ఉద్యోగుల కృషికి నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కృషికి నిదర్శనం

Jan 31 2026 7:14 AM | Updated on Jan 31 2026 7:14 AM

ఉద్యోగుల కృషికి నిదర్శనం

ఉద్యోగుల కృషికి నిదర్శనం

రెబ్బెన: రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా చే యడం సీహెచ్‌పీ ఉద్యోగుల కృషికి నిదర్శమని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి సీహెచ్‌పీని సందర్శించి అధికారులు, ఉద్యోగులను శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఒక్కరోజే 24,104 టన్నుల (ఆరు రేకులు) బొగ్గు రవాణా చేయడం అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఏరియా ఇంజినీర్‌ కృష్ణమూర్తి, సీహెచ్‌పీ హెచ్‌వోడీ కోటయ్య, ఇంజినీర్‌ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement