breaking news
Jogulamba
-
కుష్టు సర్వే పక్కాగా నిర్వహించాలి
ఖిల్లాఘనపురం: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కుష్టు వ్యాధిగ్రస్తులు, అనుమానితుల సర్వే పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. జరీనా భాను అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న కుష్టు అనుమానితుల సర్వే విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు అన్ని గ్రామాల్లో సర్వే కొనసాగుతోందని, వ్యాధి సోకినట్లు అనుమానం వచ్చినా, ఒంటిపై మచ్చలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే మందులు వాడి నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇంటి వద్దకు ఆశా కార్యకర్తలు వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఇల్లూ తిరిగి సర్వే చేయాలని ఆదేశించారు. ఆమె వెంట మండల ఆరోగ్య కేంద్రం వైద్యుడు డా. ప్రవీణ్, డీపీఎంఓలు కృష్ణ, సంజీవ్, సూపర్వైజర్ విజయ, ఆశా కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. జరీనాభాను -
ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర
అలంపూర్: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని మార్చే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరామ్ నాయక్ ఆరోపించారు. అలంపూర్ చౌరస్తాలోని జాతీయ రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని ఒక పథకంగా మార్చే ప్రయత్నం చేస్తుందని, పేదలకు పనిదినాలు వేతనాన్ని పెంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉండగా అందుకు భిన్నంగా పేరు మార్చి పనిదినాలు తగ్గించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం అన్యాయమన్నారు. దేశంలో మౌళిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ... ఉపాధిహామీ పథకం వచ్చిన సమయంలో వంద శాతం నిధులు కేంద్రమే భరించాలనే నిబంధన ఉందన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీలో నిధుల కోత విధించి కూలీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రాలపై భారాన్ని వేసి కేంద్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందన్నారు. ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని, ఉపాధి హక్కులను కాపాడుకోవడానికి ప్రజలు ఐక్యంగా ఉద్యమించడానికి సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు రేపల్లె దేవదాసు, పరం జ్యోతి మద్దిలేటి, రాజు, వీవీ నరసింహ్మా, ఉప్పేర్ నరసింహ్మా, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, రఫీ, నరసింహ్మ, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
మరమ్మతుకు గ్రహణం.. పంటలకు శాపం
నడిగడ్డ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు 3.35 లక్షల ఎకరాలు ● ఈసారికి 49 వేల ఎకరాలకే సాగునీటి విడుదల ● ప్రస్తుత యాసంగిలో ఆర్డీఎస్, ర్యాలంపాడు కింద క్రాప్ హాలిడే ప్రకటన ● జూరాల, తుంగభద్రలో గేట్లు, ర్యాలంపాడులో లీజీకేల పరంపర ● వరుసగా ఈసారి కూడా సాగునీటి నిలిపివేత.. ఆందోళనలో అన్నదాతలు ర్యాలంపాడు జలాశయం గద్వాల: నడిగడ్డలోని ప్రాజెక్టులకు మరమ్మతు గ్రహణం వెంటాడుతుంది. తుంగభద్ర, కృష్ణానదుల మధ్య ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.42 లక్షలు, ఆర్డీఎస్ కింద 83 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఆయకట్టును స్థిరీకరించారు. కానీ, ఈ ప్రాజెక్టులు మరమ్మతుకు నోచుకోకపోవడంతో స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు నిలిచిపోయింది. ఫలితంగా ఏటా రెండు పంటలతో కళకళలాడాల్సిన భూములు కాస్త బీళ్లుగా మారుతున్నాయి. యాసంగిలో కేవలం 49 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారంటే ఆయా ప్రాజెక్టుల దుస్థితి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. తుగభద్ర నది పరిధిలోని రాజోలి బండ డైవర్షన్ పథకం కింద యాసంగిలో పూర్తిగా పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అలాగే కృష్ణానది పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాల్లో పలుచోట్ల లీకేజీలు ఏర్పడడంతో యాసంగిలో పూర్తిగా క్రాప్హాలిడే ఇస్తున్నారు. అదేవిధంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్ల ఇనుప రోపులు తెగిపోవడంతో మరమ్మతు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా కేవలం 49 వేల ఎకరాలకు సాగునీరు పారుతుండడంతో ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతు పూర్తిచేయడంలో ఇటు పాలకులు, అటు అధికారుల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిగడ్డ ప్రాజెక్టుల కింద ఆయకట్టు వివరాలు ఇలా.. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
గద్వాలటౌన్: గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీసన్న, ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల కోసం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. శుక్రవారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్– 8, 10, 12, 14, 20 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. పరుగు పందెంతో పాటు లాంగ్జంప్, హైజంప్ విభాగాలలో క్రీడాకారులు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. పోటీల ప్రారంభమనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన 30 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారందరూ జనవరి 15వ తేదీ నుంచి అదిలాబాద్ సేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బషీర్, నర్సింహరాజు, ప్రణిత, శాంతి, అశోక్, అంజి తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలి
గద్వాలటౌన్: జిల్లాలో చేనేత రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామక్రిష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చేనేత రుణమాఫీ ప్రకటించి ఏడాదిన్నర అవుతున్న, జిల్లాలో ఇప్పటి వరకు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రుణమాఫీ ప్రక్రియ నత్తనడకన సాగుతుందని విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ సక్రమంగా కార్మికులకు అందడం లేదన్నారు. నేతన్న భరోసా పథకంపై అధికారులు దృష్టిసారించాలన్నారు. చేనేత త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద ప్రతి నెల కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు నిషాక్, వీరేష్, వీరన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషిత ప్రకటనలో తెలిపారు. ఏదైన విభాగంలో పీజీ కోర్సులకు సంబంధించి 1.7.2025 నుంచి 31.12.2025 వరకు అడ్మిషన్ పొందిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఆన్లైన్ వెబ్సైట్ httpr.telangan aeparr.chf.g ov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నివాస ధ్రువీకరణపత్రాలతో పాటు టెన్త్, ఇంటర్, డిగ్రీలతో పాటు అవసరమైన ఇతర పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకొనటకు చివరి తేదీ 19.1.2026 ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి హార్డ్కాపీలను జనవరి 20వ తేదీలోపు తమ కార్యాలయంలో సమర్పించాలని, ఇతక వివరాలకు సెల్ నం.8099059007 ను సంప్రదించాలని పేర్కొన్నారు. సంతోష్ ట్రోఫీకి వినోద్కుమార్ ఎంపిక గద్వాలటౌన్: ప్రతిష్టాత్మకమైన సంతోష్ ట్రోఫి ఫుట్బాల్ పోటీలకు గద్వాలకు చెందిన యువ క్రీడాకారుడు వినోద్కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 28 వరకు ఛత్తీస్ఘడ్లో జరిగే 79వ జాతీయస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్ షిప్ సంతోష్ ట్రోఫి పోటీలు జరగనున్నాయి. సంతోష్ ట్రోఫి కోసం 22 మంది క్రీడాకారులతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ జట్టును ఎంపిక చేశారు. ఇందులో గద్వాలకు చెందిన క్రీడాకారుడు వినోద్కుమార్ ఉండటం గర్వకారణం. సంతోష్ ట్రోఫి కోసం గత అక్టోబర్లో ప్రాబబుల్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో 50 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. తరువాత వారికి నెల రోజుల పాటు హైదరాబాద్లోని ఫుట్బాల్ క్రీడా మైదానంలో శిక్షణ ఇచ్చారు. ప్రాబబుల్స్ పోటీలలో అత్యంత క్రీడా నైపుణ్యం కనభర్చిన వినోద్కుమార్ను రాష్ట్ర తుది జట్టులోకి తీసుకున్నారు. వినోద్కుమార్ స్థానిక ఎంఏఎల్డీ డిగ్రి కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ ఎంపికపై ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గుణ, జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్, టీం కోచ్ వెంకట్రాములు, ఇంటెలిజెన్స్ సీఐ నర్సింహారాజు హర్షం తెలిపారు. -
పంటకు నీరు ఇవ్వాలి..
ఆర్డీఎస్ ప్రాజెక్టు గేట్లు రిపేరు చేయాలనే పేరుతో క్రాప్ హాలిడే ప్రకటించి నీళ్లు వదలకుండా భూములను బీళ్లుగా మార్చడం అన్యాయం. అధికారులు ఇలా చేయడం వారికి అలవాటుగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మతు పూర్తిచేసి పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలి. – భాను రైతు, శాంతినగర్ త్వరగా పూర్తిచేయాలి.. ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడి నాలుగేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు వాటికి రిపేర్లు చేసింది లేదు. కేవలం సర్వేలు చేస్తూ అధికారులు తిరిగి పోతున్నారు. నాలుగేళ్లుగా రిజర్వాయర్ కింద యాసంగిలో నీటిని నిలిపివేశారు. దీంతో ఒక్క పంటనే వేసుకుంటున్నాం. ఇప్పటికై నా అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే రిపేర్లు పూర్తిచేసి రెండు పంటలకు నీటిని విడుదల చేయాలి. – వెంకట్రామిరెడ్డి, రైతు ర్యాలంపాడు మరమ్మతు చేపడుతాం.. తుంగభద్ర డ్యాం గేట్లకు మరమ్మతు చేయాల్సి ఉండడంతో ఆర్డీఎస్ పరిధిలో క్రాప్హాలిడే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ర్యాలంపాడు రిజరా్వాయర్ రిపేర్లకు సంబంధించి నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్, ఎస్ఈ జిల్లా ఇరిగేషన్ శాఖ ●● నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాలలో పలుచోట్ల, తూము నిర్మాణాల వద్ద లీకేజీలు ఏర్పడడంతో జలాశయం ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 4 టీఎంసీల సామర్థ్యాన్ని కాస్త 2 టీఎంసీలకు కుదించి గత నాలుగేళ్లుగా ఏటా ఖరీఫ్ పంటకే నీళ్లు వదులుతున్నారు. -
విపత్తు సమయాల్లో సమర్థవంతమైన సేవలు
గద్వాల: విపత్తు సమయాల్లో ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గుర్రంగడ్డ గ్రామం చుట్టూ కృష్ణానదికి వరద ఎక్కువగా వచ్చే సమయంలో బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవని తెలిపారు. ఈ సమయంలో గ్రామస్తులకు ముందస్తుగానే మాట్లాడి అప్రమత్తం చేసి వారికి అవసరమైన అన్ని రకాల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్వో స్వామికుమార్, ఆర్అండ్బి ఈఈ ప్రగతి, డీఎంహెచ్వో డాక్టర్ సంధ్యా, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎస్ఈ శ్రీనివాస్, పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వర్, వివిధశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
యూరియా కష్టాలకు చెక్..!
●యూరియా కొరత ఉండదు వ్యయసాయ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా రైతులు నేరుగా తమ ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చు. డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో తెలుసుకొని యూరియాను బుక్ చేసుకోవచ్చు. పంట విస్తీర్ణం మేరకు యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది. – జాన్సుధాకర్, డీఏఓ గద్వాల వ్యవసాయం/నారాయణపేట: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు ఇదివరకు కపస్ యాప్ తీసుకువచ్చి సక్సెస్ కావడంతో .. ఇక యూరియా బుక్ చేసుకునేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫర్టిలైజర్స్ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి నుంచి మైబెల్ ఫోన్లో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగిలో 1.95 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు చేయనుండగా, అందులో 86,529 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారని అధికారులు అంచనా వేశారు. ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియా అవసరం ఉండడంతో 5191.74 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లకు అవగాహన సదస్సులు సైతం చేపట్టారు. 22 నుంచి యాప్తో యూరియా సరఫరా వ్యవసాయ శాఖ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా రైతు డీలర్ల వద్ద యూరియా ఉన్న స్టాక్ వివరాలు తెలుస్తాయి. రైతులు తమకు దగ్గరలో ఉన్న డీలర్ నుంచి యూరియా తీసుకునేలా బుక్ చేసుకోవచ్చు. వెంటనే ఐడీ వస్తుంది. ఇందుకనుగుణంగా డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భూవిస్తీర్ణం, వేసిన పంటకనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం, పరి మితికి మించి యూరియా వాడకుండా, పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టనున్నారు. ఎకరాకు మూడు బస్తాల చొప్పున రెండు ఎకరాలకు ఎక్కువ ఉంటే 15 రోజుల తర్వాత కోనుగోలు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. పట్టాపాసు బుక్లేని రైతులు పట్టాపాస్ బుక్ ఆప్షన్లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి, ఓటీపీ కన్ప ర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు సైతం యూరియా తీసుకోవచ్చు. ఇక యాప్ విషయానికి వస్తే మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్లి ఎరువుల యాప్ ఓపెన్ చేయగానే, రైతులు, వ్యవసాయశాఖ, డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి. లాగిన్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలర్లు, యూరియా స్టాక్ వివరాలు కనిపిస్తాయి. పట్టాపాసుపుస్తకం నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. సాగు చేసే పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మోతాదులో యూరియా బ్యాగుల కానవస్తుంది. యూరియా బుక్ చేసిన తర్వాత 4 దశల్లో యూరియా అందేలా చర్యలు తీసుకున్నారు. ఫర్టీలైజర్ యాప్ మొబైల్ యాప్లో బుకింగ్ చేసుకునే అవకాశం కపస్ యాప్ సక్సెస్తో యూరియా యాప్ అందుబాటులోకి.. జిల్లాలో 86,529 ఎకరాల్లో వరి సాగు యాసంగికి 5,191 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమవుతాయని అంచనా ఎకరాకు 3 బస్తాల చొప్పున సరఫరా -
భార్యను కొట్టి చంపిన భర్త
ధరూరు: దంపతుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు భార్య హత్యకు దారితీసింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడు గ్రా మానికి చెందిన కుర్వ గోవిందు– జమ్ములమ్మ (28) దంపతులకు ఇద్దరు కుమారులు. గురువారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారుజామున వారి మధ్య చిన్నపాటి గొడవ జరి గింది. మాటామాట పెరిగి కొట్టుకునే స్థితికి దారి తీయగా.. పెద్ద కుమారుడు మల్లికార్జున్ సర్దిచెప్పేందు కు ప్రయత్నించగా.. తండ్రి అతడిని కట్టెతో కొట్ట డంతో తీవ్ర గాయాల య్యాయి. ఈ క్రమంలో జమ్ములమ్మ గటిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. భార్య జమ్ములమ్మ బయటకు పరుగులు తీయగా.. గోవిందు జమ్ములమ్మను వెంటాడి అందరి ముందే కట్టెతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న రేవులపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోవిందును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ధరూరు ఎస్ఐ శ్రీహరి తెలిపారు. -
22 నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
గద్వాలటౌన్: విద్యార్థులలో దాగివున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను వెలికితీసి వారిని భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనక్ పోటీలను ఏర్పాటు చేస్తుందని డీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం స్థానిక బాలభవన్లో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన కమిటీ సభ్యుల సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శన వివరాలను విలేకర్లకు వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వైజ్ఞానిక, గణిత, పర్యావరణ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను డిసెంబర్ 22, 23వ తేదీలలో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రదర్శనల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. 13 మండలాలు.. 175 పాఠశాలలు జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 175 పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రదర్శనలు ఇస్తున్నారని చెప్పారు. జూనియర్ (6,7 తరగతులు), సీనియర్ (8,9,10 తరగతులు) విభాగాలుగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోటీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస, సెమినార్, సైన్స్ సంబంధిత డ్రామాలు ఉంటాయన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మొత్తం 14 ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీస్తూ భావి శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఇవి వేదికలుగా ఉపయోగపడతాయన్నారు. అదనపు సమాచారం కోసం జిల్లా సైన్స్ అధికారి సెల్: 9502647200కు సంప్రదించాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ పాపన్న, శ్రీనివాస్గౌడ్, ప్రతాప్రెడ్డి, శాంతిరాజు, హంపయ్య పాల్గొన్నారు. జాతరలో దుకాణాల ఏర్పాటుపై వివాదం గద్వాల క్రైం: గద్వాల సంతాన వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసే దుకాణాలపై వివాదం నెలకొంది. ప్రతి సంవత్సరం పట్టణంలోని భీంనగర్ రోడ్డు మార్గంలో చిరు వ్యాపారులు, వలస వ్యాపారం చేసే వారు జాతర అంగళ్లు ఏర్పాటు చేసుకుని భక్తులకు, ప్రజలకు వివిధ తిను బండారాలు, ఆటవస్తువులు, వస్తు సామగ్రి క్రయ విక్రయాలు చేస్తారు. అయితే ఇటీవల రోడ్డు మార్గంలో వెలసిన వ్యాపార, వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణ యాజమానులు ఈ వీధి వ్యాపారులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలోనే గురువారం భీంనగర్ రోడ్డు మార్గంలో జాతరలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కొందరు వ్యాపారులు అడ్డుకున్నారు. ఏళ్లుగా బ్రహ్మోత్సవాల్లో 10 – 15 రోజుల పాటు దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్న తరుణంలో ఇలా వ్యతిరేకించడంపై వీధి వ్యాపారులు ఆందోళన చెందారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వీధి వ్యాపారులతో దుకాణాలు వేయించారు. అడ్డుకున్న వ్యాపారులను మందలించి సామరస్యంగా ఉండాలని, లేని తరుణంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
77 మంది సర్పంచులు మా మద్దతుదారులే..
రాజోళి: అలంపూర్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని గెలుపును కాంగ్రెస్ మద్దతుదారులు సాధించి, చరిత్ర సృష్టించారని.. 124 గ్రామ పంచాయతీల్లో 77 మంది కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ అన్నారు. శాంతినగర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేఽశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో తనను ఓడించినా, ప్రజలు మాత్రం సర్పంచు ఎన్నికల్లో తమ అభిమానాన్ని చూపి కాంగ్రెస్ మద్దతుదారులకే పట్టం కట్టారన్నారు. 77 మంది కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని, కాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ పార్టీ తరపున గెలిచారని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని అన్నారు. తమ మద్దతుతో ఏకగ్రీవమైన సర్పంచు స్థానాలను స్వతంత్య్ర అభ్యర్థులుగా చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కూడా తమ మద్దతుదారులని చెప్పుకుంటూ, పబ్బం గడుపుతున్నారని అన్నారు. గెలిచిన వారందరూ తమ పార్టీ కండువా కప్పుకుంటుంటే చూసి కూడా తమ ఖాతాలో గెలిచిన వారని చెప్పడం చూస్తే వారి పార్టీపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతుందని అన్నారు. రేవంత్రెడ్డి సీఎంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలను కాంగ్రెస్ వైపు నడిపించాయని అన్నారు. నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ తరపున, ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదీ లేదని అన్నారు. వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత తమదేనన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఖాతాలో మరిన్ని విజయాలు నమోదవుతాయని, బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో షేక్షావళి,జగన్గౌడ్,గంగి రెడ్డి,కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గెలిచిన సర్పంచులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే విజయం
అలంపూర్: మూడో విడతలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్లు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని గురువారం కలిశారు. కర్నూల్లోని ఆయన నివాసంలో అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన నూతన సర్పంచ్లు, నాయకులు మద్దతుదారులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ నూతన సర్పంచ్లను సన్మానించారు. క్షేత్ర స్థాయిలో అందరి సమష్టి కృషితోనే బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసిన ఓటర్లు తమ ఓటుతో సర్పంచ్లను గెలిపించి మద్దతుగా నిలిచారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీన కలిసిన వారిలో ఆయా మండలాల నాయకులు తదితరులు ఉన్నారు. -
కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా పరిధి కోయిల్కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో రెబల్స్తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అంటే.. నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్దపోకలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది. నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. నా కొంప ఆర్సిండురోయ్..! కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో.. మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్.. మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్ఎస్కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ను దెబ్బతీసింది వీరే.. పలు చోట్ల షాడోల తీరు సైతం.. నారాయణపేట, వనపర్తి, జడ్చర్లలో అధిక ప్రభావం మంత్రి జూపల్లి ఇలాకా కొల్లాపూర్లో అత్తెసరు ఫలితాలే.. మరో అమాత్యుడి సెగ్మెంట్ మక్తల్లో మెజార్టీపై ఎఫెక్ట్ గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం -
కోడలిపై అత్త విజయం
జడ్చర్ల మండలం మాటుబండతండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించింది. తండా ఎస్టీ మహిళకు రిజర్వు కాగా నేనావత్ లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దీపక్రాథోడ్ సర్పంచ్గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్ బరిలో దింపాడు. వీరితోపాటు ఆంగోతు రూప్లి అనే మహిళ సైతం బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 228 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లికి 56 ఓట్లు వచ్చాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. – జడ్చర్ల టౌన్ -
అక్కడక్కడ..
● వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాళ్లూరు గ్రామంలో ఆరో వార్డులో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఫలితాలు తారుమారు చేస్తున్నారని రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీస్లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారు గెలవడంతో వారు ఆందోళనను విరమించారు. ● నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు మెట్ల తిరుపతమ్మ గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మం అనే వ్యక్తిపై ‘కారు’ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. -
అన్నపై తమ్ముడి పై‘చేయి’
అడ్డాకుల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అతడి తమ్ముడు దశరథ్రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో తిరుపతిరెడ్డి 758 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా.. దశరథ్రెడ్డి 888 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి ఖాజామైనొద్దీన్ (840)పై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 3,142 ఓట్లకు గాను 2,829 ఓట్లు పోలయ్యాయి. – అడ్డాకుల -
మూడో విడత ఎన్నికలు ప్రశాంతం
● పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ● కలెక్టర్ బీఎం సంతోష్ అలంపూర్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జిల్లాలోని 5 మండలాల్లో పోలింగ్ బుధవారం నిర్వహించగా.. మానవపాడు, బోరవెల్లి, జల్లాపురం పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సరళి, ఓటర్ల వివరాలు, బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. దివ్యాంగులు, నడలేని వారికి, వృద్ధులకు వీల్ చైర్ ఏర్పాటు చేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ● ఓట్ల లెక్కింపులో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని, కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, ఆతర్వాత వార్డు సభ్యులు, సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను లెక్కించాలని కలెక్టర్ ఆదేశించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ అనంతరం పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కౌంటర్ల వద్ద అందజేయాలన్నారు. వీరితోపాటు ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు, పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్ రెడ్డి, ఎన్నికల అధికారులు రామలింగేశ్వర్, రాఘవ, శ్రీనివాస్ జోషి, శివప్రసాద్, అగస్టీన్ ఉన్నారు. ● ఉండవెల్లి మండలం పుల్లూరులో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్యే విజయుడు సతీమణితో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జల్లాపురంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, వల్లూరులో మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహం ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల -
తుది విడతకు కట్టుదిట్టమైన భద్రత
అలంపూర్: జిల్లాలో జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఎర్రవల్లి మండలం పదో బెటాలియన్లో మంగళవారం మూడో విడత ఎన్నికల విధులపై నిర్వహించిన సమగ్ర సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మూడో విడత ఎన్నికలు జరిగే 68 జీపీల్లో 28 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కోసం 370 మంది పోలీస్ ఫోర్స్, 20 రూట్ మొబైల్ పార్టీలు, 6 స్ట్రైకింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 6 క్యూఆర్టీలు, 14 మందితో రూట్ ఇన్చార్జీలను నియమించినట్లు వివరించారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకావొద్దన్నారు. ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, మద్యం, డబ్బు పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా చిన్నపాటి గొడవలను కూడా నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు ఉన్నారు. ● అలంపూర్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఉండవెల్లిలో పోలీసు విధుల నిర్వహణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. -
సర్వం సిద్ధం..
అలంపూర్: పంచాయతీ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరింది. మరికొన్ని గంటల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్ను నిర్దేశించే పోలింగ్ ప్రారంభం కానుంది. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో బుధవారం ఎన్నికల పోలింగ్ జరనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రితో అధికారులు, సిబ్బంది మంగళవారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవిష్యత్ను తేల్చడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. మూడో విడత ఇలా.. మూడో విడతలో మొత్తం 75 సర్పంచ్, 700 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మానవపాడు మండలంలోని గోకులపాడు, చెన్నిపాడు, చంద్రశేఖర్నగర్, చండూరు సర్పంచ్ స్థానాలతో పాటు 50 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇటిక్యాల మండలంలో వావిలాల, మొగలిరావులచెరువు సర్పంచ్ స్థానాలు, 43 వార్డులు, ఎర్రవల్లి మండలంలో రాజశ్రీ గార్లపాడు సర్పంచ్ స్థానంతో పాటు 23 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. అలంపూర్ మండలంలో 6 వార్డులు, ఉండవెల్లిలో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఉండవెల్లి మండలంలోని బస్వాపురంలో 1, 5, 6 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. ఆయా వార్డులకు ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేసినా వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఇక మిగిలిన 68 సర్పంచ్, 561 వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ● మూడో విడత ఎన్నికలు జరిగే జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 216 మంది, వార్డు స్థానా ల్లో 1,287 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 638 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 1,430 మంది అధికారులు పోలింగ్ విధులకు నియమించారు. 1,00,372 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నువ్వా..నేనా అన్నట్టుగా బరిలో ని లిచిన అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలిపోనుంది. నేడు ఐదు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు 68 సర్పంచ్, 561 వార్డు స్థానాల్లో పోలింగ్ 638 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు -
‘తుది’ పోరుకు సై..
● 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాల్లో ఎన్నికలు ● ఏకగ్రీవం పోనూ 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్ ● 5 జిల్లాలు, 27 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం ఉండవెల్లి నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఎన్నికల సిబ్బంది నేడు చివరి విడత సం‘గ్రామం’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తుది విడత సంగ్రామం క్లైమాక్స్కు చేరింది. ఉమ్మడి పాలమూరులోని 27 మండలాల పరిధిలో బుధవారం చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐదు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఏర్పాటు చేసిన సెంటర్లలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసింది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. రెండు విడతల్లో పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యం అయిన నేపథ్యంలో చివరి దఫాలో ఎక్కడా జాప్యం జరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికార యంత్రాంగానికి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు పలు సూచనలు చేశారు. ఇటిక్యాల నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది -
నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో వెలసిన శ్రీయోగా నరసింహస్వామి ఆలయంలో బుధవారం నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజు ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు తిరుప్పావై పఠనం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనాలు, విష్ణు సహస్త్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14న శ్రీ భూనీలా సమేత యోగా నరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీ–20 క్రికెట్ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక గద్వాలన్యూటౌన్: హెచ్సీఏ ఆద్వర్యంలో నిర్వహించే జి. వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నీ పాల్గొనే జిల్లా జట్టును మంగళవారం స్థానిక స్టేడియంలో ఎండీసీఏ, జీసీఏ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల జట్లతో జిల్లా జట్టు ఆడనుంది. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మ డి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జీసీఏ అధ్యక్షుడు శరత్చంద్రకుమార్, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి వెంకటేశ్, ఖలీమ్ పాల్గొన్నారు. విద్యార్థిని కొట్టాడని.. ● హెచ్ఎంతో గ్రామస్తుల వాగ్వాదం అయిజ: మండలంలోని ఎక్లాస్పురం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం బాబు ఓ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం పాఠశాలకు చేరుకొని హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు హెచ్ఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని పాఠశాల హెచ్ఎం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంఈఓను వివరణ కోరగా.. హెచ్ఎం బాబుకు షోకాజు నోటీసు జారీ చేస్తామని, సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.7,978 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 318 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 7,978, కనిష్టంగా రూ. 4,576, సరాసరి రూ. 5,670 ధరలు లభించాయి. అదే విధంగా 19 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,960, కనిష్టంగా రూ. 5,730, సరాసరి రూ. 5810 ధరలు వచ్చాయి. 507 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,769, కనిష్టంగా రూ. 1,802, సరాసరి ధర రూ. 2,769 పలికింది. 30 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,673, కనిష్టంగా రూ. 6,129, సరాసరి రూ. 6,129 ధరలు లభించాయి. ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు ని ర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పీడీ, స్పోర్ట్స్ ఇన్చార్జి వేణుగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యా యామ ఉపాధ్యాయులు సాదత్ఖాన్, బాల్రాజు, సీనియర్ క్రీడాకారులు సయ్యద్ ఎజాజ్అలీ, ఎండీ ఉస్మాన్ పాల్గొన్నారు. -
జూపల్లి ఇలాకాలో ఉత్కంఠ..
● ఆయన స్వగ్రామం పెద్ద దగడ ఫలితంపై సర్వత్రా ఆసక్తి ● కొల్లాపూర్లోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్లో తుదివిడత ఎన్నికలు ● ఆయా మండలాల్లో పొడిచిన పొత్తులతో రసవత్తరంగా పోరు ● ఒక్క ‘చిన్నంబావి’లోనే 12 జీపీల్లో కారుకు కమలం మద్దతు.. ● మిగిలిన 4 పంచాయతీల్లో బీజేపీకి బీఆర్ఎస్ తోడ్పాటు ● మిగతా మండలాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు రెండు విడతలు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్కు చెందిన ఆయా ఎమ్మెల్యేల సొంతూళ్లలో విపక్ష పార్టీల మద్దతుదారులు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుది విడతలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంపై అందరూ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం చిన్నంబావి మండలంలోని పెద్ద దగడ గ్రామానికి బుధవారం పోలింగ్ జరగనుండగా.. ఫలితం ఏ విధంగా ఉంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్ స్థానం కాగా.. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్రెడ్డి తలపడుతున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గ పరిధిలో చివరి దఫాలో ఎన్నికలు జరిగే మండలాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. చిత్రవిచిత్ర పొత్తులే ఇందుకు కారణం. వేర్వేరుగానే.. కానీ ఒక్కటై.. తాజాగా మూడో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాల పరిధిలో మొత్తంగా 56 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ స్థానాల్లో వేర్వేరుగానే.. కానీ ఒక్కటై అన్నట్లు బీఆర్ఎస్, బీజేపీ ఒక అవగాహనతో ఉమ్మడి అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. గ్రామాల్లో బలాబలాల ప్రకారం సర్పంచ్ సీట్లు విభజన చేసుకుని.. ఆయా చోట్ల ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ముందుకుసాగారు. ఇందుకు చిన్నంబావి మండలమే ఉదాహరణగా నిలుస్తోంది. ఈ మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో బస్వాపురం జీపీ ఏకగ్రీవం కాగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అయ్యాడు. గూడెం, బెక్కం, మియాపూర్, లక్ష్మీపల్లిలో సర్పంచ్లుగా బీజేపీకి చెందిన వారు.. మిగతా 12 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. పాన్గల్ మండలంలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుతో రేమద్దుల, చిక్కపల్లి, షాగాపూర్ పంచాయతీల్లో ఆయా అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు చిత్తవుతుందా.. ఆ పొత్తు కాంగ్రెస్ను చిత్తు చేస్తుందా అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా స్వగ్రామమైన ఉండవెల్లి మండలం పుల్లూరులో కూడా చివరి విడతలో ఎన్నికలు జరనున్నాయి. అక్కడ ‘కారు’ దూసుకెళ్తుందా.. ‘హస్తం’ గాలి వీస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది. 2వ విడతలో నువ్వా.. నేనా.. రెండో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో 71 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ పోటాపోటీగా సర్పంచ్ స్థానాలను సాధించింది. హస్తం బలపరిచిన అభ్యర్థులు 36 మంది.. బీఆర్ఎస్ మద్దతుదారులు 29 మంది సర్పంచ్లుగా గెలుపొందారు. బీజేపీకి చెందిన ఇద్దరు.. స్వతంత్రులు మరో నలుగురు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఇందులో మండల కేంద్రాలైన పెద్దకొత్తపల్లి, పెంటవెల్లి జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా.. కోడేరులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పోలింగ్ జరుగుతున్న రోజు ఆ స్వతంత్ర అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. -
పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి
అలంపూర్: మూడో విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. ఏమైనా పొరపాట్లు జరిగితే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పోలింగ్, కౌటింగ్ నిర్వహణకు అవసరమైన ప్రతి సామగ్రి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు కేంద్రాల్లో రిపోర్టు చేసిన తర్వాత రూట్ల వారీగా జోనల్ అధికారులు సహకారం అందిస్తారన్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన పీఓలు, ఓపీఓలు, ఇతర అధికారులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రిసెప్షన్ సెంటర్లకు తిరిగి వచ్చే వరకు పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చివరి దశ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు నుషిత, నరేశ్ ఉన్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఇటిక్యాల: ప్రజాస్వామ్య వ్యవస్ధలో కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియాగించుకోవాలని శిక్షణ కలెక్టర్లు మనోజ్కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ అన్నారు. సోమవారం స్ధానిక మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మూడో విడత ఎన్నికల విధులకు హాజరయ్యే వివిధ శాఖల ఉద్యోగులకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ వసతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు సర్పంచ్కు 37 ఓట్లు, వార్డ్ మెంబర్లకు 31 ఓట్లను వినియోగించుకున్నట్లు ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ తెలిపారు. -
ప్రచారానికి తెర
● ముగిసిన మూడో విడత ప్రచార పర్వం ● ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో మద్దతు పార్టీలు ● ఐదు మండలాల్లోని 75 పంచాయతీలు, 700 వార్డుల్లో ఎన్నికలు ● రేపటి పోలింగ్కు అధికార యంత్రాంగం సన్నద్ధం అలంపూర్: పంచాయతీ పోరులో మూడో విడత ప్రచారానికి తెర పడింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నువ్వా నేరా అన్నట్లుగా సర్పంచ్, వార్డుసభ్యులు ప్రచారంలో పోటీపడ్డారు. ప్రచార పర్వంలో చివరి రోజైన సోమవారం అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఎక్కువ మంది ఓటర్లను కలిసి ఓటును అభ్యర్థించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ప్రచారానికి గడువు ముగిసింది. అనంతరం ఎన్నికల అధికారుల అదేశాలు, పోలీసుల సూచనల మేరకు సాయంత్రం 5 గంటలకు తమ ప్రచారాన్ని ముగించారు. గత కొన్ని రోజులుగా ప్రచారంతో సందడిగా మారిన గ్రామాలు సమయం ముగియడంతో ఒక్కసారిగా నిశబ్ద వాతావరణంలోకి వెళ్లాయి. ప్రచార పర్వంలో ప్రసన్నం చేసుకున్న ఓటర్లు చేదాటకుండా అభ్యర్థులు ప్రయత్నాలు మొదలెట్టారు. 75 పంచాయతీలకు ఎన్నికలు జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో ఐదు మండలాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అలంపూర్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, 120 వార్డులు, ఉండవెల్లిలో 15 జీలు, 142 వార్డులు, మానవపాడులో 17 జీపీలు, 164 వార్డులు, ఇటిక్యాలలో 14 జీపీలు, 130 వార్డులు, ఎర్రవల్లి మండలంలో 15 జీపీలు, 144 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల అమోదం, పరిశీలన అనంతరం 9న నామినేషన్ల ఉపసంహరణ ముగించారు. 9న పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. అప్పటి నుంచి అభ్యర్థులు 6 రోజులపాటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. మూడో విడతలో 75 పంచాయతీలు, 700 వార్డులకు ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణ వరకు 7 గ్రామ పంచాయతీలు, 136 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం 68 గ్రామ పంచాయతీలు, 564 వార్డులకు ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రచారం పర్వం ముగియడంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీసులు సైతం ప్రచార సమయం ముగిసిన తర్వాత గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికల నిబంధనల మేరకు సమయం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేయరాదని ప్రజలకు అవగాహన కల్పించారు. -
ఓటర్లకు తాయిలాలు..
● పోలింగ్కు ఒక్కరోజే సమయం ● ప్రలోభాలకు తెరలేపిన సర్పంచ్, వార్డు అభ ్యర్థులు ● రాత్రికి రాత్రే కాలనీల్లో గ్రామాల్లో మద్యం, డబ్బులు పంపిణీ గద్వాలటౌన్: పోలింగ్కు ఒక్క రోజే సమయం ఉండడంతో సర్పంచ్, వార్డుసభ్యులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు తాగినంత మద్యం పోస్తూ.. అడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటరు చొప్పున విడదీస్తూ రూ.500 నుంచి రూ.2000 వరకు చెల్లిస్తూ వారి ఓట్లను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రికి రాత్రే కాలనీల్లో రహస్యంగా పర్యటిస్తూ మద్యం, డబ్బులను విచ్చలవిడిగా ఓటర్లకు అందిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ఓటర్లు సైతం నాయకులు, కార్యకర్తలను తమ ఇష్టాలకు ఉపయోగించుకుంటున్నారు. తమ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ అభ్యర్థులను నమ్మిస్తూ డబ్బులు ఆశిస్తున్నారు. అభ్యర్థులు సైతం అడిగిందే తడవుగా వేలాది రూపాయలు గుప్పిస్తున్నారు. డబ్బులు, మద్యంతో పాటు కాలనీల్లో యువకులకు అవసరమయ్యే క్రికెట్ కిట్లు, ఇతర వస్తు సామగ్రిని అభ్యర్థుల నుంచి బలవంతంగా అడిగి పుచ్చుకుంటున్నారు. మహిళలకు ఇంటికి వెళ్లి చీరలను అందజేశారు. ఓట్లను ఆశిస్తున్న నాయకులు సైతం కాదనకుండా అందిస్తున్నారు. 17న జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో భారీగా ఓటర్లకు మద్యం అందజేసేందుకు.. రహస్యంగా మద్యం నిల్వలను ఇప్పటికే ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. దాదాపు అన్ని గ్రామాలలో ‘ఓటుకు నోటు’ అనే సంప్రదాయం కొనసాగుతోంది. డబ్బులు, మద్యాన్ని వివిధ పార్టీల అభ్యర్థులు ఎర చూపుతుండటంతో కార్యకర్తల్లో కూడా డబ్బులు సందడి స్పష్టంగా కనిపిస్తోంది. ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి.. ఇదిలా ఉండగా నాయకుల ఫోన్లు బిజీగా మారాయి. ఒక్కో గ్రామం నుంచి ఛోటా మోటా నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకుల నుంచి వచ్చే ఫోన్లతో అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ‘అన్నా ఇప్పుడే అవతలి పార్టీకి సంబంధించిన వారు వచ్చి ఇక్కడ డబ్బు పంచారు..’ ‘అన్నా ఫలానా వారికి మందు సీసాలు సఫ్లై చేయాలి’ అన్న వార్తలతో నేతల ఫోన్లు నిర్విరామంగా మోగాయి. -
ఇంటికే ‘పోల్ చీటీ’
● ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ● బీఎల్ఓల ద్వారా నేరుగా ఓటర్లకు అందజేత వనపర్తి: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఓటర్లకు పోలింగ్ సిప్ల్లను అందజేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నేరుగా పోల్ చీటీలు అందజేస్తున్నారు. ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్న అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లో మరో రెండు రోజుల్లో పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగం ఈ దిశగా ముందుకు సాగుతోంది. నిరక్షరాస్యులు.. వృద్ధులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోల్ చీటీలు దోహదపడుతాయి. వీటిని గతంలో రాజకీయ పార్టీలే ముంద్రించి ఎన్నికలకు ముందు రోజున ప్రచారం చేసుకుంటూ ఓటర్లకు అందించేవారు. అయితే వీరు ఓటర్లు అందరికీ ఇచ్చేవారు కాదు. దీంతో తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక ఓటర్లు పోలింగ్ రోజున ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు ఎక్కువగా సతమతమయ్యేవారు. ఈ క్రమంలో ఓటర్లు సులువుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘమే పోల్ చీటీలను అందజేస్తోంది. ఓటర్లు ఇళ్లలో లేకుంటే.. సిబ్బంది ఇళ్లకు వెళ్లిన సమయంలో లేనివారి పోల్ స్లిప్లు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతారు. వారితోపాటు చిరునామాలో లేనివారివి, డూప్లికేట్లుగా భావించిన వారివి అందుబాటులో ఉంటాయి. అక్కడ తగిన ఆధారం చూపి పోల్ చీటీ తీసుకోవచ్చు. పోల్ చీటీ లేకపోయినా ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటరు జాబితాలో పేరుంటే ఓటరు వేయవచ్చు. -
మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
గద్వాల: జిల్లాలో మూడవ విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్తో కలిసి మూడో విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడో ర్యాండమైజేషన్ను విజయవంతమైనట్లు ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరిగే అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లో 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఏకగ్రీవాలు అనంతరం మిగిలిన 638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 1,00,372 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇందుకు సంబందించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాంత్, ఈడీఎం శివ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితి పెంపు అనవసరం
గద్వాలన్యూటౌన్: బీమా రంగంలో ఎఫ్డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పెంపు అనవసరమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) బ్రాంచ్ కార్యదర్శి బంగి రంగారావు అన్నారు. సోమవారం గద్వాల ఎల్ఐసీ బ్రాంచ్ ఆవరణలో విలేఖర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2025 డిసెంబర్12న కేంద్ర ప్రభుత్వం ప్రో క్యాపిటెల్ ఆర్థిక సంస్కరణలకు ఆమోదం తెలిపిందని, ఇందులో బాగంగా బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని వంద శాతానికి పెంచడంతో పాటు బీమా చట్టాల (సవరణ) కూడా ఉందన్నారు. అయితే 1999లో ఐఆర్డీఏ బిల్లును ఆమోదించడం ద్వార బీమా రంగాన్ని జాతియీకరణ నుంచి విముక్తి చేశారని చెప్పారు. అప్పటి నుంచి విదేశీ భాగస్వాములతో కూడిన అనేక ప్రైవేట్ బీమా సంస్థలు జీవిత బీమా, సాధారణ బీమా రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈసంస్థలకు వ్యాపారం నిర్వహించడానికి మూలధనం సమస్య కాలేదన్నారు. వాస్తవానికి బీమా రంగంలో వినియోగిస్తున్న మొత్తం మూలధనంలో ఎఫ్డీఐ వాటా సుమారు 32శాతం మాత్రమే అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీమా రంగంలోఎఫ్డీఐ పరిమితిని వంద శాతానికి పెంచచి మూలధనానికి సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడం మంచి నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయం బీమా సంస్థలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని చెప్పారు. దీనివల్ల బీమారంగం క్రమబద్దంగా అభివృద్ధి చెందకుండా, లాభాలపై మాత్రమే దృష్టి కేంద్రీకృతమవుతుందని, ప్రజలకు, వ్యాపార రంగానికి అవసరమైన భద్రత అందించడంలో వెనకబడుతుందన్నారు. కార్పొరేట్ పక్షపాతంతో కూడిన ఆర్థిక విధానాల నుంచి ప్రజా కేంద్రీకృత విధానాల వైపు ప్రభుత్వం మళ్లాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాఘవేంద్ర, ఉదయ్ కుమార్, సూరజ్, లక్ష్మీకాంత్, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 2026 జనవరి 14 న ముగుస్తుందని, దీంతో ధనుర్మాసంలో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తునట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రాతః కాల మహా మంగళ హారతి ఉదయం 6.30 గంటలకు ఉందని.. ఆ సమయాన్ని 5.30 గంటలకు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోనూ ప్రాతఃకాల మహా మంగళహారతిని ఉదయం 6 గంటల నుంచి 5.45గా మార్పు చేసినట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
చెయ్యెత్తిన పల్లెలు..
మహబూబ్నగర్: 98 కాంగ్రెస్.. 39 బీఆర్ఎస్ జిల్లాలోని 151 జీపీల్లో రెండో విడతలో పోలింగ్ జరిగింది. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని హన్వాడ, దేవరకద్రలోని సీసీకుంట, కౌకుంట్ల దేవరకద్ర.. జడ్చర్లలోని మిడ్జిల్.. నారాయణపేటలోని కోయిల్కొండ మండలాల పరిధిలో 98 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. 39 జీపీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది, ఆరు చోట్ల ఇతరులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. నారాయణపేట : కాంగ్రెస్దే పైచేయి.. జిల్లాలోని ఈ నియోజకవర్గ పరిధిలో దామరగిద్ద, ధన్వాడా, నారాయణపేట, మరికల్ మండలాల్లో 95 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 52 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు.. 18 పంచాయతీల్లో బీఆర్ఎస్, 13 జీపీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 12 గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. -
ప్రశాంతంగా రెండోవిడత పోలింగ్
గద్వాల: జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో జరిగిన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ బీఎం సంతోష్ ఉదయం 7గంటలకు వెబ్కాస్ట్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన పలు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. రెండో విడతలో భాగంగా మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి, అయిజ మండలాల్లో మొత్తం 57 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరిగింది. మొత్తం 567 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాయు. మొత్తం 1,12,807 మంది ఓటర్లకుగాను 57,094 మహిళలు, 55,710 పురుషులు ఉన్నారు. వీరిలో 49,145 మహిళాళ ఓటర్లు, 49,086 మంది పురుష ఓటర్లు, ముగ్గురు థర్డ్జెండర్ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 87.08శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు రాజోళి/మల్దకల్: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. రాజోళి, వడ్డేపల్లి, మల్దకల్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ బీఎం సంతోష్తోపాటు ఎస్పీ పరిశీలించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలులోనే ఉందని తెలిపారు. అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉందని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోట చేసుకున్నా, వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలపై డేగ కన్ను ఉంచినటు తెలిపారు. అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య పాల్గొన్నారు. -
గ్రామాలు పోటెత్తాయి..!
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్ ● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్ ● అత్యల్పంగా నాగర్కర్నూల్లో 84 శాతం.. మేకలసోంపల్లిలో సర్పంచ్ జయరాములతో కలిసి నాయకుల సంబరాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 84 శాతం.. ఆపైనే.. ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. -
‘రెండో’ పోరుకు రెడీ
నేడు 2 విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ● ఉమ్మడి జిల్లాలో 45 మంది సర్పంచ్లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం ● 520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్ ● అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు. రెండో విడతలో ఇలా.. 520 సర్పంచ్లకు 1,709 మంది పోటీ.. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
దమగ్నాపూర్: ఇద్దరూ.. ఇద్దరే
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ సర్పంచ్ అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్ఎస్ బలపరిచిన ఇ.పావని సర్పంచ్గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయా వకాశాలు ఉన్నట్లు తెలు స్తోంది. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి
అయిజ/మల్దకల్/రాజోళి: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అయిజ, మల్దకల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసులతో సమావేశమయ్యారు. ఓటింగ్ సమయంలో గుంపులుగా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పోలింగ్ కేంద్రం సమీపంలో దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ బూత్లలో భద్రత, రూట్ ఇన్చార్జీ, రూట్ మొబైల్టీంలు, క్యూఆర్టీ, స్పెషల్ ఫోర్స్ బృందాలు చేపట్టాల్సిన పనులను స్పష్టంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడులకు ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. చిన్న గొడవలైనా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి శాంతిభద్రతలకు భంగం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల భద్రతే మన ప్రధాన ధ్యేయమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను అణిచి వేయాలన్నారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ శంకర్ అన్నారు. రాజోళి, వడ్డేపల్లి మండలాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఓటింగ్ మొదలుకుని కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎలాంటి కార్యచరణను అమలు చేయాలనే అంశాలపై వడ్డేపల్లి, రాజోళి మండలాల పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తనిఖీలు చేశాకే లోపలకు అనుమతించాలని సూచించారు. -
‘స్వగ్రామాలే’ సవాల్..!
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు ● జడ్చర్ల, వనపర్తి ఫలితాలతో ‘అధికార’ నేతల్లో కలవరం ● స్వీయ పర్యవేక్షణతోపాటు వేగుల ద్వారా పావులు ● ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారిన పోరు ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uజడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనంపల్లి అనిరుధ్రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెంలో సర్పంచ్గా బీజేపీ మద్దతుదారు కాటేపాట రేవతి విజయం సాధించారు. తొలుత ఆమెకు ఆరు ఓట్ల మెజార్టీ రాగా.. రీకౌంటింగ్లో ఆధిక్యం 31కి పెరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంతూరు ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపురంలో బీఆర్ఎస్ బలపరిచిన గుళ్ల గిరమ్మ ఏడు ఓట్ల తేడాతో సర్పంచ్గా గెలుపొందారు. ..ఇలా తొలి విడత సం‘గ్రామంశ్రీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్ పంచాయతీ పోరులో అనూహ్యంగా పుంజుకోవడం వారిని కలవరానికి గురిచేస్తోంది. రచ్చ గెలిచినా.. ఇంట గెలవకపోతే పరువు పోతుందని బెంబేలెత్తుతున్నారు. విపక్షాలు ఆయా నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల సొంతూళ్లే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. ఆ నాయకులకు గెలుపు సవాల్గా మారింది. దీంతో తమ తమ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్వగ్రామాల్లో నెలకొన్న పోరు పరిస్థితులపై ‘సాక్షి’ కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ తూడుకుర్తి: నువ్వా.. నేనా.. ప్రభావిత వర్గాలు.. బోయ, ఎస్సీ, ముస్లిం, ముదిరాజ్, ఉప్పరి మహిళలు 2,706 పురుషులు 2,658 మొత్తం ఓటర్లు 5,364 నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి స్వగ్రామం తూడికుర్తి. నాగర్కర్నూల్ మండలంలోని ఈ గ్రామ సర్పంచ్ పదవి అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తంగా సర్పంచ్ పీఠానికి ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ, బీఆర్ఎస్ మద్దతుదారు విమల మధ్యనే పోటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ ఈ గ్రామం కూచుకుళ్ల కుటుంబానికి కంచుకోట. ప్రస్తుతం ఈ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరొందిన కరుణాకర్రెడ్డి భార్య లక్ష్మీ కాగా.. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడిగా ఉన్న నర్సింహారెడ్డి భార్య విమల. నర్సింహారెడ్డి గతంలో ఒకమారు ఎంపీపీ, గ్రామ సర్పంచ్గా పనిచేశారు. దామోదర్రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరగా.. ఆయన ‘కారుశ్రీలోనే ఉండిపోయారు. ప్రస్తుతం లక్ష్మీ, విమల మధ్యే పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. ముస్లింలు, ఎస్సీల్లో ఎక్కువగా కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తుండగా.. మిగతా బీసీ సామాజిక వర్గాలు రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సొంతూళ్లలో పోటాపోటీ -
ధన్వాడ: అత్తాకోడళ్ల మధ్యే..!
నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సొంతూరు ధన్వాడ. మండలకేంద్రమైన ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ రెండో విడతలో జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్లుగా కాంగ్రెస్ మద్దతుదారు చిట్టెం జ్యోతి, బీజేపీ బలపరిచిన పంది జ్యోతి, బీఆర్ఎస్కు చెందిన గుండు శ్రీదేవి బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులైన చిట్టెం జ్యోతి, పంది జ్యోతి మధ్యే పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హస్తం మద్దతుతో బరిలో నిలిచిన చిట్టెం జ్యోతి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందగా.. ఆమెను చిట్టెం రాఘవేందర్రెడ్డి వివాహమాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందంటూ బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. తానూ ఈ గ్రామవాసినేనని.. బీసీ బిడ్డనేనని.. పదేళ్ల క్రితమే తమకు వివాహమైందంటూ చిట్టెం జ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఎక్కువ శాతం ఉన్న ముస్లింలు కాంగ్రెస్ వైపు నిలుస్తుండగా.. పద్మశాలి, కుర్వ, ఎస్సీలు బీజేపీకి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువురూ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ప్రభావిత వర్గాలు.. పద్మశాలి, ఎస్సీ, ముదిరాజ్, ముస్లిం, కుర్వ, గౌడ, బోయ వాల్మీకి, రెడ్డి పురుషులు 4,034 మహిళలు 4,293 మొత్తం ఓటర్లు 8,327 -
పెద్ద దగడ: విద్యావంతుడు, స్థానికత మధ్యే పోటీ..
పురుషులు 1,071 మహిళలు 1,021 మొత్తం ఓటర్లు 2,092ప్రభావిత వర్గాలు.. యాదవులు, ఎస్సీలు, మంగలి, తెలుగు, బోయ, గౌడ, రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్కు కేటాయించారు. మూడో విడతలో జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్ రెడ్డి తలపడుతున్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న భాస్కర్ యాదవ్ రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిరంజన్రెడ్డి స్థానిక నాయకుడు కాగా.. గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా పనిచేశాడు. స్థానికత, సానుభూతి కలిసి వస్తుందని.. గతంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేశానని, అదే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. విద్యావంతుడిగా తనకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని భాస్కర్ యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మెజార్టీగా ఉన్న యాదవ సామాజికవర్గం ఓట్లు తనకు లాభిస్తాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు. -
పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జవహార్ నవోదయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. – భాస్కర్కుమార్, ప్రిన్సిపల్, వట్టెం నవోదయ విద్యాలయం -
తగ్గిన ఏకగ్రీవాలు..!
● జిల్లాలో 40 సర్పంచ్, 719 వార్డులు ఏకగ్రీవం ● 2019 పంచాయతీ ఎన్నికల కంటే 6 స్థానాలు తగ్గిన వైనం ● ప్రత్యేక నిధుల కేటాయింపులో ప్రభుత్వాల నిర్లక్ష్యం ● విధిలేక ఎన్నికల బరిలోకి అభ్యర్థులు అలంపూర్: గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం.. ఎన్నికల వ్యయాన్ని గ్రామ అభివృద్ధికి వెచ్చించడం.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ఏకగ్రీవాలను ప్రొత్సహిస్తుంటాయి. అందుకు తగ్గట్టుగానే స్థానిక సంస్థల్లో పంచాయతీల ఏకగ్రీవాలు పెరిగాయి. కానీ ప్రభుత్వాలు గ్రామీణ ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి బాటలు వేయడం లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రత్యేకంగా కేటాయించాల్సిన నిధులు సైతం పైసా ఇవ్వలేదు. దీంతో రాను రాను పంచాయతీ ఎన్నికల సమరం హోరెత్తుతుంది. గతేడాది పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవాల సంఖ్య ఘణనీయంగా తగ్గింది. గతంలో ఏకగ్రీమైన పంచాయతీలో ఈ సారి రసవత్తర పోరు సాగుతుంది. మిగిలిన చోట అదే పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 గ్రామ పంచాయతీలు, 719 వార్డులు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. అభివృద్ధి కాంక్షించి.. ఏకగ్రీవం వైపు అడుగులు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు, మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇదిలాఉండగా, కొన్ని గ్రామాల్లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఏకగ్రీవం వైపు మొగ్గుచూపారు. మొదటి విడతలో గద్వాల మండలంలో కుర్వపల్లి, ఈడుగోనిపల్లి, ముల్కపల్లి జీపీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, ధరూరు మండలంలో ర్యాలంపాడు, జాంపల్లి, ద్యాగదొడ్డిచ చిన్నపాడు, కేటిదొడ్డిలో చింతలకుంట, రంగాపురం, గట్టు మండలంలో ముచ్చోనినిపల్లి, అరగిద్ద, లింగాపురం, పెంచికలపాడు, తుమ్మలపల్లి, తారాపురం.. మొత్తంగా తొలి విడతలో 15 మంది సర్పంచ్లు, 361 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ● రెండో విడతలో మల్దకల్ మండలంలో సద్దలోనిపల్లి, మంగంపేట, నీల్పల్లి, బిజ్వారం, చర్లగార్లపాడు జీపీలు, 54 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయిజలో గుడిదొడ్డి, జడదొడ్డి, కిష్ణాపురం, కుర్వపల్లి, రాజాపురం, తొత్తినోనిదొడ్డి, వెంకటాపురం జీపీలు, 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రాజోలి మండలంలో పడమటి గార్లపాడు జీపీతోపాటు 23 వార్డులు, వడ్డేపల్లి మండలంలో తనగల, కొంకల, జూలెకల్, జక్కిరెడ్డి పల్లె, వెంకట్రామనగర్ జీపీలు, 66 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో మొత్తం 18 గ్రామ సర్పంచ్లు, 222 వార్డుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ● మూడో విడతలో ఇటిక్యాల వావిలాల, మొగలిరావుల చెరువు జీపీలు, 43 వార్డులు, మానవపాడులో గోకులపాడు, చెన్నిపాడు, చంద్రశేఖర్ నగర్, చండూరు జీపీలు, 50 వార్డులు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎర్రవల్లిలో రాజశ్రీ గార్లపాడు జీపీతోపాటు, 23 వార్డులు, అలంపూర్లో 6 వార్డులు, ఉండవెల్లిలో 14 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. చివరి విడతలో 7 సర్పంచ్ స్థానాలు, 136 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇదిలాఉండగా, 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో 46 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో జిల్లాలో 255 సర్పంచ్ స్థానాలకు గతంలోనూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడతలో 30 స్థానాలు, రెండో విడతలో 14 స్థానాలు, మూడో విడతలో 2 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నజరానా అందక.. జిల్లాలో గడిచిన రెండు సర్పంచ్ ఎన్నికలను పరిశీలిస్తే ఈ సారి 10 స్థానాలు తగ్గాయి. ఏకగ్రీవ పంచాయతీలకు గతంలో ప్రభుత్వం రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. కానీ సర్పంచ్ల పదవీ కాలం ఐదేళ్లు ముగిసిన ఏకగ్రీవ పంచాయతీలకు పైసా రాలేదు. గ్రామ అభివృద్ధి కోసం పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకున్న ప్రజలు ఆ తర్వాత తీవ్ర నిరాశ చెందాల్సి వచ్చింది. గత ఏకగ్రీవ పంచాయతీల పరిస్థితిని గమనించిన ప్రజలు ఈ సారి ఏకగ్రీవం కంటే పోటీతోనే అభివృద్ధి సాధించాలని పోరుకు సిద్ధమయ్యారు. ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన గత ఏకగ్రీవ పంచాయతీలు ఈ సారిలో పోరులో నిచిచాయి. -
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
గద్వాల: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కోసం మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల పరిశీలకుడు గంగాధర్తో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ నెల 14వ తేదీన అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో మొత్తం 716 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో ఏకగ్రీవాలు మినహాయించి మిగిలిన 567 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. 2వ విడత ఎన్నికల్లో 1,34,601 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధుల నిర్వహణ విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది వివరాలను సంబంధిత మండలాల తహసీల్దార్లకు వెంటనే అందజేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో శ్రీకాంత్, జెడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఈడీఎం శివ తదితరలు పాల్గొన్నారు. -
జనరల్లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని 24 మండలాల్లో తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి 237 అన్రిజర్వ్డ్ (జనరల్, మహిళ కలిపి) సర్పంచ్ స్థానాల్లో 116 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు 114 బీసీ రిజర్వ్ (బీసీ జనరల్, బీసీ మహిళ కలిపి) స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 550 సర్పంచ్లకు గాను 230 మంది (41.82 శాతం) బీసీలు ఎన్నికయ్యారు. తొలివిడతలోసర్పంచ్లుగా విజయం 237 అన్రిజర్వ్డ్ స్థానాల్లో 116 మంది జయకేతనం మొత్తంగా 550 పంచాయతీల్లో 230 మంది గెలుపు బీసీలు పోటీలో ఉన్న జనరల్ స్థానాలపై సంఘాల ప్రత్యేక నజర్ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
120 సీట్లు.. 7,115 విద్యారు్థలు
గద్వాలటౌన్: నవోదయ విద్యాయాల్లో ప్రవేశం కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. తల్లిదండ్రులు సైతం ఆ దిశగా పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. గ్రామీణ, పట్టణం తేడా లేకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని నవోదయలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి మహబుబ్నగర్ జిల్లా (రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొన్ని మండలాలు)లో నవోదయ ప్రవేశాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. అంటే 120 సీట్లకు అంత మంది పోటీ పడాల్సి వస్తోంది. డిసెంబర్ 13న నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అరగంట ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రెండు విద్యాలయాలలో.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కొత్త నవోదయ విద్యాలయాలు వస్తే పోటీ తగ్గి ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం వస్తుందని అనేకమంది ఎదురుచూశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కొత్త నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం మహబూబ్నగర్ శివారులో స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి తరగతులు కొనసాగిస్తున్నా రు. అందులో 40సీట్లను భర్తీ చేశారు. వట్టెం జవహ ర్ నవోదయ విద్యాలయంలో 80సీట్లు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 120సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల మోత.. అర్హులైన అధ్యాపకుల లేమి.. తదితర సమస్యలు పూర్తిస్థాయి లో నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్ర వేశాలకు నిర్వహించే అర్హత పరీక్షలో ఒకసారి ప్రవే శం లభిస్తే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూ ర్తయ్యే వరకు అందులోనే నాణ్యమైన విద్య అందు తుంది. క్రీడలకూ ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. వస తి, భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, ఏకరూప దుస్తు లు తదితర అన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. నాణ్యమైన విద్య.. నవోదయలోప్రవేశాలకు డిమాండ్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు నేడే ప్రవేశ పరీక్ష -
ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి
ఎర్రవల్లి: సాంప్రదాయ వంటలతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని.. విద్యార్థులు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని పదో బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించగా.. కమాండెంట్ హాజరై ఫుడ్ ఫెస్టివల్లో 170మంది విద్యార్థులు ప్రదర్శించిన 80 రకాల ఆరోగ్యకరమైన వంటకాలను సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకతను, సామూహిక చైతన్య భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారవు అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. పాఠశాలలో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తూ, వారికి ఆనందాన్ని ఇచ్చే వేదికలుగా పనిచేస్తాయని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, ఆర్ఐలు ధర్మారావు, నరసింహరాజు, పాఠశాల ప్రిన్సిపల్ షేక్షావలి, అధికారులు, ఉపాద్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఓటెత్తారు..
● జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 86.77 శాతం ● మహబూబ్నగర్లో అత్యల్పంగా 83.04 శాతం ● అన్ని జిల్లాల్లోనూ పురుషుల ఓటింగ్ శాతమే ఎక్కువ మొట్ట మొదటి సారిగా ఓటు హక్కును వినియోగించుకున్న యువతిసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్నగర్ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్లో వెనుకపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 83.04 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 83.37 శాతం, మహిళలు 82.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా 86.32 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 87.13 శాతం, మహిళలు 85.53 శాతం మంది ఓటు వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో తొలి విడత జీపీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తంగా 86.77 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 87.79 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 85.79 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 84.90 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 85.91 శాతం, మహిళలు 83.99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో జరిగిన జీపీ ఎన్నికల్లో మొత్తంగా 84.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 85.55 శాతం, మహిళలు 83.66 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధరూరులో వృద్ధులకు సాయంగా పంచాయతీ సిబ్బంది -
ప్రశాంతంగా తొలివిడత పోలింగ్
గద్వాల: జిల్లాలో మూడు విడతలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు తొలివిడతలో భాగంగా శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. 86.77శాతం పోలింగ్ శాతం నమోదైందని తెలిపారు. మొదటి విడతలో నాలుగు మండలాలైన గద్వాల, ధరూరు, గట్టు, కే.టి.దొడ్డి మండలాల్లో 92 గ్రామపంచాయతీలు, 839వార్డులకు పోలింగ్ జరిగిందన్నారు. 57,476 మంది మహిళలు, 56,786 మంది పురుషులు, ఇతరులు ఒకరు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలిపారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన జిల్లాలో మొదటి విడతలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సరళిని మొదటగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన గద్వాల, ధరూరు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో చేయాలని, ముందుగా పోస్టల్బ్యాలెట్ పత్రాలను లెక్కించి తరువాత వార్డు మెంబర్ బ్యాలెట్పేపర్లను వేరుచేసి క్రమపద్దతిలో ఓట్లను లెక్కించాలని ఆదేశించారు. అన్ని వార్డుల లెక్కింపులు పూర్తయ్యాకనే సర్పంచు అభ్యర్థుల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలన్నారు. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుబందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఐజీ, ఎస్పీ పర్యవేక్షణ పోలింగ్ ప్రక్రియను డీఐజీ చౌహాన్ క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన అనంతపురం పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే, ఆలూరు, రాయాపురం, గట్టు గ్రామాల్లోని పోలింగ్ బూత్లను ఏఎస్పీ శంకర్ పరిశీలించారు. ధరూరు: ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మూడు దశల ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు, ర్యాలీలు నిషేధమని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా గురువారం మండలంలో పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తొలిదశ ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటికీ గెలిచిన అభ్యర్థులు వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎన్నికల నేపథ్యంలో మూడు దశల ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ కొనసాగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య ప్రిక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్చి అన్నారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రజలు, నాయుకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఓటర్లు శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు ధరూరులోని ఆయా పోలింగ్ బూత్లను సందర్శించి అక్కడి పరిస్థితిని, వివరాలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం -
నువ్వా.. నేనా !
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నడిగడ్డ.. జోగుళాంబ గద్వాల జిల్లా.. అంటేనే విభిన్న రాజకీయాలకు మారు పేరు. ఈ జిల్లాలో నిర్వహించిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు తీర్పు మరోసారి ఆ శైలిని ప్రతిబింబించింది. ఏకగ్రీవం పోనూ మిగిలిన 92 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు గురువారం పోలింగ్ జరగగా.. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. అయితే గద్వాల నియోజకవర్గంలో పోటీ అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కాకుండా.. ‘హస్తంశ్రీలో వర్గాల మధ్యే కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాలకు చెందిన మద్దతుదారులు నువ్వా, నేనా అన్నట్లు పోటీపడ్డారు. 839 వార్డు స్థానాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు 56.. ఇటు 26 షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల పరిధిలో 106 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. 82 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్లుగా గెలుపొందారు. ఇందులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి చెందిన మద్దతుదారులు 56.. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గానికి చెందిన 26 మంది సర్పంచ్లుగా గెలుపొందారు. గద్వాలలో హోరాహోరీగా సాగిన పోరు సర్పంచ్లు, వార్డులు అత్యధికంగా ‘హస్త’గతం ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాల మధ్యే పోటీ 56 జీపీల్లో సర్పంచ్లుగా ఎన్నికై న బండ్ల వర్గీయులు మరో 26 పంచాయతీల్లో సరిత మద్దతుదారుల గెలుపు 2వ స్థానంలో బీజేపీ.. మూడో స్థానంలో బీఆర్ఎస్ -
ఎన్నికల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం
ఎర్రవల్లి: స్థానిక సంస్థల మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు పోలీస్ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మల్దకల్, రేవల్లి, కోస్గి, తదితర ప్రాంతాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో పదో బెటాలియన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పోలింగ్లో భాగంగా వృద్దులు, దివ్యాంగులకు చేయూతనందించి వారు సురక్షితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకారం అందించారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని వారికి, అవసరమైన చోట తగిన సాయం అందిస్తూ మానవతా దృక్పథంతో పోలీస్ సిబ్బంది వ్యవహరించడంపై ప్రజలు ప్రశంసలు కురిపించారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా సాగేందుకు పోలీసులు ప్రతి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా సాగేందుకు తమ బాధ్యతను నిబద్దతతో నిర్వర్తిస్తూ ఓటర్లకు అండగా నిలిచేందుకు సిబ్బంది చూపిన సేవాభావం, క్రమశిక్షణను అభినందించారు. -
పకడ్బందీగా పోలింగ్
● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: మొదటి విడతలో జరిగే పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామగ్రిని సరిచూసుకుని ఎక్కడా కూడా పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. పీఓ అందరూ కూడా వారికి కేటాయించిన గ్రామపంచాయతీలకు సాయంత్రంలోగా చేరుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి తిరిగి రిసెప్షన్ కేంద్రానికి వచ్చేవరకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ మల్లీఖార్జున్ ఎంఈఓ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు తీర్పు నేడే..
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘటం మొదలైంది. పల్లె ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. గ్రామాభివృద్ధికి పాటుపడే సరైన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవడానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. హోరాహోరీగా సాగిన పల్లె పోరులో అభ్యర్థుల భవితవ్యం గురువారం సాయంత్రంతో తేలనుంది. సర్పంచ్గా పగ్గాలు చేపట్టేదెవరో ఓటరు తన తీర్పుతో నిర్ణయించనున్నాడు. జిల్లాలోని గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ప్రతిష్టాత్మక గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సామగ్రిని సిబ్బందికి అందజేశారు. మధ్యాహ్నం అనంతరం తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సర్పంచ్ ఫలితం తేలాక, అధికారులు ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలిదశ ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 2,634 మంది అధికారులు, సిబ్బంది పోలింగ్ క్రతువులో పాల్గొననున్నారు. ఏకగ్రీవమైన వార్డులు 361 తొలి విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధం నాలుగు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం సాయంత్రానికి ఫలితాలు.. వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక 91 సర్పంచ్ పదవులకు 321 మంది పోటీ -
ఎన్నికల సిబ్బంది.. సౌకర్యాల్లేక అవస్థలు
గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాల్లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేటీదొడ్డికి మధ్యాహ్నానికి ఎన్నికల సిబ్బంది సామగ్రితో రాగా.. వారికి సరిపడా భోజనం అందకపోవడంతో ఆకలితో ఎదురుచూశారు. అయితే, 800 మంది సిబ్బందికి భోజనాలు చేయగా 1000 మంది వచ్చారని, మరోసారి భోజనం వండి అందించినట్లు ఎంపీడీఓ రమణరావు తెలిపారు. ఇక గట్టు మండలంలో సరిపడా టెంట్లు లేకపోవడంతో సిబ్బంది ఎండలోనే సామగ్రిని సరిచూసుకున్నారు. మహి ళ లు చీర కొంగును తలపై కప్పుకోగా.. మరికొందరు అట్టా పెట్టలను ఎండ నుంచి అడ్డుపెట్టుకోవడం కనిపించింది. – కేటీదొడ్డి/గట్టు -
విద్యా సంస్థలకు సెలవు
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడతల వారీగా ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లో పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే గద్వాల, ధరూరు, గట్టు, కేటీ.దొడ్డి మండలాల్లో పోలింగ్ జరిగే ఈ నెల 11వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో అయిజ, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి, మండలాల్లో పోలింగ్ జరిగే ఈనెల 14న ఆదివారంతో పాటు ముందు రోజు 13వ తేదీన శనివారం సాధారణ సెలవులు ఉంటాయని తెలిపారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగే అలంపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి, ఉండవల్లి మరియు మానవపాడు మండలాల్లో పోలింగ్ రోజు ఈనెల 17వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ముందు రోజు 16వ తేదీన అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని,ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులు గద్వాల: పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయడానికి ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఇందులో ఓటరుకార్డు, ఆధార్, జాతీయ ఉపాధిహామీ జాబ్కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీసు లేదా బ్యాంకు పాస్బుక్కు, కార్మికమంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లెసెన్స్, పాన్కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, బీసీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం, ఇండియన్ పాస్పోర్టు, ఫొటోతో కూడి పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, రేషన్కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లెసెన్స్ పత్రంలో ఏదేని ఒకదానిని చూపి ఓటుహక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరు తప్పకుండా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. మెరుగైన విద్యాబోధన చేయాలి మల్దకల్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మల్దకల్ కస్తూర్బా బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక బద్దంగా బోధన చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వారి వెంట ప్రత్యేకాధికారి విజయలక్ష్మీ, హంపయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓయూ విద్యార్థి నాయకుల అరెస్టు అక్రమం గద్వాల: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య అన్నారు. బుధవారం ఆయన స్థానిక పీజీ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతునొక్కే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరును మార్చుకుని విద్యార్థుల డిమాండ్ను నెరవేర్చాలన్నారు. -
హోరాహోరీ.. ప్రచార భేరి
● రెండు, మూడో విడత పంచాయతీల్లో అభ్యర్థుల విస్తృత ప్రచారం ● గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం అలంపూర్: స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామ ప్రచార హోరుతో అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. మూడు విడతల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఒక విడత పల్లెలు పోలింగ్కు సిద్దం అయ్యాయి. మిగిలిన రెండవ, మూడవ విడతల్లో అభ్యర్థులు ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోనే పనిలో నిమగ్నమయ్యారు. ప్రచార పర్వంలో తమ భవిష్యత్తును చూసుకోని వార్డుల వారిగా ఓట్లను అభ్యర్థిస్తు గెలుపుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గ్రామాల్లోని తమకు అనుకులించే అంశాలతోపాటు కలిసొచ్చే వారితో ప్రచారంలో దూసుకెళ్తూన్నారు. అధికారులు నామినేషన్ల నుంచి మొదలుకొని అభ్యర్థులకు గుర్తులు కేటాయించే వరకు పనులు ముగించారు. ఇక మిగిలింది పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కావడంతో వాటిపై దృష్టిసారిస్తున్నారు. అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగిపోగా అధికార యంత్రం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు. రెండు విడతల్లో అభ్యర్థుల ప్రచార జోరు జిల్లాలోని 13 మండలాల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో గద్వాల, ధరూరు. కేటీదొడ్డి, గట్టు మండలాలు ఉన్నాయి. మొదటి విడతలో నేడు పోలింగ్ నిర్వహించనుండగా.. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అభ్యర్థులకు ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలింది. దీంతో అభ్యర్థులు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారంతో రక్తి కట్టిస్తున్నారు. మూడో విడతలో అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకుగాను అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వచ్చిన గుర్తులతో గత రెండు రోజులుగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. రెండో విడతలో 191 మంది సర్పంచ్ అభ్యర్థులు రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో 191 మంది సర్పంచ్, 965 మంది వార్డుసభ్యులు పోటీపడుతున్నారు. 18 మంది సర్పంచ్ స్థానాలు, 222 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మల్దకల్ మండలానికి వస్తే.. 25 గ్రామ పంచాయతీలు, 242 వార్డులు ఉండగా... 70 మంది సర్పంచ్, 486 మంది వార్డుసభ్యులు పోటీపడనున్నారు. ఇక్కడ 5 సర్పంచ్, 54 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయిజ మండలంలో 28 పంచాయతీలు, 279 వార్డులు ఉండగా.. సర్పంచ్కు 78మంది, వార్డులకు 191 మంది పోటీలో నిలిచారు. ఇక్కడ 7 సర్పంచ్, 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వడ్డేపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు, 94 వార్డులకుగాను సర్పంచ్కు 13, వార్డులకు 66మంది పోటీపడుతున్నారు. ఇక్కడ 5 సర్పంచ్, 66 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రాజోలి మండలంలో 11 గ్రామ పంచాయతీలు, 110 వార్డులు ఉండగా.. సర్పంచ్కు 30మంది, వార్డులకు 222 మంది పోటీపడనున్నారు. ఒక సర్పంచ్, 23 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. -
ఏకగ్రీవమైన పంచాయతీలకు ఎన్నికల సిబ్బంది
గట్టు: సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు కేటాయించిన ఎన్నికల సిబ్బంది ఎంపీడీఓ చెన్నయ్యతో వాగ్వాదానికి దిగారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం దగ్గర ఎన్నికలు నిర్వహించే గ్రామాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించి, మెటీరియల్ను అందజేశారు. అయితే 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ఈ గ్రామాలకు కేటాయించిన సుమారు 120 మంది ఎన్నికల సిబ్బంది కూడా వచ్చారు. వీరికి ఎన్నికల విధులను అప్పగించకపోవడంతో పాటుగా ఎన్నికల భత్యం చెల్లించకపోవడంతో సిబ్బంది అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరికి జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడిన తర్వాత ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించిన ఉద్యోగులకు వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయడం జరుతుందని హామీ ఇవ్వడంతో వారు వెనుతిరిగి వెళ్లారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధికారుల్లో కొంత మందికి భోజనం లభించకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
‘విజయ్ దివస్’ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి
గద్వాలటౌన్/అలంపూర్ : ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అన్న నినాదంతో ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్షతో తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో చరిత్రాత్మక విజయంగా నిలిచిన డిసెంబర్ 9వ చరిత్రలో నిలిచిపోయిందని.. ప్రజల ఆకాంక్ష సాకారానికి తొలి అడుగు అదేనని ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నాయకులు హనుమంతు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం గద్వాల, అలంపూర్లో బీఆర్ఎస్ నాయకులు విజయ్ దివస్ చేపట్టారు. ముందుగా అలంపూర్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలతో అభిషేకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. రాష్ట్ర సాధనే ధ్యైయంగా 11 రోజులు అమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజుగా కొనియాడారు. కేసీఆర్ కఠోర దీక్షతో కదిలిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేస్తు రాష్ట్ర సాధనకు ప్రకటన చేసిందని గుర్తు చేశారు. అందుకే ఈ రోజు రాష్ట్ర సాధనలో చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కిషోర్, రఘు రెడ్డి, దేవన్న, భాస్కర్ రెడ్డి, లోకారెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు హనుమంతు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళాలర్పించారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ త్యాగం చిరస్మరణీయమన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. అబద్దాలు, మాయమాటలు చెప్పి రేవంత్రెడ్డి గద్దెనెక్కిండని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కొండంత రాగం తీసిన సీఎం.. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన 24 శాతం బీసీ రిజర్వేషన్లను ఊడగొట్టారని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర్రెడ్డి, యూసుఫ్, మోనేష్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేష్నాయుడు, మధు, జనార్థన్రెడ్డి, రాజు, పల్లయ్య, ప్రేమలత, శ్రీరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ఇన్చార్జి విద్యుత్ ఏఈ
వెల్దండ: ఇంటికి విద్యుత్ మీటరు బిగించడానికి లంచం తీసుకుంటూ విద్యుత్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మహబూబ్నగర్ ఇన్చార్జి డీఎస్పీ జగదీష్చందర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.60 వేలు డీడీ చెల్లించారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్ బిగించగా.. అక్కడ నిర్మించిన ఓ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించాలని బాధితుడు ఇన్చార్జి ఏఈ వెంకటేశ్వర్లుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మీటర్ బిగించడానికి ఏఈ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న బాధితుడు ఆన్లైన్లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళవారం వ్యవసాయ పొలంలోని ఇంటి వద్ద బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా విద్యుత్ ఏఈను పట్టుకున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం ఏఈని వెల్దండ విద్యుత్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇదే సమయంలో జడ్చర్లలోని విద్యుత్ ఏఈ ఇంట్లో మరో బృందం తనిఖీలు చేపట్టింది. విద్యుత్ ఏఈని బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరస్తామని వివరించారు. దాడుల్లో మహబూబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జడ్చర్లలో సోదాలు జడ్చర్ల: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఏఈ వెంకటేశ్వర్లు అద్దె ఇంటిలో సైతం ఏసీబీ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలు ఫైళ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ● ఇంటి మీటరు బిగించడానికి రూ.20 వేల లంచం డిమాండ్ ● రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం -
మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు కేటాయించే మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల పరిశీలకులు గంగాధర్తో కలిసి మొదటి విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గద్వాల, ధరూరు, గట్టు, కేటి.దొడ్డి మండలాల్లో మొత్తం 974 పోలింగ్ సేషన్లు ర్యాండమైజేషన్లో భాగమైయ్యాయని, వీటికి సంబంధించిన 1,50,672 మంది ఓటర్ల డాటాను సమగ్రంగా పరిగణలోకి తీసుకున్నామన్నారు. మొదటి విడతలో మొత్తం 974పోలింగ్ కేంద్రాల్లో 135 కేంద్రాలు ఏకగ్రీవ గ్రామాలకు చెందినందున మిగతా పోలింగ్ స్టేషన్లకు కావాల్సిన సిబ్బంది టీంల కేటాయింపు పూర్తి చేయబడిదని తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఇద్దరు సభ్యులతో కూడిన 601టీములు, ముగ్గురు సభ్యులతో కూడిన 238 టీములు మొత్తం 839పోలింగ్ టీములు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతిమండలంలోని పోలింగ్ సేష్టన్ల సంఖ్య, గ్రామపంచాయతీల సంఖ్య, ఓటర్ల వివరాలు, అవసమైన పోలింగ్ సిబ్బంది వంటి అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా పోలింగ్ టీములను కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పూర్తిగా పారద్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈసమావేశంలో జెడ్పీ సీఈవో నాగేంద్రం, డీపీవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రలోభాల పర్వం
ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం ● గ్రామాల్లో జోరుగా మద్యం, డబ్బుల పంపిణీ ● ఒక్కో వార్డుకు రూ.లక్ష, కుల సంఘాలకు రూ.2 లక్షలు ● చిన్న పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు ● రేపే ఉమ్మడి జిల్లాలోని 550 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గురువారమే తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. యథేచ్ఛగా మద్యంతోపాటు డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిన్న గ్రామాల్లోనూ భారీగానే.. తొలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు దిగుతున్నారు. వెయ్యిలోపు ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గ్రామాల్లోని వార్డుల వారీగా లెక్కలు వేసి కేటాయింపులు చేస్తున్నారు. ఒక్కో వార్డుకు రూ.లక్ష, ఒక్కో కుల సంఘానికి రూ.2 లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. కుల సంఘాల పెద్దల వద్ద రూ.2–3 లక్షల వరకు ఉంచుతూ గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. మహిళా సంఘాల సమస్యలపై హామీలు గుప్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళల ఓట్లు పొందేందుకు మహిళా సంఘాలకు రూ.లక్షల్లో ముట్టజెప్పుతూ ప్రలోభాలను సాగిస్తున్నారు. ‘నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేవలం 1,200 లోపు ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.15 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ రోజునే ఒకరు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయగా.. నిత్యం ప్రచారంలో భాగంగా ఇప్పటికే రూ.8 లక్షలు దాటింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం కూడా ముగియడంతో అభ్యర్థులు నేరుగా మద్యం, డబ్బులతో ప్రలోభాలకు దిగుతున్నారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఇక్కడ సర్పంచ్ స్థానం కోసం అభ్యర్థులు రూ.30 లక్షల దాక ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకో మందు సీసాతో పాటు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాక ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.’ మద్యం ప్రవాహం.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఓటర్లకు మద్యం పంపిణీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు మూసివేయగా.. అంతకు ముందే అభ్యర్థులు భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఓటరుకో క్వార్టర్ చొప్పున పంపిణీ చేస్తుండగా.. కొన్నిచోట్ల మద్యంతోపాటు డబ్బుల పంపిణీ సైతం కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో పోటీని బట్టి ఓటరుకు క్వార్టర్తోపాటు రూ.వెయ్యి వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
తొలి పరీక్ష..!
డీసీసీ చీఫ్లకు ‘పంచాయతీ’ సవాల్ ● మెజార్టీ జీపీల్లో గెలుపే మొదటి టాస్క్ ● నేతల మధ్య సమన్వయమే ప్రధాన సమస్య ● పలు నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా అసంతృప్త నేతలు ● పట్టించుకోని అధిష్టానం తీరుతో అలక ● అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ సత్తా చాటుతామంటున్న నూతన అధ్యక్షుల ధీమా సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నూతనంగా ఎన్నికై న అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పంచాయతీ పోరు సవాల్ విసురుతోంది. డీసీసీ చీఫ్లుగా నియామకమైన వెంటనే ఎన్నికలకు తెరలేవడం.. వారి సత్తాకు పరీక్షగా మారింది. మెజార్టీ పంచాయతీల్లో గెలుపే వారి తొలి టాస్క్ కాగా.. క్షేత్రస్థాయిలో సంగ్రామం బాట పట్టారు. పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో గ్రూప్లు.. అంటీముట్టనట్లుగా ఉన్న నేతలతో వారికి సమన్వయం కత్తిమీద సాములా మారినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత భర్త తిరుపతయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజీవ్రెడ్డి, నల్లారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి ఆశించారు. అధిష్టానం రాజీవ్రెడ్డికి అవకాశం కల్పించింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పలు గ్రామాల్లో పార్టీ మద్దతుదారులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గద్వాల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇదివరకే డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపాటుకి గురైన సరిత వర్గం.. తాజాగా ఎమ్మెల్యేతో కలిసి రాజీవ్రెడ్డి ప్రచారంలో పాల్గొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ జిల్లాలో పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు అటు సరిత, ఇటు బండ్ల వర్గానికి చెందిన మద్దతుదారుల మధ్యే పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాజీవ్రెడ్డి.. ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేయడంపై సరిత వర్గం గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నాగర్కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తన సొంత నియోజకవర్గం అచ్చంపేటకే పరిమితమయ్యారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు హీటెక్కింది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఏకమై మెజార్టీ గ్రామాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు సంబంధించిన వర్గాలు సైతం పోరులో నిలిచాయి. ప్రధానంగా వనపర్తి, గద్వాలలో చేతులు కలవని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడడం ఒకవైపు కాగా.. భర్తీ తరువాత అధిష్టానం కనీసం సంప్రదింపులు చేయకపోవడం, బుజ్జగించకపోవడం అసంతృప్త నేతలను మరింత నారాజ్లోకి నెట్టినట్లు సమాచారం. సమన్వయంతో ముందుకు.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికే మొదటి విడత గద్వాల నియోజకవర్గంలో గట్టు, కేటీ దొడ్డి, ధరూర్ మండలాల్లో పర్యటించాను. అన్ని చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. గెలుపు ఖాయం. నాకు ఏ వర్గం లేదు. పార్టీలో అందరూ ఒక్కటే. సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. – రాజీవ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, జోగుళాంబ గద్వాలమహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన సంజీవ్ ముదిరాజ్ పంచాయితీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నుంచి డీసీసీ పీఠాన్ని అధిరోహించాలని ఆశలతో ఉన్న వారిని సైతం కలుసుకొని సహకరించాలని కోరారు. ఆ వెంటనే జీపీ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలో రెండు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన శివసేనారెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోనే పంచాయతీ ఎన్నికల తంతు కొనసాగుతుందని చెప్పారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పునర్నియామకమైన కె.ప్రశాంత్రెడ్డి కూడా జీపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. పేటలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి.. మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి అన్నీ తామై మద్దతుదారుల గెలుపునకు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ రెబల్స్ని పోటీ నుంచి విరమింపజేసేలా ప్రశాంత్ చర్యలు చేపట్టారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
గద్వాల క్రైం: తొలి విడత సర్పంచ్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహిస్తామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లోని ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసు బలగాలతో పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ఎప్పటికప్పుడు నివేదికలు, రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్, స్ట్రయికింగ్ ఫోర్సు, ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపామన్నారు. 106 గ్రామ పంచాయతీలో 14 ఏకగ్రీవం కాగా 92 గ్రామ పంచాయతీల్లో 35 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. గత ఎన్నికల్లో ఏఏ పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయో అక్కడ ప్రస్తుతం అదనపు బలగాలను ఏర్పాటు చేశామని, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమా వేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవి, నాగేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. -
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
మానవపాడు: మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యసిబ్బంది పనిచేయాలని డీఎంహెచ్ఓ డా.సంధ్యా కిరణ్మయి సూచించారు. సోమవారం మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో డీఎంహెచ్ఓ సమావేశమై మాట్లాడారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ప్రతినెలా పరీక్షలు చేయడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారికి విధిగా ఎన్సీడీ పరీక్షలు చేయాలన్నారు. టీబీ, లెప్రసీ, పాలియేటివ్ కేర్ పేషంట్ల జాబితాను జిల్లా ఆస్పత్రికి పంపించాలని తెలిపారు. పీహెచ్సీ పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం నిర్వహించాలని ఆదేశించా రు. సమావేశంలో డా.శారణ్య, జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సూపర్వైజర్లు హెలెన్, అక్కమ్మ, చంద్రన్న, శేఖర్ ఉన్నారు. 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవు గద్వాల: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో ఈ నెల 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,270 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 311 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 7,270, కనిష్టంగా రూ. 4,616, సరాసరి రూ. 5,270 ధరలు లభించాయి. అదే విధంగా 18 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,880, కనిష్టంగా రూ. 5,520, సరాసరి రూ. 5880 ధరలు వచ్చాయి. 1,023 క్వింటాళ్ల వరి (సోన) విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 2,559, కనిష్టంగా రూ. 1,719, సరాసరి ధరలు రూ. 2,489 ధరలు లభించాయి. వందశాతం ఉత్తీర్ణత సాధించాలి గద్వాలన్యూటౌన్: పదో తరగతి చదువుతున్న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి నుషిత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలతో పాటు టాయి లెట్లు, వంట గది, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్, సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతినెలా మెడికల్ క్యాంప్ నిర్వహించి.. విద్యార్థినులకు అవసరమైన మందులు అందించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి విధిగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటుచేసి.. హాస్టల్లో కల్పిస్తున్న వసతులు, విద్యార్థినుల చదువు పరిస్థితిని తెలియజేయాలని సూ చించారు. విద్యార్థినులు మధ్యలోనే చదువు మానుకొని, స్వగ్రామాలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత వసతిగృహ అధికారులదేనని చెప్పారు. అనంతరం పదో తరగతి విద్యార్థినులతో ఆమె సమావేశమై అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ట్యూటర్లు బోధిస్తున్న విధానం, విద్యార్థినుల ప్రగతిపై ఆరా తీశారు. కార్యక్రమంలో వార్డెన్ సుజాత పాల్గొన్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ వేడుక జరిపారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తన్మయం చెందారు. అదే విధంగా శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
గద్వాల క్రైం: పెండింగ్ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో ముందుకెళ్లాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి ఎన్.ప్రేమలత అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. జిల్లాలో పెండింగ్ కేసులు, రాజీ అయ్యే కేసుల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెల 21న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక్అదాలత్లో రాజీ కాదగిన కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సివిల్, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాదాలు, బ్యాంకు రుణాలు, చెక్బౌన్స్ తదితర కేసుల వివరాలను తెలుసుకున్నారు. సమావేశంలో న్యాయమూర్తులు లక్ష్మి, ఎన్వీహెచ్ పూజిత, ఉదయ్నాయక్, ఏఎస్పీ శంకర్ ఉన్నారు. -
ఆరుతడికే సాగునీరు
యాసంగి పంటలకు సాగునీటి ప్రణాళిక ఖరారు ● వారాబందీ పద్ధతిలో విడుదలకు నిర్ణయం ● కనీసం 15 రోజులకు ఒకసారి వదిలేలా చర్యలు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కేఎల్ఐ కింద 2.81 లక్షల ఎకరాలకు.. ● ఆర్డీఎస్ పరిధిలో పంట విరామం ప్రకటన ●చివరి వరకు అందించాలి.. యాసంగి సీజన్లోనూ వరిపంట పండించేందుకు వీలుగా నీటి సరఫరా చేయాలి. కేవలం మొక్కజొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలకే నీరందిస్తే మేం తీవ్రంగా నష్టపోతాం. కాల్వల వెంట నీరు వృథా కాకుండా మరమ్మతు చేపట్టాలి. చివరి దశలో పంటలు ఎండిపోకుండా ప్రణాళిక ప్రకారం నీటిని సరఫరా చేయాలి. – ఆలేటి మారయ్య, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం రిజర్వాయర్లు నింపుతాం.. కేఎల్ఐ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం సాగునీరు సరఫరా చేస్తాం. ఇందుకోసం ముందుగా జిల్లాలోని ప్రధానమైన సాగునీటి రిజర్వాయర్లను నింపుతాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తూ యాసంగి పంటలకు నీటి సరఫరా చేపడతాం. – శ్రీనివాస్రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈసారి యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా చేపట్టనుండగా.. కనీసం 15 రోజులకు ఒకసారి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అత్యధికంగా 2,81,754 ఎకరాలకు ప్రస్తుత సీజన్లో సాగునీటిని అందించనున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెండింగ్ పనుల కారణంగా ఈసారి ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించారు. అత్యధికంగా కేఎల్ఐ.. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 3,70,469 ఎకరాలు ఉండగా.. యాసంగి సీజన్లో 2,81,754 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,01,317 ఎకరాల మేర ఆరుతడి పంటలతోపాటు మరో 80,437 ఎకరాలకు వరి సాగుకు నీటిని అందిస్తారు. అలాగే కోయిల్సాగర్ కింద 35,600 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆరుతడి పంటలకు 7,700 ఎకరాలకే పరిమితం చేశారు. భీమా లిఫ్ట్–1 కింద 82,523 ఎకరాలు ఉండగా కేవలం ఆరుతడికి 21,690 ఎకరాల్లో నీరందిస్తారు. భీమా లిఫ్ట్–2 సైతం 92 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 5,350 ఎకరాల్లో ఆరుతడి, 4,650 ఎకరాల్లో వరి పంటకు నీరందించనున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 1,09,296 ఎకరాలకు గాను ఆరుతడి కింద 20,014 ఎకరాలకు, వరి 6,910 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు గాను ఆరుతడికి 22,800 ఎకరాల మేరకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు రైతులు పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు. ప్రాజెక్టు మొత్తం ప్రతిపాదిత ఆరుతడి వరి ఆయకట్టు ఆయకట్టు పంటలు కేఎల్ఐ 3,70,469 2,81,754 2,01,317 80,437 కోయిల్సాగర్ 35,600 7,700 7,700 – భీమా లిఫ్ట్–1 82,523 21,690 21,690 – భీమా లిఫ్ట్–2 92,000 10,000 5,350 4,650 జూరాల 1,09,296 26,924 20,014 6,910 నెట్టెంపాడు 1,42,000 22,800 22,800 – ఆర్డీఎస్ 83,998 – – – ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి ప్రణాళిక వివరాలు (ఎకరాల్లో) -
నిర్భయంగా ఓటేయండి
ఏకగ్రీవం పేరుతో పదవులను అమ్మొద్దు ● ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు ● జిల్లాలో 102 సమస్యాత్మక గ్రామాలు ● 600 మంది పోలీసులతో బందోబస్తు ● మద్యం, నగదు, సామగ్రి పంపిణీపై నిఘా ● ‘సాక్షి’తో ఎస్పీ టి.శ్రీనివాసరావు గద్వాల క్రైం: ‘‘జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేశాం. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మూడు విడతలుగా నిర్వహించే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లాలో 600 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాం. అల్లర్లు సృష్టించే వారిని గుర్తించి బైండోవర్ చేస్తున్నాం. మద్యం, నగదు, వస్తుసామగ్రితో ఓటర్లను మభ్యపెడితే కేసులు నమోదు చేస్తాం.’’ అని ఎస్పీ టి.శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పీ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. ● పంచాయతీ ఎన్నికలు గ్రామ స్వరాజ్యం కోసం జరుగుతున్నాయి. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకున్నప్పుడే గ్రామాలకు పూర్తి స్వీయపాలన, స్వావలంబన సాధ్యమవుతుంది. సర్పంచ్ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఓటర్లకు బహుమతులు, నగదు, మద్యం ఇచ్చినా.. ఓటర్లు స్వీకరిస్తూ పట్టుబడినా కేసులు నమోదు చేస్తాం. ఏకగ్రీవాల వేలంపై విచారణ.. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదువులను ఏకగ్రీవం పేరుతో అమ్మొద్దు. జిల్లాలో పలు జీపీల ఏకగ్రీవానికి వేలం నిర్వహించినట్లు తెలిసింది. వాటిపై మూడు కమిటీలను నియమించి.. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టాం. జీపీల ఏకగ్రీవం కోసం వేలం నిర్వహించినట్లు నిజమని తేలితే.. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాలను రద్దుచేసే అవకాశం ఉంటుంది. మొదటి విడతలో 40, రెండో విడతలో 34, మూడో విడతలో 28 జీపీల్లో 102 సమస్యాత్మక గ్రామాలు, 1,048 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. జిల్లాలోని ర్యాలంపాడు, పుల్లూరు, నందిన్నె, బల్గెర వద్ద చెక్పోస్టులను ఏర్పాటుచేసి.. నిత్యం తనిఖీలు చేపడుతున్నాం. ఎన్నికల కోడ్ ప్రకారం సమావేశాలు, ర్యాలీలు, మైక్ పెట్టి ప్రచారం చేసేందుకు తప్పనిసరిగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పోలీస్స్టేషన్ నుంచి రెవెన్యూ అధికారులు రిమార్క్స్ తీసుకొని అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా ఒత్తిడి చేసినా, ఇబ్బందులకు గురిచేసినా, అక్రమాలు, నేరాలకు పాల్పడినా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరాలి తప్ప.. ఇతరులను వక్రీకరించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో ఇతరుల మనోభావాలు దెబ్బతీసే పోస్టులపై నిఘా ఉంచాం. వాటిని ఫార్వర్డు చేసినా తగు చర్యలు ఉంటాయి. ఎన్నికల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు తదితర సిబ్బందితో వివిధ అంశాలపై ఇప్పటికే సమావేశం నిర్వహించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ పెట్టాం. శాంతియత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పక్కా ప్రణాళికలు రూపొందించాం. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు తెలిస్తే ప్రజలు పోలీసుశాఖకు సమాచారం అందించాలి. ముందస్తు బైండోవర్.. గత ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించిన వారితో పాటు పాత నేరస్తులు, ఎన్డీపీఎస్ కేసులు ఉన్న 287 మందిని గుర్తించి బైండోవర్ చేశాం. మద్యం తరలిస్తున్న వారిపై 73 కేసులు నమోదుచేసి.. రూ. 6.64లక్షల విలువైన మద్యం (906.265 లీటర్లు) సీజ్ చేశాం. జిల్లాలో గన్ లైసెన్స్ పొందిన వారి నుంచి గన్స్ డిపాజిట్ చేసుకున్నాం. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామాల్లో మందు పార్టీలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నాం. -
మిగిలింది.. రెండు రోజులే
● నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం ● అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ గద్వాల: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ధరూరు, గద్వాల, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో 106 సర్పంచ్, 974 వార్డు స్థానాలకు గాను 14 సర్పంచ్, 120 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ఎన్నికల ప్రచారానికి కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో తొలి విడత గ్రామాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. 48 గంటల ముందుగానే.. ఎన్నికలకు 48 గంటల ముందుగానే అభ్యర్థుల ఎన్నికల ప్రచార మైక్లు మూగబోనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారానికి బ్రేక్ పడనుంది. అయితే ఇప్పటికే గ్రామాల్లో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి ఈ ప్రలోభపర్వం మరింత ఊపందుకోనుంది. గెలుపే లక్ష్యంగా హామీలు.. గ్రామాల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు కుల, మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో గెలుపు కోసం భారీస్థాయిలో హామీలు గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు వ్యక్తిగత పనులపై సైతం హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా ఓటర్ల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. మద్యం దుకాణాలు బంద్.. తొలి విడత ఎన్నికల నేపథ్యంలో 48 గంటల ముందుగానే వైన్షాపులు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి వైన్షాపులను మూసివేయనున్నారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడి పూర్తయ్యే వరకు వైన్షాపులను మూసివేసి ఉంచనున్నారు. వైన్షాపుల మూసివేత నేపథ్యంలో పలు గ్రామాల అభ్యర్థులు ఇప్పటికే భారీ స్థాయిలో మద్యాన్ని కొనుగోలు చేసి డంపులుగా నిల్వ చేసుకుంటున్నారు. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ
గద్వాల: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది తమ సొంత మండలాల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ధరూరు, కేటీదొడ్డి మండలాల్లో పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే వివరాలను తెలుసుకున్నారు. హెల్ప్డెస్క్ వద్ద సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకొని వినియోగించుకోని వారి వివరాలతో పాటు ఎంతమంది వినియోగించుకున్నారనే వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామపంచాయతీల ఓటరు జాబితాలో పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు వచ్చిన వారి వివరాలు సరిచూసుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేయాలన్నారు. ఎలక్ట్రోరల్ తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం కేటీదొడ్డి మండల కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎన్నికల పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓలు కృష్ణమోహన్, రమణారావు, తహసీల్దార్లు నరేందర్, హరికృష్ణ పాల్గొన్నారు. -
హక్కును కోల్పోతారు..
ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అసలు ఏకగ్రీవమే కరెక్ట్ కాదు. దీంతో మిగతా వాళ్లు పోటీ చేసే హక్కును కోల్పోతారు. గ్రామాల్లో పెత్తందారులే ఏకగ్రీవాల పేరిట కుట్రలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సైతం పదవులకు వేలం అంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించి.. ఇవ్వకపోవడం కూడా వేలం పాటల సంస్కృతి పెరిగేందుకు కారణమైంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం.. అత్యంత ప్రమాదకరం. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్● -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ..
గ్రామాల్లో డబ్బున్నోళ్లు, పెత్తందారులు కలిసి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం ఆలయాల నిర్మాణం ఇతరత్రా అంటూ రూ.30–50 లక్షలు ఇచ్చిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రధానంగా సీడ్ మాఫియా, సీడ్ ఆర్గనైజర్లు పదవుల పందేరానికి పాల్పడుతున్నారు. సామాన్యులు, చదువుకున్న యువత ఆశావహులు డబ్బులు పెట్టలేక మిన్నంకుంటున్నారు. జిల్లాలో తొలి దశలో 15 గ్రామాల వరకు సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించారు. – గొంగళ్ల రంజిత్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు ● -
భక్తులతో కిటకిటలాడిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాలు, జాతర నేపథ్యంలో అర్చకులు ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉమ్మడి పాలమూరు నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అలాగే, జాతర మైదానం భక్తులతో సందడిగా మారింది. గృహోపకరణాలు, గాజులు, మిఠాయి దుకాణాలు, ఆట వస్తువులు, రంగుల రాట్నాల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, దీరేంద్ర దాసు , రాఘవేంద్ర దాసు తదితరులు పాల్గొన్నారు. ‘ప్రభావిత ఉద్యమశక్తి జయరాజ్’ వనపర్తిటౌన్: సమాజాన్ని ప్రభావితం చేసిన శక్తి ప్రముఖ కవి, ఉద్యమ గాయకుడు జయరాజ్దే అని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్ కొనియాడారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, రాష్ట్ర కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత జయరాజ్ను సాహితి కళావేదిక ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. కవిగా, గాయకుడిగా తన పంతా మార్చుకోకుండా ముందుకు సాగి తెలంగాణలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. సమాజాన్ని జాగృతం చేసే ఎన్నో పాటలు రచించి ఉద్యమ నిర్మాణంలో తన భక్తిని చాటారని కొనియాడారు. నిరంతరం పేద, బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు. జయరాజ్ సాహిత్యం ఎంతోమంది వర్ధమాన కవులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జయరాజ్ తను రచించిన పలు పుస్తకాలను పలువురు సాహితీవేత్తలకు అందజేశారు. కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, నరేష్కుమార్, శ్యాంసుందర్, ఉప్పరి తిరుమల్లేశ్, రచయితలు డా. వీరయ్య, పపద్మావతి, డా. కంటే నిరంజనయ్య, మధుకర్, కిరణ్కుమార్, దర్శన్కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ‘ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి’ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దుచేయాలని టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతోపాటు పీఆర్సీ అమలుతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం సంఘం జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా తాహెర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హమీద్అలీ, కార్యదర్శి మహమ్మద్ రహమతుల్లా, జిల్లా అధ్యక్షుడు సతీష్కుమార్, నాయకులు షేక్ఫరీద్, శశిధర్, మల్లికార్జున్, మోహన్, శరణప్ప, మురళి, శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు. ఉచిత శిక్షణ ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఉచిత సైకాలజీ శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ మేరకు నారాయణపేట డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ టెట్ అర్హత పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తరగతులను ఉచితంగా బోధించేందుకు అధ్యాపకుడు జనార్దన్రెడ్డి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మొత్తం 70కిపైగా అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దులు అప్రమత్తమేనా..?
● ఎన్నికల వేళ మద్యం బార్డర్లు దాటే అవకాశం ● అక్రమ మద్యానికి దారులు వెతుకుతున్న దందారాయుళ్లు ● ఇప్పటికే చెక్పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు ఏపీ మద్యం..? ప్రస్తుతం ఏపీలో కొన్ని రకాల మద్యం బాటిళ్లు తక్కువ ధరకే వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అక్కడి ప్రభుత్వం తక్కువ ధరకే చీప్ లిక్కర్ను అందుబాటులో ఉంచింది. కాని దాన్ని ఏపీలో మద్యం ప్రియులు కూడా తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి లిక్కర్ వ్యాపారులు, జిల్లాలోని కొందరితో కుమ్మకై ్క నది మార్గం ద్వారా ఆ మద్యాన్ని జిల్లాలోకి పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రూ.110 కే చీప్ లిక్కర్ క్వాటర్ను ఇస్తుండగా, అందులో పలు రకాల బ్రాండ్లను అక్కడి ప్రభుత్వం మద్యం ప్రియులపైకి నెట్టింది. దాన్నే పేరు మార్చి కాని, బాటిళ్లను మార్చికాని జిల్లాలోకి పంపే అవకాశాలు ఉన్నాయని, తుంగభద్ర నది అవతల ఉన్న కర్నూల్ జిల్లాని ఆయా గ్రామాల నుంచి నది ఇవతలి వైపున ఉన్న జిల్లాలోకి రాకుండా మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కఠిన చర్యలు ఇప్పటికే చెక్పోస్టు ఏర్పాటు చేశాం. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో విధిగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. పక్కా సమాచారం ఇచ్చే వాళ్లతో టచ్లో ఉంటున్నాం. చెక్పోస్ట్ సిబ్బందితో పాటు, గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నజర్ పెట్టాం. చిన్న అనుమానం వచ్చినా వదిలేది లేదు. అక్రమ మద్యం రవాణా చేసేవారిపై, గతంలో దందా చేసిన వారి కదలికలపై నిఘా ఉంచాం. దందాలు చేస్తే జైలు శిక్ష తప్పదు. – టాటాబాబు, సీఐరాజోళి: ఎన్నికల వేళ అక్రమ దందా రాయుళ్లు వారి వ్యాపారం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నారు. గ్రామ పంచాయతీలు ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. కాగా ఓటర్ల నుంచి ఓట్లు రాబట్టుకునేందుకు కొన్ని చోట్ల ప్రలోభాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. అందులో ప్రధానంగా మద్యం పంపిణీ ఎక్కువగా జరిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో గ్రామాల్లో ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు. అయినప్పటికీ, పోటీలో నిలిచేవారు, అక్రమ మద్యం తెచ్చే వారితో కలిసి గ్రామాల్లో మద్యం సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి నదీ పరివాహక గ్రామాల్లో దందాకు ముమ్మరంగా ప్రణాళికలు చేస్తున్నారని తెలుస్తుంది. జిల్లాలో ఉన్న మద్యంతో పాటుగా తక్కువ ధరకు లభించే మధ్య, చిన్న సైజు పాకెట్లలో లభించే మద్యంపై ఫోకస్ పెట్టారు. దీని కోసం కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు తదితర పట్టణాల నుంచి కొన్ని రకాల మందు బాటిళ్లు తెచ్చే అవకాశాలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా అక్కడి నుంచి మద్యం పెద్ద ఎత్తున రవాణా జరిగింది. ఇదే తరహాలో మళ్లీ మద్యం రవాణా చేసేందుకు ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. నదీ తీర గ్రామాల్లో... కర్ణాటక నుంచి మద్యం తీసుకురావడానికి కట్టుదిట్టమైన పోలీస్ చెక్పోస్టులు ఉన్నప్పటికీ, ఆర్డీఎస్ కెనాల్ మీదుగా, ఇతర అడ్డదారుల్లో మద్యం తీసుకువచ్చేందుకు మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం. గతంలో మాదిరిగానే కర్ణాటకలో కొన్ని ప్రత్యేక టెట్రా పాకెట్లల్లో లభించే మద్యం, 90 ఎంఎల్ ప్యాకెట్లు, గోవా నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చే మద్యాన్ని గ్రామాల్లోకి తరలించేందుకు రాజోళి మండలంలోని తుమ్మిళ్ల, ముండ్లదిన్నె గ్రామాలకు చెందిన వ్యక్తులు, అయిజ, రాయచూరు, గట్టు మండలంలోని పలువురితోపాటు ఏపీలోకి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల వారితో ఒప్పందాలు చేసుకున్నారని సమాచారం. కాగా రాజోళి పోలీస్స్టేషన్ పరిదిలోని సుంకేసుల డ్యాం వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యంతో పాటు, ఎన్నికల సందర్భంగా డబ్బు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వాటి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో ఏపీ వ్యక్తులు అక్రమ మద్యాన్ని తెలంగాణలోకి తెచ్చే అవకాశం లేదు, కాని నదీ తీర గ్రామాల్లో పుట్టీల ద్వారా అక్రమ మద్యం వ్యాపారం యథేచ్ఛగా నడిచిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో కర్ణాటక నుంచి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లోకి మద్యం చేర్చుకుని, అక్కడి నుండి నది ఇవతలి వైపున ఉన్న జిల్లాలోని పలు గ్రామాలకు మద్యం చేరవేసేందుకు అవకాశాలున్నాయని ఆయా గ్రామాల్లోని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల పుణ్యమా అని కల్లీ మద్యం తెచ్చి ప్రజలకు ఇస్తే దాని వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటని అంటున్నారు. -
దారి తప్పిన సంగ్రామం..!
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తిప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వీధికి వెళ్లేందుకు వేసిన మట్టి రోడ్డు ఇది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో 2019లో ఊరంతా ఏకమై ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ నిధులు వస్తే గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని ఆశించారు. నజరానా రాకపోవడంతో సాధారణంగా వచ్చే నిధులతో తూతూమంత్రంగా పనులు చేపట్టారు. ఇప్పటికీ పలు వీధుల్లో సీసీరోడ్లు, పంచాయతీకి సొంత భవనం లేదు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన పాత భవనంలోనే కొనసాగుతోంది. ..ఈ ఒక్క గ్రామమే కాకుండా.. ఉమ్మడి పాలమూరులోని అన్ని ఏకగ్రీవ పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పారితోషికం రాక.. నిర్దేశించుకున్న పనులు కాక.. స్థానిక ప్రజల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ట్రెండ్ మారి వేలం పాటల ద్వారా ఏకగ్రీవాలకు క్రేజీ పెరుగుతుండగా.. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయి. యునానిమస్ లక్ష్యం నెరవేరకపోవడం.. దారి తప్పుతున్న సం‘గ్రామం’ తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్ ఉవ్ముడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో గత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 322 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 113, నాగర్కర్నూల్లో 80, జోగుళాంబ గద్వాలలో 48, వనపర్తిలో 45, నారాయణపేట జిల్లాలో తక్కువగా 36 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలన్నింటినీ గ్రామస్తులంతా ఒక్కతాటికి వచ్చి ఏకగ్రీవం చేసుకున్నారు. ఆలయ నిర్మాణాల వంటి ప్రధాన పనులు పూర్తి చేస్తామంటూ పలు జీపీల్లో ముందుకు రాగా.. ఆ అభ్యర్థులకు సర్పంచ్ అవకాశం ఇచ్చారు. కానీ, పెద్దగా వేలం పాటలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆయా ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. ● జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని చింతకుంట గ్రామాన్ని ఏకగ్రీవం చేసేందుకు కొందరు గ్రామపెద్దలు యత్నించారు. రూ.38.50 లక్షలకు ఏకగ్రీవం చేస్తూ.. సదరు అభ్యర్థి మినహా ఎవరూ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని గ్రామానికి చెందిన ఒకరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. విచారణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాఘాయిపల్లి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు పెద్దలు తీర్మానించగా బెడిసి కొట్టింది. రూ.25 లక్షలు ఇస్తానని ఒకరు ముందుకు రాగా.. ఓ అభ్యర్థి వ్యతిరేకించారు. దీంతోపాటు తన నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ.5 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టడమే కాకుండా బెదిరిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. దీనిపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేశారు. మచ్చుకు కొన్ని.. మారిన ట్రెండ్.. డబ్బున్నోళ్లకే చాన్స్? ప్రస్తుత జీపీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ట్రెండ్ మారింది. పలు పంచాయతీల్లో పోటీచేసే ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారులతో గ్రామాల పెద్దలు భేటీ ఏర్పాటు చేసి.. ఎవరు ఎంత ఇస్తారంటూ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి దశలో 550 గ్రామాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 44 జీపీలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మెజార్టీ చోట్ల వేలం పాటల ద్వారానే సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసేలా పెద్దలు చక్రం తిప్పారు. కొన్నిచోట్ల సర్పంచ్ స్థానాల్లో వేలం పాడి పోటీ లేకుండా ఒక్కరితోనే నామినేషన్లు వేయించారు. ఇలా ఒక్కరే నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువగా రియల్టర్లు, బడా వ్యాపారులే ఉండడం గమనార్హం. దాదాపు 88 శాతం మేర.. ఉమ్మడి జిల్లాలో తొలిదశ ఎన్నికల్లో 44 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 39 గ్రామాల వరకు వేలం ద్వారా పదవులకు తీర్మానం చేసి.. ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేసేలా పెద్దలు చక్రం తిప్పినట్లు నిబంధనలు కఠినం.. కొన్ని ప్రాంతాల్లో వేలం పాటల ద్వారా గ్రామాలను ఏకగ్రీవం చేస్తున్నారనే అంశం ఎన్నికల కమిషన్ దృష్టికి రావడంతో నిబంధనలను మరింత కఠినం చేసింది. నిబంధనల ప్రకారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏకగ్రీవమైన జీపీల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రాజకీయ నేతల ప్రోద్బలంతో ఉపసంహరించుకున్న వారు మిన్నకుండిపోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలం ద్వారా పదవులు పొందిన వారిపై చర్యలుంటా యా అనేది ప్రశ్నార్థకమేనని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ‘పెద్దల’ చేతుల్లోకి సమస్త గ్రామవాసుల నిర్ణయాధికారం రియల్, వ్యాపార రంగాలకు చెందిన యువతకే గ్రీన్సిగ్నల్ భారీ మొత్తం చెల్లించలేక ఔత్సాహికుల వెనకడుగు పల్లెపోరు పెడదారి పట్టడంతో పలుచోట్ల ‘పంచాయితీ’ యునానిమస్ లక్ష్యం నెరవేరకపోవడమూ కారణమంటున్న మేధావులు -
గ్రామాల్లో రసవత్తర పోరు
● గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టిన అభ్యర్థులు ● పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ.. ఉనికి చాటేందుకు పార్టీల పాట్లు ● ఊపందుకున్న ప్రచార సందడి గద్వాలటౌన్: పంచాయతీ ఎన్నికలను గద్వాల నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీ రహిత ఎన్నికలైనప్పటికి రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు అనేక పాట్లు పడుతున్నాయి. రాబోయే మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడే సర్పంచులను తమ తమ వాళ్లుగా అనిపించుకోవాలని ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. మరో వైపు సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల పోటాపోటీని దృష్టిలో పెట్టుకుని అర్ధబలం, అంగబలం కోసం పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా పార్టీల నాయకులు కూడా తమదైన ముద్ర వేసేందుకు గ్రామాల్లో పడరాని పాట్లు పడుతున్నారు. ఊపందుకున్న ప్రచారం.. మొదటి, రెండవ విడత ఎన్నికల వేడి రాజుకుంది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారవటంతో ప్రచార పర్వం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.. సర్పంచ్గా గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న ఒక్కో అభ్యర్థి ఒక్కో పంథా అవలంభిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు సామాజిక మాధ్యమాలను విరివిరిగా వినియోగించుకుంటే.. మరి కొందరు ‘ నేను ఇవి చేసి చూపిస్తా’నంటూ బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడవ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అక్కడ కూడా పల్లెపోరు రసవత్తరంగా మారింది. స్థానిక వర్గాలు, సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత పలుకుబడి కీలకంగా మారనున్నాయి. ప్రలోభాల పర్వం కుల సంఘాలు, వార్డు సమూహాలు, పెద్ద కుటుంబాలకు ప్రత్యేక విందులు ఏర్పాటు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందురోజు ఓటుకు కొంత నగదు ఇవ్వటం ద్వారా ఓట్లు కొల్లగొట్టేందుకు నిధులు సమకూర్చుకుంటున్నారు. యువతను ఆకట్టుకునేందుకు రాత్రిపూట మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రుజువైతే జైలు శిక్ష.. అనర్హత వేటు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధం. వేలం వేసిన వారు, వేలం ద్వారా పదవులు పొందిన వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. సింగిల్ నామినేషన్లు దాఖలైన చోట.. ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాం. జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చాకే ఏకగ్రీవంపై ముందుకెళ్తాం. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● -
ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి
కేటీ దొడ్డి: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో సిబ్బంది అత్యంతం బాధ్యతతో తమ విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ బాక్సులు, కవర్లు, సీళ్లపై సూచనలు చేస్తు మెటీరియల్ వినియోగంపై సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని అన్నారు. వారి వెంట ఎంపీడీఓ రమణరావు, జూనియర్ అసిస్టెంట్ గురునాధ్, ఆపరేటర్ ఖయ్యూం, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
అయిజ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యర్తల సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్లకు శాలువాలు, పూలమాలలతో సత్కారం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే నిధులు అడిగేందుకు హక్కు, బాధ్యత ఉండేదని, ఓడిపోయినందుకు నిధులు అడిగేందుకు నైతికమైన అర్హత కోల్పోయానని అన్నారు. నిధులు లేకనో, వనరులు లేకనో గెలిచిన ఎమ్మెల్యేలకే నిధులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినా సరే నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలముందు ఎన్నో హామీలు ఇచ్చిన ఎమ్మెల్సీ చల్లా వెంట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకాపురం రాముడు, షేక్షావలి ఆచారి, జయరాముడు, మద్దిలేటి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పోరుబాట ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం..
సాయి ఈశ్వర్ మృతితోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. పోరు బాట ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం. పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు కూడా సర్పంచ్, వార్డులకు సంబంధించి జనరల్ స్థానాల్లో ఎంత మంది బీసీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో జాబితా వెల్లడించాలి. – రాచాల యుగంధర్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
గద్వాల కోసం ఏం సాధించారో ఎమ్మెల్యే చెప్పాలి
గద్వాలటౌన్: నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, రెండేళ్లలో ప్రత్యేకంగా ఏం అభివృద్ధి సాధించారో ప్రజలకు చెప్పాలని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ నిలదీశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సొంత ప్రయోజనాలు, రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పార్టీ మారారని ధ్వజమెత్తారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. రేవులపల్లి వద్ద వెంటనే ప్రాజెక్టు సేప్టీ బ్రిడ్జి కట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, సంక్షేమ పథకాలతోనే రాష్ట్రంలో, జిల్లాలో అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేంద్రం సాయంతోనే 75 శాతం గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సీఎం, ఇద్దరు మంత్రులున్నా వారు పదవులు నిలుపుకొనేందుకు, గ్రూపు రాజకీయాలను కట్టడి చేయడానికి తప్ప జిల్లా అభివృద్ధికి ఇచ్చిన నిధులు శూన్యమని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని, కేవలం 20 శాతం మాత్రమే కల్పించి మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్కు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను నిండా మోసం చేశారని విమర్శించారు. రెండేళ్లలో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకొంటున్నారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులతో పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకుండా అప్పులపాలు చేసిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో బీజేపీ మద్దతుదారులను గెలిపిస్తే.. ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఇన్చార్జి బాబురెడ్డి, నాయకులు రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, శ్యామ్రావు, రాజగోపాల్, శివారెడ్డి, జయశ్రీ, సమత తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
గద్వాల న్యూటౌన్: జోనల్ అధికారులు ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేష్బాబు, డీపీఓ శ్రీకాంత్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఐడీఓసీ హాల్లో మూడు విడతల్లో విధులు నిర్వర్తించే జోనల్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణకు ఒకరోజు ముందుగానే పోలింగ్ సామగ్రి అందించే ప్రిసైడింగ్ అధికారులకు జోనల్ అధికారులు సహకరించాలని సూచించారు. ఆయా పంచాయతీల్లో 87 మంది జోనల్ అధికారులకు రూట్ల ప్రకారం బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా సమస్యలు వచ్చినా, సామగ్రి కొరత ఏర్పడినా వెంటనే అక్కడి సిబ్బందికి సహకారం అందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయి పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కేంద్రంలో అప్పగించేంతవరకు ఆయా రూట్లవారీగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం చేయాలని సూచించారు. -
మళ్లీ.. బీసీ లొల్లి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్పై మళ్లీ లొల్లి మొదలైంది. హైదరాబాద్లో సాయి ఈశ్వరాచారి మృతితో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయా సంఘాలకు చెందిన పలువురు నేతలు ఆయనది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే అని ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వగా.. వేడి రాజుకుంది. పంచాయతీ పోరు మొదటి విడతలో ప్రచారం హోరెత్తుతుండగా.. రెండో దశకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తి కాగా.. నేటి నుంచి ప్రచారం మొదలు కానుంది. చివరి దఫాకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇలా పంచాయతీ సంగ్రామం కీలక ఘట్టానికి చేరుకున్న క్రమంలో మళ్లీ బీసీ లొల్లి రాజుకోవడం రాజకీయ పార్టీలను కలవరానికి గురి స్తోంది. 42 శాతం ఏమైంది.. స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లగా.. హైకోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. నోటిఫికేషన్ వెలువడే రోజు రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటొద్దనే సుప్రీంకోర్టు సూచనలతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో బీసీ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రం చేసే దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని.. ప్రస్తుతం చట్టపరంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ మేరకు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మూడు దశల పల్లె పోరు కీలక ఘట్టానికి చేరుకోగా.. బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపు ఎంతవరకు వచ్చిందంటూ బీసీ సంఘాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సంఘటితంగా పోరు బాట.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ సంఘాలు, వెనుకబడిన తరగతులకు చెందిన కులసంఘాలు సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధానంగా బీసీ సంక్షేమ, బీసీ సమాజ్, బీసీ పొలిటికల్ జేఏసీ, మున్నూరు కాపు, ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ, బీసీ లెక్చరర్ల ఫోరం, విశ్వకర్మ, బీసీ మేధావులు, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక తదితర సంఘాలు ఏకమై బీసీ ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. రెండు దశలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ.. చివరి దశలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామన్న అధికార కాంగ్రెస్ నేతల హామీ ఏమైంది అంటూ బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు మద్దతు ప్రకటించడం వరకు మాత్రమే బీఆర్ఎస్, బీజేపీ పరిమితమా అని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఈశ్వరాచారి ఆత్మహత్యకు యత్నించడం.. చికిత్సపొందుతూ ఆయన మృతి చెందడం వెనుకబడిన వర్గాల్లో విషాదం అలుముకుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వడంతో మళ్లీ సెగ రాజుకున్నట్లు తెలుస్తోంది. మా ఓటు బీసీలకే..42 శాతం రిజర్వేషన్పైసంఘాల పోరు ఇప్పటికే బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు హైదరాబాద్లో సాయి ఈశ్వర చారి మృతితో కదలిక నేడు కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపు ఉమ్మడిగా దశల వారీ ఉద్యమబాటకు సన్నాహాలు సం‘గ్రామం’ వేళ మారుతున్న పరిణామాలతో రాజకీయ పార్టీల్లో కలవరం -
హోంగార్డుల సేవలు కీలకం
గద్వాల క్రైం: పోలీసుశాఖలో హాంగార్డుల సేవలు ఎంతో కీలకమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సేవా స్ఫూర్తితో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ విభాగలైన ట్రాఫిక్, పెట్రోలింగ్, డ్రైవింగ్ సేవలు చేస్తు పోలీసుశాఖకు విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. హోంగార్డు సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ తదితరులు ఉన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలి ఎర్రవల్లి: హోంగార్డ్స్ భవిష్యత్తులో తమ నైపుణ్యం పెంపొందించుకొని శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండాలని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శనివారం బీచుపల్లి పదో బెటాలియన్లో హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించగా కమాండెంట్ హాజరై సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ చూపుతున్న సేవలు, వినమ్రత క్రమశిక్షణ నిబద్దతకు నిదర్శనమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో, పండుగలు, ప్రజాకార్యక్రమాలు, ప్రమాదాలు, రక్షణ చర్యలు, మొదలైన కీలక సమయాల్లో ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న హోంగార్డ్స్, పోలీస్శాఖకు బలమైన తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. అనంతరం బెటాలియన్లో వివిద విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన హోంగార్డ్స్ శ్రీకాంత్, ధనుంజయ్, అశోక్ లకు అభినందించి వారికి కమాండెంట్ జ్ఞాపికలను బహుకరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, రిజర్వ్ ఇన్సె ్ఫక్టర్లు ధర్మారావు, నర్సింహారాజు, ఆర్పీసింగ్, రాజేశం, సిబ్బంది ఉన్నారు. ఆదిశిలా క్షేత్రంలో జడ్జి పూజలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం గద్వాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల పూజిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించగా, అర్చకులు, చైర్మన్ స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను అందజేశారు. వారి వెంట పట్వారి అరవిందరావు, మధుసూధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
దళితుల అభ్యున్నతికి కృషి
గద్వాలటౌన్: దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్రంలోని ఎన్టీయే ప్రభు త్వం పని చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితం అందరికి ఆదర్శమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత కొనియాడారు. జిల్లా కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ మహా విద్యా వేత్త అని, విద్యను ప్రచారం చేయడం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ● సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఉప్పేర్ నర్సింహ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు అంబేడ్కర్ వర్థంతి వేడుకలలో పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,224 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 213 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8,224, కనిష్టం రూ.4,700, సరాసరి రూ.6789 ధరలు లభించాయి. అలాగే, 9 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.5907, కనిష్టం రూ.5250, సరాసరి రూ.5907 ధరలు పలికాయి. -
పోరాడి సాధించుకుందాం.. ఆత్మహత్యలు వద్దు..
సాయి ఈశ్వరాచారి మృతి బాధించింది. పాలకుల మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం. దశల వారీ పోరాటాలకు సిద్ధం. పూలే, పండుగ సాయన్న బాటలో ముందుకు సాగుతాం. బీసీలు అడగకముందే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పి.. మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకుందామే తప్ప.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈశ్వర్ చారి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. – బెక్కం జనార్దన్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఇప్పటికై నా మేల్కోవాలి.. బీసీలకు రాజ్యాధికారం రావడం కష్టమని భా వించి సాయి ఈశ్వరా చారి బలిదానం కావ డం బాధేస్తోంది. బీసీల కు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మోసం చేసింది. 17 శాతానికే పరిమితం చేయడం దారుణం. బీసీలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికై నా మేల్కోవాలి. లేకుంటే పోరు బాట తప్పదు. మాకు ఉద్యమం కొత్త కాదు.. బీసీలందరం ఏకమై సత్తా ఏంటో చూపిస్తాం. – శ్రీనివాస్ సాగర్, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
ఓటులోనూ నారీ శక్తి!
జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా.. సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో మహిళలే అధిక సంఖ్యలో పోటీలో ఉండగా.. ఓటర్లుగానూ పురుషుల కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఫలితంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసేలా మహిళాశక్తి పనిచేయనుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్.. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం సర్పంచ్, వార్డు స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండగా, ఈ మేరకు స్థానాలన్నింటిలో మహిళలే అభ్యర్థులుగా బరిలో ఉంటున్నారు. వీటితోపాటు జనరల్ స్థానాల్లోనూ కొన్నిచోట్ల మహిళలు పోటీలో ఉంటున్నారు. గతంలో మహిళ రిజర్వేషన్ ఉన్నచోట్ల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు ఈసారి రిజర్వ్ కాకపోయినా పోటీలో ఉంటున్నారు. అలాగే ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు జనరల్ స్థానాల్లోనూ తమ సతీమణులను బరిలో దింపుతున్నారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కారణంగా 50 శాతం స్థానాలతోపాటు మిగతా రిజర్వ్ కాని చోటా మహిళలు పోటీచేస్తుండటంతో 50 శాతానికి మించి మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. సంఘాలతో సంప్రదింపులు.. గ్రామాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా మహిళా ఓటర్లు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానికంగా మహిళల సమస్యలపై దృష్టిసారించి హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో త్వరితగతిన పరిష్కారానికి వీలున్న వాటిని పూర్తిచేసేందుకు సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లా పురుషులు మహిళలు మొత్తం ఓటర్లు మహబూబ్నగర్ 2,48,222 2,51,349 4,99,582 నాగర్కర్నూల్ 3,23,016 3,24,315 6,47,342 వనపర్తి 1,90,068 1,92,223 3,82,295 జోగుళాంబ గద్వాల 1,93,627 1,99,781 3,93,418 నారాయణపేట 1,94,124 2,02,410 3,96,541 పంచాయతీ ఎన్నికల్లో ప్రభావిత వర్గంగా మహిళా శక్తి ఎన్నికల బరిలో 50 శాతంపైగా వారిదే హవా జనరల్ స్థానాల్లోనూ పోటాపోటీ ఇటు ఓటర్లు గానూ మెజార్టీ స్థాయిలో.. -
ముగిసిన నామినేషన్ల పర్వం
గద్వాలటౌన్/అలంపూర్: బతిమాలో.. భంగపడో మొత్తానికి ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులు దాదాపు తమ తిరుగుబాటు అభ్యర్థులను దారికి తెచ్చుకున్నారు. జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం ప్రధాన పార్టీల మద్దతుదారులను భయపెట్టిన రెబల్స్తో పాటు కొంతమంది ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పోటీ నుంచి పక్కకు తప్పుకున్నారు. మల్దకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యే వర్గం, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయిజ, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య పోటీ త్రీవంగా ఉంది. ఽఆయా వర్గాల మద్దతుదారులకు తిరుగుబాటు బెడద తప్పడం లేదు. వారి వల్ల తమ విజయావకాశాలకు వచ్చే నష్టం లేదని పార్టీ మద్దతుదారులు ఎమరికి వారు ధీమాగా ఉన్నా ఎంతోకొంత ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండవ దశ గ్రామ పంచాయతీలలో ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణలో ఆయా ఎన్నికల నామినేషన్ కేంద్రాలు నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం పంచాయతీ రెండవ దశ ఎన్నికలలో పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. రెండవ దశ ఎన్నికలు జరిగే మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని 74 గ్రామ పంచాయతీలకుగాను 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మల్దకల్ మండలంలో 5, అయిజలో 7, వడ్డేపల్లిలో 5, రాజోలి మండలంలో 1 గ్రామ పంచాయతీలలో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో వాటిని అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. కోరం ఉన్న గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచులను సైతం ఎన్నుకున్నారు. గుర్తుల కేటాయింపు రెండో విడత నామినేషన్ల ఘట్టం పూర్తవగా.. ఈనెల 14న జరిగే ఎన్నికలకు పోటీలో ఉండే సర్పంచు, వార్డు సభ్యులకు వేర్వేరుగా కేటాయించే గుర్తులను అధికారులు ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి పంచాయతీ అధికారులకు వచ్చిన ఉత్తర్వుల మేరకు గుర్తులను కేటాయించారు. పోటీలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఇబ్బంది కలగకుండా 10–15 రకాల గుర్తులను కేటాయిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ గుర్తులతో కూడిన వివరాలు అన్ని గ్రామ పంచాయతీలకు చేరాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే పోటీలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు అధికారికంగా గుర్తులను కేటాయించారు. ఈ నెల 7వ తేదీ నుంచి పోలింగ్కు ముందు రోజు వరకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో కరపత్రాలు, వాల్పోస్టర్లు ముద్రించుకుని ఓటర్ల వద్దకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బిర్యానీలు, మద్యం సీసాల పంపిణీకి ఇంకొందురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా అసలు సిసలు ఎన్నికల వాతావరణం పల్లెల్లో మొదలైంది. మూడో విడతలో జోరుగా నామినేషన్లు మూడో విడతగా అలంపూర్, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. చివరి రోజు కొన్ని కేంద్రాల్లో నామినేషన్ ప్రక్రియ అర్ధరాత్రి సైతం కొనసాగిన విషయం తెలిసిందే. ఐదు మండలాల్లో 75 సర్పంచ్ స్థానాలకు 438, 700 వార్డులకు 1489 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో విడతలో సర్పంచ్కు 438, వార్డులకు 1489 నామినేషన్లు రెండో దశలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం ఊపిరి పీల్చుకున్న పార్టీలు సమరానికి సిద్ధమైన అభ్యర్థులు -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ధరూరు: వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి నుషిత అన్నారు. శనివారం మండలంలోని ఉప్పేరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంట గది, స్టోర్ రూం, సరుకులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఆహార నాణ్యత, షానిటేషన్, బాత్రూంల శ్రుభ్రత తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల చదువు ప్రగతి, ట్యూటర్ల బోధనా విధానం, అధ్యయన సమయం తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సారి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. -
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
గద్వాలటౌన్: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని డీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు పోటీలను నిర్వహించారు. అనంతరం డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులు అపారమైన ప్రతిభ కలిగి ఉంటారన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. వైకల్యం శరీరానికే కాని, మనసుకు కాదని, సకలాంగులతో సమానమేనన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, జిల్లా విలీన విద్య సమన్వయ అధికారి హంపయ్య, ఐఈఆర్పీలు వాసు, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గద్వాలటౌన్: వసతిగృహా విద్యార్థులకు రుచితో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలోని వంటగది, స్టోర్ రూంను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాన్ని చక్కగా నిర్వహిస్తుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువులో రాణించి వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో ఇటీవల కొన్ని వసతి గృహాల్లో ఆహారం కలుషితమై విద్యార్థులు కొందరు అస్వస్థతకు గురైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అలాంటివి పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
పోలింగ్ నిర్వహణపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న కలెక్టర్ సంతోష్ గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్లో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమేనన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఓటర్లు తమ ఓటు గల్లంతైందని, ఇతర సమస్యలు చెప్పకుండా ముందుగానే పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ముందుగానే మాస్టర్ ట్రైనర్స్ను అడిగి పరిష్కరించుకోవాలన్నారు. ఈ శిక్షణలో బ్యాలెట్ బాక్స్లను తెప్పించి మాదిరి పోలింగ్ కూడా చేస్తారన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఓటు హక్కు ఉంటే ఫామ్ 14 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ దరఖాస్తులను పూరించి సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేస్తే ఈ నెల 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం తమ జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియ
అలంపూర్: నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మూడో రోజు కావడంతో అటు సర్పంచ్, ఇటు వార్డులకు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అర్ధరాత్రి వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వేచి ఉండగా.. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఏఏ కేంద్రాల్లో ఎన్ని నామినేషన్లు వచ్చాయనే విషయం ఒకటిరెండు చోట్ల తప్ప మిగిలిన కేంద్రాల వద్ద అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అందించేందుకు సాధ్యపడలేదు. చివరి రోజు కావడంతో భారీగా దాఖలు -
పల్లీకి డిమాండ్..
● మార్కెట్యార్డులో 15 రోజులుగా మంచి ధరలు ● క్వింటాకు అత్యధికంగా రూ.7500 ధర పలుకుతున్న వైనం మంచి ధరలు బోర్లు, బావులు, అందుబాటులో ఉన్న నీటివనరుల కింద వేరుశనగను సాగు చేశారు. అయితే దిగుబడులు ఎక్కవగా రాకున్నా గింజ గట్టిగా, లావుగా ఉంది. కాగా చేతికి వచ్చిన వేరుశనగను విక్రయానికి రైతులు గడిచిన రెండు నెలల నుంచి గద్వాల మార్కెట్యార్డుకు తీసుకువస్తున్నారు. బాగా ఆరబెట్టి, మట్టిపెల్లలు, దుమ్మూదూళి లేకుండా రైతులు వేరుశనగను తీసుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఈ సమయంలో వేరుశనగ యార్డులకు రావడం లేదు. దీంతో ఇక్కడ వేరుశనగకు మంచిఽ ధరలు వస్తున్నాయి. గడిచిన రెండు నెలల నుంచి ప్రతిరోజు 800 నుంచి 1100 క్వింటాళ్ల దాక వేరుశనగ యార్డుకు విక్రయానికి వస్తోంది. సరుకు నాణ్యతగా ఉంటుండటంతో వ్యాపారస్తులు మంచి ధరలు కోడ్ చేస్తున్నారు. క్వింటాకు అత్యధికంగా రూ.7వేల నుంచి రూ.7,550 దాకా వస్తోంది. సరాసరి ధరలు కూడా రూ.5400 నుంచి రూ. 6300 వరకు వస్తున్నాయి. అక్టోబర్, నవంబర్తో పోల్చితే డిసెంబర్లో మంచి ధరలు రైతులకు లభిస్తున్నాయి. కాగా ముందస్తు యాసంగి సీజన్లో భాగంగా సాగు చేసిన వేరుశనగ డిసెంబర్ వరకు యార్డుకు విక్రయానికి రానుంది. మరో 20వేల నుంచి 30వేల క్వింటాళ్ల వరకు విక్రయానికి వచ్చే అవకాశం ఉందని యార్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే డిసెంబర్లో ప్రస్తుతం వస్తున్న ధరల కన్నా ఇంకా కాస్త ఎక్కువ వస్తాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గద్వాల వ్యవసాయం: పల్లీకి డిమాండ్ బాగా వస్తోంది. నడిగడ్డలోని రైతులు యాసంగి సీజన్కు ముందుగా వేరుశనగ వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట చేతికి రావడంతో విక్రయానికి గడిచిన 50 రోజుల నుంచి గద్వాల మార్కెట్యార్డుకు తీసుకువస్తున్నారు. ఇలా వస్తున్న వేరుశనగకు యార్డులో మంచి ధరలు లభిస్తున్నాయి. 50 రోజులుగా యార్డుకు ధాన్యం.. సాధారణంగా వంటనూనెలకు మార్కెట్లో ఽమంచి ఽడిమాండ్ ఉండటంతో పాటు ధరలు స్థిరంగా ఉంటాయి. ఇలా ధరలు బాగా ఉండటంతో పాటు గద్వాల ప్రాంతం నుంచి చైన్నె, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఏటా వేరుశనగ ఎగుమతి అవుతుంది. వ్యాపారస్తులు ఇక్కడ వేరుశనగను కొనుగోలు చేసి ఇక్కడే విక్రయించడంతో పాటు ఎగుమతి చేస్తుంటారు. నడిగడ్డలో వేరుశనగ పంటను ఇక్కడి రైతులు ఏటా మూడుసార్లు సాగు చేస్తారు. బోర్లు, బావులతో పాటు ఇతర నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగను మూడు సార్లు వేస్తున్నారు. వేరుశనగ పంట 90 నుంచి 100 రోజులకు చేతికి వస్తుంది. ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో అధిక వర్షాల వల్ల వేరుశనగ బాగా దెబ్బతినడంతో కొన్ని చోట్ల తీసివేశారు. జిల్లాలో పలుచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. అయితే బాగా కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జ్ అయ్యాయి. దీంతో ఆగస్టు, సెస్టెంబర్లో దాదాపు 7వేల నుంచి 10వేల ఎకరాల్లో ముందస్తు యాసంగి సీజన్ పంటలో భాగంగా మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట గడిచిన యాభై రోజులుగా యార్డుకు వస్తోంది. నాణ్యతగా తీసుకురావాలి గద్వాల ప్రాంతంలో వేరుశనగను ఏటా మూడు సార్లు సాగు చేస్తారు. ప్రస్తుతం యార్డుకు వస్తున్న వేరుశనగ నాణ్యతతో వస్తోంది. దీనివల్ల వ్యాపారస్తులు మంచి ధరలు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారు. రైతులు వేరుశనగను బాగా ఆరబెట్టి, మట్టి పెళ్లలు లేకుండా తీసుకొస్తే ధరలు బాగా వస్తాయి. – నర్సింహ్మ, గద్వాల మార్కెట్ యార్డ్ కార్యదర్శి ●వేరుశనగ కాంటా వేస్తున్న హమాలీలు జిల్లాలో వేరుశనగ ధరల వివరాలిలా.. -
ఆదిశిలా క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
మల్దకల్: ఆదిశిలాక్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. గురువారం అర్ధరాత్రి కనులపండువగా రథోత్సవం నిర్వహించగా.. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నెల రోజులపాటు స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. వాహనాలు, ఎడ్లబండ్లపై ఆలయానికి భక్తులు చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులుతీరి కనిపించారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అశ్వవాహనంపై ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారు అశ్వవాహనంపై ఊరేగారు. ముందుగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీసమేతుడైన శ్రీనివాసుడిని అశ్వవాహనంపై ఉంచి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, పూజారులు పాల్గొన్నారు. -
పొత్తుల రాజకీయం!
జోగుళాంబ గద్వాలశుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మహబూబ్నగర్: బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ● గండేడ్ మండలం చిన్నవార్వాల్, రుసుంపల్లి, పెద్ద వార్వాల్, లింగాయపల్లి, వెన్నచేడ్, కొండాపూర్ గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అంచన్పల్లి, మన్సూర్పల్లి గ్రామాల్లో ఏకగ్రీవం కావడానికి మూడు పార్టీల మద్దతుదారులు అంగీకరించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్కు చెందిన వారు సర్పంచ్లుగా ఏకగ్రీవమయ్యారు. ● మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది. కంచన్పల్లిలో కాంగ్రెస్కు చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండగా.. అందులో ఒకరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నంచర్ల, గాదిర్యాల్లో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ మద్దతుదారులకు బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. పల్లె పోరులో చిత్రవిచిత్రాలు గెలుపే లక్ష్యంగా ఊహించని ‘మద్దతులు’ కొన్ని జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ.. సీపీఎం, కాంగ్రెస్.. మంత్రి జూపల్లి ఇలాకాలో కారు, కమలం ఉమ్మడి కార్యాచరణ? వీపనగండ్లలో బీఆర్ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్, సీపీఎం.. -
ఏకగ్రీవ సర్పంచులకు ధ్రువీకరణ పత్రాలు
గద్వాలటౌన్: పంచాయతీ తొలిదశ ఎన్నికలలో పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. తొలిదశ ఎన్నికలు జరిగే గద్వాల, గట్టు, కేటీదొడ్డి, ధరూరు మండలాల్లోని 106 గ్రామ పంచాయతీలకుగాను 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గట్టు మండలంలో 6 గ్రామ పంచాయతీలు, కేటీదొడ్డి మండలంలో 2, ధరూరు మండలంలో 4, గద్వాల మండలంలో 3 గ్రామ పంచాయతీలలో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో వాటిని అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. గురువారం ఏకగ్రీవమైన సర్పంచు అభ్యర్థులకు, వార్డు సభ్యులకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక సైతం చేపట్టారు. మెజార్టీ వార్డు సభ్యుల అభిప్రాయం మేరకు ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయిన వెంటనే ఆయా గ్రామాలలో సంబురాలు నిర్వహించారు. గెలుపొందిన వారికి మిఠాయిలు తినిపించి, పెద్ద ఎత్తున్న సన్మాన కార్యక్రమాలు చేపట్టారు. ఏకగ్రీవ గ్రామాలలో కోలాహాలం నెలకొంది. -
మార్మోగిన గోవిందనామస్మరణ
● ఆదిశిలా క్షేత్రానికి తరలివచ్చిన భక్తజనం ● బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ● దాసంగాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు ● ఎడ్లబండ్లు, వాహనాలతో కిలోమీటర్ల మేర రద్దీ మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మార్మోగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారికి వేదపండితులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలిరావడంతో భక్తులతో మల్దకల్ గ్రామం జనసంద్రమైంది. మల్దకల్ ఆలయం చుట్టూ కిలోమీటర్ల మేర ఎటు చూసినా తిమ్మప్పస్వామి భక్తులతో రద్దీగా మారింది. ట్రాక్టర్లు, ఆటోలు, జీపులు, ఎద్దులబండ్లపై వచ్చిన భక్తులు స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీ, డీఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోలీసులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు, సేవా సమితి నిర్వాహకులు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జాతరలోకి వాహనాలను అనుమతివ్వకుండా గ్రామశివారులోనే ఎక్కడికక్కడే కట్టడి చేశారు. కార్యక్రమంలో ఆల య చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, ఎస్ఐ నందికర్, పట్వారి అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, మండల నాయకులు మధుసూదన్ రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, నరేందర్ వాల్మీకీలు పాల్గొన్నారు. ఎస్పీ ప్రత్యేక పూజలు ఆలయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు ఎస్పీకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జాతర పరిసరాలను పరిశీలించారు. రథోత్సవంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు చేపట్టాలని పోలీసులకు సూచించారు. అలాగే క్యూలైన్లు, తేరు పరిసరాలను పరిశీలించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐలు టంగుటూరి శ్రీను, టాటా బాబు, ఎస్ఐలు నందీకర్, సతీష్రెడ్డి పాల్గొన్నారు. -
క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు స్వీకరించాలి
ఎర్రవల్లి: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆయా పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్లను క్షుణ్ణంగా సరిచూసుకొని పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్లో ఏర్పాటు చేసిన క్లస్టర్–1, క్లస్టర్–2 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. వివిధ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తుండటంతో ఆయా పంచాయతీల ఓటర్ లిస్టును పరిశీలించారు. పోటీ చేసే అభ్యర్థులు, పూరించాల్సిన వివిధ దరఖాస్తులు, నామినేషన్ వేసేందుకు అవసరమైన ఇతర సామగ్రిని రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వారికి తగిన సహకారం అందించాలని హెల్ప్డెస్క్ సిబ్బందికి సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీచేసే అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపరచాల్సిన వయస్సు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు పెండింగ్లో ఉండకుండా కట్టించుకోవాలని, నామినేషన్ల డిపాజిట్ స్వీకరించాక అభ్యర్థులకు రషీదు అందజేయాలన్నారు. తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్ఖాన్, తదితరులు ఉన్నారు. -
సర్పంచ్కు 82, వార్డులకు 290 నామినేషన్లు
అలంపూర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల స్వీకరణ రెండో రోజైన గురువారం జోరుగా సాగింది. అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడో విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 82మంది, వార్డులకు 290 మంది నామినేషన్లు వేశారు. అలంపూర్ మండలంలో సర్పంచ్కు 82 మంది, ఇటిక్యాల మండలంలో సర్పంచ్కు 11 మంది, వార్డులకు 56, ఉండవెల్లిలో సర్పంచ్కు 18, వార్డులకు 57 మంది, మానవపాడులో సర్పంచ్కు 10 మంది, వార్డులకు 43 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎర్రవల్లిలో సర్పంచ్ స్థానానికి 16 మంది వార్డుల స్థానాలకు 53 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
పెద్దధన్వాడలో సంబరాలు
రాజోళి: ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్దధన్వాడ గ్రామస్తులు చేసిన ప్రజా పోరాటం ఫలించిందని పలువురు అన్నారు. పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం గ్రామాల ప్రజలు చేసిన పోరాటం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యాక్టరీ గ్రామం నుండి ఇతర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారని తెలియడంతో గురువారం గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. కంపెనీ ప్రతినిధులు పెద్దధన్వాడ గ్రామాన్ని వీడి ఇతర రాష్ట్రంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని రైతులకు తెలియడంతో సంతోషం వ్యక్తం చేశారు. బాణా సంచా పేలుస్తూ, స్వీట్లు పంచుకున్నారు. గ్రామస్తులతోపాటు చుట్టు పక్కల గ్రామాల వారు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో చేసిన పోరాటం ఫలించిందని అన్నారు. ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించారన్నారు. ఈ సందర్బంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేరుశనగ క్వింటా రూ.7,500 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 125 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7500, కనిష్టం రూ.4830, సరాసరి రూ.6723 ధరలు లభించాయి. అలాగే, 8 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.5980, కనిష్టం రూ.5420, సరాసరి రూ.5980 ధరలు పలికాయి. 743 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2716, కనిష్టం రూ. 1719, సరాసరి ధరలు రూ. 2546 వచ్చాయి. 27 వరకు ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి కొల్లాపూర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 27 చివరి గడువు అని కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్కుమార్, ఓపెన్ డిగ్రీ సెంటర్ కోఆర్డినేటర్ రమేష్కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 1, 3, 5 సెమిస్టర్ చదువుతున్న విధ్యార్థులు పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి నెలలో జరుగుతాయని పేర్కొన్నారు. -
ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఆయా జిల్లాల కలెక్టక్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన స్టేజ్–2 జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై కమిషనర్ ఆరా తీశారు. ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు తదితర అంశాలపై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామాల్లో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు, అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల పరిశీలకుడు గంగాధర్, రాజేష్బాబు పాల్గొన్నారు. -
ప్రజా రక్షణ కోసమే సిబ్బందికి నైపుణ్య శిక్షణ
ఎర్రవల్లి: ప్రజల రక్షణ కోసమే 10వ బెటాలియన్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక నైపుణ్య శిక్షణకు అందిస్తున్నట్లు కమాండెంట్ జయరాజు తెలిపారు. విపత్తు సమయంలో వేగవంతమైన రక్షణ కోసం బీచుపల్లి పదో బెటాలియన్ సిబ్బందికి యూసుఫ్గూడలోని 1వ బెటాలియన్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనపై ప్రత్యేక శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ శిక్షణలో విపత్తులు సంభవించినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రాణ రక్షణకు ఉపయోగించే ఆధునిక పరికరాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్, హైడ్రాలిక్ ర్యామ్ సెట్, ఫ్లోటింగ్ పంప్, ఇన్స్పెక్షన్ హోల్ మేకర్, రోటరీ రెస్క్యూ, కార్బైడ్ టిప్ చైన్స్, డైమండ్ టిప్ చైన్స్ పరికరాల వినియోగం, నిర్వహణ, విపత్తు సమయంలో రక్షణ చర్యలు తీసుకునే పద్ధతులపై ప్రాక్టికల్ శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడానికి, సత్వర చర్యలు చేపట్టడానికి, సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని సూచించారు. -
జోగుళాంబ గద్వాల
పాత కొత్త ఒక్కో చోట ఒకలా.. నేటినుంచి కబడ్డీ టోర్నీ పాలమూరులోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం అంతర్ జిల్లా (రాష్ట్రస్థాయి) జూనియర్ బాలుర కబడ్డీ టోర్నీ ప్రారంభం కానుంది. గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uఉమ్మడి జిల్లాలో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ పడుతున్న వారిలో ఎక్కువ శాతం కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే (పాత) ఆయా నియోజకవర్గాల నేతలు మద్దతు ప్రకటించారు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట మాత్రం బెట్టి చరిష్మా, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. దీన్ని గ్రహించిన పలు నియోజకవర్గాల నేతలు నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వారిని నేరుగా పిలిపించుకుని భవిష్యత్లో తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని.. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ‘హస్తం’లో తారస్థాయికి పల్లె పోరు ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ అత్యధిక జీపీల్లో బరిలోనే రెబల్స్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే పార్టీ మద్దతు ‘చేయి’ అందుకున్న ఇతర నాయకుల్లో అసహనం పలు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు తలపట్టుకుంటున్న ‘అధికార’ నేతలు ‘హస్తం’లో తారస్థాయికి పల్లె పోరు ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ అత్యధిక జీపీల్లో బరిలోనే రెబల్స్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకే పార్టీ మద్దతు ‘చేయి’ అందుకున్న ఇతర నాయకుల్లో అసహనం పలు ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు తలపట్టుకుంటున్న ‘అధికార’ నేతలు -
కనులపండువగా ప్రభోత్సవం
మక్తల్: మక్తల్ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రభోత్సవ వేడుకలు కనులపండువగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ప్రభోత్సవ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని రాంలీలా మైదానం కిటకిటలాడింది. ముందుగా ఆలయ చైర్మన్ ప్రాణేష్కుమార్ తదితరులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ప్రతిష్టించి పట్టణంలోని మెయిన్ రోడ్లో ఉన్న గోధా ఆంజనేయ స్వామి దేవాలయం వరకు భజన బృందాల నడుమ పల్లకీ యాత్ర నిర్వహించారు. భక్తులు, ప్రముఖులు ప్రభోత్సవానికి హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టారు. ప్రభోత్సవాన్ని పడమర దిక్కున ఉన్న చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు లాగారు. అక్కడ విశేష పూజ లు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయం వద్దకు ప్రభోత్సవాన్ని తీసుకువచ్చారు. వేరుశనగ క్వింటా రూ.7,522 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 261 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7522, కనిష్టం రూ.4339, సరాసరి రూ. 5690 ధరలు లభించాయి. అలాగే, 4 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5960, కనిష్టం రూ. 5760, సరాసరి రూ. 5760 ధరలు పలికాయి. 1384 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2859, కనిష్టం రూ. 1718, సరాసరి ధరలు రూ. 2576 వచ్చాయి. 5 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ. 6201 లభించింది. -
పంచాయతీ ఎన్నికలపై పటిష్ట నిఘా
● చెక్పోస్టుల వద్ద తనిఖీలు తప్పనిసరి ● డీఐజీ చౌహాన్ వెల్లడి గద్వాల క్రైం: సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డీఐజీ చౌహాన్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు, సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రెండు రాష్ట్రాల సరిహద్దులు కావడంతో అక్రమంగా మద్యం, నగదు, మాదకద్రవ్యాలు సరఫరా చేసే వెసులుబాటు ఉంటుంని నిఘా వర్గాలు స్పష్టం చేశాయన్నారు. ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు పెద్ద మొత్తంలో నగదు, వస్తు సామగ్రి, మద్యం తదితర వాటితో తమ వైపునకు అభ్యర్థులు, నాయకులు తిప్పుకుంటారనే నివేదికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఎన్నికలు సజావుగా సాగించాలనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ ముందుస్తు చర్యలకు శ్రీకారం చేపట్టిందన్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలన్నారు. అనుమానిత వాహనాలను విధిగా తనిఖీ చేయాలన్నారు. విధిగా హైవే పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్ చేయాలని, సామాజిక మాద్యమాలు, గ్రూపుల ద్వారా సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. -
మూడో విడత నామినేషన్లు షురూ..
● ఐదు మండలాల్లో 75 పంచాయతీలు, 700 వార్డులు ● మొదటి రోజు సర్పంచ్కు 39, వార్డులకు 49 వార్డులకు నామినేషన్లు అలంపూర్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ఆరంభించారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి రోజు సర్పంచ్ స్థానానికి 39 మంది అభ్యర్ధులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదేవిధంగా వార్డులకు 49 మంది అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. మూడవ విడతలోని 5 మండలాల్లో 75 పంచాయతీలకు, 700 వార్డులకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. మొదటి రోజు కావడంతో ఇంకా నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలు చేశారు. చివరి రెండు రోజులు గురు, శుక్రవారాలు కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్లు అధిక సంఖ్యలో దాఖలు చేసే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ కేంద్రం పరిశీలన అలంపూర్ మండలంలోని బుక్కాపురం, భీమవరం, క్యాతూర్, అలంపూర్ పట్టణంలోని నామినేషన్ కేంద్రాలను డిప్యూటీ కలెక్టర్ రాజ్కుమార్ పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులతో నామినేషన్ దాఖలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ మంజుల నామినేషన్ దాఖలు కేంద్రాలను పరిశీలించారు. మూడో విడత నామినేషన్ల వివరాలిలా.. మండలం మొత్తం వార్డులు సర్పంచ్ వార్డులు పంచాయతీలు నామినేషన్లు అలంపూర్ 14 120 10 13 ఉండవల్లి 15 142 5 4 మానవపాడు 17 164 4 –– ఇటిక్యాల 14 130 6 12 ఎర్రవల్లి 15 144 14 20 -
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
గద్వాలటౌన్: దివ్యాంగులు తమ వైకల్యాన్ని శాపంగా భావించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబాటుతనం, పేదరికం, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనేకమంది దివ్యాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చాయని, సద్వినియోగం చేసుకోవాలని, దివ్యాంగుల హక్కులను కాపాడేందుకు ఉన్న చట్టాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు మాట్లాడుతూ డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో మహిళా దివ్యాంగ సంఘాలు ఏర్పాటు చేసి, వారికి ఉపాధి నిమిత్తం ప్రత్యేక రుణాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకొని అన్నిరంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులను అందజేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దివ్యాంగులు అడిషనల్ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి సునంద, డీఈఓ విజయలక్ష్మి, డీవైఎస్ఓ కృష్ణయ్య, డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాసులు, డీసీపీఓ నర్సింహా, న్యాయవాదులు శ్రీనివాసులు, లక్ష్మణ్స్వామి, దివ్యాంగుల సేవా సంఘం నాయకులు చంటిబాబు, బీసమ్మ, లక్ష్మీకాంతరెడ్డి, నర్సింహులు, ఆంజనేయులు పాల్గొన్నారు. -
15 జీపీలు ఏకగ్రీవం
● ఊపిరి పీల్చుకున్న పార్టీలు ● సమరానికి సిద్ధమైన అభ్యర్థులు గద్వాలటౌన్: పంచాయతీ తొలిదశ ఎన్నికలలో పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. తొలిదశ ఎన్నికలు జరిగే గద్వాల, గట్టు, కేటీదొడ్డి, ధరూరు మండలాల్లోని 106 గ్రామ పంచాయతీలకుగాను 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన సర్పంచులలో ఒకరు మినహా మిగిలిన సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కావడం విశేషం. గట్టు మండలంలో 6 గ్రామ పంచాయతీలు, కేటీదొడ్డి మండలంలో 2, ధరూరు మండలంలో , గద్వాల మండలంలో 3 గ్రామ పంచాయతీలలో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో వాటిని అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అయితే ఏకగ్రీవమైన సర్పంచు అభ్యర్థులకు, వార్డు సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదు. గురువారం అందజేస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు తొలిదశ పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరగనుండగా.. సర్పంచు, వార్డు సభ్యులకు వేర్వేరుగా కేటాయించే గుర్తులను అధికారులు ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి పంచాయతీ అధికారులకు వచ్చిన ఉత్తర్వుల మేరకు గుర్తులను కేటాయించారు. రాజకీయ పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతుండటంతో పోటీ చేసే అభ్యర్థులకు పలు రకాల గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. పోటీలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఇబ్బంది కలగకుండా 10–15 రకాల గుర్తులను కేటాయిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ గుర్తులతో కూడిన వివరాలు అన్ని గ్రామ పంచాయతీలకు చేరాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే పోటీలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు అధికారికంగా గుర్తులను కేటాయించారు. ఫలించిన ప్రయత్రాలు.. జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం ప్రధాన పార్టీల మద్దతుదారులను భయపెట్టిన రెబల్స్తో పాటు కొంతమంది ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పోటీ నుంచి పక్కకు తప్పుకున్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఽనామినేషన్ల ఉపసంహరణ అనంతరం తొలిదశలోని గట్టు, ధరూరు, కేటీదొడ్డి, గద్వాల మండలాల్లోని 106 గ్రామ పంచాయతీ సర్పంచులకు గాను 714 మంది అభ్యర్థులు, 974 వార్డు సభ్యులకు 1903 మంది మద్దతుదారులు ఎన్నికల బరిలో మిగిలారు. ఏకగ్రీవమైన పంచాయతీలలో 14 మంది ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ మద్దతుదారులే ఉండటం విశేషం. ఒక్కరు మాత్రమే బీజేపీ మద్దతుదారులు ఉన్నారు. ప్రతి మండలంలో రెండు, మూడు పంచాయతీలు తప్పిస్తే మిగిలిన అన్ని పంచాయతీలలో ద్విముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీల మద్దతుదారులు తిరుగుబాటుదారులను, ఎంతో కొంత ఓట్లు చీల్చగల రెబల్స్ను తమకు అనుకూలంగా పోటీ నుంచి తప్పించేలా గత రెండురోజుల నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పలుచోట్ల బెదిరింపులు, హెచ్చరికలు, నజరానాలతోనే అధికార పార్టీ మద్దతుదారులు తమ పార్టీ రెబల్స్తో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను సైతం పోటీ నుంచి తప్పించారు. మొదటి దశ గ్రామ పంచాయతీలలో ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణలో ఆయా ఎన్నికల నామినేషన్ కేంద్రాలు నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. గద్వాల మండలం కుర్వపల్లి సర్పంచ్గా సరస్వతి, ఈడిగోనిపల్లిలో రాణి, ముల్కలపల్లిలో బోయ రాముడు ఏకగ్రీవమయ్యారు. ధరూరు మండలం ర్యాలంపాడు సర్పంచ్గా వెంకట్రామిరెడ్డి, జాంపల్లిలో శారదమ్మ, ద్యాగదొడ్డిలో సావిత్రమ్మ, చిన్నపాడులో సవారన్న సర్పంచ్గా ఎన్నికయ్యారు. కేటీదొడ్డి మండలం చింతలకుంట సర్పంచ్గా రాజశేఖర్, రంగాపురం సర్పంచ్గా పెద్ద జయన్న ఎన్నికయ్యారు. గట్టు మండలం ముచ్చోనిపల్లి సర్పంచ్గా పార్వతమ్మ, అరగిద్దలో బాలక్రిష్ణనాయుడు, లింగాపురంలో షకుంతల, పెంచికలపాడులో కుర్వ ఆంజనేయులు, తుమ్మలపల్లిలో గోవిందమ్మ, తారాపురంలో లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి
● 974 పోలింగ్ కేంద్రాలకు.. 974 మంది ఓపీఓలు, 1236 సిబ్బంది ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు గంగాధర్తో కలిసి తొలి విడత పోలింగ్ సిబ్బందిని రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాలలో నిర్వహించనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 974 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో విధులు నిర్వర్తించడానికి పీఓలు 974, ఓపీఓలు 1,236 సిబ్బందిని రెండవ ర్యాడమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఒక్కో మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ అధికారులను ర్యాండమైజేషన్ విధానంలో కేటాయించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు పారదర్శకంగా ఎన్ఐసీ సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఈడీఎం శివ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే..
● కనులపండువగా లక్ష్మీవేంకటేశ్వరుడి కల్యాణ మహోత్సవం ● జనసంద్రంగా మారిన ఆదిశిలా క్షేత్రం మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తజనం నడుమ స్వామివారి కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. ముందుగా సింగిల్విండో చైర్మన్ తిమ్మారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించగా.. వేద పండితులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చూడముచ్చటగా అలంకరించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, భాజా భజంత్రీలు, మేళతాళాల మధ్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆదిశిలా వాసుడైన శ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవి మెడలో మాంగళ్యధారణ చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. గజవాహనంపై ఊరేగిన ఆదిశిలా వాసుడు ఆదిశిలా వాసుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీవేంకటేశ్వస్వామిని గజవాహనంపై ఊరేగించారు. వేదపండితులు ప్రసన్నాచారి, భీంసేనాచారి, రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, ధీరేంద్రదాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. లక్ష్మీ సమేతుడైన శ్రీనివాసుడిని గజవాహనంపై కొలువుదీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
వేరుశనగ క్వింటాల్ రూ.5,729
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 193 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 5,729, కనిష్టంగా రూ. 4,516, సరాసరి రూ. 6,489 ధరలు వచ్చాయి. అదే విధంగా 19 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,941, కనిష్టంగా రూ. 5,519, సరాసరి రూ. 5,941 ధరలు లభించాయి. 1,810 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,850, కనిష్టంగా రూ. 1,932, సరాసరి ధరలు రూ. 2,709 ధరలు వచ్చాయి. మానవసేవే మాధవ సేవ మల్దకల్: మానవసేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ భావించాలని.. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా భక్తులను అనుగ్రహిస్తారని హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి అన్నారు. మంగళవారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రాన్ని పీఠాధిపతి సందర్శించగా.. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో భక్తులకు వేద ప్రవచనాలు వినిపించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. సన్మార్గంలో పయనించినప్పుడే దేవుడి అనుగ్రహం పొందుతారని అన్నారు. కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబూరావు, మధుసూదన్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
అలంపూర్ రూరల్: రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని డీఏఓ సక్రియా నాయక్ సూచించారు. మంగళవారం అలంపూర్ మండలం క్యాతూర్లో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. క్యాతూర్లో ఇప్పటి వరకు 533 మంది రైతుల నుంచి 34వేల క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొంటుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీఏఓ వెంట సింగిల్విండో సీఈఓ హుస్సేన్ పీరా, వ్యవసాయ విస్తరణాధికారి మానస ఉన్నారు. క్రీడల్లో రాణించాలి ఎర్రవల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పదో పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అస్మితా జిల్లాస్థాయి అథ్లెటిక్ మీట్లో పదవ బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థులు మల్లిక, వైష్ణవి, వినంద, భార్గవి, నందిని, కీర్తి ఉత్తమ ప్రతిభకనబరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం వారిని పదో పటాలం కార్యాలయంలో కమాండెంట్ అభినందించారు. భవిష్యత్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ ఆర్పీ సింగ్, ఆర్ఐలు తిరుపతి, ప్రసన్నకుమార్, ప్రిన్సిపాల్ షేక్షావలి, పీఈటీ హైదర్పాషా పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలం గద్వాల: సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థ్ధులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రవీణ్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 15మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. జిల్లా అధికారులు హాస్టళ్లను తనిఖీలు చేస్తున్నా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ను సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు భరత్, నరేశ్, శరత్ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అలంపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం అలంపూర్లోని కేవీపీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సీపీఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం నిరంతరం పోరాడుతుందన్నారు. కార్మిక లోకానికి అండగా నిలవడంతో పాటు రైతుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేపడుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సీపీఎం బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి.. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గన్నీబ్యాగుల కొరతతో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయని.. రోజుల తరబడి రైతులు కేంద్రాల్లోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వార్షాలు వచ్చి ధాన్యం తడిసి రైతులు నష్టపోతే బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రేపల్లె దేవదాసు, జీకే ఈదన్న, నర్సింహ, అలీక్బర్, బంగారు రఫీ పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు
● ఉప సర్పంచ్ పవర్ ఫుల్ ● డిపాజిట్ కోల్పోవడమంటే? ● ‘సోషల్’ ప్రచారం! ● అమెరికా నుంచి వచ్చి నామినేషన్ ● ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ ● ఒక అభ్యర్థి.. రెండు కుల ధ్రువీకరణ పత్రాలు ● ఏకగ్రీవాల జోరు – వివరాలు 8లో uగద్వాల: ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని.. సాధారణ పంచాయతీ ఎన్నికలను నిష్పాక్షికంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఫేస్–2 రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. అధికారులు సూచనల పుస్తకంపై పూర్తి అవగాహన కలిగి ఉండి, ఎన్నికల నియమాలను పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, వెబ్కాస్టింగ్, ఇతర సౌకర్యాలపై అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధమని.. ఓటర్లకు అవసరమైన సదుపాయాలు సక్రమంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. 10వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండల కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. పోలింగ్ రోజున ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 1గంటకు ముగుస్తుందన్నారు. ఆ సమయానికి ముందు క్యూలో నిల్చున్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ పీపీటీ ఆధారంగా సమగ్ర శిక్షణ అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీపీఓ శ్రీకాంత్, ఎన్నికల ట్రెయినింగ్ నోడల్ అధికారి రమేశ్బాబు పాల్గొన్నారు. -
రాజకీయ వేఢీ!
మొదటి విడత పంచాయతీ పోరు రసవత్తరం ● ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగాప్రధాన పార్టీల వ్యూహరచన ● తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకుండా జాగ్రత్తలు ● నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు బుజ్జగింపులు.. బేరసారాలు జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో బుజ్జగింపులు, బేరసారాల పర్వానికి తెర లేచింది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు బేరసారాలు ప్రారంభించారు. తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన రెబల్స్తో సంప్రదింపులు.. రాయబారాలు జరుపుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులతో రాజీ కుదుర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. ‘ఇదంతా కాదయ్యా.. నాకు కచ్చితంగా వందకు పైగా ఓట్లు ఉన్నాయ్. ఏంటో చెప్పు..’ అంటూ కొందరు అప్పుడే బేరాలు ప్రారంభించారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గద్వాలటౌన్: జిల్లాలో మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో పరిస్థితిని ముఖ్య నేతలు ముందుగానే పసిగట్టి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి పంచాయతీ ఎన్నికలు కావడంతో తమ బలాబలాలను అంచనా వేసుకోవడానికి ప్రధాన పార్టీలు స్థానిక సంస్థలను వేదికగా భావిస్తున్నాయి. ఆ దిశగానే ఆయా పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల వ్యూహ ప్రణాళికల్లో మునిగిపోయారు. వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్లు 1,903 సర్పంచ్కు దాఖలైన నామినేషన్లు 724 -
పల్లెపోరుపై హైఅలర్ట్
● నగదు.. మద్యం పంపిణీపై నిఘా ● అల్లర్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి ● శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు శాఖ చర్యలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు గద్వాల క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో ఎలాంటి అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. మొదటి విడతగా 106 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తి అయ్యింది. గద్వాల, కేటీదొడ్డి, ధరూర్, గట్టు మండలాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అభ్యర్థులు తదితర వివరాలపై ఇప్పటికే ఫ్లయింగ్ సర్వైలైన్ టీం(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలైన్స్(ఎస్ఎస్టీ) బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు మద్యం, నగదు, వస్తు సామగ్రి వంటివి అందించే వారిపై కేసులు నమోదుకు చర్యలు తీసుకుంది. సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు జిల్లా సరిహద్దులోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది చెక్పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి మండలానికి ప్రత్యేక బృందం ఎన్నికల నియమావళికి సంబంధించిన ఫిర్యాదులపై స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా ఉంచి సోదాలు చేస్తున్నారు. తహసీల్దార్ స్థాయి అధికారి, నలుగురు పోలీసులు, వీడియోగ్రాఫర్ సైతం విధుల్లో ఉంటున్నారు. స్టేషన్ పరిధిలోని సిబ్బంది, ప్రత్యేక బృందం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. పాత నేరస్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్ల వివరాలు సేకరిస్తున్నారు. గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని ముందుస్తుగా బైండోవర్ చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ప్రశాంత ఎన్నికలు నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. సామాజిక మాద్యమాల్లో అనుచిత వాఖ్యలు చేసినా, ఫార్వర్డ్ చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినా ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు చేపడుతున్నారు. ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు గద్వాల, కేటీదొడ్డి, ధరూర్, గట్టు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు ఎవరూ ఇబ్బంది పడకుండా కేంద్రాల వద్ద పట్టిష్ట భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎవరైన అల్లర్లు, దాడులు, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపిస్తే సహించేది లేదు. ప్రత్యేక బృందాలు నిత్యం తనిఖీలు చేపడుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా చర్యలు తప్పవు. పాత నేరస్తులను ముందుస్తుగా బైండోవర్ చేశాం. అత్యవసర సమయాల్లో డయల్ 100కు ఫోన్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. – శ్రీనివాసరావు, ఎస్పీ నగదు, వస్తు తరలింపుపై ఆంక్షలు ఎన్నికల నియమావళి మేరకు రూ.50 వేల కంటే అధికంగా నగదు, పెద్ద మొత్తంలో వస్తు సామగ్రి, మద్యం, చీరలు, ఇతర ఒకే రకమైన వస్తువులు తీసుకెళ్లినా ఆధారాలు చూపించాల్సిందే. లేని తరుణంలో అధికారులు వాటిని సీజ్ చేస్తారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో డయల్ 100కు సమాచారం అందించాల్సిందిగా పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి విడత నామినేషన్ల పర్వం పూర్తికాగా, రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి అయిన వెంటనే ప్రచారమే తరువాయి గట్టంగా మిగిలింది. -
ఎన్నికల నియమావళి ఉల్లంఘించొద్దు
గద్వాల/మల్దకల్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ నియమ, నిబంధనలను పాటించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం మల్దకల్, తాటికుంట నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈమేరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ వేసే అభ్యర్థుల వివరాలను టీపోల్ యాప్లో నమోదు చేయాలని, సాయంత్రం 5గంటల తర్వాత నామినేషన్లు వేసేందుకు వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, నిర్దేశిత సమయంలోగా కేంద్రం లోపల ఉన్న వారి నుంచే అధికారులు నామినేషన్లను స్వీకరించాలన్నారు. అదే విధంగా సర్పంచు, వార్డు స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల నుంచి అవసరమైన ధ్రువపత్రాలు తీసుకుని విధిగా దరఖాస్తులను జతపరచాలని, డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులతో డిపాజిట్ తీసుకుని రశీదు ఇవ్వాలన్నారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని సూచించారు. అభ్యర్థుల నుంచి సంబంధిత గ్రామ పంచాయతీకి చెల్లించే ఇంటి పన్నులు పెండింగ్ లేకుండా కట్టించుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఇతర అంశాలపై ముద్రించిన పత్రాలను నామినేషన్లు వేసిన వారికి అందజేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంఈఓ సురేష్, అధికారులు తదితరులు ఉన్నారు. పకడ్బందీగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల ఎన్నికల పరిశీలకులు గంగాధర్, అదనపు ఎస్పీ శంకర్, డీపీవో శ్రీకాంత్, డిప్యూటీ సీఈవో నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. -
వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా
ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం ● దేశంలోనే పాలమూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ● ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు ● మక్తల్, అత్మకూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నారాయణపేట: ‘పాలమూరు జిల్లాకు వేలకోట్ల నిధులు ఇస్తున్నాం. వడ్డించేది నేనే. ఎన్ని నిధులైనా ఇస్తా. పాలమూరు పచ్చబడాలే. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పదేళ్లలో పాలమూరును వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం.’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లో ఏర్పాటు చేసిన తొలి బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చేరుకున్న సీఎంకు అక్కడ భారీ స్వాగతం పలికారు. పీజేపీ క్యాంపు వద్ద ఆత్మకూరు పురపాలికలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మధ్యా హ్నం 3 గంటలకు హెలికాప్టర్లో మక్తల్కు బయల్దేరారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహతో కలిసి మక్తల్లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ. 1,038 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు. సంక్షేమానికి పెద్దపీట.. ‘రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా ఇంటింటికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. మహిళలకు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేశాం. వచ్చిన పైసలు కరెంట్ బిల్లుకు సరిపోయేదని, దానిని దృష్టిలో పెట్టుకొని ఉచిత కరెంట్ అందిస్తున్నాం. నారాయణపేట మహిళలకు పెట్రోల్ బంక్ మంజూరు చేశాం. మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు 25.35 లక్షల రైతులకు రూ.21,653 కోట్ల రుణమాఫీ చేశాం. ఏడాదికి రూ.12 వేల రైతు భరోసాను వేశాం. 1.04 కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించడానికి నిరంతరం పని చేస్తున్నాం.’ ముఖ్యమంత్రి అన్నారు. సాగుతో పాటు విద్యారంగానికి ప్రాధాన్యత ‘సాగుతో పాటు విద్యారంగానికి కూడా ప్రాధాన్యత కింద తీసుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తించాం. ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మించుకుంటున్నాం. రూ.220 కోట్లతో రెసిడెన్షియల్ పనులు చేపడుతున్నాం. పార్టీలు, జెండాలు, ఏజెండా చూసుకోకుండా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను మంజూరు చేశాం. జడ్చర్ల–దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఐఐఐటీని ప్రారంభించుకున్నాం. పీయూలో లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేసుకున్నాం.’ అని సీఎం పేర్కొన్నారు. మీ ఆశీర్వాదంతోనే సీఎం అయ్యాను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలను మొదటగా మక్తల్లోనే నిర్వహించాలని మంత్రి వర్గ సహచరులు నిర్ణయించారని సీఎం పేర్కొన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అడగడంతో మక్తల్ నుంచే ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లు ‘కౌన్ పూచేగా మక్తల్ అని పాత నానుడిని కాదని.. సబ్ కుచ్ పూచేగా, సబ్ కుచ్ ఆయేగా మక్తల్’ అని ఇక్కడ విజయోత్సవం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిందని.. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి తనకు అండగా నిలబడ్డారని, పార్టీ, ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణకు రెండో సీఎం అయ్యానన్నారు. ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి సీఎంగా బూర్గుల రామకృష్ణారావు కాగా.. 75 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా మీ బిడ్డ సీఎం అయి మీ ముందు నిలబడ్డానన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి ‘మంచోడు సర్పంచు అయితే ఊరు బాగుపడుతది. ముంచేటోడికి ఓటు వేస్తే ఊరు పాడవుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే మద్దతుదారులకు ఓటర్లు పట్టం కట్టాలి. మంచి వాళ్లను ఎన్నుకోవాలి. నీళ్లు, నిధులు ఇచ్చే వారికి ఓట్లు వేయాలి. ఎమ్మెల్యే, మంత్రుల వద్దకు వెళ్లి అభివృద్ధి పనులు మంజూరు చేసుకునే నాయకులను సర్పంచులుగా గెలిపించుకోవాలి. నిధులు, నీళ్లు, రైతుల పంటకు బోనస్ ఇచ్చే బాధ్యత నాది. మీరందరూ మళ్లీ ఆశీర్వదించాలి. పదేళ్లలో పాలమూరును వందేళ్లకు సరిపడే విధంగా అభివృద్ధి చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడితే ఢిల్లీకి వినిపించాలి. సీటీలు కొడితే పాలమూరు జిల్లా ఏకమైందని.. ఢిల్లీలో ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలె.’ అని సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, అనిరుధ్రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, మేఘారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఒబేదుల్లా కొత్వాల్, సీతా దయాకర్రెడ్డి, శివసేనారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్లు స్వర్ణసుధాకర్రెడ్డి, సరిత, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్కుమార్రెడ్డి, రాజీవ్రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, బీకేఆర్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
గద్వాలటౌన్: అన్ని రంగాలలో ఉన్న కార్మికులు చేసే ఐక్య, సమరశీల పోరాటాల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. సోమవారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన సీఐటీయూ ముగింపు మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వలన శ్రమ దోపిడీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల ఆదాయం పెంచే చర్యలు ఏమాత్రం చేయడం లేదని విమర్శించారు. విధానాలను అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కు పెద్ద తేడా లేదన్నారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలపై ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకటస్వామి, పరంజ్యోతి, దేవదాసు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా ఉప్పేర్ నర్సింహ, ప్ర ధాన కార్యదర్శిగా వీవీ నర్సింహ, కోశాధికారిగా గట్ట న్న, ఉపాధ్యక్షులుగా ఏమేలమ్మ, వెంకటేశ్వర్లు, ఈశ్వ ర్ సహాయ కార్యదర్శులుగా సునీత, తిమ్మప్ప, రామకృష్ణతో పాటు 13 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం పలు తీర్మాణాలు చేశా రు. జిల్లాలో ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యూలర్ చేయాలని తదితర తీర్మాణాలను ప్రకటించారు. -
ఆ జీపీలు ఏకగ్రీవమే..!
14 గ్రామాల్లో సర్పంచ్లు, వార్డులకు ఒక్కో నామినేషన్ అక్కడక్కడ ‘కండువా’ లొల్లి..! ప్రస్తుతం ఏకగ్రీవం దిశగా అడుగులు వేసిన జీపీల్లో సర్పంచ్లు, వార్డుసభ్యులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతు దారులేనని తెలుస్తోంది. అయితే చాలాచోట్ల గ్రామాల పెద్దలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని ఏకగ్రీవం దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలో అక్కడక్కడ ‘కండువాల’ లొల్లి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం లక్ష్మీదేవిపల్లిలో సర్పంచ్గా బంగారయ్య శనివారం ఒక్కరే నామినేషన్ వేయగా.. ఆయన వద్దకు పలువురు కాంగ్రెస్ నాయకులు వెళ్లి పార్టీ కండువా కప్పారు. ఆ తర్వాత ఆదివారం బీఆర్ఎస్ నేతలు వెళ్లి గులాబీ కండువా వేశారు. ఈ సందర్భంగా బంగారయ్య మాట్లాడుతూ ఊరంతా ఏకమై తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేశారని, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పారు. టీడీపీ.. కాంగ్రెస్ అంటూ.. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లిలో సర్పంచ్గా టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బుడ్డోళ్ల శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ ఎనిమిది వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవ పంచాయతీ లాంచనమే. ఎనిమిదో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ మద్దతుదారు శ్రీనివాస్ను ఉప సర్పంచ్గా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేశారు. పలు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ.. కాంగ్రెస్, జై తెలుగుదేశం.. జై తెలంగాణ అంటూ పోస్టులు దర్శనమివ్వడం గమనార్హం.సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో మొదటి దశలో 550 జీపీల సర్పంచ్లు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేశాయి. ఆయా ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది. మరోవైపు పలు జీపీల్లోని అన్ని వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పునే నామినేషన్లు వేయగా.. సర్పంచ్లుగా మాత్రం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. వారు ఉపసంహరించుకునేలా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల 0 మహబూబ్నగర్ 2 (అంచన్పల్లి, కాకర్జాల్) ఇప్పటి వరకు ఏకగ్రీవమైన జీపీలు ఇవే.. నారాయణపేట 5 (అప్పాయపల్లి, పెద్దతండా, పర్సాపూర్, అప్పిరెడ్డిపల్లి, దామలతండా) వనపర్తి 2 (నాగుల కుంటతండా, లక్ష్మీదేవిపల్లి) పలు జీపీల్లో వార్డుల్లోనేమో సింగిల్.. సర్పంచ్కు పోటాపోటీ కొన్నిచోట్ల సీన్ రివర్స్.. ఆయా చోట్ల పెద్దల రాజీ యత్నాలు ఉపసంహరణ నాటికి కొలిక్కి వచ్చే అవకాశం -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి స్వీకరించే నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. రెండో విడత ఎన్నికలలో భాగంగా ఆదివారం మల్దకల్ మండలంలోని మల్దకల్ –1, మల్దకల్–2, పెద్దపల్లి, అమరవాయి క్లస్టర్ గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియతో పాటు ఆయా పంచాయతీలలో ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపర్చాల్సిన వయసు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ల డిపాజిట్ను స్వీకరించిన వెంటనే రషీదును అందజేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు ప్రతిపాదించే ఇద్దరినీ మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఉండే అన్ని అంశాలను అభ్యర్థులు కరెక్టుగా పూరించేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
నేటినుంచి నూతన మద్యం పాలసీ
● ఉమ్మడి జిల్లాలో 227దుకాణాలు ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు ● గుడ్విల్ ఇచ్చి కొన్నింటిని సొంతం చేసుకున్న వ్యాపారులు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మొత్తం 227 ఏ4 మద్యం దుకాణాలకు అక్టోబర్ 6 నుంచి 23 వరకు టెండర్లు నిర్వహించగా 5,536 దర ఖాస్తులు వచ్చాయి. దీంతో అక్టోబర్ 27న ఆయా జి ల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కలెక్టర్లు లక్కీడిప్ నిర్వహించి 227 మంది నూతన మద్యం లైసెన్స్దారుల ను ఎంపిక చేశారు. ఈ మేరకు కొత్తగా లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే పనుల్లో తలమునకలయ్యారు. ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్విల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్విల్తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్విల్ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్ కింగ్లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు దుకాణాలు (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 54 1,634 49.02 నాగర్కర్నూల్ 67 1,518 45.54 నారాయణపేట 36 853 25.59 జోగుళాంబ గద్వాల 34 774 23.22 వనపర్తి 36 757 22.71 ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. వారిదే పైచేయి.. గణనీయంగా అమ్మకాలు ప్రస్తుతం రెండేళ్లు ఉండే నూతన మద్యం వ్యాపారులకు స్థానిక పంచాయతీ ఎన్నికలతోపాటు రాబోయే పరిషత్, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు కలిసి రానున్నాయి. ఆయా ఎన్నికల్లో మద్యం అమ్మకాలు తారస్థాయిలో ఉంటాయి. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు బెల్ట్ దుకాణాలకు అధిక మోతాదులో లిక్కర్ సరఫరా కానుంది. దీంతో మండల కేంద్రాల్లో ఉన్న లిక్కర్ దుకాణాలతోపాటు పట్టణాల్లో సై తం గణనీయంగా అమ్మకాలు పెరగనున్నాయి. -
నేడు సీఎం రేవంత్రెడ్డి పర్యటన
● కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన ● 800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు నారాయణపేట/ మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మక్తల్లో పర్యటించనున్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయిన తర్వాత సీఎం మక్తల్కు రావడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రూ.558 కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జూరాల– కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై రూ.123 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో 25 ఎకరాల భూమిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు రూ.210 కోట్లతో మక్తల్– నారాయణపేట నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభించనున్నారు. అలాగే మక్తల్– పేట – కొడంగల్ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం చెక్కులను సీఎం చేతులమీదుగా అందించనున్నారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో సభావేదిక వద్ద ఏర్పాట్లను ఆదివారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్ఐలు మొత్తం 800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో వైభవంగా ధ్వజారోహణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, ప్రసన్నచారి, ధీరేంద్రదాసు, శశాంక్ ఆగమ పద్ధతిలో స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించి పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల కంటే ముందు ధ్వజారోహణంతో దేవతామూర్తులను ఆహ్వానించి బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతం కావాలని కోరినట్లు ఆలయ అఽర్చకులు తెలిపారు. అదే విధంగా సంతానం లేని మహిళలకు ధ్వజారోహణం రోజు అర్చకులు ప్రసాదాన్ని అందజేశారు. యేటా ధ్వజారోహణం రోజున వివిధ ప్రాంతాల నుంచి సంతానం కానీ మహిళలు ఆలయానికి పెద్దసంఖ్యలో చేరుకుని స్వామి వారి ప్రసాదం పొందడం భక్తుల నమ్మకం. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, మండల నాయకులు మధుసూదన్రెడ్డి, సీతారామిరెడ్డి, న రేందర్, వాల్మీకీ పూజారులు పాల్గొన్నారు. -
పట్టుదలతోనే విజయం
గద్వాలటౌన్: కృషితో పాటు పట్టుదల ఉంటే విజయాలు సాధ్యపడుతాయని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బీబీఆర్ ప్రీమియర్ లీగ్ సీజన్–3 క్రికెట్ టోర్నీ ఆదివారం ఉత్సాహంగా సాగింది. రింగ్రోడ్డు సమీపంలోని క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించినపుడే వారు ఆ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరగల్గుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. రానున్న కాలంలో క్రీడారంగం ప్రముఖంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాబర్, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, నరహరి శ్రీనివాసులు, దివాకర్రెడ్డి, అన్వర్, మౌలానా పాల్గొన్నారు. -
పల్లె నుంచేప్రస్థానం..
గ్రామ తొలి పౌరుడిగా రాజకీయ అరంగేట్రం.. ● జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజా సేవలో.. ● తమదైన ముద్ర వేసుకున్న ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డలు సర్పంచ్.. రాజకీయ అరంగేట్రానికి తొలిమెట్టు. ఎందరెందరో పల్లె పెద్దగా తొలి అడుగు వేసి.. క్రమక్రమంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజాసేవలో తమదైన ముద్ర వేసుకున్నారు. గ్రామ మొదటి పౌరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులను అధిరోహించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలపై ‘సాక్షి’ సండే స్పెషల్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఎల్లారెడ్డి వార్డు సభ్యుడి నుంచి మంత్రి.. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ గ్రామానికి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డి 1965లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1971లో సర్పంచ్గా, 1982లో సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో శాసన సభ్యుడిగా ఎన్నికై 1997లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2014లో మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. నారాయణపేట జిల్లా మక్తల్ మేజర్గ్రామ పంచాయతీకి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి 2001లో సర్పంచ్గా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో మక్తల్ జెడ్పీటీసీగా..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ ఫ్లోర్లీడర్గా ఎన్నికయ్యారు. 2022లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనతి కాలంలోనే రాష్ట్ర కేబినెట్లో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కింది. ప్రస్తుతం వాకిటి రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య సహకార, పాడి పరిశ్రమలు, క్రీడలు, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఎన్ గౌడ్: సర్పంచ్.. ఎమ్మెల్యే.. జెడ్పీచైర్మన్ నాగర్కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన వంగా నారాయణగౌడ్ అలియాస్ వీఎన్ గౌడ్ 1953లో గ్రామసర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1954లో నాగర్కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా.. 1956 నుంచి 1967 వరకు బిజినేపల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 1972 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా.. 1981లో జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వాకిటి: సర్పంచ్.. జెడ్పీ ఫ్లోర్ లీడర్.. మంత్రి -
దివ్యాంగులను ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు
గద్వాలటౌన్: క్రీడల్లో రాణించడం ద్వారా దివ్యాంగ ప్రతిభావంతులు.. సకలాంగులకు ఏమాత్రం తీసిపోరని నిరూపించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. శనివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలను అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులలో దాగివున్న క్రీడా నైపుణ్యాలను, సృజనాత్మకతను వెలికితీసి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని సూచించారు. డీఎస్పీ మొగిలయ్య మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, దాన్ని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఇటీవల అంధుల టీ20 క్రికెట్ ప్రపంచకప్ సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి ఏడాది దివ్యాంగుల కోసం పోటీలను నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అనంతరం అంధుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోని ప్రత్యేక అవసరాల భవిత కేంద్రం విద్యార్థులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు డిసెంబర్ 3వ తేదీన కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేస్తామని చెప్పారు. పరుగుపందెం, చెస్, క్యారమ్స్, షాట్ఫుట్, జావలిన్త్రో తదితర పోటీలలో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద, డీవైఎస్ఓ కృష్ణయ్య, డీఎంహెచ్ఓ సంధ్యకిరణ్మయి, డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వేలమా.. తూచ్!
గద్వాలటౌన్: ‘సర్పంచు పదవికి వేలమా..? అబ్బే అలాంటిదేమీ లేదు సార్.. మా గ్రామంలో మేము సర్పంచు పదవి కోసం ఎలాంటి వేలాన్ని వేసుకోలేదు. ఇదంతా కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ఇస్తున్న తప్పుడు సమాచారమే తప్ప మరేమీ లేదు..’ అంటూ ఏకగ్రీవమైన గ్రామాల్లో కొంతమంది మాత్రమే వచ్చి విచారణ అధికారుల ఎదుట ముందస్తుగా అనుకున్న ప్రకారమే చెప్పడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు పదవులను వేలం వేసిన గ్రామాల్లో శనివారం ఎన్నికల పరిశీలకులతో పాటు ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎస్ఐలు పర్యటించారు. గద్వాల, గట్టు, కేటీదొడ్డి, ధరూర్ మండలంలోని కొండపల్లి, వీరాపురం, కుర్వపల్లి, మిట్టదొడ్డి, గోర్లఖాన్దొడ్డి, రంగాపురం, చింతలకుంట, ఉమిత్యాలతండా తదితర గ్రామాల్లో విచారణ నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో ముందస్తుగా అనుకున్న ప్రకారం సర్పంచు ఎన్నికలకు భార్యాభర్తల చేతనే నామినేషన్లను వేయించారు. మరికొన్ని గ్రామాల్లో కూడా వేలంపాడిన వారికి సర్పంచు పదవి దక్కే విధంగా వారిచేత సింగిల్ నామినేషన్లు వేయించారు. ఇతరులు ఎవరూ నామినేషన్ వేయరాదని, గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులు హుకూం జారీ చేశారు. ఈ విషయంలో గ్రామస్తులపై కొంతమంది గ్రామ పెద్దలు సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆయా పంచాయతీలకు కేవలం ముందుగా అనుకున్న ప్రకారంగా వేలంపాడిన తాలూకు వారు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. వేలంపాటల గురించి వరసగా రెండు రోజులు ‘సాక్షి’లో ‘అమ్మకానికి సర్పంచ్లు’, ‘హెచ్చరికలు బేఖాతర్..’ శీర్షికలతో కథనాలు ప్రచురితం అయ్యాయి. జిల్లాలోని తొలిదశ ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో వేలంపాట ద్వారా ఏకగ్రీవం కానున్న పంచాయతీలపై ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. సర్పంచ్ పదవుల వేలంపై అధికారుల విచారణ నిజమని తేలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడిన గ్రామ పెద్దలు వేలం జరగలేదంటూ అధికారులను నమ్మించే ప్రయత్నం స్పందించిన అధికార యంత్రాంగం.. విచారణ పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. అందులో భాగంగా ఆయా గ్రామాల వారీగా విచారణ చేపట్టారు. ఎన్నికల పరిశీలకులతో పాటు మరికొంతమంది అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి వేలం వ్యవహారంపై విచారణ నిర్వహించారు. అయితే జిల్లా అధికారులు వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉండటంతో పలువురు గ్రామ పెద్దలు పథకం ప్రకారం గ్రామస్తులను సిద్ధం చేశారు. దీంతో కొంతమందిని మాత్రమే అధికారుల ముందు పెట్టి వేలం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. గ్రామాల్లో వేలంపాట జరగలేదంటూ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. అధికారులు కూడా వేలంపాట జరిగిందా లేదా అన్నదానిపై అందుబాటులో ఉన్న గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందస్తుగా మాట్లాడుకున్న విధంగా గ్రామస్తులెవరూ కూడా విచారణ అధికారుల ఎదుట వేలంపాటపై నోరు విప్పలేదు. దీంతో అధికారులు చేసేదేమీ లేక పంచనామా నిర్వహించారు. అయితే అధికారులపై కూడా రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వేలం ప్రక్రియ గురించి అధికార యంత్రాంగం వారికి తెలియకపోవడం శోచనీయం. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలలో ఏకాభిప్రాయం ముసుగులో వేలంపాట నిర్వహించడం సరైనది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలు అంగట్లో వస్తువుల్లా అమ్ముడుపోయిన విషయం వాస్తవమని ఆయా గ్రామాల్లోని పలువురు నాయకులు పెదవి విరవడం విశేషం. అవగాహన కల్పిస్తున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయా పదవులను వేలం పాటతో ఏకగ్రీవాలను నిరోధించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వేలం ద్వారా సర్పంచు పదవులు పొందడం చట్టరీత్యా నేరం. ఎన్నికల పరిశీలకులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎస్ఐలు గ్రామాల్లో పర్యటించి అనైతిక ఏకగ్రీవాలను నిరోధిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆరోపణలు వచ్చిన గ్రామాలలో అధికారుల బృందం పర్యటించి, గ్రామస్తుల నుంచి వివరాలను సేకరించండం జరిగిందన్నారు. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ఏర్పాటు
గద్వాలటౌన్: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అన్న నినాదంతో ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్ష తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందని.. ఆ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు దీక్షా దివస్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు, రైతుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పారు. ఉద్యమ నేతగా కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. అబద్దాలు, మాయమాటలు చెప్పి రేవంత్రెడ్డి గద్దెనెక్కిండని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, హనుమంతునాయుడు, వెంకట్రాములు, శ్యామల,పద్మ, బస్వరాజ్, మోనేష్,రాజారెడ్డి, యూ సూఫ్, రంగారెడ్డి, జనార్థన్రెడ్డి పాల్గొన్నారు. -
ఎన్నికల విధులు నిబద్ధతతో నిర్వహి ంచాలి
గద్వాలన్యూటౌన్: పంచాయతీ ఎన్నికల్లో రెండోదశలో స్టేజ్–2 అధికారుల పాత్ర కీలకమైనదని, వారు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఐడీఓసీ హాల్లో నిర్వహించిన రిటర్నింగ్ అధికారుల (స్టేజ్–2) శిక్షణ శిబిరంలో నోడల్ అధికారి రమేష్బాబుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కఠినంగా అమలు చేయాలని చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో భద్రతాచర్యలు, ఇతర ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉండాలన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభించి.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించాలని, ఆ తర్వాత క్యూలో నిల్చున్న ఓటర్లను మాత్రమే అనుమతించాలన్నారు. పీఓలు ఫాం –25, బ్యాలెట్ పేపర్ అకౌంట్, డైరీ తదితర చట్టపరమైన పత్రాలను ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద ప్రచారం లాంటి సంఘటనలు జరిగిన పోలీసులకు తెలియజేయాలన్నారు. అదేరోజు కౌంటింగ్.. మధ్యాహ్నం 2గంటలకు పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత వార్డు మెంబర్ బ్యాలెట్ పేపర్లను వేరు చేసి లెక్కించాలన్నారు. వార్డు మెంబర్ల కౌటింగ్ పూర్తి అయ్యాక సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను డ్రమ్లో కలిపి అభ్యర్థులు వారీగా లెక్కించాలని సూచించారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలన్నారు. ఎన్నికల ఖర్చులు 45రోజుల్లో సమర్పించాలన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
గద్వాల క్రైం: నామినేషన్ల ప్రక్రియ పారదర్శకమైన వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం గద్వాల మండలం పరుమాల గ్రామంలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎవరు ఇబ్బందులు కలిగించినా వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామంలో నిఘా బృందం, క్విక్ రెస్పాన్స్ బృందం, పెట్రోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి అనుమానిత వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. ఎస్పీ వెంట రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు. -
నామినేషన్లలో డిక్లరేషన్ తప్పనిసరి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. శుక్రవారం గద్వాల మండలం శెట్టిఆత్మకూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆత్మకూర్, గోనుపాడు, సంగాల, మదనపల్లి, ఈడిగోనిపల్లి పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను ప్రక్రియ, ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఎన్నికల ఖర్చుల లెక్కల నిర్వహణపై అభ్యర్థి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ ఫారాలపై అన్ని అంశాలను తప్పనిసరిగా రాసేలా అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వారి వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. హెల్ప్ డెస్కు వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కలెక్టర్ తగు సూచనలు చేశారు. నామినేషన్ల డిపాజిట్ను స్వీకరించిన వెంటనే రషీదు అందజేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు ప్రతిపాదించే ఇద్దరినీ మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు. సాయంత్రం అయిదు గంటలలోపు నామినేషన్ వేసేందుకు కేంద్రంలోకి వచ్చిన అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల జనరల్ పరిశీలకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి పక్కాగా అమలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి స్వీకరించే నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. శుక్రవారం గద్వాల మండలం పరుమాల కేంద్రంలోని ఆయా గ్రామాల నామినేషన్ల ప్రక్రియతో పాటు ఆయా పంచాయతీలలో ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపర్చాల్సిన వయసు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియామళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
ఎర్రవల్లి: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషిచేయాలని ఎస్ఎస్ఎ రాష్ట్ర పరిశీలకులు మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొండేరు ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్ఎస్, ఎల్ఈపి, ఎఎక్స్ఎల్ సంబంధిత కార్యక్రమాలను పరిశీలించి వాటి అమలు, పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను, అక్షరమాల, వివిద పరీక్షల ఫలితాలను పరిశీలించారు. ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి అంపయ్య, ఎంఈఓ అమీర్ఫాష, హెచ్ఎం పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఏకగ్రీవాలు గద్వాలటౌన్: జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకగ్రీవ ఎన్నికల వల్ల కులం, డబ్బు ప్రాతిపదికన పెత్తందారులకు, ధనవంతులకు మాత్రమే రాజకీయ అవకాశం ఉంటుందన్నారు. రూ.లక్షలు పెట్టి ఏకగ్రీవాలు చేసుకుంటున్న అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి ఏం కృషిచేస్తారని ప్రశ్నించారు. ఏకగ్రీవ ఎన్నికల ద్వారా ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటు వేసే హక్కును, ఎన్నికలలో పోటీచేసే హక్కు, నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే హక్కును కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షలు పెట్టిన అభ్యర్థులు గ్రామ సమస్యలపై కృషి చేయకపోగా, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. గతంలో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరాలను ప్రకటించలేదనే విషయాలను గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు రాజు, వీవీ నర్సింహా, ఉప్పేర్ నర్సింహా, సవారన్న పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,509 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 185 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్ట ధర రూ.7509, కనిష్టం రూ. 4349, సరాసరి రూ. 6869 ధరలు లభించాయి. అలాగే, 9 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.5859, కనిష్టం రూ.5536, సరాసరి రూ.5759 ధరలు పలికాయి. 1477 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2701, కనిష్టం రూ. 1786 ధరలు వచ్చాయి. -
విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
గద్వాలటౌన్: ప్రతి విద్యార్థి బాల్య దశ నుంచే శాసీ్త్రయ దృక్పథం, పరిశీలన అలవర్చుకొని శాస్త్రరంగంలో రాణించాలని రాష్ట్ర ఎసీఈఆర్టీ ప్రతినిధి మధుసూదన్రెడ్డి సూచించారు. జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెకుముకి పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక బాలభవన్లో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవస్థీకృతమైన ప్రాంతాల్లో జ్ఞానాన్ని ప్రసాదించేది విజ్ఞాన శాస్త్రమని వివరించారు. మన జీవన విధానం, అభివృద్ధి, సైన్స్తో ముడిపడి ఉందని చెప్పారు. శాసీ్త్రయంగా ఆలోచించే ప్రతి వ్యక్తి శాస్త్రవేత్తే అని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞాన శాస్త్రంపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులలో శాసీ్త్రయ నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. శాస్త్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. అధ్యయనంతోనే అభివృద్ధి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జిల్లాస్థాయి చెకిముకి సైన్స్ పోటీలలో ప్రభుత్వ పాఠశాలల తెలుగు మీడియం విభాగంలో అలంపూర్ న్యూప్లాట్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లీష్ మీడియం విభాగంలో ధరూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలు, ఇంగ్లీష్ మీడియం విభాగంలో అలంపూర్ మాంటీస్సోరి స్కూల్ విద్యార్థులు, రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో వీరాపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వీరికి విద్యాధికారులు మెమోంటోతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టులో ప్రతిభ చాటిన ఈ నాలుగు పాఠశాలల విద్యార్థులు వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, డాక్టర్ మోహన్రావు, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్పాపన్న, జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుషిరాజు, పరంజ్యోతి, కన్వీనర్ ఎల్లాస్వామి, కోశాధికారి భీసన్న తదితరులు పాల్గొన్నారు. -
కాంగిరేసులో రెబెల్స్!
సర్పంచ్ పదవికి ‘హస్తం’లో ఫుల్ గిరాకీ ● తొలి విడతకు సంబంధించి పోటాపోటీగా నామినేషన్లు ● పలు జీపీల్లో ఇప్పటివరకు ఇద్దరు నుంచి ఏడుగురి వరకు దాఖలు ● నేటితో ముగియనున్న గడువు.. పోటీదారులు మరింత పెరిగే అవకాశం ● వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో జటిలంగా మారిన వర్గ పోరు ● రాజుకుంటున్న పాత, కొత్త పంచాయితీ.. తలపట్టుకుంటున్న ముఖ్య నేతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. పార్టీ గుర్తులతో జరిగేవి కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. అయితే పలు గ్రామ పంచాయతీల్లో రెబల్స్ బెడద అధికార పార్టీ కాంగ్రెస్ను వేధిస్తోంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం రెండోరోజుకు చేరుకోగా.. ఒక్క చోట సర్పంచ్ పదవికి ఇద్దరు నుంచి ఎనిమిది మంది వరకు ‘హస్తం’ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు శనివారంతో ముగియనుండగా.. ఆయా ప్రాంతాల్లో పోటీదారులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో గుబులు నెలకొన్నట్లు తెలుస్తోంది. మారిన అధికారం.. ఉప ఎన్నిక గెలుపుతో.. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే (కొల్లాపూర్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేని కలుపుకొని) ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక జీపీలను కై వసం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పరిస్థితుల ప్రభావంతో చాలా ఏళ్లుగా గ్రామస్థాయిలో పదవులకు దూరంగా ఉండి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ బరిలో నిలిచేందుకు వెనుకాడేది లేదని సంకేతాలిస్తూనే.. నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బుజ్జగింపులు.. బేరసారాలు కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గ్రామ పంచాయతీల వారీగా కసరత్తు చేశారు. ఈ క్రమంలో పలు జీపీల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవంపై దృష్టి పెట్టి.. అందుకనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం. దీంతోపాటు ఆశావహుల చరిష్మా, గ్రామానికి, పార్టీకి చేసిన సేవలతో పాటు ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపొందే అభ్యర్థుల చిట్టా తయారు చేసినట్లు వినికిడి. అయితే పలు జీపీల్లో అనుకున్నదాని కంటే పార్టీ ఆశావహులు పోటీపడుతుండడం నేతలకు తలనొప్పిగా మారింది. ఏదేమైనా రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా.. ఆయా గ్రామాల్లో రాజుకుంటున్న కొత్త, పాత పంచాయితీతో నష్టం వాటిల్లకుండా తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎక్కువ ఉన్న పలు గ్రామాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇప్పటికే బుజ్జగింపులతో పాటు బేరసారాలు నడుస్తున్నట్ల్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
హెచ్చరికలు బేఖాతర్
గద్వాలటౌన్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు వేలం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన హెచ్చరికలను జిల్లాలో పట్టించుకోవడం లేదు. జిల్లాలో పంచాయతీలకు జరుగుతున్న వేలం ప్రక్రియను చూస్తే ఎన్నికల సంఘానికే సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల సంఘం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రెండవ రోజు సైతం పలు గ్రామాలలో వేలం ప్రక్రియ నిర్వహించారు. గ్రామాభివృద్ధి అంటూ స్థానిక పెద్దలే ముందుండి ఈ తంతు కొనసాగించారు. రూ.20 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వేలంవేసి సర్పంచు పదవులను కొనుగోలు చేశారు. ఈ తతంగం జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసినా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రెండో విడతలోనూ... రెండో విడత ఎన్నికలు జరిగే మల్దకల్, అయిజ మండలాల్లో సైతం వేలం ద్వారా సర్పంచు స్థానాలను కై వసం చేసుకున్నారు. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వు అయింది. ఇక్కడ ఏకంగా రూ.42 లక్షల వ్యయంతో శ్మశానవాటిక నిర్మాణానికి వేలం ద్వారా ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ ఆ డబ్బును ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. మగ్గంపేట, బిజ్వారం, పెదొడ్డి గ్రామాలలో సైతం ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయిజ మండలం కుర్వపల్లి సర్పంచ్ పదవిని రూ. 7.50లక్షలకు వేలంలో పాటపాడి కై వసం చేసుకున్నారు. కిష్టాపురం గ్రామ పంచాయతీ పదవికి జరిగిన వేలంలో కాటన్ వ్యాపారి పాల్గొని రూ.10.35 లక్షలకు సర్పంచ్ స్థానాన్ని పొందారు. యాపదిన్నె గ్రామంలో ఏకగ్రీవ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఏకగ్రీవాల సంఖ్య శనివారం నాటికి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది. సర్పంచ్ పదవులకు రెండో రోజు కొనసాగిన వేలం రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్న అభ్యర్థులు అపహాస్యమవుతున్న పంచాయతీ ఎన్నికలు చోద్యం చూస్తున్న అధికారులు -
సర్పంచ్ 441.. వార్డులు 174
● తొలి దశ జీపీ ఎన్నికల్లో తొలిరోజు దాఖలైన నామినేషన్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/జెడ్పీసెంటర్/ గద్వాలటౌన్: ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో తొలి దశలో 550 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి దశలో జరిగే ఎన్నికలకు సంబంధించి 550 సర్పంచ్ స్థానాలు ఉండగా.. తొలి రోజు 441 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా 4,840 వార్డు స్థానాలు ఉండగా... 174 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. జోగుళాంబ గద్వాలలో 68 నామినేషన్లు ● జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచు, వార్డు సభ్యులకు జరుగుతున్న మొ దటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. గురువారం ఆయా కేంద్రాల వద్ద అధికారులు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. జిల్లాలో గద్వాల, ధరూర్, కేటిదొడ్డి, గట్టు మండలాల పరిఽధిలోని గ్రామ పంచాయతీలు, వా ర్డు సభ్యులకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొత్తం 106 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకుగాను 68 నా మినేషన్లు దాఖలయ్యా యి. 974 వార్డు సభ్యులకుగాను 13 నామినేషన్లు దాఖలయ్యాయి. పలు కేంద్రాలలోని నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
గద్వాల క్రైం: గద్వాల – అలంపూర్ సెగ్మెంట్ పరిధిలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈమేరకు ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, అక్రమంగా మద్యం, నగదు, వస్తు, సామగ్రి తరలింపు విషయంలో చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఫంక్షన్హాల్స్, గెస్ట్హౌస్లు, కమ్యూనిటీ హాల్స్, లాడ్జ్ల్లో నిరంతరం సోదాలు చేయాలని, రాజకీయ కార్యక్రమాలపై నిఘా ఉంచాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వాఖ్యలు, గొడవలకు కారణమయ్యే పోస్టు లు చేసిన వారిపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలన్నారు. గత ఎన్నికల సమయంలో నమోదైన కేసులు, రౌడీషీటర్లు, అనుమా నిత వ్యక్తులను బైండోవర్ చేయాలన్నారు. నామినేషన్ కేంద్రాల్లో పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది ఎవరైన అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు, ఎస్ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
అమ్మకానికి సర్పంచ్లు
● వేలంలో కొనుగోలు చేస్తున్న సర్పంచు అభ్యర్థులు ● అపహాస్యమవుతున్న పంచాయతీ ఎన్నికలు ● చోద్యం చూస్తున్న అధికారులు గద్వాలటౌన్: జిల్లాలోని తొలిదశ ఎన్నికలు జరిగే గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో సర్పంచు పదవి కాస్ట్లీగా మారింది. వేలం ద్వారా కొన్ని సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి, గుడి నిర్మాణాలు, శ్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వడం తదితర కారణాలపై ఏకగ్రీవాలు అయినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ● గద్వాల మండలం కొండపల్లి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వు అయింది. ఇక్కడ ఏకంగా రూ.60 లక్షల వ్యయంతో గుడి నిర్మాణానికి వేలం ద్వారా ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ ఆ డబ్బు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన వెంటనే కొంత డబ్బు చెల్లించి గుడి పనులు చేపట్టేలా ని ర్ణయం తీసుకున్నారు. ఈడిగోనిపల్లి గ్రామంలో సై తం వేలం పాట నిర్వహించారు. కొంతమంది నుంచి అభ్యంతరాలు రావడంతో వాయిదా పడింది. ● గట్టు మండలంలో గొర్లఖాన్దొడ్డి సర్పంచు స్థానం బీసీ జనరల్కు రిజర్వు అయ్యింది. ఏకంగా రూ.57లక్షలకు వేలంపాట పాడి సర్పంచు పదవిని కొనుగోలు చేశారు. అదేవిధంగా ముచ్చోనిపల్లి గ్రామ సర్పంచు స్థానం జనరల్కు రిజర్వు అయింది. ఇక్కడ రూ.14.90 లక్షలకు వేలం పాట పాడి సర్పంచు స్థానాన్ని కై వసం చేసుకున్నారు. అరగిద్ద గ్రామ సర్పంచు పదవికి సైతం వేలం నిర్వహించినట్లు సమాచారం. గ్రామ నాయకుడు ఒకరు రూ.35 లక్షల వరకు వేలం పాట పాడి సర్పంచ్ స్థానాన్ని కై వసం చేసుకోవడానికి యత్నించారు. చివరి నిమిషంలో మరో నాయకుడు అడ్డు తగిలారు. దీంతో వేలం శుక్రవానికి వాయిదా పడింది. అంతంపల్లి గ్రామ సర్పంచ్ స్థానం కోసం వేలం నిర్వహిస్తే.. రూ. 24 లక్షలకు పాటపాడారు. అయితే ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని వాపోయారు. దీంతో ఈ వేలం అర్ధాంతరంగా నిలిచిపోయింది. తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శుక్రవారం వేలం నిర్వహించనున్నట్లు తెలిసింది. ● కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామ సర్పంచ్ బీసీ జనరల్ స్థానానికి రిజర్వు అయ్యింది. గ్రామ సర్పంచ్గా ఓ వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. ప్రకటించిన తరువాత గెలుపు సంబరాలు సైతం నిర్వహించారు. రూ.38 లక్షలు గ్రామాభివృద్ధి కోసం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు తెలిసింది. ఉమిత్యాల తండాలో సైతం వేలం ద్వారా ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన ఒకరు రూ.12 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. సర్పంచ్ స్థానం ఇక్కడ కూడా ఏకగ్రీవం అయినట్లు సమాచారం. మరికొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ● టంకర @ రూ.కోటి మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని టంకర్ గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. గ్రామానికి చెందిన ఓ భూ స్వామి, ధాన్యం వ్యాపారి వేలం పాటలో రూ.కోటికి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేలా పెద్దలతో ఒప్పందం చేసుకున్నాడు. గ్రామంలో ఆంజనేయ ఆలయ నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించేలా.. ఆలయ కమిటీ పేరిట బ్యాంక్లో జమచేయాలని నిర్ణయించారు. నామినేషన్ వేసేటప్పుడు రూ.44 లక్షలు.. సర్పంచ్గా ధ్రువీకరణపత్రం అందుకున్న తర్వాత మిగిలిన రూ.56 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మహమ్మదాబాద్ మండలంలోని ఆముదాలగడ్డ తండాలో యువకులు గ్రామ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం అక్రమం. వేలం ద్వారా పదవులు పొందితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటును ఎదుర్కొంటారు. – రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హెచ్చరిక -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి స్వీకరించే నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. గురువారం గద్వాల మండలంలో చేపట్టిన పూడూ రు ఎర్రవల్లి, వేలచేర్వు, కొండపల్లి, రేపల్లె గ్రామాల నామినేషన్ల ప్రక్రియతో పాటు ఆయా పంచాయతీలలో ఉన్న ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించా రు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపర్చాల్సిన వయస్సు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకా రం స్వీకరించాలని ఆదేశించారు. నామినేషన్ల డిపాజిట్ను స్వీకరించిన వెంటనే రషీదు అందజేయాలని, నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు ప్రతిపాదించే ఇద్దరినీ మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఉండే అన్ని అంశాలను అభ్యర్థులు కరెక్టుగా పూరించేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన ని యామళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరా వు, జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం పాల్గొన్నారు. స్ట్రాంగ్రూం వద్ద పటిష్ట భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నా రు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదాంలలో ఈవీ ఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్రూంలను కలెక్టర్ ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా కలెక్టర్ ఈ తనిఖీ నిర్వహించారు. స్ట్రాంగ్రూంతో పాటు భద్రతా నిర్వహణ, రికార్డులు, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, సూపరింటెండెంట్ కరుణాకర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ సెంటర్ తనిఖీ.. ధరూరు: ధరూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నామినేషన్ స్వీకరణ సెంటర్ కలెక్టర్ బీఎం సంతోష్ సందర్శించారు. కార్యాలయంలో ఎన్నికల అధికారులతో, హెల్ప్ డెస్క్ సిబ్బందితో మాట్లాడా రు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే వారికి పూర్తి వివరాలు తెలియజేసి నామినేషన్లు స్వీకరించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, మండలంలోని పారుచర్లలోని నామినేషన్ సెంటర్ను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, ఆ దిశగా వ్యయ పరిశీలకులు తగు సూచనలు చేయాలని జిల్లా వ్యయ పరిశీలకులు రాజేష్ సూచించారు. గురువారం ఐడీఓసీ హాల్లో సర్పంచ్ ఎన్నికల వ్యయానికి సంబంధించి ఆయా మండలాల సహాయ వ్యయ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తాను నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ వరకు ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వివరాల ను ఖాతాలో నమోదు చేయాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు, అంతకుమించి జనాభా గల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి గరిష్టంగా రూ.2.50 లక్షలలోపు, వార్డు అభ్యర్థి రూ.50వేలలోపు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. 5వేల కంటే తక్కువ జనాభా గల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలలోపు, వార్డు అభ్యర్థి రూ.30 వేలలోపు ఖర్చు చేయాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్కు వ్యయానికి సంబంఽధించిన వివిధ అంశాలపై శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లను అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా.. గన్నీ బ్యాగుల కొరత, ఇతర కారణాలతో కొనుగోళ్లు ఆలస్యంగా షురూ చేశారు. గన్నీ బ్యాగు లు రావడంతో అధికారులు మొక్కజొన్న కొనుగోలు చేశారు. ఇప్పటికే ఉండవెళ్లి, మానవపాడు ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారు. దీంతో కేంద్రంలో నిల్వ చే సేందుకు స్థలం కరువైంది. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు బారులు తీరారు. ఇక్కడ క్వింటాకు మద్దతు ధర రూ.2400 ఇస్తున్నారు. మూడు రోజులు ధాన్యం తేవొద్దు మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, రైతులు సైతం ధాన్యం వేసుకోవడానికి కష్టంగా ఉందని ఈ నెల 28వ తేదీ మూడు రోజుల వరకు రైతులు ఎవరూ కేంద్రానికి ధాన్యం తీసుకురావడ్దని మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెన్న, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, కార్యదర్శి ఎల్లస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం తెచ్చే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, రైతులు సహకరించాలని వారు పేర్కొన్నారు. -
బాలికలకు స్వీయ రక్షణ ఎంతో అవసరం
ఎర్రవల్లి: బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ ఎంతో అవసరమని, విధిగా రక్షణ విధానాలు నేర్చుకోవాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సరస్వతీ పాఠశాలలో జిల్లా భరోసా కేంద్రం ఆధ్వర్యంలో డిజిటల్ హింసకు ముగింపు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వాటి వల్ల కలిగే అనార్థాలు, భవిష్యత్తులో జరిగే వివిద పరిణామాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. చదువు వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. చెడు వ్యసనాల భారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. అనంతరం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఉద్యమం – డిజిటల్ హింసకు ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో కలిసి డిఎస్పీ ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. రోసా కోఆర్డినేటర్ శివాని, సిబ్బంది స్రవంతి, శ్వేత, పాఠశాల యాజమాన్యం గోవర్దన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలి గద్వాలన్యూటౌన్: కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ)గద్వాల బ్రాంచ్ సెక్రటరీ బంగి రంగారావ్ డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఏఐఐఈఏ గద్వాల ఎల్ఐసీ బ్రాంచ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల భవిష్యత్లో స్థిరమైన ఉపాధి ఉండదని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిట్ ద్వారా ఎంతో నైపుణ్యం కల్గిన నిరుద్యోగులను పరిమిత కాలానికి ఉపయోగించుకునేలా ఉందని చెప్పారు. ఇప్పటికే కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో అప్రెంటీస్ పేరుతో తాత్కాలిక ఉద్యోగ నియమకాలు చేపట్టారని విమర్శించారు. ఈ లేబర్ కోడ్ల వల్ల అనేక సంఘటిత రంగాల్లో కూడా ఇలాంటి తాత్కాలిక నియామకాలు పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిద్వార సంఘటిత రంగాలన్నీ జవాబుదారీతనం లేకుండా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె నోటీసును 15రోజుల నుంచి 60రోజులకు పెంచి, సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కూడా కన్సలేటరీ, ఆర్బీ మీటింగ్లనే పేరుతో కాలయాపన చేస్తూ, కార్మికుల హక్కులపై ఏమాత్రం శ్రద్ద లేకుండా నిర్లక్ష్యం వహించేలా లేబర్కోడ్లు రూపొందించబడ్డాయని ఆరోపించారు. నాలుగులేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఐఈఏ బ్రాంచ్ అద్యక్షుడు నర్సింగ్, రాఘవేంద్ర, సూరజ్, శివశంకర్, ఉదయ్కుమార్, మనీష్, సుదర్శన్శెట్టి, శైలేష్, కృష్ణచైతన్య, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ ముప్పు
● అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు ● ఆస్పత్రుల్లో జలుబు, దగ్గు కేసులు రెట్టింపు ● పిల్లలు, వృద్ధులకు న్యూమోనియా ముప్పు ● అప్రమత్తం చేస్తున్న ఆరోగ్యశాఖ గద్వాల క్రైం: చలికాలం మొదలు కాగా.. ఇటీవల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. దీంతో జిల్లాలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూజ్వరం, ఆయాసంతో బాధపడుతున్న చిన్నారులు, వృద్ధులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రధానం అప్పుడే పుట్టిన శిశువులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై న్యూమోనియా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గడిచిన మూడేళ్లలో జిల్లాలో 1,127 న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స పొందినట్లు వైద్యుల రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. న్యూమోనియాతో సతమతం గాలిలోని వైరస్, బ్యాక్టీరియా ద్వారా న్యూమోనియా వ్యాధి భారిన పడతారు. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో ఎగవేత, పక్కటెముకలు ఎగరడం, నిస్సత్తువగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు న్యూమోనియా భారిన పడుతున్నారు. చలికాలంలో తుగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. ఐదేళ్లలోపు పిల్లలు, 65 సంవత్సరాలు దాటిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో న్యూమోనియా భారిన పడుతున్నారు. జనవరి నుంచి ప్రస్తుతం వరకు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో 426 మంది న్యూమోనియా భారిన పడి చికిత్స పొందారు. స్వీయ జాగ్రత్తలతో మేలు.. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతోంది. న్యూమోనియాతో బాధపడే వారిని త్వరగా సమీప ఆస్పత్రికి వెళ్లాలి. సాధ్యమైనంత వరకు మొదటి దశలో వ్యాధి ప్రాథమిక లక్షణాలను గుర్తించి చికిత్స అందిస్తే తీవ్రతను తగ్గించవచ్చు అని వైద్యులు, వైద్య సిబ్బంది జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత చలి కాలంలో చిన్నారులు, వృద్ధుల్లో శ్వాస సంబంధ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఉన్నా సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. ఈ సీజనల్ వ్యాధులతో బాధపడే వారు మందులు వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంది. -
పల్లె పోరు.. కసరత్తు జోరు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో పోరు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గ్రామాల వారీగా గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు. సర్పంచ్ ఆశావహ అభ్యర్థుల పూర్వపరాలు, బలాబలాలు, చరిష్మా, సేవలపై ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా.. అదే దూకుడును కొనసాగించేలా నాయకులు ముందస్తు ప్రణాళికతో పోరు బాట పట్టారు. ఇదేక్రమంలో ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం దిశగా నడవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్.. పంచాయతీ పోరులో విజయం సాధించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా బీజేపీ ముఖ్యులు పక్కా కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. ఎవరికి వారు వ్యూహాలు.. పంచాయతీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు వ్యూహాలకు పదునుబెట్టారు. తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ● ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, గృహజ్యోతి, పేదలకు సన్న బియ్యం, చీరలు, వడ్డీ లేని రుణాలు, సన్న రకాల ధాన్యానికి బోనస్ వంటి వివిధ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ● 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. యూరియా కొరతతోపాటు అరకొర రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ఉదహరిస్తూ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి తదితర అంశాలతో పాటు తమ హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరించేలా వ్యూహాలను అమలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ● కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. గ్రామాలకు అందుతున్న నిధుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అరాచకాలు తమకు కలిసి వస్తుందని.. ఈసారి సత్తా చాటుతామని ‘కమలం’ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
భారత రాజ్యాంగం.. ప్రజల మార్గదర్శక గ్రంథం
గద్వాలటౌన్: భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదని, అది ప్రతి పౌరుడి నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మార్గదర్శక గ్రంథమని అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్నాయక్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, మౌలిక కర్తవ్యాలు, సెక్షన్లు, వివిధ ఆర్టికల్స్ గురించి అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, బాలకార్మిక నిషేద చట్టం, బాల్య వివాహ నిరోధక చట్ట వంటి చట్టాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, దాని సాధించడం కోసం పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో రాజ్యాంత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు రాజేందర్, శ్రీనివాసులు, లక్ష్మణ్స్వామి, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ, ఎస్సై జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు హక్కులు తెలుసుకోవాలి గద్వాల క్రైం: రాజ్యాంగంలో అందించిన హక్కులను ప్రతి పౌరుడు తెలుసుకుని ముందుకెళ్లాలని, స్వాతంత్య్రం పొందిన తర్వాత రాజ్యాంగ రూపకల్పనకు బీఆర్ అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎందరో మహాత్ముల త్యాగ ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని, అన్ని వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం రచించారన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడాలి ఎర్రవల్లి: ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించి విలువలను కాపాడాలని బీచుపల్లి పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పాణి అన్నారు. బుధవారం బీచుపల్లి పదో బెటాలియన్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకత్వం వహించే ప్రామానిక పాలనా పత్రం అని, ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజల హక్కులను గౌరవిస్తూ నిజాయితీగా విధులు నిర్వర్తించాల్సిన బాధత ఉందని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. మనకు రాజ్యాంగాన్ని అందించడంలో కీలకపాత్రను పోషించారన్నారు. దేశ ప్రజలు కుల, మతాలకు అతీతంగా స్వేచ్చగా జీవించడానికి ముఖ్యమైన ఆధారం రాజ్యాంగమేనని ఆయన అన్నారు. అనంతరం పటాలం అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యంగంలోని ప్రియంబుల్ (పఠిక)ను పఠించి ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో ఆర్ఐలు ధర్మారావు, రాజేశం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాలి
గద్వాలటౌన్: స్థానిక సంస్థల ఎన్నికలలో నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియామవళిని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో ఎన్నికల విధులకు సంబంధించి మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికలలో ఆయా మండలాల తహసీల్దార్లు.. ఎంపీడీఓలకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, షెడ్యూల్ ప్రకారం నామినేషన్లను తీసుకోవాలని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ చేపట్టరాదన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది లేదని, ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ● ఇదిలాఉండగా, మాస్టర్ ట్రైనర్స్కు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. తదనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ● తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, ఎస్పీలకు ఎన్నికల నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలు, జియో లోకేషన్లును టీఈ పోల్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఇతర శాఖల అధికారులు శ్రీనివాసరావు, మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్, నాగేంద్రం, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. 29న జిల్లా స్థాయి క్రీడా పోటీలు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు పోటీలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
మెరుగైన విద్య అందించాలి
ఇటిక్యాల: విద్యార్ధులకు మెరుగైన విద్య అందించాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని చాగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈమేరకు విద్యార్థులకు దేశ సమైక్యత, అభివృద్ధిలో రాజ్యాంగం పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ప్రతి విద్యార్ధి శాసీ్త్రయ దృక్పఽథాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్ధులకు కాన్ అకాడమీ ద్వారా వీడియోలు చూపించాలని, పదో తరగతి విద్యార్థులకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి హంపయ్య, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, అమీర్పాష, ప్రధానోపాద్యాయులు కాంతయ్య, విజయ భాస్కర్ పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
న్యూమోనియా భారిన పడకుండా ముందస్తుగా పుట్టిన ప్రతిబిడ్డకు వ్యాక్సిన్ వేయించాలి. వయస్సును బట్టి వ్యాధి నియంత్రణకు పిల్లలు, పెద్దవారికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవడం చాలా మంచిది. వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందుతుంది. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి తక్షణ వైద్యసేవలు అందిస్తున్నాం. – ఇందిరా, జిల్లా ఆస్పత్రి సూపరింటెండ్ ● -
జిల్లా అల్లుడిగా వచ్చా.. మీ సమస్యలన్నీ తీరుస్తా
మక్తల్: ‘ఉమ్మడి జిల్లా అల్లుడిగా వచ్చా.. ఇక్కడి ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటిన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా.’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ మండలం అనుగొండలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు, సంగబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అనుగొండ పునరావాస కేంద్రం ఏర్పాటుకు రూ.42.70 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి సాగునీటి పారుదలకు అడ్డుగా ఉన్న బండను తొలగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్నేళ్లుగా సమస్యగా ఉన్న బండను తొలగించడంతో పాటు భూ నిర్వాసితులకు రూ.13 కోట్ల పరిహారం అందించామని గుర్తు చేశారు. భూత్పూర్, నేరడ్గం గ్రామాల్లో నిర్వహించిన ఏరియల్ సర్వేలో పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం ముంపు గ్రామాలకు సంబంధించిన ఫైళ్లను మూలకు పడేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఎత్తిపోతల పథకాలు, చెక్డ్యాంలు, కాల్వల మరమ్మతు, నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ● మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా చెక్పోస్టు సమీపంలోని బ్రిడ్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో నిరంతరాయంగా నీరు నిల్వ ఉంటుందని.. అక్కడ చెక్డ్యాం నిర్మించి రైతులకు సాగునీటి వసతిని మెరుగుపర్చాలని మంత్రి ఉత్తమ్ను కోరారు. అదేవిధంగా ముంపునకు గురైన దాదాన్పల్లి, అంకెన్పల్లి, భూత్పూర్, నేరగడం గ్రామాలకు ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏరా్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుండగా.. కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నామని మంత్రి వాకిటి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మక్తల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని వివరించారు. రూ.42.70 కోట్లతో అనుగొండ పునరావాస కేంద్రం సంగంబండ వద్ద బండను తొలగించి రైతాంగానికి నీరందించిన ఘనత మాదే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిఉత్తమ్కుమార్రెడ్డి -
అనుమతులనురద్దు చేయాలి
గద్వాలటౌన్: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కార్తీక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆల్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎస్సీ సంస్థ కార్మికులకు అవసరం లేకున్నా హెల్త్ టెస్టులు చేస్తుందని.. టెస్టులు చేయించుకోకపోతే లేబర్ కార్డులను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. కార్మికులకు ఎలాంటి ఉపయో గం లేని సీఎస్సీ సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని కోరారు. అదే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జానకీరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఉప్పేర్ నర్సింహ, ఆంజనేయులు, సీతారాం, శ్రీనివాస్, జమ్మన్న, గట్టన్న, శివ, రవి, మహేశ్, పరమేశ్ పాల్గొన్నారు. ధ్వంసమైన పైపులైన్.. నిలిచిన నీటి సరఫరా గద్వాలటౌన్: జిల్లా కేంద్రం నుంచి అయిజకు వెళ్లే మార్గంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులతో తాగునీటి ప్రధాన పైపులైన్ ధ్వంసమైంది. దీంతో తాగునీరు వృఽథాగా పారింది. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి.. పైపులైన్కు మరమ్మతు పనులు చేపట్టారు. పైపులైన్ మరమ్మతు కారణంగా స్థానిక పిలిగుండ్ల కాలనీ తదితర ప్రాంతాలకు మంగళవారం తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బుధవారం సాయంత్రం నాటికి పైపులైన్ మరమ్మతు పూర్తిచేసి.. తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి మల్దకల్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని భగవంతుడిని ఆరాధించాలని మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అన్నారు. మంగళవారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో ప్రారంభమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని అన్నారు. సమాజంలో కులమతాలను రూపుమాపడానికి, ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి దైవభక్తి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఉండటంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకునే వీలుంటుందన్నారు. అనంతరం పీఠాధిపతిని భక్తులు సత్కరించారు. అదే విధంగా స్వామివారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, చక్రధర్రెడ్డి, రాముడు, వీరారెడ్డి, ఆలయ అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, ముకుందరావు పాల్గొన్నారు. ఆటల్లో అదరగొడుతున్నారు.. ● రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ● నిరంతర సాధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణింపు – వివరాలు 9లో.. -
దోమల విజృంభణ
● వర్షాకాలం ముగిసినా తగ్గని దోమకాటు ● మున్సిపాలిటీల్లో నివారణ చర్యలు అంతంతే ● ఆందోళనలో ప్రజలు గద్వాలటౌన్: వర్షాకాలం ముగిసినప్పటికీ దోమల బెడద మాత్రం తప్పడం లేదు. పల్లె, పట్టణం తేడా లేకుండా దోమలు విజృంభిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా దోమల సైర్వవిహారం ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. దోమల నివారణ చర్యలకు మున్సిపాలిటీ పరంగా ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా.. ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే ఫాగింగ్, కాల్వల్లో దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నట్టు అప్పుడప్పుడు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కిందిస్థాయి సిబ్బంది పనితీరును పర్యవేక్షించక పోవడంతో పట్టణాల్లోని కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద ఏ మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా డెంగీ వంటి ప్రాణాంతక జ్వరాలు ప్రజానీకాన్ని వెంటాడుతున్నాయి. పారిశుద్ధ్య లోపంతో.. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలతో పాటు కందకాల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో సగభాగం కందకాలు విస్తరించి ఉన్నాయి. ఎగువ నుంచి, అంతర్గత డ్రెయినేజీల నుంచి వచ్చే మురుగునీరంతా కందకంలో కలుస్తున్నాయి. వాటిలో సక్రమంగా పూడిక తీయకపోవడంతో చెత్తా చెదారాలతో నిండిపోయాయి. మరోవైపు స్థానిక సుంకులమ్మ మెట్టు వెనక భాగాన ఉన్న అవుట్లేట్ వద్ద అనువైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఇటీవల ప్రధాన డ్రెయినేజీల్లో చేపట్టిన పూడికతీత పనులు నామమాత్రంగానే సాగాయి. అయిజ, శాంతినగర్ వంటి పట్టణాల్లోనూ మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయాయి. దీంతో మురుగు ముందుకు పారడం లేదు. చాలా వరకు డ్రెయినేజీలు పూడికతో నిండి మురుగు పారుదలకు ఇబ్బందిగా ఏర్పడింది. ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోవడంతో దోమల ఉధృతి పెరిగిపోతోంది. దోమల నివారణ చర్యలు గద్వాలలో ఓ మోస్తరుగా ఉండగా.. మిగిలిన అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పట్టణాల్లో మచ్చుకై నా కనిపించవు. ఏడాదికి రూ.4 కోట్లపైనే.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 30వేల కుటుంబాలు నివసిస్తుండగా.. దోమల నివారణ మందుల వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రతి కుటుంబంలో ఎవరి స్థాయి మేరకు వారు రోజుకు రూ.2 నుంచి రూ.5 వరకు దోమల నివారణ కోసం ఖర్చు చేస్తున్నారు. సగటున నెలకు ఒక్కో కుటుంబం రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చు చేస్తోంది. ఇలా పట్టణాల్లో దోమల మందుల వినియోగ వ్యయం ఏడాదికి రూ.4 కోట్లపైనే దాటుతోంది. ఇది కేవలం ఆయా కుటుంబాలు వ్యక్తిగతంగా ఏడాదికి చేస్తున్న ఖర్చు. వీటితో పాటు మున్సిపాలిటీ దోమల సంహరణ కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఆయిల్పాం సాగు లాభదాయకం
ఉండవెల్లి: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి మండలం కలుగోట్ల రైతువేదికలో ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం వచ్చే ఆయిల్పాం దిగుబడులతో రైతులు లాభాలు ఆర్జించవచ్చన్నారు. జిల్లాలో ఆయిల్పాం సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు అందిస్తున్నాయని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ జిల్లా ఇన్చార్జి శివనాగిరెడ్డి, ఏఓ అనిత, పీఏసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


