Jogulamba
-
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి ప్రవేశానికి షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జూన్ 1 నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షలు మించరాదన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఎంపిక జూన్ 1న కలెక్టరేట్లో లక్కీడిప్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 94917 67689, 79814 88878 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్గా చంద్రశేఖర్ అలంపూర్: స్థానిక మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్గా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్గా పనిచేసిన శంకర్ ఇటీవల నారాయణపేట జిల్లాకు బదిలీ కావడంతో అయిజ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో అలంపూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. తిరిగి ఇదే మున్సిపాలిటీకి ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. ఐకేపీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు గద్వాల: మండలంలోని తెలుగోనిపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణను పట్టించుకోని ఐకేపీ ఉద్యోగులపై కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ సస్పెన్షన్ వేటు వేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగోనిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కేంద్రం నిర్వహణలో లోపాలను గుర్తించారు. దీంతో వీఏఓ అలివేలు, సీపీ రంగన్నలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని.. కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జూన్ 2 నాటికి పీఆర్సీ అమలుచేయాలి గద్వాలన్యూటౌన్: ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని జూన్ 2వ తేదీ నాటికి అమలుచేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు హెల్త్కార్డులు జూన్1 నాటికి పంపిణీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ. 6వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని.. ఈ మేరకు జీపీఎఫ్, లీవ్ ఎనాన్స్మెంట్, గ్రాట్యూటీలో విశ్రాంత ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం టోకెన్ ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయనను పలువురు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, అసోసియేట్ అధ్యక్షుడు బాలకిషన్రావు, బీసీరెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,511 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 42 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,511, కనిష్టంగా రూ. 6,066, సరాసరి రూ. 6,699 ధరలు లభించాయి. 52 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,049, కనిష్టంగా రూ. 3,119, సరాసరి రూ. 5,949 ధరలు పలికాయి. 566 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,339, కనిష్టంగా రూ. 1,651, సరాసరి రూ. 2,189 ధరలు లభించాయి. -
సకాలంలో వంతెన నిర్మాణం పూర్తి
ఆత్మకూర్: జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు సకాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక నాయకులతో వంతెన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందని, వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల–ఆత్మకూర్ మధ్య రాకపోకలకు సమయంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. వర్షాకాలంలోగా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఏడాదిలోగా వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచి వయా ఆత్మకూర్, గద్వాల, రాయచూరు మీదుగా మంత్రాలయం వెళ్లే వారికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, జిల్లా కార్యదర్శి తులసీరాజ్ యాదవ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, పార్టీ నాయకులు ఉన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ధరూరు/మల్దకల్: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం ధరూరు మండలం మార్లబీడు, మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డి, మద్దెలబండ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి.. లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి సొంతిల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, జంబు రామన్గౌడు, రాజారెడ్డి, విజయ్, సత్యారెడ్డి, సురేందర్రెడ్డి, పెద్దవీరన్న, నారాయణ, రామాంజనేయులు, వెంకటన్న, రంగన్న, శేఖర్ పాల్గొన్నారు. -
పైసలిస్తేనే పని..
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ డబ్బులిస్తేనే పనులు ● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న వైనం ● ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు చిక్కిన వైనం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అవినీతిపై ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే దాడులు చేపడుతున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి. టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. – సీహెచ్ బాలకృష్ణ, డీఎస్పీ, ఏసీబీ, మహబూబ్నగర్ ●సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. చేయి తడిపితేనే పని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏసీబీ వలలో చిక్కి రెడ్హ్యాండెడ్గా పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 మంది పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో నాలుగు నెలల్లోనే ఇప్పటివరకు ఐదుగురు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ శాఖల్లో అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి మార్చి 20న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ ఇసుక ట్రాక్టర్కు మైనింగ్ అధికారులు రూ.60 వేలు ఫైన్ వేశారు. ట్రాక్టర్ను స్టేషన్ నుంచి విడిపించేందుకు ఎస్ఐ రూ.30 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు దాడి చేయగా ఎస్ఐ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అవినీతి అధికారి ఏసీబీకి చిక్కడంతో గ్రామస్తులు రోడ్డుపై టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ అధికారులకు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం కలిగించింది. బర్త్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏప్రిల్ 21న నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదుగురు వ్యక్తులకు చెందిన బర్త్ సర్టిఫికెట్లు జారీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ జారీకి సైతం లంచం తీసుకుంటూ ఏకంగా ఆర్డీఓ అధికారే పట్టుబడటం ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకుని ఉన్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం
● రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గద్వాల మండలం తెలుగోనిపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ఇన్చార్జి గైర్హాజరు కావడం.. మహిళా సంఘాల సభ్యులు లేకపోవడం.. రైతులు ఎండలో గంటల తరబడి వేచి ఉండటాన్ని గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘాల స్థానంలో ఇతరులు వ్యవహారాలు నిర్వహించడాన్ని గమనించి తీవ్రంగా మందలించారు. మహిళా సంఘాల సభ్యులే కొనుగోలు కేంద్రం నిర్వహించాలని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని.. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద ట్యాబ్ ఎంట్రీలు, రిజిస్టర్ల నిర్వహణ లేకపోవడం, మిల్లులను కేటాయించకపోవడం వంటి సమస్యలతో ఓపీఎంఎస్లో తీవ్ర జాప్యం జరిగి, రైతులకు సకాలంలో డబ్బులు రావడం లేదన్నారు. కొన్ని మిల్లులకే అధిక కేటాయింపులు చేసి, మిగిలిన మిల్లులకు సరైన కేటాయింపులు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నప్పటికీ లోపాలను అధిగమించకపోతే ఎలా ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలోనూ అవకతవకలకు చోటు లేకుండా పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎస్డీసీ కృష్ణ, సివిల్ సప్లయ్ డీఎం స్వామికుమార్, మేనేజర్ విమల, డీఏఓ వీరప్ప ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో ఒకరోజు వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఎవరైనా బాల్యవివాహాలకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవనే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతులు చేయడమే కాకుండా మన ఊరు–మన బడిలో మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మెరుగైన పనితీరు కనబరిచే సర్పంచులకు ప్రతి మండలం నుంచి ఐదుగురు చొప్పున ఆగస్టు 15న అవార్డులు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో టాపర్స్గా నిలిచిన వివిధ పాఠశాలల విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, ఇన్చార్జి డీవైఎస్ఓ రామలింగేశ్వర్గౌడ్, డీపీఓ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో రాణించాలి
గద్వాలన్యూటౌన్/మల్దకల్: జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. ఈ నెల 10న హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో అండర్–18 విభాగంలో జిల్లా క్రీడాకారులు దినేష్, రాహుల్ అత్యుత్తమ ప్రతిభకనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. అదే విధంగా మల్దకల్ మండలకేంద్రంలో జములమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. స్థానిక గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీసన్న, ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, సంయుక్త కార్యదర్శి నాగేష్, కార్యదర్శి సతీష్కుమార్, సర్పంచ్ చిట్టెమ్మ, శ్రీధర్గౌడ్, రాజారెడ్డి, విక్రమ్సింహారెడ్డి, ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు పాల్గొన్నారు. -
ఇరవై రోజులుగా మంచి ధరలు..
బత్తాయి రైతులు మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు పొందలేదు. ఈఏడాదిలో మాత్రం వస్తున్న ధరలతో ఊరట చెందుతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి రైతులు కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏప్రిల్ మొదటి వారంలో టన్నుకు రూ. 18వేల నుంచి రూ. 20వేల ధర రాగా.. రెండో వారం నుంచి కాస్త పెరిగి, రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు ధర వచ్చింది. మూడు, నాలుగో వారంలో మరింత పెరిగాయి. ఆ తర్వాత రూ. 25వేల నుంచి రూ. 35వేల వరకు చేరింది. ఈ నెలలో మార్కెట్లో మరోసారి ధరలు పెరిగాయి. ఈ నెలలో కాయసైజు, నాణ్యత బాగా ఉంటే టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 55వేల వరకు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ధరలు బత్తాయి రైతుకు ఊరటనిస్తున్నాయి. టన్నుకు కనీసం రూ. 30వేల నుంచి రూ. 35వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. ఇదిలా ఉంటే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున బత్తాయికి డిమాండ్ పెరిగి.. మంచి ధరలు వస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
మంచి ధర వచ్చింది..
నాకు రెండున్నర ఎకరాల బత్తాయి తోట ఉంది. అధిక ఉష్ణోగ్రతలతో కాయ పెద్దగా ఊరలేదు. కొద్ది రోజుల క్రితం కాయలు విక్రయించాను. టన్నుకు రూ. 35వేల వరకు ధర వచ్చింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి ధరలు బాగా వస్తున్నాయి. – మనోహర్రెడ్డి, రైతు, షాబాద్, ఇటిక్యాల మండలం మార్కెట్లో డిమాండ్.. జిల్లాలో కొన్ని చోట్ల మినహాయిస్తే, చాలా చోట్ల బత్తాయి దిగుబడులు బాగా వచ్చాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి మార్కెట్లో మంచి ధరలు వస్తున్నాయి. ఈ నెలలో బత్తాయికి డిమాండ్ బాగా పెరగడం వల్ల ధరలు ఎక్కువగా వస్తున్నాయి. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా: ఎస్పీ
అలంపూర్: ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై పోలీసు సిబ్బంది పటిష్ట నిఘా ఉంచాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన సరిహద్దు చెక్పోస్టుతో పాటు ఎర్రవల్లి చెక్పోస్టును సోమవారం అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. వాహనాల పత్రాలు, పశువుల రవాణాకు సంబంధించిన అనుమతులు, డ్రైవర్ల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాను నియంత్రించడానికి జిల్లా సరిహద్దుల్లోని బల్గేర, నందిన్నె, ఇర్కిచేడు, సుంకేసుల డ్యామ్, భైరాపురం, పుల్లూరు టోల్ప్లాజా, ఎర్రవల్లి చౌరస్తా వద్ద చెక్పోస్టులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎవరైనా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పశువుల రవాణాకు సంబంధించి తప్పనిసరిగా అనుమతి పత్రాలు, కొనుగోలు రశీదులు, వెటర్నరీ ధ్రువపత్రాలు ఉండాలని సూచించారు. రవాణాలో పశువులపై క్రూరత్వం ప్రదర్శించినా, నిబంధనలకు విరుద్ధంగా తరలించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జంతు సంరక్షణ చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవడం.. గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చెక్పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణను పకడ్బందీగా కొనసాగించాలని ఎస్పీ అదేశించారు. ఆయన వెంట డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్, ఎస్ఐ శేఖర్ ఉన్నారు. -
కదిలిన యంత్రాంగం..
రాజోళి: ‘‘రైతుల కడుపుకొట్టి వ్యాపారుల కడుపు నింపుతారా..? రైతు పేరుతో వచ్చి రైతుల నోటికాడి కూడు నేల పడేస్తారా.?’’ ఇవి సాక్ష్యాత్తు వ్యవసాయశాఖ, డీసీఎస్ కార్యాలయ అధికారుల మాటలు. ‘వ్యాపారులకే మద్దతు’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు కదిలారు. మంగళవారం శాంతినగర్ పీఏసీఎస్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారి రాధ, డీసీఎస్ కార్యాలయ ఆడిటర్ విశ్వకర్మ ఆచారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి రైతులకు వ్యవసాయశాఖ నుంచి జారీ చేసిన టోకెన్లు.. పీఏసీఎస్ నుంచి అందిన లోడింగ్ అనుమతులను పరిశీలించారు. రికార్డుల్లో చేర్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆన్లైన్లో పంటల నమోదును పరిశీలించారు. రాత్రి సమయంలో ముద్రలు వేసి, బస్తాలను అన్లోడు చేసిన రామాపురం గ్రామవాసులను వారు విచారించారు. తాము హైదరాబాద్లో ఉంటామని.. అందుకే ధాన్యం అమ్ముకోలేదని వారు తెలియజేశారు. అయినప్పటికీ రాత్రివేళ నిండు బస్తాలకు ముద్రలు వేయడం ఏంటని అధికారులు ఆరా తీశారు. అక్కడి నుంచి వారు చెబుతున్న పొలం వద్ద వెళ్లి, అక్కడ మొక్కజొన్న సాగు చేశారా? లేదా అనే విషయంపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఇంకా ఎవరైనా అక్రమంగా మొక్కజొన్నల వ్యాపారం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై విచారణ మొదలైందని.. నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారుల విచారణ ముగిసే వరకు మొక్కజొన్న లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అక్రమ దందా ఇలా.. కర్నూలు జిల్లా సుంకేసులకు చెందిన ఓ వ్యాపారి శాంతినగర్కు చెందిన కొందరితో సత్సంబంధాలు సాగిస్తున్నాడు. ఇదే అదునుగా ఏపీలో సేకరించిన మొక్కజొన్నలను శాంతినగర్కు పంపించగా.. ఇక్కడ వారు ఓ ధరకు కొనుగోలు చేయడం.. పట్టాదారు పాస్పుస్తకాల ఆధారంగా ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తూ వస్తున్నారు. కాగా, ఈ వ్యాపారంలో సహకరిస్తున్న కూలీలను ‘సాక్షి’ సంప్రదించగా.. సుంకేసులకు చెందిన ఒకరి పేరు, రామాపురం, శాంతిగనర్కు చెందిన కొందరి పేర్లను తెలిపారు. వారితో ‘సాక్షి’ మాట్లాడే ప్రయత్నం చేయగా.. సుంకేసులకు చెందిన వ్యాపారి శాంతినగర్కు చెందిన ఒక వ్యక్తితో డబ్బుల పని ఉండి వచ్చానని చెప్పాడు. ఆయన చెప్పిన వ్యక్తితో మాట్లాడగా.. సుంకేసులకు చెందిన వ్యాపారితో మొక్కజొన్నల వ్యాపారం చేస్తున్నానని.. కొనుగోలు కేంద్రాలు మొదలైనప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నామని.. లాభం వస్తే ఎక్కడైనా అమ్ముకుంటామని దర్జాగా చెప్పడం గమనార్హం. ఇలా దర్జాగా తమ వ్యాపారం చేసుకుంటున్నారంటే, వారి వెనక ఉన్న అధికారులు వారికి ఎంత అభయం ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా రాజకీయ నాయకులు ఎవరూ నోరు మెదపడం లేదనే వాదన ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. మొత్తానికి ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు.. బాధ్యులపై ఏ చర్యలు చేపడతారనే దానిపై వేచి చూడాలి. మొక్కజొన్న దందాపై విచారణ పీఏసీఎస్ రికార్డుల నుంచి రైతుల పొలందాక పరిశీలన లెక్క తేలే వరకు కదలని మొక్కజొన్న లారీలు సుంకేసులకు చెందిన వ్యాపారే కీలక సూత్రధారి? -
మండలాల వారీగా బత్తాయి సాగు ఇలా (ఎకరాల్లో)..
మూడేళ్ల తర్వాత మార్కెట్లో మంచి ధరలు ● అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన డిమాండ్ ● ఈసారి దిగుబడులు తగ్గినా రైతులకు ఊరట ● జిల్లావ్యాప్తంగా 8,481 ఎకరాల్లో బత్తాయి సాగుమల్దకల్ 3,276 అయిజ 608ధరూరు 1,364గద్వాల 798గట్టు 1,557 ఇటిక్యాల 262కేటీదొడ్డి 308రాజోళి 121వడ్డేపల్లి 68ఎర్రవల్లి 93అలంపూర్ 10మానవపాడు 3ఉండవల్లి 13గద్వాల వ్యవసాయం: బత్తాయి తోటల రైతులకు ఈసారి కాస్త కలిసొచ్చింది. జిల్లాలో కొంత వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గినా.. కొన్ని రోజులుగా వస్తున్న ధరలు ఊరటనిస్తున్నాయి. మూడేళ్లుగా బత్తాయి పండ్లకు పెద్దగా ధరలు రాలేదు. దీంతో కొంత నిరాశ నిస్పృహాల్లో ఉన్న రైతులకు ఇరవై రోజులుగా మంచి ధరలు వస్తుండటంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఇలా.. పండ్లతోటల సాగుకు నడిగడ్డలో నేలలు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు కూడా సాధారణంగా బాగుంటాయి. ఇక్కడి రైతులు 15ఏళ్లుగా బోర్లు, బావుల కింద పండ్లతోటలు సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 8,481 ఎకరాల్లో బత్తాయి తోటలు వేశారు. అందులో ఎక్కువగా జంబేరీ, రంగాపూర్ రకాలను సాగుచేశారు. ఈ తోటల సాగు కోసం ఎకరాకు రూ. 18వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు అవుతుంది. ఏటా రెండుసార్లు కాపు వస్తుంది. ఏప్రిల్, మే నెలలో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్లో రెండోసారి కాపు వస్తుంది. వాతావరణ పరిస్థితులు మంచిగా అనుకూలిస్తే, ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే మిగిలిన పండ్ల తోటలతో పోల్చితే బత్తాయి తోటలకు పెట్టుబడులు ఎక్కువే. అదే సమయంలో నిర్వహణ కూడా ఎక్కువగానే ఉంటుంది. -
బీచుపల్లిలో మార్మోగిన అంజన్న నామస్మరణ
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలో మంగళవారం అంజన్న నామస్మరణ మార్మోగింది. హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,299 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 15 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,299, కనిష్టంగా రూ. 7,071 ధర పలికింది. అదే విధంగా 70 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,429, సరాసరి రూ. 5,879 ధరలు లభించాయి. 976 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,294, కనిష్టంగా రూ. 1,889, సరాసరి రూ. 2,001 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,421, కనిష్టంగా రూ. 6,389 ధర పలికింది. స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా హౌస్ వైరింగ్, బైక్ మెకానిక్ రంగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 99633 69361, 98481 42489లను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం జడ్చర్ల: జడ్చర్లలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థలో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, హోం అప్లియెన్సెస్ కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సెట్విన్ కోఆర్డినేటర్ విజయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18– 35 ఏళ్లలోపు మైనార్టీ ముస్లిం యువతీ, యువకులు మాత్రమే ఆధార్, 10వ తరగతి సర్టిఫికెట్, రెండు ఫొటోలతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.94415 65895ను సంప్రదించాలని పేర్కొన్నారు. అధిక మోతాదులో యూరియా వాడొద్దు వనపర్తి రూరల్: అధిక మోతాదులో యూరియా వినియోగించడంతో నేల సారం తగ్గడంతో పాటు పంటల నాణ్యత దెబ్బతింటుందని ఆగ్రోనామి శాస్త్రవేత డా. నవత అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లి రైతువేదికలో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆమె హాజరై రసాయన ఎరువులపై రైతులకు అవగాహన కల్పించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ఉత్తమమని సూచించారు. ఎరువులు, పురుగు మందులు సరైన మోతాదులో, సరైన సమయంలో వాడాలని, ఇది పంటల నాణ్యతను పెంచడంతో పాటు సాగు ఖర్చు తగ్గిస్తుందన్నారు. ఏఓ షేక్ మున్నా మాట్లాడుతూ.. వివిధ రకాల పంటలు సాగు చేయడంతో రైతులకు ఆదాయం స్థిరంగా ఉంటుందని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలను ఎంపిక చేసుకోవడంతో మెరుగైన ధర వస్తుందని తెలిపారు. భూ సారం పెంపొందించేందుకు జీలుగ, జనుము సాగుచేసి పూత దశలో భూమిలో కలియ దున్నాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ రజిత, రైతులు రామచంద్రారెడ్డి, జగదీశ్వర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● లాభదాయక పంటల సాగుపైఅవగాహన కల్పించాలి ● కేంద్ర వ్యవసాయశాఖ నోడల్ అధికారి రఘు గద్వాల/ఎర్రవల్లి: ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంతో రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు అభివృద్ధి సాధించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర వ్యవసాయశాఖ (పీఎంఓ) నోడల్ అధికారి రఘు అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన కేవలం గణాంకాలు, లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా.. రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు, పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, నేల ఆరోగ్య సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్పామ్, పప్పుధాన్యాలు, ఉద్యాన, అంతర పంటల సాగువైపు దృష్టిసారించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, సహకార వ్యవస్థ ద్వారా మరింత రుణసౌకర్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, మొక్కలు, ఎరువులు, సూక్ష్మ నీటిపారుదల సదుపాయాలు, రుణాలు, సాంకేతిక సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ● ఎర్రవల్లి మండలం తిమ్మాపురం, కొండేరు, జింకలపల్లి గ్రామాల్లో కేంద్ర నోడల్ అధికారి రఘు పర్యటించి.. రైతుల చేపల చెరువులను పరిశీలించారు. బీచుపల్లిలో తెలంగాణ ఆయిల్పామ్ నర్సరీని సందర్శించి, జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం, రైతులకు లభిస్తున్న ఆదాయం వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా కొండేరు శివారులో సాగుచేసిన కూరగాయల తోటలను ఆయన పరిశీలించి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అమలవుతున్న పథకాలు, రుణ సదుపాయాలు, ఈ ప్రాంత మౌలిక వసతులు, తదితర విషయాలపై రైతులతో ఆరా తీశారు. కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. వైవిధ్యమైన పంటల సాగుతో రైతులు మెరుగైన ఆదాయం సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని అమలు చేస్తోందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీకాంత్, డీఏఓ వీరప్ప, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్, ఆయిల్ఫెడ్ ఏడీఏ శివనాగిరెడ్డి, డివిజినల్ ఉద్యానశాఖ అధికారులు రాజశేఖర్, ఇమ్రానా, ముసాయిదాబేగం, ఏఓ సురేశ్గౌడ్, ఏఈఓలు నరేశ్, ప్రవళిక, సర్పంచ్ పెద్ద మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం సేకరణ
ఎర్రవల్లి: వరిధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండలం తిమ్మాపురంలోని ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. ధాన్యంలో తేమశాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్ఫాలిన్లు, గన్నీబ్యాగులపై ఆరా తీశారు. నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా వివరాలను తెలుసుకున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఐకేపీ డీపీఎం విమల, ఏఈఓ నరేశ్ ఉన్నారు. -
ఆత్మబంధువులు
● నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం ● ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో కీలక విధుల నిర్వహణ ఆస్పత్రుల్లో అభాగ్యులకు అండగా నిలుస్తున్న నర్సులు ● పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్లో 59, సెకండియర్లో 58, థర్డ్ ఇయర్లో 57, ఫోర్త్ ఇయర్లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్ఎమ్లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్హెచ్ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. ● నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం -
వ్యాపారులకే మద్దతు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారుల అజమాయిషీ రాజోళి: ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి.. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. అయితే కొందరు అవినీతి అధికారుల మూలంగా ఆ ప్రయోజనాలు రైతులకు చెందకుండా.. వ్యాపారులకు ‘మద్దతు’ దక్కుతుందనే వాదనలు వెల్లువెత్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు రైతుల కోసం పెట్టినప్పటికీ.. అక్కడ నడిచే పెత్తనం అంతా ప్రైవేట్ వ్యాపారులదే కావడంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీ నుంచి వస్తున్న వ్యాపారస్తులే తమ ధాన్యాన్ని యథేచ్ఛగా అమ్ముకొని.. ప్రభుత్వ మద్దతు ధర పొందుతున్నారని, ఇక్కడి రైతులు మాత్రం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి దాపురిస్తోంది. అధికారికంగా అక్రమ లోడింగ్.. ఏపీ నుంచి మొక్కజొన్న ధాన్యం తీసుకువచ్చి శాంతిగనర్, మాన్దొడ్డి తదితర ప్రాంతాల్లో వారికి అనుకూలంగా ఉన్న కేంద్రాల్లోకి ధాన్యం తీసుకువస్తున్నారు. ఇలా తీసుకువచ్చేందుకు స్థానికంగా ఉన్న ఏజెంట్లు సహకరిస్తున్నారు. ఏజెంట్లు తమ పాసు పుస్తకాలతోపాటు తమకు తెలిసిన వారి పాసు పుస్తకాల పేరిట పీఏసీఎస్ల నుంచి టోకెన్లు తీసుకుంటున్నారు. వీటిని ఆసరాగా చేసుకుని ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలోని సుంకేసుల, కొత్తకోట తదిదర గ్రామాల నుంచి వ్యాపారుల ధాన్యాన్ని ఇక్కడికి తరలిస్తున్నారు. ఎవరైనా వాహనాలు ఆపుతారనే నెపంతో, దీని కోసం ప్రత్యేకంగా రైతులను తీసుకెళ్లి వారి పాసు పుస్తకాలను చూపుతూ వాహనాలను కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక్కడి అమా యక రైతులు మాత్రం తమ ధాన్యం సేకరించే వంతు ఇంకా రాలేదని, అక్కడే పడిగాపులు కాస్తున్నారు. తమ వెనుక వచ్చిన ధాన్యం కూడా లోడ్ అవుతుందని, తమకు మాత్రం ఇంకా టోకెన్ నంబర్ రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొత్త దారుల్లో రవాణా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సందర్భంలో ఏఎస్పీ శంకర్ చెక్పోస్టులను పరిశీలించి నిఘా పటిష్టం చేయాలని ఆదేశించారు. దీంతో అక్రమ వ్యాపారులకు తమ రవాణా ఆగుతుందని కొత్తదారులు వెతికారు. అలంపూర్ నియోజకవర్గంలో కొత్తగా వేస్తున్న ఆరు లైన్ల జాతీయ రహదారిపై దందా సాగిస్తున్నారు. ఇప్పటికే ఆ రహదారి పనులు దాదాపు పూర్తికావడంతోపాటు కొన్ని చోట్ల సర్వీస్ రోడ్డు, రైతుల పంటలకు వెళ్లేందుకు వేసిన రోడ్లు ఉండటంతో వాటిని ఆసరాగా చేసుకుని లారీలు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో ధాన్యం తీసుకువచ్చి జిల్లాలోని వివిధ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సైతం ఏపీ నుంచి తెచ్చిన ధాన్యాన్ని శాంతిగనర్ కొనుగోలు కేంద్రంలో అన్లోడ్ చేశారు. కానీ, లోడ్ ఎక్కడి నుంచి వస్తుందనే పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులే బాగుపడుతున్నారని, రైతులు నష్టపోతున్నారని, ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరినీ వదిలిపెట్టం.. అక్రమంగా వ్యాపారులు తీసుకువచ్చే ధాన్యం అమ్మి, రైతులను నష్టపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. టోకెన్ నంబర్లు కూడా మారుస్తున్నారని తెలుస్తుంది. దానిపై మాకు స్పష్టత రాగానే మా సిబ్బంది అని కూడా చూడకుండా ఎవరినీ వదిలిపెట్టం. శాంతిగనర్లో ఏపీ నుంచి ధాన్యం తెస్తున్న వ్యాపారులతో సిబ్బంది సంబంధాలపై ఆరా తీస్తున్నాం. – శ్రీనివాస్, డీసీఎస్, గద్వాల రాత్రి, పగలు తేడా లేకుండా లోడింగ్, అన్లోడింగ్ చెక్పోస్టుల కన్నుగప్పి కొత్తదారుల్లో ధాన్యం తరలింపు వరి, మొక్కజొన్న కొనుగోలులో చేతులు మారుతున్న కమీషన్లు స్థానిక రైతులకు మాత్రం తప్పని పడిగాపులు -
ధాన్యం బస్తాలను తక్షణమే తరలించాలి
అలంపూర్: కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న ధాన్యం బస్తాలను తక్షణమే తరలించాలని ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాల ముప్పు ఉందని తెలిసాన కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో రైతులు తెచ్చిన ధాన్యం తూకాలు వేసి కొనుగోళ్లు చేయడం లేదన్నారు. కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను తరలించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సీఎం రేవంత్రెడ్డి తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనీసం రైతుల బాధలు పట్టించుకోని దుస్థితి ఉందన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం కేంద్రాల్లోని ధాన్యం తరలించాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గజేందర్రెడ్డి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం
గద్వాల: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యా వారోత్సవాలను కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులతోపాటు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ● జనగణన–2027లో భాగంగా గద్వాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఇళ్ల నమోదు (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఎన్యూమరేటర్ తమకు కేటాయించిన సరిహద్దులోని ఇళ్లను కవర్ చేస్తూ మూడు రోజుల్లో మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్లో ఇంటి నంబర్లు స్పష్టంగా నమోదు చేయాలని రోజుకు కనీసం 20 ఇళ్లను సందర్శించాలని చెప్పారు. ● ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా మండల స్ధాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్బాష షేక్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్తో కలిసి మొత్తం 69 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అర్జీలు స్వీకరించిన ఎస్పీ గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 13 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వారి సమస్యలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే సివిల్ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సకాలంలో ధాన్యం డబ్బుల చెల్లింపు చేపట్టాలి ఎర్రవల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లింపులు చేయాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి స్వామికుమార్ అన్నారు. సోమవారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంత మంది రైతులతో ఎంత ధాన్యం సేకరించారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని చూసి సెంటర్లో తేమ శాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్పాలిన్లు, గన్నీ సంచుల వివరాలపై ఆరాతీశారు. రైతుల సాగు ధ్రువీకరణకు సంబంధించి కేంద్రం పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇచ్చే టోకెన్లు పరిశీలించారు. నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేశాక వివరాలను యాప్లో ఎప్పటికప్పుడూ నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఐకేపీ డీపీఎం విమల, తహసీల్దార్ నరేష్, ఏఈఓ నరేష్ తదితరులున్నారు. విద్యతోపాటు నైపుణ్యాలు పెంచుకోవాలి గద్వాల న్యూటౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు చదువుతోపాటు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని ప్రిన్సిపాల్ మీనాక్షి అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం స్థానిక ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్య వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ ట్రైనింగ్, నైపుణ్యాభివృద్ధిపై మ్యాజిక్ ఫౌండేషన్తో కళాశాల ఎంఓయూ కుదుర్చుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మ్యాజిక్ ఫౌండేషన్తో కుదిరిన ఒప్పందం ద్వారా విద్యార్థినులకు ప్రత్యేక జాబ్ శిక్షణ, నైపుణ్యాభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మ్యాజిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ఆఫీసర్ ఎండీ ఫయాజ్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్, అధ్యాపకులు సురేష్బాబు, దేవుజా, జగన్మోహన్, సమత పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాకారం
ధరూరు: గ్రామీణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని లక్ష్మీనాగరాజు నూతన ఇందిరమ్మ ఇంటిని ఆయన సర్పంచు విజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ అనేవి కీలకమైనవన్నారు. దశాబ్దాల తరబడి సొంతిళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో శుభ పరిణామమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు చేయగా.. ఇప్పటికే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో జాబితా వస్తుందని, ఇందులో ఇళ్లు వచ్చిన వారు కూడా ఇల్లు త్వరగా నిర్మించుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, సర్పంచు విజయ్కుమార్, మాజీ సర్పంచు శ్రీనివాస్రెడ్డి, నాయకులు సంజీవ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఒక ప్రమాదం.. 2 కుటుంబాల్లో విషాదం
మహబూబ్నగర్ క్రైం: పాలకొండ బైపాస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్ రైడర్ అతివేగంతో నగరంలోని రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. న్యూ ప్రేమ్నగర్కు చెందిన మహ్మద్ బాసిద్ భార్య సారాబేగం ఇద్దరు పిల్లలతోపాటు రబియా మజీద్ ఏరియాకు చెందిన సారాబేగం తల్లి గౌసి యాబేగం ఆమె కోడలు రేష్మా ఖాతూమ్, ఇద్దరు మనవలతో కలిసి యూబీ గార్డెన్లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ రెండు కుటుంబాలు శుభకార్యం పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్ర మంలో బైకర్ రూపంలో వచ్చిన ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ప్రేమ్నగర్తో పాటు రబియా మజీద్ ఏరియా (మర్లు)లో విషాదచాయలు అలుముకున్నాయి. అటు మహ్మద్ బాసిద్ కుటుంబంలో బాసిత్తో పాటు అతని ఏడేళ్ల కొడుకు మహ్మద్ జైద్ గాయపడ్డారు. భార్య సారా బేగం(30), కొడుకు హుజేఫా(9) మృతి చెందారు. ఇటు గౌషియా బేగం, ఆమె కొడలు రేష్మా ఖాతూ మ్, నాలుగేళ్ల మనవడు మహ్మద్ జమాద్ద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. మరో రెండేళ్ల మనవడు మహ్మద్ హమ్మర్ మృతి చెందాడు. ఇటీవల దుబాయ్ వెళ్లిన హమ్మర్ తండ్రి మహ్మద్ ఇమ్రాన్ వెంటనే ఇండియాకు బయల్దేరాడు. ప్రమాద విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు సోమవారం జనరల్ ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. ఇద్దరూ స్నేహితులే.. ఈ ఘటనలో మృతి చెందిన బైకర్లు హైదరాబాద్లోని చార్మినార్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఒవైజ్(30), మెహదీపట్నంకు చెందిన ఎండీ యాకూబ్ అబ్జల్(26) ఇద్దరూ స్నేహితులే. ఆదివారం రాత్రి మహబూబ్నగర్లోని మెట్రో ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి మరికొంతమంది స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి స్పోర్ట్స్ బైక్లపై మహబూబ్నగర్కు వచ్చారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుంటే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బైక్ రిజిస్ట్రేషన్ మాత్రం హర్యాన పాసింగ్ ఉండటం విశేషం. వీరితో పాటు వచ్చిన ఇతర బైకర్లు ఎవరు? ప్రమాదం జరిగిన తర్వాత వారు ఎటూ వెళ్లారు అనేది మహబూబ్నగర్ పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మృతదేహలను జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగిన తీరుతో పాటు ఇతర అంశాలను అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీసీఎస్ సీఐ కృష్ణ, రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ పర్యవేక్షించి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పాలమూరు బైపాస్పై ప్రమాదం..ఐదుగురి దుర్మరణం మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ప్రేమ్నగర్, రబియా మజీద్ ఏరియాలో విషాదం -
అభివృద్ధి వైపు.. పీయూ
యూనివర్సిటీలో రూ.113 కోట్లతో కొనసాగుతున్న పనులు ● శరవేగంగా నూతన భవనాల నిర్మాణాలు ● ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ● సీవేజ్ వాటర్ ట్రీట్మెట్ ప్లాంట్, సింథటిక్ ట్రాక్ గ్యాలరీ ● ప్రారంభమైన లా, ఇంజినీరింగ్ కళాశాల భవనాలు ఎమ్మెల్యేను సన్మానిస్తున్న పీఏసీఎస్ అధ్యక్షుడు మద్దిలేటి పీయూలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో పలు కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి. పలు హాస్టళ్లు, లా, ఇంజినీరింగ్ కళాశాలల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎస్టీ పీ ప్లాంట్, సింథటిక్ ట్రాక్ గ్యాలరీ కూడా పూర్తయ్యాయి. పీయూను గొప్ప యూనిర్సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఇలా.. నిధులు (రూ.కోట్లలో..) నిర్మాణం పూర్తి చేసుకున్న పీయూ సింథటిక్ ట్రాక్ గ్యాలరీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. పలు అభివృద్ధి పనులకు అటు ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీ అంతర్గత నిధులు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతంగా ఏకంగా రూ.113.63 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో పలు నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా.. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండగా.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం వరకు పలు భవనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లా, ఇంజినీరింగ్ కళాశాలల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో పీయూ కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తుండటంతో విద్యార్థులకు వసతి సమస్య తీరనుంది. దక్షిణ తెలంగాణకు రీసెర్చ్ హబ్గా.. పీఎం ఉషా స్కీం ద్వారా రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని రూ.13.50 కోట్లతో నిర్మించారు. ఇది దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద రీసెర్చి హబ్గా అవతరించనుంది. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. దీని ద్వారా పీయూలోని అన్ని డిపార్ట్మెంట్లకు ఒక్కో రీసెర్చ్ ల్యాబ్ను కేటాయించనున్నారు. ముఖ్యంగా సైన్స్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉషా స్కీం నుంచి రూ.కోట్లు వెచ్చించి మైక్రోస్కోప్, స్పెక్రోస్కోప్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలుకు సైతం ఇప్పటికే టెండర్లు పిలిచారు. తీరనున్న హాస్టల్ సమస్యలు... యూనివర్సిటీలో మొత్తం 13 కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో సీట్లు సరిపోకపోవడంతో విద్యార్థి అడ్రస్ నుంచి ఉన్న దూరం ఆధారంగా సీట్ల కేటాయింపులు చేస్తున్నారు. వీటికి తోడు లా, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా కొత్తగా రావడంతో ఇక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న పాత బాలబాలికల హాస్టళ్లలోనే వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కళాశాలలకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుండటంతో పీయూలో ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తున్నారు. రెండు హాస్టళ్లు యూనివర్సిటీ ద్వారానే నిర్మిస్తుండగా ఒక బాలిక, ఒక బాలుర హాస్టల్స్ను ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు వీటితో సీట్లు రెట్టింపు కానున్నాయి. బాలుర హాస్టల్ 12.50 రీసెర్చి ఫెసిలిటీ భవనం 13.50ఎస్టీ బాలుర హాస్టల్ 10 బాలికల హాస్టల్ 12.50 ఎస్టీ బాలికల హాస్టల్ 10లా కళాశాల 10 సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5 ఇంజినీరింగ్ కళాశాల 35 సింథటిక్ ట్రాక్లో టైల్స్వర్స్ 0.53సింథటిక్ ట్రాక్ గ్యాలరీ 4.60 పీయూలో సాధారణ భవనాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీయూలో హాస్టళ్లు, ఆఫీస్ల నుంచి వృథాగా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో ఫిల్టర్ చేసి తిరిగి వినియోగించేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా నీటి వృథా అరికట్టడంతోపాటు నీటి ఎద్దడి, డ్రెయినేజీ సమస్య కూడా తీరనుంది. న్యాక్ గ్రేడింగ్లో కూడా దీనికి మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్న ఏకై క సింథటిక్ ట్రాక్ పీయూలో మాత్రమే అందుబాటులో ఉండగా దానికి గ్యాలరీ నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. దీని నిర్మాణం కోసం అధికారులు రూ.4.60 కోట్లు వెచ్చించారు. -
విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలి
అలంపూర్: విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలని విద్యాశాఖ అధికారులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడును నియోజకవర్గంలోని మండల విద్యా శాఖ అధికారులు ఆదివారం కలిసి విద్యా వారోత్సవాలకు ఆహ్వానం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి శనివారం వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీయడం, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. విద్యా వారోత్సవాల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేక అంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారులు అశోక్కుమార్, భగీరథరెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి పాన్గల్: పండుగలు శాంతియుతంగా జరుపుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆదివారం మండలంలోని మాందాపూర్లో వీరభద్రుడి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోజువారి పనులతో పాటు కొంత సమయం దైవ భక్తికి కేటాయించాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అంతకుముందు మంత్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పోటీలకు ఆర్థిక తోడ్పాటునందించిన మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు కృష్ణయ్యసాగర్, జయరాములుసాగర్, కమిటీ సభ్యులు కుపేందర్రెడ్డి, పరమేష్, మహేష్, నర్సింహరాజు, భగవంతు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని మంత్రి జూపల్లి లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో సర్పంచ్ సుగుణమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. కొత్త కోర్సుల్లో చేరండి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఇటీవలి తీసుకువచ్చిన కొత్త కోర్సుల్లో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి పేర్కొన్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలలో ఇటీవల బీకాంలో బీఎఫ్ఎస్ఐ, బీబీఏలో రీటైల్ ఆపరేషన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, హెల్త్కేర్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుందని, వివిధ కంపెనీల్లో పని చేయడం ద్వారా అనుభవంతో పాటు వేతనం కూడా పొందవచ్చని వివరించారు. ఎంవీఎస్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు, ఎన్ఎసీసీ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. వివిధ కోర్సులకు సంబంధించి దోస్తు అడ్మిషన్లలో మొదటి ఆప్షన్గా ఎంవీఎస్ కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, సత్యనారాయణ, మంజూల, సూర్యనారాయణ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
మక్క రైతుల అరిగోస
అయిజ: రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరపున అయిజలో కొనుగోలు కేంద్రం గతనెల 9న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెలరోజులు గడిచినా ఇప్పటి వరకు రైతులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ముందుగా గన్నీ బ్యాగుల కొరత ఏర్పడటంతో రైతులే గన్నీ బ్యాగులను తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పడు హమాలీల కొరత మరో సమస్యగా మారింది. దీంతో మొ క్కజొన్న కొనుగోలు కేంద్రంకు తరలించి 15 రోజు లు గడిచినా కాంటా వేసిన మొక్కజొన్న బస్తాలను ఇప్పటి వరకు గోదాంకు తరలించకపోవడంతో రైతు లు బస్తాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు అయిజ– గద్వాల రోడ్డుపై ధర్నా చేసినా వారిలో చలనం రావడం లేదు. రైతులే తెచ్చుకోవాలి.. రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రైతులే గన్నీ బ్యాగులను తెచ్చుకోవాలని మార్క్ఫెడ్ అధికారులు సూచించారు. అప్పటి నుంచి రైతులు సొంత డబ్బుతో గన్నీ బ్యాగులను ఒక్కొక్కటి రూ.25 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చేది మాత్రం ఒక్కొక్క బ్యాగ్కు రూ.15 మాత్రమే. ఈ లెక్కన ఒక్కొక్క బ్యాగుపై రైతు రూ.10 చొప్పున నష్టపోతున్నాడు. హమాలీల కొరుత... ప్రతిరోజు కొనుగోలు కేంద్రానికి వందల క్వింటాళ్ల మొక్కజొన్న బస్తాలను రైతులు తరలిస్తున్నారు. అయితే హమాలీల కొరత వలన వచ్చిన దాంట్లో సగం కూడా గోదాంలకు తరలించడం లేదు. బస్తాల్లో నింపి, కాంటా వేసి, లోడింగ్ చేసేందుకు రైతు హమాలీలకు 50 కిలోల బస్తాకు రూ.30 చొప్పున చెల్లిస్తున్నాడు. అయితే గోదాంల వద్ద అన్లోడ్ చేసేందుకు ప్రభుత్వం ఒక్కొక్క బస్తాకు రూ.6.50 మాత్రమే చెల్లిస్తుండడంతో హమాలీలు బస్తాలను అన్లోడ్ చేయడానికి విముఖత చూపుతున్నారు. దీంతో ట్రాన్స్పోర్ట్ లారీలు గోదాంల వద్ద రెండు మూడు రోజులు ఆగాల్సి వస్తోంది. ఫలితంగా కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న సంచులు ఎక్కువగా నిల్వ ఉంటున్నాయి. రోడ్డెక్కి ఆందోళనలు.. మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర రూ.2,400 ప్రకటించగా బయటి మార్కెట్లో కేవలం రూ.1,700 మాత్రమే పలుకుతోంది. ఒక్కొక్క క్వింటాకు రూ.7,00 ధర వ్యత్యాసం ఉండడంతో రైతులందరూ కొనుగోలు కేంద్రానికే మొక్కజొన్న తరలిస్తున్నారు. మొక్కజొన్న బస్తాలు కొనుగోలు కేంద్రంకు రావడం ఎక్కువ, గోదాంలకు వెళ్లడం తక్కువ కావడం వలన బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. నెలరోజులైనా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డుపై ధర్నా చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూడెకరాలు మొక్కజొన్న సాగుచేశాను. 122 క్వింటాళ్ల దిగుబడి రాగా.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 23 రోజులవుతుంది. తోటి రైతులు కొనుగోలు కేంద్రంకు మొక్కజొన్న తెచ్చి 20 రోజులవుతున్నా కాంటా పట్టిన బస్తాలను గోదాంలకు తరలించకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలి. – కురువ నీలప్ప, రైతు, అయిజ కొనుగోలు కేంద్రంకు మొక్కజొన్నను తరలించి 20 రోజులవుతోంది. ఆరు ఎకరాలు మొక్కజొన్న పంటను సాగు చేస్తే మొత్తం 150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కాంటా వేశారు కానీ గోదాంకు తరలించలేదు. అన్ని పనులు మానుకొని మొక్కజొన్న బస్తాల వద్ద ప్రతిరోజు పడిగాపులు కాయాల్సి వస్తోంది. – చాకలి శ్రీను, రైతు, వెంకటాపురం మొక్కజొన్న పంటను మూడెకరాల్లో సాగు చేశాను. 105 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు కేంద్రంకు తీసుకొచ్చి 20 రోజులయ్యింది. గోనె సంచులను మేమే తెచ్చుకున్నాం. లోడింగ్ హమాలీ కూడా మేమే ఇస్తున్నాం. అయినా వెంట వెంటనే గోదాంలకు మొక్కజొన్న బస్తాలను తరలించడం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలి. – రియాజ్, రైతు, వేణిసోంపురం అన్లోడ్ చేసేందుకు హమాలీల కొరత ఎక్కువగా ఉంది. దీని వలన గోదాంల వద్ద మొక్కజొన్న లారీలు రెండు, మూడు రోజులు నిలపాల్సి వస్తోంది. అయిజలో రెండు గోదాంలు ఉన్నాయి. ఎలాగోలా వాహనాల్లో మొక్కజొన్న బస్తాలను తరలించైనా గోదాంల వద్ద అన్లోడింగ్ చేసేందుకు సరిపడా మంది హమాలీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలో నిల్వలు పేరుకుపోతున్నాయి. సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళి, మార్క్ఫెడ్ డీఎం గుదిబండగా మారిన గన్నీ బ్యాగుల సమస్య గోదాంలకు తరలింపులోనూ ఇక్కట్లు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వేలాది బస్తాలు -
యువతరం.. సతమతం
తీవ్ర మానసిక ఒత్తిడిలో యువత, మధ్యవయస్కులు –8లో uప్రస్తుత సమయంలో చాలామందికి ఈ వ్యాధి లక్షణాలపై పెద్దగా అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని వైద్యులు చెబుతున్నారు. ఉన్నట్టుండి శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరగడం, కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పని చేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయంపై ప్రభావం చూపుతున్న వ్యాధి పక్షవాతం. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలను అకస్మాత్తుగా కుప్ప కూల్చేస్తోంది. వారి బతుకులను ఉన్నట్లుండి అంధకారంలో నెట్టేస్తోంది. పక్షవాతానికి గురైన కొందరు దివ్యాంగులుగా మిగిలిపోయి.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహం, వ్యాధి లక్షణాలను గుర్తించక పోవడం ప్రధానంగా ఉన్నాయి. మద్యం, సిగరెట్లు తాగే వారికి పక్షవాతం సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గంటల తరబడి సెల్ఫోన్లు చూడటం, రీల్స్, గేమ్స్ అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం వంటి విషయాలపై ఉంటూ సమయానికి తినకపోవడం సమస్యగా ఉంది. గతంలో ఎక్కువగా వృద్ధులు ఈ వ్యాధి బారిన పడేవారు. ఇప్పుడు పాతికేళ్లలోపు వారూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. అలంపూర్గద్వాల క్రైం: మారిన జీవనశైలి కారణంగా సగటు మనిషి ప్రమాదంలో పడిపోతున్నాడు. ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడంలో నిర్లక్ష్యం, వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం, సరైన సమయంలో తగిన వైద్యం తీసుకోకపోవడంతో పలువురు పక్షవాతం బారిన పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 898 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అయితే ఇందులో 15 శాతం యువత సైతం ఈ వ్యాధి లక్షణాలతో సతమతం అవుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు 40 ఏళ్ల వారు గత కొన్ని నెలల క్రితం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పక్షవాతం కేసులపై సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం, మద్యపానం, ధూమపానం, నిద్రలేమి వంటి సమస్యలతో మెదడు మొద్దుబారిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు తమవారి ఆరోగ్య సమస్యలపై భయాందోళన చెందుతున్నారు. నిత్యం అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవగాహన లోపంతో తీవ్రమవుతున్న ఇబ్బందులు భయాందోళనలో కుటుంబ సభ్యులు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రమాదం మండలానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా కుడిచేయి పని చేయలేదు. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు పక్షవాతం వచ్చినట్లు నిర్ధారించారు. అయితే సకాలంలో ఆస్పత్రికి వచ్చినందున పెను ప్రమాదం తప్పిందని.. అయినప్పటికీ నిత్యం మందులు వాడాలని సూచించారు. దీంతో సదరు వ్యక్తి వ్యాధిబారి నుంచి త్వరగా బయటపడాలని బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు
ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, గద్వాల ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలతో రూ.లక్షల్లో ఆస్తినష్టం జరిగింది. సోషల్ మీడియా యుగంలో.. అమ్మ పాత్ర పెద్ద టాస్క్ –8లో uప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ -
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
ఇటిక్యాల: బీచుపల్లి పుణ్యక్షేత్రం శనివారం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. నెలరోజులపాటు జరిగే జాతర ఉత్సవాలలో భాగంగా రెండోవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా బీచుపల్లికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. భక్తులు దాసంగాలతో మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి ఆంజనేయస్వామికి సమర్పించారు. అనంతరం ద్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శివాలయంలోనూ భక్తులు పూజలు చేశారు. -
కొల్పూర్ వద్ద బ్రిడ్జికమ్ బ్యారేజీ
మాగనూర్: మక్తల్ నియోజకవర్గ పరిధిలో మరో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మాగనూ ర్ మండలం కొల్పూర్, కర్ణాటక సరిహద్దులోని కొర్తికొండ వద్ద కృష్ణానదిపై రెండు రాష్ట్రాల సహకారంతో రూ. 750కోట్లతో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు శనివారం కర్ణాటక రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి బోసురాజుతో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొల్పూర్ వద్ద కృష్ణానదిపై 8 మీటర్ల ఎత్తులో రూ. 750 కోట్లు వ్యయంతో కృష్ణానదిపై అతి త్వరలో బ్రిడ్జికమ్ బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కర్ణాటక రూ.470 కోట్లు, తెలంగాణ రూ. 280కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. జూరాల ఎగువన కొల్పూర్ వద్ద ప్రాజెక్టు నిర్మించడంతో ఆ ప్రాంత రైతులకు రెండవ పంటకు సాగునీటి కష్టాలు దూరం కావడంతో పాటు మక్తల్ నియోజకవర్గవ్యాప్తంగా రెండు పంటలతో సస్యశ్యామలమయ్యేందుకు మార్గం సుగమవుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అతి త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభించి.. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. తెలంగాణ, కర్ణాటక సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయం రూ. 750కోట్లు అవసరమని అంచనా కర్ణాటక మంత్రితో భేటీ అయిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి -
రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు
అయిజ: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్నలను ప్రభుత్వం సకాలంలో కొనడం లేదని, కాంటా వేసిన బస్తాలను గోదాంలకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని శనివారం మండల కేంద్రంలోని గద్వాల రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లేష్ సంఘటనా స్థలానికి పోలీస్ బృందంతో చేరుకున్నారు. రోడ్డుపై నుంచి రైతులు వెళ్లిపోవాలని కోరినా వినిపించుకోలేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంకు రైతులు మొక్కజొన్నను తరలించినప్పటి నుంచి బస్తాలను గోదాంకు తరలించే వరకు సుమారు నెల రోజులు పడుతుందని, రైతులు అంతవరకు కాపలా కాయాల్సి వస్తుందని మండిపడ్డారు. ఒక్కరోజులోనే రైతుల మొక్కజొన్న బస్తాలను మొత్తం గోదాంకు తరలించేలా ఏర్పాటు చేస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు. -
మా అమ్మ వల్లే ఈ స్థాయిలో..
మాది మధ్య తరగతి కుటుంబం. నా జీవితం ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఎంతో ఉంది. మా నాన్న సాయిబాబ, అమ్మ వెంటకసుబ్బమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో సంతానం. మిగిలిన ఇద్దరిలో ఒకరు టీచర్ కాగా.. మరో సోదరుడు మున్సిపల్ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ముందు నుంచి మా అమ్మ మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే నేను గ్రూప్–1 సాధించాను. ఆ తర్వాత 2013లో ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే. – టి.శ్రీనివాసరావు, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను..
పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు – విజయలక్ష్మి, ఏఎస్ఐ, షీ టీం ఇన్చార్జి, నాగర్కర్నూల్ కూతురు మానస, కుమారుడు సాయిరాంతో ఏఎస్ఐ విజయలక్ష్మి -
జోగుళాంబ గద్వాల
త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం ● విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత ● నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు ● పోలీస్, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు ‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు ఉన్నతాధికారులు. ఐఏఎస్, ఐపీఎస్తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఉన్నత ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు... – సాక్షి, నాగర్కర్నూల్/ పాలమూరు/గద్వాల/ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) అమ్మకు సలాం..ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్లో కూడా రోజు హోంవర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది. నేడు మాతృదినోత్సవం ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్నగర్ టౌన్ ఎకై ్సజ్ ఎస్ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్, ఏడేళ్ల కొడుకు రోహన్ష్ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్వేర్ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు. -
ఉదయం 6 గంటలకే దినచర్య మొదలు..
మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్ చూసుకోవడం పెద్ద టాస్క్గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. – డాక్టర్ శిరీష, ఆర్ఎంఓ జనరల్ ఆస్పత్రి పిల్లలతో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష -
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు.. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకే అందిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవమాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. అమ్మ మన రేపటి భవిష్యత్కై నిరంతరం శ్రమించే గొప్ప శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్, మహబూబ్నగర్ -
దాహం.. దాహం
గద్వాల: వేసవికాలం మొదలు అయ్యిందంటే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు గుర్తుకు వచ్చేది తాగునీటి సమస్య. గతంతో కంటే ఈసారి వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా పనులపై జనాలు బయటకు వెళ్లాలంటే అల్లాడిపోతున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో తాగునీటి సమస్య మొదలైంది. గద్వాల మున్సిపాలిటీలో కృష్ణానది, జమ్ములమ్మ రిజర్వాయర్ నుంచి, అదేవిధంగా కొత్తహౌసింగ్బోర్డు, దౌదర్పల్లి వంటి శివారు కాలనీలలో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా చేస్తుండగా.. మిగిలిన అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా నాలుగు మున్సిపాలిటీలలోని శివారు కాలనీలలో తాగునీటి సమస్య అధికంగా కనిపిస్తుంది. ఈ కాలనీలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోచ్చు. ట్యాంకర్ల ద్వారా సరఫరా.. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులు ఉన్నాయి. పట్టణ జనాభా సుమారు 65 వేలు. పట్టణానికి కృష్ణానది, జమ్ములమ్మ రిజర్వాయర్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే పట్టణంలో శివారు కాలనీలైన బీసీ కాలనీ, రెండవ రైల్వేగేటు కాలనీ, పిల్లిగుంట్ల, దౌదర్పల్లి, హమాలీకాలనీ తదితర కాలనీలలో తాగునీటి సమస్య తలెత్తుతుంది. ఇటీవల కాలంలో పిల్లిగుంట్ల కాలనీలో తాగునీటి సమస్య ఉందని కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కాలనీలలో కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండగా.. ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రమవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తరుచుగా మరమ్మతు.. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులున్నాయి. మొత్తం జనాభా 13,267. ఈ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేస్తుండగా.. ప్రధానంగా 9వ వార్డులో కేవలం 30– 45 నిమిషాలు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తుండడంతో వార్డు ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ వార్డుకు సరఫరా చేసే తాగునీటి పైపులైన్ తరచూ మరమ్మతులకు గురవుతుండడం కూడా తాగునీటి సమస్యకు కారణంగా మారుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా.. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులుండగా మొత్తం జనాభా 12,654. ఈ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండగా ప్రధానంగా 5, 7, 8 వార్డులలో వేసవిలో తరచూ తాగునీటి సమస్య ఎదురవుతుంది. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కోసం జనాల అవస్థలు జిల్లాలోని మున్సిపాలిటీలలో శివారు కాలనీల్లో తాగునీటి కష్టాలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా సరిపోని వైనం గద్వాల మినహా మిగతా చోట్ల మిషన్ భగీరథ ద్వారా సరఫరా -
నెరవేరని టార్గెట్..
ఆర్థిక సంవత్సరం బ్యాంకులకు నిర్దేశించిన పంటరుణ పరిమితి మేరకు రైతులకు రుణాలు అందిస్తాయి. అందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు రుణ లక్ష్యాన్ని లీడ్ బ్యాంక్ అధికారులు నిర్దేశించారు. ఈ మేరకు ఆయా బ్యాంకుల వారీగా లక్ష్యాన్ని విభజించారు. అయితే ఇచ్చిన లక్ష్యంలో కేవలం 68.92 శాతం మాత్రమే బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు అందించారు. అర్హులందరికీ రుణాలు.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పంట పెట్టుబడుల కోసం అర్హత కలిగి, రుణం కోరిన రైతులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాం. రుణ లక్ష్యం నెరవేరేలా బ్యాంకర్లతో సమీక్షలు నిర్వహించాం. అర్హులైన ప్రతి రైతుకు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. – శ్రీనివాసరావు, ఎల్డీఎం ● -
జనగణన.. దేశాభివృద్ధికి పునాది
● స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జనగణన దేశాభివృద్ధికి పునాది వంటిదని.. పౌరుల ఉజ్వల భవిష్యత్కు ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలుకు ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగణన–2027పై శుక్రవారం కలెక్టరేట్ నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించగా.. వివిధ శాఖల అధికారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటగా ఇళ్ల గణన చేపడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 26 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు స్వీయగణనకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు స్వీయ గణనలో భాగస్వాములై జిల్లాను రాష్ట్రంలోనే ముందుండేలా సహకరించాలని కోరారు. అనంతరం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా వ్యాధి లక్షణాలు, చికిత్స తదితర అంశాలపై ప్రోగ్రాం అధికారి రాజు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, సీపీఓ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో మత్స్యకారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్యశాఖ కూడ ప్రధానమైనదన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో నాణ్యమైన చేపపిల్లలను సకాలంలో వదిలేందుకు రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్తో మాట్లాడతానని తెలిపారు. చెరువుల్లోకి ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు చేరకుండా మత్స్యకారులు అసవరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే రెన్యువల్ చేస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి, సీ్త్రనిధి, ప్రధానమంత్రి మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ వంటి రుణాలతో కులవృత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చన్నారు. పీఎండీడీకేవైకు జిల్లా ఎంపిక కావడం ద్వారా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఆశించిన పురోగతి సాధించడానికి అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన వంటి పథకాలను అర్హులైన మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి షకీలాభాను, ఇరిగేషన్శాఖ ఈఈ శ్రీనివాస్, ఎల్డీఎం శ్రీనివాసరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరయ్యాయని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించి.. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయాలన్నారు. బడిబాటతో పాటు ఇతర కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మి, డీఐఈఓ హృదయరాజు ఉన్నారు. -
తపాలాశాఖలో సీబీఐ కలకలం
● తోటి ఉద్యోగుల నుంచి లంచం ఆశించిన పోస్టల్ ఇన్స్పెక్టర్ ● సుదీర్ఘ విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న అధికారులు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పనిచేస్తున్న గోపీనాథ్ తోటి ఉద్యోగుల నుంచి లంచం తీసుకుంటున్నట్లు పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 7 వరకు అదుపులోకి తీసుకొని విచారించారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న స్థానాల్లో బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవక్లకు అదనపు విధులు కేటాయిస్తారు. ఇందుకుగాను అదనంగా డబ్బులు చెల్లిస్తారు. 2023 నుంచి 2026 వరకు అదనపు విధుల బిల్లులు పెండింగ్లో ఉండటంతో మంజూరుకు పోస్టల్ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరికి వచ్చే డబ్బుల నుంచి కొంత శాతం తనకు చెల్లించాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో కొందరు బీపీఎం, ఏబీపీఎం, డాక్సేవక్లు చెల్లించగా.. ఒకరిద్దరు సీబీఐ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి కార్యాలయానికి సీబీఐ అధికారులు చేరుకోగా.. విషయం తెలుసుకున్న గోపీనాథ్ పరారయ్యారు. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సెల్ఫోన్ ట్రేసింగ్ ద్వారా గుర్తించిన సీబీఐ అధికారులు పట్టుకొని పోస్టల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, కార్యాలయ ట్రెజరీలో కొంత నగదుకు సంబంధించి లెక్కలు చూపడంలో విఫలం కావడంతో గురువారం రాత్రంతా అక్కడే ఉంచారు. విధులు ముగించుకొని ఇంటికెళ్లిన మిగతా ఉద్యోగులను రాత్రి 10.30 గంటలకు కార్యాలయానికి పిలిపించి బీపీఎంలకు సంబంధించి బిల్లుల చెల్లింపులో జాప్యం, కార్యాలయ ట్రెజరీలో అదనంగా నిల్వ ఉన్న డబ్బులపై ఆరా తీసినట్లు తెలిసింది. అన్ని వివరాలను లిఖితపూర్వకంగా ధ్రువీకరించుకొని నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 7 వరకు కార్యాలయంలోనే ఉండి సుదీర్ఘ విచారణ అనంతరం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి వనపర్తి ప్రధాన పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న అంగీకరించారు. -
రైతులకు ఇబ్బందులు రానివ్వం
మానవపాడు: ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని డీఈలు రామ్పతి, నాగరాజు అన్నారు. శుక్రవారం మానవపాడు సమీపంలోని ఆర్డీఎస్–30 కెనాల్లో ఉపాధిహామీ పథకం కూలీలతో చేపట్టిన కంపచెట్లు, ముళ్లపొదల తొలగింపు పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులతో పాటు ఆయకట్టు రైతులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాల్వలో పూడికతీతతోనే సాగునీరు సాఫీగా పారుతుందని.. పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. ఈ విషయంపై వారు స్పందిస్తూ.. ఆయకట్టు రైతులు, రైతు సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పూడిక తీసుకునేందుకు అనుమతులు ఇస్తామన్నారు. లేనిచో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనప్పుడు పూడికతీత చేపడుతామని స్పష్టంచేశారు. ఉపాధి హామీ పథకంలో పూడికతీత పనులు చేపడితే.. మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేందుకు రెండు, మూడేళ్ల సమయం పడుతుందని రైతులకు వివరించారు. కాల్వలో పూడికతీత కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో తీర్మానంచేసి సమర్పించాలని సూచించారు. వారి వెంట సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. -
లక్ష్యం.. నిర్లక్ష్యం!
గద్వాలన్యూటౌన్: నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా బోరుబావులను కూడా ఇక్కడి రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిద రకాల పంటలు పండిస్తున్నారు. ఇంకా పండ్లతోటలు, కూరగాయల సాగు చేపడుతున్నారు. ప్రతి ఏటా 60 – 70 శాతమే.. నడిగడ్డలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జిల్లావ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రైతుభరోసా, పీఎం కిసాన్ సమ్మాన్నిధి వంటి పంట పెట్టుబడుల పథకాలు రైతుల పూర్తి అవసరాలు తీర్చడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలనే పంట పెట్టుబడులకు వినియోగిస్తూ.. సేద్యం చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా పంటరుణ లక్ష్యం నెరవేరడం లేదు. నిర్దేశించిన లక్ష్యంలో 60 నుంచి 70శాతం మాత్రమే బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, రెన్యువల్ చేసుకుంటే అర్హత కలిగిన ప్రతి రైతుకు పంట రుణాలు అందిస్తామని బ్యాంకర్లు అంటున్నారు. అయితే రెన్యువల్ చేసుకునే విషయంలో రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. దీంతో చాలా మంది రైతులు అధిక వడ్డీకి ప్రైవేటు వ్యాపారులతో అప్పులు చేస్తున్నారు. బ్యాంకు రుణాలు రెన్యువల్ చేసుకునే విధానాలపై వ్యవసాయ, బ్యాంకర్లు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదరగొడుతున్నారు పాలమూరు స్టేడియంలో నిర్వహిస్తున్న హ్యాండ్బాల్ శిక్షణ శిబిరంలో క్రీడాకారులు మెళకువలు నేర్చుకుంటున్నారు. –8లో uజిల్లాలో 68.92శాతం మాత్రమే పంట రుణాలు సాగు పెట్టుబడులకు తప్పని ప్రైవేటు అప్పులు బ్యాంకు రుణాల రెన్యువల్పై కొరవడిన అవగాహన బ్యాంకర్ల తీరుతో రైతులకు చేకూరని లబ్ధి -
ర్యాష్ డ్రైవింగ్.. త్రిబుల్ రైడింగ్
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మైనర్లు, చిన్నారులకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే వాహనాలు నడిపేందుకు అర్హులు. కానీ, ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పదేళ్లు దాటిన వారికి సైతం తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. నియంత్రణ లేని పిల్లలు రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనెల్ హోంకు తరలిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తునా తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన క్రమంలో వారందరూ ఇళ్ల దగ్గర ఉంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న వారిలో చాలామంది చిన్నారులు ఇంట్లో ఉండే తల్లిదండ్రుల బైక్లు, స్కూటీలు తీసుకొని గల్లీలతోపాటు ప్రధాన రోడ్లపై త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్లతో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గాయపడుతున్న ఘటనలు అనేకం. ఇక కొన్ని సందర్భాల్లో ప్రధాన రోడ్లపై మేజర్ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాల కట్టడికి మొదటి అడుగు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. బైపాస్ రోడ్డుపై రేస్.. నగరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ బైపాస్పై రాత్రివేళలో టీనేజర్స్ రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చించోళి బైపాస్ రోడ్డుపై కూడా సాయంత్రం వేళ కొంతమంది యువకులు బైక్లతో అక్కడికి చేరుకుని పోటీలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక వర్గానికి చెందిన టీనేజర్స్ మరింత రెచ్చిపోయి బైక్లు రాష్గా.. వేగంగా నడుపుతూ గట్టిగా హారన్స్ కొడుతూ.. సైలెన్సర్ల నుంచి మంటలు వచ్చేలా నడుపుతున్నారు. కొందరు అయితే బైక్ స్టాండ్స్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోగణనీయంగా పెరిగిన మైనర్ల డ్రైవింగ్ వేసవి సెలవులనేపథ్యంలో బైక్లపై టీనేజర్ల చక్కర్లు పాలమూరు బైపాస్ రోడ్లపై రేస్ల నిర్వహణ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టని పోలీస్ శాఖ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రాని వైనం -
అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
గద్వాల: అదనపు కలెక్టర్గా (రెవెన్యూ) మధుమోహన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన జిల్లాకు వచ్చారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కేటీదొడ్డి: ఎరువులు, విత్తన డీలర్లు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప హెచ్చరించారు. శుక్రవారం కేటీదొడ్డి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్ వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని స్పష్టంచేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించమని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ రాజవర్ధన్రెడ్డి ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,071 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శుక్రవారం 67 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,071, కనిష్టంగా రూ. 3,699, సరాసరి రూ. 6,489 ధరలు లభించాయి. అదే విధంగా 63 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,069, కనిష్టంగా రూ. 6,001 ధర పలికింది. 1,823 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,276, కనిష్టంగా రూ. 1,621, సరాసరి రూ. 2,092 ధరలు లభించాయి. -
నీలినీడలు..!
● ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా ప్రోత్సాహం కరువు ● నెరవేరని ఉచిత చేపవిత్తనాల పంపిణీ లక్ష్యం ● మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం ఉమ్మడి జిల్లాలో అవసరమయ్యే చేపపిల్లలు.. జిల్లా చెరువులు జలాశయాలుచేపపిల్లలు (కోట్లలో) మహబూబ్నగర్ 1092 1 1.98 నాగర్కర్నూల్ 715 6 2.41 నారాయణపేట 506 3 1.37 వనపర్తి 653 5 2.02 జో. గద్వాల 140 6 1.46 మహబూబ్నగర్ న్యూటౌన్: మత్స్యశాఖ నిర్లక్ష్యధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా.. చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చేపపిల్లల పంపిణీ కోసం టెండర్లు పిలిస్తే ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో పాటు పెంపకానికి ప్రభుత్వం సహకారం అందిస్తున్నా.. ఆసక్తి కనిపించడంలేదు. ఫలితంగా మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ అబాసుపాలవుతోంది. నీటితో కళకళలాడుతున్న చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో ఉచితంగా చేపపిల్లలు వదిలి మత్స్యకారులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన పథకం ఆశించినస్థాయిలో అమలుకాకపోవడం అసంతృప్తికి గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది దాదాపు 9కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉండగా.. చేపపిల్లల కొరతతో 50 శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోకపోవడం గమనార్హం. ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి టెండర్లలో పాల్గొంటున్నారు. తెలంగాణలో చేపపిల్లలను ఉత్పత్తి చేసే టెండరుదారులు మాత్రం ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉచిత చేపపిల్లల పంపిణీ నామమాత్రంగా ఉండటంతో వృత్తిని నమ్ముకొని బతుకుతున్న మత్స్యకారుల్లో నైరాశ్యం నెలకొంది. ప్రోత్సాహం కరువు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూరాలప్రాజెక్టు, కోయిల్సాగర్, సరళాసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు వివిధ జలాశయాల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయి. అయితే ఆసక్తి ఉన్న మత్స్యకారులను ప్రోత్సహిస్తే ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశముంది. మత్స్యరంగాన్ని బలోపేతం చేయాల్సిన మత్స్యశాఖ అధికారులు.. ప్రైవేటు కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇస్తుండటం పలు అనుమానాలకు తానిస్తోంది. ప్రతి సంవత్సరం ఉమ్మడి జిల్లాలో అవసరమున్న 9 కోట్ల చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం రూ.16.50 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. అదే ఇక్కడి మత్స్యకారులే ఉత్పత్తిదారులుగా తయారైతే ఆర్థికంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కొత్త దరఖాస్తులు రావడం లేదు.. మహబూబ్నగర్ జిల్లాలో రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అందులో పిల్లలమర్రి ఉత్పత్తి కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి జరగడం లేదు. కోయిల్సాగర్ లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో సగం మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. ఈ కేంద్రంలో మరమ్మతు చేపట్టి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో అస్యూర్డ్ వాటర్ లేనందున కొత్త దరఖాస్తులు ఏమి రావడం లేదు. – రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి మహబూబ్నగర్ పిల్లలమర్రి వద్ద నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ప్రభుత్వ ఉత్పత్తి కేంద్రాలిలా.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో దాదాపు 20 ఎకరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అచ్చంపేట మండలం చంద్రసాగర్లో 14 లక్షల చేపపిల్లల సామర్థ్యం కలిగిన పెంపకం కేంద్రం నిరుపయోగంగా మారింది. ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం 12 ఏళ్ల క్రితం మూతపడింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ వద్ద చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని పెబ్బేరు మత్స్యకళాశాల విద్యార్థుల అవగాహన కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో దా దాపు 20వేల చేపపిల్లలను పెంచుతున్నారు. గద్వాల జిల్లా జములమ్మ రిజర్వాయర్ వద్ద నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని తొలగించి, ఆలయ అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టారు. దేవరకద్ర మండలం కోయిల్సాగర్ వద్ద కోటి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఉన్నా ప్రస్తుతం 60 లక్షలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తికి మరమ్మతు చేపట్టాల్సి ఉంది. పిల్లలమర్రిలో ఉన్న ఉత్పత్తి కేంద్రం నిరుపయోగంగా మారింది. -
నత్తనడకన..
అయిజలో ముందుకుసాగని 30 పడకల ఆస్పత్రి నిర్మాణం ● 2017లో రూ.1.10 కోట్లు మంజూరు ● రూ. 80లక్షల పనులకు మాత్రమే టెండర్ ● నిధులలేమితో అసంపూర్తిగా పనులు ● పీహెచ్సీలో మెరుగైన వసతులు లేక రోగుల అవస్థలు –8లో uఅయిజ: జిల్లాలోనే అయిజ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. ఇక్కడ రోజూ 250 పైగా ఓపీ నమోదవుతోంది. మరో 10 మంది ఇన్ పేషెంట్లు ఉంటారు. కాన్పుల సంఖ్య కూడా అధికమే. అయిజ మండలంతో పాటు మల్దకల్, గట్టు, వడ్డేపల్లి మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో పీహెచ్సీ భవనం ఏమాత్రం సరిపోవడం లేదు. శిథిలావస్థకు చేరిన పీహెచ్సీలో రోగులు మౌలిక వసతులకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో 30 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి 2017లో అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2021లో నిర్మాణానికి శ్రీకారం.. మాతా శిశు సంరక్షణ కేంద్రం (30 పడకల ఆస్పత్రి) నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.10 కోట్లు మంజూరు చేయగా.. 2021 సెప్టెంబర్ 30న అప్పటి ఎమ్మెల్యే అబ్రహాం శంకుస్థాపన చేశారు. అయితే కరోనా విపత్తు సమయంలో అత్యవసర పనుల కోసం అప్పటి కలెక్టర్ రూ. 30లక్షల నిధులను ఖర్చుచేశారు. మిగిలిన రూ. 80లక్షల పనులకు మాత్రమే టెండరు ప్రక్రియ పూర్తిచేసి, పనులు చేపట్టారు. ఐదేళ్లుగా అసంపూర్తిగానే.. 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధుల కొరత కారణంగా ఐదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయింది. ఆస్పత్రిలో వైద్యుల గదితో పాటు స్టాఫ్ నర్సు గది నిర్మించాలి. వాటితో పాటు 12 పడకల గదులు రెండు, ఆరు పడకల గది ఒకటి, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడానికి మరో రూ. 50లక్షలు అవసరమవుతాయని సంబంధిత అధికారులు నిర్ధారణకు వచ్చారు. నిధుల కోసం 2024లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. నేటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి 30 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి.. అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
సేవలు మరింత విస్తృతం..
ఇండియన్ రెడ్క్రాస్తో అందిస్తున్న సేవలను మ రింత విస్తృతం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సహకారంతో రూ.5 కోట్లతో మల్టీ సూపర్స్పెషాలిటీ డయాగ్నొస్టిక్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతం ఎస్డీపీ మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఒక యూనిట్కు రూ.10, 500 ఖర్చు చేస్తున్నాం. ప్రైవేటులో అయితే రూ.18 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మూడు అంబులెన్స్లు, ఒక మినీవ్యాన్ అందుబాటులో ఉంది. – నటరాజ్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ -
రెడ్క్రాస్.. సేవల్లో టాప్
పాలమూరు: అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన వారికి ఓవైపు రక్తం సమకూర్చడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ముందుంటోంది. కొన్నేళ్లుగా పాలమూరు జిల్లాలో ఆరోగ్యం, అత్యవసర సహాయం, రక్తదానం వంటి సేవల్లో మేటిగా నిలుస్తోంది. ప్రకృతి విపత్తుల సమయంలో నిస్సహాయులకు చేయూత అందించడంతో పాటు గర్భిణులు, చిన్నారుల పోషణ వంటి వాటిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థు ల్లో సేవాభావం, ఆరోగ్య అవగాహన పెంపు కోసం జూనియర్ రెడ్క్రాస్ వలంటీర్లను తయారు చేయడంతో.. జిల్లాలో జరిగే కురుమూర్తి, మన్యంకొండ ఇతర ముఖ్యమైన ఉత్సవాల్లో వలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. 6,130 యూనిట్ల రక్తసేకరణ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏడాది కాలంలోనే 114 రక్తదాన శిబిరాలు నిర్వహించి.. 6,130 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్లో ఏర్పాటుచేసిన కోల్డ్ స్టోరేజ్లో అన్ని రకాల రక్త నిల్వలు అందుబాటులో ఉంటాయి. సర్జరీలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో పాటు తలసేమియా బాధితులకు సైతం రక్తం అందిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు.. పాలమూరులో గతేడాది కాలంలో 20 కంటి వైద్యశిబిరాలు నిర్వహించడంతో పాటు 156 మంది కళ్లు సేకరించారు. 23 మృతదేహాలను మెడికల్ కళాశాలకు వితరణ చేశారు.30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను 258 మంది లబ్ధిదారులకు అందజేశారు. 17 ప్రాంతాల్లో సీపీఆర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2005లో మహబూబ్నగర్ ఏనుగొండలో అనాథ శరణాలయం ఏర్పాటు చేయగా.. 1వ తరగతి నుంచి ఇంటర్ వ రకు చదివే విద్యార్థులు 74 మంది ఉన్నారు. అదే విధంగా 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే వారు 14మంది ఉండగా.. ముగ్గురు డిగ్రీ, ఒకరు ఇంజినీరింగ్, ఇద్దరు పాలిటెక్నిక్, ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి యో గా పోటీల్లో రెడ్క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు. 2018లో శాంతివనం.. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మరో అరుదైన సేవా కా ర్యక్రమం శాంతివనం పేరుతో మానసిక వికలాంగుల ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో 25మంది వరకు ఉండగా.. ప్రత్యేక శిక్షణ పొందిన ముగ్గురు ఉపాధ్యాయులతో నిత్యం పాఠాలు భోదిస్తుంటారు. ఈ పాఠశాలలో చదువుతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఐదుగురికి విద్యానిధి.. ఎంబీబీఎస్ చదువుతున్న ఐదుగురు నిరుపేద విద్యార్థులను రెడ్క్రాస్ సొసైటీ దత్తత తీసుకొని వారి చదువుకయ్యే ఖర్చు భరిస్తోంది. ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు వారికి సంబంధించిన అన్ని రకాల బాగోగులను చూస్తోంది. విద్యార్థిని గోపిక గాంధీ మెడికల్ కళాశాల, హరిత కాకతీయ మెడికల్ కళాశాల, ఊర్మిళ ఎస్వీఎస్, ఆకాంక్ష నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ముడావత్ లోకేష్ ఈఎస్ఐ మెడికల్ కళాశాల ముంబైలో చదువుతున్నాడు. ప్రతి ఒక్కరికీ కళాశాల ఫీజు, పుస్తకాలు, దుస్తులు, హాస్టల్ సౌకర్యాలకు అయ్యే ఖర్చు భరిస్తున్నారు. పేదలకు అండగా నిలుస్తున్న సొసైటీ అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా శిబిరాల నిర్వహణ ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దత్తత అనాథ శరణాలయాల్లో 100మంది వరకు ఆశ్రయం నేడు ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం -
అవస్థలు పడుతున్నాం..
30 పడకల ఆస్పత్రి నిర్మా ణం ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా పను లు పూర్తికావడం లేదు. దీంతో అనేక అవస్థలు పడుతున్నాం. రోజు పీహెచ్సీకి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా నిలిచిన 30 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేస్తే బాగుంటుంది. – నాగరాజు, అయిజ పీహెచ్సీ భవనం పక్కన నిర్మిస్తున్న 30 పడకల ఆస్ప త్రి పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు, పాలకులు ప ట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గు రవుతున్నారు. అధికారులు చూసి వెళ్తున్నారు తప్ప..పనులను మాత్రం పూర్తి చేయించడం లే దు.ఇప్పటికై నా స్పందించి త్వరగా పూర్తిచేయాలి. – నజీర్, అయిజ అయిజ పీహెచ్సీకి ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఎక్కువ కాన్పులు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. నూతనంగా చేపట్టిన 30 పడకల ఆస్పత్రి భవనం అసంపూర్తిగా ఉంది. నిర్మాణ పనుల పూర్తికి అవసరమైన నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భవనాన్ని ప్రత్యేక వార్డుగా వినియోగిస్తాం. – సంధ్యా కిరణ్మయి, డీఎంహెచ్ఓ ● -
ఉద్యోగ భద్రత కల్పించాలి..
కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు ఆపాలి. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా 2021 వేతన సవరణ, 30శాతం ఫిట్మెంట్ అమలు, మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన నిధులు, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేతపై చర్యలు చేపట్టాలి. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే ఆశాభావంతో ఉన్నాం. – రాంనాథ్, ఆర్టీసీ కార్మికుడు, గద్వాల సమస్యలను అధిగమిస్తాం.. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సిబ్బందికి సైతం పనిభారం పెరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం అమలు తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళా ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బస్సు సర్వీసుల కొరత ఉంది. త్వరలో నూతన బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తాం. డిపో పరిఽధిలోని కార్మికుల సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. – సునీత, ఆర్టీసీ డీఎం, గద్వాల ● -
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
గద్వాలవ్యవసాయం: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాలు అమలుచేస్తోందని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, వైస్చైర్మన్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో వారు పాల్గొని మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. ఈనామ్ ద్వారా రైతులు తమ పంటను ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనామ్ విధానంతో గద్వాల యార్డులో చాలా మంది రైతుల పంట ఉత్పత్తులను మంచి ధరలకు కొనుగోలు చేసినట్లు వివరించారు. మార్కెట్యార్డు అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి సబిత, మార్కెట్ కార్యదర్శి నర్సింహ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,599 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 98 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,599, కనిష్టంగా రూ. 4,769, సరాసరి రూ. 6,506 ధరలు లభించాయి. అదే విధంగా 51 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,011, కనిష్టంగా రూ. 5,519, సరాసరి రూ. 5,829 ధరలు పలికాయి. 1,944 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,256, కనిష్టంగా రూ. 1,686, సరాసరి రూ. 2,039 ధరలు లభించాయి. ఆదిశిలా క్షేత్రంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ మల్దకల్: ఆదిశిలా క్షేత్రాన్ని బుధవారం జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వరగౌడ్ సందర్శించి.. స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి ఆయనకు తీర్థప్రసాదాలను అందజేసి.. ఆదిశిలా క్షేత్రం విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు పూలమాల, శేషవస్త్రంతో రామలింగేశ్వరగౌడ్ను సత్కరించి మెమోంటో అందజేశారు. -
ఆర్టీసీలో పనిభారం!
గద్వాల క్రైం: నిత్యం వేలాది ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ఆర్టీసీ సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడం.. ఆర్టీసీ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. జిల్లాకేంద్రమైన గద్వాల జిల్లా నుంచి హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, కర్ణాటక తదితర దూర ప్రాంతాలకు గతంలో రోజు 70వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో లక్ష మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇక పాఠశాలలు, కళాశాలలు కొనసాగే సమయంలో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుండటంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నిత్యం అనేక సమస్యలతో విధుల నిర్వహణ భారంగా మారుతోందని వాపోతున్నారు. సామర్థ్యానికి మించి.. గద్వాల ఆర్టీసీ డిపోలో 103 బస్సులు ఉండగా.. అందులో ఆర్టీసీకి చెందినవి 56, అద్దె బస్సులు 47 ఉన్నాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 50 – 60 మంది వరకు ప్రయాణింవచ్చు. గతంలో 10 నుంచి 20 మంది అదనంగా ప్రయాణించే వారు. ప్రస్తుతం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 80 నుంచి 100 మంది ప్రయాణిస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వయసు పైబడిన వారు, చిన్నారులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ సిబ్బంది సైతం సతమతమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడం.. కాలం చెల్లిన బస్సులతో డ్రైవర్లు, కండక్టర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పని ఒత్తిడితో పొరపాట్లు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఏ బస్సులో చూసినా మహిళలే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. సీట్ల కోసం మాటల యుద్దాలు, పిడిగుద్దుల వరకు వెళ్తున్నారు. ఈ పరిస్థితులు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ప్రయాణికుల రద్దీతో బస్సు ఆలస్యం కావడం.. కేఎంపీఎల్ రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. మరోవైపు కండక్టర్లు సైతం టికెట్లు ఇచ్చే సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. జీరో టికెట్ ఇచ్చే క్రమంలో తప్పిందాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. అధికారుల టార్గెట్.. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. ప్రస్తుతం పని గంటల్లో ఎలాంటి నిబంధన లేదు. దూర ప్రాంతాలకు వెళ్లిన క్రమంలో రాను, పోను 400 కి.మీ. డ్యూటీ చేయాల్సిందే. మరోవైపు అధికారుల టార్గెట్తో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. డ్రైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ ఇవ్వడం.. కేఎంపీఎల్ ఎందుకు రాలేదని అధికారుల ప్రశ్నలతో సతమతమవుతున్నారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కార్మిక యూనియన్లు లేకపోవడంతో సిబ్బందికి ఇష్టానుసారంగా డ్యూటీలు వేయడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీతోఉద్యోగుల సతమతం మహాలక్ష్మి పథకంతో పెరిగిన ఒత్తిడి నానాటికీ భారంగా మారుతున్న విధుల నిర్వహణ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు లేక అవస్థలు -
‘రామన్పాడ్’ తగ్గుముఖం
● రిజర్వాయర్లో ఏడు మీటర్లుతగ్గిన నీటిమట్టం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్ భగీరథ అధికారులు ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్పాడు రిజర్వాయర్లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే పాలమూరులోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్పాడు రిజర్వాయర్ను నిర్మించారు. రిజర్వాయర్లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది. తాగునీటి పథకాలు.. శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్డీ తాగునీటి పథకం ద్వారా వనపర్తి జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్పేట 10 ఎంఎల్డీ పథకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్గల్ 5 ఎంఎల్డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్యసాయి 2 ఎంఎల్డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్డీ పథకం ద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. సాగునీటి సరఫరా బంద్.. ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం సరికాదని.. తూకం చేసిన వెంటనే రైస్మిల్లులకు తరలించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును పార్టీ నాయకుల బృందంతో కలిసి సందర్శించారు. ఐకేపీ, సింగిల్విండో ద్వారా కొనసాగుతున్న కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా తూకం చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వెంటనే పూర్తిచేసి తరలించాలని కోరారు. లారీల కొరతతో తూకం చేసిన ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందన్నారు. మిల్లు యజమానులు ధాన్యం దించుకునే సమయంలో సమస్యలు సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని.. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్రెడ్డి, జీఎస్ గోపి, మండ్ల రాజు, జిల్లా కమిటీ సభ్యులు బాల్యానాయక్, ఆంజనేయులు, ఆసీఫ్, కార్యదర్శి ఉమా తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
తక్షణ చర్యలు చేపట్టాలి..
మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్పాడు రిజర్వాయర్ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి. – రాజు, సీపీఎం నాయకుడు, ఆత్మకూర్ తాగునీటి కష్టాలు రానివ్వం.. వనపర్తి జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం. – అంజద్పాషా, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి ● -
వైద్యశాఖలో అలజడి
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో గందరగోళం సృష్టించిన ఉద్యోగుల నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో కాంట్రాక్టు ఉద్యోగాలు పొందారంటూ తరుచూ కలెక్టరేట్ ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో కొన్ని నెలలుగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేశారని, విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డి మీడియాకు వెల్లడించారు. కష్టపడి చదివి తెచ్చుకున్న విద్యార్హతను నకిలీగా చిత్రీకరించి ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారంటూ వారిలో ఒకరైన శిరీష డీఎంహెచ్ఓపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల వనపర్తి కోర్టు ఈ దావాను స్వీకరించినట్లు తెలిసింది. 2026, జూన్ 12న కోర్టుకు హాజరుకావాలని తెలిపినట్లు సమాచారం. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొంది ఉంటే తీసుకున్న వేతన రికవరీకి ఎందుకు ఉపక్రమించలేదని, యూనివర్సిటీ డిక్లరేషన్ కాపీ ఎందుకు బయటపెట్టడం లేదనే అంశాలు వైద్య, ఆరోగ్యశాఖలో సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డి వద్ద ప్రస్తావించగా.. అదంతా గడిచిపోయిన విషయమని, చట్టప్రకారం వెళ్తున్నామని, ఎక్కువగా మాట్లాడటం సరికాదని బదులిచ్చారు. జిల్లా వైద్యాధికారిపై పరువునష్టం దావా -
మరో రెండు కార్పొరేషన్ పదవులు
● సరిత, గట్టు తిమ్మప్పకు దక్కిన ‘చైర్మన్ గిరి’ గద్వాల: ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాకు మరో రెండు కార్పొరేషన్ పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. కొల్లె సరిత తిరుపతయ్యను తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (టీజీఎస్జీడీసీఎఫ్ఎల్) చైర్పర్సన్గా, గట్టు తిమ్మప్పను వాల్మీకి బోయ కో–ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి కే శాట్ చైర్మన్గా శివసేనారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఒబేదుల్లా కొత్వాల్ కొనసాగుతున్నారు. ● కొల్లె సరిత బీఆర్ఎస్ హయాంలో గద్వాల జెడ్పీ చైర్పర్సన్గా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2023లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సరిత కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ● గట్టు తిమ్మప్ప గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సోదరుడు. టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మ డి పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్గా పదవి నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓసారి గట్టు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్గా కూడా పనిచేశారు. -
వాణిజ్య పంటలతో లాభాలు బాగు
వనపర్తిటౌన్: రైతులు వరి మాత్రమే కాకుండా ఆయిల్పాం, పప్పుగింజలు, కూరగాయల సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పాం సాగు చేయాలన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో సరిపడా పామాయిల్, పప్పు దినుసుల నిల్వలు లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఆయిల్పాం సాగుచేస్తే 30 ఏళ్ల పాటు దిగుబడి పొందవచ్చని కోరారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లో సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని వెల్లడించారు. ఆయిల్పాం సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులను ప్రత్యేక బస్సులో సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి, ప్రత్యేక నోడల్ అధికారి ప్రసాదరావు, వ్యవసాయశాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ కృపాకర్రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి, వీణా, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు
గద్వాల: జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ పారదర్శకంగా చేపట్టాలని.. ఎక్కడైనా నగదు స్వీకరణ జరిగితే వెంటనే రెడ్క్రాస్ సొసైటీ ఖాతాలో జమ చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 1200 మంది రెడ్క్రాస్ సభ్యులు ఉండగా.. మరికొంత మంది నమోదు ప్రక్రియలో ఉన్నారన్నారు. ఈ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులు విద్యాసంస్థలు, స్వచ్చంద సంస్థలు, యువత ముందుకురావాలని కోరారు. జీవితకాలం సభ్యత్వం రూ.వెయ్యి మాత్రమే ఉండటం వల్ల ప్రజలు సులభంగా సభ్యత్వం పొందవచ్చన్నారు. సభ్యత్వ నమోదు కోసం కలెక్టరేట్లోని ప్రజాపాలన విభాగంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేసి.. అక్కడే నేరుగా రిజిస్ట్రేషన్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అందుకు అవసరమైన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలన్నారు. వార్షిక ఆడిట్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆర్థిక వ్యవహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, రెడ్క్రాస్ నోడల్ అధికారి వేణుగోపాల్, మంజుల, అజారుద్దీన్ తదితరులు ఉన్నారు. ఈవీఎంల గోదాం పరిశీలన.. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మంజుల ఉన్నారు. -
మొక్కజొన్న రైతుకు తప్పని తిప్పలు
రాజోళి: మొక్కజొన్న రైతులకు క్షణక్షణం గండంగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉన్నా తమవంతు వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాలకు బలికాక తప్పని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్నలు తీసుకొస్తే.. కనీసం కుప్పగా పోసుకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని.. ఇదే క్రమంలో ఎక్కడో చోట పోసుకున్న ధాన్యానికి రక్షణ లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. తమ దుస్థితి ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదని వాపోతున్నారు. ● రాజోళి, వడ్డేపల్లి తదితర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. గత వారంలో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోగా.. ఎండలు ఉన్న కారణంగా ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో రైతులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. చోరీకి గురవుతున్న ధాన్యం.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా గుర్తుతెలియని దుండగులు ధాన్యాన్ని చోరీ చేస్తున్నారు. ఇటీవల వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన రైతు 3 క్వింటాళ్ల ధాన్యం చోరీకి గురైంది. దీంతో రైతు పడిన బాధ వర్ణనాతీతం. అయితే మరికొందరి ధాన్యం కిలోల లెక్కన చోరీకి గురవుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రాల వద్ద ధాన్యాన్ని రక్షించుకునేందుకు రాత్రి, పగలు పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు.. వడ్డేపల్లి కొనుగోలు కేంద్రం వద్ద వారం రోజులు గా మొక్కజొన్న అమ్మేందుకు పడిగాపులు కాస్తు న్నా. ఈ క్రమంలో ధా న్యం కుప్పలో 3 క్వింటాళ్ల మేర చోరీకి గురైంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం దొంగలపాలైంది. అధికారులు త్వరగా కొనుగోలు చేయాలి. – ఎద్దుల తిమ్మప్ప, రైతు, తనగల వర్షాల భయం వెంటాడుతుంది మొక్కజొన్న అమ్మకాల్లో ఆలస్యం జరిగినా ఓపిగ్గా ఉంటున్నాం. కానీ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయకుండా ఎదురుచూడాలంటే ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే అన్ని ఖర్చులు రైతులే భరిస్తున్నారు. ఈ సమయంలో వర్షాల భయం వెంటాడుతుంది. అమ్మకాల ప్రక్రియలో వేగం పెంచాలి. – సునీల్, రైతు, వడ్డేపల్లి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు అకాల వర్షాలతో ఆందోళన -
అదనపు కలెక్టర్గా సీహెచ్ మధుమోహన్
గద్వాల: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్గా మధుమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ రెవెన్యూ అదనపు కలెక్టర్గా పనిచేసిన వి.లక్ష్మీనారాయణ గతనెల 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో కామారెడ్డి డీఆర్వోగా పనిచేస్తున్న సీహెచ్.మధుమోహన్ను ప్రభుత్వం నియమించింది. నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత ధరూరు: మండలంలోని రేవులపల్లి వద్ద ఉన్న మిషన్ భగీరథ నీటిశుద్ధి కర్మాగారాన్ని శుభ్రపరిచేందుకు గాను బుధవారం తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవిచంద్రకుమార్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం నీటి సరఫరా ఉండదని.. ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. గురువారం నుంచి నీటి సరఫరా యథావిధిగా ఉంటుందని తెలిపారు. జోగుళాంబ సన్నిధిలో దివ్యమైన అనుభూతి అలంపూర్ రూరల్: అష్టదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన శ్రీజోగుళాంబదేవి అమ్మవారి సన్నిధిలోనే దివ్యమైన అనుభూతి కలుగుతుందని హైదరాబాద్ పురాణపీఠం అనంతసాహితీ ఆశ్రమం గురువు శ్రీఅనంతానంద భారతి స్వామిజీ అన్నారు. మంగళవారం అలంపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. హిందూ సమాజంపై గౌరవభావం, స్వధర్మంపై అంకితభావం వికసింపజేయాల్సిన అవసరముందన్నారు. హిందువులంతా జాగృతమై సమాజ సంరక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ కట్ట ప్రభాకర్, కార్యదర్శి కావలి శ్రీనివాసులు, నాగమద్దిలేటి, నాగమల్లయ్య, నరేశ్, సర్పంచ్ ఈశ్వరయ్య, రంగస్వామి, జగదీశ్ పాల్గొన్నారు. రేపు బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి అండర్–19, అండర్–22 బాలబాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బొంబాయి నర్సింహులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు 10 వెయిట్ కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని, 7వ తేదీ(గురువారం) ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు. యువతకు ఉపాధి రంగాల్లో శిక్షణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7, 8 తేదీల్లో నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కెరీర్ గోల్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇంటర్నెట్ అవగాహన, ఫైనాన్సియల్ లిటరసీ, ఇండస్ట్రీయల్ అవగాహన, ప్రాబ్లం సాల్వింగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్ను సంప్రదించాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.7,392 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
‘ఉపాధి’కి ఊతం!
గద్వాలన్యూటౌన్: ఈ నెలలో వ్యవసాయ పనులు ఉండవు. గ్రామీణ కూలీలకు ఉపాధిహామీ పనులే దిక్కు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ద్వారా ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 200 మంది కూలీలకు పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపికచేసిన కొన్ని పనులకు ప్రాధాన్యత ఇస్తూ.. అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. వలసలు వెళ్లకుండా.. సాధారణంగా మే ప్రారంభం నుంచి జూన్ మొదటి వారం వరకు వ్యవసాయ పనులు ఉండవు. దీంతో వేలాది మంది కూలీలు ఇతర పనులకు వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో స్థానికంగా పనులు దొరక్కపోతే.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఎందుకంటే కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బుతోనే వారి కుటుంబ పోషణ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించాలని స్పష్టంగా ఆదేశించింది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం ఒక్కో జీపీలో సరాసరి 70 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం 200 మంది కూలీలకు పనులు కల్పించడం ద్వారా వలసలను నివారించడంతో పాటు కూలీలు ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా ఉంటారని.. వారి కుటుంబ పోషణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు బావిస్తున్నారు. కొన్ని పనులకు ప్రాధాన్యత.. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రధానంగా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్ పిట్లు, నాడేక్ కంపోస్ట్ పిట్లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, కోళ్ల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు చేపడతారు. అయితే జూన్లో వర్షాకాలం ప్రారంభవుతుంది. చెరువులు, ఊటకుంటలు, కాల్వల్లో పనులు చేయడం ఇబ్బంది. ఇదే సమయంలో పొలాలకు ఒండ్రుమట్టి అవసరం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కాల్వల్లో షిల్ట్ తొలగింపు, చెరువులు, ఊటకుంటల్లో ఒండ్రుమట్టి పూడికతీత, ఇంకా పశువులకు నీటి ఎద్దడి లేకుండా నీటితొట్ల నిర్మాణం, గొర్రెలు, పశువులకు పాకాలు తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి జీపీలో 200 మందికి పనులు కల్పించేలా ప్రణాళిక జూన్ మొదటి వారం వరకు వ్యవసాయ పనులు కరువు గ్రామీణ కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధి కల్పన వేసవిలో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
ఇటిక్యాల: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ జగ్గూనాయక్, అలంపూర్ ఏడీఏ సక్రియానాయక్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బీచుపల్లి ఆయిల్ మిల్లులో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పంటల స్టాల్స్ ఏర్పాటుచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలు పెరగడంతో రైతులు వరి, మొక్కజొన్న, పత్తి వంటి సంప్రదాయ పంటలను అధికంగా సాగుచేస్తున్నారని.. వాటితో పోలిస్తే ఆయిల్పాం సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఒకసారి మొక్కలు నాటితే 25 నుంచి 30 ఏళ్ల వరకు రైతుకు స్ధిరమైన దిగుబడి వస్తుందన్నారు. ఈ పంటకు చీడపీడల సమస్య తక్కువగా ఉండటంతో పాటు అకాల వర్షాల ప్రభావం ఉండదన్నారు. మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. రైతులు ఆయిల్పాం సాగును విస్తృతంగా చేపట్టి అధిక లాభాలు పొందాలని సూచించారు. పంటమార్పిడితో నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విజితా బీసీరెడ్డి, ఆయిల్ఫెడ్ నర్సరీ ఇన్చార్జి శివనాగిరెడ్డి, ఫ్యాక్టరీ ఇన్చార్జి బాలకృష్ణ, ఉద్యానశాఖ అధికారులు ఇమ్రానా, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
● సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం గద్వాల మండలం చెనుగోనుపల్లి, అనంతపురం–1, బసల్చెర్వు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉండటం, లారీలు తక్కువగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రానికి రోజు కనీసం నాలుగు లారీలు పంపించాలని తెలిపారు. రైతులు ఎండలో ఎక్కువసేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం ఎక్కువగా వచ్చిన కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చి.. సమీప మిల్లులకు పంపడం ద్వారా సమయం వృథా కాదన్నారు. అదే విధంగా గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. కేంద్రంలో ఉన్న ధాన్యం నిల్వలు, తేమశాతం, పంపిన లోడ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఎం అరుణ, ఏఈఓ ఉషశ్రీ, రవి ఉన్నారు. ● రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల 31వ తేదీ వరకు సభ్యత్వ నమోదును సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను కలెక్టరేట్లో ప్రత్యేక డాటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు అదనపు కలెక్టర్ నర్సింగ్రావును ఉపాధ్యక్షుడిగా, ప్రత్యేక అధికారిగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి వేణుగోపాల్, జిల్లా ఉపాధి కల్పన అధికారి చరణ్ దీప్ను నోడల్ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. సభ్యత్వ రుసుం పేట్రన్ రూ. 25వేలు, వైస్ పేట్రన్ రూ. 12వేలు, లైఫ్ సభ్యత్వం రూ.1,000, సంస్థాగత సభ్యత్వం సంవత్సరానికి రూ. 5వేలు ఉంటుందన్నారు. రెడ్క్రాస్కు ఇచ్చే విరాళాలకు 80జీ కింద పన్ను మినహాయింపు ఉంటుందన్నా రు. ఈ మానవతా సేవలో భాగంగా ప్రజలు విరా ళాలు ఇవ్వడం, సభ్యత్వం పొందడం లేదా స్వచ్ఛంద సేవలకులుగా పాల్గొనవచ్చని తెలిపారు. సేవాభావాన్ని అలవర్చుకోవాలి బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన తర్వాత సేవాభావం, సహానుభూతి, మానత్వంతో కూడిన సేవలను ప్రజలకు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో నిర్వహించిన నర్సింగ్ కాలేజీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. నర్సింగ్ కాలజీ మొదటి బ్యాచ్కు చెందిన 87 మంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. అందరూ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతమ్మ, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, ఏఓ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నేతన్నకు పొదుపు’ జాడేది?
అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్డి–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్డి–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్ ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లకుగాను రూ.2.64 కోట్లు మాత్రమే జమ -
ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపర్చాలి
అలంపూర్: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని డీసీహెచ్ఎస్ రమేష్చంద్ర అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆస్పత్రిలో పీహెచ్సీ వైద్యాధికారులు, పీఓ ఎంసీహెచ్ సర్వీసెస్, ఏరియా ఆస్పత్రి సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా ఆస్పత్రిలో మదర్ అండ్ చైల్డ్ కేర్ సర్వీసెస్ మరింత మెరుగుపర్చాలన్నారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. చికిత్స కోసం వచ్చే వారికి డైట్ సర్వీసెస్ అందించడం జరుగుతుందన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహ ణ మెరుగుపర్చాలన్నారు. జనరల్ సర్జరీలు, ఆప్త మాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ సేవలను ఆస్ప త్రిలో అందిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యశ్రీలో జనరల్ సర్జరీలో అప్రెంటిక్స్ ఫిస్టులా శరీరంలో కంతులు రొమ్ములో కంతులు థైరాయిడ్ సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్ బాష, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసన్న, డాక్టర్లు నిఖిల, సుహానా, ఆనస్తీషియా గిరిభాస్కర్, వైద్య సిబ్బంది సుబ్బలక్ష్మి, త్రివేణి పాల్గొన్నారు. -
సరిహద్దులు దాటిన లింకులు
● ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ నకిలీ ధ్రువపత్రాల దందా ● కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా సబ్ రిజిస్ట్రార్ ముద్రలు గుర్తింపు ● పోలీస్, రెవెన్యూ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..గట్టు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ కేంద్రంగా సాగిన నకిలీ ధ్రువపత్రాల తయారీ దందా వ్యవహారం ఏకంగా మూడు రాష్ట్రాలకు విస్తరించింది. ఇటీవల అయిజలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ను రెవెన్యూ అధికారులు తనిఖీ చేయగా నకిలీ ధ్రువపత్రాల ముద్రింపు దందా వెలుగు చూసిన విష యం తెలిసిందే. అయితే అయిజ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల సృష్టిలో గట్టు మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పైరవీకారుల ప్రమే యం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అయిజ టు గట్టు’ కథనం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ పత్రాల దందాలో పాత్రదారులు, సూత్రదారులను గుర్తించి.. శిక్షిస్తారా.. లేక ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తారా.. అన్న సందేహాలను ఇక్కడి వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, రైతుబీమా, భూ భారతి పోర్టల్కు సంబంధించి నకిలీ పత్రాలతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నకిలీ దందాలో భాగస్వాములుగా ఉన్న వారిలో ఇప్పటికే టెన్షన్ నెలకొంది. ఎక్కడ తమ పేర్లు బయట పడతాయోనని ఆందోళన చెందుతున్నారు. నకిలీ దందా నుంచి బయట పడేందుకు మార్గాలనే వెతుక్కుంటున్నారు. ఇప్పటికే ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ను రెవెన్యూ, పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకుని గుట్టు విప్పే పనిలో ఉన్నట్లు సమాచారం. దిమ్మతిరిగే వాస్తవాలు.. కంప్యూటర్ లోగుట్టును విప్పుతున్న క్రమంలో అధికారులు దిమ్మతిరిగే వాస్తవాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ నకిలీ దందా వ్యవహారం కేవలం అయిజ, గట్టు మండలాలకే కాకుండా.. ఏకంగా అంతర్ రాష్ట్ర స్థాయికి చేరుకున్నట్లు తెలిసింది. కర్ణాటకతోపాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన స్టాంపులు, ఆధార్ కార్డులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. కర్ణాటకలోని గుల్బర్గా సబ్ రిజిస్ట్రార్ స్టాంపు, సంతకం ఉన్న స్టాంపు, ఆంధ్రప్రదేశ్లోని పత్తికొండ ప్రాంతానికి చెందిన అధికారుల ముద్రలు, సంతకాలు ఉన్న స్టాంపులను గుర్తించినట్లు సమాచారం. ఇక గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ల సంతకాలకు సంబంధించిన స్టాంపు (ముద్ర)లను సైతం అధికారులు గుర్తించారు. వీటితోపాటు డిగ్రీ, ఎస్సెస్సీ సర్టిఫికెట్లు, ఆయా బ్యాంకులకు సంబందించిన నో డ్యూలు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. అయిజ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా కొనసాగిన నకిలీదందా వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
ఎర్రవల్లి: విద్యార్థులు విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పదో పటాలం కమాండెంట్ జయరాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో నిర్వహించిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్లో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం మోపకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి విద్యను అభ్యసిస్తూ తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధిరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నర్సింహారెడ్డి, శ్రీనివాసులు, రాజేశం, పాఠశాల హెచ్ఎం షేక్షావలి, ఉపాధ్యాయులు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం బస్తాలు తరలించండి అలంపూర్: కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న ధాన్యం బస్తాలు తరలించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో సోమవారం ఆర్డీఓ శ్రీనివాస్రావుకు తెలంగాణ రైతు సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు చేసి మార్క్ఫెడ్ సంస్థ వాటిని తరలించడంలో చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుండటంతో ఇక్కడే తమ ధాన్యం విక్రయించారని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని గోదాంలకు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా కొనుగో లు కేంద్రాల్లో 50 వేల క్వింటాళ్ల ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కేంద్రాల్లో నిలిచిన ధాన్యం బస్తాలను తరలించడానికి చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. అధికారులు ధాన్యం బస్తాల తరలింపులో స్పందించకపోతే జాతీయ రహదారి–44పై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైతు సంఘం నాయకులు మద్దిలేటి, రైతులు వెంకటేశ్వర్లు, నర్సింహరాజు, చాంద్బాష తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకపోతే పోరాటం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇవ్వాలని టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో 900మందికి 60–75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్బెడ్రూం ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పేదలకు మోసం మండిపడ్డారు. అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేస్తూ నిరుపేదలను క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ గూడు వింటారని ఆశతో ఏడాది నుంచి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే కలుస్తూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటం తప్పదని హె చ్చరించారు. అనంతరం ఆర్డీఓ నవీన్కు వినతిపత్రం అందజేశారు. -
వరి.. వర్షార్పణం
రాజోళి: ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ’ చందంగా మారింది రైతుల పరిస్థితి. పంటను పండించే వరకు నానా కష్టాలు పడి కాపాడుకుంటే.. కోత కోసి అమ్ముకుందామనేలోగా ప్రకృతి వైపరీత్యాలతో పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ఏడాది కూడా రైతుకు పూర్తిస్థాయిలో నష్టమే జరిగినట్లుగా అధికారుల అంచనాలు తెలుస్తున్నాయి. జిల్లాలో గత నెలలో కురిసిన అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న అరటి, మినుము, మామిడి పంటలతోపాటు.. అత్యధికంగా సాగవుతున్న వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో పైసా చేతికి రాలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లా పరిధిలో ఇలా.. గత నెలలో ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం కారణంగా పలుచోట్ల పంటలపై ప్రభావం తీవ్రంగా పడింది. రాజోళి మండలంలోని మాన్దొడ్డితోపాటు చుట్టు పక్కల గ్రామాలు, అయిజ మండలంలో తీవ్రంగా చూపడంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. గంటల వ్యవధిలోనే జిల్లా ఉన్నతాధికారులు గ్రామాలకు చేరుకుని పంటలను పరిశీలించారంటే నష్టం ఎంత మొత్తంలో ఉంటుందో ఊహించవచ్చు. అధికారుల అంచనా వేసిన దాని ప్రకారం 33 శాతంపైగా పంట దెబ్బతిందని గుర్తించారంటే ఆ పంటలు అసలు పనికి రావని నిర్ధారణ అయినట్లే. అలాంటి జాబితాలో ప్రస్తుతం పంటల వివరాలు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు 1,800 ఎకరాలకుపైగా (80 శాతం) పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరి కంకి మొత్తం రాలిపోయి.. పైరు అడ్డం పడిపోయి, నేలరాలిన గింజ దేనికి పనికి రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి బలైన రైతు అధికారుల అంచనాల్లోనే 1,800 ఎకరాలకుపైగా పంట నష్టం జిల్లాలో సింహభాగం నష్టపోయింది వరి రైతులే.. 85 శాతం మేర పూర్తిగా నష్టపోయినట్లు గుర్తింపు పరిహారంపైనే రైతుల ఆశలు -
ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వద్దు
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులపై పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో 74 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలన్నారు. అలాగే మండలాల్లో అధికారులు ప్రజావాణిని సక్రమంగా నిర్వహిస్తే చిన్నపాటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జనాభా గణనలో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతి పంచాయతీ నుంచి కనీసం వందమంది పాల్గొనేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాకు 11 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇందుకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు మొక్కలు పెంచడానికి తమ పరిధిలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో గుర్తించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఎఫ్ఓ ఆశీస్సింగ్, ఎస్డీసీ కృష్ణ, ఏఓ భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన వరిధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజిలెన్స్ అధికారులు తమ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలన్నారు. రైతులతో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసి సకాలంలో వారికి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. -
10 ఎకరాలు పోయింది..
సొంత భూమితోపాటు కౌలు తీసుకున్న దానితో కలిపి మొత్తం 10 ఎకరాలు వరి పంట సాగు చేశాను. ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం రాలిపోయింది. చేనులోనే రాలిపోయిన గింజలను చూస్తే ప్రాణం తరుక్కుపోతుంది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాను. – పాపన్న, రైతు, మాన్దొడ్డిఉన్నతాధికారులకు పంపాం.. అకాల వర్షానికి జిల్లాలో ఎక్కువగా రాజోళి మండలంలోని మాన్దొడ్డి పరిసర గ్రామాలు, అయిజ మండలంలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా వరి పంట చేతికి రాని విధంగా తయారైంది. పంటలో జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాం. – వీరప్ప, డీఏఓ ● -
టెండర్ ప్రక్రియ పూర్తి..
జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరమ్మతు పూర్తి చేస్తాం.. జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ● -
మత్తు.. భవితకు చేటు
గద్వాల క్రైం: గంజాయి, డ్రగ్స్, పొగాకు వంటి మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది. చెడు వ్యవసనాలపై ఉక్కుపాదం మోపుతూ, చట్టాలపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – పల్లె ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ప్రధాన అంశమైన పిల్లల రక్షణ, మత్తు పదార్థాల రహిత నవ సమాజ నిర్మాణ కార్యాక్రమాన్ని వారం రోజల పాటు వారోత్సవాల కార్యచరణ చేపట్టింది. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. విక్రేతలపై కేసులు నమోదు చేసి, బహిరంగ మార్కెట్లో వాటి సరఫరాకు అడ్డుకట్ట వేసింది. తాజాగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అధికారులు ప్రజల వద్దకు చేరుకుని చట్టాలపై ప్రజలను చైతన్యం పరుస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల, రైల్వేస్టేషన్, బస్టాండ్, అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెడు వ్యసనాలకు ఆకర్శితులై.. ప్రభుత్వం మత్తు పదార్థాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో చేరడం లేదనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు అధికారులు నిరంతరం నిఘా పెట్టినా చెడ్డు వ్యవసనాలకు ఆకర్శితులైన కొందరు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువతపై పోలీసు శాఖ నిఘా ఉంచి, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న దాడులు, చిన్నారులపై జరుగుతున్న వికృత చేష్టలపై (బ్యాడ్ టచ్, గుడ్ టచ్) విషయాలు తెలియజేస్తున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే సమస్యలు, లైగింక దాడులు, పోక్సో కేసుల తీవ్రత, లింగ సమానత్వం, పౌష్టికాహారం వినియోగంతో పాటు విద్య, వైద్య సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్య అంటే కేవలం ఉద్యోగం, డబ్బు సంపాదించడం కాదనే విషయాన్ని యువత గుర్తించాలని, జీవనశైలి అలవరుస్తుందన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు, భరోసా సెంటర్ నిర్వాహకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలతో మమేకమై మత్తు పదార్థాల నిర్మూలనపై పోరాడాలని సూచిస్తున్నారు. గంజాయి తాగినా, అమ్మినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలనే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రత్యేక నిఘా.. గ్రామాల్లో 15 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువకుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. వేసవి సెలువుల నేపథ్యంలో వారిని స్కిల్ డెవలప్మెంట్ వైపు మళ్లించేలా చూస్తున్నారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునే సమయంలో యువత తీసుకునే మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం వంటి వాటిపై మఫ్టీ పోలీసులు నిరంతరం కూపీలాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలన వారోత్సవాలు ప్రజాపాలన–పల్లె ప్రగతి కార్యక్రమంలో కసరత్తు మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం అన్ని శాఖల సమన్వయంతోకార్యక్రమాలు చట్టాలపై అవగాహన అవసరం -
నేడు ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి : కలెక్టర్
అలంపూర్: క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్యార్డు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే ప్రజావాణిలో అన్ని శాఖల డివిజన్స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు డిప్యూటీ తహసీల్దార్లు వేణుగోపాల్రెడ్డి, వెంకటరమణలను పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదులను సీజీజీ ప్రజావాణి పోర్టల్లో నమోదుచేసి.. అంగీకార పత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు. ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్లో పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాటా దక్కడం లేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వంనుంచి మనకు ప్రత్యేకంగా ఒరిగిందేమి లేదని అసహనం వ్యక్తం చేశారు.అయిజ టు గట్టు ● నకిలీ పత్రాల తయారీ దందాలో గట్టుకు లింకులు ● కూపీ లాగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు – వివరాలు 8లో.. -
ప్రశాంతంగా నీట్
● 911మంది అభ్యర్థులు హాజరు బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద అభ్యర్థులు, వారి కుటుంబీకుల సందడి గద్వాల: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు.. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో మొత్తం 930 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 911మంది అభ్యర్థులు హాజరైనట్లు పరీక్షల కో–ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష కొనసాగగా.. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ శంకర్ పర్యవేక్షించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు కో–ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి తెలిపారు. -
సన్నాలకే మొగ్గు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. -
కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. -
పంట కోసి 15 రోజులు..
వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి దాదాపు 15 రోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఒక్కరోజు మాత్రమే దొడ్డు వడ్లను కొనుగోలు చేసి మధ్యలోనే ఆపేశారు. వడగండ్ల వానలు పడుతుండటంతో చేతికొచ్చిన పంట ఆగమవుతుందని పానం గుబులవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వడ్ల కుప్పలకు టార్పాలిన్ కవర్లను కప్పుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలి. – బోయ పరశురాముడు, రైతు, కొండేరు గ్రామం, ఇటిక్యాల● -
ప్రగతి వైపు పయనించాలి
జిల్లావ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తు, యువతను ప్రగతి వైపునకు తీసుకురావాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గద్వాలను గంజాయి రహిత జిల్లాగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వారం రోజులపాటు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాల్య వివాహాల వల్లన జరిగే సమస్యలు, మహిళలపై వేధింపులు, దాడులకు విధించే శిక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరుస్తున్నాం. – టి శ్రీనివాసరావు, ఎస్పీ ● -
మళ్లీ మొదటికొచ్చింది
ప్రయాణానికి ప్రతికూలంగా అంతర్రాష్ట్ర రహదారి అయిజ: అంతర్రాష్ట్ర రహదారి కర్నూలు– రాయచూరు రోడ్డుపై అయిజ సమీపంలో పెద్దవాగుపై సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలమైంది. రక్షణ గోడల రాళ్లు ఊడిపడ్డాయి. శిథిలమైన రోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే శిథిలమైన కాజ్వేను తొలగించి.. అదే ప్రదేశంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్ల అంచనాతో ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. 2024– 25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నుంచి ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అధికారులు ప్రతిపాదనలు పంపిన అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం, వాటికి నిధుల మంజూరు, సకాలంలో విడుదల చేయడం వంటివి చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం సమయం ముగియకముందే ప్రక్రియ మొత్తం పూర్తవ్వాల్సి ఉంటుంది. శిథిలావస్థలో నాలుగు కల్వర్టులు.. మండలంలోని వెంకటాపురం నుంచి అయిజ పట్టణం వరకు గతంలో నిర్మించిన కల్వర్టులు శిథిలమయ్యాయి. బీటీ రోడ్డుపై అనేక చోట్ల మోకాలులోతు గోతులు ఏర్పడ్డాయి. వాటిని తొలగించి నూతనంగా కల్వర్టులు నిర్మించేందుకు గతేడాది రూ.3 కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెక్నికల్ డ్రాయింగ్ అప్రూవల్ కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చుట్టపు చూపుగా వెళ్లి పరామర్శించడం, మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం చేస్తున్నారే గాని సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు వెళ్లలేని దుస్థితి నిధులున్నా ప్రారంభించని కల్వర్టు పనులు ఇప్పటికీ పూర్తికాని డ్రాయింగ్ అప్రూవల్ కొత్తగా ప్రతిపాదనలు పంపాలంటున్న ప్రభుత్వం -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
గద్వాల: అబద్ధపు హామీలతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ క్రమంలోనే బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే జనాగ్రహ సభకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆమె స్థానిక బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారం కోసం అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనాగ్రహసభ నిర్వహిస్తున్నామని, ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలించి రాష్ట్రాన్ని అప్పులకుప్పుగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను నమ్మి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. గతంలో వాజ్పేయి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ అని, అనంతరం మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది కూడా అదే పార్టీ అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోనూ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి ఎన్నికై న నరెంద్రమోదీ తొలిసారిగా ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవరావు, రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, వెంకట్రాములు, రవికుమార్, శివారెడ్డి, రాజగోపాల్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
అంజన్న నామస్మరణతో మారుమోగిన బీచుపల్లి
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి నామస్మరణతో మారుమోగింది. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి, చౌకిసేవ, బలిహరణం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలలో భాగంగా మొదటి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలను ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. దాసంగాలతో మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి ఆంజనేయస్వామికి సమర్పించారు. అనంతరం ద్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల కొనుగోళ్లతో ఆలయాల పరిసరాల్లో వెలసిన వివిధ దుకాణాలు రద్దీగా మా రాయి. కార్యక్రమంలో ఈఓ పురేందర్ కుమార్, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
గద్వాల: విద్యార్థులు చదువుతోపాటు వివిధ రకాల కళల్లోనూ రాణించాలని, ఇందుకోసం బాలభవన్లో వివిధ అంశాలపై ఇచ్చే వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శనివారం గద్వాల బాల భవన్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే పాగ పుల్లారెడ్డి 107వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో పిల్లలు సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ సమయాన్ని వృథా చేయకుండా బాలభవన్లో నేర్పించే శాసీ్త్రయ, జానపద నృత్యం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ పొందితే గొప్ప కళాకారులుగా రాణించే అవకాశం ఉందన్నారు. ఒకే అంశంలో కాకుండా విభిన్న రంగాల్లో శిక్షణ పొంది బహుముఖ ప్రజ్ఞశాలురుగా పేరు తెచ్చుకోవాలన్నారు. విద్యార్థులు తాము నేర్చుకునే నృత్యం, సంగీతం, వేదికలపై స్టేజీఫియర్ లేకుండా ధైర్యంగా ప్రదర్శించాలన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా త్వరలో విద్యా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒకరోజు బాలభవన్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కలెక్టర్ బాలభవన్ విద్యార్థులతో నేర్చుకునే వివిధ అంశాల గురించి వారి భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడారు. అంతకు ముందు బాలభవన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి పూర్వ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చూపిన ప్రతిభ సాధించిన అవార్డులు అక్కడ ఇస్తున్న శిక్షణ గురించి క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, డాక్టర్ అనంతలక్ష్మి, విద్యాశాఖ అధికారులు శ్రీనివాసులు, మైఖేల్, సత్యం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అడవి ‘బయటికి’ బిడ్డలు
●జీవనోపాధి కావాలి.. ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలని అంటున్నారు. ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్ చేపట్టాలి. పునరావాసంతోపాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్ బైల్, అమ్రాబాద్ మండలం పరిహారం ఇస్తేనే వెళ్తాం.. అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య,తాటిగుండాలపెంట సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు. సంఘర్షణ నిర్మూలన కోసం.. అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. స్పష్టత కరువు నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వా రికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బా చారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీల ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది. పరిహారం అందితేనే రీలొకేషన్కు.. నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. నల్లమలలో చెంచుపెంటల తరలింపు ప్రక్రియ వేగవంతం మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు బలవంతం లేదు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. రీలొకేషన్ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్చంద్ర, ఐఎఫ్ఎస్ అధికారి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ -
ప్రతిపాదనలు బుట్టదాఖలు..
అయిజ సమీపంలోని పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్ల అంచనాతో ఆర్అండ్బీ ఈఈ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, ఇంత వరకు నిధులు మంజూరు కాలేదు. అదేవిధంగా నాలుగు కల్వర్టులు పునర్ నిర్మించేందుకు 2024లో రూ.3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. – నజీర్, అయిజ మరమ్మతు చేపట్టాలి.. క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు ఎక్కువగా అంబులెన్స్లు గద్వాల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు కర్నూలుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి కాజ్వే పూర్తిగా దెబ్బతినడంతో రోడ్డుపై వేగంగా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాల మీదకు వస్తుంది. హైలెవల్ బ్రిడ్జి నిర్మించి, కల్వర్టులలకు మరమ్మతు చేస్తే బాగుంటుంది. – తిరుమలేష్, 108 సిబ్బంది ప్రతిపాదనలు పంపించాం.. అయిజ పెద్దవాగుపై శిథిలమైన కాజ్వేను తొలగించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఆర్థిక సంవత్సరం ముగియడంతో మళ్లీ ఈసారి కొత్తగా పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తయి నిధులు విడుదలైతేనే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిస్తాం. అలాగే నాలుగు కల్వర్టులు నిర్మించేందుకు 2024లో రూ.3 కోట్లు మంజూరయ్యాయి. టెక్నికల్ డ్రాయింగ్ అప్రూవల్కు పంపాం. – అల్తాఫ్, ఆర్అండ్బీ ఏఈ ● -
రాయితీ.. అనాసక్తి!
–8లో uగద్వాలన్యూటౌన్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు కల్పించిన 5శాతం రాయితీకి ఆదరణ కరువైంది. ఇందుకు నెలరోజుల సమయం ఉన్నా.. చాలా తక్కువ మంది మాత్రమే ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్లో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు సైతం దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు. నాలుగు మున్సిపాలిటీల్లో ఓ మోస్తారుగా మాత్రమే ఆస్తిపన్ను చెల్లించారు. ప్రచారం చేసినా ఫలితం శూన్యం.. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఉన్న నివాసగృహాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి ప్రతి ఏడాది ఆస్తిపన్ను వసూలు చేస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలపాటు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు బృందాలుగా ఏర్పడి పన్ను వసూలు చేపట్టారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు గత ఆర్థిక సంవత్సరం (2025–26) పన్నుల వసూలులో లక్ష్యాన్ని చేరుకోలేదు. 60 నుంచి 70 శాతానికి చేరుకోవడానికి సైతం తడబడ్డాయి. తాజాగా మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. ఏప్రిల్లో ముందస్తుగా పన్ను చెల్లించే వారికి రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది మొత్తం చెల్లించాల్సిన పన్నులో 5శాతం మినహాయిస్తామని ప్రకటించింది. ఇందుకు పట్టణాల్లో ప్రచారం కోసం ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. బిల్ కలెక్టర్లు కాలనీల వారీగా అవగాహన కల్పించారు. అయినప్పటికీ ప్రజల నుంచి మాత్రం స్పందన అంతగా రాలేదని చెప్పవచ్చు. మున్సిపాలిటీల్లో ముందస్తుఆస్తిపన్ను వసూలు అంతంతే 5శాతం రాయితీతో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం జిల్లాలోని నాలుగు పురపాలికల్లోఓ మోస్తారుగా మాత్రమే చెల్లింపు ఫలించని అధికారుల ప్రచారం -
‘మొక్కజొన్న తరలింపులో నిర్లక్ష్యం’
అలంపూర్: రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి ఆరోపించారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అలంపూర్ మార్కెట్యార్డు కొనుగోలు కేంద్రంలోనే దాదాపు 40వేల బస్తాలు నిల్వ ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ధాన్యం కాంటా చేసిన తర్వాత రైతులకు కనీసం రశీదు కూడా ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న, వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. మదనగోపాలుడి రథోత్సవం కొల్లాపూర్: పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో శ్రీరుక్మిణీ సత్యభామ సమేత మదనగోపాలస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవానికి సమీప గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పచ్చటి తోరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి.. వేదమంత్రోచ్ఛారణ, భాజాభజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సురభి రాజవెంకటలక్ష్మాదిత్యారావు, సర్పంచ్ పద్మమ్మ, గోవిందుగౌడ్, భీంరెడ్డి, ఉపసర్పంచ్ ప్రమోద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీలకు పైసల్లేవ్..!
‘ఇందిరమ్మ కలలను సాకారం చేద్దాం’ పాలమూరు: ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ భారంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతి పీహెచ్సీకి హెచ్డీఎఫ్ (హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు రాక వసతులు సమకూర్చుకోలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు పీహెచ్సీ అభివృద్ధి కమిటీకి ఎంపీపీలు అధ్యక్షులుగా ఉండి విడుదలయ్యే నిధులపై పర్యవేక్షిస్తుండేవారు. వారి పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటంతో వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సరైన వసతుల కల్పన లేకపోవడంతో చాలా వరకు వైద్యాధికారులు పీహెచ్సీల వైపు చూడటం లేదు. చివరగా 2023 మార్చిలో.. మహబూబ్నగర్ జిల్లాలోని 17 పీహెచ్సీలు, ఆరు యూపీహెచ్సీలకు, మూడు సీహెచ్సీలకు గత మూడేళ్లుగా నిధుల కేటాయింపు లేవు. చివరగా 2023 మార్చిలో రూ.59.46 లక్షల నిధులు విడుదల కాగా.. దీంట్లో రూ.37.14 లక్షలు ఖర్చు చేశారు. తాజాగా ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద కేవలం 9 పీహెచ్సీలకు కలిపి రూ.6 లక్షలు విడుదల చేయగా దీంట్లో ఒక్కో పీహెచ్సీకి రూ.50 వేల చొప్పున.. ఒక్క రాజాపూర్ పీహెచ్సీకి మాత్రం రూ.2 లక్షలు విడుదల చేశారు. ● గద్వాల జిల్లాలో గత మూడేళ్లు నిధులు లేకపోవడంతో పీహెచ్సీల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద ఆరు పీహెచ్సీకు రూ.6.35 లక్షలు విడుదలైన నిధులు తప్పా ఇతర బడ్జెట్ రాలేదు. ● వనపర్తి జిల్లాలో కేవలం హెచ్డీఎస్ కింద 2023– 24 ఏడాదిలో మొత్తం 13 పీహెచ్సీలలో ఒక్కోదానికి రూ.1.39 లక్షలు విడుదల చేయగా.. 2024– 25లో ఒక్కో పీహెచ్సీకి రూ.61,579 విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి నిధుల కేటాయింపులకు నోచుకోలేదు. ● నారాయణపేట జిల్లాలో 11 పీహెచ్సీలు ఉండగా 2023 అక్టోబర్ నుంచి హెచ్డీఎస్ నుంచి కానీ కాయకల్ప విభాగం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 69ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నేషనల్ హెల్త్ హెల్త్ మిషన్ కింద ప్రతి ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి కింద ఒక్కో పీహెచ్సీకి రూ.1.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యేవి. వీటి ద్వారా ఆయా పీహెచ్సీల్లో అభివృద్ధి కమిటీ తీర్మానం మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేవారు. అయితే గత మూడేళ్లుగా నిధులు మంజూరు ఊసేలేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా కనీస సౌకర్యాలు లేక పీహెచ్సీకి వచ్చిన రోగులతోపాటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ వస్తువులు మరమ్మతుకు గురైనా వాటిని బాగు చేయించే పరిస్థితి లేక సిబ్బంది సతమతమవుతున్నారు. అవసరాలు తీరేదెలా? బడ్జెట్ కేటాయింపు లేకపోవడంతో పీహెచ్సీల్లో అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ భవనంలో చిన్నపాటి మరమ్మతు, పరిసరాలు శుభ్రం చేయడానికి వర్కర్లకు కూలీ, చిన్నపాటి పరికరాలు, బ్లడ్గ్రూప్ టెస్ట్ కిట్ల కొనుగోలు, విద్యుద్దీపాలు, టాయిలెట్స్ నిర్వహణ, రిజిస్టర్లు కొనుగోలు ఇలా ప్రతీది సమస్యగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ పరిధిలోని గర్భిణులతోపాటు దీర్ఘకాలిక రోగులు ఇతర వివరాలను ఆన్లైన్లో నమో దు చేయాలంటే తప్పక ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. దీనికి ఏటా రూ.6వేల వరకు ఖర్చు అవుతుంది. వీటికి కూడా నిధులు లేకపోవడంతో పలుచోట్ల వైద్యాధికారులే సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. గట్టు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంరమణీయం.. అంజన్న రథోత్సవం బీచుపల్లి క్షేత్రంలో అభయాంజనేయస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంజన్న రథోత్సవానికి వేలాది భక్తులు తరలివచ్చి.. భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. – ఎర్రవల్లి – వివరాలు 8లో..ఊట్కూర్: ఇందిరమ్మ కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని యువజన క్రీడల మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని ముగ్దుంపూర్లో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోనప్ప దంపతులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. సొంతిల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో ఎంతోమంది నిరుపేదలు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికీ కూడా ఇళ్లను మంజూరు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో ఇల్లు లేని వాళ్లే ఉందకూడదని, విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేద్దామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలేష్, యజ్ఞేశ్వర్రెడ్డి, ఎల్కోటి జనార్దన్రెడ్డి, సూర్యప్రకాష్రెడ్డి, కోరం మహేష్రెడ్డి, రవికుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 69 పీహెచ్సీలకు అందని నిధులు గత మూడేళ్లుగా విడుదల కానిహెచ్డీఎస్, కాయకల్ప బడ్జెట్ నిర్వహణకు సైతం అవస్థలు.. పేరుకుపోతున్న సమస్యలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నాకనికరించని ప్రభుత్వం నెట్ సదుపాయం కోసం సొంతంగా చెల్లిస్తున్న వైద్యాధికారులు -
ఇదీ పరిస్థితి..
గద్వాలలో 12,203 అసెస్మెంట్లతో 5శాతం రాయితీకి అర్హులుగా ఉన్నారు. వీరిలో కేవలం 2,660 మంది పన్ను చెల్లించి రాయితీ పొందారు. అయిజలో 8,223 అసెస్మెంట్లకు గాను 955 మంది రాయితీపై పన్ను చెల్లించారు. అదే విధంగా అలంపూర్లో 3,593 మందికిగాను 618 మంది, వడ్డేపల్లి మున్సిపాలిటీలో 4,132 మందికి గాను కేవలం 845 మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించి రాయితీ అవకాశాన్ని పొందారు. విస్తృత ప్రచారం చేశాం.. ఆర్థిక సంవత్సరం (2026–27)కు సంబంధించి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ వర్తిస్తుంది.. ఏడాదికి చెల్లించే పన్నులో రాయితీని మినహాయించి తీసుకున్నాం. ఇందుకోసం నాలుగు మున్సిపాలీటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాం. ఫ్లెక్సీలు సైతం ఏర్పాటుచేశాం. బిల్ కలెక్టర్లు వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. – నర్సింగ్రావు, అదనపు కలెక్టర్ ● -
3 నెలలకోసారి ఉద్యోగ మేళాలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు. ● ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ● 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. నియామక పత్రాల అందజేత ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు,యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మెగా జాబ్మేళాలో పాల్గొన్న 105 కంపెనీలు ఉమ్మడి జిల్లా నుంచి 3,450 మంది నిరుద్యోగుల హాజరు -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లోఅందరూ భాగస్వాములు కావాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా యంత్రాంగంతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల అధికారులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, పౌరులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతుభరోసా, రైతుబీమా, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను తెలియజేయడంతో పాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, ఇందిరమ్మ జీవిత బీమా పథకాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కాగా, జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలను తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. ఈ నెల 4 నుంచి నిర్వహించే రైతువారం కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. కార్మికుల కృషితోనే అభివృద్ధి.. సంఘటిత, అసంఘటిత కార్మికుల కృషితోనే ఏరంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో కార్మిక ఉపాధి, శిక్షణ, కర్మాగారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ కార్మిక దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజ అభివృద్ధికి కార్మికు లు ఎంతో బాధ్యతతో పనిచేస్తుంటారన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో అందించే లేబర్ కార్డులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు.. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తిచేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అఽధికారులతో ఆయన సమీక్షించారు. ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరును ఎంపీడీఓలు పర్యవేక్షిస్తూ.. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, లీగల్ సర్వీసెస్ అఽథారిటీ ప్రతినిధి రాజేందర్, సహాయ కార్మిక అధికారి వేణుగోపాల్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్ బాషా, డీఈఓ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఆర్డీవో ముసాయిదాబేగం ఉన్నారు. -
‘ఇందిరమ్మ’కు నీటి కష్టాలు!
రాజోళి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైందని సంతోషించే లోగా రాజకీయ కారణాలతో తమ పేరు మొదటి విడతలో వస్తుందా లేదా అనే ఆందోళన చెందారు. తీరా ఇల్లు మంజూరై నిర్మాణం ప్రారంభించాక తలెత్తుతున్న ఇబ్బందులతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా చాలా గ్రామాల్లో తాగునీటి కొరత ఉందనే సాకుతో నల్లా నీటిని ఇళ్ల నిర్మాణాలకు వినియోగించనివ్వడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణానికి క్యూరింగ్ చేసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సరిపోని సాయం.. తప్పని అప్పులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందించే రూ. 5లక్షల సాయం సరిపోకపోయినా.. లబ్ధిదారులు అప్పులుచేసి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం కోసం బోరుబావి డ్రిల్లింగ్, విద్యుత్మోటారు ఏర్పాటు లబ్ధిదారులకు అయ్యే పని కాకపోవడంతో నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. అయితే వేసవిలో తాగునీటి కొరత సాకుతో ప్రజాప్రతినిధులు, అధికారులు మిషన్ భగీరథ నీటిని ఇంటి నిర్మాణాలకు వినియోగించొద్దని లబ్ధిదారులకు తేల్చిచెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఏకంగా ఇందిరమ్మ ఇళ్లకు మిషన్ భగీరథ నీటిని వినియోగించే వారి నల్లా కనెక్షన్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు గత సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్ర భుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలకు మోకాలడితే ఎలా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలక్యూరింగ్కు అవస్థలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటినివినియోగించుకోనివ్వని వైనం బిందెలతో నీటిని తెచ్చుకుంటున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల పూర్తిపై నీలినీడలు -
భానుడి విలయతాండవం
పాలమూరు: రోజురోజుకూ భానుడు విలయతాండవం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. మార్చి రెండో వారం నుంచే వేసవి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందినట్లుగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్ధరాత్రి తర్వాత చల్ల గాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మే నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగి అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకుల హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. ఊపిరాడనంత కష్టం వారం రోజులుగా ఎండల తీవ్రతకు ఊపిరి కూడా ఆడడం లేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా దాదాపు ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలాల నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇందులో కర్బన వాయువుల మోతాదు అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని చెట్ల కింద సేదతీరితేనే కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఏటా పెరుగుదల.. ఉమ్మడి జిల్లాలో ఎండల ప్రభావంతో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు మృతిచెందారు. ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్ హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం కిడ్నీలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు శరీర ఉష్ణోగ్రత మాములు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. ఇవీ వడదెబ్బ లక్షణాలు శరీర నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. విపరీతమైన దాహం వేయడంతోపాటు శరీరం వేడెక్కుతుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, తూలడం, వాంతులు, కాళ్లు, కండరాలు పట్టేసి నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలుఇలా.. వడదెబ్బ లక్షణాలున్న బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. చల్లని నీరు ముఖంపై చిలకరించాలి కూలర్ లేదా ఏసీల వద్ద విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేయాలి. చల్లని నీరు లేదా ఐస్ ముక్కలతో నుదురు, శరీరంపై తుడవాలి. అరచేయి, కాళ్లకు రక్తప్రసరణ మెరుగుపడేలా రుద్దాలి. వీలైనంతా త్వరగా వైద్యులను సంప్రదించాలి. ఉమ్మడి పాలమూరులోతీవ్రమవుతున్న ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధుల ఉక్కిరిబిక్కిరి ముందస్తు జాగ్రత్తలతోనే వడదెబ్బ నివారణ చల్లని చెట్లతో ఉపశమనం అంటున్న వైద్య నిపుణులు -
టీజీజీడీఏ జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరావు
గద్వాల క్రైం: తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.నాగేశ్వరావు అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారిగా జిల్లా ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. పలువురు వైద్యులు పోటీచేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా డా.శ్యామ్, డా. ఎస్కే సిద్ధప్ప, కె.రాణి, జనరల్ సెక్రెటరీగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిరా, జాయింట్ సెక్రెటరీలుగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి, నవీన్క్రాంతి కుమార్, వృశాలి, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా వెంకటదాస్, రమేశ్చంద్ర, నరహరి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా వినోద్కుమార్, ప్రియాంక ఎన్నికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. నూతన కమిటీ సభ్యులను పలువురు ఆభినందించారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలుధరూరు: విత్తన డీలర్లు రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టి మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప హెచ్చరించారు. గురువారం ధరూరు రైతువేదికలో మండలంలోని సీడ్ విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వానాకాలంలో రైతులకు అవసరమయ్యే వివిధ రకాల విత్తనాలతో పాటు పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విత్తన విక్రయాలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. అదే విధంగా స్టాక్ బోర్డుపై రోజువారీగా ధరలను రాసి ఉంచాలన్నారు. విత్తనాలు కొనే రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలన్నారు. రైతులు కూడా విత్తనాలకు సంబంధించిన రశీదులను పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అల్వలపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏఓ శ్రీలత, ఏఈఓలు ఉన్నారు జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక వనపర్తి రూరల్: పెబ్బేరుకు చెందిన పరమేష్ జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ నాగరాజు గురువారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్–20 జట్టు ఎంపికలో పరమేష్ అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. మే నెల 3 నుంచి 25వ తేదీ వరకు ఛత్తీస్ఘడ్లో జరిగే జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడతారని పేర్కొన్నారు. గురువారం పట్టణంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి, వెంకట్, అఫ్సర్, రాజేందర్, సీనియర్ క్రీడాకారులు పరమేష్ను అభినందించారు. వేరుశనగ క్వింటా రూ.6,789 గద్వాలవ్యవసాయం/దేవరకద్ర: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు గురువా రం 89 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,789, కనిష్టంగా రూ. 4,229, సరాసరి రూ. 5,889 ధర పలికింది. అదే విధంగా 95 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,219, సరాసరి రూ. 5929 ధర లభించింది. 11 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,569, కనిష్టంగా రూ. 6,069, సరాసరి రూ. 6,559 ధరలు వచ్చాయి. 2,018 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,136, కనిష్టంగా రూ. 1,729, సరాసరి రూ. 1,919 ధరలు లభించాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ.2,319, కనిష్టంగా రూ.1,949 ధరలు పలికాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,820, కనిష్టంగా రూ.1,709 ధరలు లభించాయి. మార్కెట్కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
ఉజ్వల భవిష్యత్కు చదువే పునాది
గట్టు: ఉజ్వల భవిష్యత్కు చదువే పునాది అని.. చిన్నచిన్న కారణాలతో ఎవరూ కూడా మధ్యలోనే చదువును నిలిపివేయొద్దని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గొర్లఖాన్దొడ్డి రైతువేదికలో జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే తరాలు బలంగా ఎదగడానికి చదువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు అవాంఛనీయ ప్రభావాలు, ఆకర్షణలకు లోనై చదువును అశ్రద్ధ చేయొద్దని సూచించారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా చదువులో రాణించి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా బాల్యవివాహాలతో శారీరక, మానసిక ఎదుగుదల కుంటుపడుతుందని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. బాల్యవివాహం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా సెల్ఫోన్ అవసరానికి మించి వినియోగించొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అనాథ పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. సర్పంచ్ శ్వేత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారిణి సునంద, డీసీపీఓ నర్సింహ, ఎంపీడీఓ చెన్నయ్య, ఎస్ఐ శేఖర్గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవి, ఎంవీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ కిరణ్, చైల్డ్ లైవ్ సూపర్వైజర్ నవీన్, హబ్ కోఆర్డినేటర్ సరోజ తదితరులు పాల్గొన్నారు. -
మెగా జాబ్మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మెగా జాబ్మేళా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం శిల్పారామంలో జాబ్మేళా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. జాబ్ మేళాలో హైదరాబాద్ నుంచి సుమారు 80 కంపెనీలు, జిల్లాలో స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొననున్నాయని వెల్లడించారు. వీరికోసం 120 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మున్సిపల్, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీ శాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మా, ఉపాధి కల్పన అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వ యం చేసుకొని జాబ్ మేళాకు టెంట్లు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే స్టేజీ, స్టాళ్లలో కావాల్సిన సౌకర్యాలను రెవెన్యూ, జిల్లా విద్యా శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. పలువురు మంత్రుల రాక.. మేళాలో మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారని, నమోదు అనంతరం అభ్యర్థులను హాల్లో కూర్చోబెట్టి, ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతి ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామక పత్రం అందజేస్తారన్నారు. అలాగే పోలీస్ శాఖ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతోపాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. మేళాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎండీడీకేవై అమలులో ముందుండాలి
గద్వాల: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకం అమలులో జిల్లా ముందుండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ వీసీ హాల్లో సంబంధిత అధికారులతో పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తి సమాచార ఆధారిత పాలన ద్వారానే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ప్రతిశాఖ తమ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను కచ్చితమైన గుణాంకాలతో ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. చిన్న పురోగతినైనా నమోదు చేయాలని.. ఎక్కడా జీరో చూపించకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుత ప్రగతి మెరుగ్గా ఉండాలని.. ఇందుకు ప్రతినెలా డేటాను సరిచూసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సూచికలను సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పతకాలు ప్రజలకు సమర్ధవంతంగా చేరుతాయని తెలిపారు. సమావేశంలో డీఏఓ వీరప్ప, డీఆర్డీఓ ముషాహిదాబేగం ఉన్నారు. విద్యావ్యవస్ధ బలోపేతానికి కృషి జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచి, విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు పాల్గొనగా.. ఆమె పలు సూచనలు చేశారు. పదో తరగతి, ఇంటర్లో పెయిల్ ఆయిన విద్యార్ధులను అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. మే 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాగా, ఇటీవల ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లిన కలెక్టర్ రిజ్వాన్ బాషా అక్కడి విద్యా విధానం విశేషాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఫిన్లాండ్లో వృత్తి విద్యాకోర్సులు, డిజిటల్ బోధనా పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీసీలో డీఈఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ ప్రతిభ, సీ్త్ర వైద్య నిపుణులు, మహబూబ్నగర్ నీరు ఎక్కువగా తాగాలి ఎండల తీవ్ర త కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి. – డాక్టర్ స్వరూప్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ ● -
అనారోగ్యానికి గురయ్యా..
నిత్యం వాటర్ట్యాంకు నుంచి బిందెలతో నీరు తెచ్చుకుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నా. ఈ క్రమంలో గుండెలో సమస్య ఏర్పడింది. అలాగే పనికి వెళ్లడంతో అక్కడే పడిపోయాను. గ్రామస్తులు ఇంటికి చేర్చారు. మాలాంటి వారు ట్యాంకు నుంచి నీరు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నీటి వసతి కల్పించాలి. – లక్ష్మక్క, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు, ముండ్లదిన్నె ఇబ్బంది పడుతున్నాం.. ఇల్లు మంజూరైందని సంతోషపడాలో.. లేక క్యూరింగ్ చేసుకునేందుకు నీటి కష్టాలు తప్పడం లేదని బాధపడాలో తెలియడం లేదు. కొళాయి ద్వారా నీరు పట్టుకునేందుకు వీలు లేకుండా చేశారు. కాని కొందరి ఇళ్లకు మాత్రం ప్రత్యేకంగా కొళాయిలు ఏర్పాటుచేశారు. ట్యాంకుల నుంచి రోజూ ఉదయం, సాయంత్రం నీరు తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు నీరు అందించే ఏర్పాటుచేస్తే బాగుంటుంది. – నాగేశ్వరమ్మ, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు, ముండ్లదిన్నె క్షేత్రస్థాయిలో నిఘా ఉంచుతాం మిషన్ భగీరథ ద్వారా ఇంటి నిర్మాణాలకు నీరు ఇవ్వలేం. కానీ కొందరు నర్సరీలు, ఇళ్లకు ప్రత్యేకంగా నల్లాలు ఏర్పాటుచేశారని సమాచారం. ఈ విషయమై గ్రామ పంచాయతీ అధికారులు, మండల అధికారులకు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచమని చెబుతాం. అలాంటి వాటికి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. – శ్రీధర్రెడ్డి, మిషన్ భగీరథ డీఈ ● -
పదిలో మెరుగు
గద్వాల: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు గతం కంటే కొంత మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 8,037 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 7,549 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 4,001మంది బాలికలు, 3,548 మంది బాలురు ఉన్నారు. బాలికలు 95.49శాతం, బాలురు 92.23శాతం ఉత్తీర్ణత సాధించగా.. మొత్తం 93.93శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే జిల్లా 29వ స్థానంలో నిలిచింది. 2024–25 విద్యా సంవత్సరంలో 91.74 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 26వ స్థానంలో నిలువగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయిలో మూడు స్థానాలు పడిపోయి 29వ స్థానానికి చేరింది. ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. ముందంజలో నిలపాలి: కలెక్టర్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 93.9శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 29వ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ముందుంజలో నిలిచేందుకు విద్యాశాఖ అధికారులు కృషిచేయాలని సూచించారు. విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్లో ఇదేస్ఫూర్తితో ముందుకుసాగి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పలు పాఠశాలల విద్యార్థులను అభినందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పూజిత 577, మరో 20మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి ప్రైవేటుకు ధీటుగా ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. రీకౌంటింగ్.. రీవెరిఫికేషన్కు.. జవాబుపత్రాలను రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టు కోసం రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని సూచించింది. గురువారం నుంచి వచ్చేనెల 14 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వీరితోపాటు ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం మే 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండగా.. జూన్ 6 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 55 పాఠశాలల్లో వందశాతం.. జిల్లావ్యాప్తంగా 55 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 34 ఉండగా, ప్రైవేటు స్కూళ్లు 21 ఉన్నాయి. అదే విధంగా గద్వాల ప్రభుత్వ పాఠశాల, అయిజ మండలం ఉత్తనూరు పాఠశాలకు చెందిన విద్యార్థులు పి.పూజిత, పి.పవిత్ర 577 మార్కులతో జిల్లా టాపర్లుగా నిలిచారు. ప్రైవేటు పాఠశాలకు చెందిన టి.అభిరామ్ 591 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చాటాడు. సంతోషంగా ఉంది.. నాకు 577 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను బాగా చదువుకునేందుకు అమ్మ సుజాత, నాన్న గోవిందు ఎంతో సహకరించారు. అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. భవిష్యత్లో ఇదేస్థాయిలో చదివి పర్యావరణ ఇంజినీరు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. – పి.పూజిత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గద్వాల 93.93శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లాకు 29వ స్థానం 8,037మంది విద్యార్థులకు గాను 7,549 మంది పాస్ గతం కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం 55 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు -
బీచుపల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అర్చకులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా.. మొదటి రోజు ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, పల్లకీసేవను వేద పండితుల మంత్రోచ్ఛరణలతో చేశారు. అదేవిధంగా రాత్రి తెప్పతేరు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్కుమార్, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ప్రత్యేక పూజలు ఉత్సవాలను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఎస్పీ తోట శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈఓ పురేందర్కుమార్ ఆయనకు శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ విశిష్టతను గురించి వివరించారు. ఎస్పీ వెంట సీఐ ప్రదీప్కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించం
గద్వాల: సీడ్ కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన డబ్బులను సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తే సహించమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో సీడ్ కాటన్పై వ్యవసాయశాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సీడ్ పత్తికి సంబంధించిన పలు కంపెనీలు కొన్ని నెలలుగా బకాయి లు చెల్లించకపోవడంతో రైతులు, ఆర్గనైజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీడ్ కంపెనీలు ఎలాంటి ఆలస్యం లేకుండా పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలని.. లేనిపక్షంలో సదరు కంపెనీ యాజమాన్యాలకు షోకాజు నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా కంపెనీలు నిర్ణీత గడువులోగా విత్తనాల సర్టిఫైడ్ పరీక్షలు పూర్తిచేసి.. నివేదికలు సమర్పించాలన్నారు. రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీల మధ్య రౖతైపాక్షిక ఒప్పందాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఒప్పందాల్లో చెల్లింపుల గడువు, బాధ్యతలు, గడువులోగా డబ్బులు చెల్లించకుంటే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునేలా అన్ని అంశాలను పొందుపర్చాలని సూచించారు. ఒప్పందం లేకుండా విత్తన కొనుగోలు లేదా ఉత్పత్తి కార్యకలాపాలు అనుమతించబోమని అన్నారు. అదే విధంగా సీడ్ కంపెనీలు రైతులకు తగిన శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలు అందించడం లేదని గుర్తించామని.. ఇకనుంచి క్షేత్రస్థాయి సందర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో వేలాది రైతులు సీడ్పత్తి సాగుచేస్తున్నారని.. కంపెనీలు, ఆర్గనైజర్లు పరస్పర సహకారం లేకపోతే సీడు వ్యవస్థనే దెబ్బతినే ప్రమాదముందని తెలిపారు. అనంతరం జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. దుకాణాల వద్ద స్టాక్ వివరాలు, ధరల పట్టి క, రికార్డుల నమోదు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ శంకర్, డీఏఓ వీరప్ప తదితరులు ఉన్నారు. సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీలు నిబంధనలు పాటించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
అమరచింత: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కేజీ రామచందర్ ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని మార్క్స్ భవనంలో జరిగిన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శుల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, పంటలకు మద్దతు ధర కల్పించడం, నాణ్యమైన విత్తనాలు అందించడం లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్న సంపాదన వారికి దోచి పెట్టడమేగాక ప్రశ్నిస్తున్న గొంతుకలకు నొక్కేస్తోందని ఆందోళళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా నిధులు సకాలంలో ఇవ్వకపోగా కోతలు విధిస్తోందని, పది ఎకరాలలోపు అందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్ల పెంపు నేటికీ అమలుగాక పోవడం శోచనీయమన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యడు ఎం.కృష్ణ, ఉమ్మడి జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంచందర్, జిల్లా కార్యదర్శి హన్మంతు, ప్రసాద్, గణేష్, రాజన్న, మస్లమణి పాల్గొన్నారు. -
పారదర్శకంగా జనగణన
గద్వాల: జనగణన–2027 ప్రక్రియను సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింద ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగణనలో భాగంగా మంగళవారం ఆ యన తన చాంబర్లో స్వీయ గణన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి పౌరుడు మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషా ల వ్యవధిలో పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. వివరాల నమోదు అనంతరం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ జారీ చేయడం జరుగుతుందని.. ప్రభు త్వం నియమించిన ఫీల్డ్ ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చిన సమయంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే ధ్రువీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో నమోదుచేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధ్రువీకరిస్తారన్నారు. తద్వారా ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. అయితే స్వీయ గణనలో కచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం.. ప్రతిపౌరుడి వివరాలు నమోదు చేసేలా చూ డటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో సీపీఓ పాపయ్య పాల్గొన్నారు. ● వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖతో పాటు రెడ్క్రాస్ సంస్థ సహకారంతో స్థానిక రెండవ రైల్వే గేట్ సమీపంలో ఉన్న పాతసాయుధ దళాల కార్యాలయ ప్రాంగణంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ కార్యాలయం పక్కన డే కేర్ సెంటర్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్లో రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకు వృద్ధులకు మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, అల్పాహార సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో సెంటర్ను మూసివేయనున్నట్లు చెప్పారు. అర్హులైన వృద్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99494 63238 నంబర్ను సంప్రదించాలని సూచించారు. స్వీయ నమోదు అవకాశాన్నిసద్వినియోగంచేసుకోవాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
ముందుకు.. వెనక్కి..
సాక్షి, నాగర్కర్నూల్: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిల ప్రాంతంలోనే హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో.. కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షణం చేసేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి సోమశిల వరకు హెలికాప్టర్లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యేలా టూర్ ప్లాన్ చేపట్టింది. హెలికాప్టర్లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరొకరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరిజం ప్యాకేజీని బుక్ చేసుకునే సందర్శకులకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం.. సోమశిలతో పాటు అమరగిరి సమీపంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీపంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్నెస్, స్పిరిట్చువల్ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఆగస్టులోనే శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్నెస్ సెంటర్లో కా టేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్పూ ల్, ల్యాండ్స్కేప్ గార్డెన్, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశా రు. అయితే ఈ ప్రాజెక్ట్లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్నెస్, రిట్రీట్ ప్రాజెక్ట్ అటకెక్కింది. అసైన్డ్ భూముల్లో ఏర్పాటుతో.. హెలీటూరిజం ప్రాజెక్ట్ కింద హెలీప్యాడ్ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్ భూముల్లో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు హైదరాబాద్–సోమశిల హెలికాప్టర్ రైడ్ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్ పనులకు బ్రేక్ హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● రికార్డు స్థాయిలో 18వేల మెగావాట్ల వినియోగం ● ఆర్టిజన్ కార్మికులకు త్వరలోనే తీపికబురు ● టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ కల్వకుర్తి/చారకొండ/మన్ననూర్: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ 18వేల మెగావాట్లకు చేరినప్పటికీ.. వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంతో పాటు 33/11 కేవీ సబ్స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో నెలకొన్న సమస్యలను సిబ్బందితో తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పెరిగిన విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసినట్లు వివరించారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మరమ్మతు, లోడ్ మేనేజ్మెంట్ చర్యలతోనే ఈ స్థాయిలో సరఫరా సాధ్యమైందన్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశముందని.. అయినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది సమన్వయంతో పనిచేసి.. ఎక్కడా లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సబ్స్టేషన్ల ఆపరేటర్లు, లైన్మన్లే విద్యుత్ సంస్థకు నిజమైన బలమని చెప్పారు. వేసవి తీవ్రతలోనూ, అధిక లోడ్తోనూ నిరంతరం పనిచేస్తూ ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందిస్తున్న సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు త్వరలో శుభవార్త అందిస్తామని సీఎండీ పేర్కొన్నారు. వారి సమస్యలను సమగ్రంగా పరిశీలించి.. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా చారకొండ మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. విద్యుత్ కార్యాలయ భవనంతో పాటు ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని స్థానిక అధికారులకు సూచించారు. కాగా, ఆర్జిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని కోరుతూ ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు నాయిని పరంజ్యోతి సీఎండీకి విజ్ఞప్తి చేశారు. ● అమ్రాబాద్ మండలం మాచారంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం అమలు తీరును సీఎండీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు ఏర్పాటుచేసుకున్న సోలార్ సిస్టమ్, బోరుబావులతో పాటు పండ్ల తోటల సాగు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతు పెద్దిరాజు వ్యవసాయ క్షేత్రంలో గిరిజన రైతులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో గిరిజన రైతులు సాధిస్తున్న ప్రగతిని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ సీఈ బాలస్వామి, ఎస్ఈ వెంకటనర్సింహారెడ్డి, డీఈటీ రవికుమార్, డీఈఈ శ్రీధర్రెడ్డి, ఏడీఈలు ఆంజనేయులు, శంకరయ్య, ఎస్ఓ పార్థసారధి తదితరులు ఉన్నారు. -
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
గద్వాల క్రైం: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భరోసా కేంద్రం నిర్వాహకులు శివాణి, శిరీష కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కౌమర దశలోనే బాలికలకు వివాహం చేయడం వల్ల భవిష్యత్లో అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని.. ఎక్కడైనా బాల్యవివాహం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అదే విధంగా యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని.. వారిలో మార్పునకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీచుపల్లి ఈఓగా బాధ్యతల స్వీకరణ ఎర్రవల్లి: బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయ ఈఓగా పురేందర్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా అభయాంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, అర్చకులతో నిర్వహించిన సమావేశంలో ఆలయ అభివృద్ధి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. సద్వినియోగం చేసుకోవాలి వనపర్తి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళా నిర్వహిస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 1న మహబూబ్నగర్లో జాబ్ మేళా ఉంటుందని.. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగా http://satg.telangana.gov.in/prajapalana వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులను వేగంగా విచారించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా రాత్రివేళ పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేయాలన్నారు. ఇదివరకే నమోదైన కేసులను పారదర్శకంగా విచారించి.. బాధితులకు భరోసానివ్వాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటుచేయాలని సిబ్బందిని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో పాటు నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలన్నారు. స్టేషన్లో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 27 నుంచి మే 2వ తేదీ వరకు ప్రతి మండలంలో చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు, శ్రీకాంత్, శేఖర్, శ్రీహరి, నందికర్ ఉన్నారు. -
మార్కెట్ ఏర్పాటు చేయాలి..
కొల్లాపూర్లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. – సాయికృష్ణగౌడ్, మామిడి రైతు, సింగోటం ధరలు తగ్గించేశారు.. రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ ● -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. స్థాని క భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్ను సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నా రు. వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు భరోసా కేంద్రం నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు ప్రజావాణికి 13 ఫిర్యాదులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాలకు చెందిన 13మంది తమ సమస్యలపై ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు. -
మామి‘డీలా’..!
కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. టన్నుకు కనిష్టంగా రూ.20వేల ధర.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు. స్థానికంగా మార్కెట్ లేకపోవడమే సమస్య.. మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 45వేలకు మాత్రమే కొనుగోలు కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ఆందోళనలో మామిడి రైతులు -
జనగణనకు సహకరించండి
● అన్ని వర్గాలు స్వీయ గణనలోభాగస్వాములు కావాలి ● అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ గద్వాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన–2027కు అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్, జిల్లా ప్రధాన జనగణన అధికారి వి.లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నర్సింగ్రావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగణనలో భాగంగా ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు స్వీయగణనకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఎన్యూమరేటర్ల అవసరం లేకుండానే ప్రజలే తమ వివరాలను స్వయంగా సంబంధిత వెబ్సైట్లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https:// se.census.gov.in వెబ్సైట్లో వివరాల నమోదుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. అన్ని వర్గాల ప్రజల స్వీయగణనలో భాగస్వాములై జిల్లాను రాష్ట్రంలోనే ముందుండేలా సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ పాపయ్య ఉన్నారు. పెట్రోలియం కొరత నివారణకు చర్యలు జిల్లాలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేకుండా సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎనర్జీ సప్లయ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్బంకుల డీలర్లకు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ప్రాతిపదికన పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసేవారని.. ప్రస్తుతం ముందే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో సమస్య ఉత్పన్నమైందన్నారు. మూడురోజులుగా ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేనందున కర్నూలు, సమీప ప్రాంతాల ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం జిల్లాకు వస్తుండటంతో కొరత ఏర్పడిందన్నారు. పెట్రోల్బంకుల రోజువారీ రిపోర్టు ఆధారంగా ఇంధనం కోసం బుక్ చేసిన వెంటనే కంపెనీలు సకాలంలో సరఫరా చేసేలా పౌర సరఫరాలశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్, కమిటీ సభ్యులు వీరప్ప, సునంద, నుషిత ఉన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో మే 18నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో మే 1న మహబూబ్నగర్లో నిర్వహించే జాబ్మేళాలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఈ నెల 30న హైదరాబాద్లో నిర్వహించే యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 61 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు పంపించారు. నిర్ణీత సమయంలోగా ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇన్చార్జి డీవైఎస్ఓ రామలింగేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● ఎక్కడైనా అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే మంటలను ఆర్పివేసేందుకు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ● ఐఎస్ఐ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించాలి. ● కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలను పూర్తిగా ఆర్పివేయాలి. ● సెల్లార్లలో ఆటోమెటిక్ స్ప్రింక్లర్లను అమర్చుకోవాలి. ● వంటగదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్లు ఉంచొద్దు. ● స్కూల్, షాపింగ్ మాల్స్, ఆస్పత్రుల్లో కాంక్రిట్ స్లాబ్లను మాత్రమే పైకప్పుగా వాడాలి. ● గ్రామాల్లో గడ్డివాములను నివాసగృహాలకు కనీసం 60 అడుగుల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే నిల్వ చేసుకోవాలి. ● గుడిసెకు గుడిసెకు 30 అడుగుల దూరం ఉండాలి. ప్రమాదాల నియంత్రణకు కృషి.. అగ్నిప్రమాదాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఒడిదుడుకులను ఎదుర్కొటూ విపత్తులను అధిగమిస్తున్నాం. ప్రమాదాలు చోటు చేసుకున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. జిల్లాలో రెండు ఫైర్స్టేషన్ల ద్వారా సేవలను అందిస్తున్నాం. ఇంకా అవసరమైన మౌలిక వసతులు, సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. – అశోక్, జిల్లా అగ్నిమాపక అధికారి ● -
వారబందీ మరో రెండ్రోజులే..
● ఆయకట్టులో తుది దశకు చేరుకున్న పంటలు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రా జెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో యాసంగి వరి పంట తుది దశకు చేరుకోవడంతో కాల్వలకు మరో రెండ్రోజులు మాత్ర మే సాగునీరు వదలనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారంలో మూడురోజుల పాటు సాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ప్రాజెక్టులో 1.461 టీఎంసీల నీరు ఉండటంతో వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. పీజే పీ నందిమళ్ల డివిజన్ డీఈ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. నీటి అవసరం ఉందని ఒకరిద్దరు రైతులు అడుగుతున్నారని.. రెండురోజుల్లో సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. -
ఫిర్యాదు చేయండి..
జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్కుమార్, డీఈఓ సీజ్ చేయాలి కోచింగ్ సెంటర్లలో అధి క ఫీజులు, హాస్టల్ ఫీజు లు, మెటీరియల్ ఫీజులు సంఖ్యతో సంబంధం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వ సతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ అడ్డగోలుగా ఫీజులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. వెంటనే అధికారులు చర్య తీసుకోవాలి. జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు. హాస్టల్స్ కూడా ఇందులో నిర్వహిస్తున్నా పట్టింపు లేదు. – మారుతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● -
ఇదేం శిక్షణ!
ఉమ్మడి జిల్లాలో అడ్డగోలుగా కోచింగ్ సెంటర్ల నిర్వహణ ● ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్ ● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ● షార్ట్, లాంగ్టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు ● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. -
మరమ్మతుకు ఎదురుచూపులు
● ‘చంద్రగఢ్’కు రూ.6.58 కోట్లు మంజూరు ● టెండర్ పూర్తయినా అగ్రిమెంట్లో జాప్యం ● 9 ఏళ్లుగా నిరుపయోగంగా నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల ● చంద్రగఢ్ లిఫ్ట్లో తాజాగా కాలిన ప్యానల్ బోర్డు ● వేసవి నాటికి పనులు పూర్తయ్యేనా? అమరచింత: దేవరకద్ర నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్ మరమ్మతుల కారణంగా మరుగునపడింది. ఏళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించకుండా నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల మరమ్మతునకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించారు. అప్పట్లో మక్తల్ పర్యటనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని వేడుకోవడం, ఎనిమిది నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు వివరించడంతో వెంటనే రూ.6.58 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన జీఓ ప్రతులను సైతం సంబంధిత శాఖ అధికారులకు అందించడంతో టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియ 4 నెలల కిందట పూర్తవగా పనులు దక్కించుకున్న కంపెనీ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇదీ పరిస్థితి.. జూరాల ప్రాజెక్టు నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలను 2005లో రూ.50 కోట్లతో పూర్తి చేశారు. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా పైప్లైన్ నిర్మించారు. కాని కాంట్రాక్టర్ పనులు నాసిరకం చేపట్టడంతో పాటు పథకం నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించారు. నాణ్యత లేని పైపులు కావడంతో ఎక్కడికక్కడే పగిలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో పైపులు మార్చేందుకు నిధులు మంజూరుకు అనేక పర్యాయలు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. చంద్రగఢ్, బెక్కర్పల్లి ఎత్తిపోతల పరిధిలో ప్రస్తుతం 2,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది. ● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ మార్పు, లీకేజీలు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రికి వివరించగా.. వీటి కోసం త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు. ఎత్తిపోతల వారీగా ప్రతిపాదనలు.. ● నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్లైన్ మార్పు, చిన్న సంపుహౌజ్ల నిర్మాణం, కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటుకు రూ.2.52 కోట్ల ప్రతిపాదనలు చేశారు. ● చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డుతో పాటు పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ● బెక్కర్పల్లి ఎత్తిపోతలకు సంబంధించిన పనుల కోసం రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే ఇరిగేషన్శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాదికారులు, ప్రజాప్రతినిధులకు అందించా రు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి సైతం విన్న వించడంతో నిధులు మంజూరయ్యాయి. చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగి రెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో నిధులు మంజూ రయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు దక్కించుకున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్ప టి వరకు అగ్రిమెంట్ మాత్రం పూర్తి చేయలేదు. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తిచేసి మరమ్మ తులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ -
చదువు ప్రాముఖ్యతపై అవగాహన తప్పనిసరి
గద్వాల: అక్షరాస్యతలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు గాను ప్రతి ఒక్కరికీ చదువు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బడిబాట ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో నిరక్షరాస్యులైన పెద్దలకు అక్షరాలు నేర్పించాలని సూచించారు. చదువు మధ్యలో మానేసిన వారి కోసం ప్రభుత్వం సార్వత్రిక విద్యా కోర్సుల ద్వారా మరో అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు వర్తించే మధ్యాహ్న భోజన పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, చదువు మనిషికి ఆత్మస్థైర్యాన్ని, స్వయం సమృద్ధిని ఇస్తుందని పేర్కొంటూ అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్జ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి నుషిత, అక్బర్బాషా, రవీంద్రబాబు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. పేదలకు వరం
ధరూరు: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ధరూరు మండలం ఓబులోనిపల్లిలో పద్మమ్మ – చిన్నజమ్మన్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించి.. లబ్ధిదారుకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇదివరకే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో జాబితా విడుదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, శేఖర్, నాగన్న, సురేశ్, పాండు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు అలంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని ఎమ్మెల్యే విజ యుడు అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఫీజుల పోరుబాట పోస్టర్లను ఆదివారం అలంపూర్ చౌరస్తాలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కోసం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. వి ద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, కిషోర్ కుమార్, రఘురెడ్డి, నర్సింహ, మాధవ్, ఆనంద్ పాల్గొన్నారు. నేటి నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ గద్వాలవ్యవసాయం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి మే 23వ తేదీ వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు క్లస్టర్ ఇన్చార్జి, శాస్త్రవేత్త డా.శంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి, 40 గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఉద్యాన, పశుసంవర్ధకశాఖ అధికారులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. పాలిటెక్నిక్లో ప్రవేశాలకు దరఖాస్తులు వనపర్తిటౌన్: హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అనాథ బాలికల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడౠ్ల్యఓ కె.సుధారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన అనాథలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన, అక్రమ రవాణా బాధిత బాలికలు ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా కళాశాలలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. డీసీఈ, డీఈఈఈ, డీసీఎం, డీఈసీఈ, డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ. డిప్లొమా ఇన్ ల్యాడ్స్కేప్ డైసైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (అనాథ బాలికలకు అవసరం లేదు), అనాథ బాలికలు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, డిక్లరేషన్/బోనఫైడ్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్, పదోతరగతి మార్కుల మెమో (కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి), 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో మే నెల 25వ తేదీలోగా దరఖాస్తులను మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 84659 57488, 96037 24113 లేదా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ)లో సంప్రదించాలని సూచించారు. -
వాసవీమాతకు ప్రత్యేక పూజలు
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని కన్యాకా పరమేశ్వరిదేవి ఆలయంలో ఆదివారం వాసవీమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సామూహిక క్షీరాభిషేకాలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా హోమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉరేగింపు చేపట్టగా.. మహిళలు, చిన్నారుల కోలాటాలు, పోతరాజుల విన్యాసా లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బిలకంటి రాము, ప్రధానకార్యదర్శి నరహరి శ్రీనివాసులు, కోశాధికారి పత్తి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ నమోదు షురూ
–8లో uగద్వాలన్యూటౌన్: జనగణన–2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్, యాప్ ద్వారా మే 10వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. జనగణన మొదటి దశలో చేపట్టే ఇళ్ల లెక్కింపును 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొదటి దశలో ఇళ్ల గణన.. ప్రభుత్వం పదేళ్లకోసారి జనగణన నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా 2011లో జనాభాను లెక్కించారు. ఆ తర్వాత 2021లో కరోనా, ఇతరత్రా కారణాలతో జనగణన ప్రక్రియ ముందుకుసాగలేదు. 2027లో డిజిటల్గా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనగణనకు ఇళ్ల లెక్కింపు కీలకమైనది. ఇళ్ల గణన ద్వారా నివాసాల స్థితిగతులు, మౌలిక వసతులపై కచ్చితమైన సమాచారం సేకరించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మొదటి దశలో ఇళ్ల గణన కోసం గ్రామీణ ప్రాంతాల్లో 130 నుంచి 150, పట్టణ ప్రాంతాల్లో 230 నుంచి 250 నివాసగృహలతో హౌసింగ్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్ఎల్బీ)గా ఏర్పాటుచేశారు. బ్లాక్ వారీగా ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్తారు. ఈ గణనలో ఇంటి నిర్మాణ స్వభావం, యజమాని వివరాలు, ఇంటిలో ఉండే మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్, వంటగ్యాస్, మరుగుదొడ్డి, డ్రెయినేజీ.. ఇలా మొత్తం 33 వివరాలను సేకరిస్తారు. ఇళ్ల గణనతో ప్రభుత్వానికి విద్య, వైద్యం, రహదారులు, ఇళ్లు వంటి అంశాల్లో స్పష్టత వస్తుంది. దీన్ని ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తుంది. జిల్లాలో హెచ్ఎల్బీలు : 1,071 ఎన్యూమరేటర్లు : 1,087 సూపర్వైజర్లు : 191 ఇళ్ల గణన పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఇప్పటికే గణన అధికారులకు శిక్షణ అందించాం. సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. స్వీయ గణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అదే విధంగా క్షేత్రస్థాయి గణనలో భాగంగా ఇళ్లకు వచ్చే గణన అధికారులకు ప్రజలు వివరాలు తెలియజేసి, సహకరించాలి. – పాపయ్య, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జిల్లాలో మొదలైన జనగణన ప్రక్రియ మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం 11నుంచి జూన్ 9 వరకు క్షేత్రస్థాయి పరిశీలన, నమోదు ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం స్వీయ గణన నమోదు కోసం https://se.-ce nsus.gov.i n లింక్ ఓపెన్ చేసి.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ (హెచ్ఎల్ఓ) స్వీయగణన లాగిన్ వద్ద తెలంగాణ ఎంపిక చేయాలి. ఆ తర్వాత captcha ఎంటర్ చేసి, వెరిఫై, ప్రొసీడ్ క్లిక్ చేయాలి. అప్పుడు వెల్కం పేజీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడి నుంచి మూడు స్టెప్లలో అడిగిన వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఏతో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడీ వస్తుంది. ఈ ఐడీని నోట్ చేసుకోవాలి. మే 11 తర్వాత ఇంటికి వచ్చే గణన అధికారి (ఎన్యూమరేటర్)కు చూపిస్తే ఆయన అఫ్రూవ్ చేస్తారు. -
కాపు బాగా వస్తోంది..
నాకు మూడెకరాల మామిడి తోట ఉంది. ఏటా కాపు బాగానే వస్తోంది. ఈ ఏడాది పూత, పిందెలు రాలి కొంత దిగుబడి తగ్గింది. అయితే ధరలు బాగానే ఉన్నాయి. మా ప్రాంతంలో చాలా మంది రైతులు పండ్ల తోటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. – కొండయ్య, మామిడి రైతు, కేటీదొడ్డి రెండున్నరెకరాల్లో సాగు.. నేను రెండున్నర ఎకరాల్లో బత్తాయి తోట సాగుచేస్తున్నా. మా ప్రాంతంలోని నేలలకు పండ్ల తోటలు బాగా వస్తున్నాయి. వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటోంది. ఈఏడాది దిగుబడులు బాగానే వచ్చాయి. ప్రస్తుతం బత్తాయి ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. – మనోహర్రెడ్డి, బత్తాయి రైతు, షాబాద్, ఇటిక్యాల మండలం రైతులను ప్రోత్సహిస్తున్నాం.. పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇక్కడి రైతులు ఆసక్తి చూపుతున్నారు. పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను ఉద్యానశాఖపరంగా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకు సంబంధించి పథకాల అమల్లో అర్హులైన రైతులను గుర్తించి.. వారికి ప్రోత్సాహకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖాధికారి ● -
దాహం తీర్చడం గొప్ప సంకల్పం
అలంపూర్: ప్రజల దాహం తీర్చాలనుకోవడం గొప్ప సంకల్పమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలో పుల్లూరు గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుల్లూరు పంచాయతీ ద్వారా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీతమ్మ, ఉపసర్పంచ్ అబ్దుల్ నబీ, కార్యదర్శి శ్రీనివాసులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలువపందిళ్ల పరిశీలన : అలంపూర్ చౌరస్తాలోని నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వేసవి ఎండలు తీవ్రమవడంతో కలెక్టర్ పంచాయతీ తరుఫున చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. దీంతో అలంపూర్, అయిజ, గద్వాల, కర్నూలు రోడ్డు మార్గాల్లో నాలుగు చోట్ల ప్రయాణికులు బస్సులు ఎక్కి దిగే చోట చలువ పందిళ్ల్లు ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో చలువ పందిళ్లను పెంచాలని సూచించారు. -
తాగునీటి శాంపిల్స్ సేకరణ
ఉండవెల్లి: మండలంలోని కలుగోట్ల గ్రామస్తులు కొన్ని రోజులుగా కాళ్లు, చేతుల వాపు, కండరాళ్ల బలహీనతతో బాధపడుతున్నారు. సమాచారం అందుకున్న మిషన్ భగీరథ అధికారులు శనివారం గ్రామానికి చేరుకొని తాగునీటి శాంపిల్స్ సేకరించారు. వైద్యసిబ్బందికి ఇంటింటికెళ్లి పరీక్షలు చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కుటుంబీకులు అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొందరు కర్నూలులోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏఈఓ సస్పెన్షన్ కందనూలు: బిజినేపల్లి మండలం పాలెం క్లస్టర్లో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి ఎస్.విష్ణువర్ధన్ను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. రైతుభరోసా పథకం నిధులను దారి మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఏఈఓ సస్పెన్షన్లో కొనసాగుతారని పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత అధికారి తన ప్రధాన కార్యాలయాన్ని వదిలివెళ్లకూడదని తెలిపారు. కాగా, వెల్లగొండకు చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరు ఏఈఓ సస్పెన్షన్ నిలుపుదల చేసేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిసింది. -
ఆరోగ్యవంతులే.. శ్రీమంతులు
ఔషధ గుణాలు కలిగిన దవాచాయ్.. గ్రీన్ జ్యూస్లకు ఆదరణ వనపర్తి: కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చిందనడానికి ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధనే ఉదాహరణగా చెప్పవచ్చు. యసిడిక్ ఆహారం, పానియాలను తగ్గించి సేంద్రియ ఎరువులతో పండించిన వాటిని తినడం, వందేళ్ల క్రితం నాటి ఆహారపు అలవాట్లను మళ్లీ పునఃప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాకు ముందు డబ్బు సంపాదించే వారిని ధనవంతులుగా చెప్పుకొనేవారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం కలవారే నిజమేన శ్రీమంతులుగా అభివర్ణించడం విశేషం. మారిన ప్రజల ఆలోచన తీరుకు అనుగుణంగా చద్దన్నం, మిల్లేట్ టిఫిన్స్, దవాచాయ్, గ్రీన్ జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. శతాబ్దాల నాటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రంతో అనుబంధం ఉన్న ధాతు ఆయుర్వేదంకు సంబంధించిన డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ సహకారంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాకేంద్రాల్లోనూ దవాచాయ్ సెంటర్లు వెలిశాయి. 24 మూలికల చూర్ణంతో దవాచాయ్ తయారీ కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపైపెరిగిన శ్రద్ధ నిత్యం వాకింగ్ తర్వాత తీసుకుంటున్న ఔత్సాహికులు ధాతు ఆయుర్వేదం సహకారంతోసెంటర్ల ఏర్పాటు -
మహిళలు స్వశక్తితో ఎదగాలి
గట్టు: మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్థికంగా బలపడాలని డీఆర్డీఓ ముసాయిదాబేగం సూచించారు. గట్టు మండల మహిళా సమాఖ్యలో శనివారం డబ్ల్యూసీఎంఓ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు స్వయం ఉపాధి, డ్రైవింగ్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు సైకిల్ డ్రెవింగ్ నేర్చుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ తప్పనిసరిగా స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఎం మారుతి, మహిళా సమాఖ్య ప్రతినిధులు వెంకటేశ్వరి, అక్షర, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జయభారతి, శ్రీవల్లి, జానెల్లి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,789 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 278 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 6,789, కనిష్టంగా రూ. 3,880, సరాసరి రూ. 5,899 ధర పలికింది. అదే విధంగా 118 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 5,759, సరాసరి రూ. 5,919 ధర లభించింది. 2,119 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,306, కనిష్టంగా రూ. 1,771, సరాసరి రూ. 2,009 ధర పలికింది. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనిదోష నివారణ కోసం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత జిల్లేడు పూలు, తిలతైలాభిషేక పూజలు చేశారు. లింగదర్శనం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులను గెలిపించిన ప్రభుత్వం
కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ఒక మెట్టు దిగి.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు అంగీకారంతో ప్రజాపాలన అర్థాన్ని చాటడంతో పాటు కార్మికులను గెలిపించిందని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల స్వగృహంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు కార్మికులతో చర్చించి.. వారి డిమాండ్లకు ఆమోద ముద్ర వేసిందన్నారు. గతంలో 55 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నియంతలా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకులు ప్రస్తుతం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్బెడ్రూం ఇళ్ల పేరుతో రెండుమార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఘనంగా శేషదాసుల ఆరాధనోత్సవాలు
మల్దకల్: మండల కేంద్రంలో శేషదాసుల ఆరాధనోత్సవాలు శనివారం ముగిసాయి. శేషదాసుల వంశస్తులు ధీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, శశాంకల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక భజనల చేశారు. దాసుల చరిత్రను వేదపండితులు వివరించారు. ఉత్సవాలకు గ్రామీణ భక్తులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అరవిందరావు, బాబురావు, చంద్రశేఖర్రావు, ముకుందరావు, అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి, శ్రీకాంత్ జోషి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ క్రికెట్ సంబురం
నేటినుంచి 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ● పాల్గొననున్న 31 రాష్ట్రాల జట్లు ● ఇప్పటికే జడ్చర్ల చేరుకున్న 28 జట్లు జడ్చర్ల టౌన్: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్నగర్ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్లకు జడ్చర్ల బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హాజరుకాన్నారు. డీఈఓ పరిశీలన.. మెగా టోర్నీ ఏర్పాట్లను డీఈఓ ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. స్వామి నారాయణ గురుకులానికి చేరుకుని ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో మాట్లాడారు. వారికి కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్, వసతిపై ఆరా తీశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్న జడ్చర్ల మినీ స్టేడియాన్ని పరిశీలించారు. ఆయన వెంట టోర్నీ కన్వీనర్ మంజులాదేవి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదబాయి ఉన్నారు. 31 జట్లు.. 61 మ్యాచ్లు.. టోర్నమెంట్ను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 20–20 ఓవర్ల విధానంలో 61 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 31 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఏడు గ్రూప్లో నాలుగేసి జట్లు ఉంటాయి. ఒక్క గ్రూప్లో మాత్రం మూడే జట్లు ఉంటాయి. డ్రా ద్వారా గ్రూప్లను విభజిస్తారు. ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్ఫైనల్కు చేరుకుంటాయి. మ్యాచ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. మ్యాచ్లు జరిగే మైదానాల్లో మ్యాట్లు వేశారు.క్రీడాకారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మ్యాచ్లు తిలకించేందుకు వచ్చే వారి కోసం సైతం మైదానాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. -
వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం
● ఫిట్నెస్ను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి ● గవర్నర్ శివప్రతాప్ శుక్లా ● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్ మహబూబ్నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శరీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు. క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఖేల్ మహోత్సవ్ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడల తో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నా రు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● అంతకు ముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
కాంగ్రెస్ కౌన్సిలర్ల గైర్హాజరు
అయిజ: మున్సిపాలిటీలో శుక్రవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నిక కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సురేష్ అధ్యక్షత వహించగా.. కమిషనర్ సైదులు ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను 13 మంది బీఆర్ఎస్ పార్టీ వారు ఉండగా.. 7మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. పోటీ లేకపోవడంతో మొత్తం నలుగురు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికై న వారిలో నాగన్నగౌడ్ (జనరల్), సువర్ణ (జనరల్ మహిళ), మౌలా (మైనార్టీ), శంషాద్బేగం (మైనార్టీ మహిళ) ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు జ్యోతి, మహేశ్వరి, సరోజమ్మ, పద్మ, నర్సమ్మ, శారదాసువర్ణ, రామేశ్వరమ్మ, తిరుమలేష్, రజాక్షేక్, శివ, కృష్ణయ్య, మున్సిపల్ మేనేజనర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడోరోజు.. నిరసనల హోరు
గద్వాల క్రైం: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడోరోజుకు చేరింది. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని ఆర్టీసీ కార్మికులు భీష్మించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని నినదించారు. కండక్టర్ శంకర్గౌడు ఆత్మబలిదానం చేసుకున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శించారు. కార్మికులు అవినీతికి తావు లేకుండా ప్రగతి చక్రాలు పరుగులు పెడితేనే సంస్థ మనుగడ సాధిస్తుందన్న విషయం మరువొద్దన్నారు. ఎమ్మెల్యే బండ్ల మద్దతు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు కీలకంగా వ్యవహరించారన్నారు. వేలాది మంది కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పదించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా అందించాలని పేర్కొన్నారు. బాధిత కార్మికుడి కుటుంబానికి తన తరపున రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తానని కార్మికుల సమక్షంలో ప్రకటించారు. కార్మికుల సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. మూడోరోజు సమ్మెలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 58కు పైగా బస్సులను నడిపించినట్లు డిపో మేనేజర్ సునీత వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఆందోళనలు అరకొరగానే బస్సులు.. ప్రయాణికుల తిప్పలు మద్దుతు తెలిపిన ఎమ్మెల్యే బండ్ల.. రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటన -
పట్టించుకోవడం లేదు..
ఉపాధి హామీ కూలి డబ్బులు ఖాతాల్లో జమ కాలేదు. చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పటించుకోవడం లేదు. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ కూలి డబ్బులు త్వరగా వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలి. – సునీత, ఉపాధి కూలి, చంద్రశేఖర్నగర్ పైసలు వస్తలేవు.. జనవరి నుంచి ఇప్పటి వరకు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాం. గడిచిన మూడు నెలలుగా కూలి పైసలు వస్తలేవు. ఎండల్లో పనులు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కూలి డబ్బులు ఇప్పించేలా చొరవ చూపాలి. – పురుషోత్తం, ఉపాధి కూలి, చెన్నిపాడు బడ్జెట్ రాగానే.. ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. ప్రభుత్వం నుంచి కూలి డబ్బులు వచ్చిన వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేస్తాం. ప్రజలు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తున్న కూలీ పనులను సద్వినియోగం చేసుకోవాలి. – ముసాయిదాబేగం, డీఆర్డీఓ● -
పోటీ లేకుండా ‘సహకారం’
అచ్చంపేట: అచ్చంపేట: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘాల(పీఏసీఎస్)పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలను నియమించాలనే నిర్ణయం రాజకీయ వేడెక్కించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా మరో ఆరు నెలలు గడువును పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గడువు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలకవర్గా లను రద్దు చేసింది. కాగా..ఊహించినట్లుగానే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదవీకాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలోనే నామినేటేడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో 76 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటి అన్నింటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కూడా పాలకవర్గాలను నామినేటేడ్ చేసే అవకాశం ఉంది. పోటీ లేకుండా పదవులు? ఇక డైరెక్టర్ల ఎంపికలో పాత పద్ధతిలో అనుసరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సహకార శాఖ వర్గాల ప్రకారం ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, మిగిలిన వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత నామినేటేడ్ కమిటీల నియామక ప్రక్రియ త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగా ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీ నేతల్లో హర్షం వ్యక్తవుతుంటే, ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పీఏసీఎస్ పాలనపై నియంత్రణను స్థానిక ఎమ్మెల్యేల చేతుల్లోకి అప్పగి ంచేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు లో 76 సొసైటీలుంటే.. నాగర్కర్నూల్లో 23, వనపర్తి 15, జోగుళాంబగద్వాల 11, మహబుబ్నగర్ 17, నారాయణపేట 10 చొప్పున సొసైటీలు పని చేస్తున్నాయి. మరో 20 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో సొసైటీల పరిధిలో 380 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 76 మంది చైర్మన్లు, 76 మంది వైస్ చైర్మన్లను నియమిస్తారు. రాజకీయ వర్గాల్లో చర్చ పీఏసీఎస్ల గడువు ముగిసినా ప్రభుత్వం ఆరు నెల ల చొప్పున రెండుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదే జీఓను కొనసాగిస్తూ అకస్మాత్తుగా రద్దు చేయడం, తిరిగి నామినేటేడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు మరింత చికాకుగా మారాయి. సహకార ఎన్నికల స్వస్తి పలికి, నామినేటేడ్ విధానాన్ని అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్న తరుణంలో రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. పీఏసీఎస్ పదవులు ఇక నామినేటెడ్ నూతన సంస్కరణలా..? రాజకీయ వ్యూహమా..? ఎమ్మెల్యేల చేతుల్లోకి పీఏసీఎస్ పగ్గాలు డీసీసీబీకి కూడా నామినేటేడ్ చేసే అవకాశం -
‘ఉపాధి’కి విఘాతం
మానవపాడు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం లక్ష్యం నీరుగారుతోంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యరాహిత్యంతో చా లామందికి మూడు నెలలుగా కూలి డబ్బులు నిలిచిపోయాయి. రెక్కాడితే గానీ.. డొక్కాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసలు రాక పోవడంతో అల్లాడిపోతున్నారు. మూడు నెలలుగా కూలి డబ్బులు అందక.. ఈకేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న పరిస్థితి వచ్చింది. మరోపక్క అధికారులేమో గ్రామాల్లో కనీసం వందమంది ఉపాధి హామీ పనులు కల్పించాలని సర్పంచ్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే పనిచేసిన కూలీలకు డబ్బులు రాకపోతే పనులకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం 15 రోజులలో కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా లెక్కేసీ పరిహారం అందించాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ లింక్ అంశాలను అడ్డుపెట్టుకొని పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తుంది. ఉపాధి హామీ పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ముఖ ఆధారిత హాజరు.. కేంద్ర ప్రభుత్వం జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానం (ఎస్ఎంఎంఎస్) యాప్లో కూలీల ముఖ ఆధారిత హాజరు తీసుకున్నాకే పని కల్పించాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు యాప్లో కూలీల ఫొటో తీసినప్పుడు కూలీలు కనురెప్పలు మూసి తెరవాలి. ఇలా ఐదారు సార్లు చేయాల్సి ఉంటుంది. ఇదే తరహాలో అందరి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఉదయం 8 గంటలకు ఒకసారి ఫొటో దిగితే మళ్లీ 12 గంటలకు తీయాలి. ఒక గ్రామంలో వందమంది కూలీలు నాలుగు, ఐదు ప్రాంతాల్లో పని చేస్తున్నారంటే అన్నిచోట్ల వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్లు రెండుసార్లు అథెంటికేషన్ ఫొటోలు తీయాల్సిందే. లేకపోతే పని చేసిన డబ్బులు అకౌంట్లో జమ కావు. ఈ ఫొటో క్యాప్చర్ ప్రక్రియను యాప్ సరిగా గుర్తించకపోవడం టెక్నికల్ సమస్యలు, సిగ్నల్స్ సరిగా అందకపోవడంతో కూలీలు పనులకు దూరమవుతున్నారు. మూడు నెలలుగా అందని కూలీల వేతనాలు ఫీల్డ్ అసిస్టెంట్లదీ అదే పరిస్థితి సకాలంలో చెల్లించకుండా అధికారుల కాలయాపన ఈకేవైసీ కొర్రీలతో పనులకు వచ్చేందుకు అనాసక్తి -
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గద్వాల: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, కుర్వపల్లయ్య ఆధ్వర్యంలో రైతులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం కురిసిన వడగండ్ల వానకు అయిజ, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీనిపై అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ నినాదాలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో ఏఓ భూపాల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు రవికుమార్, కృష్ణ, వీరేష్, తిమ్మప్ప, వినయ్, వినోద్, లింగప్ప, మల్లేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లల చదువే ఇంటికి వెలుగు
ఉండవెల్లి: ఆడపిల్లలు పదో తరగతి చదివితే వివాహం చేసి పంపించేవారని, ప్రస్తుతం ఆడపిల్లలే చదువులలో రాణిస్తున్నారని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం మండలంలోని పుల్లూరు బాలికల గురుకుల పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్తోపాటు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు ఇంట్లో అమ్మాయి పుట్టిందని చులకనగా చూసిన సమాజం.. ప్రస్తుతం ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తుంటే ఆడపిల్లలు అద్భుతం అని కొనియాడుతుందని పేర్కొన్నారు. గొప్ప చదువులు చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకువచ్చి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఆడపిల్లల చదువే ఇంటికి వెలుగు అని కొనియాడారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి అధికారులు మధ్యాహ్న భోజనం చేశారు. నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. అనంతరం కలుగోట్ల పంచాయతీ, కేజీబీవి పాఠశాలను అధికారులు తనిఖీ చేశారు. పాఠశాల ప్రహరీ త్వరగా పూర్తి చేయించాలని ప్రిన్సిపల్ రాధమ్మకు సూచించారు. -
అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను శోభాయమానంగా అలంకరించి.. వేదమంత్రాల నడుమ కల్యాణతంతు జరిపించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
‘నామినేషన్ తీసుకునే దిక్కులేదు’
గద్వాల: మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్ వేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే తీసుకునేందుకు ఒక్క అధికారి కూడా లేరని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. గద్వాల మున్సిపల్ కౌన్సిల్లో కోఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి నామినేషన్ను వేసేందుకు గురువారం గద్వాల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే నామినేషన్ స్వీకరించేందుకు కార్యాలయంలో కమిషనర్ జానకీరామ్ అందుబాటులో లేరు. దీంతో నామినేషన్ పత్రాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక కొంత గందరగోళానికి గురైనట్లు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ విలేకరులతో తెలిపారు. నామినేషన్ స్వీకరణకు చివరి తేదీ ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా అధికారులు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. ఈ క్రమంలో కౌన్సిలర్లు కమిషనర్తో ఫోన్లో మాట్లాడగా.. ఇన్వార్డులో నామినేషన్ పత్రం ఇచ్చి వెళ్లండని చెప్పారు. దీంతో నిర్లక్ష్య సమాధానానికి నిరసనగా కమిషనర్ చాంబర్లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణ ఎస్ఐ కల్యాణకుమార్ అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో మాట్లాడారు. చివరికి కమిషనర్ కార్యాలయానికి వచ్చి మేనేజర్కు నామినేషన్ పత్రాన్ని ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, జగదీష్, నర్సింహ, మోహన్యాదవ్, గోపాల్, సంటెన్న, రాముడు, మంజులరాణి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ మహర్షి అందరికీ ఆదర్శం
గద్వాల: అసాధ్యం అనుకున్న గంగమ్మను భూమికి తీసుకొచ్చి సకల జీవరాశులకు నీటిని అందించిన భగీరథ మహర్షి ప్రతిఒక్కరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో భగీరథుడి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహర్షులు అంటేనే గొప్ప వ్యక్తులని, అందులోనూ భగీరథ మహర్షి తన తపో శక్తితో సాధించిన విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఎవరైనా ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు విజయం వరించకుంటే భగీరథ మహర్షిని తలుచుకోమని పెద్దలు చెప్పేవారని, దాంతో విజయం సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలన్న అర్థం వస్తుందన్నారు. ఇలాంటి గొప్పవాళ్లు చూపిన మార్గం చేసిన సమాజ సేవ గుర్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఏటా అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ భూపాల్రెడ్డి, డీఈఓ విజయలక్ష్మి, సగర సంఘం నాయకులు పాల్గొన్నారు. జనగణనలో స్వీయ లెక్కింపునకు అవకాశం జనగణన–2027లో ప్రజల సౌలభ్యం నిమిత్తం స్వీయ లెక్కింపునకు అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 10 వరకు మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ ద్వారా సెన్సెస్కు సంబంధించిన వెబ్పోర్టల్లో తమ వివరాలను పొందుపర్చవచ్చన్నారు. నమోదైన తర్వాత ఒక యూనిక్ కోడ్ వస్తుందని, దీనిని తమ ప్రాంత ఎన్యుమరేటర్లకు చూపించాలని చెప్పారు. ఇంటి సభ్యుల వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడానికి ఇది సులభమైన, వేగవంతమైన పద్ధతి అన్నారు. స్వీయ లెక్కింపులో పాల్గొనడం ద్వారా గణన ప్రక్రియను వేగవంతం చేయడానికి సహకరించిన వారవుతారన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మహిళా, స్వయం సహాయక సంఘాలు ఇలా అన్నివర్గాల వారు స్వీయ లెక్కింపులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఇబ్బందులు పడుతున్నాం..
మొత్తం 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. 100 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 12 రోజువుతుంది. ఇప్పటి వరకు కాంటా వేయలేదు. మొక్కజొన్న రాశుల వద్ద కాపలా కాయలేక ఇబ్బందులు పడుతున్నాం. అనుకోకుండా వర్షం పడటంతో చాలామంది రైతుల మొక్కజొన్న తడిసిపోయింది. – మార్కు, రైతు, ఉప్పల క్యాంపు, అయిజ మండలం రాత్రంతా కాపలా.. మొత్తం 120 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 15 రోజులయ్యింది. రాత్రి సమయంలో పందులు సంచరిస్తున్నాయి. వాటిని పారదోలేందుకు రాత్రంతా కాపలా కాయాల్సి వస్తోంది. దీని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. రైతులు తెచ్చిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేస్తే బాగుంటుంది. – ఈశ్వరన్న, రైతు, తూంకుంట, అయిజ మండలం బ్యాగులు తెచ్చుకోవాలంట గన్నీ బ్యాగులు లేకపోవడంతో మొక్కజొన్న కాంటా వేసేందుకు ఆలస్యం అవుతుంది. రైతులే గన్నీ బ్యాగులు తెచ్చుకుంటే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క బ్యాగు ధర రూ.30. అధికారులు మాత్ర ఒక్కొక్క బ్యాగుకు రూ.15 చెల్లిస్తామంటున్నారు. ఒక్కొక్క బాగ్యుపై రైతు రూ.15 నష్టపోవాల్సి వస్తోంది. – అబ్రహం, రైతు, తూంకుంట, అయిజ మండలం ఎక్కడికక్కడే కొనుగోళ్లు చేపడుతున్నాం.. మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – తహమీనా, జిల్లా మార్క్ఫెడ్ అధికారి, నాగర్కర్నూల్ ● -
మక్కలు.. తిప్పలు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పక్షం రోజులైనా కొలిక్కిరాని కొనుగోళ్లు.. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చి సుమారు నెలరోజులు అవుతోంది. ఈసారి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ఊపందుకోలేదు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో నర్వ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నా ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులకు ఇప్పటివరకు కొన్నది 760 బస్తాల మొక్కజొన్న మాత్రమే. వనపర్తి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం వెయ్యి మెట్రిక్టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 8,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు. అరకొర కేంద్రాలతో అవస్థలు.. ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్నగర్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయస్థాయిలో సత్తా అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని 5 గ్రామాలకు పునరావాసం కల్పించడంపై నమూనా ప్రజెంటేషన్లో రాష్ట్ర ప్రతినిధులు సత్తాచాటారు. –8లో u -
ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలి
రాజోళి: అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలో ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని మాన్దొడ్డి, పచ్చర్ల గ్రామాల్లో ఆయన పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి దెబ్బతినడం చాలా బాధాకరమన్నారు. పొలాల్లో ఉన్న పంటలు దెబ్బతింటే అది ప్రకృతి నష్టంగా రైతులు భావించారని, కానీ, అమ్మకానికి తీసుకెళ్లిన మొక్కజొన్న ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తడిసిపోయిందన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి ధాన్యం కుప్పలుగా ఉంచినా గన్నీ బ్యాగులు లేక కొనలేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. నేడు కోఆప్షన్ ఎన్నిక అయిజ: మున్సిపాలిటీలో శుక్రవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో నిర్వహించే కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు కౌన్సిలర్లు, సంబంధిత ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు. బీచుపల్లి ఆలయ ఈఓగా పురేందర్ ఎర్రవల్లి: బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా పురేందర్కుమార్ను నియమిస్తూ గురువారం దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వహిస్తున్న రామన్గౌడ్ బదిలీపై పొన్నకల్ ఆలయానికి వెళ్లడంతో ఆయన స్థా నంలో ప్రస్తుత జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్న పురేందర్కు ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు అప్పగించింది. 204 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 204 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.6,606, కనిష్టంగా రూ.4,409, సరాసరిగా రూ.5,819 ధరలు లభించాయి. 124 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.3,301, సరాసరిగా రూ.5,931 చొప్పున పలికాయి. 13 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,519, కనిష్టంగా రూ.5,219, సరాసరిగా రూ.6,219 ధరలు వచ్చాయి. 1,530 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,308, కనిష్టంగా రూ.1,809, సరాసరిగా రూ.2,069 ధరలు లభించాయి. డ్రైవర్, కండక్టర్లు కావాలి స్టేషన్ మహబూబ్నగర్: టీజీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతున్న నేపథ్యంలో సమ్మెకాలంలో పనిచేసేందుకు డ్రైవర్, కండక్టర్ అభ్యర్థుల నుంచి అత్యవసరంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న డ్రైవర్ అభ్యర్థులకు రోజుకు రూ.1000 చొప్పున, కండక్టర్ అభ్యర్థులకు రోజు రూ.800 చొప్పున పారితోషికం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అచ్చంపేట, గద్వాల, కల్వకుర్తి, కొల్లాపూర్, కోస్గి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, షాద్నగర్, వనపర్తిల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని కోరారు. డ్రైవర్ అభ్యర్థులకు తెలుగులో రాయడం, చదవడం, హెవీ ట్రాన్స్పోర్టు వెహికల్ లైసెన్స్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ లేదా హెవీ ప్యాసింజర్ వెహికల్ లైసెన్స్ (18 నెలల అనుభవంతో), 25 నుంచి 50 ఏళ్లలోపు, అదే విధంగా కండక్టర్ అభ్యర్థులకు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత, 21 నుంచి 58 ఏళ్లలోపు అర్హులని తెలిపారు. నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు హాజరవుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ఖేల్ మహోత్సవ ముగింపు వేడుకలను జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. అలాగే అతిథులుగా అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, గొంగిడి త్రిషారెడ్డి, డబ్ల్యూపీఏల్ మహిళా క్రికెటర్ త్రిషా పూజితలు హాజరుకానున్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా.. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్, నవీన్కుమార్రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. -
బస్సులు.. అంతంతే
● రెండోరోజు సమ్మెలోనే ఆర్టీసీ కార్మికులు ● ప్రైవేట్ సిబ్బందితో కొనసాగిన సర్వీసులు ● భద్రత కల్పించిన పోలీసులు ● మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు గద్వాల క్రైం: ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు గురువారం రెండోరోజు సైతం గద్వాల డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ అమలు చేయకుండా తమను నిర్లక్ష్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను విస్మరించడం సమంజసం కాదని నినదించారు. కార్మికుల సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికులను ప్రతి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆర్టీసీ కార్మికులు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. ఉద్యమ పార్టీగా ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వం సైతం కార్మికులను విస్మరించదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందని వివరించారు. అయితే రెండోరోజు సమ్మెలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 50కిపైగా బస్సు సర్వీసులను డిపో మేనేజర్ సునీత అందుబాటులోకి తీసుకువచ్చారు. గమ్యస్థానాలకు వెళ్లే బస్సులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రైవేట్ సిబ్బందితో బస్సులు నడిపించారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేకపోవడంతో ఆటోలు, జీపులలో రాకపోకలు సాగించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో డిపోకు రెండోరోజు రూ.7 లక్షల నష్టం వాటిల్లింది. రీజియన్లో 426 నడిచిన బస్సులు రెండు రోజు గురువారం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి. -
కదలని ప్రగతి రథం
పోలీసుల పహారాలో.. ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టడంతో పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సీఐ శ్రీను ఆధ్వర్యంలో ఎస్ఐలు కల్యాణ్కుమార్, జహగీంర్, పోలీసు సిబ్బంది డిపో వద్ద సమ్మెలో ఉన్న ఉద్యోగుల నుంచి ఎలాంటి విపత్కర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా డిపో అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి 20కిపైగా బస్సు సర్వీసులను నడిపించారు. విధుల్లోకి వచ్చిన ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లకు పోలీసులు రక్షణ కల్పించారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో ఆర్టీసీ రూ.12 లక్షల ఆదాయం కోల్పోయింది. ప్రయాణికులు, బస్సులు లేక నిర్మానుష్యంగా మారిన బస్టాండ్ ప్రాంగణం గద్వాల డిపోలో నిలిచిపోయిన బస్సులు గద్వాల క్రైం: డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో బుధవారం జిల్లావ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కండక్టర్లు, డ్రైవర్లు బస్ డిపోల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మెతో జిల్లావ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలోని అనేక మార్గాల్లో బస్సులు నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు, ఇతర పనుల కోసం వెళ్లే ప్రజలు బస్సులు లేక ఆటోలు, జీపులను ఆశ్రయించారు. అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసుల పహారాలో ఉదయం 10 గంటల తర్వాత 20కిపైగా బస్సు సర్వీసులు నడిపించారు. ప్రధానంగా కర్నూలు, అయిజ, వనపర్తి జిల్లాకు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ఏర్పాటు చేసి డిపో మేనేజర్ సునీత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల ఆగ్రహం.. ప్రభుత్వం ఉద్యోగులను ఆర్టీసీలో విలీనం చేసే ప్రక్రియ, 2021 వేతన సవరణ, 30 శాతం ఫిట్మెంట్ అమలు, మహాలక్ష్మీ పథకం కింద ఇవ్వాల్సిన నిధులు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, కండక్టర్, డ్రైవర్లలపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు, 2019 సమ్మెకాలంలో నమోదైన కేసుల ఎత్తివేత తదితర విషయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని నమ్మించి మోసం చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపో ఎదుట గేట్ ధర్నా అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి వరకు ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం స్పదించి చర్చలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసినా.. మొండివైఖరితో ఈ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సంస్థ అభివృద్ధికి నిర్విరామంగా పనులు చేస్తున్నామని, అలాంటి తమపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం భావ్యం కాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రీజియన్లో 134 నడిచిన బస్సులు స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ హైర్, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్నగర్ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు. జిల్లాలో మొదటి రోజు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు డిపో గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలోకార్మికుల ధర్నా జిల్లావ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు జిల్లాకేంద్రంలో పోలీసుల పహారాలో బస్సులు రాకపోకలు ప్రభుత్వం తీరుపై ఉద్యోగుల ఆగ్రహావేశాలు -
చేతి నైపుణ్యం కళలను నేర్చుకోవాలి
గద్వాల న్యూటౌన్: మనల్ని మనం గెలవాలంటే ముందుగా మన మనస్సును గెలవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా కేజీబీవీ సంక్షేమ వారో త్సవాలను పురస్కరించుకొని బుధవారం బాలభవన్లో విద్యార్థులకు చిత్రలేఖనం, స్టోరీ టెల్లింగ్, నాట్యం, పాటలు, ఆర్ట్ క్రాప్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మనస్సును గెలవాలని, దానికి తగిన శ్రమను అందించాలని అప్పుడు విజయం అనేది సొంతమవుతుందని చెప్పారు. విద్యార్థిని, విద్యార్థులు చదువుతోపాటు, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి చేతి నైపుణ్యం కలిగిన కళలను కూడా నేర్చుకోవాలన్నారు. ఇలాంటి పోటీలు విదార్థినుల్లో ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిర్ధిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని, అప్పుడే ఉన్నత స్థానానికి చేరుకుంటామన్నారు. అనంతరం విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి నుషిత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సయ్యద్ అక్బర్ పాషా, కేజీబీవీ కోఆర్డినేటర్ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వీధుల్లో భౌయం..!
గద్వాల: జిల్లాలో వీధికుక్కల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఆరుబయట కనిపిస్తే చాలు జనాలపై దాడులు చేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలన్నా.. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రావాలన్నా.. తల్లిదండ్రుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రజలు ఇంట్లోంచి కిరాణా షాపులు, ఇతర పనులకు, కూలీకి వెళ్లాలన్న భయపడుతున్నారు. ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా వెంబడించి మరీ దాడి చేస్తున్నాయి. ఇక రాత్రిళ్లు రోడ్లపై ద్విచక్రవాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా గడిచిన మూడు నెలల వ్యవధిలో వెయ్యికిపైగా కుక్కకాటు కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎండలకు తాళలేక.. కుక్కలు మనుషులపై దాడులకు పాల్పడటానికి ప్రధాన కారణం ఇటీవల వేసవిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కుక్కలు ఎండతాపానికి తాళలేక ఇరిటేషన్కు గురై ఇలాంటి దాడులు చేస్తున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు దాహం ఎక్కువై పిచ్చిగా ప్రవర్తిస్తాయని చెప్పారు. అదేవిధంగా సరైన ఆహారం దొరక్కపోవడం వంటి కారణాలతో ఆగ్రహం చెంది ఎవరు కనిపిస్తే వారిపై దాడులకు తెగబడుతాయని పేర్కొంటున్నారు. మాంసం దుకాణాల వద్ద జిల్లాలో చికెన్ సెంటర్లు, మాంసం దుకాణాలు అధికంగా వెలిశాయి. ఇందులో ముఖ్యంగా గద్వాల మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మాంసం, చికెన్ సెంటర్ల వద్ద కుక్కలు గుంపులు, గుంపులుగా ఉండి అక్కడ లభించే వ్యర్థాలు తినేందుకు అలవాటు పడ్డాయి. చికెన్ తీసుకెళ్లేందుకు వచ్చే జనాల మీదకు విరుచుకుపడుతూ చికెన్ను లాగేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో ప్రతిఘటించలేక కుక్కకాటుకు గురై గాయపడుతున్నారు. అనధికారికంగా మరిన్ని.. జిల్లావ్యాప్తంగా గడిచిన మూడు నెలల్లో వెయ్యికిపైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరిలో 520, మార్చిలో 321, ఏప్రిల్లో 220 కుక్కకాటు కేసులు నమోదైనట్లు వైద్యాధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అధికారిక లెక్కలే ఇంతమొత్తంలో ఉంటే అనధికారికంగా మరిన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిర్లక్ష్యం చేయొద్దు.. కుక్క కాట్లపై ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు. కుక్క కాటు వేసిన ప్రాంతంలో ముందుగా సబ్బుతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి వెళ్లి సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా వీధికుక్కలు కరిస్తే కచ్చితంగా ఇమ్యూనోగ్లోబిన్, వ్యాక్సినేషన్ ఇప్పించాలి. అదేవిధంగా కుక్కల బారిన పడకుండా బయటకు వెళ్లే సమయంలో చేతిలో కర్రను తీసుకెళ్లడం అలవాటుగా చేసుకోవాలి. అదేవిధంగా వీధుల్లో తిరిగే కుక్కల ప్రవర్తనలో తేడా గమనిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి వాటిని తరలించేలా చర్యలు తీసుకోవాలి. అందుబాటులో మందులు.. కుక్కకాటుకు సంబంధించి మూడు నెలల కాలంలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యా యి. వీరికి అవసరమైన వ్యాక్సిన్లను అందిస్తు న్నాం. అదేవిధంగా కుక్కకాటుకు గురైన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, జనరల్ ఆస్పత్రి, అలంపూర్ సీహెచ్సీలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయి. – రాజ్యలక్ష్మి, జిల్లా ఎపిడమాలజిస్ట్ జిల్లాలో భయపెడుతున్న గ్రామసింహాలు అధిక ఉష్ణోగ్రతలతో మరింత రెచ్చిపోతున్న వీధికుక్కలు మూడు నెలల వ్యవధిలో వెయ్యికిపైగా కుక్కకాటు కేసులు -
క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యార్థులు క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి ఎదగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జి.ఎన్.శ్రీనివాస్ అన్నారు. ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా పీయూలో విద్యార్థులకు ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కబడ్డీ క్రీడలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. మనిషి ఆరోగ్యానికి క్రీడలు ఎంతో మేలు చేస్తాయని, నిరంతరం ఉత్తేజంగా పనిచేయడానికి సహకరిస్తాయన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ పూస రమేష్బాబు, ఫిజికల్ డైరెక్టర్ డా.వై.శ్రీనివాసులు, సిబ్బంది అభిషేక్, శారద, మన్యం పాల్గొన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో న్యాయమూర్తి పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని బుధవారం గద్వాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరళ్ల వెంకట హైమాపూజిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఆలయ విశిష్టతను వివరించి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 271 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 271 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.6,880, కనిష్టంగా రూ.4,099, సరాసరిగా రూ.5,686 ధరలు లభించాయి. 195 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,059, కనిష్టంగా రూ.3,961, సరాసరిగా రూ.5,869 పలికాయి. 24 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,619, కనిష్టంగా రూ.2,166, సరాసరిగా రూ.5,689 ధరలు పలికాయి. 1,550 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,256, కనిష్టంగా రూ.1,809, సరాసరిగా రూ.2,109 ధరలు లభించాయి. జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.7,151, కనిష్టంగా రూ.4,879 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,347, కనిష్టంగా రూ.5,760, జొన్నలు రూ.5,209, ధాన్యం హంస రూ.1,669, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,500, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,818, కనిష్టంగా రూ.1,416 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,161, కనిష్టంగా రూ.1,900, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,729, ఆముదాలు రూ.6,092గా ధరలు నమోదయ్యాయి. ఇద్దరు ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు : ఎస్పీ నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులు నడపకుండా ఇబ్బందులకు గురిచేసిన ఇద్దరు కార్మికులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెలో నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు ఆటంకం కలిగించిన కొల్లాపూర్లో, కల్వకుర్తిలో ఒక్కొక్కరిపై కేసు నమోదైందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరితే వారిని ఎవరైనా ఆర్టీసీ కార్మికులు ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 50 శాతం సబ్సిడీపై తీగజాతి కూరగాయలు కొల్లాపూర్ రూరల్: రాష్ట్ర ఉద్యాన శాఖ ద్వారా ఆర్కేవీవై పథకంలో భాగంగా రైతులు తీగ జాతి కూరగాయలు సాగు చేయడానికి తీగ జాతి పందిరి నిర్మాణాల కోసం 50 శాతం సబ్సిడీ అందిస్తుందని కొల్లాపూర్ ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పందిరి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం రైతులకు చెల్లిస్తుందన్నారు. కాకర, బీర, సోర, పొట్ల, దొండ వంటి తీగ జాతి కూరగాయలు పండించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. -
కన్నీళ్లే మిగిలాయి..
● నిండా ముంచేసిన అకాల వర్షం ● తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యం మాన్దొడ్డిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు శాంతినగర్ కొనుగోలు కేంద్రం వద్ద మొక్కజొన్న ఆరబోస్తున్న రైతు రాజోళి: అకాల వర్షానికి రైతులు నట్టేట మునిగారు. పలుచోట్ల కురిసిన వడగళ్ల వాన దెబ్బకు రైతులకు ధాన్యం ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. పొలాల్లో ఉన్న వరి పంట, అమ్మేందుకు తీసుకువచ్చిన మొక్కజొన్న వర్షంలో తడిసిపోయి రైతులకు కన్నీళ్లే మిగిలాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం.. రాత్రి మొత్తం కురిసింది. దీంతో ఆరుకాలం కష్టపడి పండించిన పంట మొత్తం వర్షార్పణం అయ్యింది. రాజోళి మండలంలో మార్కెట్కు తీసుకువచ్చిన మొక్కజొన్న తడిసిపోగా.. మాన్దొడ్డి, పెద్దధన్వాడ, పచ్చర్ల శివార్లలో వరి పంట మొత్తం నేలవాలింది. చేతికొస్తున్న పంటకు ఉన్న వడ్ల గింజలు మొత్తం రాలిపోయాయి. వరి పంటలో నీరు నిలిచి పంట పూర్తిగా దెబ్బతింది. అధికారులపై ఆగ్రహం.. మండలంలో అకాల వర్షం కురిసి పంటలు నష్టపోతే సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాన్దొడ్డిలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని, ఎంత ఇస్తారో చెప్పాలని అధికారులను నిలదీశారు. శాంతిగనర్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గర మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. రైతులు ధాన్యంపై కవర్లు కప్పినా ఈదురు గాలులు కారణంగా కవర్లు తొలగిపోయి.. ధాన్యం మొత్తం తడిసిపోవడంతో ఆరబెట్టడానికి నానా ఇబ్బందులు పడ్డారు. -
సమ్మెకు సై..
నేటి నుంచి ‘ఆర్టీసీ’ బంద్ ● పలు డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట ● రీజియన్లోని 10 డిపోల పరిధిలో నిలిచిపోనున్న బస్సు సర్వీసులు ● అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అద్దె బస్సులు నడిపేలా చర్యలు కార్మికుల ప్రధాన డిమాండ్లు ● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి. ● మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను క్రమం తప్పకుండా నెలనెలా ఆర్టీసీకి ఇవ్వాలి. ● ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి. ● ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ● అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ● రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు అన్నింటినీ చెల్లించాలి. ● మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. డిపో బస్సులు అచ్చంపేట 80 గద్వాల 108 కల్వకుర్తి 103 కొల్లాపూర్ 65 కోస్గి 27 మహబూబ్నగర్ 152 నాగర్కర్నూల్ 81 నారాయణపేట 97 షాద్నగర్ 91 వనపర్తి 121 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు. 925 బస్సులు.. 3267 మంది కార్మికులు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్ డ్రైవర్లు, 148 మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, 385 మంది మెకానిక్ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు.. సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా అద్దె బస్సులను నడుపుతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులతో బస్సులు నడిచేలా తగిన చర్యలు చేపడుతాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్ -
భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మల్దకల్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మల్దకల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి.. పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు. గ్రామాల్లో జీపీఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతు సమస్యలను పరిష్కరించేందుకు జీపీఓలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చిన్నచిన్న సమస్యలతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా జీపీఓలకు ప్రత్యేక గదులు కేటాయించాలని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఝాన్సీరాణి, సీనియర్ అసిస్టెంట్ కరీం, ఆర్ఐ మహేందర్, రవితేజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ
● బర్త్ సర్టిఫికెట్ల జారీకి రూ.25 వేల లంచం డిమాండ్ ● రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూర్కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్ కార్యాలయానికి తిరుగుతూ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తామని సదరు అధికారి ద్వారా ఆర్డీఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించారు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


