచికల్పేట్, ఎల్లూర్, కోయచిచ్చాల, కొత్తగూడ, అగర్గూడ గ్రామాలకు చెందిన సుమారు 30మందిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కాగజ్నగర్, పెంచికల్పేట్ రేంజ్లో విడివిడిగా విచారణ చేస్తున్నారు. పులుల సంరక్షణలో వైఫల్యమైన అధికారులు అమాయకులను అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.అసలేం జరిగిందంటే..పెద్దపులి మృతి విషయంలో అటవీశాఖ అధికారులు గోప్యత పాటించారు. ఈనెల 14న ఉదయం అగర్గూడ గ్రామానికి చెందిన మహిళలు తునికాకు సేకరణకు ఎల్లూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆకు సేకరిస్తున్న క్రమంలో అచేతనంగా పడి ఉన్న పెద్దపులిని చూసి పరుగులు పెట్టారు. విషయాన్ని ఆలస్యంగా అటవీశాఖ అఽధికారులకు తెలిపారు. 15న అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులకు పులి ఆచూకీ లభించలేదు. 16న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఒర్రెలో వన్యప్రాణి చనిపోయిన ఆనవాళ్లు గు ర్తించిన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఎఫ్డీపీటీ శాంతారాం, డీఎఫ్వో నీరజ్కుమార్ టోబ్రివాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 17న ఉదయం 6గంటలకు డీఎఫ్వో నీరజ్కుమార్ ఆధ్వర్యంలో పాతి పెట్టిన వన్యప్రాణి కళేబరాన్ని బయటకు తీశారు. వెటర్నరీ డాక్టర్ల బృందం రాకేశ్, శ్రీకాంత్, విజయ్ కళేబరానికి ప్రిమార్టం, పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో చనిపోయింది సుమారు ఏడేండ్ల వయస్సున్న ఆడపులిగా ప్రాథమికంగా నిర్ధారించారు. పులిని హతమార్చిన తర్వాత గోర్లు, చర్మం, మీసాలు, దంతాలను వేటగాళ్లు అపహరించారు. కళేబరం నుంచి కాలేయాన్ని సేకరించి సీసీఎంబీ ల్యాబ్కు పరీక్షల కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం కళేబరాన్ని అక్కడే దహనం చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లిన మీడియాను అడ్డుకున్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని గ్రంథాలయాల్లో పని చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని పీటీఎస్ సి బ్బంది శనివారం హైదరాబాద్లో గ్రంథాలయ పీటీఎస్ జనరల్ సెక్రటరీ ముజీబ్ హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో పని చేస్తున్న తమకు వేతనాలు పెంచాలని కోరారు. ప్రస్తుతం నెలకు రూ.7వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా రూ.20 వేల వేతనం ఇవ్వాలని కోరా రు. దీంతో ముజీబ్ హుస్సేన్ స్పందించి వేతనం రూ.18,600 చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలి పారు. సంఘం సభ్యులు మధు, సలీం, అంకుశం బుచ్చన్న, రాజారాం, శంకర్, ప్రేమ్సాగర్ ఉన్నారు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్రూరల్: జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ కోరా రు. శుక్రవారం న్యాయ స్థానంలో న్యాయవా దులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్కు అధికసంఖ్యలో రాజీ కేసులు వచ్చేలా చూడాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీపడే క్రిమినల్, సివిల్, భూతగాదా కేసులు లాంటివి రాజీపడదగు కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకా శాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జూనియర్ సివి ల్ జడ్జి అనంతలక్ష్మి, అడ్వకేట్ పాల్గొన్నారు. -
ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: ఫిట్నెస్ లేని బస్సులు న డుపుతున్న పాఠశాల యాజమాన్యాలపై చ ర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆర్టీవో రాంచందర్కు జిల్లా కేంద్రంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్ మాట్లాడారు. జిల్లాలో ప్రై వేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారని తెలిపారు. వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీటింగ్ కెపాసిటికి మించి విద్యార్థులను వాహనాల్లో తీసుకువెళ్లకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సంఘం కన్వీనర్ మహేశ్ తదితరులున్నారు. -
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
దహెగాం: క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్వో సీతారాంనాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలకు ఎన్టీఈసీ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. క్షయ కారణంగా దేశవ్యాప్తంగా ఏడాదిలో స గటున 3లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. వ్యాధికి వైద్యం అందుబాటులో ఉందని, వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోనూ వైద్యం అందుబా టులో ఉందని చెప్పారు. వ్యాధి లక్షణాలు గుర్తించడానికి త్వరలో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. లక్షణాలున్న వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి వైద్యం పొందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. క్షయ సోకి ప్రభుత్వ వైద్యం పొందుతున్నవారికి నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరునెలలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారిని అశ్విని, హెచ్ఈవో కోటేశ్వర్, పీహెచ్ఎం పావని, హెచ్వీ పద్మ, సూపర్వైజర్ ఖాదర్పాషా, పార్మసిస్ట్ రామచంద్రారెడ్డి, సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’లో వసూళ్ల పర్వం: ఎమ్మెల్యే హరీశ్బాబు
రెవెన్యూ కార్యాలయానికి సర్టిఫికెట్ల కోసం వెళ్లే వారి నుంచి అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్బాబు ఆరోపించారు. దిందా, కొండపల్లి గ్రామాల పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రిజర్వ్ ఫారెస్ట్ భూములున్న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. పెంచికల్పేట్ పెద్ద వాగు అప్రోచ్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసినా రెవెన్యూ అధికారుల తీరుతో ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదని తెలిపారు. జిల్లాకు ఆనుకుని ప్రాణహిత ప్రవహిస్తున్నా చుక్కా సాగునీరు పొలాలకు అందడం లేదని తెలిపారు. కౌటాల మండల కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రభుత్వం భూమి కేటాయించాలని కోరారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దు
ఆసిఫాబాద్రూరల్: బాల్య వివాహం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణాధికారి బూర్ల మహేశ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రహపల్లి గ్రామంలో బాల్యవివాహం నిశ్చయించినట్లు వచ్చి న సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల తరువాతే వివాహం చేయాలని, ముందే వివాహం చేస్తే నేరమవుతుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలతో కలిగే నష్టాలను వివరించారు ఎక్కడైనా బాల్య వివాహం చేస్తున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్లైన్ 1098 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 2030 నాటికి బాల్య వివాహ రహిత భారత్ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. సోషల్ వర్కర్ ప్రవీణ్కుమార్, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన వేసవి క్రీడా శిక్షణ
ఆసిఫాబాద్రూరల్: క్రీడలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని డీఎస్వో మీనారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గిరిజన సంక్షేమశాఖ అధ్యర్యంలో 15 రోజుల పాటు మంచి ర్యాల, ఆసిఫాబాద్ గిరిజన పాఠశాలల వి ద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు తె లిపారు. వేసవి క్రీడా పోటీలకు 120 మంది క్రీడాకారులకు అఽథ్లెటిక్స్, హ్యాండ్బాల్, ఖో ఖో, వాలీబాల్, కబడ్డీ, చెస్ పోటీలపై శిక్షణ ఇ చ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అథ్లెటి క్స్ కోచ్ విద్యాసాగర్, కబడ్డీ కోచ్ తిరుమల్, హ్యాండ్బాల్ కోచ్ అరవింద్, పీడీ, పీఈటీలు లక్ష్మణ్, శ్రీను, రవీందర్ పాల్గొన్నారు. -
రైతులకు మేలు
భూ భారతితో● రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క ● పెంచికల్పేట్ మండల కేంద్రంలో ‘భూ భారతి’పై అవగాహన సదస్సుమాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్రెడ్డి, పక్కన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే హరీశ్బాబు, ఎమ్మెల్సీ విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రేపెంచికల్పేట్: భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు పంచాయతీరాజ్, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 18 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చట్టాలను పరిశీలించి భూ భారతి చట్టాన్ని రూపొందించామ ని తెలిపారు. జూన్ 2నుంచి రాష్ట్రంలో 10,956 గ్రా మాల్లో భూ భారతిని అమలు చేస్తామని చెప్పారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి రెవెన్యూ అధికారులు గ్రామాలకు వస్తారని తెలిపారు. రెండు రోజుల్లో భూ భారతి సమస్యలపై ఫిర్యాదు చేయటానికి టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. భూ భారతి చట్టం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలకు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య ఉన్న భూముల్లో సర్వే నిర్వహించి సమస్య పరిష్కరించాలని ఇరు శాఖల అధికారులను ఆదేశించారు. రైతుల పంట పొలాలకు సాగునీరు అందించి వారి కళ్లలో ఆనందాన్ని చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చెప్పారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. పెంచికల్పేట్ మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేయగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సంబంధిత సమస్యలపై 239 దరఖాస్తుల వ చ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ న వీన్ మిట్టల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, ఎస్సీ డీవీ శ్రీనివాసరావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సముద్రాల సరితరాజన్న, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. పోడు భూముల జోలికి వెళ్లొద్దు: మంత్రి సీతక్క ప్రభుత్వం పేదలకు 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించటమే ధ్యేయంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేసిందని తెలిపారు. అటవీ భూముల పేరుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఆదేశించారు. నియోజకవర్గంలో గిరి వికాస్ పథకంలో గిరిజనుల భూముల్లో ప్రభుత్వం బోర్లు వేసి సోలార్ విద్యుత్, మోటార్లను అందించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి సీతక్క ఆరోపించారు. -
‘ఆదర్శ’ం పిలుస్తోంది!
● మోడల్ స్కూళ్లలో 320 ఇంటర్ సీట్లు ● ఈ నెల 20వరకు దరఖాస్తు గడువు ● కార్పొరేట్ తరహాలో విద్యాబోధన ● బాలికలకు హాస్టల్ సదుపాయంఆసిఫాబాద్రూరల్: ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్మీడియట్ చదవాలనుకునే గ్రామీణ విద్యార్థులకు తెలంగాణ మోడల్ స్కూల్ ఓ వరంలా మారింది. మోడ ల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. పరీక్షా ఫలితాల్లో జిల్లాలోనే టాప్ ర్యాంకులు సాధిస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్, జేఈఈ మెయిన్స్ సీట్లు కూడా కై వసం చేసుకుంటున్నారు. దీంతో జి ల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులైనవారు చాలామంది మోడల్ స్కూల్లో చదివేందుకే మొగ్గు చూపుతున్నారు. మోడల్ స్కూళ్లలో ఈ నెల 1నుంచి 20వ తే దీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లుజిల్లాలో ఆసిఫాబాద్, సిర్పూర్ (యూ)లో తెలంగా ణ మోడల్ స్కూళ్లున్నాయి. ఒక్కో కళాశాలలో 160 సీట్లున్నాయి. సీఈసీ, ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో గ్రూపునకు 40 చొప్పున రెండు స్కూళ్లలో మొత్తం 320 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం విద్యార్థుల ఎంపిక ఉంటుంది. 100 మంది బాలికలకు హాస్టల్ వసతి కల్పించనున్నారు. చట్టు పక్కల గ్రామాల్లో కాకుండా దూరప్రాంతాల నుంచి వచ్చే 9, 10, ఇంటర్ చదవే బాలికలకు భోజన వసతి క ల్పిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలి తాల్లో ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ జిల్లాలోనే టాప్ గా నిలుస్తోంది. 2023–24లో ఇంటర్ ఫలితాల్లో 92 శాతం, ఈ సంవత్సరం కూడా 94 శాతంతో 20మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించారు. అదిబా తహిరీం 971, హర్షిత 970 మార్కులతో జిల్లాలోనే టాప్గా నిలిచారు. అందుబాటులో 320 సీట్లుపదో తరగతి పాసైన విద్యార్థులు ఎలాంటి రుసు ము లేకుండా ఈ నెల 20వరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 27నుంచి 31వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఉచితవిద్య, వసతి, పా ఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు, కంప్యూటర్ విద్య, ఐఎఫ్పీ డిజిటల్ బోర్డులతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధిస్తారు. రిజర్వేషన్ల వారీగా సీట్ల వివరాలుకేటగిరీ శాతం సీట్లు జనరల్ బాలికలు జనరల్ 50 20 13 07 ఎస్సీ 15 06 04 02 ఎస్టీ 06 02 01 01 బీసీ ‘ఏ’ 07 03 02 01 బీసీ ‘బీ’ 10 04 03 01 బీసీ ’సీ’ 01 00 00 00 బీసీ ‘డీ’ 07 03 02 01 బీసీ ‘ఈ’ 04 02 02 00 -
సన్న బియ్యం.. పెద్ద దందా!
కౌటాల మాజీ సర్పంచ్ వొజ్జల మౌనిశ్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 13.40 క్వింటాళ్ల రేషన్ సన్నబియ్యాన్ని ఈ నెల 4న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. బియ్యం విక్రయించిన షేక్ జైనొద్దీన్, పెరుగు ప్రభాకర్, పోతులవార్ తిరుపతి, గుర్లె విట్టుమేర, విలాస్, మనోహర్, కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్ వొజ్జల మౌనిశ్పై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎక్కువ మొత్తంలో సన్నబియ్యం పట్టుకున్నా తక్కువ బియ్యం పట్టుకున్నట్లు చూపించారనే ఆరోపణ లున్నాయి. ఈ కేసు నమోదు అనంతరం ఎ న్ఫోర్స్మెంట్ అధికారులు, నిందితులిచ్చిన విందులో పాల్గొన్నట్లు సమాచారం. కౌటాల: పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్ర భుత్వం ఆ బియ్యం పక్కదారి పడుతుంటే ఏమీ చేయలేకపోతోంది. చాలామంది అనర్హుల కూ రే షన్ కార్డులుండడం, మరికొందరికి రేషన్ బి య్యం తినడం ఇష్టం లేక అమ్ముకుంటున్నారు. జి ల్లాలో 314 రేషన్ షాపులుండగా, 1.41 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీరికి ప్రతీ నెల మూడువేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ లబ్ధిదారులకు 35 కిలో లు, అన్నపూర్ణ అబ్ధిదారులకు 10 కిలోల చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పగలు కొని రాత్రుల్లో విక్రయంకొందరు రేషన్ డీలర్లు ‘డబ్బులు కావాలా.. బి య్యం కావాలా’ అని నేరుగా లబ్ధిదారులను అడుగుతుండడం గమనార్హం. కొందరు అక్రమార్కులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కిలో రూ.25 ఇస్తామని చెబుతున్నారు. చిరు వ్యాపారులు, దళారులు గ్రా మాల్లో తిరుగుతూ, రేషన్ షాపుల వద్ద పగలు ల బ్ధిదారులు, రేషన్ డీలర్ల నుంచి రూ.23 చొప్పున కొనుగోలు చేసి రాత్రుల్లో ప్రత్యేక వాహనాల్లో త రలించి మిల్లర్లు, బియ్యం వ్యాపారులకు రూ.28 కి అమ్ముతున్నారు. అవి మళ్లీ మెరుగులు దిద్దుకు ని ఎక్కువ ధరకు వినియోగదారుల వంట గదికి చేరుతున్నాయి. కొందరు మిల్లర్లు ప్రతీనెల అధి కారులకు మామూళ్లు ఇస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్ర భుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని లబ్ధిదా రులు విక్రయిస్తే అధికారులు వారి ఆహార భద్రత కార్డులు తొలగించనున్నారు. ఇటీవల బియ్యం పట్టుకున్న ఘటనలు● జిల్లా కేంద్రంలోని బజార్వాడిలో వ్యాపారి మ ధుసూదన్ ఇంట్లో ఈ నెల 3న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2.79 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టుకుని ఇద్దరిపై 6ఏ కేసు నమోదు చేశారు. ● కౌటాల మాజీ సర్పంచ్ వొజ్జల మౌనిశ్ ఇంట్లో నిల్వ ఉన్న 13.40 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని అధికారులు పట్టుకుని, అమ్మిన ఆరుగురు, కొన్న మౌనిశ్పై కేసు నమోదు చేశారు. ● వాంకిడి మండలం బోర్డా గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మూడు క్వింటాళ్ల సన్న బి య్యాన్ని ఈ నెల 6న అధికారులు పట్టుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ● ఈ నెల 8న సిర్పూర్(టి) మండలం డోర్పల్లికి చెందిన అనురాధ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన ఆరున్నర క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకుని ఆమైపె కేసు నమోదు చేశారు. ● సిర్పూర్(టి) మండలం పారిగాం సమీపంలో ఈనెల 8న దిచక్రవాహనాలపై తరలిస్తున్న నా లుగు క్వింటాళ్ల సన్నబియ్యాన్ని అధికారులు పట్టుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రేషన్ దుకాణాలు : 314అంత్యోదయ కార్డులు : 12,948తెల్లరేషన్ కార్డులు : 1.40లక్షలు నెల బియ్యం కోటా : 3వేల మెట్రిక్ టన్నులుజిల్లాలో ప్రజాపంపిణీ వివరాలు విక్రయిస్తున్న రేషన్ లబ్ధిదారులు కొత్త దందాకు దిగిన దళారులు పోలీసులకు పట్టుబడుతున్న వైనం కేసులు నమోదు చేస్తాం రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యాన్ని దుర్వినియోగం చేయొద్దు. సన్నబియ్యం విక్రయించే వారి సమాచారం తెలుపాలి. – శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ -
వంతెనలు త్వరగా పూర్తి చేయాలి
కెరమెరి: మండలంలోని లక్మపూర్, అనార్పల్లి వాగులపై అసంపూర్తిగా ఉన్న వంతెనలను త్వరగా పూర్తి చేయాలని మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ గురువా రం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వాగుల అవతల ఉన్న సుమారు 15 గ్రామాల ప్రజలు వానాకాలంలో అనేక క ష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఏటా వర్షా కాలంలో ఆయా గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉంటున్నారన్నారు. స్పందించిన కలెక్టర్ సంబంఽధిత గుత్తేదారుతో మాట్లాడి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్, శశాంక్ పాల్గొన్నారు. -
జేటీవో ఉద్యోగానికి యువకుడి ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన నడిగోటి అనుదీప్ కుమార్ నీటి పా రుదల శాఖలో జూని యర్ టెక్నికల్ అధికారి(సివిల్)గా నియామ కం అయ్యాడు. బుధవారం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. అనుదీప్ కుమార్ తండ్రి నడిగోటి కుమార్ నాయీబ్రాహ్మణ వృత్తి నిర్వహిస్తూ కొడుకును ఉన్నతంగా చదివించాడు. అనుదీప్ కుమార్ బెల్లంపల్లిలో పదో తరగతి వరకు, హైదరాబాద్ రామాంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. 2023అక్టోబర్ 19న జేటీవో ఉద్యోగానికి పరీక్ష రాయగా గత జనవరి 24న తుది ఫలితాలు ప్రకటించారు. -
బోధన అంశాలను విద్యార్థులకు నేర్పించాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు వేసవి శిక్షణలో నేర్చుకున్న బోధన అంశాలను పాఠశాలలో విద్యార్థులకు నేర్పించాలని ప్రోగ్రాం రాష్ట్ర పరిశీలకులు కృష్ణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొ ని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశా రు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం కలిగేలా చూడాలన్నారు. అనంతరం ఎంఈవో సుభాష్ ఆయనను శాలువాతో సత్కరించారు. -
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్రూరల్: వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కాకముందే బస్సు ఫిట్నెస్, సరైన ధ్రువపత్రాలు సరి చూసుకోవాలన్నారు. డ్రైవర్లు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, డ్రైవింగ్ సమయంలో మత్తు పానీయాలు సేవించరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మోహన్, రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన రుణ లక్ష్యం
● 6,295 మహిళా సంఘాలకు రూ.232.44 కోట్లు అందించాలని టార్గెట్ ● గతేడాది లక్ష్యానికి మించి అందజేత ● ఖరారుకాని సీ్త్రనిధి రుణ లక్ష్యం తిర్యాణి: మహిళల స్వయం ఉపాధి కల్పనకు రుణాలు అందించేందుకుగానూ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. ఆయా సంఘాలలోని సభ్యుల అవసరాల మేరకు తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేస్తోంది. దీంతో పాటు సీ్త్ర నిధి ద్వారా సైతం స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు అందజేస్తున్నారు. ఇట్టి రుణాలను సభ్యులు సులభమైన నెలవారి వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కాగా రుణాల మంజూరుకు ప్రతీ ఆర్థిక సంవత్సరంలో అధికారులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందుకు తగినట్లు మహిళా సంఘాలకు రుణాలు అందజేస్తారు. అయితే 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికలను అధికారులు ఇటీవల ఖరారు చేశారు.. 6,295 సంఘాలు.. రూ.232.44 కోట్ల రుణాలు2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 6,295 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.232.44 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.221 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యానికి మించి రూ.229 కోట్ల రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా అందించి 103 శాతం లక్ష్యాన్ని సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణ లక్ష్యం కొంతమేర పెంచారు. దీంతో ఈ ఏడాది మరిన్ని సంఘాలకు రుణాలు అందే అవకాశం ఉంది. కాగా సీ్త్రనిధికి సంబంధించి మహిళా సంఘాల సభ్యులకు అందించే రుణ లక్ష్యాలను అధికారులు ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాది అత్యధికంగా కాగజ్నగర్లో రూ.27.77, వాంకిడిలో రూ.22.63, రెబ్బెనలో రూ.22.60 కోట్ల రుణాలు అందించనుండగా అత్యల్పంగా లింగాపూర్లో రూ.5.58, పెంచికల్పేట్లో రూ.7.02, సిర్పూర్(యూ)లో రూ.7.07 కోట్లు అందజేయనున్నారు.. ప్రణాళికలు సిద్ధం చేశాం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 6,295 మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.232.44 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించాం. గతేడాది లక్ష్యానికి మించి అందించిన రుణాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది లక్ష్యాన్ని ఛేదిస్తాం. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశాం. – దత్తారాం, డీఆర్డీవో, ఆసిఫాబాద్ మండలాల వారీగా రుణ లక్ష్యం వివరాలుమండలం సంఘాలు లక్ష్యం (రూ.కోట్లలో) ఆసిఫాబాద్ 539 20.70 బెజ్జూర్ 352 13.74 దహెగాం 436 16.33 జైనూర్ 364 13.03 కాగజ్నగర్ 752 27.71 రెబ్బెన 633 22.60 సిర్పూర్(యు) 195 7.07 సిర్పూర్(టి) 414 14.77 వాంకిడి 614 22.63 తిర్యాణి 393 14.13 పెంచికల్పేట్ 193 7.02 లింగాపూర్ 142 5.58 కౌటాల 486 17.77 కెరమెరి 425 15.77 చింతలమానెపల్లి 357 13.53 మొత్తం 6,295 232.44 పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తుమహిళా సంఘాలకు కేవలం రుణాలు అందించే వరకే పరిమితం కాకుండా వారు స్వయం ఉపాధి పొందేలా అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అడుగులు వేస్తోంది. జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఏడాది నూతనంగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అంతేకాకుండా రెబ్బెన మండలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సైతం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి లభించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా జిల్లా కేంద్రంలోని థియేటర్ను కొన్నేళ్లుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపిస్తున్న విషయం తెలిసిందే. -
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
● కలెక్టర్ వెంకటేష్ దోత్రేవాంకిడి: విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మర్ క్యాంపులో విద్యార్థులు నేర్చుకున్న విద్యా సామార్థ్యాలను, కళా నైపుణ్యాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్యాంపులో నేర్చుకున్న విషయాలను ఇక్కడితో వదిలేయకుండా ఇళ్లలో కూడా కొనసాగించాలన్నారు. చిత్ర లేఖనం, యోగా, కరాటే, నృత్యం, స్పోకెన్ ఇంగ్లిష్, తదితర అంశాలపై జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతీ కేటగిరీ నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురిని కలెక్టరేట్లో సన్మానించడంతో పాటు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. పాఠశాల వయస్సులో నేర్చుకున్న కళా నైపుణ్యాలు దీర్ఘకాలం గుర్తుండిపోతాయన్నారు. అంతకు ముందు విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్రావు, ఎంఈవో శివచరణ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు నటరాజ్, తదితరులు పాల్గొన్నారు. సభాస్థలి ఏర్పాట్లు పరిశీలనపెంచికల్పేట్: పెంచికల్పేట్ మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దనసరి సీతక్క పర్యటన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్సీ దండె విఠ ల్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ కార్యాలయం వద్ద హెలిప్యాడ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభాప్రాంగణం పరిశీలించి పలు సూచనలు చేశారు. సభను విజయవంతంగా నిర్వహించటానికి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వారి వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, డీఎస్పీ రామానుజం, డీపీవో గంగాధర్, డీఆర్డీవో దత్తరాం, తహసీల్దార్ వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో అల్బర్ట్, అన్నిశాఖల అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
● అక్రమార్కుల నుంచి వసూళ్లు.. ● స్మగ్లర్లకు సహకరిస్తున్న కొంతమంది.. ● జిల్లాలో కనిపించని విజిబుల్ పోలీసింగ్ ● అవినీతిలో మునుగుతున్న పోలీసు అధికారులు
కాగజ్నగర్ నియోజకవర్గంలోని ఓ కీలక పోలీసు స్టేషన్లో పరిధిలో ఆవులను అక్రమంగా తరలించే వ్యక్తుల నుంచి పోలీసు అధికారికి నెలకు రూ.9 లక్షల వరకు ముడుపులు అందుతుందనే ఆరోపణలున్నాయి. కేసుల చూపించేందుకు ఒక్కోసారి దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే కంకర రవాణా చేసే వ్యక్తుల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఓ పోలీసు అధికారిపైనా తీవ్ర ఆరోపణలున్నాయి. బెల్ట్ దుకాణాలు నడిపే వ్యక్తుల నుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమార్కులు సైతం అడిగినంత ఇచ్చుకుంటూ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో పోలీసుల జరిపిన దాడుల్లో కొందరు వ్యాపారులు పట్టుపడ్డారు. వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఒక్కొక్కరి వద్ద రూ.25 వేలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. సాక్షి, ఆసిఫాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది గాడి తప్పుతున్నారు. ప్రధానంగా జిల్లా యంత్రాంగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో మాదిరిగానే పలువురు తమ వ్యవహార శైలిని కొనసాగిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. కీలకమైన శాంతి భద్రతల వ్యవహారాన్ని కొందరు పోలీసులు వదిలేసి అవినీతిలో మునిగితేలుతున్నారు. కాగజ్నగర్ నియోజకవర్గంలోని ఓ సరిహద్దు మండలం నుంచి ఆవులను అక్రమ రవాణా చేసే వ్యాపారుల నుంచి అధికారులు మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే జిల్లా కేంద్రం, దానికి అనుకునే ఉన్న స్టేషన్లలోనూ పలువురు సిబ్బంది ఇసుక అక్రమార్కుల నుంచి రోజూ రూ.వేలల్లో తీసుకుంటున్నారు. భూ వివాదాలు తలెత్తుతున్న సందర్భాల్లో సెటిల్మెంట్లు చేసి ఇరువర్గాల నుంచి దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొరవడిన విజిబుల్ పోలీసింగ్?జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ తక్కువైంది. జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో సాయంత్రం, రాత్రిళ్లు ట్రాఫిక్ చలానాలు విధించడంపై చూపిన శ్రద్ధ, ఇసుక, ఆవుల అక్రమ రవాణా, జూదం కట్టడిపై ప్రదర్శించడం లేదు. అడపా దడపా రహదారులపై మకాం వేసి ఇసుక, ఆవులను అక్రమంగాా తరలించే వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. జూదం, ఇసుక, ఆవులను తరలించే అంశాలపై ఇన్ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారులకు విషయం తెలియదని అనుకుంటే జూదం ఆడే వ్యక్తులు, ఇసుక, ఆవులను తరలించే వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా పోలీసు బాస్ ఇలాంటి అవినీతికి పాల్పడే అధికారులపై స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ద్వారా నిఘా పెడితే వారి దందాలకు అడ్డుకట్ట పడుతుంది. స్టేషన్లలో లంచాల పర్వమూ తగ్గుతుంది. ఉన్నతాధికారులకు చెడ్డపేరు రాదు. తద్వారా ప్రజలకూ ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా వ్యవసాయ శాఖ 2025 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన సాగు ప్రణాళిక ఖరారు చేసింది. అధికారులు సాగు అంచనాలు సిద్ధం చేసి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో వానాకాలం సీజన్లో మొత్తంగా 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనాలు వేశారు. పత్తి పంటకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుండగా రెండో స్థానంలో వరి సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదికలుజిల్లాలో ఈ వానాకాలం సీజన్లో పంటల సాగు అంచనాలు వేసిన అధికారులు అందుకు అవసరమయ్యే విత్తనాలకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. జిల్లాలో 4,45,049 ఎకరాల్లో వివి ధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో మూడో వంతు పత్తిని సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో సాగునీటి ప్రాజక్టులు పూర్తి కాక పోవడం, ఉన్న ప్రాజక్టుల కాలువలు మరమ్మతులకు నోచుకోక పోవడంతో వర్షాధార పంటలనే రైతులు ఆధారపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 3,35,363 ఎకరాల్లో పత్తి, 56,861 ఎకరాల్లో వరి, 30.430 ఎకరాల్లో కంది, 22,395 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఆముదాలు, నువ్వులు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనాలు రూపొందించారు. 6,70,726 పత్తి విత్తన ప్యాకెట్లు, 14,215 క్వింటాళ్ల వరి, 1,217 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని అంచనా వేశారు. ఎరువుల కొరత లేకుండా..జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత లేకుండా అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు. యారియా 60,061 మెట్రిక్ టన్నులు, డీఏపీ 400.54 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 10,013 మెట్రిక్ టన్నులు, ఎ స్ఎస్పీ 20,027 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎ రువులు 20,027 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువు ల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. అంచనాలు సిద్ధం చేశాం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుపై ప్రణాళికలు సిద్ధం చేసి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకుగానూ ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాం. సాగు ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశాం. – రావూరి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి సాగు విస్తీర్ణం 4,45,049 ఎకరాలుగా అంచనా.. 3,35,363 ఎకరాల్లో పత్తి సాగు.. 6.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని ప్రతిపాదన -
రైల్వే పనులు పరిశీలించిన డీఆర్ఎం
బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలో పనులను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) భర్తేష్కుమార్జైన్ గురువారం పరిశీలించారు. ప్రత్యేక రైలులో మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్ నుంచి వచ్చిన ఆయన మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్ రైల్వేస్టేషన్లను సందర్శించారు. రైల్వే అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గతంలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న పనులతోపాటు కొత్తగా మంజూరైన పనులు, గూడ్స్ రైళ్ల ట్రాక్ పనులు, నాణ్యత పరిశీలించారు. అధికారులు పనుల వివరాలు, పురోగతిని వివరించారు. నిర్ధేశించిన గడువు ప్రకారం పనులు పూర్తి చేయాలని డీఆర్ఎం ఆదేశించారు. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్లను సందర్శించారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్(డీసీఎం) బాలాజీకిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేపెంచికల్పేట్(సిర్పూర్): భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బొంబాయిగూడ, ఎల్కపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న సదస్సులను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సదస్సుల్లో రైతులు సమర్పించే దరఖాస్తులను నమోదు చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ ఎల్కపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యాన్ని వేగంగా రైస్ మిల్లులకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని రైతులు కలెక్టర్కు విన్నవించారు. ఆయన వెంట కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు ఉన్నారు. బాధితులకు అండగా భరోసా కేంద్రాలుఆసిఫాబాద్రూరల్: లైంగిక దాడి బాధితులకు జిల్లా భరోసా కేంద్రాలు అండగా ఉంటూ సేవలందిస్తున్నాయని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా ఎనిమిది మంది బాధిత మహిళలకు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున చెక్కులు అందించారు. లైంగిక దాడికి గురైన మహిళలతోపాటు బాలికలకు భరోసా కేంద్రాల సిబ్బంది అండగా నిలుస్తున్నారన్నారు. బాధితులకు ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తున్నామని, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాధితులు 87126 70561 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్, భరోసా సెంటర్ ఇన్చార్జి ఎస్సైలు తిరుమల, శైలజ, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్ పాల్గొన్నారు. -
16న పెంచికల్పేట్కు మంత్రి ‘పొంగులేటి’ రాక
పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలానికి ఈ నెల 16న రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రానున్నారని ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. మండల కేంద్రంలో సభాస్థలిని బుధవారం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూభారతి రె వెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్ ప్రా జెక్టు కింద పెంచికల్పేట్ మండలాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ నెల 16న మంత్రి స్థానిక రైతులతో ముచ్చటిస్తారని తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు హెలిప్యాడ్, సభాస్థలాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు పరిశీలించారు. -
అకాల వర్షం.. అన్నదాతలకు కష్టం
దహెగాం/పెంచికల్పేట్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దహెగాం, పెంచికల్పేట్తోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వరిధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పారు. వర్షం తగ్గిన తర్వాత తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబోశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే రెక్కల కష్టం వృథా అవుతుందని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరారు. కాంటా పూర్తయినా అధికారులు మిల్లులకు తరలించడం లేదని ఆరోపించారు. -
యాసంగి ధాన్యం సేకరణలో జాప్యం
సాక్షి, ఆసిఫాబాద్/దహెగాం: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలుకరించనున్నాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో వానలు మొదల య్యే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. మరోవైపు అకాల వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. అయినా జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. నేటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడమే ఇందుకు కారణం.లక్ష్యం నెరవేరేనా..?జిల్లాలో 24 వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశా రు. ఈ యాసంగిలో 55 వేల మెట్రిక్ టన్నుల ధా న్యం చేతికొచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసింది. పౌరసరఫరాల శాఖ మాత్రం కేవలం 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వాస్తవానికి జిల్లాలో పంట చేతికొచ్చేది ఏప్రిల్ చివరాఖరుకు. ఇక్కడ వాతావరణ పరిస్థితులు.. పత్తి పంటపైనే మొగ్గుచూపడం వంటి కారణాలతో అనుకున్న మేర వరి సాగుకావడం లేదు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాలో ఏప్రిల్ మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆలస్యంగా ఈ ప్రక్రియ ప్రారంభించారు.ఇప్పటివరకు కేవలం 1,120 మెట్రిక్ టన్నుల వడ్లు మా త్రమే కొన్నారు. వచ్చే రెండు వారాల్లో మిగిలిన ధా న్యాన్ని ఎలా కొంటారనే ప్రశ్న రైతులను వేధిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం వి క్రయిస్తున్నారు. ప్రభుత్వం వరి ధాన్యం ఏ గ్రేడ్ రకా నికి రూ.2,320, బీ గ్రేడ్ రకానికి రూ.2,300 ప్రకటించింది. సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తోంది. దళారులు మాత్రం క్వింటాల్కు రూ.1800 నుంచి రూ.1900 వరకు మాత్రం చెల్లిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు నాణ్య త, తేమ శాతం పరిశీలించకుండానే కొంటున్నారు.ఆందోళనలో రైతులుజిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ఉండగా.. 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలతో పెంచికల్పేట్ మండలంలో ఏకంగా 200 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. కౌటాల, దహెగాం మండలాల్లోనూ వర్షం కారణంగా ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లతో ధాన్యాన్ని కప్పి ఉంచినా.. అకాల వర్షాలు వారిని భయపెడుతున్నాయి. -
విద్యా బోధన మెరుగుపర్చుకోవాలి
● డీఈవో యాదయ్య ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు తమ వి ద్యా బోధనను మెరుగుపర్చుకోవాలని డీఈ వో యాదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. డీఈవో మాట్లాడుతూ టీచర్లు క్రమం తప్పకుండా ఐదురోజులపాటు శిక్షణకు హాజరు కావాలన్నారు. జి ల్లా రిసోర్స్పర్సన్లు చెప్పే అంశాలను పాఠశాలల్లో కొనసాగించాలని సూచించారు. అభ్యసన సామగ్రిని వినియోగించి బోధన చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఐ ద్వారా విద్యాబోధన ప్రారంభిస్తున్నామ ని, ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, అబిద్ అలీ, ఎంఈవో సుభాష్ పాల్గొన్నారు. -
ఘనంగా శంభాజీ మహరాజ్ జయంతి
వాంకిడి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని జేత్వా న్ బుద్ధ విహార్లో బుధవారం ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసుడిగా మరాఠా సామ్రాజ్యానికి రెండో ఛత్రపతి రాజుగా శంభాజీ మహరాజ్ గొప్ప ఖ్యాతిని సంపాదించారన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించకుండా ఆపగలిగిన మహా వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా ఇన్చార్జి దుర్గం సందీప్, బీఎస్ఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్రె వినేష్, అంబేడ్కర్ సంఘం నాయకులు శ్యాంరావు, రాంటెంకి ప్రతాప్, బల్వంత్, కిషన్, మనోజ్, సురేందర్, స్వాగత్, చింటు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఇంటికి తాగునీరు అందించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి కెరమెరి(ఆసిఫాబాద్): ప్రతీ ఇంటికి మిషన్ భ గీరథ ద్వారా తాగునీరు అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికా సం పథకాన్ని సమర్థవంతంగా అమలు చే యాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. వారం రో జుల్లో పూర్తి చేయాలన్నారు. శివగూడ గ్రా మంలో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన బావి నిర్మాణ పనులను పరిశీలించారు. భగీ రథ నీటి సరఫరాను పరిశీలించారు. నల్లా నీ ళ్లు వస్తుండగా, బావి నీరు ఎందుకు తాగుతున్నారని స్థానికులను ప్రశ్నించారు. భూ గర్భ జలాల పెంపునకు సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ డీవో వేణుగోపాల్, ప్రత్యేకాధి కారి వెంకట్, ఎంపీడీవో అంజద్పాషా, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వేశ్వరరావు, ఏపీఎం జగదీ శ్వర్, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఈసీ అక్యానాయక్, టీఏ నాగోరావు పాల్గొన్నారు. -
గిరి‘జనులకు’ రైలు కూత!
● మంచిర్యాల–ఉట్నూరు–ఆదిలాబాద్కు ముందడుగు ● నిజామాబాద్–నిర్మల్, పటాన్చెరు– ఆదిలాబాద్ దాక ● కొత్త లైన్లకు ఇంజనీరింగ్, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ప్రతిపాదనలు ● పింక్బుక్ 2025– 26లో నిధులు అంచనా వేసిన రైల్వే శాఖ ● పట్టాలెక్కితే ఏజెన్సీ ప్రాంత వాసులకు రైలు యోగంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజన ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ముందడుగు పడింది. తొలిసారిగా ఉమ్మడి జిల్లా గిరిజన, అడవుల వెంట రైలు మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. ఈ మేరకు 2025–26 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్ కేటాయింపులు తెలిపే కీలక పింక్బుక్లో వెల్లడించింది. గత ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తాజాగా రైల్వే శాఖ ఈ బుక్లో ఉమ్మడి జిల్లాకు పలు కొత్త మార్గాలు, ట్రాఫిక్ సర్వేల కోసం నిధుల ప్రతిపాదనలు ఉన్నాయి. భవిష్యత్లో కాజిపేట–బల్లార్షా 234కి.మీ. నాలుగో లైన్ సర్వేకు రూ.4.68కోట్లు, వన్యప్రాణులకు ప్రాణనష్టం జరగకండా బల్లర్షా, ఆసిఫాబాద్ రోడ్ వరకు రైల్వే పట్టాల ఫెన్సింగ్కు నిధులు ప్రతిపాదించారు. మంచిర్యాల టు ఆదిలాబాద్ వయా ఉట్నూరు మంచిర్యాల నుంచి వయా ఉట్నూరు ఆదిలాబాద్ దాక ప్రతిపాదిత కొత్త మార్గం 186కి.మీ. నిడివి. ఇందుకు రూ.వంద కోట్లు అంచనా ప్రతిపాదించారు. ఈ లైను ఏర్పాటు కోసం భూమి, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ఈ నిధులు వెచ్చించనున్నారు. కొత్తగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ మధ్య మార్గం 125కి.మీ. కోసం ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే కోసం రూ.31లక్షలు, మరో కొత్త మార్గమైన పటాన్చెరు(నాగలపల్లి) వయా బోధన్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు ఫైనల్ లొకేషన్ సర్వే 317కి.మీ కోసం రూ.7.92కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్–పింపల్కుటి 183కి.మీ ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.3.66కోట్లు, ఆదిలాబాద్ –గడ్చాందూర్ 70కి.మీ సర్వే కోసం రూ.1.75కోట్లు, యావత్మాల్–ఆదిలాబాద్– వయా గంటిజి, పందర్కావందన్, చానఖా వరకు 100కి.మీ సర్వే కోసం రూ.25లక్షలు, సికింద్రాబాద్–ముత్కేడ్– ఆదిలా బాద్ 420కి.మీ. ఇంజనీరింగ్, ట్రాఫిక్ ప్రాథమిక డబ్లింగ్ సర్వేకు రూ.1.64కోట్లు ప్రతిపాదించారు. ఆర్వోబీలు, స్టేషన్ల ఆధునీకరణ ఆర్వోబీలు, వంతెనలకు ఆర్ఆర్ఎస్కే(రాష్ట్రీయ రేల్ సంరక్ష కోశ్), ఆర్ఎస్ నిధులు(రైల్వే సేఫ్టీ ఫండ్) కేటాయిస్తుంది. ఆదిలాబాద్ యార్డు–రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) లెవల్ క్రాసింగ్కు రూ.5.69 కోట్లు, ముత్కేడ్ ఆదిలాబాద్ పింపల్కుట్టి 68కి.మీ. రూ.4.71కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ 8.16కి.మీ. రూ.1.04కోట్లు, ఆర్ఆర్ఎస్కే రూ.1.93కోట్లు, ఆర్ఎస్ఎఫ్ రూ.9.73కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ ఘాట్ సెక్షన్లో ఆర్ఆర్ఎస్కే నుంచి రూ. 6.40కోట్లు, ఆదిలాబాద్ పిట్ లైన్ నిర్మాణం కోసం మూలధన నిధులు రూ.22.28కోట్లు, మంచిర్యాల–పెద్దంపేట మధ్య మూడో లైనుకు 4.37కి.మీ, మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచ్నీ, రేపల్లెవాడ మధ్య రోడ్ కొత్తగా అండర్ బ్రిడ్జికి రూ.7.64కోట్లు, ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో భవనాలు, మరుగుదొడ్లు, విస్తరణ అభివృద్ధి కోసం రూ.4.44కోట్లు, ‘అమృత్’ స్కీం కింద ఆదిలాబాద్ స్టేషన్లో ఎఫ్వోబీ(ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం, దివ్యాంగుల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లకు ఎంపిక చేశారు. స్టేషన్లో లెస్ ట్రాక్, క్విక్ వాటరింగ్ కోసం రూ.14.95కోట్లు, ప్లాట్ ఫాంలపైన కవర్ నిర్మించేందుకు రూ.4.61కోట్లు ప్రతిపాదించారు. మంచిర్యాలకు అమృత్ స్కీం కింద నిధులు ప్రతిపాదించారు. కార్యరూపం దాల్చితేనే.. నిధుల ప్రతిపాదనలతో సరిపెట్టకుండా ఆ మేరకు మంజూరు చేసి కార్యరూపం దాల్చితేనే కొత్త మార్గాల్లో రైలు ప్రయాణ యోగం కలుగనుంది. కొన్నేళ్లుగా రైల్వేలో ఫైనల్ లొకేషన్ సర్వే జరిగిన పనులు సైతం ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు. తాజా ప్రతిపాదిత రైలు మార్గాలు అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలతోపాటు అనేక గిరిజన ప్రాంతాల నుంచి వెళ్లనుంది. భూసేకరణ, అటవీ అనుమతులు, పరిహారం రూ.వందల కోట్లలోనే ఉండనుంది. కాగితాలపైనే సరిపెడితే మారుమూల ప్రాంతాలకు రైలు కూత అందని ద్రాక్షగానే మారనుంది. -
సమస్యల పరిష్కారానికి కృషి
బెజ్జూర్(సిర్పూర్): ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని మర్దిడి గ్రామంలో బుధవారం పోతేపల్లికి చెందిన రౌతు మల్లేశ్కు రూ.60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిర్పూర్ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, సన్నబియ్యం పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బెజ్జూర్ మండలంలో దాదాపు రూ.కోటికి పైగా నిధులతో సీసీరోడ్లు నిర్మించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్, మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు జగ్గయ్య గౌడ్, విశ్వేశ్వర్, సామల రాజన్న, సురేశ్గౌడ్ తదితరులు ఉన్నారు. -
పుట్టుక.. చావులో వైవిధ్యం!
● ‘ఆడ’ కంటే ‘మగ’ జననమే అధికం ● అధిక మరణాలు కూడా పురుషులవే.. ● ఆగని గర్భస్త, నవజాత శిశు మరణాలు ● ‘సీఆర్ఎస్– 2021’ నివేదికలో వెల్లడిసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుట్టుక, చావు మానవ జీవనంలో కీలక ఘట్టాలు. దేశ వ్యాప్తంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే కేంద్ర హోంశాఖ పరిధి రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్)–2021 నివేదిక ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జననాలు, మరణాలతో పాటు ఏడాదిలోపు శిశువులు, గర్భంలోనే చనిపోతున్న శిశువుల వివరాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీ్త్ర, పురుష నిష్పత్తిలో ఏర్పడిన అసమానతలు, జనన, మరణాల్లో నమోదవుతున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.కన్నుమూస్తే మరణం..ఉమ్మడి ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లాలో మరణాలు అధికంగా నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832 మంది మరణించారు.మగ శిశువుల జననమే అధికం ఉమ్మడి ఆదిలాబాద్లోని నిర్మల్ జిల్లాలో అధికంగా జననాలు నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్లో తక్కువగా ఉంది. ఇందులో మగ శిశువుల జననాలే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లింగనిష్పత్తి తగ్గుతుండగా ఈ నివేదికలోనూ ఇదే తీరువెల్లడైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 26,576 మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25,124 మంది జన్మించారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జననాలు.. జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 2,073 1,865 2,710 2,729 4,783 4,594 9,377 నిర్మల్ 4,490 4,218 7,002 6,599 11,492 10,817 22,309 మంచిర్యాల 333 320 5,377 5,065 5,710 5,385 11,095 కు.ఆసిఫాబాద్ 3,458 3,240 1,132 1,088 4,590 4,328 8,918ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలుశిశు మరణాలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి మొదటి పుట్టిన రోజు కూడా జరుపుకోకుండానే ఎంతోమంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పుట్టిన సమయంలోనే అనేక సమస్యలుండగా, కొందరు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో 84మంది, మంచిర్యాలలో గ్రామీణ ప్రాంతంలో ఒక్కరూ చనిపోనప్పటికీ.. పట్టణ ప్రాంతంలో 11మంది, ఆదిలాబాద్లో 61, కుమురంభీం ఆసిఫాబాద్లో అధికంగా 77మంది నవజాత శిశు మరణాలు నమోదయ్యాయి. స్టిల్ బర్త్ మరణాలూ అధికమే..20 వారాలు దాటిన పిండం నుంచి ప్రసవ దశ శిశువు వరకు గర్భంలోనే మరణించే స్థితిని స్టిల్ బర్త్గా పేర్కొంటారు. ఈ పరిస్థితిని చాలామంది గర్భిణులు ఎదుర్కొంటున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 178 మృతశిశువుల జననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో గ్రామీణ పరిధిలో నమోదు లేనప్పటికీ పట్టణాల్లోనే 174 నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్లో 61, నిర్మల్లో 26 నమోదయ్యాయి. గర్భం దాల్చి పిండ వృద్ధి దశలో ఎదురవుతున్న పలు సమస్యలతో గర్భంలోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.శిశుమరణాలు ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 27 18 10 06 37 24 61 నిర్మల్ 36 42 3 3 39 45 84 మంచిర్యాల 0 0 06 05 6 5 11 కు.ఆసిఫాబాద్ 43 29 02 03 45 32 77 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 1,367 1,206 890 842 2,257 2,048 4,305 నిర్మల్ 2,400 1,850 1,356 1,054 3,756 2,904 6,660 మంచిర్యాల 653 574 1,636 1,003 2,289 1,577 3,866 కు.ఆసిఫాబాద్ 1,890 1,172 263 131 2,153 1,303 3,456 గర్భస్రావాలు (స్టిల్ బర్త్) ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 21 20 14 06 35 26 61 నిర్మల్ 12 14 0 0 12 14 26 మంచిర్యాల 0 0 94 80 94 80 174 కు.ఆసిఫాబాద్ 98 74 04 02 102 76 178 -
ప్రశాంతంగా పాలిసెట్
బెల్లంపల్లి/ఆసిఫాబాద్రూరల్: రాష్ట్ర సాంకేతిక విద్య కళాశాలల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగి సింది. 8,195 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7,719 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజ రు శాతం 94.19గా నమోదైంది. 476 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మంచిర్యాల, కుమురంభీం ఆ సిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కోఆర్డినేటర్, బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట ర్ ఎం.దేవేందర్రెడ్డి తెలిపారు. మంచిర్యాలలో అ త్యధికంగా 161 మంది, బెల్లంపల్లిలో అత్యల్పంగా 55 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఇలా..మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2,558 మందికి 2,397 మంది పరీక్ష రాయగా 161 మంది గైర్హాజరయ్యారు. బెల్లంపల్లిలో 1,081 మందికి 1,026 మంది పరీక్ష రాయగా 55 మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. కుమురంభీం జిల్లాలో 1,032 మంది దరఖాస్తు చేసుకోగా 965 మంది పరీక్ష రాశారు. 76 మంది గైర్హాజరయ్యారు. నిర్మల్ జిల్లాలో 2,422 మందికి గాను 2,305 మంది హాజరు కాగా 117 మంది హాజరు కాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 1,102 మందికి గాను 1,026 మంది పరీక్ష రాయగా 67 మంది గైర్హాజరయ్యారు. గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆసిఫాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకులం, బాలికల గురుకులం, మాతృశ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పాలిసెట్ జిల్లా కన్వీనర్ కనకయ్య తనిఖీ చేశారు. ఉమ్మడి జిల్లాలో 94.19శాతం హాజరు -
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: అడవి పంది దాడిలో గాయపడిన ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించి, బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ అన్నారు. గత నెల 28న అడవి పంది దాడిలో గాయపడిన మండలంలోని కౌటగూ డ గ్రామానికి చెందిన కుమ్రం రాజుబాయి, కుమ్రం రవి, కుమ్రం ప్రేమలత కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం జిల్లా కేంద్రంలో డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు కనీసం ఆటో చార్జీలకు కూడా డబ్బులు లేవన్నారు. అనంతరం డీఎఫ్వో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు బెనిఫిట్స్ అందిస్తామని తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టాలని రేంజ్ అధికారిని ఆదేశించగా, బీట్ అధికారులు రాజేష్, ప్రభాకర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
విధులకు గైర్హాజరు కావొద్దు
రెబ్బెన(ఆసిఫాబాద్): కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందుతున్న యువత విధులకు గైర్హాజరు కాకుండా సంస్థ ఉన్నతికి కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తూ మెడికల్ ఇన్వ్యాలిడేట్ అయిన ఇద్దరు ఉద్యోగుల వారసులకు మంగళవారం గోలేటిలోని జీఎం కార్యాలయంలో నియామక పత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకు తరగని వనరులు ఉన్నాయన్నారు. క్రమశిక్షణతో పనిచేసి ఉత్పత్తి, ఉత్పాదకత, లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని సూచించారు. తల్లిదండ్రులను కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ అర్చన తదితరులు పాల్గొన్నారు. -
కష్టానికి ప్రతిఫలం
● జిల్లాలో మొదలైన ఆయిల్పామ్ పంట దిగుబడి ● వచ్చే నెల నుంచి గెలల కత్తిరింపు పనులు ప్రారంభం ● 1,320 ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణంరెబ్బెన(ఆసిఫాబాద్): సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి.. కొత్తరకం పంటల సాగు ప్రారంభించిన జిల్లా రైతులు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రయోగాత్మకంగా పండించిన ఆయిల్పామ్ దిగుబడి మరికొన్ని రోజుల్లో అందనుంది. నాలుగేళ్లుగా చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అన్నదాతకు ప్రతిఫలం దక్కనుంది. జిల్లాలో నాలుగేళ్ల క్రితం ఆయిల్పామ్ సాగుకు అ డుగుపడింది. ప్రారంభంలో అతికొద్ది మంది మా త్రమే తోటల సాగుపై ఆసక్తి చూపారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా తోటల సాగు చేపట్టగా.. అవి ఈ ఏడా ది నుంచి రైతులకు దిగుబడితోపాటు ఆదాయాన్ని అందించనున్నాయి. జూన్ నుంచి ఆయిల్పామ్ గె లలు కోసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. 53 ఎకరాలతో మొదలై..నాలుగేళ్ల క్రితం జిల్లా రైతులు ఆయిల్పామ్ తోటల సాగు ప్రారంభించారు. ఈ తరహా సాగుపై అవగాహన లేకపోవడం, సమీపంలోని జిల్లాలోనూ పంట లేకపోవడంతో స్థానిక రైతులు ప్రారంభంలో ఆసక్తి చూపలేదు. ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించడం, ఆయిల్పామ్ తోటల సాగుతో వచ్చే ఆదాయం వివరాలను వివరిస్తూ ప్రోత్సహించారు. దీంతో రెబ్బెన, చింతలమానెపల్లి, కాగజ్నగర్, పెంచికల్పేట్ మండలాలకు చెందిన కొంతమంది ముందుకొచ్చారు. 53 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ఆయిల్పామ్ సాగు ప్రారంభించారు. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నాలుగేళ్ల క్రితం అతితక్కువ విస్తీర్ణంలో మొదలైన పంట సాగు ఇప్పుడు 1,320 ఎకరాలకు చేరింది. మొదటి మూడేళ్లు మొక్కల నిర్వహణతోపాటు అంతర పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు సైతం అందించింది. అయితే సాగు విస్తీర్ణం పెరుగుతున్నా అధికారులు లక్ష్యానికి అనుగుణంగా విస్తీర్ణం పెరగడం లేదు. ఇప్పటికీ కొంతమంది రైతులకు కొన్ని అపోహలు ఉండడం, సరైన నీటి వసతులు లేకపోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. కొద్దిరోజుల్లో మొదటి దిగుబడి జిల్లాలో నాలుగేళ్ల క్రితం నాటిన ఆయిల్పామ్ చెట్లు మరికొన్ని రోజుల్లో మొదటి దిగుబడిని అందించనున్నాయి. మొదటి ఏడాది ఎకరానికి సుమారు 2 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. చెట్టు ఆరేళ్ల వయస్సుకు వచ్చేసరికి ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రైతు ఒక్కసారి చెట్లు నాటితే 35 ఏళ్ల పాటు సంవత్సరం పొడవునా దిగుబడి ఇస్తూనే ఉంటాయి. సంప్రదాయ పంటల సాగుతో పోల్చితే ఆయిల్పామ్తో రైతులు లాభాలు ఉంటాయి. – ఎంఏ నదీం, ఉద్యానవన శాఖ అధికారి ఎకరానికి రెండు టన్నుల దిగుబడి..గతేడాదే చెట్లు కాత దశకు చేరినా అంతంత మాత్రంగానే వచ్చే కాపుతో రైతులకు ప్రయోజనం ఉండదు. గత సంవత్సరం వచ్చిన గెలలను కత్తిరించి పడేశారు. ఈ ఏడాది నుంచి వచ్చే గెలలతో రైతులకు ఆదాయం వస్తుంది. జూన్లో కత్తిరింపు పనులు మొదలుకాగానే రైతులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మ్యాట్రిక్స్ సంస్థ గెలలు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తుంది. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు సుమారు 4 నుంచి 6 వరకు గెలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం ఎకరానికి సుమారు రెండు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉన్నా క్రమంగా పెరగనుంది. సకాలంలో యాజమాన్య పద్ధతులు చేపడితే ఆయిల్పామ్ చెట్లు 6 నుంచి 7 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఎకరానికి 8 నుంచి 12 టన్నుల దిగుబడి అందిస్తాయి. అగ్రిమెంట్ ప్రకారం మ్యాట్రిక్స్ కంపెనీ కొనుగోలు చేసే రోజుకు ఉన్న మార్కెట్ ధరను రైతులకు చెల్లిస్తుంది. దీంతో దిగుబడులు అమ్ముకోవడంలో ఇబ్బందులేవీ ఉండవు. ప్రస్తుతం టన్ను ఆయిల్పామ్ ధర రూ.20,800 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగో సంవత్సరం నుంచి 30 ఏళ్లపాటు రైతులకు దిగుబడిని అందిస్తూనే ఉంటాయి. ఒక్కసారి పెట్టుబడి పెడితే 30 ఏళ్లపాటు రైతు ఆదాయాన్ని పొందుతూనే ఉండవచ్చు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ
దహెగాం(సిర్పూర్): మండల కేంద్రంతోపాటు లగ్గాం, కుంచవెల్లి, గిరవెల్లి, కల్వాడ, చంద్రపల్లి, ఒడ్డుగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. 17శాతం కంటే తక్కువ తేమ ఉంటే వేగంగా కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యంపై కప్పడానికి వీలుగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు ధాన్యం దళారులకు అమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ఆయన వెంట డీఏవో శ్రీనివాసరావు, డీసీవో బిక్కు, డీటీలు లలిత, రాజ్కుమార్, శ్రీనివాస్, ఏవో రామకృష్ణ, ఏఈవోలు తదితరులు ఉన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలిరెబ్బెన(ఆసిఫాబాద్): కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండలంలోని నారాయణపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. నారాయణపూర్ కేంద్రం నిర్వాహకులు ధాన్యం తేమను పరిశీలించడంలో జాప్యం చేస్తున్నారని, గోనె సంచులు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మరుసటిరోజే అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ధాన్యంలో తేమ శాతం పరిశీలించి, సకాలంలో గోనె సంచులు అందించాలని ఆదేశించారు. జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్రావు, ఏపీఎం వెంకటరమణ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: దేశవ్యాప్తంగా ఈ నెల 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో అన్ని విభాగాల సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ పిలుపునిచ్చారు. ఎన్హెచ్ఎం స్కీంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి జిల్లా కేంద్రంలో డీఎంహెచ్వో సీతారాంకు మంగళవారం సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెండో ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, 7 నెలల పెండింగ్ పీఆర్సీ డబ్బులు విడుదల చేయాలని, నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలని, బస్తీ దవాఖానాలో సపోర్టింగ్ స్టాఫ్ను కాంట్రాక్టు విధానంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్మకూరి చిరంజీవి, నాయకులు సురేశ్ పాల్గొన్నారు. -
సమన్వయంతో సమస్యల పరిష్కారం
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ బావులకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పంపుసెట్లు మంజూరు చేయాలని జైనూర్ మండలం ఉషేగాం, పోచంలొద్ది గ్రామాలకు చెందిన రైతులు అర్జీ సమర్పించారు. దివ్యాంగుడినైన తనకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని పెంచికల్పేట్ మండలం గుంట్లపేట గ్రామానికి చెందిన సాగర్, దివ్యాంగ పత్రం పునరుద్ధరించి పింఛన్ ఇప్పించాలని ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన బొమ్మకంటి మంజుల వేర్వేరుగా అధికారులకు విన్నవించారు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని ఇతరులకు విక్రయించారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన జాడి జయబాయి వినతిపత్రం సమర్పించింది. తన భూమికి హద్దులు నిర్ధారించాలని ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి గ్రామానికి చెందిన చునార్కర్ లక్ష్మి కోరింది. బెజ్జూర్ సహకార బ్యాంక్ నుంచి రూ.లక్షల ట్రాక్టర్ రుణం పొందానని, బకాయిలు చెల్లించినా నోటీసు అందించారని, అధికారులు న్యాయం చేయాలని రెబ్బెన గ్రామానికి చెందిన పొట్టి ధర్మయ్య అర్జీ అందించాడు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి బోరుబావి, విద్యుత్ సౌకర్యం మంజూరు చేయాలని కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన గంధం మంజులాబాయి దరఖాస్తు చేసుకుంది. నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రాళ్లపేట్ గ్రామానికి చందిన రెడ్డి ఉమారాణి వేడుకుంది. 65 ఏళ్లు ఉన్న తనకు వృద్ధాప్య పింఛన్ అందించాలని రెబ్బెన మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన ఆదే యాదవ్ కోరాడు. ఇల్లు ఇవ్వాలిఇందిరమ్మ ఇళ్ల పథ కం జాబితాలో నాకు ఇల్లు ఇవ్వాలి. కూలీ పనులు చేసుకుంటున్నా. సొంత ఇల్లు లేకపోవడంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో కాలం వెల్లదీస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేద కుటుంబాన్ని ఆదుకోవాలి. – ప్రియాంక, సిర్పూర్(యూ) నా భూమిలో ఇళ్లు కట్టుకున్నారుకెరమెరి శివారులోని సర్వే నం.58/ఆ,58/ఏ/1లో ఏడెకరాల భూమి అనువంశికంగా వచ్చింది. నన్ను భయపెట్టి అందులో 20 మంది ఇళ్లు కట్టుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నా భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – అబ్దుల్ షేకూర్, కెరమెరి విధుల్లోకి తీసుకోవాలిసిర్పూర్(యూ) మండలం మహగావ్ పంచాయతీలో 2018 ఆగస్టు 20 వరకు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశా. అదేరోజు ఆరో గ్యం క్షీణించి పక్షవాతం వచ్చింది. 2018 ఆగస్టు 21న నిర్వహించిన ఆడిట్ ప్రజావేదికకు హాజరు కాలేదు. అధికారులు విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం పనిచేయగలను. విధుల్లోకి తీసుకోవాలి. – కొడప హిరామన్, సిర్పూర్(యూ) న్యాయం చేయండినిరుపేద కుటుంబం మాది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా. మొదటి లిస్టులో తనకు ఇల్లు మంజూరైనట్లు పేరు వచ్చిందన్నారు. ఇప్పుడు అధికారులను సంప్రదిస్తే సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారు. ఇల్లు ఉన్నవారికే మంజూరు చేస్తున్నారు. ఇప్పటికై నా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – లలిత, సిర్పూర్(టి) కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రజావాణిలో వినతులు స్వీకరణ -
ఘనంగా నర్సుల దినోత్సవం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. నర్సులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభా కాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సూపరింటెండెంట్ ఇందుమతిని శాలువాతో సన్మానించారు. వా రు మట్లాడుతూ ప్రేమ, ఓర్పు, సహనం కలి గిన అమ్మకు ప్రతిరూపంగా నర్సులు నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో తక్కువ వేతనంతోనూ సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. సమాజా నికి నర్సులు అందిస్తున్న సేవలకు గుర్తుగా, ఫ్లోరెన్స్ నైటింగల్ జయంతి రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు ప్రసాద్, స్రవంతి, ప్రసాద్, హెడ్ నర్స్ సఫియా, న ర్సింగ్ ఆఫీసర్స్ శ్రీదేవి, ఏసుకరుణ, కుసుమరాణి, భాగ్యలక్ష్మి, లలిత, పద్మ, హేమలత, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. -
రహదారుల అభివృద్ధికి కృషి
రెబ్బెన(ఆసిఫాబాద్): మారుమూల గ్రామాల్లో రహదారుల సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. రెబ్బెన మండలం కొమురవెళ్లి నుంచి కిష్టాపూర్ వరకు రూ.2కోట్లతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులను సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడా రు. జిల్లాలో రహదారుల నిర్మాణానికి రూ.10కోట్ల సీఆర్ఆర్ నిధులు కేటాయించామని తెలిపారు. కొమురవెళ్లి నుంచి రంగాపూర్ మీదుగా కిష్టాపూర్ వరకు రూ.2కోట్లతో బీటీరోడ్డు నిర్మిస్తున్నామన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో రూ.44 కోట్ల వ్యయంతో ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ప్రత్యేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం నిర్మించడం సంతోషమన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. గుండెల్లో పెట్టుకునేలా పనిచేయాలి చింతలమానెపల్లి: ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజించేలా అధికారులు పనిచేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. చింతలమానెపల్లి మండలం డ బ్బాలో సోమవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ స్థానికంగా ప్రజ ల పోడు సమస్యను పరిష్కరించేందుకు అధికారులు పనిచేయాలన్నారు. ప్రజలపై జులుం చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఆదివాసీల అభి వృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆయా కార్య క్రమాల్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఎఫ్వో నీరజ్కుమార్, ఏఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ రామానుజం, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, డీఆర్డీవో దత్తారాం, ఎఫ్డీవో సుశాంత్ బొగాడె, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో శంకరమ్మ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్కసొంతింటి కల సాకారమే లక్ష్యంకౌటాల: రాష్ట్రంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, వారి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కౌటాలలో సోమవారం రాత్రి ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలు దశాబ్ద కాలంగా సొంతిళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వ సూచనల మేరకు నిర్మించుకోవాలన్నారు. విడతలవారీగా నిధులు మంజూరు చేస్తామన్నారు. కౌటాల మండల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎఫ్వో నీరజ్కుమార్, ఎఫ్డీవో సుశాంత్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, అధికారులు వేణుగోపాల్, పుష్పలత, రమేశ్, బద్రుద్దీన్, పార్టీ మండల కన్వీనర్లు నికోడే గంగారాం, ఉమామహేశ్, తదితరులు పాల్గొన్నారు. కాగా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించాల్సిన కార్యక్రమం రాత్రి 10 గంటలకు ప్రారంభించారు. దీంతో పోలీసులకు గంటలపాటు నిరీక్షణ తప్పలేదు. -
టీచర్లకు వేసవి శిక్షణ
● నేటి నుంచి ఈ నెల 31 వరకు..హాజరు కావాలిజిల్లాలో ఈ నెల 13 నుంచి 31 వరకు ని ర్వహిస్తున్న శిక్షణ కా ర్యక్రమానికి ఉపాధ్యాయులు టైం టే బుల్ వారీగా తప్పని సరిగా హజరు కావాలి. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలి. – యాదయ్య, డీఈవో సమయపాలన పాటించాలిఉపాధ్యాయులు స మయపాలన పాటించాలి. ప్రతీ సబ్జెక్టుకు కాంప్లెక్స్ హెచ్ఎంలను సెంటర్ ఇన్చార్జీలుగా నియమించాం. ఉదయం 9:30 గంటల్లోపు వచ్చి, జియోకార్డినల్ ద్వారా తమ మొబైల్ నుంచి హాజరు నమోదు చేసుకోవాలి. – శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్టినేటర్ ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు జిల్లాలో అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి శిక్షణ అందించనున్నారు. ఈ నెల 31 వరకు కొనసాగే వేసవి శిక్షణ కార్యక్రమం కోసం విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 13 నుంచి 17 వరకు మొదటి దశ, ఈ నెల 20 నుంచి 24 వరకు రెండో దశ, ఈ నెల 27 నుంచి 31 వరకు మూడో దశలో శిక్షణ అందించనున్నారు. డిజిటల్ విద్య, కంప్యూటర్ ద్వారా ఏఐ ఆ ధారిత విద్యాబోధన, లీడర్షిప్ లక్షణాల పెంపుద ల, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబో ధన, సబ్జెక్టు విద్యా బోధన, జీవన నైపుణ్యాలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ బోర్డు(ఐఎఫ్బీ) వినియో గం, 2025– 26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఎలా బోధించాలి, కనీస సామర్థ్యాలు పెంపు, విద్యా ప్రమాణాలు ఎలా సాధించాలి, ప్రాథమిక స్థాయి నుంచి కనీస సామర్థ్యాలు సాధించేలా కార్యాచరణ రూపకల్పన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వివిధ స్థాయిల్లో.. జిల్లాస్థాయిలో భాగంగా ఈ నెల 13 నుంచి 17 వరకు ఒక్కో జిల్లా రిసోర్స్పర్సన్ ప్రతీ సబ్జెక్టుకు నలుగురు చొప్పన స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెచ్ఎంలు, కేజీబీవీల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత శిక్షణ తీసుకున్నవారు మండలస్థాయిలో ఈ నెల 20 నుంచి 24 వరకు, 27 నుంచి 31 వరకు ఎంఈవోల ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తారు. 130 గణితం సబ్జెక్టు ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ కొనసాగనుంది. జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్లో 100 వంద మందికి, తెలంగాణ మోడల్ స్కూల్లో సాంఘిక శాస్త్రం 114 మందికి, బాలికలు ఉన్నత పాఠశాలలో 120 మండల స్థాయి రిసోర్స్పర్సన్లకు, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రత్యేక విద్య 80 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే వంద మంది సైన్స్ టీచర్లు, 106 మంది హిందీ, 109 మంది ఫిజికల్ సైన్స్, 138 మంది తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ అందించనున్నారు. -
హద్దురాళ్ల తొలగింపు
రెబ్బెన: ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వేస్తే చర్యలు తప్పవని మండల పంచాయతీ అధికారి వాసుదేవ్ అన్నారు. కొండపల్లి శివారులోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లో ఆదివారం పంచాయతీ అధికారులు హద్దురాళ్లను తొలగించారు. ఆయన మాట్లాడుతూ డీటీసీపీ, గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దన్నారు. డీటీసీపీ ద్వారా మాత్రమే లేఅవుట్లను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇంటర్ ప్రవేశాలకు వేళాయె
● ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ● ఈ నెల 31 వరకు దరఖాస్తులకు ఆహ్వానం ఆసిఫాబాద్రూరల్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు మొదలయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఫలితాల్లో ప్రైవేట్ కంటే దీటుగా నిలుస్తున్నారు. ఏటా మెరుగైన ఉత్తీర్ణతతో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ప్రైవేట్ కంటే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. కళాశాలల వారీగా సీట్లు ఇలా...జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 11 ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ గ్రూప్లు ఉండగా ఒక్కో గ్రూప్లో 88 మంది వరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. 11 కళాశాలల్లో అన్ని గ్రూప్లు కలిపి 4,200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 13 కేజీబీవీలు 7 కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీలో ఒక్కో గ్రూప్లో 40 చొప్పున 560 సీట్లు, 6 కళాశాలల్లో సీఈసీ, హెచ్ఈసీలో ఒక్కో గ్రూప్లో 40 చొప్పున 480 సీట్లకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. 2 తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్లు ఉండగా ఒక్కో గ్రూప్లో 40 చొప్పున 320 సీట్లు భర్తీ చేయనున్నారు. 4 సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ ఒక్కో గ్రూప్లో 40 మంది విద్యార్థుల చొప్పున 320 సీట్లు ఉన్నాయి. 5 గిరిజన బాలికల కళాశాలల్లో ఒకటి బాలురు, నాలుగు బాలికల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఒకేషనల్ గ్రూప్లో 460 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2 మైనార్టీ గురుకుల కళాశాలల్లో బాలికలు, బాలురు ఎంపీసీ, బైపీసీ ఒక్కో గ్రూప్లో 40 చొప్పున 160 సీట్లు, 5 జ్యోతిబా పూలే గురుకుల కళాశాలల్లో మూడు బాలురు, రెండు బాలికల కళాశాలల్లో 400 సీట్ల భర్తీకోసం ఆన్లైన్లో అడ్మిషన్ల పక్రియ కొనసాగుతోంది. ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పదోతరగతి పాసైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా లేదంటే నేరుగా కళాశాలకు వెళ్లి తమకు నచ్చిన గ్రూప్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉంది. – కళ్యాణి, డీఐఈవో నాలుగేళ్లుగా ఇంటర్ ఫలితాలు ఇలా..విద్యా హాజరైన ఉత్తీర్ణులు ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయిలో సంవత్సరం విద్యార్థులు ర్యాంకు 2021–22 ఫస్ట్ ఇయర్ 5,252 3,716 70 03 సెకండ్ ఇయర్ 4,826 3,678 76 02 2022–23 ఫస్ట్ ఇయర్ 5,137 3,748 74 03 సెకండ్ ఇయర్ 4,697 3,793 81 02 2023–24 ఫస్ట్ ఇయర్ 4,570 2,813 61 08 సెకండ్ ఇయర్ 4,095 2,951 81 07 2024–25 ఫస్ట్ ఇయర్ 4,756 3,354 70.52 04 సెకండ్ ఇయర్ 4,920 3,948 80.24 02జిల్లాలో 48 కళాశాలలు...జిల్లాలో మొత్తం 48 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వరంగ కళాశాలలు 42, ప్రైవేట్ కళాశాలలు 6 ఉన్నాయి. ఇందులో 11 ప్రభుత్వ జూని యర్ కళాశాలలు కొన్నేళ్లుగా ప్రైవేట్ను మించి ఉత్తీర్ణత నమోదు చేస్తున్నాయి. వార్షిక పరీక్షల్లో మూడేళ్లగా జిల్లా టాప్ త్రీలో నిలుస్తోంది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, పరీక్షలకు కొన్ని నెలల ముందు నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. -
సర్వీస్కు నోచుకోని ‘సెంట్రల్ ఏసీ’
● కలెక్టరేట్లో అధికారుల తిప్పలు ● నెల రోజులుగా పనిచేయని వైనం..సాక్షి, ఆసిఫాబాద్: అధునాతన భవనం. రెండేళ్లు దాటలేదు. నేటికీ భవనానికి అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. తాజాగా కలెక్టరేట్లోని ‘సెంట్రల్ ఏసీ’ పనిచేయకుండా మొరాయించింది. అసలే వేసవి కాలం.. నెల రోజులకుపైగా సెంట్రల్ ఏసీ సిస్టం పనిచేయకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కలెక్టరేట్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్వో, సమావేశ మందిరంతో కలిపి మొత్తం 5 చోట్ల సెంట్రల్ ఏసీ అమర్చారు. డైకిన్ కంపెనీకి చెందిన ఏసీలు అమర్చగా.. అవి ప్రస్తుతం పనిచేయడం లేదు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల ఏసీలు పనిచేయడాని అవసరమయ్యే చిప్లు పాడైపోవడంతో సెంట్రల్ ఏసీ సిస్టం మొత్తం పనిచేయడం లేదని సమాచారం. కలెక్టరేట్ అధికారులు డైకిన్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించి.. రిపేరీ చేయాలని కోరగా.. వాటికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయాలని.. అందుకు డబ్బులు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే ఆ డబ్బులు సమాకూర్చేందుకు సమయం పట్టడం.. ఆ తర్వాత నిధులు సమాకూర్చినా నెల రోజులు దాటినా సెంట్రల్ ఏసీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. అయితే ఏసీలు పనిచేయకపోవడంతో కలెక్టర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) తన ఛాంబర్లలో కూలర్లను ఏర్పాటు చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక్క సాకెట్ లేదు... బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 2023 జూన్ 30న అట్టహాసంగా ప్రారంభానికి నోచుకున్న ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనం అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో అధునాతన హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న కలెక్టరేట్ భవనంలో నేటికీ విద్యుత్ పరికరాల పరిస్థితి అధ్వానంగా ఉంది. కలెక్టరేట్ భవనంలో ఉన్న 40కు పైగా ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సరైన సాకెట్ వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని ఉద్యోగవర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గనులకు కన్నం.. సర్కారుకు సున్నం..!
జిల్లా వివరాలుకౌటాల మండలం ముత్యంపేట్లోని ఓ క్వారీ జైనూరు మండలంలో ఉన్న దుక్రే సుభాష్ క్వారీ నుంచి 20 సంవత్సరాల నుంచి అనుమతులకు మించి కంకరను వెలికి తీసి భారీగా ఆర్జించారు. గనుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా వ్యవహారం బయటపడింది. 80 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వినట్లు తనిఖీలో తేలింది. సంబంధిత క్వారీ యజమానికి రూ.2 కోట్ల జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో అప్పీలుకోసం కోర్టుకు వెళ్లాడు. సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో ఖనిజాల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తవ్వకాలు ఎక్కువగా జరిపి తక్కువ మొత్తం ఖనిజానికి రాయల్టీని చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం తాజాగా ఈ విధానంలో మార్పులు చేపట్టి నిబంధనలు మరింత పదునెక్కించాలని చూస్తోంది. కంకర క్వారీల రాయల్టీ చెల్లింపు పరిస్థితి... ప్రతీ టన్ను కంకరకు ప్రభుత్వానికి రూ.139 రాయల్టీ చెల్లించాలి. జిల్లాలో 7 కంకర క్వారీలు, 4 క్రషర్లు ఉన్నాయి. అన్ని గనుల నుంచి అనధికారిక అంచనా ప్రకారం రోజుకు 1000 నుంచి 2000 టన్నుల వరకు కంకర బయటకు వస్తోంది. ఈలెక్కన ప్రతీరోజు ప్రభుత్వానికి రూ.1.39 లక్షల నుంచి రూ.2.78 లక్షలు రావాల్సి ఉంది. కానీ అంతగా రావడం లేదు. గతంలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య జిల్లాలోని వివిధ గనుల నుంచి వెలికితీసే ముడి ఖనిజాన్ని 363 జాతీయ రహదారి పనులకు వినియోగించగా.. ఆ సమయంలో సీనరేజ్తో పాటు ఇతర పన్నులు కలిపి రూ.10.80 కోట్లకుపైగా రాయల్టీ రూపంలో వసూలైంది. ప్రస్తుతం ఆ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 32,632 మెట్రిక్ టన్నుల ముడి ఖనిజం వెలికితీయగా ఇందుకు రాయల్టీ, ఇతర ఫీజుల రూపంలో సర్కారుకు రూ.31.74 లక్షల ఆదాయం వచ్చింది.టన్నుకు చెల్లించాల్సిన రాయల్టీ : 139 రోజుకు వివిధ తవ్వకాలు : 1000–2000 టన్నులు నామమాత్రంగా రాయల్టీ చెల్లింపు జిల్లాలో యథేచ్ఛగా ఖనిజాల తవ్వకాలుజరిమానా విధించాం.. జిల్లాలో ఖనిజాలను తవ్వి ఫీజులు చెల్లించకుండా లావాదేవీలు జరుపుతున్న లీజుదారులపై రూ.2 కోట్ల జరిమానా విధించాం. కేవలం ఇదంతా తనిఖీల ద్వారానే జరిగింది. తరచూ గనులకు వెళ్లి తనిఖీలు జరుపుతూనే ఉన్నాం. తొమ్మిదేళ్లలో రూ.12.33 కోట్ల ఆదాయం సమకూరింది. – ఎస్.గంగాధరరావు, గనుల శాఖ ఏడీ, ఆసిఫాబాద్ అక్రమంగా తరలింపుజిల్లాలో జరిగే ఇతర పనులకు, పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే ముడి ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. సాంకేతికంగా ఒక లారీ లోడుకు ఫీజు చెల్లించి అదే రశీదులో నాలుగైదు ట్రిప్పుల లోడ్లు తరలివెళ్తున్నట్లు సమాచారం. ఇలా ఫీజులను చాలా వరకు ఎగ్గొడుతున్నారు. అక్రమ రవాణా ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మూడింతలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రైల్వే, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ పనులకు సైతం ఇక్కడి గనుల నుంచే ముడి ఖనిజాన్ని తరలిస్తున్నారు. వీటి నుంచి డీఎంఎఫ్టీ, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం మాత్రం ఇతర పద్దులో జమ అవుతోంది. గనుల శాఖలో కొందరు అధికారులు క్వారీ యజమానులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం వల్ల సర్కారుకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలి
చింతలమానెపల్లి: మండలంలోని డబ్బా గ్రామంలో ఈ నెల 12న నిర్వహించనున్న కుమురంభీం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుల్కరి ఉమామహేశ్ కోరారు. శనివారం డబ్బా గ్రామంలో కార్యక్రమం నిర్వంచనున్న స్థలంలో కాంగ్రెస్, ఆది వాసీ నాయకులు ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విగ్రహావిష్కరణకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు పాల్వా యి హరీశ్బాబు, వెడ్మ బొజ్జు, కోవ లక్ష్మి, ఆదివాసీ నాయకులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి అధికసంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బెజ్జూర్ మండల కన్వీనర్ కొడప విశ్వేశ్వర్, యువజన విభాగం మండలాధ్యక్షుడు బండి మహేశ్, నా యకులు కొండు శంకర్, జునుగరి శేఖర్, విజయ్, కార్యక్రమ నిర్వహణ అధ్యక్షుడు నారాయణ, ఆదివాసీ నాయకులు కుంరం నందారాం, ఆత్రం బాబురావ్, కుంరం అశోక్, సురేశ్, కుడ్మెత సందీప్, మెస్రం శశికుమార్, అర్జున్ పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీహెచ్పీలో లోడర్ ఆపరేటర్లకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివా రం సీహెచ్పీ ఎస్ఈ కోటయ్యను కలిసి వేతనాలు చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోడర్ ఆపరేటర్లకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కు టుంబాలను పోషించుకునేందుకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. క్రమం తప్పకుండా వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ వేతనాలతో పాటు సీఎంపీఎఫ్ వివరాలు తెలియజేయాలని సూచించారు. సీఎంపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తాలపై కార్మికులకు సమాచారం లేకపోవడంతో ఆందోళన గురవుతున్నారని తెలిపారు. ఆపరేటర్ల సమస్యలపై యాజమాన్యం స్పందించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆపరేటర్లు నారాయణ, రాజు, మహేందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
కౌటాల: గ్రామీణ యువత క్రీడల్లో రాణించా లని మాలీ సంఘం నాయకుడు మోర్లె పాండురంగ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని కన్నెపల్లి గ్రామ యువకులకు ఆయన వాలీబాల్, క్రికెట్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చదవులో ముందుండాలని, క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నా రు. ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత నిత్యజీవితంలో క్రీడలను భాగం చేసుకోవా లని సూచించారు. గ్రామీణ యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. -
అట్టహాసంగా వాలీబాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగనున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, సీఐ శశిధర్రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మందమర్రి జీఎం దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. గెలుపు, ఓటములను లెక్క చేయకుండా అకుంఠిత దీక్షతో సాధన చేస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు. క్రీడల వల్ల చక్కటి క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని, సమాజంలో మంచి పౌరులను తయారు చేయడానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ క్రీడాకారులు బెల్లం శ్రీనివాస్, యాకూబ్, శివ, ఈశ్వరాచారీ, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
చేరువగా రైతు నేస్తం!
● ప్రస్తుతం జిల్లాలోని 15 రైతువేదికల్లోనే.. ● త్వరలో మరో 30 వేదికల్లో కార్యక్రమం ● ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ● ప్రభుత్వ ఉత్తర్వులు అందగానే అమలు ఆసిఫాబాద్అర్బన్: రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు మండల కేంద్రంలోని రైతువేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులకు సాగుకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండడంతో కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సంబంధిత శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో అదనంగా రెండు వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. కార్యక్రమ ఉద్దేశం ఏమంటే..పంటల సాగులో రైతులకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతుల ద్వారా తరగతులు నిర్వహించి పంటల సాగు, మెలకువలు, యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ చర్యల గురించి రైతులకు వివరిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నూతన వ్యవసాయ సమాచారం చేరవేస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుండడంతో రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో మండలానికి ఒక రైతువేదికను ఎంపిక చేయగా.. అదనంగా మరో రెండు క్లస్టర్లకు విస్తరించనున్నారు. జిల్లాలో ప్రతీ 5వేల ఎకరాలకు ఒకటి చొప్పున 70 వ్యవసాయ క్లస్టర్లున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 15 రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తుండగా నూతనంగా మరో 30 వేదికల్లోనూ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ రైతువేదికల్లో..జిల్లాలో ప్రస్తుతం 15 రైతు వేదికల్లోనే రైతు నేస్తం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్, కెరమెరి, వాంకిడి, తిర్యా ణి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), రెబ్బెన, పెంచికల్పేట్, దహెగాం, కౌటాల, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, బెజ్జూర్లోని రైతువేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్లో రైతునేస్తం నిర్వహిస్తున్న రైతువేదిక అదనంగా ఎంపిక చేసిన గ్రామాలివే..మండలం ఎంపికై న గ్రామాలు ఆసిఫాబాద్ చిర్రకుంట, రహపల్లి కెరమెరి సాంగ్వి, సుద్దాపూర్ జైనూర్ లెండిజల, ఊశేగాం వాంకిడి బంబారా, ఇందాని సిర్పూర్ (యూ) సిర్పూర్(యూయ), పంగిడి లింగాపూర్ కాంచన్పల్లి, లింగాపూర్ రెబ్బెన తక్కలపల్లి, నారాయణపూర్ తిర్యాణి గిన్నెదరి, మాణిక్యపూర్ కాగజ్నగర్ జంబూగ, దుర్గానగర్ సిర్పూర్(టి) చింతకుంట, వెంపల్లి బెజ్జూర్ కుకుడ, ఔట్సారంగపల్లి కౌటాల మొగడ్దగడ్, సాండ్గాంవ్ చింతలమానెపల్లి డబ్బా, రుద్రాపూర్ దహెగాం కుంచవెల్లి, గిరివెల్లి పెంచికల్పేట్ కమ్మర్గాం, చేడ్వాయిసద్వినియోగం చేసుకోవాలి రైతువేదికల ద్వారా నిర్వహిస్తున్న రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పంటల సాగు పద్ధతులను తెలియజేస్తారు. రైతులతో నేరుగా చర్చించి సందేహాలను నివృత్తి చేస్తారు. అభ్యుదయ రైతుల అనుభవాలు చూపిస్తారు. దీంతో రైతుల్లో నమ్మకం పెరుగుతుంది. నూతనంగా ఎంపిక చేసిన రైతువేదికల్లో త్వరలో రైతు నేస్తం సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే రోజుల్లో రైతులకు మరింత మేలు జరుగుతుంది. – రావుల శ్రీనివాస్రావు, జిల్లా వ్యవసాయాధికారి -
బూరెపల్లిలో ప్రాణహిత ప్రాజెక్ట్ సర్వే
చింతలమానెపల్లి: మండలంలోని బూరెపల్లి గ్రామంలో ప్రాణహిత నదివద్ద ప్రాజెక్ట్ నిర్మాణ సర్వేను అధికారులు శనివారం ప్రారంభించా రు. రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారి కె.విఠల్రావు ప్రతిపాదన మేరకు జిల్లా నీటి పారుదలశాఖ అధికారులు బూరెపల్లి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణాని కి సంబంధించిన సర్వే నిర్వహించారు. ప్రాణ హిత నదికి ఆనుకుని ఉన్న బూరెపల్లి, కోర్సిని, గంగాపూర్ గ్రామాల పరిధిలోని వివరాలు సేకరించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకున్న నేపథ్యంలో రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారి విఠల్రావు ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్వేషణ చేపట్టి స్వచ్ఛందంగా ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించి నివేదికను నీటిపారుదల శాఖ రాష్ట్ర అధికారులకు అందించారు. ఈనేపథ్యంలో శాఖ అధికారులు సంబంధిత వివరాలు సేకరించాలని కాగజ్నగర్ డివిజన్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. సుమారు 10రోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు నీటి పారుదలశాఖ డీఈ వెంకటరమణ, ఏఈఈ రాజ్కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో నీటి లభ్యత, నదిలో పునాదులకు అణువైన పరిస్థితులు, ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రాంతం, మహారాష్ట్ర వైపు ప్రభావితమయ్యే ప్రాంతాలు తదితర వివరాలు సేకరించనున్నట్లు పేర్కొన్నారు. -
శిథిల భవనాల్లో కార్యాలయాలు
● ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ● కొత్త భవనాలు నిర్మించాలని డిమాండ్ చింతలమానెపల్లి: మండల అభివృద్ధి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధికి దూ రంగా ఉన్నాయి. అసౌకర్యాలు, శిథిల గోడల మధ్య కార్యకలాపాలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. కార్యాలయాలకు వచ్చే ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు, స్థానికుల డిమాండ్ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చింతలమానెపల్లి కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్లో సిర్పూర్ నియోజకవర్గంలో పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండల కేంద్రాలుగా ఏర్పాటయ్యాయి. చింతలమానెపల్లి మండలంలో 19 గ్రామపంచాయతీలున్నాయి. తాత్కాలిక భవనాల్లో మండల కార్యాలయాలు ఏర్పాటు చేసి మండల ప్రజలకు ఆయా శాఖల ద్వారా సేవలందించారు. తహసీల్దార్ కార్యాలయం మొదట అద్దెభవనంలో నిర్వహించి ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఒక పాఠశాల భవనానికి తరలించారు. పోలీస్స్టేషన్ను ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయగా అనంతరం శాశ్వత భవనాన్ని నిర్మించి అందులోకి మార్చారు. ఎంపీడీవో కార్యాలయాన్ని శిథిలావస్థలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఇదే భవనంలో ఎంపీపీ, ఉపాధిహామీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఎంఈవో కార్యాలయం స్థానిక దుబ్బగూడ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, ఇతర ఇంజినీరింగ్ శాఖలకు కార్యాలయాలు లేవు. శిథిల భవనాలుమండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలు నిర్వహిస్తున్న భవనాలు శిథిలావస్థలో.. అసౌకర్యాలకు నిలయంగా మారాయి. మండల పరిషత్ కార్యాల య భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా అవి ఎలాంటి ఉపయోగంలోకి రాకుండా పోయా యి. గతేడాది వానాకాలంలో కార్యాలయం వరండా కూలిపోయింది. కూలిపోయిన సమయంలో స మీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వానాకాలంలో గదుల పైకప్పు నుంచి నీరు ఉరుస్తూ ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన భవనం పాఠశాల పైగదిలో ఉండడంతో కార్యాలయానికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులకు గురవుతున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ఉపయోగించే మెట్ల గోడ శిథిలావస్థలో ఉంది. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎలాంటి వసతులు లేక సిబ్బంది, కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి స్పందన లేదునూతన మండలాలను ఏర్పాటు చేసిన తర్వాత మండల కేంద్రాల్లో అన్ని వసతులతో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. నివేదికలు అడగలేదని ఆయా శాఖల అధికా రులు చెబుతున్నారు. అన్ని వసతులతో కూడిన భవనాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘వికాసం’పై కసరత్తు
● జిల్లావ్యాప్తంగా 29,756 దరఖాస్తులు ● కొనసాగుతున్న ఇంటర్వ్యూ ప్రక్రియ ● నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలుబెజ్జూర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు రూ.4లక్షల వరకు ఆర్థికసా యం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆన్లైన్తో పాటు ఎంపీడీవో కార్యాలయంలో ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు గడువు గత నెల 14వ తేదీతో ముగిసింది. అయితే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ని రుద్యోగ యువత నుంచి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న సబ్సిడీ రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన లబ్ధిదారు ల ఎంపికకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధి కారులు ఆ దిశగా దృష్టి సారించారు. మండలాలవారీగా రుణ మంజూరు యూనిట్ల టార్గెట్లను ఖరా రు చేశారు. అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకు ఆదేశించింది. కొనసాగుతున్న ఇంటర్వ్యూలుజిల్లాలోని 15 మండలాల్లో రెండు రోజులుగా రాజీ వ్ యువ వికాసం పథకంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న యువతను బ్యాంక్ మేనేజర్, ఎంపీడీవో, ఎంపీవో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. యువకులకు బాసటగా..రాష్ట్రంలో చదువుకున్న యువత భవిష్యత్ బాగుపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం పకడ్బందీగా అమలు చేస్తే యువతకు బాసటగా నిలవనుందని చెప్పవచ్చు. నిరుద్యోగ యువతను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యు వ వికాసం ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలతో పకడ్బందీగా అమలు చేయడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు.మండలాలవారీగా దరఖాస్తులుమండలం దరఖాస్తుల సంఖ్య బెజ్జూర్ 1,788 ఆసిఫాబాద్ 2,238 ఆసిఫాబాద్ రూరల్ 802 చింతలమానెపల్లి 1,907 దహెగాం 1,500 జైనూర్ 1,860 కాగజ్నగర్టౌన్ 2,633 కాగజ్నగర్రూరల్ 2,853 కెరమెరి 1,761 కౌటాల 2,027 లింగాపూర్ 793 పెంచికల్పేట్ 1,072 రెబ్బెన 2,827 సిర్పూర్(టి) 1,616 సిర్పూర్(యు) 893 తిర్యాణి 1,478 వాంకిడి 1,074 -
భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలి
మందమర్రిరూరల్: భూగర్భ గనులు, ఓపెన్ కాస్టు గనుల్లో విద్యుత్ భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలని సింగరేణి డీడీఎంఎస్(ఎలక్ట్రికల్) రాజీవ్ ఓం ప్రకాశ్వర్మ అన్నారు. శనివారం మందమర్రి ఏరియాలోని కేకేఓసీ, కేకే 5 గనుల్లో నాలుగు రోజులపాటు సాధారణ తనిఖీలు నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ హాలులో ఎలక్ట్రికల్ సేఫ్టీ, సాంకేతిక ఇంటరాక్టివ్ సెషన్లో విద్యుత్ అపాయాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏరియా జీఎం దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ జీఎం సేఫ్టీ రఘుకుమార్, ఎస్వోటు జీఎం విజయ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, ఏఎస్వో రవీందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, కేకే ఓసీపీవో మల్లయ్య, ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ఆర్మీకి మద్దతుగా ఆలయంలో పూజలు
ఆసిఫాబాద్అర్బన్: భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని జిల్లా కేంద్రంలోని కేశవనాథస్వామి ఆలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఒజ్జల నరేశ్ శర్మ, శిరీష్ శర్మ స్వామివారికి గణపతి పూజ, శ్రీదేవి భూదేవి సమేత కేశవనాథ స్వామివారికి పురుషసూక్త అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శత్రుదేశం పాకిస్తాన్పై మన రక్షణ బలగాలు చేపడుతున్న విరోచిత పోరాటానికి 140 కోట్లు ప్రజలు అండగా ఉండాలన్నారు. ఉగ్రవాదం అంతం కావాలని ప్రపంచ దేశాలు భారత్కు మద్దతు ఇవ్వడం శుభ సూచకమన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై.. జై జవాన్.. జై కిసాన్.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైరాగడె మనోజ్, సుగుణాకర్, ఖాండ్రె విశాల్, గంధం శ్రీనివాస్, రవికుమార్ జోషి, శంకర్రావ్, సురేష్చారి, సంతోష్కుమార్, మహిళలు పాల్గొన్నారు. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకే ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ వార్డు నంబర్– 1 ఎస్సీ కాలనీలో శుక్రవారం ఇందిర మ్మ ఇళ్ల జాబితాలోని దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించారు. ఆదాయం, కుటుంబ నేపథ్యం, రేషన్ కార్డు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే విచారించి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. జాబితాలో దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. మొక్కలు సంరక్షించాలిఆసిఫాబాద్రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొ క్కలను సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అడ గ్రామంలో ఏర్పా టు చేసిన నర్సరీని శుక్రవారం డీఆర్డీవో దత్తారా వుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సకాలంలో నీరందించాలన్నారు. పశువులు రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో వార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా వైద్యులు, సిబ్బంది విధులకు గైర్హాజరు కావొద్దన్నారు. గర్భణులను అంబులెన్స్లో తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేశ్, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు. -
గ్రామసభలు బలోపేతం చేస్తాం
● డీపీవో భిక్షపతిగౌడ్ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో మెరుగైన పాలన కోసం గ్రామసభలు బలోపేతం చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. పరి పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహకారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం గ్రామ సభ పాత్ర, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలనను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం, స్వచ్ఛందంగా సమాచారం వెల్లడించడం ద్వారా పారదర్శకతను ప్రోత్సహించడం, ఎన్నికై న ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సాధికారత, బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలు.. ఇతర అంశాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు సమాచార భాగస్వామిగా పంచాయతీ కార్యదర్శి పాత్ర, మహిళా ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించేందుకు సాయం అందించే అంశాలపై చర్చించామన్నారు. కార్యక్రమంలో 35 మంది పంచాయతీ కార్యదర్శులు, రిసోర్స్పర్సన్లు మహేందర్రెడ్డి, సీహెచ్ రుషి, అధికారులు పాల్గొన్నారు. -
ఇక అన్నీ ప్రధాన కేంద్రాలే..
● మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ ● మెయిన్ సెంటర్లుగా మార్పు ● జిల్లాలో పెరగనున్న ఆయాల పోస్టులు ● పీఎం జన్మన్ కింద పీవీటీజీ గ్రామాల్లో మరో 38 కేంద్రాలు వాంకిడి(ఆసిఫాబాద్): చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసింది. అందులో పనిచేస్తున్న వారి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మేజర్ అంగన్వా డీ కేంద్రాలుగా గుర్తించాలని గత కొన్నేళ్లుగా ఆందో ళనలు చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న ల్ ఇవ్వడంతో మినీ అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మినీ సెంటర్లలోని టీచర్లకు రూ.7500 వేతనం చెల్లిస్తుండగా ఇకపై ప్రధాన కేంద్రాల్లోని టీచర్లకు చెల్లిస్తున్న విధంగా రూ.13,650 చొప్పున అందించనున్నారు. 139 కేంద్రాలు అప్గ్రేడ్జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్(టి), జైనూర్, వాంకిడి మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. 973 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 139 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. గతంలో చిన్న కేంద్రాల్లో కేవలం టీచర్లను మాత్రమే నియమించారు. ఆయాలు లేకపోవడంతో టీచర్లే అన్ని పనులు చూసుకునేవారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించడంతోపాటు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వంట చేసి పెట్ట డం, రోజూవారీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం, రిజిస్టర్లు నమోదు చేయడం తదితర పనులు వారికి భారంగా ఉండేవి. గ్రామంలోని ఇళ్లకు తిరుగుతూ పౌష్టికాహారం, తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా గుర్తించాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి జిల్లాలోని 139 మినీ కేంద్రాలు అప్గ్రేడ్ చేసింది. మేజర్ అంగన్వాడీలుగా మారడంతో ఆయాల పోస్టులు సైతం పెరగనున్నాయి. ప్రస్తుతం 126 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 397 ఆయా పోస్టులు ఖాళీ ఉండగా.. మరో 139 పోస్టులు అవసరం కానున్నాయి. ఇకపై అన్ని కేంద్రాలను ఒకే కేటగిరీలో గుర్తించనుండటంతో మినీ కేంద్రాల టీచర్లు సైతం రూ.13,650 వేతనం అందుకోనున్నారు. అద్దె భవనాల్లో నిర్వహణజిల్లాలోని అనేక కేంద్రాలు అద్దె, రెంట్ ఫ్రీ(స్కూల్ బిల్డింగ్స్)ల్లో కొనసాగుతున్నాయి. కొత్త భవనాల నిర్మాణం, మౌలిక సదుపాలయాల కల్పనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు. 352 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా.. 326 కేంద్రాలు పాత స్కూల్ భవనాల్లో నిర్వహిస్తున్నారు. 296 కేంద్రాలకు ఎలాంటి భవనాలు అందుబాటులో లేకపోవడంతో అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు.కొత్తగా 38 కేంద్రాలుపీఎం జన్మన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని పీవీటీజీ గ్రామాల్లో 38 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంబంధిత గ్రామాల్లో భవనాల నిర్మాణం చేపట్టేందుకు స్థలాలు గుర్తించాల్సి ఉంది. తదనంతరం ప్రత్యేక నిధులను కేటాయించి టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో పారదర్శకతతో పాటు అవినీతికి తావులేకుండా ప్రతీ టీచర్కు రూ. 20 వేలు విలువ చేసే ట్యాబ్లు అందజేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాలేదు. పోరాట ఫలితంగానే.. ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం గుర్తించి జీతాలు పెంచింది. భవిష్యత్తులో వీళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. – బోగె ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి139 కేంద్రాలకు ప్రయోజనం జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 139 మినీ సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మినీ కేంద్రాలను అప్గ్రెడ్ చేయడంతో అన్నీ మేజర్ కేంద్రాలుగా మారాయి. వారికి వేతనాలు పెరగడంతో పాటు హెల్పర్ల సదుపాయం కలుగనుంది. జిల్లాలో 139 కేంద్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. – భాస్కర్, ఐసీడీఎస్ పీడీ -
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆసిఫాబాద్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఈ నెల 12న అంతర్జాతీయ నర్సులు దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదన్నారు. స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. శిబిరంలో 15 మంది పాల్గొనగా, 15 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సుల సూపరింటెండెంట్ ఇందుమతి, హెడ్ నర్సులు ఏసుకరణ, సఫియా, కుసుమ, స్టాఫ్ నర్సులు శ్రీదేవి, పద్మ, సృజన, సునీత, సుమిత్ర, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీడీ వ్యాధిగ్రస్తులపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఎన్సీడీ వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సీతారాం అన్నారు. ఎన్సీడీ వ్యాధిగ్రస్తులకు నిర్వహించే పరీక్షలు, వైద్యసేవలపై శుక్రవా రం జిల్లా కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బందికి ప్రోగ్రాం అధికారి వినోద్తో కలిసి అవగాహన క ల్పించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ బాధితులకు క్రమపద్ధతిలో వైద్యం అందించాలన్నారు. సికిల్సెల్ ప్రోగ్రాంలో భాగంగా గిరిజన గ్రామాల్లో స్క్రీనింగ్ నిర్వహించా లని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడాదుస్తులు పంపిణీ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపునకు హాజరైన విద్యార్థులకు శుక్రవారం డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్ క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవి సెలవుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఈ క్యాంపులు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్ హెచ్ఎం జంగు, పీడీ, పీఈటీలు లక్ష్మణ్, పాండు, అరవింద్, రవీందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: గంజాయి నిర్మూలనకు పోలీసు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులకు వేయింగ్ మిషన్లు అందించా రు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలుగా మారినా, గంజాయి సరఫరా, విక్రయించినా వివరాలను 87126 70551, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. ఆసిఫాబాద్ సీఐ బుద్దె రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
అర్హుల పేర్లు మాత్రమే జాబితాలో ఉండాలి
ఆసిఫాబాద్అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితా లో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు పరిధిలో గల బజార్వాడీలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో దరఖాస్తుదారు సాహెరా బేగం ఇంటిని గురువారం స్వయంగా సందర్శించారు. దరఖాస్తుదారు కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకు సొంతింటి స్థలం ఉండాలని, నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. లబ్ధిదారులు ఇంటిని సొంతంగా నిర్మించుకోవాలని, పనులు పూర్తయిన ప్రకారం నిధులు మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా పర్యవేక్షించాలని పరిశీలన అధికారి రాజ్కుమార్ను ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదు
ఆసిఫాబాద్అర్బన్: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఆసిఫాబాద్ ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రెస్క్లబ్ ప్రతినిధులు హెచ్చరించా రు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దౌర్జన్యంపై గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ఆసిఫాబాద్ ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రెస్క్లబ్ ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. సాక్షి ఎడిటర్ నివాసంలో అనుమానితులు ఉన్నారనే నెపంతో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా చట్టవిరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో సో దాలు చేశారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుశాఖ భేషరతుగా జర్నలిస్టులు, సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సాక్షి జిల్లా ప్రతినిధి రామ్మోహన్, రిపోర్టర్ వారణాసి శ్రీనివాస్రావ్, జర్నలిస్టులు దాసరి సురేశ్, వేణుగోపాల్, కృష్ణంరాజు, మీర్ సలీం, రాజు, బిక్కాజీ, ప్రకాశ్గౌడ్, సురేశ్, శ్రీధర్, బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసన -
సాదాబైనామాలే అధికం
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పెంచికల్పేట్ మండలం లోడుపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్దల పోశం. లోడుపల్లి శివారులో ఎకరం భూమికి పాత పట్టా పాసుపుస్తకం ఉంది. నూతన పట్టా పాసు పుస్తకం కోసం ఇటీవల రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్నాడు. పెంచికల్పేట్(సిర్పూర్): భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పెంచికల్పేట్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ఈ నెల 19 వరకు కొనసాగనున్నాయి. భూసమస్యలు పరిష్కరించడానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చేడ్వాయి, దరోగపల్లి, అగర్గూడ గ్రామాల్లో ఇప్పటివరకు మూడు రోజులపాటు సదస్సులు నిర్వహించారు. గురువారం వరకు 174 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా రు. దరఖాస్తుల వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఎక్కువగా సాదాబైనామాల సమస్యలతోనే ప్రజలు వస్తున్నారు. మూడు బృందాల ఏర్పాటుగ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం అధికారులతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో తహసీల్దార్తో పాటు ఆరుగురు సిబ్బందిని నియమించారు. తహసీల్దార్లు వెంకటేశ్వరరావు, కవిత, సురేశ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన సదస్సుల్లో చేడ్వాయి గ్రామంలో 95, జనకపూర్లో 66, అగర్గూడలో 13 దరఖాస్తులు స్వీకరించారు. రైతులు ఎక్కువగా లావుణి పట్టా దరఖాస్తులు, డిజిటల్ సైన్, సాదా బైనామాలు, విరాసత్, నూతన పట్టా పాసుపుస్తకం, విస్తీర్ణంలో మార్పులపై సమస్యలు విన్నవిస్తున్నారు.వ్యవసాయ భూమి విస్తీర్ణం 15,724 ఎకరాలు పైలట్ మండలంగా పెంచికల్పేట్ ఎంపిక ఈ నెల 19 వరకు గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు ఇప్పటివరకు 174 దరఖాస్తులు స్వీకరణ మండలం వివరాలు -
కవి సమ్మేళనంలో రాధాకృష్ణాచారి
ఆసిఫాబాద్అర్బన్: తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆసిఫాబాద్కు చెందిన కవుల సంఘం ప్రచార కార్యదర్శి రాధాకృష్ణాచారి కవితాగానం చేశారు. ప్రముఖ కవులతో ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇలికాల పురుషోత్తం, లక్ష్యసాధన సమితి చైర్మన్ ప్రజ్ఞారాజ్, తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్ తదితరులు రాధాకృష్ణాచారిని శాలువా లు, పూలమాలతో సత్కరించి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు. ఆకసం ప్రతినిధులు శ్రీరాం సత్యనారాయణ, మాడుగుల నారాయణమూర్తి, సభ్యులు గుర్రాల వెంకటేశ్వర్లు, ధర్మపురి వెంకటేశ్వర్లు, తూమోజు సురేష్చారి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.