Jogulamba
-
రైతులకు న్యాయం చేయాలి
గద్వాల: సీడు పత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని, రైతు పండించిన సీడుపత్తి ధరను పెంచి ఫెయిలైన విత్తనాలను రీశాంపిల్కు పెట్టాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గొంగళ రంజిత్కుమార్, బుచ్చిబాబు డిమాండ్ చేశారు. శనివారం సీడుపత్తి రైతులతో ర్యాలీగా వచ్చి కలిసి కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీడుపత్తి రైతులను ఆర్గనైజర్లు, సీడుపత్తి కంపెనీలు మోసం చేస్తున్నాయన్నారు. కంపెనీల నుంచి వచ్చే ప్రయోజనాలను దళారులుగా ఉన్న ఆర్గనైజర్లే దోచేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పంటలు సాగుచేసేముందు అడ్వాన్స్ రూపంలో ఇచ్చే పెట్టుబడిని బాకీల కింద లెక్కకట్టి వాటికి వడ్డీలు వేసి పంటలు వచ్చిన తరువాత రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రైతులు పండించిన సీడుపత్తి విత్తన పాకెట్ ధరలను పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఆర్గనైజర్లు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రంగస్వామి, వెంకట్రాములు, జమ్మన్న, శ్రీనివాస్, బలరాం, గోవిందు, విష్ణు, ప్రేమ్కుమార్, దయాకర్, ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన -
చెరుకు బిల్లులు సకాలంలో చెల్లించాలి
అమరచింత: చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో పలువురు రైతులు శనివారం కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ ఈడీ రవికుమార్, డీజీఎం నాగార్జునరావుకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలని, లేదంటే 16 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉందని, వాటిని నేటికీ అమలు చేయడం లేదని తెలిపారు. విత్తన బిల్లులు 40 రోజుల్లో ఇస్తామన్న యాజమాన్యం ఇప్పటి వరకు చెల్లించలేదని వివరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని.. రాయితీలు సకాలంలో చెల్లించి రైతులను ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్లో రికవరీతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర కల్పించాలని, వేరు పురుగు సోకిన పంట రైతులకు యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేటి వరకు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. త్వరగా చెల్లించి రైతు ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాసులు, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4న ఇంటర్వ్యూలు నాగర్కర్నూల్ క్రైం: నేషనల్ హెల్త్మిషన్ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను బస్తీ దవాఖానాల్లో ఒప్పంద పద్ధతిన వైద్యాధికారుల నియామకానికి ఈ నెల 4న వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. అభ్యర్థులు కలెక్టరేట్లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సా యంత్రం 5 వరకు దరఖాస్తుతో పాటు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. -
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
గద్వాల: జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలోని తనఛాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఐడీవోసీ కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో ఉదయం 10గంటలకు నిర్వహించే వేడుకలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని సంక్షేమాభివృద్ధి శాఖలకు చెందిన కార్యక్రమాలు ప్రతిబింభించేలా ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గద్వాల పట్టణంలోని స్మృతివనం, పాతబస్టాండ్ వద్ద గల తెలంగాణ పోరాయోధుల విగ్రహాల వద్ద సభాస్థలి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పరేడ్గ్రౌండ్లో పోలీసుగౌరవ వందనం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పకడ్బందిగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు, ఏవో భూపాల్రెడ్డి, డీఎస్పీ మొగులయ్య, తహసీల్దార్, మున్సిపల్ కమీషనర్ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ధీరవనిత అహల్యబాయి
పాలమూరు: ఒక హిందూ మహిళగా హైందవ సంస్కృతిని కాపాడుతూ, రాజ్య సంరక్షణలో అహల్యబాయి హాల్కెర్ చేసిన కృషిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మరాఠా మహారాణి అహల్యబాయి 300వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో చరిత్రలోని ధీర వనితలలో అహల్యబాయి ఒకరు అని కొనియాడారు. ఆమె ఎన్నో పురాతన ఆలయాలు నిర్మించిందని, వందకు పైగా కొత్తగా శివాలయాలను అభివృద్ధి చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, బాలాత్రిపురసుందరి, సాహితీరెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
పాలమూరు
సార్థకనామం.. నేడు ప్రపంచ పాల దినోత్సవం పాడి రైతులపై ఆర్థిక భారం ఒకప్పుడు రాష్ట్రానికి రోజువారీగా అవసరమైన పాలు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్పత్తి అయ్యేవి అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. అయితే ప్రస్తుతం పాడి పరిశ్రమ ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు ఆవు పాల ధర తగ్గించింది. ఇప్పటికే పాడి రైతులు పశుపోషణ భారమై తమ ఆవులు, గేదెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా విజయ డెయిరీ ద్వారా ఇస్తున్న దాణా, మినరల్ మిక్చర్స్, క్యాల్షియం మందులు సబ్సిడీలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కాల్షియం మందులు, విజయ దాణా కొనుగోలు చేయాలంటే సబ్సిడీ కాకుండా పూర్తి ధర చెల్లించాల్సి వస్తుందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ పరంగా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవి రైతులకు భరోసా కల్పించడం లేదు. ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ, పాడి రైతులకు డీబీటీ సదుపాయంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు సక్రమంగా అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు సెంటర్లలో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
1975లోనే పాలకేంద్రం
గద్వాల ప్రాంతంలో 1975లో ప్రభుత్వం పాలకేంద్రం స్థాపించింది. చాలా ఏళ్లపాటు రైతులు ఇక్కడ పాలు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా పాల కేంద్రం మూతబడింది. కాగా 2020 ప్రాంతంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో పాలకేంద్రం పునఃప్రారంభమైంది. దీనిద్వారా జిల్లావ్యాప్తంగా 25 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతిరోజు 2,500 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ పరంగా మరో పది దాక పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. -
వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శుక్ల పంచమిని పురస్కరించుకొని శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనాలు, విశేష అలంకరణ వంటి పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతి దేవిని దర్శించుకొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు.. చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వేదమంత్రాల నడుమ వైభవంగా చేయించారు. వివిధ ప్రాంతాల నుండి హాజరైన భక్తులకు పాలక మండలి ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
రైతువేదికలు.. సౌర కేంద్రాలు
భవనాలపై ప్యానల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధం జిల్లాల వారీగా రైతువేదికలు ●● ఒక్కో కేంద్రం వద్ద 5 కిలోవాట్ల సామర్థ్యం.. ● కేంద్రాల నిర్వహణకు విద్యుత్ విక్రయం ● పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లిలో విజయవంతం ● అన్ని వేదికల్లో ఏర్పాటుకుసిద్ధమవుతున్న టీజీ రెడ్కో ప్రభుత్వ నిర్ణయం మేరకే.. రైతులకు అందుబాటులో ఉంటూ సాగు సలహాలు, సూచనలు, సమీక్షల కోసం నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు మంజూరుకావడం లేదు. సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – తిరుపతి, ఏఈఓ, గుండుమాల్ క్లస్టర్ అన్ని వేదికలపై ఏర్పాటు.. ఉమ్మడి జిల్లాలో పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లి రైతులవేదికల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని 467 రైతువేదికలపై ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని భవనాలు ఒకే నమూనాలో నిర్మించడంతో సౌర పలకల బిగింపు ఒకేసారి చేపట్టేందుకు వీలుంటుంది. సౌర విద్యుత్ తయారీ, విక్రయం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అను గుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – మనోహర్రెడ్డి, మేనేజర్, టీజీ రెడ్కో, ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్కర్నూల్ 140 కోస్గి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు సమకూరడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదాయ సమీకరణకు రైతువేదిక భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసి విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. ఒక్కో వేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర పలకలు అమర్చడంతో విద్యుత్ అవసరాలు పోను ఏడాదికి సుమారు రూ.25 వేల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రూపొందించింది. పైలెట్ గ్రామాల్లో విజయవంతం.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకొని జిల్లాకు రెండు చొప్పున పైలెట్ గ్రామాల రైతువేదికలను ఎంపిక చేసి సౌర విద్యుదుత్పత్తి చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా జానంపేట, నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిని ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో విజయవంతం కావడంతో మిగిలిన రైతువేదికపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెడ్కో అధికారులు సిద్ధమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 467 రైతువేదికలపై సోలార్ ప్యానెల్స్ బిగించి సౌర విద్యుత్ తయారీకి చర్యలు తీసుకుంటోంది. నిర్వహణ భారం.. గత ప్రభుత్వ హయంలో రైతులను సమావేశపర్చి శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ, సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాల పంపిణీ కోసం 5 వేల ఎకరాలను ఓ క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒకటి చొప్పున రైతువేదిక నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతను ఏఈఓలకు అప్పగించారు. భవనాల నిర్మాణం పూర్తయినా.. నిర్వహణకు నిధులు మంజూరుగాకపోవడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయారు. సొంతంగా ఆదాయం లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతువేదికల లక్ష్యం నీరుగారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. రైతువేదికలపై సోలార్ పలకల ఏర్పాటుతో ఆదాయం సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతువేదికల నిర్వహణకు నిధుల కొరత లేకుండా సక్రమంగా సాగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. జోగుళాంబ గద్వాల 94 వనపర్తి 69 మహబూబ్నగర్ 87 ఆదాయ సమీకరణ ఇలా.. రెడ్కో సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఒక్కో రైతువేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ పలకలు బిగిస్తే నెలకు 600 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. సొంత అవసరాలకు 100 యూనిట్లు వినియోగించినా.. మిగిలిన 500 యూనిట్లను విక్రయించి ఆదాయం సమకూర్చుకోవచ్చు. యూనిట్ రూ.4కు అమ్మినా నెలకు రూ.2 వేలు, ఏడాదికి రూ.24 వేల ఆదాయం వస్తుంది. అయితే సౌర పలకల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్కో వేదికకు రూ.3 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం కింద సౌర పలకలు ఏర్పాటు చేయనున్నారు. -
స్వీయ రక్షణే ముఖ్యం
ప్రశ్న : ఎవరికి ప్రమాదకరం.. వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. – ప్రభాకర్, బుర్దాపేట్, గద్వాల పట్టణం డీఎంహెచ్ఓ : కరోనా ప్రమాదకరం కాదు కాని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, గతంలో కరోనా వచ్చి ఇబ్బందులకు గురైన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు రిస్క్ ఉంటుంది. వీళ్లందరూ స్వీయరక్షణ అంటే చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి పాటిస్తూనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే వాకింగ్ వంటి వ్యాయామం చేయాలి. గద్వాల: కరోనా ప్రస్తుతం పాండమిక్ దశ నుంచి ఎండమిక్ దశకు చేరుకుంది. అంటే జ్వరం, జలుబు, దగ్గు, టైఫాయిడ్ లాంటివి ఎలానో కరోనా కూడా మనిషి జీవన విధానంలో అలా భాగమైంది. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడంతోపాటు, స్వీయరక్షణ చర్యలు పాటిస్తే అవే మనల్ని కాపాడుతాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సిద్దప్ప అన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని.. కరోనాతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చి నివృత్తి చేశారు. ప్రశ్న : కరోనా కొత్త వేరియంట్ ఏమైనా ప్రమాదకరమా..? – వెంకటేష్, నల్లకుంట, గద్వాల డీఎంహెచ్ఓ : కరోనా కొత్త వేరియంట్ మ్యూటేషన్ (రూపాంతరం) చెందింది. మొదట్లో కరోనా పాండమిక్ దశగా ఉండేది. ప్రస్తుతం ఎండమిక్ దశకు చేరింది. అంటే మన జీవనంలో భాగమైంది. జలుబు, దగ్గు, జ్వరం మాదిరిగా ఉంది. ప్రమాదకరం కాదు.. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే స్వీయరక్షణ పాటించాల్సిందే. ప్రశ్న : కరోనాను ఎలా ఎదుర్కోవాలి.? – శ్రీను, సెంకడ్ రైల్వేగేట్, గద్వాల డీఎంహెచ్ఓ : కరోనాకు భయపడాల్సిన పనిలేదు. అయితే దీనిని ఎదుర్కోవాలంటే మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, కలుషిత ఆహారం, నీటిని తీసుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచింది. ప్రశ్న : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. – విజయ్కుమార్, పాతహౌసింగ్బోర్డు, గద్వాల డీఎంహెచ్ఓ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వానాకాలం సీజన్ కంటే కూడా 15, 20 రోజుల ముందస్తుగానే వానలు వచ్చాయి. వానలు నిరంతరాయంగా కురిస్తే ఇబ్బందులు ఉండవు. కానీ, వానలు వెలసిపోయిన తర్వాత నిలిచిన నీటి వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రధానంగా దోమలకు ఆవాసంగా మారుతుంది. దోమలు గుడ్లు పెట్టి వాటిని పెద్దఎత్తున వ్యాప్తి చెందిస్తాయి. దీంతో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి వస్తాయి. మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీటినిల్వ లేకుండా చూడడం, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం చర్యలు తీసుకోవడం వంటివి పాటించాలి. అలాగే దోమల నివారణకు ఫాగింగ్ వంటివి చేపట్టి నాశనం చేస్తాం. ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షణ చేపడతాం. జిల్లాస్థాయిలో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారుల బృందం, మండల స్థాయిలో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారుల బృందం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. ఎక్కడైనా జ్వరం, డెంగ్యూ, చికెన్గున్యా వంటివి ఎక్కువ మందికి వస్తే అక్కడే ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు వైద్యం అందిస్తాం. జిల్లాలోని జీజీహెచ్, అన్ని పీహెచ్సీల డాక్టర్లకు కరోనా, సీజనల్ వ్యాధుల నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఎన్ఎం, ఆశాల వరకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. కరోనా వ్యాప్తి గురించి ఆందోళన వద్దు మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి జనరల్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ‘సాక్షి’ ఫోన్ ఇన్లో డీఎంహెచ్ఓ సిద్దప్ప ప్రశ్న : ప్రభుత్వ పరంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు. – రమేష్, చిన్నఅగ్రహారం, గద్వాల డీఎంహెచ్ఓ : కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. ఇటీవలి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే కరోనా పరీక్ష నిర్వహిస్తాం. కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లయితే వెంటనే వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తాం. కరోనా పరీక్షలకు అవసరమైన కిట్లు అన్ని సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా వాటికి సరిపడా మందులు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. -
పకడ్బందీగా భూ భారతి సదస్సులు
గద్వాల: జిల్లాలో జూన్ 3 నుంచి 20 వరకు భూ భారతి సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ భారతి రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అని, ఇందుకోసం ధరణి స్థానంలో భూ భారతి చట్టం అమలు చేస్తుందన్నారు. కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు– చేర్పులు, వారసత్వ భూములు, సాదాబైనామాలు, ఓఆర్సీలు వంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. జిల్లాలోని ఇటిక్యాల మండలంలో భూ భారతి పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేశామన్నారు. అలాగే మంగళవారం నుంచి జరిగే రెవెన్యూ సదస్సులకు మండలం నుంచి రెండు బృందాలు ఏర్పాటు చేసుకుని రోజుకో గ్రామాన్ని సందర్శించి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ● రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రా జీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన, పారదర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం మిల్లులకు తరలించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణ చివరి దశలో ఉందని ఇప్పటికే అనుకున్న లక్ష్యంలో 90 శాతం ధాన్యం సేకరించామని, మిగిలిన 10 శాతం వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ బ్యాగులు, లారీల ట్రాన్స్పోర్ట్ వంటివి వేగవంతంగా చేపట్టాలన్నారు. -
బరువు తక్కువ పిల్లలకు బాలామృతం
గట్టు: సాధారణం కంటే తక్కువ బరువుతో రెడ్జోన్లో ఉన్న శ్యామ్ పిల్లలకు, సాధారణం కంటే తక్కువ బరువుతో ఆరెంజ్ జోన్లో ఉన్న మామ్ పిల్లలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు తప్పనిసరిగా బాలామృతం ప్లస్ అందించాలని యూనిసెఫ్ ప్రతినిధి, న్యూట్రిషన్ స్పెషలిస్టు ఖ్యాతి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆలూరు అంగన్వాడీ కేంద్రంతోపాటు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కమిషనర్ కార్యాలయం నుంచి డాక్టర్ సౌజన్య, హెల్త్ కమిషనర్ కార్యాలయం నుంచి డాక్టర్ నర్సింహారావు, స్టేట్ కన్సల్టేషన్ యూనిసెఫ్ నుంచి శిరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖ్యాతి మాట్లాడుతూ రెడ్జోన్లో ఉన్న పిల్లలకు 9 బాలామృతం పాకెట్లను అందించి, వాటిని నిరంతరం వాడుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అతి తక్కువ బరువు ఉన్న పిల్లలను బాలామృతం తీసుకుంటే సాధారణ స్థితికి చేరుకుంటారన్నారు. ఆరోగ్య ఉప కేంద్రంలో గర్భిణులకు అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆల్బెండజోల్, ఆమాక్సిలిన్, జింక్ ట్యాబ్లెట్లు, సిరప్స్ అందుబాటులో ఉంచాలని, వాటిని ఆరోగ్య ఉప కేంద్రాలకూ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాక్సిన్ మేనేజర్ నరేంద్రబాబు, ఎన్సీడీ సమన్వయకర్త శ్యాంసుందర్, డాక్టర్ రమేష్, జిల్లా ఎస్ఎస్ఎఫ్పీ కోఆర్డినేటర్లు పరమేష్, సురేష్, వికాస్, సూపర్వైజర్లు వెంకటేష్, వెంకటాద్రినాయుడు, తాహేరాబేగం తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
ధరూరు: వర్షాకాలంలో వరద నీటితో రిజర్వాయర్లను నింపి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి కుడి కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసారి కూడా గతేడాది మాదిరిగానే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందస్తుగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు వరద రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి జూరాలకు వస్తున్న వరద ఆధారంగా వారం రోజుల క్రితమే నీటి పంపింగ్ను ప్రారంభించి ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను నింపేందుకు చర్యలు చేపట్టామన్నారు. వీటిని నింపడం ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని ప్రజానీకానికి తాగు, సాగు నీరందించేందుకు ఉపయోగపడతాయన్నారు. అధికారులు రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని, సాగునీరు వృథా కాకుండా చూడాలని పీజేపీ అధికారులకు సూచించారు. నడిగడ్డ ప్రాంతానికి జూరాల గుండెకాయ లాంటిదని, ఈ ప్రాజెక్టు నుంచే ఎత్తిపోతల పథకాలకు సాగు నీరందుతోందన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతు సంక్షేమం కోసం పాటు పడతాయన్నారు. రెండు పంటలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రామన్గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పద్మ, నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, ప్రభాకర్గౌడ్, వంశీ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్
శాంతినగర్: జిల్లాలో నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్ చేపడుతున్నామని, ప్రజలు సహకరించాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్లోని ఇందిరానగర్కాలనీలో శుక్రవారం సాయంత్రం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని అన్ని ఇళ్లు, వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్లు లేని 70 మోటార్సైకిళ్లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చి కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వారి పూర్తి వివరాలు కనుక్కొని ఇళ్లు అద్దెకు ఇవ్వాలని, అపరిచితులు, అనుమానం ఉన్న వ్యక్తులు కాలనీల్లో సంచరిస్తుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగాక వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోవాలని, ప్రమాదాలు జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఉంచుకోవాలన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫోన్లు జాగ్రత్తగా వాడాలన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తామని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రవాణా, పేకాట, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ టాటాబాబు హెచ్చరించారు. -
ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు : ఎస్పీ
గద్వాల క్రైం: సమస్యలపై వచ్చే బాధితుల పట్ల సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఉదయం ఎస్పీ రూరల్ పోలీసుస్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఫిర్యాదులపై వేగవంతగా విచారణ చేపట్టి బాధితులకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని ఎస్ఐ శ్రీకాంత్కు సూచించారు. గ్రామాల్లో నిత్యం గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైం, మహిళల వేధింపులు, అత్యాచార యత్నం, మిస్సింగ్ కేసులలో ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ శివారుల్లో నిత్యం వాహనాల తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలన్నారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల వివరాలు, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయలన్నారు. డయల్ 100 కాల్స్ విషయంలో త్వరగా స్పదించాలని ఆదేశించారు.వేరుశనగ క్వింటాల్ రూ.5,339గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు శుక్రవారం 12 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.5,339, కనిష్టంగా రూ.3,619, సరాసరిగా రూ.3,619 ధరలు పలికాయి. అలాగే 94 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.1,979, కనిష్టంగా రూ.1,509, సరాసరిగా రూ.1,979, 2 క్వింటాళ్ల కంది రాగా.. సరాసరిగా రూ.6,106 ధరలు లభించాయి.ఫీల్డ్ అసిస్టెంట్ల బకాయిలు విడుదల చేయాలిజెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జాబ్కార్డులను వెంటనే ఇవ్వాలని కోరారు. ఉపాధి పనిని పట్టణ కూలీలకు వర్తింపచేయాలని సూచించారు. పని దినాలను 200 రోజులకు పెంచి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో జాబ్కర్డాలలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పని చేసిన వారికి వారంలోపు వేతనాలు చెల్లించాలన్నారు. పని ప్రదేశంలో మం చినీళ్ల, మెడికల్ కిట్లు, టెంట్ ఏర్పాటు, పనిమూర్లు, ఓఆర్ఎస్ పాకెట్లను ఇవ్వాలన్నారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా నిధులను పని దినాలను కూలీలకు జాబ్కార్డులను పెద్ద ఎత్తున కోత విధించిందని ఆరోపించరు. అనంతరం డీఆర్డీఓ నర్సిములుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, హన్మంతు, భగవంతు రాములు, శివలీలా, ఎఫ్ఏలు వెంకటయ్య, నర్సిములు, సాయిలు, చంద్రశేఖర్, వెంకటయ్య, మొగులయ్య, కొం్డయ్య, నీలమ్మ, మంజుర చెన్న య్య, దాసు, జయమ్మ నాగలక్ష్మి పాల్గొన్నారు.మక్తల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదంషాద్నగర్రూరల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్నగర్వైపు వెళ్తున్న మరో కారు టోల్ప్లాజాలోని వేరే లైన్కు మారేందుకు డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు. -
జూరాలకు వరదొచ్చింది
పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళాడుతున్న జూరాల ప్రాజెక్టు గద్వాల/ధరూరు/ఆత్మకూర్: కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు కేవలం 3,624 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా వరద పెరిగింది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా.. భీమా ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులు విడుదల చేశారని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ఈ సీజన్లో తొలిసారి జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 12 గేట్లను ఎత్తి 83,616 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. చివరిసారిగా 2007లో మే నెలలోనే జూరాలకు వరద వచ్చిందని, మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఈ నెలలో వరద రావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల ప్రాజెక్టు చరిత్రలో మే నెలలో వరద రావడం ఇది ఐదోసారి మాత్రమే. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలశయంలో 8.571 టీఎంసీల నీరు ఉంది. ● జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమై లిఫ్టు–1 గుడ్డెందొడ్డి వద్ద రెండు పంపులను ప్రారంభించి 1,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి.. గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. జూలై మూడో వారంలో ప్రారంభం కావాల్సిన వరద ముందు రావడంతో.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. గురువారం అర్ధరాత్రి ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఎస్ఈ శ్రీధర్ బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 18 ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రవాహం 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 12 గేట్లు ఎత్తివేత అర్ధరాత్రి 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం అప్రమత్తంగా ఉండాలి జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో దిగువనున్న లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట కోసం మత్య్సకారులు నదిలోకి వెళ్లవద్దని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద పరిిస్థితిని సమీక్షిస్తూ అందుకనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ఫిట్లెస్ బస్సులు
ఈ నెల 16 నుంచి మొదలైన ప్రైవేట్ బస్సుల సామర్థ్య పరీక్షలు ● ఉమ్మడి జిల్లాలో 1,383 బస్సులకు గాను 245 పూర్తి ● కండీషన్లో లేని వాహనాలు వెనక్కి పంపాలని నిర్ణయం ● ఫిట్నెస్ పరీక్షలకు రాకుండానే నడిపిస్తున్న వైనం ● విద్యార్థుల సంరక్షణ బాధ్యత యాజమాన్యాలదే ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ విషయంలో కొందరు అధికారులు ఉదాసీనంగా, ఏజెంట్లు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024– 25లో దాదాపు వందకు పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోకుండానే విద్యార్థులను తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన కొందరు యాజమాన్యాలు మరమ్మతు ఇతర కారణాలతో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదు. విద్యాసంస్థల బస్సులన్నీ నిబంధనల మేరకు వసతులు కల్పించి ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలి. బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణా శాఖకు హామీపత్రం సమర్పించాలి. కఠినంగా వ్యవహరిస్తేనే.. -
పకడ్బందీగా నకిలీ విత్తనాల నియంత్రణ
గద్వాల క్రైం: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీగా నిఘాపెట్టి కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు వివిధ పంటల సాగుకు మార్కెట్లో విత్తనాలు, మందులు, పెస్టిసైడ్స్ తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వస్తుంటారని, ఈ క్రమంలో రైతులకు నాసిరకం విత్తనాలు, మందులను ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు అంటగట్టే అవకాశం ఉందన్నారు. నాసిరకం మందులు, విత్తనాల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి నిలువారించలన్నారు. ఎక్కడైన నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బక్రీద్ పండుగా సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పికెట్ నిర్వహించి అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టాలన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలతో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి స్వీయ జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినా అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లలో నమోదైన కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు శ్రీకాంత్, శ్రీహరి, వెంకటేష్, శ్రీనివాసులు, నాగశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
9 ఏళ్లు.. 5 కి.మీ.,
డబుల్ నిర్మాణానికి నోచుకోని అంతర్రాష్ట్ర రహదారి ●అయిజ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లకే తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన ఉన్న సింగిల్ రోడ్డును డబుల్గా మార్చేందుకు, 5 కల్వర్టులను నిర్మించేందుకు 2016లో అప్పటి ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. అలాగే ఇదే దారిలో అయిజ సమీపంలోని పోలోని వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు మరో రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. అయితే పనులు ప్రారంభించి.. తొమ్మిదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు అప్పట్లోనే సింగిల్ రోడ్డును తొలగించారు. రోడ్డు వెడల్పు చేసి కంకరవేసి నాలుగేళ్లపాటు బీటీ వేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డుపై ప్రయాణించే వారు ద్విచక్రవాహనాలపై నుంచి కిందపడి అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలు తీవ్ర విమర్షలు చేయడంతో తిరిగి మూడు సంవత్సరాల క్రితం పనులు పునర్ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తికాలేదు. కాంట్రాక్టర్ను మార్చినా.. బిల్లులు చెల్లించడం లేదని మొదటి కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. దీంతో రెండేళ్ల క్రితం ఆర్అండ్బీ అధికారులు సదరు కాంట్రాక్టర్ను తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మొత్తం 10 కి.మీ., బీటీ నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5 కి.మీ. మాత్రమే నిర్మించారు. అలాగే అయిజ సమీపంలో పోలోని వాగుపై రూ.2 కోట్లతో నిర్మించతలపెట్టిన హై లెవల్ బ్రిడ్జి సైతం అసంపూర్తి గానే ఉంది. ఇక్కడ కూడా కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశాడని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సింగిల్ రోడ్డును డబుల్గా మార్చేందుకు 2016 సంవత్సరంలో క్రితం రూ.12 కోట్లు మంజూరు చేశారు. 10 కి.మీ., పొడవైన ఈ రోడ్డులో 5 కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వం మూలంగా గడిచిన తొమ్మిదేళ్లుగా రోడ్డు నిర్మాణం సా..గుతోంది. ఇప్పటి వరకు కేవలం 5 కి.మీ., మేర రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్.. ఒక్క కల్వర్టు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఫలితంగా ఇదే రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాల్సిన 20 గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అసంపూర్తిగా హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం బిల్లులు రావడం లేదు.. పులికల్ రోడ్డుపై పోలోనివాగు వద్ద రూ.2 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాను. అలాగే మండలంలోని చిప్పదొడ్డి, యాపదిన్నె గ్రామాల పరిసర ప్రాంతాల్లో బ్రిడ్జి పనులు చేపట్టాను. పనులు పూర్తి చేసినా బ్రిడ్జిలకు కూడా అధికారులు బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు రూ.2.30 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉండటంతో పనులు ఆపేశాను. బిల్లు మంజూరు చేస్తేనే పనులు తిరిగి ప్రారంభిస్తాను. – హన్మంతురెడ్డి, కాంట్రాక్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది గాయాలపాల య్యారు. చికిత్స పొందు తూ కొందరు వ్యక్తులు ఆస్పత్రిలో మృతిచెందారు. ఇప్పటికై నా సరే అధికారులు స్పందించి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తిచేయా లని కోరుతున్నాం. – పుల్లారెడ్డి, అయిజ త్వరలోనే పూర్తి చేస్తాం.. రోడ్డు నిర్మాణానికి అనేక ఆటంకాలు ఎదురవుతు న్నాయి. మొదటి కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయకపోవడంతో తొలగించి.. మరొకరికి అప్ప గించాం. పనులు వేగంగా పూర్తిచేయాలని ఆ దేశించాం. అయితే బిల్లులు రాలేదని హైలెవ ల్ బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిపివేశారు. సమ స్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – రాజేందర్, ఆర్అండ్బీ ఎస్ఈ 20 గ్రామాలకు ఈ రోడ్డే ఏకై క మార్గం ఏళ్లతరబడిగా సా..గుతున్న పనులతో నరకయాతన సగం కూడా పూర్తికాని రోడ్డు పనులు హై లెవల్ బ్రిడ్జిది అదే పరిస్థితిప్రమాదపుటంచున ప్రయాణం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీపంలోని నాగులదిన్నె, నందరవరం, ముగితి గ్రామాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని కొత్తపల్లి, మైనిపల్లి, రాజాపురం, పులికల్, మేడికొండ తదితర గ్రామాలు, అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల, అయిజ పట్టణ ప్రజలు ఈ రోడ్డుపైనే ప్రయాణం చేయాల్సి ఉంది. వీరంతా ఏళ్లతరబడిగా సాగుతున్న రోడ్డు నిర్మాణ పనులతో ప్రమాదపుటంచున ప్రయాణం చేయాల్సి వస్తోంది. కంకర వేయడంతో ద్విచక్రవాహనదారులు తరుచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. -
భూమి కోల్పోయిన ప్రతిరైతుకు పరిహారం
గద్వాల: భారత్మాల రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జాతీయ రహదారి నిర్మాణానికి భూములు కోల్పోయిన కేటీదొడ్డి, మండలం కుచినెర్ల, అయిజ మండలం దేవబండ గ్రామాల రైతలతో నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేటీదొడ్డి నుంచి రాజోలి వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవునా భారత్ మాల రహదారి నిర్మించబడుతుందని తెలిపారు. భారత్మాల రహదారి పూర్తయిన తర్వాత రవాణా, వ్యవసాయం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో జిల్లా వేగవంతమైన అభివృద్ధి సాధించగలదని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికి 70 నుంచి 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, ఇది రైతుల సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రహదాని నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నష్టపరిహారం పెంచే దిశగా ఎన్హెచ్ఏఐ అధికారులతో చర్యలు జరుపుతామన్నారు. తగిన నిధులు మంజూరయ్యేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ● పదవీ విరమణ పొందుతున్న ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మణ్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సరోజకు జిల్లా యంత్రాంగం తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 35 ఏళ్లపాటు వివిధ హోదాలతో ఉత్తమ సేవలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
రేపు సీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని ఆయన కోరారు.కొనుగోలు కేంద్రంలో తనిఖీలుఅయిజ: మండలంలోని బైనిపల్లిలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు విచారించారు. బుధవారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఇతర రాష్ట్రాల నుంచి వరి ధాన్యం తరలించి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశాంత్ను విచారణకు పంపారు. ఆయన కొనుగోలు కేంద్రం చేరుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రైతులు, నిర్వాహకులతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రైతుల పంట పొలాలకు వెళ్లి వరి పండించారో లేదో పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని ఏఈఓ శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశించారు.మొక్కలే మానవాళికి జీవనాధారంఎర్రవల్లి: మొక్కలే మానవాళికి జీవనాధారమని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నీటి కుంట ఏర్పాటు కోసం కమాండెంట్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు అవసరమైనప్పుడు నీరు వినియోగించుకోవచ్చునని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ద్వారా రూ. 3లక్షల వ్యయంతో బెటాలి యన్లో నీటి కుంటను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ రాజేశం ఉన్నారు.ప్రభుత్వ విద్యతోనే అంతరాలు లేని సమాజంగద్వాలన్యూటౌన్: విద్యతోనే సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని, అంతరాలు లేనివిద్య అందించాలని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పౌర స్పందన వేదిక చేపట్టిన ప్రచార జాత బుధవారం గద్వాలలోని పాతబస్టాండ్కు చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సామాజిక ఆర్థిక అంతరాలు తగ్గడానికి విద్య ప్రధాన ఆయుధమని అందులోను విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండడం మరీ అవసరం అన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించే ఉద్దేశ్యం లేకే పాలకులు ఉద్దేశపూర్వకంగా విద్యపై దాడి చేస్తున్నారని, అందులో భాగంగా విద్యా ప్రైవేటీకరణ విధానాలను పాల్పడుతున్నారని విమర్శించారు. విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సమాన అవకాశాలు దొరుకుతాయని మేధావులందరూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా ప్రైవేటీకరణ ద్వార వ్యాపార దృక్పథం మూడనమ్మకాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు. రమేష్, గోపాల్, రమణ, చంద్రకాంత్, బీసన్న పాల్గొన్నారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 7013959920, 7013959652
గద్వాల: కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో జెన్ –1 వైరస్ వేరియంట్ లక్షణాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 30న శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డీఎంహెచ్ఓ సిద్దప్పతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది. జిల్లా ప్రజలు కరోనా వైరస్పై తమకు ఉన్న అనుమానాలు, వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై నేరుగా ఫోన్ చేసి మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
జిల్లాను యూనిట్గా తీసుకొని పరిహారం చెల్లించాలి
గట్టు: భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో చాలా తేడాలున్నాయని, జిల్లాను యూనిట్గా తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులతో కలసి నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణను బుధవారం కలసి వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర సినియర్ నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌస్, మహాబూబ్పాష, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ రైతులతో కలసి అదనపు కలెక్టర్ను కలిశారు. భారత్మాల ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన గట్టు, గంగిమాన్దొడ్డి గ్రామాలకు చెందిన కొంత మంది రైతులకు ఆర్భిట్రేషన్ తర్వాత అందించే పరిహారం అందకపోవడంతో గంగిమాన్దొడ్డి గ్రామం దగ్గర మంగళవారం పనులను అడ్డుకుని నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు రహదారి పనుల సైట్ ఇన్చార్జ్ అప్జల్తో కలసి అదనపు కలెక్టర్ను కలిశారు. రహదారి నిర్మాణంలో భూముల కోల్పోయిన రైతులకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నష్ట పరిహారం చెల్లించడం ద్వారా రైతులు నష్టపోతున్నారని, జిల్లాను యూనిట్గా తీసుకుని మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అదనపు కలెక్టర్కు విన్నవించారు. ఆర్భిట్రేషన్ తర్వాత రైతులకు చాలా మంది నోటీసులు రాక డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారని, రెండవ విడత పరిహారం అందుకొని రైతులను గుర్తించి, తక్షణమే వారికి పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండవ విడత పరిహారం అందుకొని రైతులను గుర్తించి, వారికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. -
చెక్పోస్టు వద్ద కొనసాగుతున్న తనిఖీలు
రాజోళి: మండలంలోని తుంగభద్ర నదిపై గల సుంకేసుల డ్యాం వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ చెక్పోస్టు ఏర్పాటుచేసిన విషయం విధితమే. ఏపీ తదితర ప్రాంతాల నుంచి ఆవులు, పశువులను తీసుకువెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను తరలించే అవకాశమున్నందున ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా వీఎల్ఓ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో ఆవులు, పశువులు ఉన్నట్లయితే వాటికి సంబందించిన రశీదులు, అనుమతి పత్రాలు ఉన్నాయా, లేదా ఆరా తీస్తున్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని వారు హెచ్చరించారు. -
బాధ్యతగా పనిచేయాలి
గద్వాల: లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్యతగా పనిచేయాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో లైసెన్స్డ్ సర్వేయర్లకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వంటి ప్రక్రియలో సర్వే మ్యాప్లు తప్పనిసరిగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుందన్నారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పనిలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియలో థియరీ ఎంతో ముఖ్యమో ప్రాక్టికల్ కూడా అంతే ముఖ్యమన్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పరీక్ష అనంతరం లైసెన్స్డ్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాంచందర్, చందర్ పాల్గొన్నారు.ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోండిగద్వాల: జిల్లాలో కొరియర్, హోంసర్వీస్, ఫుడ్ డెలివరీ, ఏసీ టెక్నీషియన్లు, డిజైనర్స్, వీడియో ఎడిటర్లు వంటి విధులు నిర్వర్తించే కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందాలని కార్మికశాఖ ఏసీ మహేశ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్, ఫ్లిప్కార్డు, జొమాటో, స్విగ్గి వంటి సంస్థల్లో పనిచేసే వారిని కార్మికులుగా ప్రభుత్వం గుర్తించి.. వివిధ సంక్షేమ పథకాలు వర్తింపచేస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 14434 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.ఉపాధ్యాయులకు శిక్షణఅలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, రాజోళి, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల్లోని స్కూల్ అసిస్టెంట్స్ శిక్షణ తరగతుల్లో పాల్గొనగా.. జిల్లా రీసోర్స్పర్సన్లు వెంకటేశ్, రాఘవేంద్ర పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో బోధించాలని సూచించారు. శిక్షణ తరగతులను రాష్ట్ర రీసోర్స్పర్సన్లు గీత, వాణి పరిశీలించారు. నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ శివప్రసాద్, ఇన్చార్జి హేమలత తదితరులు పాల్గొన్నారు.రైతులను ఆదుకోవాలిగద్వాల: అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ బీఎం సంతోష్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతా వరణంలో తేమశాతం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో తేమశాతం రావడం కష్టతరమన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. అదే విధంగా పొగాకును సంబంధిత కంపెనీలు కొనుగోలు చేయకుండా.. ధరలు, తూకం విషయాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకా రం పొగాకు కొనుగోలు చేయించాలన్నారు. కార్యక్రమంలో రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, బలిగెర శివారెడ్డి, దేవాదాసు, రవికుమార్ పాల్గొన్నారు.రామన్పాడుకు నీటి సరఫరా నిలిపివేతమదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికి పైన 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల జలాశయం ఎడమ, కుడి కాల్వల ద్వారా నీటి సరఫరా లేదని.. రామన్పాడు జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నామని వివరించారు. -
పత్తి సాగుకు సన్నద్ధం
●8 ఎకరాల్లో సాగు.. గతేడాది క్వింటాల్ పత్తి రూ. 7,500 పైగా ధర పలికింది. ఈఏడాది కూడా మంచి దిగుబడి, ధర వస్తుందన్న ఆశతో 8 ఎకరాల్లో పంటసాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నాను. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసు కోవాలి. – రవికుమార్, రైతు, చెన్నిపాడు మంచి దిగుబడి వస్తుందని.. గత సీజన్లో పత్తిని సాగుచేయగా.. ఎకరాకు 15 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట వస్తుందనే ఆశతో ఈసారి 15 ఎకరాల్లో పత్తిసాగు చేస్తున్నా. వరుణదేవుడు కరుణించాలి. – గొల్ల వెంకట్రాములు, రైతు, మానవపాడు నకిలీ విత్తనాలను అరికడుతున్నాం.. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికడుతున్నాం. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్మితే మా దృష్టికి తీసుకురావాలి. – సక్రియా నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మానవపాడు: పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో పండించే పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుండటం.. జిల్లావ్యాప్తంగా నల్ల, ఎర్రనేలలు ఉండటం.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంటున్న నేపథ్యంలో జిల్లా రైతులు పత్తిసాగుకు సై అంటున్నారు. అదే విధంగా పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశంగా రైతులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, వానాకాలం ప్రారంభానికి ముందే మోస్తరు వర్షాలు కురుస్తుండటం రైతుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది. వ్యవసాయ పొలాల్లో దుక్కులు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తిసాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. 1,42,410 ఎకరాల్లో సాగు అంచనా.. గతేడాది జిల్లావ్యాప్తంగా 1,33,206 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది 1,42,410 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు సాగు ప్రణాళికలను సిద్ధం చేసింది. గతేడాది కంటే 9వేలకు పైగా ఎకరాల్లో పత్తిపంట అదనంగా సాగయ్యే అవకాశం ఉండటంతో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మానవపాడులోని ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీ చేస్తున్న టాస్క్ఫోర్స్ అధికారులు (ఫైల్) జిల్లాలో పత్తిసాగు ఇలా.. జిల్లాలో ప్రధాన పంటగాతెల్లబంగారం గతేడాది 1,33,206 ఎకరాల్లో సాగు ఈసారి అదనంగా 9వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా దక్కులు సిద్ధం చేస్తున్న అన్నదాతలునకిలీ విత్తనాలకు అడ్డుకట్ట.. జిల్లావ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టేందుకు ప్రభుత్వ శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేశారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన ఈ బృందాల్లో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులను నియమించారు. జిల్లాస్థాయి బృందాల్లో ఏడీఏ, డీఎస్పీ, సీఐ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారి, డివిజన్స్థాయి కమిటీలో ఏడీఏ, ఎంఈఓ, మండలస్థాయి కమిటీలో ఏఓ, ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలు విక్రయించే దళారులు, అక్రమాలకు పాల్పడే డీలర్లపై నిఘా ఉంచి.. రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
జలయజ్ఞం ప్రాజెక్ట్లపై నజర్
కోయిల్సాగర్: చివరి దశలో పనులు 2006లో రూ.349 కోట్లు కేటాయించి.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి కాకుండానే పదేళ్ల తర్వాత 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలు, లింక్ కెనాల్ కింద కొత్తగా పిల్ల కాల్వల పనులు చేపట్టడానికి రూ.50 కోట్లతో రీ టెండర్లు పిలిచారు. అలాగే నాగిరెడ్డిపల్లి ఫేస్1, తీలేర్ ఫేస్ 2 పంపుహౌస్లలో పెండింగ్లో ఉన్న పనులకు రూ.16.90 కోట్లతో రీ టెండర్లను పిలిచారు. ఎత్తిపోతల పథకం లక్ష్యం 50,250 ఎకరాలు కాగా.. వానాకాలం పంటల కింద 36 వేల ఎకరాలలకు, యాసంగిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుంచి దేవరకద్ర గ్రావిటీ కెనాల్ను రూ.23 కోట్లతో చేపట్టగా పనులు చివరిదశలో ఉన్నాయి. అజిలాపూర్, చౌదర్పల్లి ఎత్తిపోతల పథకం, రాజోలి నుంచి పేరూర్ వరకు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి ● నెట్టెంపాడులో 610 ఎకరాలకు రూ.25 కోట్లు విడుదల ● ‘పాలమూరు’లో 15 వేల ఎకరాలకు రూ.300 కోట్లు.. ● భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పనులపైనా కసరత్తు ● పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి రవినాయక్ ఆరా ● ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ప్రాజెక్ట్ -
కేఎల్ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్కు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. -
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
గద్వాల వ్యవసాయం: సబ్సిడీపై అందించే విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్యార్డ్ చైర్మన్ హనుమంతు సూచించారు. సోమవారం గద్వాల సింగిల్విండో కార్యాలయంలో సబ్సిడీపై అందించే జీలుగ విత్తనాల విక్రయ కార్యక్రమాన్ని పీఏసీఎస్ చైర్మన్ సుభాన్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 30 కేజీల జీలుగ విత్తనాలను సబ్సిడీ ధరపై రూ. 2,137.50 ఇస్తుందని తెలిపారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ మాట్లాడుతూ పచ్చిరొట్టె ఎరువు వాడటం వల్ల పంటకు పోషకాలు అందుతాయని, నేల గుల్ల బారి నీటిని నిలుపుకొనే సామర్థ్యం పెరిగి, వేరు వ్యవస్థ భూమిలోకి పటిష్టంగా పెరుగుతుందన్నారు. దీంతో పాటు భూమిలో నత్రజని శాతం పెరుగుతుందన్నారు. అనంతరం పలువురు రైతులకు సబ్సీడీ జీలుగ విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రతాప్కుమార్, పీఏసీఎస్ సీఈఓ వెంకటేశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకం
గద్వాల: లెసెన్స్ సర్వేయర్లతో భూవివాదాలకు పరిష్కారం దొరకడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పాత ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి భూమి హక్కుల రికార్డు చట్టం–2025ను అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. భూ యజమానులైన రైతులకు మెరుగైన సేవలను అందించే ప్రణాళికలో భాగంగా లైసెన్స్ పొందిన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. భూభారతి చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, ముటేషన్, తదితర వాటిలో తప్పనిసరిగా సర్వే చేసి మ్యాప్ జత చేయాల్సి ఉంటుందని దీనికోసం లైసెన్స్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి ప్రభుత్వం శిక్షణ అందిస్తుందన్నారు. మే 26వ తేదీ నుంచి 50రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈశిక్షణ కార్యక్రమంలో థియరీతో పాటు, ఫీల్డ్ట్రైనింగ్ కూడా ఉంటుందన్నారు. అదేవిధంగా శిక్షణ కాలంలో సెలవులు ఇవ్వరని అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలన్నారు. అందులో ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్డ్ సర్వేయర్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందన్నారు. అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని సూచించారు. కార్యక్రమంలో సర్వేయర్ ఏడీ రామ్చందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరందించడమే లక్ష్యం
ధరూరు: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని, రైతులు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పేస్ 1 నుంచి పంపుహౌస్ను ఎమ్మెల్యే హాజరై గంగమ్మ పూజ చేసి సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో కృష్ణనదిలో నీటి సామర్థ్యం పెరిగిందని అన్నారు. దీంతో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేశామని, ఈ ఏడాది రైతులకు రెండు పంటలకు నీళ్లను అందించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ఇప్పటి వరకు 80 శాతం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మిగిలిన 20 శాతం త్వరలో కొనుగోలు చేయనుందని తెలిపారు. ర్యాలంపాడు.. నాలుగు టీఎంసీల సామర్యం గల రిజర్వాయర్లు ప్రస్తుతం రెండు టీఎంసీల నీళ్లు నిలువ ఉంటుందని, రెండు టీఎంసీలలో కొంత ఇబ్బందిగా ఉందని, విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడు, మార్కేట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, జంబురామన్ గౌడు, సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, విజయ్ పాల్గొన్నారు. -
ప్రాధాన్యతా క్రమంలో.. ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అచ్చంపేట/ బల్మూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రణాళిక, జీఓ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతలు, ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో చేపట్టనున్న పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందే తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు. అచ్చంపేట నియోజవర్గానికి, తమకు విడదీయని బంధం ఉందని, అన్న మల్లు అనంతరాములుతోపాటు మల్లు రవి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేశారని, తాను అప్పట్లో విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికి వచ్చానని గుర్తుచేసుకున్నారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే.. నీళ్లు, నిధులు, నియామకాలంటూ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న యువతకు గత పాలకులు అన్యాయం చేశారని డిప్యూటీ సీఎం విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామని, ఇప్పటికే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేసిందని, దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు ఈ ఆలోచన చేయలేదని వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు సోలార్ కరెంట్, పంపుసెట్లు, డ్రిప్ స్ప్రింక్లర్లను వినియోగించి ఉద్యానశాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, నిమ్మ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని.. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, రాష్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, రాజేందర్, జిల్లా ఓబీసీ చైర్మన్ గిరివర్ధన్గౌడ్ పాల్గొన్నారు. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం బీఆర్ఎస్ పనులు చేపట్టింది తప్పా పూర్తిచేయలే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క -
నట్టేట ముంచి
జోగుళాంబ గద్వాలనమ్మించి.. మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025వివరాలు 8లో u●దళారులను నమ్మొద్దు జిల్లాలోని రైతులు ఎవరూ భూ సమస్యలపై మధ్య దళారులను ఆశ్రయించొద్దు. చట్టబద్దంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. డబ్బులు ఇస్తే పనులు అవుతాయి అంటే అక్కడ ఖచ్చితంగా మోసం జరుగుతుందని గ్రహించాలి. పలు సాంకేతిక సమస్యల కారణంగా సమస్య పరిష్కారంలో జాప్యం జరగవచ్చు. మోసపోయిన రైతుల విషయంలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం అందేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ప్రభుత్వ భూములపై దళారుల నజర్... గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో సీలింగ్, వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములు ఉండగా.. వీటిని సైతం దళారులు, భూకబ్జాదారులు రెవెన్యూలోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకొని పట్టా భూములుగా మార్చుకున్నారు. వాస్తవంగా ప్రభుత్వ భూముల క్రయ విక్రయాలు నిర్వహించరాదనే నిబంధనలు ఉన్నాయి. భూ బాదలాయింపు జరగాల్సి ఉంటే అట్టి భూములను వారుసుల పేరిట రెవెన్యూ రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ప్రభుత్వ భూములు సైతం దళారుల చేతివాటంతో రికార్డులు తారుమారు అవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా అలంపూర్, గట్టు, కేటీదొడ్డి, వడ్డేపల్లి, అయిజ, గద్వాల, మానవపాడు మండలాల్లో భూ సమస్యలపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుంటున్న దళారులు రైతులను నమ్మించి దోచుకుంటున్నారు. గద్వాల క్రైం: భూ సమస్యలు.. పాసు బుక్కులు.. ఆన్లైన్లో పేర్ల మార్పు.. తదితర సమస్యలను పరిష్కరించాలని రైతులు అటు అధికారులకు వినతులు.. ఇటు ప్రజావాణి.. ప్రజాదర్భార్లో దరఖాస్తులు చేస్తుంటారు. ఇలాంటి బాధితులనే లక్ష్యంగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు.. భూములకు సంబంధించి ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని నమ్మబలుకుతున్నారు. వీరి మాటలు నమ్మిన రైతులు రూ.లక్షలు వారికి అందజేయడం.. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటనలు జిల్లాలో కో కొల్లలుగా ఉన్నాయి. జిల్లాలో కొన్ని సంఘటనలు.. గద్వాల పట్టణానికి చెందిన ఓ మహిళా రైతు పేరుపై 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా రెవెన్యూ రికార్డులో పేరు నమోదు కాలేదు. ఈ క్రమంలో ఆమెతోపాటు అతని సోదరుడు హైద్రాబాద్లో ఏర్పాటు చేసిన ప్రజాదర్భర్లో ఫిర్యాదు చేశారు. అక్కడే ఓ దళారీ నేను ఓఎస్డీలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించి భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయించేందుకు ఈ ఏడాది మార్చిలో రూ.1.45క్షలు వసూలు చేశాడు. అయితే నెల రోజులైనా ఎలాంటి ఫలితం లేక పోయింది. దీంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి 24.05.2025 తేదీన హైద్రాబాద్కు చెందిన దళారీపై పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ● గద్వాల పట్టణానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమి గద్వాల మండలంలోని పరుమాలలో ఉంది. అయితే అక్రమార్కులు ఆ భూమిపై నకిలీ పాసుబుక్కులు సృష్టించి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను పొందుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో న్యాయం కోసం ఫిర్యాదు చేయగా కోర్టు రైతుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే రైతుకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని 26.5.2025 తేదీన కలెక్టర్, ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనలో రైతు రూ.4లక్షలు దళారులకు ఇచ్చి మోసపోయాడు. ● రాజోళి మండలానికి చెందిన ఓ రైతు తన రెండు ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పాసుబుక్కుల కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. వివిధ సమస్యల కారణంగా పాసుబుక్ల జారీ ఆలస్యమైంది. దీంతో రైతు గద్వాలకు చెందిన ఓ దళారీని ఆశ్రయించాడు. అందుకు రూ.50వేలు ఒప్పందం చేసుకున్నాడు. ఆరు నెలలు అయినా దళారీ పాసుబుక్కు ఇప్పించడం లేదని 17.3.2025 తేదీన కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎంతో మంది రైతులు భూసమస్యలపై రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, సమస్యల పరిష్కారం లేకపోవడంతో దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. న్యూస్రీల్ అమాయక రైతులే లక్ష్యంగా దోచుకుంటున్న మధ్య దళారులు భూ వివాదాలు పరిష్కరిస్తామని.. పాసుబుక్కులు ఇప్పిస్తామని బుకాయింపు రూ.లక్షలు వసూలు చేసి మొఖం చాటేస్తున్న వైనం పట్టణ పోలీసు స్టేషన్లో తాజా కేసు నమోదుతో వెలుగులోకి.. -
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి
తాడూరు: రైతులు సాగు చేసే పంటల్లో యూరియాతో పాటు రసాయనిక ఎరువులను తగ్గించాలని పాలెం కేవీకే శాస్త్రవేత్తలు శ్రీరాం అన్నారు. సోమవారం మండలంలోని బలాన్పల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం శాస్త్రవేత్త శ్రీరాం మాట్లాడుతూ పంట మార్పిడీతో భూసారం పెరుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదులు భద్రపర్చుకోవాలని సూచించారు. శాస్త్రవేత్త రాజిరెడ్డి మాట్లాడుతూ పురుగు మందులు అవసరం ఉన్నప్పుడే మాత్రం పిచికారి చేయాలన్నారు. నేల తేమ సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధికారులు సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు కార్యక్రమంలో ఏఓ సందీప్కుమార్రెడ్డి, ఏఈఓ దీపక్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులు పాల్గొన్నారు. -
పూడిక తొలగేనా..?
జిల్లా కేంద్రంలో పూడుకపోయిన డ్రెయినేజీలు లోతట్టు ప్రాంతాలకు ముప్పు వేసవి ముగుస్తుంది. మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. మూడు నాలుగు రోజుల నుంచే ముసురు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు మాత్రం వర్షాకాలం వస్తోందంటేనే భయం మొదలవుతుంది. అవన్నీ లోతట్టు ప్రాంతాలు కావడంతో వానొస్తే నీరు నిలిచిపోతుంది. మురికి నీరు డ్రయిన్లలోంచి పొంగి ప్రవహిస్తోంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని కుంట వీధి, నల్లకుంట, జివిలివీధి, పాత హౌసింగ్బోర్డు కాలనీలోని కొంతభాగం, సుంకులమ్మమెట్టు, ఒంటెలపేట తదితర కాలనీలు జలమయమవుతూ ఉంటాయి. పట్టణంలోని తుల్జారాం గుడి, కూరగాయల మార్కెట్, రథశాల ప్రధాన పరిసర ప్రాంతాలు అధ్వాన్నంగా మారతాయి. అయినా ముందస్తు జాగ్రతలు చేపట్టడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పైన పేర్కొన్న కాలనీలలో డ్రైనేజీ వ్యవస్త అస్తవ్యస్థంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు ముందస్తుతో సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకొని డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. గద్వాలటౌన్: మరికొన్ని రోజుల్లో వానాకాలం ప్రారంభం కానుంది. అప్పుడే వర్షాలు సైతం కురుస్తున్నాయి. అయినా కూడా జిల్లా కేంద్రంలోని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. గద్వాల మున్సిపాలిటీల్లో చాలామటుకు డ్రెయినేజీలు చెత్తా చెదారంతో, శివారు ప్రాంతాల్లోని ప్రధాన మురికి కాల్వలు అన్నీ పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. భారీ వర్షాలు కురిస్తే అవన్ని పొంగి పొర్లుతాయని, పట్టణం దుర్గంధంగా మారుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అధికారులకు తెలిసినా.. తగు చర్యలు మాత్రం చేపట్టరు. ప్రజలను వర్షాకాలం కష్టాల నుంచి తప్పించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం వారిపై ఎంతైనా ఉంది. జనాభా 80,000 మురుగు కాల్వల ఆక్రమణ.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో అధికారుల తాత్సారం త్వరలో చేపడతాం వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తా, చెదారం పూడికతీత పనులను చేపడతాం. ఇందుకోసం అవసరమైన డ్రెయినేజీలు గుర్తించడంతో పాటు వాటికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అవసరమైన చోట యంత్రాలను ఉపయోగించి పూడికతీత చేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. – దశరథ్, ఇన్చార్జ్ కమిషనర్, గద్వాల -
నీటి వృథాకు అడ్డుకట్ట
సుమారు 30 ఏళ్ల కిందట.. జూరాల ఎడమ కాల్వ కింద జిల్లాలో సుమారు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏడాదికి రెండుసార్లు పంటలకు సాగునీరు అందిస్తారు. సుమారు 30 ఏళ్ల కిందట బిగించిన షట్టర్లు వంగిపోయి దెబ్బతినడంతో మూసినా నీరు వృథాగా పారుతోంది. వారబందీ సమయంలో లీకేజీల కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథా అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు. యాసంగిలో వారబందీ విధానంలో రామన్పాడు రిజర్వాయర్ వరకు సాగునీటిని వదిలారు. పూర్తయిన జూరాల ఎడమ కాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతు ●● నాలుగు షట్టర్లకు రూ.7.50 లక్షల వ్యయం ● వారబందీ సమయంలో నీరు వృథా కాకుండా చర్యలు ● ఎట్టకేలకు మోక్షం అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమకాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిపివేసినా షట్టర్ల లీకేజీలతో రోజు కాల్వలో వృథాగా పారి జలాశయంలో నిల్వ నీటిమట్టం తగ్గుముఖం పట్టేది. నిత్యం 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు వృథా అవుతుండటంతో అధికారులు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వకు 4 సాధారణ, 4 ఎమరెన్సీ షటర్లు ఉండగా.. 4 సాధారణ షట్టర్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతుంది. దీంతో వీటి మరమ్మతుకు రూ.7.50 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వేగంగా మరమ్మతులు పూర్తిచేశారు. ఇకనుంచి యాసంగి సీజన్లో ఆయకట్టుకు వారబందీ సమయంలో సాగునీరు నిలిపివేసే సమయంలో చుక్కనీరు ముందుకు పారకుండా షట్టర్లను పక్కాగా బిగించనున్నారు. సమాంతర కాల్వకు మోక్షమెన్నడో? భీమా ఫేజ్–2 ఎత్తిపోతల కోసం సమాంతర కాల్వను ఏర్పాటు చేశారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు వస్తున్న నీటిని కాల్వ ద్వారా పంపింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. కాని భీమా అధికారులు కాల్వ ప్రధాన షట్టర్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం 150 క్యూసెక్కుల నీరు కాల్వలో వృథాగా పారుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నీరు వృథా అయ్యేది.. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లు పూర్తిగా దెబ్బతినడంతో నీరు కాల్వలో వృథాగా పారేది. అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టడంతో వేసవిలో జలాశయంలోని నీటిమట్టం తగ్గకుండా ఉంటుంది. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత పనులు పూర్తి చేశాం.. జలాశయం ప్రధాన ఎడమ కాల్వ షట్టర్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేశాం. మరమ్మతులను డీఈ నారాయణ పర్యవేక్షించారు. ఇకపై కాల్వకు నీరు నిలిపితే షట్టర్ల నుంచి లీకేజీ కాకుండా పక్కాగా పనులు చేపట్టాం. వారబందీ విధానంలో పూర్తిస్థాయిలో నీటిని అందించే సమయంలో సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డ్యాం డివిజన్ -
ఉత్సాహంగా తిరంగా ర్యాలీ
అలంపూర్: భారత సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ చేపట్టినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు అన్నారు. అలంపూర్ పట్టణంలోని బీజేపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు శరత్ బాబుల ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంఘీభావం, సైనికులకు మద్దతుగా తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్తో భారత్.. సత్తా ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. దేశంలో పాకిస్తాన్ వంటి దేశాలు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నించాయని, అలాంటి దేశాలు దాడులకు పాల్పడితే భారత ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఉగ్రస్థావరాలను నాశనం చేసిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అక్కల రమసాయిబాబ, బీజేపీ నాయకులు స్వప్న, రాజగోపాల్, కేకే రెడ్డి, రాజశేఖర్ శర్మ, నరేశ్, మద్దిలేటి, శ్రీనివాసులు, నరసింహ్ములు, నాగేశ్వర్ రెడ్డి, నాగమద్ది లేటి, నరేష్ గౌడ్, పరుశురాముడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన జీపీఓ పరీక్ష
గద్వాల: గ్రామ పాలన అధికారి (జీపీఓ) రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటించాలని అధికారులకు సూచించారు. జీపీఓ పరీక్షకు మొత్తం 81మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 77మంది అభ్యర్థులు హాజరయ్యారని, 95.06శాతం హాజరుశాతం నమోదైందని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ మల్లిఖార్జున్, పరీక్ష నిర్వాహకులు ఇమ్మానియెల్ ఉన్నారు. కోయిల్సాగర్లో 11 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్హౌస్ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్ సాగర్కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. నేడు ‘పాలమూరు’ అథ్లెటిక్స్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో వచ్చే నెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్– 8, 10, 12 ఏళ్లలోపు బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, తహసీల్దార్ ద్వారా కుల, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని సూచించారు. -
జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: ఈనెల 25వ తేదీ ఆదివారం గ్రామ పాలన అధికారి రాతపరీక్ష (జీపీఓ)కు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం సీసీఎల్ఏ కార్యదర్శి నవీన్మిట్టల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొత్తం 81మంది అభ్యర్థులు పరీక్ష హాజరు కానున్నారని తెలిపారు. వీరికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు కొనసాగతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. అదేవిధంగా కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఏవో నరేందర్, తహసీల్దార్ మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల పొదరిల్లు
● వేసవి శిక్షణకు వేదికగా బాలభవన్, బాలకేంద్రాలు ● నృత్యం, సంగీతం, చిత్రలేఖనం నేర్చుకునేందుకు చిన్నారుల ఆసక్తి ● ఉమ్మడి జిల్లాలో 4 కేంద్రాల్లో 16 ఏళ్ల లోపు బాలబాలికలకుప్రత్యేక శిక్షణ నారాయణపేటలో 1983లో 9 మంది చిన్నారులతో ఏర్పాటైన బాలకేంద్రం చౌక్బజార్లోని అద్దె భవనంలో కొనసాగింది. ఆ తర్వాత మినీస్టేడియం గ్రౌండ్లో వృథాగా ఉన్న ఓ భవనంలోని మార్చారు. ఇక్కడ తబలా, సితార్, గాత్రం, నృత్యం, చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. 6 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బాలకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. జనరల్ విద్యార్థులకు రూ.50, ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్నారులకు రూ.20 ప్రవేశ రుసుం వసూలు చేస్తారు. ఏటా వేసవిలో వందమంది పిల్లలు శిక్షణ పొందడానికి వస్తుంటారు. వీరికి దాతల సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్ వంటి పరికరాలు ఉచితంగా అందిస్తున్నారు. ఇక తరచుగా దాతలతో స్నాక్స్ సైతం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పాల్గొని మంచి పేరు తీసుకువచ్చారు. ఉత్సాహభరితంగా.. గద్వాల బాలభవన్లో400కు పైగా విద్యార్థులు వివిధ కళల్లో శిక్షణ పొందారు. 5–16 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సాహభరిత వాతావరణంలో వేసవి శిబిరం కొనసాగుతుంది. వివిధ కళల్లో నైపుణ్యం ఉన్న శిక్షకులు చిన్నారులకు శిక్షణ ఇస్తూ బాల కళాకారులుగా తీర్చిదిద్దారు. చిన్నారులకు భరతనాట్యం, జానపద నృత్యం, శాసీ్త్రయ నృత్యాలను శిక్షకులు సత్యం, చిత్రలేఖనం గణేష్, సంగీతం శివకుమార్, వాయిద్యాలు శంకర్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్లో గాయిత్రి తదితరులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కళల ప్రపంచం.. ‘పేట’ బాలకేంద్రం -
రాయితీ ఎరువులు సిద్ధం
●రాయితీ వివరాలు ఇలా.. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జీలుగ, జనుము రెండు రకాల పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తోంది. జీలుగ క్వింటాల్కు రూ.14,250 కాగా.. రాయితీపై కేవలం రూ.7,425కు, జనుము పూర్తి ధర క్వింటాల్కు రూ.12,550 ఉండగా.. రాయితీపై రూ.6,275కే రైతులకు అందజేస్తోంది. అందుబాటులో జనుము, జీలుగ రకాలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసేందుకు చర్యలు ● వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ మేరకు సరఫరా చాలా ఉపయోగం.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై అందజేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో డిమాండ్ మేరకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రసాయనిక ఎరువుల వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి ఒకసారి పచ్చిరొట్ట ఎరువుల వాడకం పొలానికి చాలా ఉపయోగకరం. – ఆదినారాయణరెడ్డి, రీజినల్ మేనేజర్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, వనపర్తి వనపర్తి: రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి భూ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ ఏటా పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందుకు రైతులకు 50 శాతం రాయితీపై మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో పంపిణీ షురూ చేశారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా జిల్లాలకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువుల ఇండెంట్ ఆధారంగా జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ జీలుగ, జనుము రకాల విత్తనాలను సిద్ధం చేసింది. వనపర్తి జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కర్మాగారంలో ఐదు జిల్లాలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసి తొలకరి వర్షాలు కురుస్తున్న ప్రస్తుతం సమయంలో సరఫరా కోసం ఆయా ప్రాంతాలకు పంపిణీ చేశారు. జీలుగ రకం ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7 వేల క్వింటాళ్లు, జనుము 760 క్వింటాళ్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులకు ఈ విత్తనాలను వారి అభ్యర్థన మేరకు ఆయా రకాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తారు. పచ్చిరొట్టతో ఉపయోగాలిలా.. పచ్చిరొట్ట ఎరువులతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. వ్యవసాయ పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం పరిమితికి మించడంతో భూమిపై గల సారవంతమైన పొర చౌడు నేలగా మారే ప్రమాదం ఉంది. ఏటా ఖరీఫ్ పంటల సాగుకు ముందు వర్షాధారంగా పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నడం వలన భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించకుండా ఈ పచ్చిరొట్ట ఎరువులు వాటి మనుగడను కాపాడుతాయి. నేలపై పొరలోని సహజ భౌతిక లక్షణాల రక్షణకు ఉపయోగపడతాయి. పచ్చిరొట్ట ఎరువుల నాటేందుకు ప్రస్తుత సమయం అనువైనదని ఇటీవల నిర్వహించిన శాస్త్రవేత్తల పల్లెబాట కార్యక్రమంలో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకోవాలి. సాధారణ పంటల సాగుకు ముందు 45 రోజుల ముందు ఈ పచ్చిరొట్ట ఎరువులను నాటుకుంటే.. పచ్చిరొచ్చ మొక్కలు పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదున్నేందుకు అవకాశం ఉంటుంది. తర్వాతి సాగు చేసే పంటలకు ఎంతగానో సారవంతమైన ఎరువుగా పచ్చిరొట్ట ఉపయోగపడుతుంది. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ఎరువులు ఇలా (క్వింటాళ్లలో).. ఇదే అనువైన సమయం.. -
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప, శేషంపల్లి శివసీతారామస్వామి, చర్లగార్లపాడు వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కొంత మంది భక్తులు స్వామి వారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఆలయ అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారిలు సిబ్బంది గురునాథ్, ఉరుకుందు, శ్రీను, రంగస్వామి, శివమ్మ, కృష్ణ, తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మూడు బాలికల, రెండు బాలుర పాఠశాలలు/కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ అధికారిణి ఫ్లోరెన్స్రాణి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులే అర్హులని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాంరెడ్డిగూడెంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో నిర్వహించే డెమోకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా బాలికల కళాశాలల్లో తెలుగు రెండు, ఇంగ్లిష్, మ్యాథ్స్, బాటనీ, ఫిజిక్స్, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్లో ఒక్కో పోస్టు తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయనున్నామని వివరించారు. ఇక పాఠశాలల్లో హిందీ, మ్యాథ్స్, బయో సైన్స్లో మూడు చొప్పున, తెలుగు, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, పీఈటీ రెండు చొప్పున, ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని, బాలుర కళాశాలల్లో ఇంగ్లిష్ రెండు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఒక్కొక్కటి చొప్పున; పాఠశాలల్లో బయోసైన్స్ రెండు, ఇంగ్లిష్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. 30న ఇంటర్వ్యూలు పాలమూరు: జిల్లా ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పథకం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి మెడికల్ ఆఫీసర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒకటి పారా మెడికల్ అసిస్టెంట్ పోస్టులను ఒక ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 30న డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, అర్హులైన బలహీన గిరిజన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. రేపు గిరిజన విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్, కల్వకుర్తిలోని తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (టీజీఈఎంఆర్ఎస్– కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు ఈనెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని జీటీ గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, సీఈసీలలో సీబీఎస్ఈ సిలబస్కు సంబంధించి ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతిలో ఎక్కువ మార్కులు పొందిన గిరిజన విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకల్లా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లోని టీజీఈఎంఆర్ఎస్లో అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోలను వెంట తెచ్చుకోవాలని, పూర్తి వివరాలకు ఫోన్ నం.94156 06618, 98557 37578, 98857 38387, 8520 041973లలో సంప్రదించవచ్చని సూచించారు. రేపు డిప్యూటీ సీఎం రాక బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్ గ్రామానికి సోమవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం గట్టుతుమ్మెన్లో ఏర్పాటు చేయనున్న సభాస్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి, అనంతరం నియోజకవర్గ ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని చెప్పారు. -
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితా సిద్ధం చేయండి
గద్వాల: ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల కింద అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను వెంటనే జిల్లాస్థాయికి పంపాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్యువ వికాసం పథకాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, అర్హుల వివరాల జాబితాను వెంటనే అందజేయాలన్నారు. పైలట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి, పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ఈఈలు పంచాయతీ కార్యదర్శులతో కలిసి లబ్ధిదారుల నిర్మాణం పనులను ప్రారంభించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిగ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా రాజీవ్యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని, అర్హుల ఎంపికను పారదర్శకంగా పూర్తి చేయాలని లబ్ధిదారుల వివరాల సాఫ్ట్ కాపీని బ్యాంకులకు వెంటనే పంపించాలన్నారు. సెక్టార్ వారీగా నాన్లింకేజి బ్యాంకింగ్ వివరాలతో జాబితాను సిద్ధం చేయాలన్నారు. సోమవారంలోపు లబ్ధిదారుల బ్యాంకు వివరాలు నిర్ధారణను పూర్తి చేతి తుది జాబితాను సమర్పించాలన్నారు. అధికారులు, బ్యాంకర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకునే విధంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్బాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి పాక్షిక శనిత్రయోదశి సందర్భంగా శనివారం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేకాలతో పూజలు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల చేత శనిదోష నివారణ కోసం గోత్రనామార్చన, అభిషేకాలు, అర్చనలు వంటి పూజలను అర్చకులు చేయించారు. భక్తులు శనేశ్వరుడి పూజల అనంతరం శివాలయంలో బ్రహ్మసూత్ర శివుడికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలి
అలంపూర్: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ అన్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరులో ప్రొఫెసర్ జయశంకర తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనల స్థానం పాలెం, జిల్లా వ్యవసాయ శాఖల సంయుక్త అధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు తక్కువ యూరియా, తక్కువ రసాయనిక మందులను వినియోగం, సాగు నీటి ఆదా, పంట మార్చిడి, చెట్లను పెంచి– పర్యావరణానికి కాపాడడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త శ్రీధర్ మాట్లాడుతూ..తక్కువ యూరియాను వినియోగంచడం వలన పంటల్లో వచ్చే పురుగు, తెగుళ్లను నివారించవచ్చన్నారు. డ్రిప్లు, స్పీంక్లర్ల ద్వార తక్కువ నీటిని వినియోగించుకోవచ్చన్నారు. శాస్త్రవేత్త శంకర్ విత్తన శుద్ధి, పంటలో అట్టల వినియోగం, లింగాకార్షక బుట్టలు, అంతర పంటల సాగు గురించి వివరించారు. ఏఓ అనిత ప్రభుత్వ పథకాలు, విత్తనాల లభ్యత, జీలుగు విత్తనాల గురించి వివరించారు. కార్యక్రమంలో విస్తరణ అధికారిణి హసీనా బేగం, అదిల్, యం.వి. రాజేశ్, పీఏసీఎస్ అధ్యక్షుడు గజేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మద్దిలేటి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు 5,609 క్యూసెక్కుల వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం సాయంత్రానికి 5,609 క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.657 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. -
శిక్షణను వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలని.. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా పాఠశాలలో తప్పకుండా అమలు చేయాలని ఆర్జేడీఎస్ఈ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రోగ్రాం స్టేట్ అబ్జర్వర్ విష్ణుశాస్త్రి అన్నారు. శుక్రవారం మండలంలోని కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన కార్యక్రమాన్ని పర్యవేక్షించి పాఠశాలల్లో చేపట్టాల్సిన పలు అంశాలను గురించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్లను చర్చించి వాటిని ఇతర పాఠశాలల్లో కూడా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఐదు రోజుల ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో ఆబ్జెక్టివ్, ఇంప్లిమెంటేషన్ ల గురించి డీఆర్పీలు వివరించారు. కార్యక్రమంలో ఎఎంఓ ఎస్తేర్ రాణి, ఎంఈఓలు అమీర్ఫాష, వెంకటేశ్వర్లు, డిఆర్పీలు, ఆర్పీలు, తదితరులు ఉన్నారు. -
లాటరీ విధానంలో ఎంపిక
గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మూడు స్వీపర్ పోస్టులను లాటరీ విధానంలో భర్తీ చేసినట్లు అదనపు కలెక్టర్ బి.నర్సింగ్రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు స్వీపర్ పోస్టులకు లాటరీ విధానంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ పోస్టులకు మొత్తం 54 దరఖాస్తులు రాగా.. వారి సమక్షంలో లాటరీ విధానాన్ని చేపట్టారు. లాటరీ విధానంలో ఎస్సీ మహిళ యశోధ, జనరల్ పోస్టుకు మహిళ శివమ్మ, జనరల్ ఆల్ కెటగిరీలో ఎం లీలావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జీ డీఎంహెచ్ఓ సిద్ధప్ప, ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ 371జే అమలు చేయాలి గద్వాల: అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిన నడిగడ్డ ప్రాంతంలో ఆర్టికల్ 371జే అమలు చేసి అభివృద్ధి చేయాలని సీనియర్ సిటిజన్ ఫోరం కన్వీనర్ మోహన్రావు కోరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు డాక్టర్ చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు నివేదిక అందజేయండి వనపర్తి: జిల్లాలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల కేటాయింపుపై సమర్థన నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా. సువర్ణ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 41వ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా, ఇందులో 12 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 7.166 హెక్టార్ల అటవీ భూమి ఉన్నట్లు పటం ద్వారా తెలుస్తోందన్నారు. అటవీ భూమి కేటాయిస్తే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. స్పందించిన డా. సువర్ణ 7.166 హెక్టార్ల స్థలం దేని కొరకు కావాలో సమర్థన నివేదిక అందజేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఆదేశించారు. వీసీలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, సెక్షన్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. నేతన్నలను ఆదుకుంటాం అమరచింత: పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో వస్త్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నేత కార్మికులతో పాటు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు నాబార్డు తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీజీఎం ఉదయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని నాబార్డు సీజీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం సందర్శించి రోలింగ్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన చీరలు రోలింగ్ కోసం గద్వాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. మహిళలు కుట్టు శిక్షణ పొందడమే గాకుండా పలు రకాల డిజైన్ల వస్త్రాలను కుట్టడంలో మెళకువలు నేర్చుకున్నారని చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ తయారు చేస్తున్న వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయస్థాయితో పాటు ఆన్లైన్ మార్కెటింగ్కు కావాల్సిన మద్దతునిస్తామని హామీనిచ్చారు. అనంతరం మగ్గాలపై జరీ చీరలు తయారు చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి ఆదాయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తాము సైతం కంపెనీ యజమానులమని.. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి లాభాలు సమానంగా చేరుతాయని కార్మికులు వివరించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం దీప్తి సునీల్, డీడీఎం మనోహర్రెడ్డి, ఆర్డీఎస్ సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, కంపెనీ డైరెక్టర్లు పబ్బతి వెంకటస్వామి, అశోక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని చింతరేవుల గ్రామ శివారులో చేపట్టిన భూసేకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూ సేకరణ వివరాలు, లేఅవుట్ మ్యాప్, పెగ్ మార్కింగ్ చేసిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జవహార్ నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిదిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పరిదిలో భూసేకరణ సర్వే పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ఏ విధమైన ఆలస్యం లేకుండా త్వరగా పనులు చేయాలని అన్నారు. ప్రతి రోజు ఎంత మేర భూసర్వే జరుగుతోంది, ఎన్ని ఎకరాలు పూర్తయ్యాయి అనే వివరాలు స్పష్టంగా ఉండాలని అన్నారు. సర్వే, పెగ్ మార్కింగ్ పనులను ఒకే సారి జరుపుతూ రైతులను చైతన్యపరిచి వారి సహకారంతో భూ సేకరణను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ఎక్కడైన సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ విషయంలో సర్వే ల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ భూసర్వే పూర్తి అయితే ఆయకట్టు పెరగడంతోపాటు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నీటి పారుదల శాఖ ఎస్ఈ రహీముద్దీన్, ఆర్డీఓ శ్రీనివారావు, తహసీల్దార్ బైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా గంజాయి దందా
బానిసలుగా మారుతున్న యువత, కార్మికులు ●గద్వాల క్రైం: నడిగడ్డలో గంజాయి విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో యువకులు మొదలుకొని కార్మికులు ఈ మత్తుకు బానిసలుగా మారి కుటుంబాలను చిద్రం చేసుకుంటున్నారు. తాజాగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గమనించిన పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి.. ఎట్టకేలకు పక్కా సమాచారంతో దాడి చేసి గంజాయి అమ్మకాల గుట్టు రట్టు చేశారు. ఈ నెల 13వ తేదీన గద్వాల జిల్లాకు చెందిన ఓ యువకుడు గద్వాల వ్యవసాయ మార్కెట్లో గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు గుర్తించి అరెస్టు చేసి 680 గ్రాముల ఎండు గంజాయి (రూ. 27 వేల విలుగల) స్వాధీనం చేసుకోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఈ దందాలో ఇంకా ఎంత మంది ఉన్నారు, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు, ఎలా దిగుమతి చేసుకుంటున్నారు.. అసలు సూత్రధారులు ఎవరనే విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు. రిమాండ్కు తరలించాం.. జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేయించేందుకు వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. గంజాయి తీసుకునే వారిలో యువత, కార్మికులు ఉన్నట్లు విచారణలో తెలిసింది. గంజాయిని హైదరాబాద్, షోలాపూర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు సదరు యువకుడు తెలిపాడు. త్వరలో వారిని సైతం గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అయితే నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాం. – కళ్యాణ్కుమార్, పట్టణ ఎస్ఐ. కట్టడికి ప్రత్యేక నిఘా గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలో కొంతమంది యువకులు గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. వీరు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, దందాలో ఎంతమంది ఉన్నారనే విషయాలపై విచారణ జరుగుతుంది. యువత, ప్రజలు గంజాయికి దూరంగా ఉండాలి. ఆ మత్తుకు అలవాటు పడి జీవితాలను ఆగం చేసుకోవద్దు. జిల్లాలో గంజాయి అమ్మకాలు, వినియోగంపై సమాచారం తెలిస్తే పోలీసుశాఖకు తెలియజేయాలి. నిషేధిత మత్తు పదార్థాల కట్టడి, వాటితో వచ్చే సమస్యలపై అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ ఇటీవల జిల్లా కేంద్రంలో గంజాయి విక్రేత అరెస్టు 280 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం కూపీ లాగుతున్న పోలీసులు -
ధాన్యం కొనుగోలులో అలసత్వం వద్దు
గద్వాల: ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల మండలం చెనుగోనిపల్లి, గుంటిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం తేమశాతం పరిశీలించి రైతులతో మాట్లాడుతూ.. ఏవైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో లోడింగ్, ఓపిఎంఎస్లో డేటా ఎంట్రీ తదితర అంశాలను పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్రాలలో ధాన్యం తడిసిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గన్నీబ్యాగుల కొరత, ట్రాన్స్పోర్ట్లో లారీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎం విమల, ఏడీఆర్డీఏ నర్సింహులు, మండల వ్యవసాఽయాధికారులు పాల్గొన్నారు. దళితుల విద్యకోసం కృషి దళితుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా వారికోసం పాఠశాలలు స్థాపించిన గొప్ప ఆదర్శమూర్తి భాగ్యరెడ్డివర్మ అని కలెక్టర్ బీఎం సంతోష్ కొనియాడారు. గురువారం కలెక్టరేట్లో భాగ్యరెడ్డివర్మ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించిన మహనీయుడు భాగ్యరెడ్డివర్మ అన్నారు. ప్రధానంగా దళిత బాలకలకు విద్యను అందించేందుకు పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అస్పృశ్యత, దేవదాసి వంటి అన్యాయాలను ఎదిరించి సమాజంలో మార్పు కోసం ఎంతగానో కృషి చేసినట్లు వివరించారు. ఈతరం యువత భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గాన్ని అనుసరించి సమాజంలో మార్పు కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, న ర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏవో నరెందర్, బీసీ సంక్షేమశాఖ అధికారి సరోజ, వివిధ కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు నీటి ప్రవాహం
గద్వాల/ ధరూరు/ దోమలపెంట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెల చివరలోనే కొత్త నీటి రాక మొదలైంది. గురువారం ఎగువ ప్రాంతం నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 8,953, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 8,940 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్, జూలైలో కృష్ణానదికి వరదలు వస్తుంటాయి. జూరాల ప్రాజెక్టుకు కొన్ని నెలలుగా ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు దాపురించారు. మొన్నటి వరకు 3 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం రెండు రోజులుగా వస్తున్న ఇన్ఫ్లోతో దాదాపు 1.25 టీఎంసీల నీరు చేరిందని అధికారులు చెప్పారు. డెడ్ స్టోరేజీ దశలో ఉన్న జూరాలకు స్థానికంగా కురుస్తున్న అకాల వర్షాలు కొంత మేలు చేశాయి. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.175 టీఎంసీల నీరు నిల్వ ఉందని పీజేపీ అధికారులు తెలిపారు. సుంకేసుల, హంద్రీ నుంచి.. శ్రీశైలం జలాశయానికి గురువారం సుంకేసుల నుంచి 8,690, హంద్రీ నుంచి 250 కలిపి మొత్తం 8,940 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిందని జలాశయం గేజింగ్ నిర్వాహకులు తెలిపారు. కాగా.. గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలం ఎగువన రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 1,305 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 817.2 అడుగుల వద్ద 38.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల స్టాప్లాక్ గేట్ల ఓవర్ఫ్లో జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జూరాలకు వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో గేట్ల మరమ్మతు చేసే క్రమంలో ప్రధాన గేట్లకు రక్షణగా ఉన్న స్టాప్లాక్ గేట్లపై నుంచి వర్షపు నీరు పొంగిపొర్లినట్లు ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. జూరాలకు 8,953, శ్రీశైలానికి 8,940 క్యూసెక్కుల ఇన్ఫ్లో జూన్కు ముందే మొదలైన కొత్త నీటి రాక -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్లో జఠిలంగా పరిహారం.. పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం. రిజర్వాయర్లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ డెడ్లైన్.. డిసెంబర్ మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి డెడ్లైన్.. కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్లోపు కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో సాగు నీరందిస్తాం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం. – విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం -
‘నెట్టెంపాడు’ భూసేకరణ వేగవంతం చేయాలి
గద్వాల: జవహార్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రవినాయక్, కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్టెంపాడు ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న 480ఎకరాల భూసేకరణపై వెంటనే చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా 99,100 ప్యాకేజీలలో సేకరించాల్సిన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చింతరేవుల, శెట్టిఆత్మకూరు, మెలచెర్వు గ్రామాల్లో భూసేకరణపై రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్స్, కెనాల్స్, వారిగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని,భూసేకరణ పరిహారం చెల్లించిన వెంటనే అవసరమైన సివిల్ పనులు ప్రారంభించాలన్నారు. కాల్వల నిర్మాణం వల్ల గ్రామాల అభివృద్ధి, సాగు సౌకర్యాలు మెరుగవుతాయని, త్వరలోనే ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎస్ఈ రహీముద్దీన్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
పవనపుత్రా.. పాహిమాం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఉదయం ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, వడమాల, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిదంగా వికాస తరంగిణి, విశ్వ హిందూపరిషత్, ధర్మప్రసార సమితి ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి శిష్య బృందం సభ్యులు ఆలయంలో 1008 పర్యాయాలు హనుమాన్ చాలిసా పారాయణం చేశారు. హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాలను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు, అర్చకులు, హిందూ సంఘాల సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారద దంపతులు గురువారం దర్శించుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రామన్గౌడ్ ఎమ్మెల్యే దంపతులను శేష వస్త్రాలతో సత్కరించగా.. అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలు అందించారు. వారి వెంట నాయకులు విజయవర్దన్రెడ్డి, అక్కి శ్రీనివాస్గౌడ్, వెంకట్రాములు, సురేందర్గౌడ్, రంజిత్కుమార్, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు. బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంత్యుత్సవాలు -
సాగుదాం..
జోగుళాంబ గద్వాలవానాకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారుగురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025వివరాలు 8లో uవిత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చర్యలు గడిచిన ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పంటల దిగుబడులు బాగా వచ్చాయి. రానున్న వానాకాలం సీజన్లో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే పంటలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విషయంలో రైతులు వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈసీజన్లో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – సక్రియానాయక్, డీఏఓ గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఈఏడాది వానాకాలం సీజన్ పంట ప్రణాళిక ఖరారు అయ్యింది. 3,67,211 ఎకరాల్లో పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గడిచిన ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లు సాఫీగానే సాగయ్యాయి. ఈఏడాది కూడా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయన్న ఆశతో అన్నదాతలు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు వ్యవసాయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన ఏడాది సాఫీగా సాగు 2024–25 వానాకాలం, యాసగి సీజన్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. దీంతో బోర్లు, బావులు రిజార్జ్ అయ్యాయి. ఇదే సమయంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల జూరాల జలాశయం నుంచి అనుకున్న సమయలో నీటి విడుదల జరిగింది. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల గడిచిన ఏడాది వానాకాలం సీజన్లో అన్ని పంటలు దిగుబడులు బాగా వచ్చాయి. అయితే వానాకాలం సీజన్లో సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల జిల్లాలో దాదాపు 2వేల ఎకరాల్లో పత్తి, ఆముదం, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇక యాసంగిలోనూ వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల వరి, వేరుశనగ, పప్పుశనగ తదితర పంటల దిగుబడులు ఆశించిన మేర వచ్చాయి. అత్యధికం పత్తి, వరి.. వానాకాలం సీజన్కు అవసరమైన పంట ప్రణాళికను ఇక్కడి వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈఏడాది పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఆయా ప్రాంతాలలో 3,21305 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 45906 ఎకరాల్లో ఉద్యాన పంటలు, మొత్తం 3,67,211 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి ప్రధానంగా పత్తి, వరి,కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తారని భావిస్తున్నారు. ఇక కంది పంటకు సంబందించి గడిచిన ఏడాది దాదాపు 40వేల ఎకరాల్లో వేశారు. అంతకుముందు మూడేళ్లు తక్కువగా వేశారు. ఈ ఏడాది సాగు ఎక్కువగా ఉంటుంది. వేరుశనగ పంట అంచనాకు మించి సాగు అయ్యే అవకాశం ఉంది. ఇక ఉద్యాన పంటలకు సంబంధించి 30వేల ఎకరాల్లో ఎండుమిర్చి, 3936 ఎకరాల్లో ఆయిల్పాంమ్, 11,665 ఎకరాల్లో ఇతర పంటలు సాగు అంచనాగా ఉంది. ఇదిలా ఉంటే పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల లెక్కలు సైతం అధికారులు సిద్ధం చేశారు. దాదాపు 49వేల క్వింటాళ్ళ పత్తి, వరి, కంది తదితర పంటలకు విత్తనాలు అవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అన్నారు. ఇదిలాఉండగా, ఈ ఏడాది వానాకాలం సీజన్కు అన్నదాతలు సిద్ధం అయ్యారు. గడిచిన పది రోజల వ్యవదిలో మూడునాలుగు సార్లు ఓ మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వేసవి దుక్కులు దున్నుతున్నారు. విత్తనాల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ రెండో, మూడో వారం నాటికి వర్షాలు ఆశించిన స్తాయిలో కురిస్తే చివరి వారంలో విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు. న్యూస్రీల్ఎరువులు ఇలా... 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంట సాగవుతాయని అంచనా పత్తి, వరి, కంది పంటలు అధికంగా సాగుచేసే అవకాశం వేసవి దుక్కులు దున్నుతున్న రైతులు -
క్రీడారంగ అభివృద్ధికి కృషి
నర్వ/మక్తల్: ఔత్సాహిక క్రీడాకారుల ఇబ్బందులు తీర్చేందుకే జాండ్రగుట్ట వద్ద క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటీ శ్రీహరీ అన్నారు. బుధవారం సాయంత్రం నర్వ జాండ్ర గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, క్రీడామైదానానికి అనుమతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రూ. 60 లక్షల నిధులు క్రీడామైదానం ఏర్పాటు కోసం కేటాయిస్తున్నట్లు శివసేనారెడ్డి ప్రకటించి ఇందుకు సంబందించిన పత్రాన్ని అందించారు. ఎమ్మెల్యే తన నిధుల నుంచి రూ. 45 లక్షలు క్రీడామైదానం అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. త్వరలో క్రీడామైదానం పనులు చేపట్టి పూర్తి చేసి క్రీడాకారులు ఆటలు ఆడే విధంగా తయారు చేస్తామని అన్నారు. దీంతో పాటు జూనియర్ కళాశాలను ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్పోర్ట్స్ చైర్మన్ను, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, జిల్లా నాయకులు గౌని లక్ష్మారెడ్డి, క్రిష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మండల నాయకులు శరణప్ప, వివేకవర్ధన్రెడ్డి, అశోక్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్లోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ.5.30 కోట్లతో మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. మారుమూల గ్రామాలలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. మినీ స్టేడియంలో క్రీడాకారులకు అన్ని వసతులు కలిపిస్తున్నామని తెలిపారు. -
నిలిచిన ‘సీయూఈటీ’
షార్ట్సర్క్యూట్ కారణంగా పనిచేయని కంప్యూటర్లు వర్షంలో తడుచుకుంటూ వచ్చాం.. రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి. – సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల పరీక్ష జరగలేదు. సీయూఈటీ పరీక్ష రాసేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – మహేశ్కుమార్, విద్యార్థి, మద్దూరు ●● మహబూబ్నగర్ ‘ఫాతిమా’ స్కూల్ కేంద్రంలో పరీక్షకు దూరమైన 180 మంది విద్యార్థులు ● న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) స్థాయిలో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు) నిర్వహిస్తోంది. వివిధ గ్రూపుల విద్యార్థులు ఈ నెల 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 180 మంది విద్యార్థులు బుధవారం ఉదయం సెషన్ 9 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఉదయం వర్షం కారణంగా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఉన్న ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు సైతం ఆఫ్ అయ్యాయి. గంట తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా.. మళ్లీ 10 నిమిషాల్లోనే మరోసారి షార్ట్ సర్క్యూట్తో సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 180 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో వారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా కొనసాగిన పరీక్ష దేశవ్యాప్తంగా 60కి పైగా సెంట్రల్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ఆన్లైన్లో ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి రూ.950 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా పరీక్ష కొనసాగగా.. ఒక్క మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయ పరీక్ష కేంద్రంలో మాత్రం జరగలేదు. పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం కూడా బయటికి వచ్చాక.. మరోసారి పరీక్ష ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఫాతిమా విద్యాలయ ప్రిన్సిపాల్ థెరిస్సా మాదను స్పందిస్తూ.. పరీక్ష నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి) సమాచారం ఇచ్చామని.. మరోసారి పరీక్ష నిర్వహించే విధంగా ఎన్టీఏ చర్యలు తీసుకుంటుందని చెప్పినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఏపీ ఎంసెట్ వదులకున్నా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వరకు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు సమాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రాయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి. – సాయివర్షిణి, విద్యార్థి, మరికల్ మరో అవకాశం ఇవ్వాలి.. సీయూఈటీ పరీక్ష రాయడానికి మరికల్ నుంచి వచ్చాను. కొన్ని రోజులుగా పరీక్ష కోసం సిద్ధమయ్యాను. తీరా పరీక్షకు వస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోయి కంప్యూటర్లు పనిచేయలేదు. ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహిస్తుందా.. లేక రీషెడ్యూల్ చేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలి. – రామకృష్ణ, విద్యార్థి, మరికల్ -
విషాదం నింపిన ప్రమాదం
గద్వాల క్రైం: కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే అప్పటి వరకు బాలుడు ప్రవీణ్.. తల్లిదండ్రులు, తోబుట్టువులతో స్వరాష్ట్రానికి వెళ్తున్నానంటూ ఆనందంతో గడిపాడు. సంతోషంగా సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల కారులో చిక్కుకుని కుటుంబసభ్యులు కళ్లముందే మృతి చెందడంతో ప్రవీణ్ అనాథగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు భాస్కర్ (41), అతని తల్లిదండ్రుల స్వగ్రామం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామం కాగా, బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం గద్వాలకు వలస వచ్చారు. పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తెలుగు భాస్కర్ బీటెక్ పూర్తి చేసిన అనంతరం కెనరా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. మేనమామ కూతురు పవిత్ర (38)ను వివాహం చేసుకొని గద్వాలలోనే కొన్నేళ్లు క్యాషియర్గా జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే 2022 సంవత్సరంలో పదోన్నతి పొందడంతో కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి మండలంలోని కెనరా బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్కు బదిలీ కావడంతో బుధవారం కుటుంబసభ్యులతో కలిసి కారులో బయల్దేరాడు. ఈక్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు భాస్కర్, అతని భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న (9), అభిరాం (7)తో పాటు కారు డ్రైవర్ (41)మృతిచెందగా..మరో కుమారుడు ప్రవీణ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలియడంతో అటు గద్వాల, మల్దెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు. కొన్ని నిమిషాల ముందు వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా కారులో బయలుదేరిన ప్రవీణ్... రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అమ్మానాన్నతో పాటు అక్క, తమ్ముడిని కోల్పోయి అనాథగా మారాడు. నేడు జిల్లాకు మృతదేహాలు.. ఈ ప్రమాదంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అయిన తర్వాత మృతదేహాలు ఇవ్వనున్నారు. అయితే అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం గద్వాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మృతుడి బంధువులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, తెలుగు భాస్కర్ చిన్ననాటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, బంధువుల సాయంతో బీటెక్ పూర్తి చేసి ఎంతో కష్టపడి బ్యాంకులో ఉద్యోగం సంపాదిచాడని బంధువులు, కాలనీవాసులు గుర్తు చేశారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కి, భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలిచివేస్తుందని.. వారి కుమారుడు ప్రవీణ్ ఆలనా పాలన చూసేది ఎవరంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గద్వాల వాసులు మృతి మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారే తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు గద్వాలలోని బీసీ కాలనీలో విషాదఛాయలు -
విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
మల్దకల్: సమ్మర్ క్యాంపులో విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని డీఈఓ అబ్దుల్ఘని ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి వారి మేధాశక్తిని పెంచేందుకు కృషి చేయాలన్నారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి పెట్టాలన్నారు. విద్య ద్వారానే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంఈఓ సురేష్, ఉపాధ్యాయులు, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు గద్వాలటౌన్: గద్వాల కేజీబీవీలో గత 15 రోజులుగా విద్యార్థినులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. జిల్లాలోని 12 కేజీబీవీల నుంచి సుమారు వంద మంది బాలికలు శిక్షణ పొందారు. నృత్యం, డ్రాయింగ్, క్రాప్ట్, కంప్యూటర్ తదితర అంశాలలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన విద్యార్థినులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ అబ్దుల్ ఘనీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి శిక్షణతో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. నేర్చుకున్న విషయాల్లో మరింత ప్రావీణ్యం సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థినులకు మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో జీసీడీఓ ఫర్జానాబేగం, ఎస్ఓ శ్రీదేవి, ఆర్పీలు పుష్పలత, చంద్రకళ, దివ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం
గద్వాల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, నర్సింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతబ బస్టాండ్లో నిసరన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేందుకు తీసుకువచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్ల కార్మికవర్గ సంపదను రాయితీల రూపంలో అందిస్తుందన్నారు. కార్మికులకు మాత్రం కనీస వేతనాలు ఇవ్వకుండా, భద్రత కల్పించకుండా హక్కులను కాలరాసే విధానాలను కొనసాగించడం దారుణమన్నారు. రూ.లక్షల కోట్ల ధనాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశభక్తి గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దానయ్య, రామకృష్ణ, కోళ్ల అంజి, భరత్, నిజాముద్దీన్, హనీఫ్ పాల్గొన్నారు. -
‘నెట్టెంపాడు’ పెండింగ్ పనులు పూర్తి చేయండి
గద్వాల: జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న 480 ఎకరాల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణలో డిస్ట్రిబ్యూషన్స్, కెనాల్స్ వారీగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. అదే విధంగా భూ సేకరణ పరిహారం చెల్లించిన వెంటనే అవసరమైన సివిల్ పనులు పూర్తిచేయాలని సూచించారు. కాల్వల నిర్మాణంతో సాగు సౌకర్యాలు మెరుగవుతాయని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్ఈ రహీముద్దీన్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
ధరూరు: రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం మండలంలోని భీంపురం, రేవులపల్లి, గార్లపాడు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కొన్న ధాన్యం వివరాలతో పాటు సెంటర్లో కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ట్యాబ్లో ఎంట్రీ చేసి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని త్వరగా తూకం వేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఏపీఎం శోభారాణి ఉన్నారు. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
గద్వాల: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్జడ్జి వి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గద్వాల మండలం మదనపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికులు అంటే ప్రభుత్వంలో నమోదుకాని వ్యాపారాల్లో పనిచేసే వ్యక్తులు అని.. నిత్యం చట్టానికి వెలుపల పనిచేస్తారన్నారు. ఈ రంగం చిన్న వ్యాపారాలను మొదలుకుని ఇంటి ఆధారిత పని వరకు విస్తృత శ్రేణి కార్యకలాపాలను కలిగి ఉంటుందన్నారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం, సామాజిక భద్రత లేకపోవడం, క్రమరహిత ఉపాధి వంటి సమస్యలు ఉంటాయన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే నేరుగా దరఖాస్తు రూపంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్మికులందరూ గుర్తింపు కార్డులు పొందాలని.. తద్వారా ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వి.రాజేందర్, బి.శ్రీనివాసులు, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్రా లీగ్లో రాణిస్తే హెచ్సీఏ టోర్నీలో అవకాశం
గద్వాలటౌన్: ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లో రాణించే క్రీడాకారులను హెచ్సీఏ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని గద్వాల క్రికెట్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పట్వారీ వెంకటేశ్ అన్నారు. స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ మంగళవారం ప్రారంభమైంది. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో మొదటిసారిగా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్లు ప్రారంభించిందన్నారు. జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని సూచించారు. అనంతరం జరిగిన మ్యాచ్లో ఆతిఽథ్య గద్వాల జట్టు నారాయణపేట జట్టుపై 94 పరుగుల ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన గద్వాల జట్టు 40 ఓవర్లలో 240 పరుగులు చేసింది. జట్టు క్రీడాకారుడు జయసింహ 48, అరుణ్కుమార్ 47 పరుగులతో రాణించారు. నారాయణపేట జట్టు బౌలర్ ఆశిష్ 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నారాయణపేట జట్టు 146 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు క్రీడాకారుడు ప్రతీష్ 50 పరుగులతో రాణించారు. గద్వాల జట్టు క్రీడాకారుడు అరుణ్కుమార్ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్ల తీశారు. ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్చంద్ర, కార్యదర్శి శ్రీనివాస్, కోచ్లు రుషేంద్ర, హరినాథ్ పాల్గొన్నారు. -
‘హద్దు’ మీరిన దందా!
●చర్యలు తీసుకుంటాం.. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకున్న వ్యవహారంపై విచారణ జరిపాం. వేరే వడ్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించి కొనుగోలు నిలిపివేశాం. సివిల్సప్లై శాఖలో, రైస్మిల్లర్లపై వస్తున్న ఆరోపణలపై నిఘా ఉంచాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ గద్వాల: ‘‘కాయ్ రాజా కాయ్.. మంచి తరుణం మించిన దొరకదు.. మీ రాష్ట్రంలో వరిధాన్యం క్వింటాల్కు రూ. 1,900 ఉంటే.. ఇక్కడ రూ. 2,300కు కొంటాం.. పైగా రూ. 500 బోనస్ వస్తుంది.. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే.. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. నాకు ఇవ్వాల్సిన వాటా అడ్వాన్స్గా టేబుల్ మీద పెడితే మీ పని చిటికెలో అయిపోతుంది.’’ .. జిల్లాలో ధాన్యం కొనుగోలులో ఓ సివిల్ సప్లయ్ శాఖ అధికారి బాహాటంగానే లంచావతారమెత్తి ఓపెన్ యాక్షన్ బోర్డు పెట్టేయడం సంచలనంగా మారింది. జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో సదరు అధికారి వ్యవహార శైలి నా రూటే సప‘రేటు’ అన్న సినిమా డైలాగ్ తరహాలో ఉంటుందనే పేరుంది. ఆయన మెచ్చిన బడా రైస్మిల్లర్లతోనే మంతనాలు జరుపుతూ.. వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణలో సైతం అక్రమార్కులతో ముందస్తు ఒప్పందం చేసుకుని పొరుగు రాష్ట్రాల ధాన్యాన్ని గోల్మాల్ చేస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. సదరు అధికారి వ్యవహారశైలి ఉన్నతాధికారులకు సైతం తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ రైస్మిల్లుకు అధికంగా ధాన్యం కేటాయించటానికి ఏకంగా రూ.లక్షక్షల్లో వసూళ్లు చేశారనే విషయం షికారు చేస్తోంది. అయితే సదరు మిల్లర్కు మిగతా మిల్లుల కంటే అధికంగా ధాన్యం కేటాయింపులు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం ఆయన రూటే సప‘రేటు’.. బినామీ పేర్లమీద జోరుగా అమ్మకాలు ధాన్యం గోల్మాల్లో చక్రం తిప్పుతున్న సివిల్సప్లయ్ అధికారి ఇప్పటికే రూ.లక్షల్లో వసూళ్లు? అంతర్గత విచారణకు ఆదేశించిన అదనపు కలెక్టర్ -
జోగుళాంబ సన్నిధిలో ఎన్ఐసీడీసీ సీఈఓ
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం నేషనల్ ఇండస్ట్రీయల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) సీఈఓ, ఎండీ రజత్ కుమార్ శైనీ సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ ఈఓ పురేందర్ కుమార్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆలయ సిబ్బంది శేషవస్త్రాలతో సత్కరించారు. సీఈఓ వెంట తహసీల్దార్ మంజుల ఉన్నారు. పిల్లల పెంపకంలో లింగభేదం చూపొద్దు అలంపూర్: పిల్లల పెంపకంలో లింగభేదం చూపొద్దని.. ఆడ–మగ పిల్లలను సమానంగా పెంచాలని యూనిసేఫ్ ప్రతినిధి మేరీ జోన్స్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి మండల కేంద్రంలో కిషోర బాలికలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆడ–మగ పిల్లలు ఇద్దరు సమానమేనని అన్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరినీ సమాన భావంతో విద్యావంతులను చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ నెల 2 నుంచి జూన్ 2వ తేదీ వరకు వేసవిలో కిషోర బాలికలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా అలంపూర్ మండలం క్యాతూర్లో కిషోర బాలికలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ఎల్లప్ప, ఏపీఎం ప్రవీణ్, సీసీలు విజయలక్ష్మి, రజిత, వీఓఏలు అంజలి, మౌనిక లావణ్య, రియాజ్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.4,790 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 72 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 4,790, కనిష్టంగా రూ. 3,421, సరాసరి రూ. 4,430 ధరలు వచ్చాయి. 22 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,839, కనిష్టంగా రూ. 5,819, సరాసరి రూ. 5,839 ధరలు లభించాయి. 294 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 1,972, కనిష్టంగా రూ. 1,521, సరాసరి రూ.1959 ధర పలికింది. ఏడు క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,429, కనిష్టంగా రూ. 6,119, సరాసరి రూ. 6,229 ధరలు వచ్చాయి. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన (గురువారం) పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8 ప్రైవేట్ కంపెనీల్లో 450 ఉద్యోగాల భర్తీకి జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇద్దరు ఎస్ఐల బదిలీ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ జోగులాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కోయిలకొండ ఎస్ఐగా పని చేస్తున్న భాస్కర్రెడ్డిని వీఆర్ వనపర్తికి బదిలీ చేయగా, వీఆర్ వనపర్తిలో ఉన్న కె.తిరుపాజీని కోయిలకొండ పోలీస్స్టేషన్కు ఎస్ఐగా బదిలీ చేశారు. -
విస్తరణకు గ్రీన్సిగ్నల్
మల్లన్న చెంతకు.. నాలుగు వరుసల రోడ్డు అనుసంధానంగా మరో రెండు.. ఎన్హెచ్–765కి అనుసంధానంగా కల్వకుర్తి (కొట్ర గేట్)–నంద్యాల–167కే జాతీయ రహదారి ఏర్పాటవుతుంది. అలాగే సోమశిల ఐకానిక్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరపతి వెళ్లే ప్రయాణికులకు 80 కి.మీ., దూరభారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని కల్వకుర్తి వరకు ట్రాఫిక్ మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రెండు వరుసల ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం అంత సులువు కాదు. దీంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ● హైదరాబాద్– డిండి, మన్ననూర్ రహదారికి మహర్దశ ● రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్హెచ్–765 నిర్మాణం ● మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటు ● స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ● మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ.. శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్) 105.6 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది. అత్యంత కీలక మార్గం హైదరాబాద్– శ్రీశైలం– తోకలపల్లి జాతీయ రహదారి–765 రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. దక్షిణకాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే ఎన్హెచ్–765లో 125 కి.మీ., దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. వన్యప్రాణులు తిరిగే 62.5 కి.మీ., ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తూ మిగతా ప్రాంతంలో భూ భాగంలోనే రోడ్డును విస్తరిస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, మైసిగండి, ఆమనగల్, డిండి, మన్ననూర్ మీదుగా ప్రయాణిస్తారు. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఈ మార్గం గుండానే వెళ్తారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 7,750 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని రవాణా శాఖ అంచనా. శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య 10 వేలకు చేరుతుంది. ఇక 2027 నాటికి 12,200, 2040 నాటికి 27,580కి చేరుతుందని ట్రాఫిక్ అధ్యయనంలో తేలింది. అయితే ఈ రహదారి నల్లమల అటవీ గుండా సాగుతోంది. సుమారు 56 కి.మీ., మార్గం అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉండటంతో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుంది. ఈ రోడ్డు విస్తరణకు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో అటవీ మార్గంలో ఎలివేటేడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. డీపీఆర్ రూపొందించారు.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎలివేటేడ్ కారిడార్ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ప్రమాదాలకు నెలవు.. హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై పెరిగిన వాహనాల రద్దీతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఈ హైవేపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే రహదారిపై తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడుతుండగా మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరించకపోవడంతో పాటు మధ్యలో డివైడర్ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ సంతోష్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులను పిలిచి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 13 అర్జీలు గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 13 అర్జీలు రాగా.. అందులో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగాదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడంలేదని వచ్చినట్లు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు. -
జాతీయ రక్షణ నిధికి రూ.లక్ష విరాళం
గద్వాల: జాతీయ రక్షణ నిధికి రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి రూ.1లక్ష విరాళం ఇచ్చినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా లక్ష్మీకాంతారెడ్డి కలెక్టర్ను కలిసి రైతుభరోసా పథకం ద్వారా జమ అయిన రూ.లక్షను జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేశారు. సేవాగుణం గొప్పదని ఇందుకు లక్ష్మీకాంతారెడ్డినే ఉదాహరణ అని, వీరి సేవలు మిగతావారికి స్ఫూర్తినిస్తాయని కలెక్టర్ అభినందించారు. స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: 2024–25 విద్యాసంవత్సరానికిగాను పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సరోజ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినీ, విద్యార్థులు అర్హతను బట్టి పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు ఫ్రెష్, రెన్యూవల్ కోసం www.epass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి మల్దకల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొన్న వరి ధాన్యాన్ని అధికారులు వెంటనే లారీల ద్వారా ప్రభుత్వ గోదాములకు తరలించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మల్దకల్లోని వరి కొనుగోలు కేంద్రానికి సమీపంలో ఉన్న అయిజ–గద్వాల రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రంలో తమ నుంచి కొన్న ధాన్యాన్ని అధికారులు పది రోజులు గడుస్తున్న గోదాములకు తరలించడంలేదని, వర్షాలకు ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో అయిజ–గద్వాల ప్రధాన రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని రైతులకు నచ్చచెప్పి ధర్నా విరమింప చేశారు. రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులు ప్రశాంత్గౌడ్, కిరణ్ మల్దకల్కు చేరుకొని రైతుల నుంచి కొన్న వరి ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా గోదాములకు తరలిస్తామని చెప్పారు. వేరుశనగ క్వింటా రూ.5,602 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు సోమవారం 67 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 5602, కనిష్టం రూ. 2739, సరాసరి రూ. 4802 ధరలు పలికాయి. 29 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5839, కనిష్టం రూ. 4819, సరాసరి రూ. 5810 ధరలు లభించాయి. 270 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1986, కనిష్టం రూ. 1575, సరాసరి రూ.1769 ధరలు వచ్చాయి. 10 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6425, కనిష్టం రూ. 2500, సరాసరి రూ. 6275 ధరలు పలికాయి. ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు సంబంధించి మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. -
పీడిత ప్రజల పక్షపాతి పుచ్చలపల్లి
గద్వాల: పీడిత ప్రజల అభ్యున్నతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప సంఘ సంస్కర్త, తెలంగాణ రైతాంగ పోరాటయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి కొనియాడారు. సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని గద్వాలలోని పాతబస్టాండ్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రోద్యమంలో ఎంతో క్రియాశీలపాత్ర పోషించినట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంపిణీ చేయించిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం తన సొంత ఆస్తులను దానం చేయడమే కాకుండా సమాజం కోసం పిల్లల్ని కూడా వద్దనుకున్న గొప్ప ఆదర్శవాది అన్నారు. చట్టసభలకు వెళ్లే సమయంలో ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా సాదాసీదాగా సైకిల్పై వెళ్లిన మహోన్నత వ్యక్తి అన్నారు. అగ్రకులంలో పుట్టినప్పటికీ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి దళితుల చేత ఆలయాల ప్రవేశాలు చేయించి సహపంక్తి భోజనాలు చేయించారన్నారు. నీటివనరులు, భూమిపై ఉన్న సహజ వనరులు ప్రజలందరికి సమానంగా అందితే సమాజ అభివృద్ధి జరుగుతుంతని దున్నేవాడిదే భూమి అనే నినాదంతో పోరాటాలు చేశారన్నారు. ఆయన వేసిన బాటలో అందరు నడవాలన్నారు. కార్యక్రమంలో ఉప్పేరు నర్సింహా, ఆంజనేయులు, విష్ణుభాస్కర్, వీరేష్కృష్ణ, నరష్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
పాలమూరు బాధ్యత నాదే
నల్లమల డిక్లరేషన్ను విడుదల చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారులు షబ్బీర్అలీ, వేం నరేందర్రెడ్డిదేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు అవసరమైనా ఉచితంగా అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు చేపడతాం. రానున్న వంద రోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్ అందించి దేశానికి మోడల్గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ అదనపు విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలుబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. స్వంత నియోజకవర్గం నల్లమలలో సాగునీరు, విద్య, ఉపాధి, రోడ్లు, ఇతర అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందని సీఎం అన్నారు. ● ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలకు నిధులు ● ఈ ప్రాంత బిడ్డగా నా బాధ్యత మరింత పెరిగింది ● విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం ● స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రజలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నాదే బాధ్యత. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను గెలిపించి.. నాపై విశ్వాసాన్ని చూపి ఆశీర్వదించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడే అవకాశం దక్కింది. నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేస్తా. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాను’ అని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. సోమవా రం అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. మాచారంలోని చెంచు రైతుల పోడు భూముల్లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్, ప్లాంటేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను పరిశీలించారు. గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పాలమూరు బిడ్డలు అంటేనే తట్ట, పార పని.. ముంబయి, పుణె వలస వెళ్లి కష్టపడేవాళ్లని అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు బిడ్డలే కావాలి. దేశం నలుమూలలా భూములను సస్యశ్యామలం చేసేందుకు మన బిడ్డలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఎవరైనా నేను పాలమూరుకు చెందిన వాడిన ని చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది’ అని పేర్కొన్నారు. సభావేదిక వద్దకు నడిచి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిర సౌర జల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి -
నిరుద్యోగులకు ఉపాధి
50 రోజులపాటు శిక్షణ నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు.. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిజాం పాలనలోని సర్వే వివరాలే కోలమానం జిల్లాలో నిజాం పాలనలో సేత్వార్ పేరిట 1938, 1945 మధ్యకాలంలో సర్వే నిర్వహించారు. అప్పట్లో రెవెన్యూ గ్రామాల వారీగా వాటాదారుల సమాచారంతో ఖస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. ప్రభు త్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగించింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వేకు ప్రభు త్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ భూముల సర్వేకు ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు భూ క్రయ విక్రయాల సమయంలో నక్ష సమర్పించాలనే నిబంధన పెట్టడంతో సర్వేయర్లకు ప్రాధాన్యం పెరిగింది. ‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయి భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం ● భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు.. ● లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ పొందేందుకు అర్హులకు అవకాశం ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు నారాయణపేట/నారాయణపేట రూరల్: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నా రు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తుల వివరాలిలా.. -
నేడు నల్లమలకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు.. ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ స్వగ్రామం కొండారెడ్డిపల్లెలోనూ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి జూపల్లి, ఎంపీ మల్లురవి సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్తో నడిచే బోరు మోటారును ఆన్చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకిస్తారు. 11.35 గంటలకు గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. 1.45 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. -
లక్ష్యం.. నిర్దేశం
గద్వాల వ్యవసాయం: జిల్లాలోని గద్వాల, అలంపూర్ మార్కెట్యార్డులకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రెండు మార్కెట్యార్డులకు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. ఈఏడాది కూడా పంట ఉత్పత్తులు యార్డులకు బాగా వచ్చి లక్ష్యం మేరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, జిల్లాలో జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతో పాటు, నెట్టెంపాడు ప్రాజెక్ట్ పరిధిలోని ఏడు రిజర్వాయర్లు, 120దాకా చెరువులు, ఇంకా కుంటలు ఉన్నాయి. దీంతో ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఏటా వానాకాలం సీజన్లో 1.27లక్షల హెక్టార్లు, యాసంగిలో 48వేల హెక్టార్లలో వరి, పత్తి, కంది, ఆముదం, వేరుశనగ, మొక్కజొన్న, ఎండుమిర్చి తదితర పంటలు రైతులు పండిస్తున్నారు. పండించిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు గద్వాల, అలంపూర్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఇందులో అలంపూర్ మార్కెట్యార్డుకు అయిజ సబ్మార్కెట్గా ఉంది. యార్డులకు ఆదాయం ఇలా.. యార్డులలో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలపై మొత్తం సరుకు విలువలో నూటికి రూపాయి లెక్కన యార్డుకు సెస్ వస్తుంది. ఇతర ప్రాంతాలకు పంట ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకెళ్తే చెక్పోస్టుల వద్ద కూడా యార్డులు మొత్తం సరుకు విలువలో నూటికి రూపాయి వసూలు చేస్తాయి. ఇదిలాఉండగా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో మార్కెట్యార్డులకు ప్రభుత్వం ఆదాయ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. 2025–26కి గాను గద్వాల యార్డుకు రూ. 5.25 కోట్లు, అలంపూర్ యార్డుకు రూ. 4 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. కాగా 2024–25లో గద్వాల యార్డు నిర్దేశించిన లక్ష్యం రూ. 4.24కోట్లకు గాను రూ.4.77కోట్లు, అలంపూర్ యార్డు లక్ష్యం రూ.2.44కోట్లకు గాను రూ. 4.07 కోట్లు సాధించాయి. జిల్లాలో ఏడాది అంతా వేరుశనగ యార్డుకు విక్రయానికి వస్తోంది. దీనివల్ల ఆదాయం బాగా వస్తుందని చెబుతున్నారు. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వల్ల కూడా ఆదాయం వస్తుందని, వీటన్నింటి వల్ల లక్ష్యం మేరకు ఆదాయం లభిస్తుందని అంననా వేశారు. ఇక అలంపూర్ మార్కెట్యార్డుకు విషయానికి వస్తే ఇక్కడ రోజువారి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిర్వహించరు. లైసెన్స్ ఉన్న ట్రేడర్స్ రైతుల నుంచి కొన్ని సార్లు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు యార్డుకు సెస్ లభిస్తుంది. ఈమార్కెట్ యార్డు పరిది కింద ఎర్రవల్లి, పుల్లూరు, అయిజలలో చెక్పోస్టులు ఉన్నాయి. ఈ చెక్పోస్టుల నిర్వహణ ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. మిల్లుల నుంచి కూడా ఆదాయం వస్తోంది. అయిజ సంత నుంచి రెండేళ్లుగా ఆదాయం బాగా పెరిగింది. మార్కెట్ యార్డు నుంచి 2.50 ప్రభుత్వ రంగ సంస్థలు 1.26 మిల్లులు 1.15 చెక్పోస్టులు 0.25 పశువుల సంత 6 లక్షలు కూరగాయల మార్కెట్ 3లక్షలు గద్వాల యార్డులో వరి ధాన్యాన్ని కాంటా వేస్తున్న కార్మికులు (ఫైల్)అలంపూర్ యార్డు లక్ష్యం ఇలా.. (రూ.కోట్లలో) చెక్పోస్టుల నుంచి 2.00 మిల్లులు, ట్రేడర్స్ 1.10 ప్రభుత్వ రంగ సంస్థలు 0.70 సంత నుంచి 0.20 గతేడాది గద్వాల, అలంపూర్ యార్డులకు రికార్డు స్థాయిలో ఆదాయం జిల్లా కేంద్రంలో జోరుగా పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరం గద్వాలకు రూ.5.25 కోట్లు.. అలంపూర్కు రూ.4 కోట్లు ఆదాయ లక్ష్యాల నిర్దేశం -
పాలమూరు అందాలు చూసొదా్దం
పిల్లలమర్రి మహబూబ్నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగులాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ వృక్షానికి 750 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రి వృక్షం. పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. మహబూబ్నగర్లోని మెట్టుగడ్డ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏడు తరాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రి, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, ఆకట్టుకునే ప్రాజెక్టులు, ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో కృష్ణమ్మ ఒడిలో సాగే బోటు ప్రయాణాలు, జలపాతాలు, జంగిల్ సఫారీ.. ఇలాంటి ఎన్నో విశేషాలతో పాలమూరు పర్యాటకం సందర్శకులను కనువిందు చేస్తోంది. రోజురోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్ను జాలీడేస్గా మార్చేస్తోంది. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మానవపాడు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అలంపూర్ జూనియర్ సివిల్ కోర్డు జడ్జి మిథున్ తేజ అన్నారు. శనివారం మండలంలోని మద్దూరు గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చదువు కోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అలాగే, బాల్యవివాహాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఆర్థిక లావాదేవీలు, భూ క్రయవిక్రయాలకు సంబంధించి ఖచ్చితంగా లిఖితపూర్వకంగా పత్రాలు కలిగి ఉండాలని, రైతులు విత్తనాలు, ఎరువులు కొన్నప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నష్టపోతే రశీదు ఉండటం వల్ల లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, గృహహింస చట్టం, న్యాయ సేవాసంస్థ అందించే సేవలతోపాటు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, నారాయణరెడ్డి, శ్రీధర్రెడ్డి, మధు, గజేంద్రగౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
గద్వాలటౌన్: ఉపాధ్యాయులు.. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఐదురోజులుగా ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం, ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు కొనసాగిన శిక్షణ కార్యక్రమాలు శనివారం ముగిశాయి. స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బోధన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అందుకోసమే విద్యాశాఖ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి శిక్షణ దోహదపడుతుందని, వారిని మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రానున్న విద్యా సంవత్సరం కృత్రిమ మేధ బోధన అన్ని పాఠశాలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా సులభమైన బోధన పద్ధతులు అవలంభించాలన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఎస్తేర్రాణి, కోర్సు డైరెక్టర్లు బీకే రమేష్, అమీర్బాష, వెంకటనర్సయ్య, అంపయ్య తదితరులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మల్దకల్: పంటల సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని.. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని పాలెం శాస్త్రవేత్తలు నళిని, శంకర్ రైతులకు సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శనివారం మండలంలోని విఠలాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని సూచించారు. పంటలకు ఆశించే చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నాణ్యమైన విత్తనాలను వాడి అధిక దిగుబడులను పొందాలని, రసాయన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతిని పంటలు నష్టపోయే వీలుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరిగా రైతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్, ఏఈఓ భాస్కర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రిలో అందగత్తెల సందడి
పిల్లలమర్రి మహావృక్షం వద్ద సుందరీమణులను సన్మానిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీహరి, మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పర్ణికారెడ్డి, తదితరులు విద్యార్థులతో మాటామంతీ.. మహా వృక్షం సందర్శించిన తర్వాత మిస్ వరల్డ్ పోటీదారులు జిల్లాకు చెందిన విద్యార్థులతో చిట్చాట్ చేశారు. నలుగురు విద్యార్థులు నాలుగు ప్రశ్నలు అడిగారు. అందులో ఓ చిన్నారి మీ మిస్ వరల్డ్ జర్నీ గురించి వివరించండని ప్రశ్నించగా.. జపాన్కు చెందిన పోటీదారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మరో చిన్నారి పిల్లలమర్రి సందర్శన తర్వాత వృక్ష సంరక్షణపై మీరు ఇతరులకు అవగాహన కల్పిస్తారా? అని అడిగారు. దీనిపై ఇండియాకు చెందిన పోటీదారు మాట్లాడుతూ ఇండియన్ అని, మాది రైతు కుటుంబమని, చెట్ల గురించి తనకు తెలుసని.. వాటి పెంపకం గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని వివరించారు. విశ్వ వేదికలపై మాట్లాడటానికి సూచనలివ్వాలని ఓ విద్యార్థి కోరగా.. బంగ్లాదేశ్ చెందిన కంటెస్టెంట్ సమాధానమిచ్చారు. ఆత్వవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పారు. చివరగా ఓ విద్యార్థి మీ చిన్ననాటి కలల గురించి చెప్పండని ప్రశ్నించగా.. నేపాల్, థాయ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్కు చెందిన మిస్వరల్డ్ పోటీదారులు స్పందించారు. మహావృక్షం వద్ద 2 గంటలు.. రాజరాజేశ్వర ఆలయం, మ్యూజియం సందర్శన తర్వాత సాయంత్రం 6.01 గంటలకు అందాలభామలు మహావృక్షం వద్దకు చేరుకున్నారు. జిల్లా అటవీ అధికారి సత్య నారాయణ పిల్లలమర్రి చరిత్రను వివరించారు. 700 ఏళ్ల నాటి ఈ వృక్షాన్ని 2018 నుంచి ఎలా సంరక్షిస్తూ వస్తున్నామనే అంశాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం మర్రిచెట్టు సమీపంలో 11 మొక్కలు నాటారు. ఆ తర్వాత మహావృక్షం చెంత ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే టీ, స్నాక్స్ తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దాదాపు 2 గంటలు మహావృక్షం వద్దే ఉన్నారు. అనంతరం చేనేత స్టాల్స్ను సందర్శించారు. గద్వాల, నారాయణపేట చేనేతలు తయారు చేసిన చీరలను పరిశీలించారు. అక్కడే ఉన్న మగ్గాన్ని, వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తొలుత రాజరాజేశ్వర ఆలయం నుంచి.. పిల్లలమర్రికి చేరుకున్న అందాల భామలకు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి సంపంగి, లైట్ పింక్ గులాబీ పువ్వులతో తయారు చేసిన మాలలను వేసి స్వాగతం పలికారు. ముందుగా 16వ శతాబ్దం కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ చరిత్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ ఆలయం ముంపునకు గురైతే ఇక్కడికి తీసుకొచ్చి పునఃప్రతిష్టించినట్లు మిస్వరల్డ్ పోటీదారులకు గైడ్ శివనాగిరెడ్డి వివరించారు. అక్కడి నుంచి మ్యూజియం వద్దకు చేరుకోగా.. వివిధ విగ్రహాలు, శిల్పాల విశిష్టత, పాత రాతియుగం పనిముట్లు, నవీన శిలాయుగపు పనిముట్లు, బృహత్ శిలాయుగపు పాత్రలు, విజయనగర, కుతుబ్ షాహీల కాలంనాటి ఆయుధాలు, విగ్రహాల గురించి వివరించారు. మ్యూజియంలో శాతవాహనుల నుంచి అసఫ్జాహి రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు, రాగి, బంగారు నాణేలతో పాటు మహా శివలింగం, దాని ముందు ఉన్న నంది విగ్రహాల గురించి శివనాగిరెడ్డి వివరించారు. -
డెంగీ రహిత జిల్లాగా మార్చుదాం
గద్వాల క్రైం: డెంగీ రహిత జిల్లాగా మార్చుదామని.. దీనికోసం దోమల నివారణలో అంతా భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్ధప్ప అన్నారు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తా, చెదారం, మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సాధారణ జ్వరం కంటే దోమల ద్వారా వచ్చే విషజ్వరాలు మనుషుల నాడీ వ్యవస్థపై దాడి చేసి తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాధి సోకుతుందని, ప్రజలు ఆరోగ్య విషయాలపై వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి తగు మందులు వాడాలని సూచించారు. -
జోగుళాంబ గద్వాల
పకడ్బందీగా ధాన్యం కొనుగోలు శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025ఫొటో తీస్తున్న మిస్ ఇండియా గద్వాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సంచుల్లో నింపి వెంటనే మిల్లులకు తరలించి అన్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అవసరమైన ట్రాన్స్ఫోర్ట్ వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గన్నీబ్యాగుల కొరత లేకుండా, వర్షాలు కురిసినప్పుడు ధాన్యం రక్షణకు టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఏవో సక్రియనాయక్ పాల్గొన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అర్హులైన వారికే ఇళ్ల కేటాయింపులు చేయాలని కలెక్టర్ అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల వారీగా లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేసి జాబితాను సిద్ధం చేయాలన్నారు. అర్హత లేనివారి గల కారణాలు వివరిస్తూ జాబితాలో పొందుపర్చాలన్నారు. పారదర్శకంగా ‘యువ వికాసం’ లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో రాజీవ్యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ప నిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీపీవో నాగేంద్రం, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్; ఎల్డీఎం శ్రీనివాసరావు, మున్సిపల్ కమీ నర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈవీఎంల పరిశీలన పటిష్ట భద్రత ఏర్పాట్లతో నిరంతరం ఈవీఎంలను భద్రపర్చాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూంలో ఈవీఎం యంత్రాలను పరిశీలించారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ బీఎం సంతోష్ తళుక్కుమన్న సుందరీమణులు ● మహావృక్షాన్ని సందర్శించిన మిస్వరల్డ్–25 పోటీదారులు ● 22 దేశాలకు చెందిన యువతుల రాక ● ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పర్యటన -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
ఇటిక్యాల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈమేరకు పైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఇటిక్యాల మండలంలోని మునగాలలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తూ.. పరిష్కారానికి అనువుగా ఉన్న సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత, భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టుగా ఇటిక్యాల మండలాన్ని ఎంపిక చేసి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వివరించారు. భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నెంబర్ గల్లంతు, పట్టాదారు పాస్బుక్జారీ కాకపోవడం వంటి అంశాలు పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ సదస్సులో తహశీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, డి టి నందిని, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘన స్వాగతం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా మీదుకు నారాయణపేట పర్యటన వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ విజయేందిర మొక్కను అందజేసీ స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి మహావృక్షం ఫొటోను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావు, ఆర్డీఓ నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘన్సిరాం, డీటీ దేవేందర్, ఆర్ఐలు నర్సింగ్, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటాం కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని బోడబండ తండా, సున్నపుతండా, వడ్డెర గుడిసెలను కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి మంత్రి సందర్శించి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీరు వస్తుండటంతో సున్నపుతండా మునకకు గురయ్యే అవకాశం ఉందని.. ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో ఇళ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో సర్వం కోల్పోయిన ప్రజలకు అన్నివి ధాలా అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బోడబండ తండా, సున్నపు తండా, వడ్డెర గుడిసెల కు చెందిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏకలవ్య పాఠశాలలో ప్రవేశానికి అవకాశం కందనూలు: తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్లో మిగిలిన సీట్ల భర్తీకి గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ అధికారి కె.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి ఆసక్తిగల విద్యార్థులు tsemrs.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని.. బాలానగర్ కళాశాలలో ఈ నెల 26న నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 94156 06618, 98557 37578 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
పాలమూరుకు అందాలభామలు
ప్రపంచ సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సుందరీమణుల బృందానికి స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గురువారం ఎస్పీ డి.జానకితో కలిసి కలెక్టర్ పిల్లలమర్రిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు.. ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, ఏఎస్పీ రాములు, డీఎఫ్ఓసత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ● 22 దేశాలకు చెందిన అందగత్తెల రాక ● అన్ని ఏర్పాట్లు చేసిన పర్యాటక శాఖ ● మూడు అంచెల భద్రతతో భారీ బందోబస్తు ఏర్పాటు ● 2 గంటల పాటు కొనసాగనున్న పర్యటన పాలమూరు: ఏడున్నర శతాబ్దాల చరిత్ర ఉన్న పిల్లలమర్రిలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు సందడి చేయనున్నారు. హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుల బృందం శుక్రవారం పాలమూరుకు రానుంది. వారి కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 22 దేశాలకు చెందిన విదేశీ అందగత్తెలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 5 గంటలకు మహబూబ్నగర్కు చేరుకోనున్నారు. పిల్లలమర్రి ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేశారు. మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డును సుందరీకరించడంతో పాటు ఇరువైపుల విద్యుత్ స్తంభాలకు రంగులు వేశారు. తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య సుందరీమణుల బృందానికి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత కల్పిస్తాం.. ప్రంపచ సుందరీమణుల పర్యటన సందర్భంగా పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి పిల్లలమర్రి వరకు ప్రత్యేక కాన్వాయ్ కొనసాగుతుంది. మూడు అంచెల భద్రతతో పోలీస్ బలగాలు విధుల్లో ఉంటాయి. పర్యాటకులు, ప్రజలు మన ప్రాంతానికి వచ్చే అతిథిలతో గౌరవంగా ఉండాలి. పోలీస్శాఖ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ ● మిస్వరల్డ్ పోటీదారుల బృందం మహబూబ్నగర్లో రెండు గంటల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటారు. పది నిమిషాల పాటు విశ్రాంతి తర్వాత మొదట చారిత్రక కళాఖండాలు, శిల్పకళలను తిలకిస్తారు. ఆ తర్వాత పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. అనంతరం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉన్న పిల్లలమర్రి మహావృక్షాన్ని తిలకిస్తారు. అక్కడే ఒక్కొక్క అందగత్తె ఒక్కొక్క మొక్కను నాటనున్నారు. అనంతరం తిరిగి వారు రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నేడు పిల్లలమర్రిని సందర్శించనున్న ప్రపంచసుందరి పోటీదారులు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు మిస్ వరల్డ్–2025 పోటీదారుల పర్యటను సంబంధించి జిల్లా పోలీస్ శాఖ 1,008 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. మూడు అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. మొదటి వరుసలో మహిళ పోలీస్ సిబ్బంది విత్ సఫారీలో ఉండగా, రెండో వరుసలో సివిల్ పోలీస్, మూడో వరుసలో ఏఆర్ పోలీస్ బలగాలను బందోబస్తు కోసం కేటాయించనున్నారు. వీరితో పాటు స్పెషల్ పార్టీ, రాష్ట్రస్థాయి నుంచి బలగాలు పహారా కాస్తాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ల నుంచి పోలీస్ బలగాలను రప్పించారు. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 936 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు. బందోబస్తును మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ డి.జానకి పర్యవేక్షించనున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
గద్వాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై బీచుపల్లి నుంచి పుల్లూర్ జంక్షన్ వరకు ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించి బ్లాక్స్పాట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఎర్రవల్లి నుంచి గద్వాల వరకు ప్రమాదసూచిక బోర్డులు, హెచ్చరికలు సూచించే గుర్తులు, కల్వర్టుల మరమ్మతు చేయాలని ఆర్అండ్బీ శాఖ అధికారులను ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద రాత్రి వేళలో సరైన వెలుతురు స్పష్టమైన సైన్బోర్డులు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ ప్రజల ప్రాణభద్రతకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రోడ్డుప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని పట్టుకునేందుకు నిరంతరంగా డ్రంక్అండ్డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, డీటీవో వెంకటరమణరావు, డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప, హిమాన్ష్గుప్త, ఎకై ్సజ్శాఖ, పంచాయతీశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆగని భూకబ్జాల పర్వం
జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా మున్సిపల్ స్థలాలు కబ్జా ●స్థలాలను కాపాడాలి లేఅవుట్ ప్లాన్లో ప్రజా అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యాయి. వాటిపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశాం. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కబ్జాకు గురైన ఖాళీ స్థలాలను కాడాలి. భవిష్యత్తులో ఎవరూ అందులో చోరబడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. – పూజారి శ్రీధర్, గద్వాల రక్షణ చర్యలు చేపడతాం అధికారిక లేఅవుట్లోని పది శాతం స్థలాలను అమ్మడం, కోనడం నిబంధనలకు విరుద్ధం. విక్రయించిన లేఅవుట్ స్థలంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. వెంటనే టౌన్ ఫ్లానింగ్ అధికారులతో మార్కింగ్ చేసి ఆయా స్థలాలకు రక్షణ చర్యలు తీసుకుంటాం. స్థలాల కొనుగోలు విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. – దశరథ్, కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: గద్వాల పట్టణ శివారులో వెలిసిన లేఅవుట్లలో అక్రమ దందా కొనసాగుతోంది. అప్పట్లో సామాజిక ప్రజా అవసరాల కోసం ఇచ్చిన స్థలాలు రాత్రికి రాత్రే ఇళ్ల స్థలాలుగా మారుతున్నాయి. నాడు తయారు చేసిన అధికారిక లేఅవుట్ మ్యాప్లో సామాజిక స్థలాలు ప్రత్యేకంగా చూపించి ప్లాట్ల స్థలాలను విక్రయించారు. అధికారిక లేఅవుట్లో గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రర్ అయిన పది శాతం స్థలాన్ని అక్రమార్కులు ప్లాట్లుగా చేసి విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు. ఈ ఉదంతాలు మున్సిపల్ పరిధిలో అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికి అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. ఊదాసీనంగా అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లను అడ్డుకోవడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వ స్థలంగా ఉన్న సామాజిక స్థలాలు అక్రమంగా ఇతరులకు ధారాదత్తం అవుతున్న ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అంతేగాక కొంతమంది రియల్టర్లు కుమ్మకై ్క ‘మాకెంత.. మీకెంత అంటూ..’ అంటూ బేరసారాలకు దిగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లేఅవుట్లోని పది శాతం స్థలం అన్యాక్రాతం అవుతుందని, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నారని చాలామంది మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇప్పటికే అనేక అధికారిక లేఅవుట్లలో ఉన్న సామాజిక స్థలాలు కనుమరుగయ్యాయి. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి లేఅవుట్లలో విక్రయించిన పది శాతం సామాజిక స్థలానికి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. లేఅవుట్లోని పార్కు స్థలాలు సైతం మాయం రూ.లక్షలు వెనకేసుకుంటున్న అక్రమార్కులు -
అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు
అలంపూర్: అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముభారక్, సీఎం సహాయ నిధి చెక్కులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...పేదింటి ఆడపిల్లలకు పెళ్లి కానుక ద్వారా రూ.లక్ష 116 అందిస్తుందన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.70 లక్షల విలువగల కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా సీఎం సహాయ సహాయ నిధి ద్వారా 102 మంది లబ్ధిదారులకు రూ.25 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. లబ్దిదారులు సకాలంలో చెక్కులను తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
నేటినుంచి డిగ్రీ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలు పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏబీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లతోపాటు పలు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు మెటీరియల్ చేరుకుంది. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 17 ప్రభుత్వ.. 30 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సె మిస్టర్–2లో 16,073 మంది విద్యార్థులు, సెమిస్ట ర్– 6లో 13,787 మంది, సెమిస్టర్–4లో 9,240 మంది విద్యార్థులు కలిపి మొత్తం 39,100 మంది పరీక్ష రా యనున్నారు. 9 రూట్లలో ఫ్లయింగ్ స్క్వాడ్, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ను నియమించారు. మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలు పక డ్బందీగా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. రెండుసార్లు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రారంభం 47 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 39,100 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తిచేశాం.. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా కాపీయింగ్ తావు లేకుండా పకడ్బందీగా, పాదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ -
ధాన్యాన్ని మిల్లులకు వెంటనే తరలించాలి
ధరూరు: కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎక్కడా నిల్వ ఉంచుకోవద్దని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని అల్వలపాడులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎంత తరలించారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా డిజిటల్ తేమ మిషన్ ద్వారా తేమ శాతాన్ని పరిశీలించి 17 శాతం రాగానే ధాన్యాన్ని కాంటా వేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ముఖ్యంగా గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని సివిల్ సప్లయ్ డీఎంను ఆదేశించారు. ధాన్యం రవాణాకు ఎక్కువ సంఖ్యలో లారీలను సిద్ధం చేసి ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంట వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని, ఆ తర్వాత రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, కాంటా వేసే విషయంలో పారదర్శకంగా తూకాలు వేయాలని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేసేలా ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, సివిల్ సప్లయ్ డీఎం విమల్, తహశీల్దార్ భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రి ‘ముస్తాబు’
● 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి సందర్శన ● మహావృక్షం ఖ్యాతిపైపవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఏర్పాట్లు ● విజయనగరం కాలం నాటి ఆలయం.. పురావస్తు మ్యూజియానికి సొబగులు ● తెలంగాణతోపాటు జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా అధికారుల సన్నాహాలు ● వెదురు ఆకృతులు, చేనేత చీరలు, మగ్గాలు, బతుకమ్మలు,బోనాల ప్రదర్శన ● గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం.. గురుకులాల విద్యార్థులతో మాటాముచ్చట ● సుమారు వెయ్యి మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 16న ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో పాలమూరు ముస్తాబవుతోంది. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని వారు సందర్శించనుండగా.. మహావృక్షం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. ఆలయం.. మ్యూజియం.. ఆ తర్వాత పిల్లల మర్రి.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు. పిల్లలమర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పురావస్తు మ్యూజియానికి రానున్నారు. ఆ తర్వాత లంబాడాల నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకోనున్నారు. మహా వృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర ఆలయ విశిష్టతతోపాటు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం విశేషాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్లను నియమించారు. గద్వాల, నారాయణపేట చేనేత చీరల ప్రదర్శన.. మన నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రఖ్యాతి గాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజసిద్దంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించనున్నారు. దీంతోపాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్త కళానైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల మర్రి ఆవరణలో 22 మంది అందాల భామల చేతుల మీదుగా వివిధ రకాల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టారు. చివరగా గురుకుల విద్యార్థులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కాసేపు ముచ్చటించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 2 గంటలు.. మూడంచెల బందోబస్తు మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లకు చెందిన గ్రూప్–2 సభ్యులు 16న సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గాన మహబూబ్నగర్లోని పిల్లలమర్రి వద్దకు నేరుగా చేరుకుంటారు. పలు కార్యక్రమాల అనంతరం తిరిగి రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు తెలిసింది. ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు మూడంచెల బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. రేపు ప్రపంచ సుందరీమణుల రాక గ్రూప్–2లోని 22 మంది అందగత్తెలు.. ఏర్పాట్లు ఇలా.. మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లు పిల్లల మర్రి పర్యటనను పురస్కరించుకుని పురావస్తు, అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊడల మర్రి చుట్టూ మట్టిని చదును చేసి, గ్రాస్ మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహావృక్షం చుట్టూ గోడ, ఊడల మర్రి పునరుజ్జీవంలో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లరతోపాటు సిమెంట్ కుర్చీలకు రంగులు అద్దుతున్నారు. పిల్లలమర్రి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లతోపాటు ప్రత్యేకంగా వాష్రూంలను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మ్యూజియంలోని శిల్పాలను శుభ్రం చేయడంతోపాటు వాటికి నేమ్ బోర్డులు రాయిస్తున్నారు. ఆయా శిల్పాలు ఏ కాలానికి చెందినవి.. ఎవరి హయాంలో తయారు చేశారు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వంటి వివరాలు నేమ్ బోర్డులో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో సౌండ్ అండ్ లైటింగ్, పారిశుద్ధ్య పనులు చకచకా సాగుతున్నాయి. మిస్ వరల్డ్–25 పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరుగుతున్న పోటీల్లో వందకు పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిచెప్పేందుకు ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం వేదికగా మలుచుకుంది. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను గ్రూప్–1, గ్రూప్–2గా విభజించి.. ప్రత్యేక థీమ్, టూరిస్ట్ సర్క్యూట్ల వారీగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పాలమూరులో ప్రఖ్యాతిగాంచిన పిల్లల మర్రిని గ్రూప్–2లోని వివిధ దేశాలకు చెందిన 22 మంది అందగత్తెలు శుక్రవారం సందర్శించనున్నారు. -
ధర లేక.. దిక్కుతోచక !
ఎండుమిర్చి రైతు కుదేలు ●తెగుళ్లు ముంచాయి ఎండుమిర్చికి ఆకుముడుత తెగులు సోకి పంట గిడుసబారింది. ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మిరప పంట నాణ్యత లేనందున ధర కేవలం రూ.10 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. పంటను విక్రయిస్తే నష్టమే వస్తోంది. – జగన్నాథరెడ్డి, మిర్చి రైతు, అయిజ గిట్టుబాటు ధర కల్పించాలి మిర్చి పంట విక్రయానికి అధికారులు మార్కెట్ సౌకర్యం, గట్టుబాటు ధర కల్పించాలి. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో పంటను హైదరాబాద్, బెంగుళూరు, గుంటూరుకు తరలిస్తున్నారు. రవాణా ఖర్చు భారమవుతుంది. జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఎండుమిర్చి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. – గోవిందు, మిర్చి రైతు, అయిజ దళారులు దోచుకుంటారు ఎండు మిర్చికి మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో చిన్న రైతుల నుంచి మధ్యదళారులు మార్కెట్ ధర కంటే క్వింటాకు రూ.2 వేలు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. అసలే రూ.లక్షలకు లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెడితే.. పెట్టుబడి రాకపోగా దళారులు నిండా ముంచుతున్నారు. – దేవేందర్, రైతు, సింధనూరు పంట మార్పిడి చేయాలి ఏటా మిరప పంట సాగుచేస్తుండడంతో పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించి దిగుబడులు తగ్గుతున్నాయి. ఏటా పంట మార్పిడి చేయాలి. ఈ ఏడాది మిరప సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. మార్కెట్లో ధర కూడా పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. గతేడాది పండించిన మిరపను రైతులు కోల్డ్ స్టోరేజ్ గోదాంలలో నిల్వచేసుకున్నారు. ఈ ఏడాది వచ్చిన పంటను నిల్వ చేసుకునేందుకు గోదాంలు చాలడం లేదు. రైతులు హార్టికల్చర్ అధికారుల సూచన మేరకు సాగుచేస్తే నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. – మహ్మద్ అలీ అక్బర్, హార్టీకల్చర్ జిల్లా అధికారి అయిజ: ఆరుగాలం కష్టపడి ఎండు మిరపను పండించిన రైతుకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. అటు మిర్చి దిగుబడి ఘననీయంగా తగ్గిపోగా.. ఇటు మార్కెట్లో ధరలు అమాంతం పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ సౌకర్యం కల్పించాల్సిన అధికారులు చేతిలెత్తేయడంతో మిర్చి పండించిన రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పురుగులు, తెగుళ్ల కారణంగా గతేడాదితో పోల్చితే ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. అదేవిధంగా మార్కెట్లో క్వింటాకు ధర రూ.10 వేలు తక్కువ పలుకుతోంది. పండిన పంటను అమ్మకుందామంటే జిల్లాలో మార్కెట్ లేదు. సుదూర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్కు పంటను తరలించాలంటే అన్నదాతలు వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. విధిలేక దళారులకు విక్రయిద్దామంటే మార్కెట్ రేటుకంటే రూ.2 వేల నుంచి రూ.3వేలు తక్కవకు ధరకు అడగడంతోపాటు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అంచనాలు తప్పాయి.. జిల్లాలో 2024లో 65,115 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా.. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మిర్చి రకాలను బట్టి ధర రూ.15 వేల నుంచి రూ. 25వేల వరకు పలికింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు సగం విస్తీర్ణం తగ్గిపోయింది. సాగుబడి తక్కువ విస్తీర్ణం ఉండడంతో ధర ఎక్కువ పలుకుతుందని, లాభాలు ఎక్కువగా ఉంటాయని ఊహించిన రైతుల అంచనాలు తప్పాయి. ధర ఘననీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది వానాకాలంలో 19,785 మంది రైతులు 37,801 ఎకరాల్లో ఎండుమిర్చిని సాగుచేశారు. పంటకు వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించాయి. తామర పురుగు పంటపై పగబట్టింది. ఆకుముడుత ఈ ఏడాది ఎక్కువ శాతం పెంటలను దెబ్బతీసింది. రైతులు ఎన్ని రకాల మందులు పిచికాారీ చేసినా ఫలితం లేకపోయింది. అప్పులు మిగిలాయి కానీ పురుగులు మాత్రం చావలేదు. మొత్తంగా ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఎండుమిర్చి రకాలను బట్టి ధర రూ.10 వేల వేల నుంచి రూ.13 వేల వరకు మాత్రమే పలుకుతోంది. మధ్యరకంగా తీసుకుంటే ఎకరానికి రైతులకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రాబడి వస్తోంది. పెట్టుబడి ఎకరానికి సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టారు. దీంతో రైతులు ఆరుగాలం పడిన కష్టం వృథా అయ్యింది. పెట్టుబడులు తిరిగి రాకపోగా రైతులు అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మండలం సాగు విస్తీర్ణం రైతులు (ఎకరాల్లో) ఇటిక్యాల 6,022 2,733 మానవపాడు 5,852 2,809 అయిజ 4,991 2,811 ఎర్రవల్లి 4,729 2,281 గద్వాల 4,366 2,397 గట్టు 3,507 2,194 మల్దకల్ 2,875 1,734 వడ్డేపల్లి 2,830 2,281 ఉండవెల్లి 2,830 1,344 రాజోళి 1,016 666 అలంపూర్ 671 245 ధరూరు 133 94 కేటీదొడ్డి 121 87 జిల్లాలో మిర్చి సాగు ఇలా.. తెగుళ్లతో తగ్గిన దిగుబడులు పడిపోయిన మార్కెట్ ధరలు కోల్డ్ స్టోరేజీల్లో పేరుకుపోయిన ఎండుమిర్చి నిల్వలు -
ప్రశాంతంగా పాలిసెట్
● 78 మంది విద్యార్థులు గైర్హాజరు గద్వాల టౌన్: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,780 మంది విద్యార్థులకు గాను 1,702 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 78 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 95.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉదయం 9 గంటల వరకే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పది గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఇచ్చారు. నిమిషం నిబంధన ఉండటంతో పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా కేంద్రాలలో ఒక్కో బెంచీకి ఒక్కరే విద్యార్థి పరీక్ష రాసే విధంగా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల దగ్గర గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులు నిరంతంర పర్యవేక్షించారు. పరీక్ష పూర్తయిన తరువాత బందోబస్తు మధ్య పరీక్ష పేపర్లును వాహనాలలో తరలించారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు గద్వాల: అక్రమ లేఅవుట్లను 25శాతం రాయితీతో క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడగించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 47,063 దరఖాస్తులు రాగా వాటిలో 25,710 మందికి 25 శాతం రాయితీతో కూడిన ఎల్ఆర్ఎస్ సమాచారాన్ని పంపినట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 14,313 మందికి, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 11, 397 మందికి సమాచారాన్ని పంపగా వీరిలో కేవలం 6165 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 18న చెస్ పోటీలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18న జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 9, 11 బాలలకు చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోటీలు జరుగుతాయని.. మొదటి, రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల బాలలు పోటీలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంఘం జిల్లా అధ్యక్షుడు (సెల్నంబర్ 97034 62115), కోశాధికారి టీపీ కృష్ణయ్య (సెల్నంబర్ 99591 54743) సంప్రదించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి కేటీదొడ్డి: కర్ణాటక రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపురం గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకు రాష్ట్రం నుంచి వచ్చే రైతులకే ముందుగా టోకన్లు ఇస్తున్నారని ఇక్కడి నెలల నుంచి ఉన్న రైతులకు టోకెన్లు, గన్నీ బ్యాగ్స్ ఇవ్వడం లేదని ఆయన అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావుకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. తూకంలో తరుగులు ఎక్కువ తీస్తున్నారని అవకతవకలు జరుగకుండా చూడాలని అన్నారు. ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వారికి కేటాయించిన రైస్ మిల్లులకు తనలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి స్వప్న, మండల అధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, నాయకులు హన్మిరెడ్డి, ఎర్రభీంరెడ్డి, శ్రీనివాసులు, నాగిరెడ్డి, తదితరులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,640 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు మంగళవారం 146 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5640, కనిష్టం రూ.2840, సరాసరి రూ.4470 ధరలు పలికాయి. అలాగే, 42 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5820, కనిష్టం రూ.4590, సరాసరి రూ.5712 ధరలు లభించాయి. 621 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1856, కనిష్టం రూ. 1509, సరాసరి రూ.1769 ధరలు వచ్చాయి. -
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వద్దు
గద్వాల: రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గద్వాల మండలం కొత్తపల్లి, రేకులపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా కేంద్రాలలోని ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్ధేశిత మిల్లులకు తరలించడంతో పాటు తక్షణమే మిల్లుల వద్ద అన్లోడింగ్ జరిగేలా పర్యావేక్షణ జరపాలన్నారు. అక్కడే రైతులను పలుకరించి ధాన్యం అమ్మకాలలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాలలో సేకరించిన ధాన్యం నిల్వల గురించి, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యం తరలింపు, రైస్మిల్లల వద్ద అన్లోడింగ్ ప్రక్రియ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీబ్యాగుల కొరత, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. అకాలవర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా సరిపడా సంఖ్యలో టార్పాలిన్లు సమకూర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ మల్లిఖార్జున్, డీటీ అజిత్కుమార్, ఆర్ఐ రామకృష్ణ, ఏఈవో హరీష్, డీపీఎం రామ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బోధనా సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యం
గద్వాలటౌన్ : మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా భోధన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్నిస్థాయిల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను చేపట్టిందని జిల్లా విద్యా సమన్వయ అధికారిణి ఎస్తేరురాణి అన్నారు. మంగళవారం వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు వేరువేరుగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వారికి ఆయా సబ్జెక్టుల నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన ఫలితాలను పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్లు బీకే రమేష్, అమీర్బాష, వెంకటనర్సయ్య, అంపయ్య తదితరులు పాల్గొన్నారు. -
మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయరు దేవస్థానం సమీపంలో మహబూబ్నగర్– రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి (ఓబులేశు) ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవబృత స్నానం తదితర పూజలు జరిపి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్వామివారి పాదాలు, శఠగోపురానికి పురోహితులు సంప్రదాయబద్ధంగా స్నానం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
భూ భారతి సదస్సులను వినియోగించుకోండి
ఇటిక్యాల: రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, జిల్లాలో ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రజలు అధికారులను కలవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అధికారులే గ్రామాల్లోకి వచ్చి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి నెలాఖరులోగా అర్హులైన వారికి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. రైతులు నిర్దేశిత ప్రొఫార్మా ద్వారా దరఖాస్తులను ఇవ్వాలని సూచించారు. ఈ సదస్సులో భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నెంబర్ గల్లంతు, పట్టాదారు పాస్బుక్జారీ కాకపోవడం వంటి అంశాలు పరిష్కరించబడతాయని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సులో తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, డి టి నందిని, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
45వేల గన్నీ బ్యాగుల సరఫరా
గట్టు: ఎట్టకేలకు గట్టు మండలానికి 45 వేల గన్నీ బ్యాగులను అధికారులు సోమవారం సరఫరా చేశారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతున్న వ్యవహారంపై ‘పేరుకుపోయిన ధాన్యం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా అధికారులు స్పందించారు. గన్నీ బ్యాగులను సమకూర్చారు. వీటిని ఆయా కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేశారు. గట్టుకు 15వేలు, మాచర్లకు 10వేలు, ఆలూరుకు 10వేలు, పెంచికలపాడుకు 10 వేల గన్నీ బ్యాగులను తీసుక వచ్చి రైతులకు అందజేసినట్లు పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, సీఈఓ భీమేష్ తెలిపారు. గన్నీ బ్యాగుల కోసం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు బారులు తీరారు. ఇప్పటికే వడ్ల రాసులతో కొనుగోలు కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. వడ్లను ఎప్పుడు తూకం పడతారా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అధికారులు గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగానే వడ్ల తూకం ఆగిపోయిందని, ధాన్యం మిల్లులకు తరలిస్తే ఏ ఇబ్బంది ఉండదని రైతులు తెలిపారు. గన్నీ బ్యాగుల కొరతను తీర్చిన అధికారులు.. ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించే ఏర్పాట్లు కూడా చేయాలని రైతులు కోరారు. -
భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలి
అయిజ: భారతమాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాలేదని సోమవారం మండలంలోని దేవబండ గ్రామం రైతులు భారతమాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడారు. నష్టపరిహారం కోసం రైతులు అనేకసార్లు ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. భారతమాల రోడ్డు నిర్మాణం కోసం 33 ఎకరాల భూసేకరణ చేశారని తెలిపారు. మెదటి విడతలో కొంతమంది రైతులకు మాత్రమే నష్టపరిహారం వచ్చిందని, మిగితా వారికి రాలేదని మండిపడ్డారు. బోర్వెల్స్, ఓపెన్ వెల్స్, చెట్లకు రావాల్సిన నరష్టపరిహారం ఇంతవరకు రాలేదని వాపోయారు. అందరికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇచ్చేవరకు నిరసన చేపడుతామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ శ్రీనివాసరావు చేరుకొని సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని నచ్చచెప్పడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 75 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్లో మొత్తం 9 అర్జీలు వచ్చాయి. ఈమేరకు ఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు రాగా.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ బాధితులకు తెలిపారు. -
నిర్వహణ ప్రశ్నార్థకం
ఆర్డీఎస్లో వేధిస్తున్న సిబ్బంది కొరత సిబ్బంది కొరతతో పర్యవేక్షణ కరువు సిబ్బంది తక్కువగా ఉండటంతో కెనాల్పై పర్యవేక్షణ నామమాత్రంగానే ఉందని చెప్పాలి. ప్రధానమైన డిస్ట్రిబ్యూటరీల దగ్గర మాత్రమే అధికారుల పర్యటనలు, పర్యవేక్షణలు కొనసాగుతున్నాయని రైతుల నుంచి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్డీఎస్పై మరమ్మతులు చేపట్టారు. పనులు చేపట్టడానికి ముందే పనులు జరగాల్సిన డీ–20 నుంచి దిగువకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉంది. మరమ్మతులకు నిధులు మంజూరు కాక ముందు చేసిన పర్యటనలే తప్పా తాజాగా చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం కెనాల్పై ఇంకా ఏమైనా మరమ్మతులు ఎక్కువ మొత్తంలో చేపట్టాల్సిన అవసరం పెరిగిందా అనే కోణంలో కూడా అధికారులు పరిశీలిన చేయాల్సి ఉండగా.. సిబ్బంది కొరత వల్ల ఆ పరిశీలన జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజోళి: జిల్లాలో దాదాపు వంద కిలోమీటర్ల మేర ఆర్డీఎస్ కాల్వ విస్తరించినా.. నిర్వహణ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అలాగే, ఆర్డీఎస్ ఆయకట్టుకు సైతం నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డీఎస్ నిర్వహణకు గతంలో ఉన్న అధికారులు ప్రస్తుతం లేకపోవడం, సిబ్బంది కొరతతో ఉన్న కొద్దిమందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని చివరి ఆయకట్టుకు అందించే క్రమంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడంలో అధికారులు నియంత్రణ కోల్పోతున్నారు. దిగువ, ఎగువన ఉన్న రైతులకు నీటి విషయంలో సరైన సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. మొత్తానికి ఆర్డీఎస్ కెనాల్పై అధికారుల పర్యవేక్షణ నామమత్రంగానే ఉందని రైతులు ఆరోపిస్తుండగా.. ఉన్న సిబ్బందితోనే చివరి ఆయకట్టు వరకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఆయకట్టుకు జీవం పోస్తున్నామని అధికారులు అంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ కెనాల్ వంద కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 12ఏ డిస్ట్రిబ్యూటరీ నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు 42.6 కి.మీ నుంచి 140 కి.మీ వరకు ఉంది. దీనికి సంబంధించిన విధులు చేయాల్సిన అధికారుల కంటే తక్కువగా సిబ్బంది ఉన్నారు. 2017 సంవత్సరంలో చీఫ్ ఇంజినీర్స్ కమిటీ రూపొందిన నిబంధనల మేరకు ఆయా విభాగాల వారిగా సిబ్బందిని కేటాయించారు. దాని ప్రకారమే సిబ్బంది ఉండాలి కాని, వర్క్ ఇన్స్పెక్టర్లు 11 మంది ఉండాల్సి ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. మరో నలుగురిని ఏర్పాటు చేయాల్సి ఉంది. కాల్వపై వివిధ పనులు చేస్తూ, నీటి ప్రవాహాన్ని సాఫీగా చేసి, ప్రధానమైన చోట్ల కంప చెట్లు ఇతర వ్యర్థాలను తొలగించి, అత్యవసర సమయంలో సేవలందించే లస్కర్లు, ఇతర మాన్యువల్ సిబ్బంది 57 మంది ఉండాలి. కానీ 46 మంది మాత్రమే ఉన్నారు. ఎలక్ట్రీషియన్లు ఒకరిని కేటాయించాల్సి ఉండగా ఇంత వరకు కేటాయింపు చేయలేదు. ఇద్దరు పంపు ఆపరేటర్లు అవపసరముండగా.. వారిని కూడా కేటాయించలేదు. ఫిట్టర్ మెకానిక్గా ఒకరు అవసరం ఉండగా వారిని కూడా ఏర్పాటు చేయలేదు. జీఓ 45 ప్రకారం ఔట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఇప్పటిదాకా అడుగు ముందుకు వేయడం లేదని రైతులు అంటున్నారు. కానీ కొన్ని రకాల సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ద్వారానే ఉత్తర్వులు రావాల్సి ఉండటంతో చాలా వరకు సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. వంద కిలోమీటర్ల మేర ప్రవాహం వంద కి.మీ.ల కాల్వ పర్యవేక్షణకుసరిపడా లేని సిబ్బంది తరచూ కాల్వ వెంట కోతలు.. సవాళ్లను అరికట్టడంలో తీవ్ర ఒత్తిడి తుమ్మిళ్ల లిఫ్టుతో అదనపు భారం సిబ్బంది కొరత ఉన్నప్పటికీ.. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందించడమే మా లక్ష్యం. దాని కోసం నిరంతరం శ్రమిస్తాం. దీని కోసం ఉన్న సిబ్బందితోనే కాలం వెల్లదీస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, రైతులకు ఇబ్బందులు రాకూడదనే లక్ష్యంతో సిబ్బందితోనే అదనపు సమయమైనా తీసుకుని పనులు చేస్తున్నాం. సిబ్బంది నియామకం అనేది ప్రభుత్వం, ఉన్నతాధికారుల చేతిలోనే ఉంటుంది. కాగా ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – శ్రీనువాసులు, ఆర్డీఎస్ ఎస్ఈ -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి.. స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా మహాహోమం నిర్వహించి స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయచైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్రావు, దీరేంద్రదాసు, నరేందర్, సవారి, రాములు, వీరారెడ్డి, పద్మారెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు మీసేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, కనీసం ఇంటర్మీడియట్ గణితశాస్త్రంలో 60శాతం మార్కులు, ఐటీఐ డ్రాప్ట్స్మెన్(సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) లేదా ఇతర సమాన అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీ విద్యార్థులు రూ.5వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.2500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు నోటీసు అయిజ: అయిజ మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన తైబజార్ వేలం రద్దు విషయంపై సోమవారం మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు తైబజార్ వేలం నిర్వహించారు. అయిజకి చెందిన రవీందర్ రూ.21 లక్షలకు వేలం దక్కించుకున్నారు. అయితే వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదని, రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈనెల 4న వేలం నిర్వహణను రద్దుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. ఇదిలాఉండగా, తైబజార్ను వేలంలో దక్కించుకున్న రవీందర్ ఈనెల 6న హైకోర్టును ఆశ్రయించడంతోపాటు మానవ హక్కుల కమిషన్కు, సీడీఎంఏ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు హైకోర్టు నోటీసు పంపించింది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులును వివరణ కోరగా.. హైకోర్టు నుంచి నోటీసు వచ్చిందని, త్వరలో వివరణ ఇస్తానని పేర్కొన్నారు. 15, 16న ‘ఇంటర్’ స్పాట్ కౌన్సెలింగ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2025– 26)లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు గాను ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల మహబూబ్నగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కేటీదొడ్డి, అచ్చంపేట, మన్ననూర్, పెద్దమందడి, కొండాపూర్లో ఈ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో చేరేవారు మొదటి రోజు బాలురకు, రెండో రోజు బాలికలకు జిల్లాకేంద్రం శివారు ధర్మాపూర్లోని ఆల్ మదీనా బీఈడీ కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.5,970 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు సోమవారం 112 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5970, కనిష్టం రూ.2919, సరాసరి రూ.5136 ధరలు పలికాయి. అలాగే, 63 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5830, కనిష్టం రూ.4656, సరాసరి రూ.5810 ధరలు లభించాయి. 863 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1951, కనిష్టం రూ. 1702, సరాసరి రూ.1739 ధరలు వచ్చాయి. 2 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6306, కనిష్టం రూ. 6026, సరాసరి రూ.6026 ధరలు పలికాయి. -
రేపటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19, 23 విభాగాలకు ఈ సెలక్షన్స్ ఉంటాయన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్లోని పిల్లలమర్రి రోడ్డులోగల ఎండీసీఏ క్రికెట్ మైదానంలో, జడ్చర్లలోని మినీ స్టేడియంలో, 15న నారాయణపేటలోని మినీ స్టేడియంలో, నాగర్కర్నూల్లోని నల్లవెల్లి రోడ్డులోగల క్రికెట్ అకాడమీలో, 16న వనపర్తి జిల్లా పెబ్బేరులోని పీపీఎల్ మున్సిపల్ గ్రౌండ్లో, గద్వాలలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారుల సెలక్షన్స్ ఉంటాయని చెప్పారు. ఎంపికై న క్రీడా జట్లతో ఈ నెల 19 నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లకు శ్రీకారం చుట్టిందని, పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభచాటాలని పిలుపునిచ్చారు. క్రికెట్ సెలక్షన్స్కు సంబంధించి మిగతా వివరాల కోసం మహబూబ్నగర్లో సంతోష్ (81792 75867), నాగర్కర్నూల్లో సతీష్ (89193 86105), జడ్చర్లలో మహేష్ (99494 84723), గద్వాలలో శ్రీనివాసులు (98859 55633), నారాయణపేటలో రమణ (91007 53683), పెబ్బేర్లో శంకర్ (96033 60654) నంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఎప్సెట్లో ‘గట్టు’ గురుకుల విద్యార్థినుల ప్రతిభ
గట్టు: ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాల్లో గట్టు గురుకుల కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఆదివారం ఫలితాలను విడుదల చేయగా.. గట్టు విద్యార్థినులు స్వాతి 369వ ర్యాంకు, ఐశ్వర్య 981వ ర్యాంకు మణికుమారి 1106 ర్యాంకు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. వీరితోపాటు ఇదే కళాశాలకు చెందిన మరికొందరు సైతం 10 వేల లోపు ర్యాంకులను సాధించినట్లు తెలిపారు. విద్యార్థినులు ప్రతిభ కనబర్చడంపై ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. -
నెరవేరిన ‘రుణ’ లక్ష్యం
ఇందిరా మహిళా శక్తి కింద యూనిట్లు 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద భ్యాంకుల ద్వార రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. వ్యక్తిగత యూనిట్లతో పాటు ప్రధానంగా ఒక సంఘంలో నలుగురు, ఐదుగురితో కలిసి గ్రూప్ యూనిట్లు నెలకొల్పుకునేలా ప్రోత్సహించారు. ఈపథకం కింద 2024–25లో క్యాంటీన్లు, కిరణాలు, టైలరింగ్, బ్యూటీపార్లర్లు, పాడి, చీరలు, స్వీట్ దుకాణాలు, అగర్బత్తీలు, రోటీ మేకింగ్ సెంటర్లు తదితర వాటిని స్వయం సహయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్నారు. గద్వాల న్యూటౌన్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు రుణ లక్ష్యం నెరవేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు మండలాలు మినహా, లక్ష్యం మేరకు రుణాలు అందించారు. స్వయం సహయక సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బ్యాంక్ లింకేజీ కింద బ్యాంకుల ద్వార రుణాలు అందిస్తారు. బ్యాంకుల ద్వార రుణాలు పది నుంచి పదిహేను మంది మహిళలు కలిసి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడగా.. వారంతా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వార గ్రూపు రుణాలు అందిస్తారు. ఇందుకోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను నిర్ధేశిస్తారు. బ్యాంకు ద్వార రుణాలు పొందే గ్రూపు మహిళలు వారు నిర్వహించుకునే వ్యాపారాలు సూచిస్తూ బ్యాంకు లింకేజీ కింద బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటారు. బ్యాంకులు ఆయా స్వయం సహాయక సంఘాల సీనియారిటీ అంతకుముందు తీసుకున్న అప్పుకు సంబందించి వారి చెల్లింపులను పరిగణలోకి తీసుకుంటారు. డోస్ల వారీగా రూ. లక్ష నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందిస్తారు. బ్యాంకర్లు ఇచ్చిన అప్పుకు 12 నుంచి 14శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. 5248 సంఘాలు.. రూ.204.29 కోట్లు డీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల నిర్వహణ చూస్తుంటారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల రుణ లక్ష్యం 5248 సంఘాలకు రూ. 204.29కోట్లు లక్ష్యం ఉండగా.. 2,355 సంఘాలకు 217.57 కోట్లు అందించారు. మండలాల వారీగా పరిశీలిస్తే ఇటిక్యాలలో 186శాతం, ధరూర్లో 145శాతం, అలంపూర్లో 121శాతం, గద్వాల 119శాతం, వడ్డేపల్లిలో 118శాతం, మల్దకల్లో 110శాతం, గట్టులలో 102శాతం రుణ లక్ష్యం నెరవేరింది. ఇక కేటీదొడ్డిలో 87శాతం, ఉండవల్లిలో 82శాతం, రాజోళిలో 72శాతం, మానవపాడులో 70శాతం, అయిజలో 65శాతం నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకుని, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అందించే ఈరుణాల లక్ష్యంపై డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే దృష్టి సారించారు. సంబంధిత అధికారులు ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందికి దిశానిర్ధేశం చేయడం వల్ల జిల్లా రుణ లక్ష్యం నెరవేరింది. స్వయం సహాయ సంఘాల ఆర్థికాభివృద్ధే ధ్యేయం ‘ఇందిరా మహిళా శక్తి’ కింద మహిళలకు బ్యాంకుల ద్వారా వ్యాపార యూనిట్లు చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రోత్సాహం రుణాలు సద్వినియోగం చేసుకోవాలి స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. 2024–25లో లక్ష్యం మేరకు రుణాలు అందించాం. ఈఏడాది తీసుకున్న రుణాలతో ఇందిరా మహిళాశక్తి పథకం కింద చాలా వ్యాపారాల యూనిట్లు నెలకొల్పారు. వీటి నిర్వహణ ద్వార ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. 2025–26లో సైతం రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటాం. – నర్సింగరావ్, అడిషనల్ కలెక్టర్ -
2024–25లో రుణాల వివరాలిలా..
మండలం అర్హత కలిగిన రుణాలు పొందిన రుణ లక్ష్యం అందించిన రుణం సంఘాలు సంఘాలు (రూ. కోట్లలో) ఇటిక్యాల 492 451 18.78 35.08 ధరూర్ 440 166 14.46 21.09 అలంపూర్ 315 166 11.39 13.86 గద్వాల 515 260 23.59 28.21 వడ్డేపల్లి 251 111 9.82 11.66 మల్దకల్ 570 241 23.17 25.62 గట్టు 542 225 17.83 18.24 కేటీదొడ్డి 372 108 13.59 11.90 ఉండవెళ్లి 363 185 16.63 13.75 రాజోళి 353 101 14.23 10.25 మానవపాడు 553 196 23.53 16.62 అయిజ 482 145 17.26 11.28 -
ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి
మల్దకల్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుచుకుంటూ దైవచింతన అలవర్చుకోవాలని త్రిదండి చినజీయర్ స్వామి సూచించారు. ఆదివారం మండలంలోని అమరవాయిలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడుచుకోవాలని, కులమతాలను రూపుమాపడాని,కి ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని అన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వలన జీవితంలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకునే వీలుంటుందన్నారు. అంతకు ముందు వెంకటేశ్వరెడ్డి కుటుంబసభ్యులు స్వామి వారికి పాదపూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్రావు, ముకుందరావు, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రాములు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఘన స్వాగతం ఇటిక్యాల: మండలంలోని మునుగాల గ్రామంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భాగవత సప్తాహం పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చినజీయర్ స్వామి హాజరయ్యారు. ప్రతి మనిషికి ఆనందం ముఖ్యమని లౌకిక ఆనందం తాత్కాలికం మాత్రమేనని నిజమైన ఆనందం భాగవత ప్రవచనం ఆలకించడం ద్వారానే అనుభవం పొందగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమీటి సభ్యులు, విశ్వ హిందు పరిషత్ సభ్యులు, ఆయా గ్రామాల భగవద్గీత భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న ధాన్యం..
గట్టు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఎప్పుడెప్పుడు చేస్తారా అంటూ వేయ్యికళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు. సరిపడా గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపక పోవడంతో ధాన్యం కొనుగోలు నత్తనడకసాగుతున్నట్లు రైతులు ఆరోపించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సంబందించి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక గట్టు విషయానికి వస్తే.. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ధాన్యం కొనుగోళ్లు అప్పగించారు. గట్టు, మాచర్ల, పెంచికలపాడు, ఆలూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా ఆయా కొనుగోలు కేంద్రాల దగ్గర 292 మంది రైతులకు సంబంధించి 33,786 బస్తాలు(40కేజీలు), 13,514 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు సహకార సంఘం అధికారులు తెలిపారు. ఇవి కాక మరిన్ని ధాన్యం రాసులు కొనుగోలు కేంద్రాల దగ్గర అలాగే ఉండిపోయాయి. గట్టులో సుమారుగా 30 వేల బస్తాలు, మాచర్లలో సుమారుగా 25 వేల బస్తాలు, పెంచికలపాడులో 15వేల బస్తాలు, ఆలూరులో 12వేల బస్తాల వరకు కొనుగోలు చేయాల్సి ఉన్నట్లు అంచనా. బయటి మార్కెట్ కన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న చోట వడ్ల ధర అధికంగా ఉండడంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అకాల వర్షాల వలన వడ్లు తడిస్తే ఇబ్బంది అని రైతులు వాపోతున్నారు. అధికారులు త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత గన్నీ బ్యాగులు లేక వడ్ల కొనుగోలు మరింత ఆలస్యం అవుతున్నట్లు రైతులు ఆరోపించారు. గన్నీ బ్యాగుల కోసం ఎదురుచూస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటి వరకు 4 కొనుగోలు కేంద్రాలకు కేవలం 33వేల గన్నీ బ్యాగులు మాత్రమే పంపారని, ఇంకా సుమారుగా 80 వేల బస్తాలు అవసరం ఉన్నట్లు అంచనా. ఇక కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు లారీల సమస్య నెలకొంది. ఇప్పటిదాకా పంపిన గన్నీ బ్యాగులకు సంబందించి వడ్లను తూకం వేసిన అధికారులు వాటిని మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు అధికారులు తెలిపారు. తూకం పట్టిన వడ్ల బస్తాలు సుమారుగా 3వేల వరకు కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన వడ్లను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, సీఈఓ భీమిరెడ్డి తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోలు ఆలస్యమవుతుందని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వేధిస్తున్న గన్నీ బ్యాగుల కొరత కొన్న ధాన్యం తరలింపునకు ఇబ్బందులు రైతులకు తప్పని పడిగాపులు -
ఆలయ లెక్కల్లో వాస్తవాలు నిగ్గు తేల్చాలి
రాజోళి: రాజోళిలోని చారిత్రాత్మక వైకుంఠ నారాయణ స్వామి ఆలయంలో పాత కమిటీ లెక్కలు చూపడం లేదని నూతన ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 3 వ తేదీన నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆలయానికి సంబందించిన లెక్కలు ఇతర వివరాలు అడిగితే మాట దాటేస్తున్నారని అన్నారు. తప్పనిసరిగా లెక్కలు అడిగితే ఎనిమిది ఏళ్ల కిందట లెక్కలు ఎలా చూపుతామని అనడంపై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయని, పదుల ఎకరాల్లో మాన్యాలు ఉన్న ఈ ఆలయానికి అభివృద్ధి చేయాల్సింది పోయి,లెక్కలు చూపకుండా దాచడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. వివరాలకు సంబందించి మళ్లీ మళ్లీ అడిగితే పాత కమిటీలోని కొందరు సభ్యులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, గ్రామానికే కాకుండా రాష్ట్రానికే తలమానికమైన ఈ ఆలయ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. ఆలయ ఈఓకు పలు మార్లు వివరాలు అడిగినా ఆయన కూడా మాట దాటేస్తున్నారని,ఆయన తీరుపై కూడా పలు అనుమనాలు ఉన్నాయని, వాస్తవాలను నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపి,భాస్కర్,మద్దిలేటి తదిదరులు పాల్గొన్నారు. -
సోలార్ పనులు వేగవంతం
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సోలార్ విద్యుత్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ప్లానింగ్బోర్డు ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, విద్యుత్శాఖ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖ్ అన్నారు. శనివారం ఉదయం గ్రామంలోని ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లను వారు పరిశీలించి విద్యుత్ సరఫరా వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 482 ఇళ్లుండగా.. 412 ఇళ్లపై సోలార్ ప్లేట్లు బిగించామని, మిగతా 70 ఇళ్ల పైకప్పు మట్టి, రేకులు ఉండటంతో మిగిలిపోయినట్లు అధికారులు వారికి వివరించారు. మట్టి మిద్దెలు ఉన్న ఇళ్ల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయాలని రెడ్కో అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లిలో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని పనులు పూర్తయితే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. వారి వెంట రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామస్తులు వేమారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. -
అమ్మా.. నీకు వందనం
జోగుళాంబ గద్వాలవాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి. వేగంగా ‘టర్ఫ్’ పనులు పాలమూరు ఎండీసీఏ క్రికెట్ మైదానంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025వివరాలు 10లో uసృష్టిలో అమ్మ పాత్ర గురించి వివరిచేందుకు, వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అయితే నా వరకు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా సొంత గ్రామం అప్పారెడ్డిపల్లి వనపర్తి జిల్లా. అమ్మ మణెమ్మ, నాన్న బుచ్చన్న. మేము ఐదుగురం సంతానం కాగా.. ఇద్దరం మగ పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా నాన్న ప్రధానంగా కులవృత్తి వడ్రంగి పనిచేసేవారు. నేను పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలకున్నాను. కానీ, అప్పట్లో కులవృత్తికి బాగా డిమాండ్ ఉండడం, మాది పెద్ద కుటుంబం కావడం.. ఇంట్లో నేనే పెద్ద కుమారుడిని కావడంతో మానాన్న పదో తరగతిలోనే ఆపేసి వండ్రంగి పని నేర్చుకోవాలన్నారు. అయితే మా అమ్మ చదువుకుంటేనే విలువ ఉంటుందని, నన్ను ఇంటర్మీడియట్లో చేర్పించారు. అలా అమ్మ ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పటికీ శనివారం, ఆదివారం వచ్చిందటే చాలు పెద్దోడ ఇంటికి వచ్చివెళ్లు అంటుంది. అంత ప్రేమ పంచడం సృష్టిలో ఒక్క అమ్మకే సాధ్యం. పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లలే. అందుకే మనకోసం కష్టించే అమ్మకు మనం పెద్దవారం అయిన తర్వాత గౌరవించి బాగా చూసుకుంటే వారికి అదే చాలు. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. ● అమ్మ మాట.. బంగారు బాట.. తల్లి ప్రేమ మారదు.. ఉద్యోగరీత్యా మా పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎలాంటి సందర్భంలో నీకు దూరంగా ఉన్నా అనే విషయం చెబితే మా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు మహబూబ్నగర్ ఎస్పీ జానకి. మాకు ఒకే ఒక్క కూతురు హైదరాబాద్లో 8వ తరగతి చదువుతుంది. విధుల్లో భాగంగా నేను మహబూబ్నగర్లో ఉంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడి రావడం.. లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికై నా పిల్లలపై చూపే తల్లి ప్రేమ, వాత్సల్యంలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో జనరేషన్కు ఇప్పటి పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సాంకేతికపరంగా టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. భవిష్యత్పరంగా ఎలా ఉండాలి.. ఇతర అంశాలపై చర్చించడం చేస్తాను. చదువులో కూడా ఏదైనా సందేహాలు, సలహాలు ఇస్తాను. అమ్మాయికి దూరంగా ఉన్నా.. నిత్యం ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటాను. ‘నా చిన్నతనం నుంచి మా అమ్మ శోభ నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా నిలిచారు. మా అన్న, చెల్లెలితో పాటు నన్ను బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెకన్నా ముఖ్యమైన వారు మన జీవితంలో ఎవరూ ఉండరు. నాకు సమయం కుదిరినప్పుడల్లా అమ్మ, నాన్న, కుటుంబసభ్యులతో గడుపుతాను. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎస్పీ, నాగర్కర్నూల్ నేడు మాతృ దినోత్సవం అమ్మను తొలి గురువుగా భావించి ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్ లక్ష్యం నిర్దేశించుకున్నా. వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సాహం అందించి నేడు సమాజంలో గౌరవ ప్రదమైన కలెక్టర్గా ప్రజలకు సేవలందించేందుకు సహకారం అందించారు. నా లైఫ్లో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో మా అమ్మ నర్సమ్మ పాత్ర చాలా కీలకం. ప్రాథమిక విద్య హైదరాబాద్లో.. ఐదో తరగతి నుంచి ఢిల్లీలో చదువుకునేందుకు అమ్మ తన ఉద్యోగ బాధ్యతలను నా కోసం పదేళ్లపాటు ఢిల్లీకి మార్చుకున్నారు. నా జీవిత లక్ష్యం సాధించేందుకు ఎంతగానో మార్గనిర్దేశనం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా అమ్మ పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసించి ఆదాయపన్ను శాఖ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. నా కెరీర్లో రోల్ మోడల్గా నిలిచారు. చిన్న వయస్సు నుంచే ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ.. జీవిత లక్ష్యం సాధించుకునేందుకు వెన్నంటి నడిపించారు. మారుమూల ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టారు. మా నాన్న సురభి సత్యన్నతో జీవితాన్ని పంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్కు వచ్చారు. నాన్న రాష్ట్ర సర్సీసుల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మా కుటుంబ ఉన్నతి కోసం మా అమ్మ ఎంతగానో కృషి చేశారు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్, వనపర్తి అమృత పదం అమ్మ పదాలు తెలియని పెదవులకు అమృత పదం అమ్మ. అమృతం ఆయుష్షు పోస్తుందో.. లేదో.. తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకు అందిస్తుంది. నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవ మాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటిపాపలా చూసుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే తల్లి రుణం తీర్చుకోలేం. అమ్మ మన రేపటి భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – విజయేందిర, కలెక్టర్, మహబూబ్నగర్ తొలి గురువుగా అందరికీ స్ఫూర్తి అమ్మ లేకుంటే నేను లేను సృష్టికి ప్రతి రూపం అమ్మ.. పిలిచే తియ్యని పిలుపే అమ్మ.. ప్రాణం పోసే దేవత అమ్మ.. కన్నపేగు గుండెచప్పుడు అమ్మ.. మమతల ఒడి.. త్యాగాల గుడి.. తొలిబడి అమ్మ.. అమితమైన ప్రేమ.. అంతులేని అనురాగం.. అలుపెరగని ఓర్పు.. మాటల్లో వ్యక్తపరచలేని భావం.. చేతల్లో ప్రదర్శించలేని భాష్యం.. అందుకే అమ్మకు సాటి అమ్మే.. అమ్మకు మించిన దైవం లేదంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. – సాక్షి, నాగర్కర్నూల్/పాలమూరు/ వనపర్తి/గద్వాల/జెడ్పీసెంటర్ తల్లికంటే ముఖ్యులు ఎవరూ ఉండరు.. నా కెరీర్లో రోల్ మోడల్ -
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావుల చెర్వు గట్టు తిమ్మప్పస్వామి, చర్లగార్లపాడు వెంకటేశ్వరస్వామి ,శేషంపల్లి శివసీతారామస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, వాల్మీకి పూజరులు తదితరులు పాల్గొన్నారు. -
బావిలో పడి ఇద్దరు దుర్మరణం
● మృతుల్లో ఓ యువకుడు, ఓ బాలుడు ● సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఘటన హుజూర్నగర్: యువకుడు బావిలో పడిపోగా.. అతడిని కాపాడబోయి మరో యువకుడు అందులోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం హుజూర్నగర్లో చోటుచేసుకుంది, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన కన్మనూర్ తిరుపతయ్య, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన మోదిపురం లక్ష్మణ్లు మరో ఆరుగురితో కలిసి గొర్రెలను మేపుకుంటూ హుజూర్నగర్కు వచ్చారు. గత పది రోజులుగా పట్టణానికి చెందిన జక్కుల లింగయ్య పొలంలో మేత కోసం గొర్రెలను నిలిపి అక్కడే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతయ్య కుమారులైన శేఖర్, చరణ్ వేసవి సెలవులు కావడంతో తండ్రి వద్దకు వచ్చారు. శుక్రవారం తిరుపతయ్య పెద్ద కుమారుడైన శేఖర్, గొర్రెల కాపరి లక్ష్మణ్తో కలిసి నీటిని తీసుకువచ్చేందుకు సమీపంలో గల లింగయ్య బావి వద్దకు వెళ్లారు. లక్ష్మణ్ (21) నీళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు శేఖర్ (14)ప్రయత్నించగా అతను కూడా బావిలో పడ్డాడు. దీంతో ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుడు శేఖర్ తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. -
18న నల్లమలకు సీఎం రాక
మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో సభాస్థలం ఇతరత్రా ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రూ.12,600 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రాజెక్టును ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే జిల్లా అధికారులు, ఐటీడీఏతో అనుసంధానంగా ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఆ దివాసీలతో సమావేశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో అనుకూల ప్రదేశం కోసం పదర మండలంలోని పెట్రాల్చేన్, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, మాచారం, వెంకటేశ్వర్లబావి గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ రోహిత్రెడ్డి, డీటీడీఓ ఫిరంగి, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉస్సేన్, మండల అధికారులు, చెంచులు పాల్గొన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్ -
భూ భారతి సదస్సులను వినియోగించుకోండి
ఇటిక్యాల: రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని మొగిళిరావులచెర్వు గ్రామంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆర్డీఓ పాల్గొని రైతుల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రారంభించిందని, జిల్లాలోని ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని వివరించారు. గతంలో ప్రజలు అధికారులను కలవాల్సి వచ్చేదని, ఇప్పుడు అధికారులే గ్రామాల్లోకి వచ్చి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి నెలాఖరులోగా అర్హులైన వారికి ఉత్తర్వులు జారీ చేస్తామని, రైతులు నిర్దేశిత ప్రొఫార్మాలో దరఖాస్తులు అందించాలని సూచించారు. ఈ సదస్సులో భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నంబర్ గల్లంతు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ తదితర సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, పంచాయతీ కార్యదర్శి హారిక, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తిచేయాలి
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పనుల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతిని మండలాల వారీగా సమీక్షిస్తూ మంజురైనా ఇళ్ల నిర్మాణ పనుల్లో గ్రౌండింగ్, బేస్మెంట్, మార్క్ అవుట్, రీ వెరిఫికేషన్ తదితర అంశాలను అధికారుల నుంచి వివరంగా అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పునులు వేగవంతంగా పూర్తయ్యేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పడు ఆన్లైన్ యాప్లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపికలో ఆధార్, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు అన్ని అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. దరఖాస్తులను డౌన్లోడ్ చేసి కార్పొరేషన్ బ్యాంకుల వారీగా సంబంధిత బ్యాంకులకు పంపిచాలని, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు వాటిని పరిశీలించి అర్హత నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాలన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన రైతుల ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యం సేకరించి మిల్లులకు తరలించాలన్నారు. గాలి, దుమ్ము, అకాల వర్షాలు పడుతున్నందున వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్బాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు, పౌరసరఫరాల అధికారి స్వామికుమార్, డీఎం విమల, పీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తాడూరు: రెండు బైక్లు ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన జగపతిరెడ్డి (55) శుక్రవారం పని నిమిత్తం ఇంటినుంచి బైక్పై బయల్దేరాడు. కల్వకుర్తి రహదారిలో పెట్రోల్బంక్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టడంతో కిందపడిపోయిన జగపతి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. -
‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలి
ఎర్రవల్లి: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ఈఓ రామన్గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా శత్రు దేశానికి మన దేశ త్రివిధ దళాల సైనికులు తగిన గుణపాఠం చెప్పాలని, అలాగే వారికి దైవిక బలంతోపాటు రక్షణ, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ అర్చకులు వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మారుతిచారి, సందీప్చారి, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ నిషేధం.. అమలైతేనే ప్రయోజనం
జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగంపై ముమ్మరంగా తనిఖీలు ● పూర్తిస్థాయిలో అరికట్టేందుకు మరోసారి అడుగులు ● కలెక్టర్ దిశానిర్దేశంతో కఠిన చర్యలకు ఉపక్రమణ ● నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 10 టన్నులు సేకరణ ముమ్మరంగా తనిఖీలు.. ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధానికి అధికారులు మళ్లీ నడుం బిగించారు. గడిచిన కొన్ని రోజులుగా ఆయా మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లాకేంద్రమైన గద్వాలలో ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. కలెక్టర్ సంతోష్ ఆదేశాలతో నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో దుకాణాలపై దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్తోపాటు హోల్సేల్, రిటేల్ దుకాణాల్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని కార్యాయాలకు తరలించారు. ఆయా పార్టీల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా తగ్గకుండా దాడులు కొనసాగిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గద్వాల టౌన్: ఉదయం నుంచి నిద్రించే వరకు ప్లాస్టిక్తో మానవ జీవితం ముడిపడి ఉంటోంది. అంతలా కలిసిపోయిన దీంతో పర్యావరణంతోపాటు మానవవాళికి ముప్పుపొంచి ఉందని తెలిసినా వినియోగిస్తూనే ఉన్నాం. పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కొద్దిగానైనా మార్పు రావడం లేదు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా వీటి వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. పట్టణాల్లోని రహదారుల పక్కన, నివాస గృహల సమీపంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్పై నిషేధం ఉండేది. ప్రస్తుతం 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమస్యలను అధిగమించాలంటే వ్యక్తిగతంగా, సమష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పుడే పర్యావరణ ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్పు వచ్చినట్టే వచ్చి.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 30 వేల నివాస గృహాలు, దుకాణాలు ఉన్నాయి. దీంతో ప్రతిరోజు 80 టన్నుల చెత్త పోగవుతోంది. అందులో 10 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. గతంలోనే గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేశారు. అప్పట్లో అడపాదడపా దుకాణాలపై దాడులు నిర్వహించారు. రూ.100 నుంచి రూ.5 వేల వరకు జరిమానా సైతం విధించారు. తదనంతరం అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తిరిగి వాటి విక్రయాలను మొదలుపెట్టారు. ఏళ్ల తరబడి ప్రణాళిక రూపొందిస్తున్నా.. కౌన్సిల్లో తీర్మానాలు చేస్తున్నా.. అమలులో క్షేత్రస్థాయి లోపాలతో అడ్డుకట్ట పడటం లేదు. ప్రజల్లో మార్పు రావాలి.. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పాలిథీన్ కవర్లకు బదులు ఇతర సంచులు వాడాలని, తద్వారా ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుందని చెబుతున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలతో పాటు దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం. – దరశథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల -
సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
కేటీదొడ్డి: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి లాభాలు పొందాలని జిల్లా వ్యవసాయాధికారి సక్రియానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కుచినెర్ల గ్రామ రైతువేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన పాలెం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. సేంద్రియ ఎరువులు, రసాయనాల వినియోగం, సాగునీటి ఆదా, మట్టి పరీక్షలు, వర్షాధార వ్యవసాయంలో నీటిని సంరక్షించే చర్యలు, పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలు, చెట్ల పెంపకంతో కలిగే లాభాలు, యూరియా వాడకాన్ని సరైన మోతాదులో వాడాలని, రసాయనాలను తగు మోతాదులో వాడాలని, రైతులు షాపులలో కొన్న విత్తనం పురుగు, తెగుళ్లు కలుపు మందులకు రశీదు భద్రపరుచుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడతాయని తెలిపారు. ఆయిల్పాం తోటల సాగు, యాజమాన్య పద్ధతుల్లో మెలకువలు వివరించారు. అనంతరం రైతు ముంగిట్లో కరపత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మండల వ్యవసాయాధికారి సాజిద్ రెహమాన్, ఏఈఓలు ప్రియాంక, కిరణ్కుమార్, మమత, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 1,105 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,105 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.6,200, కనిష్టంగా రూ.3,700, సరాసరిగా రూ.5,200 చొప్పున పలికింది. అలాగే 64 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టంగా రూ.5,812, కనిష్టంగా రూ.3,680, సరాసరిగా రూ.5,812, 4 క్వింటాళ్ల కంది రాగా గరిష్టంగా రూ.6,066, కనిష్టంగా రూ.4,689, సరాసరిగా రూ.4,899, 646 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.1,876, కనిష్టంగా రూ.1,550, సరాసరిగా రూ.1,766 ధరలు లభించాయి. డిగ్రీ ఫలితాలు విడుదల బిజినేపల్లి: మండలంలోని పాలెం అటానమస్ డిగ్రీ కళాశాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సెమిస్టర్లో 43 శాతం ఉత్తీర్ణత సాధించారని, విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. మార్కుల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 17 వరకు తమ దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలన్నారు. ఫలితాలను పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమేష్బాబు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజ్కుమార్, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, అనురాధరెడ్డి విడుదల చేయగా.. కళాశాల అడిషనల్ కంట్రోలర్ శివ, సిబ్బంది శ్రీనివాస్, నాగరాజు, సుష్మ, వెంకటేష్, యాదగిరి, కవిత తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో కండక్టర్ల బదిలీలు స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని పది ఆర్టీసీ (రీజియన్) డిపోల్లో పనిచేస్తున్న 89 మంది కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బదిలీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి 80 మంది అభ్యర్థులకు కండక్టర్లుగా వివిధ డిపోల్లో పోస్టింగులు ఇచ్చామని, అలాగే 89 మంది రెగ్యులర్ కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేశామని ఆర్ఎం తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తమ బదిలీలను చేపట్టినందుకు కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
వేసవిలో ‘చల్లని’ సేవ
మరికల్: వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఎంతో మంది స్వచ్ఛందంగా అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకుంటున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదట దివంగత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుటుంబ సభ్యులు మరికల్ మండలం తీలేర్ స్టేజీ వద్ద అంబలి కేంద్రం ఏర్పాటు చేశారు. వీరి స్ఫూర్తితో మరికల్ మండల అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. 22 ఏళ్లుగా ప్రతి వేసవిలో బాటసారులు, కూలీల దాహార్తి తీరుస్తున్నారు. వీరి ఆదర్శంతో ఇతర మండలాలు, గ్రామీణ స్టేజీల వద్ద అంబలి కేంద్రాలను ఏర్పాటుచేసి వేసవిలో చల్లని సేవ అందిస్తున్నారు. 44 ఏళ్ల క్రితం.. ఈ ప్రాంత ప్రజలు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో మండుటెండలను సైతం లెక్క చేయకుండా పడుతున్న శ్రమను చూసి దివంగత మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి తండ్రి వెంకారెడ్డి చల్లించిపోయారు. తాను సర్పంచ్గా ఎన్నికై న తర్వాత వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు గాను 1981లో తీలేర్ స్టేజీ వద్ద అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి ఏడాది వేసవిలో అంబలి కేంద్రం నిర్వహిస్తూ వ్యవసాయ కూలీలతో పాటు బాటసారుల దాహం తీర్చే వారు. అయితే వెంకారెడ్డి మరణానంతరం ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కొనసాగించారు. అతడి మరణం తర్వాత ఆయన కుమారుడు, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి తన అవ్వ వజ్రమ్మ, తాత వెంకారెడ్డి, తండ్రి వీరారెడ్డి జ్ఞాపకర్థంగా అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యప్ప అనుగ్రహంతోనే సేవ.. అయ్యప్ప సేవాసమితి స్థాపించిన నాటి నుంచి బాటసారుల తీర్చేందుకు అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అయ్యప్పస్వామి అనుగ్రహంతో 22 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాం. భవిష్యత్లో కూడా కొనసాగిస్తాం. – సతీశ్కుమార్, మరికల్ ఆనందంగా ఉంది.. మరికల్ బస్టాండ్, చౌరస్తాలో యువక మండలి తరఫున చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నాం. 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. – శ్రీకాంత్రెడ్డి, యువక మండలి అధ్యక్షుడు, మరికల్ తీలేర్ అంబలి కేంద్రానికి 44 ఏళ్లు పూర్తి వేసవిలో ప్రజల దాహార్తి తీరుస్తున్న దాతలు -
హైదరాబాద్లో కానిస్టేబుల్ మృతి
పెద్దకొత్తపల్లి: నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహేందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా గురువారం ఉదయం హైదరాబాద్లోని మీర్పేట పీఎస్ పరిధిలో స్కూటీపై వెళుతుండగా.. గుర్తుతెలియని కారు వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో కింద పడిన మహేందర్ తలకు బలమైన గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మహేందర్ స్వస్థలం లింగాలలో విషాదఛాయలు అములుకున్నాయి. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. -
విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
గద్వాల టౌన్: జిల్లా విద్యాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీఈఓ మహ్మద్ అబ్దుల్ ఘనీ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాలభవన్లో ఏర్పాటు చేసిన మండల విద్యాధికారుల విద్యా సంవత్సర సన్నాహక సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థ అభివృద్ధిలో మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ముందుండి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర అధికారులు సూచించిన అన్ని కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు విధిగా పాల్గొనేలా చూడాలని సూచించారు. బడిబాట, యూడైస్, మార్కుల అప్లోడింగ్, శిక్షణ కార్యక్రమాలు, కాంప్లెక్స్ సమావేశాలు తదితర వాటిలో సహకరించాలని కోరారు. సీఆర్పీలు, ఎంఐఎస్లు, కోఆర్డినేటర్లు, సీసీఓలు డేటా నమోదులో చురుకుగా వ్యవహరించాలని చెప్పారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన హెచ్ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు ఎస్తేర్రాణి, ఫర్జానాబేగం, డీసీబీ కార్యదర్శి ప్రతాప్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు
● మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న వైనం ● ఆన్లైన్, మొబైల్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలంటున్న చైల్డ్ సేఫ్టీ అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఘటనలు సాక్షి, నాగర్కర్నూల్: ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, స్నాప్ చాట్, వాట్సప్.. తదితర సామాజిక మాధ్యమాల్లో నిత్యం గంటల తరబడి గడపడం ప్రస్తుతం టీనేజర్లకు సాధారణంగా మారింది. ఇదే క్రమంలో ఆన్లైన్ వేదికల ద్వారా కొత్తగా పరిచయం అయిన వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. బాల్య దశలోనే ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోవడం, మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చాలావరకు ఘటనలు సంబంధిత అధికారుల దృష్టికి సైతం రావడం లేదు. తీరా మైనర్గా ఉన్న బాలికలకు వివాహతంతు పూర్తయ్యాక అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. కఠిన నిబంధనలు ఉన్నా.. మైనర్ వివాహాలు జరిపిస్తే కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మైనర్ పెళ్లిళ్లు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికలను వివాహం చేసుకుంటే యువకుడు, బంధులవులతో పాటు బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. చాలాసందర్భాల్లో ఈ నిబంధనలు అమలుకావడం లేదు. మండలస్థాయిలో చైల్డ్ మ్యారేజీ ప్రొహిబిషన్ ఆఫీసర్లుగా సంబంధిత ఎమ్మార్వోలు, జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా, చాలావరకు వివాహాలు జరిగాక కేవలం కౌన్సిలింగ్లకే పరిమితమవుతున్నారు. చిన్నవయసులోనే ఆన్లైన్ ద్వారా పరిచయాలు ప్రేమ వ్యవహారాలకు దారి తీస్తుండటంతో తల్లిదండ్రులే మైనర్ బాలికలకు గుట్టుగా వివాహాలు జరిపిస్తున్నారు. మరికొంత మంది మైనర్ దశలోనే ఆన్లైన్ పరిచయస్తులను నమ్మి ఇల్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. -
నేటి నుంచి బీచుపల్లి బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: అపర మంత్రాలయంగా పేరుగాంచిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయన అర్చకులు తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, రాత్రికి తెప్పోత్సవం, ఆదివారం ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, సోమవారం ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, మధ్యాహ్నం సీతారాముల కల్యాణం, బలిహరణము, సాయంత్రం రథంగ హోమం, రాత్రికి కుంభం, రథోత్సవం, మంగళవారం ఉదయం పంచామృతాభిషేకం, చౌకిసేవ, బలిహరణం, రాత్రికి ప్రభోత్సవం, బుధవారం ఉదయం అమృతస్నానం, పంచామృభిషేకం, రాత్రికి పల్లకీసేవతో ఆంజనేయస్వామి ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయంలో నిత్య పూజలు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతి రోజు ఉదయం 07:30 లకు ఆకుపూజ, అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల సమయంలో నాలుగు శనివారాల్లో కూడా భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పిస్తారు. ఆలయ సమీపంలో దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతే భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి అమావాస్య రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపడతారు. ఐదు రోజుల పాటు వేడుకలు 12న ఆంజనేయస్వామివారి రథోత్సవం వేలాది తరలిన రానున్న భక్తులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఆంజనేయస్వామి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామన్గౌడ్ తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
వెల్దండ: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొట్ర గ్రామానికి చెందిన చిట్టయ్య(65) మేకల కాపరిగా ఉండేవాడు. ఈనెల 5వ తేదీ సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. మద్యానికి బానిసై అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లి 10 రోజులకోసారి వచ్చేవాడు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, బంధువులతో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం దుర్వాసన రావడంతో సమీప పొలాల రైతులు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి సమీపంలోని ప్రభుత్వ భూమిలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న పోలెమోని చిట్టయ్య(65)ను గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ కురుమూర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుల్లిపోవడంతో సంఘటనా స్థలంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్ప త్రి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిట్టయ్యకు భార్య బాలమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యనిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతూ భర్త మృతి జడ్చర్ల టౌన్: నాలుగు రోజుల క్రితం వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కావేరమ్మపేటకు చెందిన చింతకుంట రాములు(52), తిరుపతమ్మ భార్యభర్తలు. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుండేవి. దీంతో నాలుగు రోజుల క్రితం భార్య రాములుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే కాలిన గాయాలతో ఉన్న అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా జిల్లా ఆస్పత్రిలోనే రెండురోజుల క్రితం మరణవాంగ్మూలం నమోదు చేశారు. ఘటనపై రాములు సోదరుడు యాదయ్య జడ్చర్ల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. వివాహం జరిగిన నాటి నుంచి అన్నతో వదిన గొడవలు పడేదని, అదే క్రమంలో పెట్రోలు పోసి నిప్పంటించిందని ఫిర్యాదులో పొందుపర్చాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని, అంత్యక్రియల నిమిత్తం సాయంత్రం వరకు అనుమతిచ్చారు. ఇద్దరు పిల్లలతో సహాతల్లి అదృశ్యం నవాబుపేట: ఇంట్లో అందరు నిద్రిస్తూ ఉండగా తల్లి ఇద్దరు పిల్లలతో అ దృశ్యమైన సంఘటన మండలంలోని తీగలపల్లి శుక్రవారం చోటుచేసుకుంది. జడ్చర్ల మండ లం నాగసాలకు చెందిన ఎడ్ల కృష్ణయ్య కుటుంబంతో ఐదేళ్ల క్రితం మండలంలోని తీగలపల్లికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణయ్యకు భార్యతో పాటు ముగ్గు రు పిల్లలు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన అందరు తిని నిద్రించిన తరుణంలో తెల్లవారుజామున భార్య శ్రీదేవి (35) ఆ యన ఇద్దరు కుమారు లు విశ్వప్రసాద్(7), అ ఖిల్(5)లు కనిపించకుండ పోయారు. దీంతో ఆయన చుట్టుపక్కల, బంధువులతో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్ర మ్ తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి
భూత్పూర్: మండలంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రెండు వెర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నాసాగర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన యనమల రామ సంజీవరెడ్డి(35) జిల్లా కేంద్రంలోని ఓ గుత్తేదారు వద్ద ట్రాక్టర్తో పనులు చేయుటకు వచ్చాడు. పని పూర్తి చేసుకొని తిరిగి స్వగ్రామానికి గురువారం రాత్రి ట్రాక్టర్పై వెళ్తుండగా అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై పక్కనే ఉన్న రేలింగ్కు అదుపు తప్పి ఢీకొట్టాడు. దీంతో రామసంజీవరెడ్డి ట్రాక్టర్పై నుంచి ఎగిరిపడి ట్రాలీ టైర్ మీదపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శుక్రవారం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చిన్నాన్న యనమల లక్ష్మీనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరో పమాదంలో భూత్పూర్ పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు మోటార్ సైకిల్ను శేరిపల్లి (బి) బస్టాప్ నుంచి భూత్పూర్ వైపుకు మలుపుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. శేరిపల్లి (బి) గ్రామానికి చెందిన కృష్ణ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్ధలంలో గాయపడిన వెంకటేశ్వర్లును 108 లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ తిరుమల రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరొకరికి తీవ్ర గాయాలు -
తక్కువ పెట్టుబడితో సీడ్ డ్రిల్ విత్తు
దూరం పాటించాల్సిందే...! రకం వరుసల మొక్కల మధ్య (సెం.మీ.) మధ్య (సెం.మీ.) వరి 25 15 మొక్కజొన్న 60 20 పామాయిల్ 60 20 పెసర 25 10 గోగు 25–30 15 వేరు శనగ 30 15 అలంపూర్: జిల్లాలో రైతులు ఎక్కువగా విత్తనాలు వెదజల్లడం, నాగళి వెనుకసాళ్లలో వేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. చిన్న కమతాల్లో ఇది తప్పనిసరి. అయితే పెద్ద కమతాల్లో సాగు చేసే వారు యంత్రాలను వినియోగించడం మంచిది. ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్ డ్రిల్లర్లతో విత్తనాలు, ఎరువులు సమపాళ్లలో ఒకేసారి వేసుకోవచ్చు. దీనివలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు సూచించారు. కూలీల సమస్యను అధికమించడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సీడ్డ్రిల్ యంత్రంతో సాగు పద్ధతులను ఆయన రైతులకు వివరించారు. ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్ ఉపయోగాలు.. ● అన్ని రకాల విత్తనాలు ఈ డ్రిల్తో వేయవచ్చును. ● 8 గంటల్లో 6 నుంచి 8 ఎకరాల్లో విత్తనాలు విత్తుకోవచ్చు. ● వర్షాధార భూముల్లో తేమ తగ్గక ముందే సకాలంలో విత్తనాలు వేసుకోనే అవకాశం ఉంటుంది. ● పంటను బట్టి వరుసల మద్య దూరం, మొక్కల మద్య దూరం మార్చుకోవచ్చు. ● విత్తనంతో పాటు ఎరువులు వేయడం వలన పంట తొలి దశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. వేసిన ఎరువు మొక్కకు మాత్రమే అందడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. పంటకు గాలి వెలుతురు బాగా తగిలి పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ● యంత్రాలతో వరి, వేరు శనగ, మొక్కజొన్న, పెసర, మినుములు, కొమ్ము శనగ, గోగు తదితర పంటలు వేసుకోవచ్చు. ● ఈ యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా పొలం చదునుగా ఉండాలి. ● చివరి దుక్కిలో రోటోవేటర్ ఉపయోగించాలి. ● పొలం చదునుగా ఉంటే పొలం అంత విత్తనం, ఎరువులు ఒకే మోతాదులో పడతాయి. ఒకేసారి మొలక శాతం వస్తోంది. యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తుంది. పాడి–పంట సాగు ఇలా.. సీడ్డ్రిల్ యంత్రములో రెండు బాక్సులు ఉంటాయి. ముందు బాక్స్లో ఎరువులు వేయాలి. రెండవ బాక్స్లో విత్తనం వేయాలి. ఎరువు ముందు పడుతుంది. తర్వాత విత్తనం పడుతుంది. -
అన్నదాతలపై ఆరి్థక భారం
జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు.. ● 06.05.2025 తేదీన పట్టణ పోలీసులు జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టారు. మద్యంతాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురు యువకులు డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డారు. ఇలా..నిత్యం రోడ్లపై మైనర్లు బైక్లను మితిమీరిన వేగంతో విన్యాసాలు చేస్తూ సినిమా తరహాలో బైక్ చేజింగ్లకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో వీరు ప్రమాదాల బారిన పడడంతోపాటు ఎదుటివారిని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ● 17.2.2025వ తేదీన జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు మైనర్లు డబ్బులు సంపాదించేందుకోసం దొంగతనాలకు అలవాటుపడ్డారు. కాలనీ శివారులోని పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. ● 27.3.2025 జిల్లా కేంద్రానికి చెందిన 17ఏళ్ల బాలుడు ప్రేమ పేరిట పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు గురి చేశాడు. బాలికను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి జువైనల్ హోంకు పంపించారు. అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాల ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాకు వివిధ రకాల పరికరాలను అందించేందుకు గాను నిధులు మంజూరు చేస్తుంది. మార్చి 21న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. 2024– 25 ఆర్థిక సంవత్సరం ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాకు 1,341 యూనిట్లకు గాను రూ.3,30,53,000 నిధులు మంజూరయ్యాయి. మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతంపై వీటి ఇవ్వాలని సూచించారు. తక్కువ సమయం ఉండటంతో ప్రచారం కల్పించలేకపోయారు. దీనిపై ఇప్పటికే వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరణలో జాప్యంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైంది. ఈలోగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను వినియోగించలేకపోయారు. దీంతో 2025– 26 కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారా.. లేదా.. అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సం కింద నిధులు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపించారు. అందించే పరికరాలు ఇవే.. రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న పట్టే యంత్రాలు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. కేజీ వీల్స్, తైవాన్ పంపులు, రొటోవేటర్లు, చేతిపంపులు ఎక్కువగా మంజూరయ్యాయి. ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్ల తర్వాత.. వ్వవసాయానికి సంబంధించి ఐదేళ్లుగా వాతావరణం అనుకూలిస్తున్నా.. అన్నదాతలకు ప్రభుత్వం సాయం కరువైంది. ఏడేళ్లుగా యంత్ర సాయం లేకపోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి. 2017 వరకు ఏటా వానాకాలంలో రాయితీ పరికరాలను అందించగా తర్వాత నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖర్చులు, సమయం ఆదా.. కూలీ ఖర్చులతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవాలని రైతులు ఎక్కువగా యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఏటా యంత్రాల కోసం దరఖాస్తు చేయడం.. ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి నెల గడువు కాగా.. కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను మండలాలకు కేటాయించడం తదుపరి మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం.. అనంతరం జిల్లా కమిటీ ద్వారా ఆమోదం తెలిపి, కలెక్టర్ అనుమతితో రైతులకు అందజేయాలి. కాగా.. జిల్లాకు 2014– 15లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయగా.. 2016 నుంచి మాత్రం కేటాయింపులు ఒక రకంగా మంజూరు మరో రకంగా ఉంటోంది. మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో నిధులిచ్చే ప్రక్రియ ఊసేలేదు. 2016లో తొలి విడత.. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఈ పథకానికి రూ.5 కోట్లు కేటాయించి, రైతులకు పరికరాలు, అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చేవారు. ఏళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యవసాయ యంత్రాలకు చేయూత కరువు మహిళా రైతులకు 50, ఇతరులకు 40 శాతం రాయితీ పరికరాలు ఆర్థిక సంవత్సరం ముగియడంతో లబ్ధిదారుల ఎంపికకు బ్రేక్ 2018 నుంచి నిధులుకేటాయించని వైనం వ్యవసాయ యాంత్రీకరణ పథకంపునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం -
రెన్యువల్కు రాశాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.86 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సంవత్సరం చివరలో నిధులు రావడంతో సమయానికి లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. దీంతో ప్రస్తుత 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు కేంద్రానికి రెన్యువల్ కోసం లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పునరుద్ధరించి నిధులు ఇస్తామని ప్రకటించింది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్కర్నూల్ సబ్సిడీపై ట్రాక్టర్లు ఇవ్వాలి.. గతంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇస్తే అన్నదాతలకు ఎంతో ఊరట కలుగుతోంది. పంటల సాగుకు ఖర్చు తగ్గుతుంది. – కదిరే కృష్ణయ్య, రైతు, ఉప్పునుంతల దున్నడానికే రూ.11 వేలు.. ఏటా సాగు ఖర్చు పెరుగుతోంది. ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎద్దులతో వ్యవసాయం చేద్దామంటే వాటిని మేపేందుకు మేతలేదు. ఎకరా పంట సాగుకు రూ.25 వేల పెట్టుబడి అయితే అందులో రూ.11 వేలు దున్నడానికే పోతోంది. – సబావత్ పుల్యానాయక్, రైతు, గుట్టమీది తండా -
దారి తప్పుతున్నారు..!
మద్యానికి బానిసలవుతున్న మైనర్లు, యువత ●తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి పిల్లలు మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే మొదట్లోనే తల్లిదండ్రులు గుర్తించి మందలించాలి. వారికి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దు. డబ్బు విలువ తెలిసేలా.. పిల్లల ఫీజుల కోసం తాము పడుతున్న కష్టాన్ని వివరించాలి. చెడు వ్యసనాల బారిన పడడం వల్ల కలిగే అనర్థాలను వివరించి సన్మార్గంలో నడిచేలా చూడాలి. చిన్న తనంలోనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించి.. దానిని చేరుకునేందుకు కష్టపడి చదవాలని నిత్యం దిశానిర్దేశం చేయాలి. డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ తదితర కేసుల్లో మైనర్లు పట్టుబడితే.. వారితోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల గద్వాల క్రైం: నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్తుండేవారు. కానీ, ఇప్పుడు చదువు మరిచి కొందరు మైనర్లు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. వీరిలో అధికంగా 16 ఏళ్లు నిండని మైనర్లు.. యువతే ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. సరదాగా అలవాటు చేసుకున్న మద్యం, దూమపానానికి బానిసలుగా మారి.. ఆ మత్తులోనే వాహనాలు తీసుకొని రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. మరికొందరు మత్తు పదార్థాలు కొనుగోలు చేసేందుకు ఏకంగా వాహనాల దొంగతనాలకు వెనకాడడంలేదు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో ఇటీవల ప్రమాదాల బారినపడి గాయాలైన ఘటనలు అనేకం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి మీద కన్నవారికి ఆశలు, ఆశయాలు ఉంటాయి. కానీ, వారు మాత్రం చెడు వ్యసనాలకు అలవాటు పడి.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడి.. పలు కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్ను ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నారు. డబ్బు కోసం అడ్డదారులు.. సిగరేట్, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ మైనర్లు, యువత.. అదే ఫ్యాషన్ అనే భ్రమలో కాలం గడుపుతున్నారు. నిషాలో జోగుతూ భవిష్యత్ చిత్తు చేసుకుంటున్నారు. మత్తులో డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు, సామగ్రి దొంగలిస్తున్నారు. వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించి వచ్చిన నగదుతో మద్యం, ఇతర మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సైతం పట్టణ శివారు ప్రాంతాలకు స్నేహితులతో కలిసి వేడుకల పేరుతో హంగామా సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. అటుగా వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద చిన్నారులకు మద్యం విక్రయించబోమనే నిబంధన ఉన్నా.. అది అమలు కావడంలేదనే విమర్శలు వినవస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ చేసే సమయంలో పలువురు మైనర్లు దొరికిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది. 80 ఈ – పెట్టి.. 40 డ్రంకెన్ డ్రైవ్ కేసులు మితిమీరిన వేగంతో రోడ్డు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న ఘటనలు అనేకం ఈజీ మనీ లక్ష్యంగా దొంగతనాలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న వైనం అడ్డుకట్ట వేయడంలో కుటుంబ సభ్యులు విఫలం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్లు, కార్లు నేర్పిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం తప్పు అని తెలిసినా.. ఇంట్లో ఏదైన పని ఉంటే ఆసరా అవుతారనే భావనతో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు ఏమో వారాంతాలు, వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి బైక్ల మీద అతివేగంగా దూసుకెళ్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేని వయస్సులో వాహనాలు నడుపుతూ ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొట్టడమో, ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదాల బారిన పడడమో, అతివేగంతో అదుపుతప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వీరిని మొదట్లోనే నిలువరించాల్సిన తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇటీవల చేపట్టిన తనిఖీల్లో మైనర్లు బైక్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు 80కి పైగా ఈ పెట్టి కేసులు, 40 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని, వారు అడిగినన్ని డబ్బులు ఇవ్వకుండా స్వయంగా వారి అవసరాలను గుర్తించి వారే డబ్బులు చెల్లించాలని, వాహనాలు నడుపుతున్నారని మురిసిపోవడం కంటే వారు చేస్తున్నది తప్పు అన్న విషయాన్ని గుర్తించాలని, పిల్లల అలవాట్లు, పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం, రోజువారి కార్యకలాపాలపై దృష్టి సారించాలని, ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే మందలించాలని పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. -
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అకర్శితులయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఈశ్వరియ విశ్వ విద్యాలయం వారు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. డీఎస్పీ మొగిలయ్య, ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ, మంజుల, సీఐ శ్రీను, ఎస్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ట్రాక్టర్తో కరిగెట దున్నుతున్న ఓ రైతు -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
గద్వాల/ఇటిక్యాల: భూ సమస్యలను సత్వరం పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఇటిక్యాల మండలంలోని సాతర్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులలో కూడిన బృందాలు రెవెన్యూ సదస్సులో అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారని, ఈ సదస్సుల్లో ఎలాంటి ఫీజు లేకుండా రైతులు తమ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరీశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిర్ణీత గుడువులోగా సమస్కలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో ఆర్డీఓ శ్రీనివాన రావు, తహశీల్దార్లు వీర భద్రప్ప, నరేష్, డి.టి. నందిని, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. మార్పుకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలి సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్క్రాస్ వ్యవస్థాపకులు సర్ జీన్ హెన్రీడ్యూనాంట్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్ జీన్ హెన్రీడ్యూనాంట్ చేసిన మానవతా సేవలు, అపూర్వకృషికి గుర్తుగా మొదటగా నోబెల్శాంతి బహుమతి ఆయనకు లభించిందన్నారు. రెడ్క్రాస్ సంస్థ విశ్వవ్యాప్త మానవతా ఉద్యమానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయ సహకారాలు రక్తదానం, ఆరోగ్యసంరక్షణ, విపత్తు సంసిద్ధత తదితర రంగాల్లో సంస్థ చేపడుతున్న సేవలు గొప్పవని కొనియాడారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్, సభ్యులు అయ్యప్పురెడ్డి, రవికుమార్, అక్బర్బాషా, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రధాన కూడళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందం విస్తృత్తంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పాత, కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆలయాలు, ప్రార్థన మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్లు తదితర ప్రాంతాల్లో పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఆధ్వర్యంలో అనుమానం ఉన్న బ్యాగ్లు, స్థలాలను నిషేధిత పదార్ధాలను గుర్తించేందుకు యంత్రాలతో తనిఖీలు చేశా రు. శత్రు దేశంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో భాగంగా పోలీ సు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైన ఉంటే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా వారు తెలిపారు. అయితే పోలీసులు విస్తృత్తంగా తనిఖీలు చేపట్టడంతో పలువురు ఆందోళన చెందారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి ఇటిక్యాల: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని.. వైద్య సిబ్బంది సైతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సంధ్య కిరణ్మయి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విష జ్వరాలతో పాటు వివిధ వ్యాధులకు సంబందించిన మందులు, పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకొని ఇబ్బందులు పడాల్సిన అవనరం లేదన్నారు. గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న 102 సేవలను వినియోగించుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని, ఎండాకాలం నూలు వస్త్రాలు ధరించాలని, ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డిడిఈఓ రామాంజనేయులు, మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, పాల్గొన్నారు. ఇష్టానుసారంగా ఎరువులు వినియోగించొద్దు గద్వాల వ్యవసాయం: ఇష్టానుసారంగా ఎరువులను వినియోగించరాదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. గురువారం గద్వాల మండలంలోని కొండపల్లి రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా ఎరువులను వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతుందని, సిఫారసు చేసిన ఎరువులను మోతాదు మేరకు మాత్రమే వినియోగించాలని అన్నారు. సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ, వివిధ పంటలలో నూతన సాంకేతికతను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చునని అన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ మాట్లాడుతూ.. ఎప్పుడు ఒకే రకమైన పంటలు వేయకుండా, పంట మర్పాడి తప్పక చేయాలని సూచించారు. పండ్ల తోటల్లో అంతర పంటలు వేసుకోవడం వల్ల అధిక లాభాలు వస్తాయని చెప్పారు. అంతకుముందు ప్రాంతీయ పరిశోధన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ నళిని యూరియా వినియోగం, సాగు ఖర్చులు తగ్గించుకునే విధానాలు, పంట మార్పిడి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదులను భద్రపర్చడం, సాగునీటి ఆదా, చెట్లను పెంచడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ ఆదినారాయణ రెడ్డి, ఆయిల్ఫామ్ ఫెడరేషన్ అధికారి శశిధర్గౌడ్, మండల వ్యవసాయ, ఉధ్యానశాఖల అధికారులు, విస్థరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
కలంపై జులుం సహించం
గద్వాల: ప్రజాస్వామ్యంలో పత్రిక, మీడియా రంగం నాలుగో స్తంభమని.. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రంగానికి భంగం వాటిల్లే చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని.. కలంపై జులుం ప్రదర్శించాలని చూస్తే సహించేది లేదని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరించారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ పాలనలోని లోపాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పుటికప్పుడు ‘సాక్షి’ దినపత్రిక ఎండగడుతూ వస్తోంది. దీనిని జీర్ణించుకోలేని ఏపీ పాలకులు పోలీసులతో అప్రజాస్వామ్యంగా ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో గురువారం తనిఖీల పేరిట దౌర్జన్యానికి తెగబడటాన్ని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గద్వాల వర్కింగ్ జర్నలిస్టులు ఏపీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసులతో పత్రిక గొంతును నొక్కేప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. పాలకులు ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిన అవసరముందని, అదేవిధంగా పోలీసుల చర్యలు చట్టాన్ని పరిరక్షించి శాంతిభద్రతలను కాపాడాలే ఉండాలి తప్పితే రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించరాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో జర్నలిస్టుల నుంచి ప్రజాస్వామ్యబద్దంగా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రవిందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టులు, వెంకటేష్, హరికృష్ణ, గోకారి,మధు, లోకేష్, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన -
పుర ఆదాయానికి గండి
వ్యాపార సముదాయాలపై కొరవడిన పర్యవేక్షణ ●వసూలు చేస్తాం మున్సిపాలిటీకి సంబందించిన దుకాణాల అద్దె బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతాం. ఇప్పటికే బకాయిలు ఎక్కువగా ఉన్న దుకాణాల తాలుకు జాబితా తయారు చేశాం. వారందరికి నోటీసులు జారీ చేస్తున్నాం. అప్పటికీ స్పందించకుంటే దుకాణాలకు తాళాలు వేస్తాం. దుకాణాల అద్దె విషయంలో కఠిన చర్యలు తప్పవు. – దశరథ్ మున్సిపల్ కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: ‘స్థలం మనది.. ఇల్లు కట్టుకునేది మన సొమ్ములతో.. కానీ ఇంటి స్థలానికి లేఅవుట్ అనుమతి ఉండాలి. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోవాలి. కనీసం లేఅవుట్ లేకపోయినా భూమి మార్కెట్ ధరపై 14 శాతం అపరాధ రుసుం వసూలు చేస్తారు. అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే ఆస్తిపన్ను రెట్టింపు విధిస్తారు. అన్నీ అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్నా ఏటా ఆస్తిపన్ను చెల్లించాలి. ఇది మన సొంత ఆస్తికి సంబంధించిన వ్యవహరం.’ ‘భూమి మనదే... పూరి గుడిసె అయినా.. మేడలైనా మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఆస్తిపన్ను చెల్లించాలి. మదింపు చేసి విధించిన ఆస్తిపన్నును ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశిత తేదీల్లో చెల్లించని పక్షంలో రూ.100కు రూ.2 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. మన సొంత ఆస్తులకు సైతం ఏటా పన్ను చెల్లించాలన్న మాట.’.. కానీ ఇవేవీ లేకుండా దర్జాగా ఆస్తులను అనుభవించాలనుకుంటే మాత్రం మున్సిపాలిటీలకు చెందిన ఆస్తులు (వ్యాపార సముదాయాలను) వెతుక్కోవాలి. ఒక్కసారి వేలంలో పాల్గొని సముదాయంలో ఒక్క దుకాణం పొందితే చాలు మొదట కొంత సొమ్ము విదిల్చుకుంటే ఇక ఆ ఆస్తిని అనుభవించడానికి హక్కులు పొందినట్లే. అద్దెలు అడిగేవారుండరు.. అడిగినా మనకు తెలిసిన నాయకులను ఆశ్రయిస్తే సరిపోతుంది. గద్వాల మున్సిపాలిటీలోని వ్యాపార సముదాయాల్లో జరుగుతున్న తంతు ఇది. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే మనరులుగా లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వ్యాపార సముదాయాలు పరులపాలవుతున్నాయి. మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతుండగా, దుకాణాలను పొందిన వ్యక్తులు వాటిని ఇతరులకు అద్దెకిస్తూ ఆర్జిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార సముదాయాల్లో నిబంధన ఉల్లంఘన అడుగడుగునా చోటుచేసుకుంటున్న విషయం అధికారులకు తెలిసినా నోరు మెదపడం కానీ.. అద్దె వసూలు చేయాలనే సాహసంతో ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. రాజకీయ జోక్యం సొంత ఆస్తులపై రాబడిని ఆర్జించలేని స్థితిని మున్సిపాలిటీకి కల్పిస్తుంది. పేరుకుపోతున్న బకాయిలు పాత బస్టాండ్ సముదాయంలో, పాత గ్రంథాలయ భవన నిర్మాణం కింద దుకాణాలను వేలం పాట ద్వారా అద్దెలకు ఇచ్చారు. భారీ మొత్తంలో వ్యాపారులు వేలం పాడి దుకాణాలను దక్కించుకున్నారు. ఇందులో చాలా మంది వ్యాపారులు దుకాణం దక్కించుకున్నప్పటి నుంచి అద్దెలే చెల్లించడం లేదు. ఈ రెండు సముదాయాలలో ఉన్న అద్దె బకాయిలే రూ.లక్షల్లో ఉన్నాయి. కొంత మంది రెండు, మూడేళ్ల నుంచి అద్దెలు చెల్లించడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్దె వసూళ్లకు వెళ్లిన మున్సిపల్ సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పేరుకపోతున్నాయి. కొన్ని దుకాణాలకు న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి. వాటి పరిష్కారానికి అధికారులు కనీస శ్రద్ధ కనబర్చడం లేదు. రెండు, మూడేళ్లుగా అద్దెలు చెల్లించని వైనం పేరుకుపోయిన రూ.1.50 కోట్ల అద్దె బకాయిలు బయటి మార్కెట్ కంటే తక్కువ అద్దెలతో మున్సిపాలిటీకి నష్టం ఇదీ పరిస్థితి.. జిల్లాలో గద్వాలతో పాటు అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే మూడు దశాబ్దాల క్రితం ఐడీఎస్ఎంటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ రుణంతో గద్వాల మున్సిపల్ పరిధిలో 236 దుకాణాలను చేపట్టారు. ఏ నుంచి హెచ్ బ్లాక్ వరకూ.. స్టోర్స్ అకాడమి, నల్లకుంట కాలనీ, కూరగాయల మార్కెట్ దగ్గర, పాత బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం పక్కన, కళాశాల మార్గంలో ఉన్న ప్రధాన రహదారుల పక్కన దుకాణాలను నిర్మించారు. కొన్ని దుకాణ సముదాయాలకు 30 ఏళ్లు లీజు అగ్రిమెంట్ పూర్తయింది. కేటాయించిన దుకాణాల అద్దెలను ప్రతి మూడేళ్లకు రెన్యూవల్ చేయాలి. కానీ అద్దెలను మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు పెంచకుండా తక్కువ మొత్తంలో అద్దెలు చెల్లిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో దుకాణాల అద్దె బకాయి రూ.1.50 కోట్లకు చేరుకుంది. -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుంటే ఇకపై రోడ్డుపై నడిపేందుకు అవకాశం లేదు. కాలపరిమితి ముగిసిన వాహహనాల నంబర్ ప్లేట్ల పైనా నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని రకాల పాత వాహనాలకు ఇప్పుడున్నవి కాకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తుది గడువు సెప్టెంబర్ 30గా ప్రకటించింది. లేని పక్షంలో భారీ జరిమానాలు, శిక్షలు వేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని అమర్చుకునేందుకు ప్రత్యేక రుసుములు ప్రకటించారు. వాహనాల తీరు ఆధారంగా ధరలు నిర్ణయించింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. పటిష్ట చర్యలు నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడపకుండా ఉండేందుకు రవాణాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. నిర్ణీత కాల పరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబర్ ప్లేట్లపై రోడ్డుపై తిరుగుతూ ప్రమాదాల కారణం అవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్యం పరీక్షలు చేయడం లేదు. ఇలాంటి వాటికి ఆడ్డుకట్టు పడనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2018 డిసెంబర్ 31 నాటికి 6,01,677 వాహనాలు ఉండగా 2019 జనవరి 1 నుంచి 2025 ఏప్రిల్ 30 వరకు 3,68,574 వాహనాలతో మొత్తం 9,65,761 వాహనాలు ఉన్నాయి. ఐదు జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. సాధారణ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు 4 లక్షలకు పైగానే ఉంటాయని సమాచారం. ఈ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నిరాధరణ పత్రాల వంటి తదితర సేవలను నిలిపివేస్తారు. వాటిని అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పవు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం లేదా వాహనాలు సీజ్ చేయడం చేస్తారు. నంబర్ ప్లేట్ మార్పు ఇలా.. పాత వాహనానికి కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఎస్ఐఏఎం.ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి వాహనం నంబర్, ఫోన్నంబర్, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి అమర్చుకొని ఫొటోను తీసి మరోసారి వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సిన బాధత వాహనదారుడిపైనే ఉంటుంది. ఇదిలాఉండగా, నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్లు లేని వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్కు చెల్లించే రుసుములు ఇలా.. ద్విచక్రవాహనం 320-360 కార్లు 590-700కమర్షియల్ వాహనాలు 600-800 త్రిచక్రవాహనాలు 350-450 జిల్లా బైక్లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబూబ్నగర్ 2,70,491 26,069 14,585 9,872 19,493 433 వనపర్తి 37,407 6093 2,415 3,845 6,678 2,424 నాగర్కర్నూల్ 41,291 6,893 3,610 4,391 9,770 342 గద్వాల 58,956 4,856 1,648 3,267 6,811 218 నారాయణపేట 40,059 4,953 3,135 2,700 8,823 149 2019 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు కొనుగోలు చేసిన వాహనాలు జిల్లా బైక్లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబ్బ్నగర్ 84,061 13,548 5,873 4,310 7,917 163 వనపర్తి 36,767 4,376 1,968 2,114 7,373 01 నాగర్కర్నూల్ 47,797 6,225 1,947 3,416 15,093 78 గద్వాల 56,329 4,199 697 2,101 6,803 44 నారాయణపేట 42,405 3,719 2,409 1,423 5,404 44 పాత వాహనాలకు హై సెక్యూరిటీ ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ 2019 కంటే ముందు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు నకిలీ నంబర్ ప్లేట్ల కట్టడి.. రహదారి భద్రతే లక్ష్యం పాత వాహనాలకు అమర్చుకోవాలి పాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు అమర్చుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం వాహనాలకు ఫీజును నిర్ధారించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు మరో 5 ఏళ్లు గడువు పొడిగించాలంటే వాహనదారుడు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానికి బార్కోడ్ వస్తోంది. అప్పడు వాటికి హైసెక్యూరిటీ నంబర్ల ప్లేటు అమర్చుకోవాల్సి ఉంటుంది. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం. వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తాం. – చిన్నబాలు, రీజినల్ ట్రాన్స్పోర్టు అధికారి, నాగర్కర్నూల్ -
సిబ్బంది లేక ఇబ్బంది
అయిజ: పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 2017లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అయిజకు సబ్ డివిజన్ కేటాయించారు. నాటి నుంచి సబ్డివిజన్ కేంద్రం ఏర్పాటు చేసుకొని అయిజ, మల్దకల్, గట్టు మండలాల రైతులకు విద్యుత్ సేవలు అందిస్తున్నారు. అయితే, సబ్ డివిజన్ ఏర్పాటు వరకు బాగానే ఉన్నా.. సరిపడా సిబ్బంది లేకపోవడం, సొంత భవనం నిర్మించకపోవడం, తాత్కాలిక భవనంలో వసతులు లేకపోవడంతో అటు అధికారులు, ఉన్న సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మూడుచోట్ల సబ్ డివిజన్లు జిల్లాలో గద్వాల, అలంపూర్, అయిజలో కలిపి మొత్తం మూడు విద్యుత్ సబ్డివిజన్లు ఏర్పాటు చేశారు. అయితే గద్వాల, అలంపూర్లో సబ్ డివిజన్లకు కార్యాలయ భవనాలు ఉన్నాయి. ఆ రెండు ప్రదేశాల్లో సబ్ డివిజన్ కార్యాలయంలో తగినంతమంది సిబ్బంది ఉన్నారు. అయిజలో సబ్ డివిజన్ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడు సంవత్సరాలపాటు ఇంచార్జ్లతో సరిపెట్టారు. గత మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఏడీఈ పనిచేస్తున్నా వసతులు కరువయ్యాయి. మౌళిక వసతులు కరువు అయిజ విద్యుత్ సబ్ డివిజన్లో ఇంతవరకు కనీసం కార్యాలయ భవనం నిర్మించలేదు. తగిన సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. చిన్న గదిలో ఏఈ కార్యాలయం ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. అదే గదిలో ఏడీఈ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా పోయింది. కనీసం ఏఈలు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా అవకాశం లేదు. కార్యాలయంలో కనీసం ముగ్గురు ఏఈలు, ముగ్గురు సబ్ ఇంజినీర్లు వస్తేకూడా కూర్చోవడానికి స్థలం లేదు. అలాగే, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. తొమ్మిది గ్రామాలకు లైన్మన్లు లేరు. ఒక్కో గ్రామానికి ఇద్దరు నుంచి ముగ్గురు లైన్మెన్లు ఉండాల్సి ఉండగా వెంకటాపురం, పర్దిపురం, కిస్టాపరం, యాపదిన్నె, కుర్వపల్లి, గుడుదొడ్డి, బింగుదొడ్డి, ఎక్లాస్పురం, దేవబండ గ్రామాల్లో కనీసం ఒక్కొక్క లైన్మెన్ కూడా లేరు. రాజోళి, మల్దకల్, గట్టు మండలాల్లోని సబ్ స్టేషన్లలో ముగ్గురు చొప్పున ఆపరేటర్లు ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వేరే వ్యక్తులతో తాత్కాలికంగా పనులు చేయిస్తున్నారు. ప్రతి సబ్స్టేషన్లలో ముగ్గురు ఆపరేట్లు ఉండాల్సి ఉండగా ఇద్దరు ఆపరేటర్లతోనే పనులు చేయిస్తున్నారు. విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం కొనసాగుతున్నది ఈ భవనం ఇదే..అయిజ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో సమస్యల తిష్ట సొంత భవనం లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు 2017లో విద్యుత్ సబ్డివిజన్ ఏర్పాటు అయిజ, మల్దకల్, గట్టు, రాజోళి మండలాల రైతులకు సేవలు కూర్చోవడానికి కూడా స్థలంలేదు రైతులు తమ గోడును వినిపించుకోవడానికి సబ్డిజన్కు వెళ్తే అక్కడ అధికారితో కనీసం కూర్చొని మాట్లాడేందుకు కూడా స్థలంలేదు. దానివలన రైతులు నిలబడి మాట్లాడి వెళ్లాల్సి వస్తుంది. కార్యాలయంలో రైతులు కనీసం ఏఈతో మాట్లాడుకుందాం అన్నా సరే అక్కడ కూడా స్థలం చాలడంలేదు. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి. – గోవిందు, రైతు నివేదికలు పంపించాం సబ్డివిజన్ కార్యాలయ భవనంలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. తగినంత సిబ్బంది లేకపోవడంతో పనులు వేగంగా ముందుకు సాగడంలేదు. ఈ విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేశాం. కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టాలని రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. – నీలి గోవిందు, ఏడీఈ, అయిజ సబ్ డివిజన్ -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఇటిక్యాల: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి చట్టంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్, ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం అధికారులే స్వయంగా గ్రామాలకు వచ్చి భూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారని తెలిపారు. వావిలాల గ్రామంలో వివిధ రకాల భూ సమస్యలపై 49 అర్జీలు అందాయని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, ఎంపీడీఓ అజార్ మొహినుద్దీన్, ఏఓ రవికుమార్, రెవెన్యూ సిబ్బంది మనోహర్, నరేష్, మదన్మోహన్, సర్వేయర్ దౌలమ్మ, పంచాయతీ కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లలో తనిఖీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. బయో మెడికల్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని.. ప్రైవేటు ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా బీఎండబ్ల్యూ నిబంధనలు పాటించాలని జిల్లా ప్రోగ్రాం అధికారిణి ప్రసూన్నరాణి సూచించారు. ఈ తనిఖీల్లో అధికారులు మధుసూదన్రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. ముగిసిన ఆరాధనోత్సవాలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న శేషదాసుల వారి ఆరాధనోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున శేషదాసుల వారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పండితులు రాఘవేంద్రాచారి, రమేషాచారి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. సన్మార్గంలో పయనించాలన్నారు. అనంతరం సంగీత కచేరి చేశారు. హరినామ సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, దీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, శశాంక్, విష్ణు, అరవిందరావు, బాబురావు, భీంసేన్రావు, మనోహర్రావు, రామారావు, శ్రావణ్, రవిచారి తదితరులు పాల్గొన్నారు. -
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి
రాజోళి: కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సంబంధిత అధికారులకు సూచించారు. రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు నసనూరు, పెద్ద ధన్వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రతి కూలీకి రూ.300 కూలి అందే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా పచ్చర్లలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న నాలుగు పశువుల పాకలు, ఎరువు గుంతలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ ఖాజామొయినుద్దీన్, ఏపీఓ ప్రసాద్, ఏపీఎం మార్తమ్మ తదితరులు ఉన్నారు. -
విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందించాలి
ధరూరు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందించాలని అడిషనల్ డీఆర్డీఓ నర్సింహులు అన్నారు. మంగళవారం ధరూరు మండలం అల్వాలపాడు గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల యూనిఫాం తయారీకి అవసరమైన క్లాత్ను ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు అందించినట్లు తెలిపారు. దు స్తులను చక్కగా కుట్టి విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం ఇప్పటికే కుట్టిన యూనిఫాంలను ఆయన పరిశీలించారు. సమావేశంలో డీపీఎం రామ్మూర్తి, ఏపీఎం శోభారాణి, సీసీ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలి
● ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ ● ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన గద్వాల: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదువుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 34 మంది విద్యార్థులను మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 32వ స్థానంలో నిలవగా.. తాజాగా విడుదలైన ఫలితాల్లో 10.36 శాతం పెరుగుదలతో ఉత్తమ ఫలితాలు సాధించి 26వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలంటే.. క్రమశిక్షణ, కష్టపడేతత్వం ఉండటంతో పాటు తమపై తమకు పూర్తి నమ్మకం ఉండాలని సూచించారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు నిరంతర కృషి అవసరమన్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కీలకమని.. భవిష్యత్కు దిశను నిర్ణయిస్తుందన్నారు. ఈ సమయంలో మరింత పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరమన్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండి.. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. రోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం మెస్ చార్జీలను కూడా 40 శాతం పెంచిందని.. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన ఉపాధ్యాయులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ ఘని, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మామిడి రైతు కుదేలు
అకాల వర్షాలు, ఈదురుగాలులతో తీవ్రనష్టం ●300 టన్నులకు పైగా.. నాగర్కర్నూల్ జిల్లాలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఏప్రిల్ నెలాఖరులో 300 టన్నులకు పైగా మామిడి కాయలు నేల రాలాయి. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్ మార్కెట్కు తీసుకువచ్చారు. మార్కెట్లో రాలిన కాయలను తక్కువ ధరలకు రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా రోజూ రాలిన కాయలు మార్కెట్కు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడు గాలివానల వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సలీం, మామిడి ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్, కొల్లాపూర్ నష్టంపై నివేదికలిచ్చాం.. అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా మామిడి తోటల్లో పెద్దమొత్తంలో కాయలు రాలాయి. నియోజకవర్గాల వారీగా పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో చెట్లు విరిగిపడిన సంఘటనలు లేవు. కానీ, కాయలు చాలా రాలాయి. రాలిన కాయలను మార్కెట్లో ధరలు ఉండవు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్ కొల్లాపూర్ శివారులో ఈదురుగాలులకు నేలరాలిన మామిడి కాయలు కొల్లాపూర్: వాతావరణ ప్రభావంతో అంతంత మేరకే దిగుబడులు.. చేతికొచ్చిన దాన్ని అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు మామిడి రైతులను కుదేలు చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు లాభాలు రాకపోగా.. కష్టాలు.. నష్టాలు చుట్టుముట్టి రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. నామమాత్రపు దిగుబడులు ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం మామిడి దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. మొదట్లో పూతలు బాగా పూసినప్పటికీ వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాలేదు. సాధారణ దిగుబడి కంటే సగం మేరకు తక్కువగా దిగుబడులు వచ్చాయి. పండిన ఆ కాస్త పంటను అమ్ముకునే సమయంలో మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఏప్రిల్ నెల మూడో వారం నుంచి తరచూ వీస్తున్న భారీ ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా మామిడి తోటలు దెబ్బతిని.. కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు సైతం నెలకొరిగాయి. సరైన ధరలు లేక.. మామిడి దిగుబడుల సంగతి పక్కన పెడితే.. ధరలు ఈ ఏడాది కూడా పెరగలేదు. ఇందుకు వ్యాపారుల సిండికేటే ప్రధాన కారణం. ఫిబ్రవరి నెలలో టన్ను రూ.లక్షకు పైగా పలికిన మామిడి ధర.. మార్చి మొదటి వారంలో పూర్తిగా తగ్గిపోయాయి. టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే పలుకుతోంది. గాలివానల కారణంగా రాలిన మామిడి కాయలను హైదరాబాద్ మార్కెట్లో టన్నుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతులు పండించిన పంటకు రవాణా, కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి. నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బీభత్సం సృష్టించిన గాలులు కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు వాతావరణం అనుకూలించకపంట దిగుబడిపై ప్రభావం ఆర్థికంగా చితికిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
పారా బాయిల్డ్లో భారీ అగ్నిప్రమాదం
వనపర్తి: పెబ్బేరు పట్టణ శివారులోని సాయిగోపాల్ పారా బాయిల్డ్ మిల్లులో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి–44కు సమీపంలోని మిల్లులో సాయంత్రం ఎవరూ లేని సమయంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి.. గన్నీ బ్యాగులు, ధాన్యం బస్తాలు, మర ఆడించిన బియ్యం పెద్దమొత్తంలో దహనమైనట్లు మిల్లు యజమాని తెలిపారు. మిల్లులో పనిచేసేవారు టీ తాగేందుకు బయటకు వెళ్లిన సమయంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగగా.. గమనించిన వారు వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడంతోపాటు కొత్తకోట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్ర యత్నం చేసినా.. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పారా బాయిల్డ్ మిల్లులో చెలరేగుతున్న మంటలు వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన -
ఏం జరుగుతుందంటే..
జిల్లాలో ఇసుక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మన ఇసుక వాహనం పేరుతో కొన్ని ట్రాక్టర్లకు అనుమతులిచ్చింది. అయితే వారు ఆన్లైన్లో తమ ట్రాక్టర్ను నమోదు చేసుకునేందుకు కొంత నగదును ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు ఇసుకను ప్రజలకు అందించే క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను అందిస్తున్నారు. ఈ క్రమంలో వారికి నష్టాలు కూడా తప్పడం లేదు. కాగా నదిలో ఇసుక కూడా తక్కువగా ఉండటంతో ఎక్కడ లభ్యత ఉంటే అక్కడికి వెళ్లి ఇసుకను తీసుకుంటున్నారు. కానీ కర్నూల్ జిల్లా అధికారులు నదిలోకి వెళ్తున్న గద్వాల జిల్లా ట్రాక్టర్లను తమ హద్దులోకి వచ్చారనే నెపంతో బెదిరించడం, ఫొటోలు తీసుకోకుండా ఫోన్లు లాక్కోవడం, జరిమానాలు విధించడం చేస్తున్నారు. కానీ ఏపీకి చెందిన ట్రాక్టర్లతోపాటు నదిలో నీరున్న సమయంలో నేరుగా స్టీమర్లు జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుకను తోడుతున్నా ఇక్కడి జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా నదిలో అష్టకష్టాలు పడి నదిలో ఇసుకను లోడ్ చేసుకుని వస్తున్న అనుమతి ఉన్న ట్రాక్టర్లపై రాజకీయ కక్ష్యలతో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ట్రాక్టర్ల యజమానులు ఇసుక వాహనాలను నడిపేందుకు జంకుతున్నారు. నదిలో దిగితే ఏపీ అధికారుల బెదిరింపులు, బయటకు వస్తే జిల్లా అధికారులు నానా కారణాలతో కేసులు చేస్తున్నారని ట్రాక్టర్ల యజమానులు అంటున్నారు. రోడ్ టాక్స్, ప్రభుత్వానికి ఆన్లైన్ కోసం టాక్స్ ఇతర అన్ని పన్నులు చెల్లిస్తున్నా తమకు అండగా ఉండటం వదిలేసి ఏపీ అధికారులతో సమానంగా కేసులు చేయడం దారుణమని అంటున్నారు. -
భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ఇటిక్యాల: భూ సమస్యలను పరిస్కరించేందుకు గాను ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు. సొమవారం మండలంలోని గోపల్దిన్నెలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా మండలాన్ని ఎంపిక చేశారని, భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలని, అధికారులు స్వయంగా గ్రామాలకే దరఖాస్తులను పరిశీలించి, అర్హతను నిర్ధారించిన తర్వాత వారికి సంబంధింత ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. మీసేవ కేంద్రాలలో దరఖాస్తు ఫీజు ఉంటుందని, ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పూర్తిగా ఉచితంగా స్వీకరించబడుతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి అనంతరం కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్దిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తి అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో మొత్తం 55 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే 8 ఇళ్లకు బేస్మెంట్ పూర్తికాగా ముగ్గురికి మొదటి విడతగా రూ.1లక్ష వచ్చినట్లు తెలిపారు. ఇళ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ.. లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, తహశీల్దార్లు వీర భద్రప్ప, నరేష్, ఎంపీడీఓ అజార్ మొహినుద్దీన్, ఎఓ రవికుమార్ పాల్గొన్నారు. -
ఉచితం పేరుతో దందా
రాజోళి: తుంగభద్ర నది నీటి కోసం గతంలో రెండు ప్రాంతాల వారు ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. అప్పటి అధికారులు, యంతాంగ్రం ఆ సమస్యపై పెద్దగా స్పందించకపోవడంతోనే ఘర్షణ జరిగిందని నాటి ప్రత్యక్ష సాక్ష్యులు నేటికి చెబుతుంటారు. ప్రస్తుతం అదే ప్రాంతాల నడుమ మరో సమస్యపై వివాదం ముదురుతోంది. గతంలో తుంగభద్రలో నీటి కోసం కాగా.. ఇప్పుడు కూడా అదే నదిలో ఇసుక కోసం వివాదం జరుగుతుంది. ఇప్పుడు కూడా అధికారులు మౌనంగా ఉండటంతో జిల్లాకు నష్టం వాటిల్లుతుందని, జిల్లా ప్రయోజనాలను మరిచి ఏపీ అధికారుల తీరుపై కనీసం నోరు మెదపకపోవడంపై జిల్లా ప్రజలు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గార్లపాడు శివారులో కర్నూల్–గద్వాల మధ్యలో వివాదానికి కేంద్రంగా మారిన సరిహద్దు రెండు ప్రాంతాల నడుమ ఒకే నది రాష్ట్రంలోని గద్వాల జిల్లా.. ఏపీలోని కర్నూల్ జిల్లాలో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఈ క్రమంలో నదిలో నీటిని కలిసి తాగుతున్నామని, అందులో ఉన్న వనరులను పంచుకునే క్రమంలో పరిమితులు విధిస్తూ ఒక ప్రాంతం వారికి అన్యా యం చేయడం తగదని జిల్లా వాసులు అంటున్నారు. రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఒకే నది ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా చూడాల్సిన అధికార పార్టీలే ఈ సమస్యను పరిష్కరించకుండా వదిలేస్తే మున్మందు సమస్య తీవ్రత పెరిగే అవకాశముందని జిల్లా వాసులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో ఉచిత ఇసుక పేరుతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటుగా నది పరివాహకంలోని అన్ని గ్రామాల్లో ఇసుకను తోడి ఉచితం పేరుతో టిప్పర్లలో తరలించి దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు ఉంటే రాత్రిళ్ల సమయంలో ఇసుక రవాణా చేయాల్సిన పరిస్థితి ఏంటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉచితం ఏపిలో మాత్రమే ఉండగా, ఏపి నుంచి తెలంగాణలోకి వాహనాలు రావడం ఏంటని, దాని వెనుక ఎవరున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నదిలోకి వెళ్లగానే హద్దు పేరుతో దాడులు చేసి కేసులు, జరిమానాలు విధించే, ఏపి అధికారులు హద్దులు దాటి వచ్చి దందాలు చేస్తున్న ఏపీ వాహనాలు ఎందుకు కనిపించడం లేదని జిల్లా వాసులు అంటున్నారు. ఏపీ వాహనాలు జిల్లాలో చేస్తున్న దందాను జిల్లా అధికారులు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని అంటున్నారు. జిల్లాలో నది తీర గ్రామాల్లో భాగంగా రాజోళి మండలం తూర్పు గార్లపాడు, చిన్నధన్వాడ, మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామాల్లో మన ఇసుక వాహనాలు నడుస్తుండగా.. జిల్లాలోని తుంగభద్ర నది పరివాహక గ్రామాల్లోని ఏపీ వైపున నుంచి ఈ గ్రామాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తుమ్మిళ్ల గ్రామంలో నేటికి మర బోట్ల ద్వారా ఇసుకను జిల్లా సరిహద్దులోకి వచ్చి తీస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పటికే తూర్పు గార్లపాడులోని ఇసుక రీచ్కి వెళ్లిన జిల్లా ట్రాక్టర్లపై ఏపీ అధికారులు రెండు సార్లు కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఇలా ప్రకృతి వనరులపై అజమాయిషీ చేస్తున్నా.. రోజురోజుకు వివాదం ముదరుతున్నా అధికార పార్టీ, ప్రభుత్వ పెద్దలు నోరుమెదపకపోవడం, చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇరు ప్రాంతాల అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, లేకపోతే వివాదం మరింత ముదిరే ప్రమాదముందని జిల్లా వాసులు అంటున్నారు. ఇదిలాఉండగా, నదిలో నెలకొన్న సమస్యను జిల్లా మైనింగ్ శాఖ అధికారి దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా.. పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. ప్రకృతి వనరులపై అజమాయిషీ జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుక తోడుతున్న ఏపీ ప్రాంతంవారు ఉచితం పేరుతో ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న ఇసుక మాఫియా జిల్లా ట్రాక్టర్ యజమానులపై ఏపీ అధికారుల కేసులు, బెదిరింపులు నోరు మెదపని జిల్లా అధికారులు -
‘ప్రజావాణి’కి 53 ఫిర్యాదులు
గద్వాల:వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 53 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏవో నరెందర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు గద్వాల క్రైం: సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 8 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గద్వాలలో ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్గా చూపించి రూ.20లక్షలు మోసం చేశాడని, న్యాయం చేయాల్సిందిగా రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. అలాగే, గట్టు మండలానికి చెందిన ఇద్దరు రైతులు భూ వివాదంపై తరచూ ఘర్షణ చోటు చేసుకుంటుందని, వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీ దృష్టికి రైతులు వివరించారు. ఇలా పలువురు బాధితులు పలు సమస్యలపై ఎస్పీకి విన్నవించారు. డిగ్రీ పరీక్షలు వాయిదా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ కోరులకు సంబంధించి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలు బుధవారం (మే 6) నుంచి జరగాల్సి ఉంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘాలు.. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ చేసి, ఆందోళనకు దిగిన నేపథ్యంలో పీయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: ఈనెల మూడో వారంలో మంచిర్యాల జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలుర జట్టు ఎంపికలను ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు సభ్యులు నాగరాజు, రాఘవేందర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా వివరాల కోసం 99590 16610, 99592 20075 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. స్వయం ఉపాధికి కార్పొరేషన్ల తోడ్పాటు స్టేషన్ మహబూబ్నగర్: స్వయం ఉపాధికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడుతాయని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్నగర్ షాసాబ్గుట్ట ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెహందీ, కంప్యూటర్ కోర్సులు పూర్తిచేసిన మహిళలకు సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేవిధంగా కార్పొరేషన్లు చేయూత అందిస్తాయని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున స్కిల్డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మెహందీ, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి రుణాలు మంజూరవుతాయని అన్నారు. -
2 వేల ఏళ్ల నాటి గ్రామం..
నంది వడ్డెమాన్గా మారిన వర్ధమానపురం ● 400 ఏళ్లు పాలించిన కాకతీయ సామంత రాజులు ● నేటికీ సజీవంగా చారిత్రక ఆనవాళ్లు ● గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడు ● రాష్ట్రంలోనే ఏకై క ఆలయంగా ప్రసిద్ధి శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వస్త్రాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు. నాగర్కర్నూల్: కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి. మహిళలు సైతం పూజలు చేయొచ్చు.. -
కనులపండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
మల్దకల్: మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కల్యాణోత్సవం ఆదివారం వేదపండితులు కుమారస్వామి, శివకుమార్ మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా సాగింది. ముందుగా స్వామి వార్ల ఉత్సవమూర్తులను భాజాభజంత్రీలతో ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితులు కల్యాణం నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు, గద్వాల పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్అచారి, సంఘం నాయకులు బ్రహ్మయ్యచారి, ప్రభాకరచారి ముఖ్యలతిథులుగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు మల్దకల్తో పాటు గట్టు, అయిజ, గద్వాల పట్టణాలకు చెందిన విశ్వబ్రాహ్మణులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా.. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మయ్య, మహేష్, బీష్మాచారి, వినోద్, రంగప్పచారి, శ్రీనివాసులు, కాలప్పచారి, నర్సింహచారి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
కులగణనతోనే ఆ వర్గాలకు న్యాయం
అయిజ: కులగణన చేస్తేనే వెనుకబడిన జాతులకు మేలు కలుగుతుందని మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్తో కలిసి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీ పాదయాత్ర చేశారని, ఆ సమయంలో ప్రజల ఆలోచన విధానాన్ని, సంక్షేమంలో ప్రజలు వెనుకబడిన విధానాన్ని గుర్తించారని అన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ కడప తొక్కని వెనకబడిన జాతులు చాలా ఉన్నాయని, కులగణన వెనుకబడిన కులాల, జాతుల అభ్యున్నతికి దోహదపడుతుందని, రాహుల్ గాంధీ ఇదే విషయం చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ కుల గణన సర్వే చేయలేదని, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు సర్వే చేసింది కానీ వివరాలు బయటపెట్టలేదని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనను రేవంత్రెడ్డి అమలు చేశారని, రాష్ట్రంలో చేసిన కుల గణన దేశానికి ఆదర్శం అయ్యిందని అన్నారు. దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కుల గణన చేసేందుకు ముందుకొచ్చిందని అన్నారు. తైబజార్ వేలం రద్దు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. అయిజ మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన తైబజార్ వేలం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తైబజార్ను నిర్వహించిన వారు నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కౌన్సిలర్లు తీర్మానం చేయకుండా తైబజార్ వేలాన్ని ఎలా నిర్వహిస్తారని అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో తైబజార్ను నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని తొత్తినోనిదొడ్డిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అయిజ: మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు హెచ్చరించారు. శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తైబజార్ వేలం నిర్వహణ నిబంధనల మేరకు లేకపోవడంతో దాన్ని రద్దుచేసి కొత్తగా వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వార్డు ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ వారి వార్డుల్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఎప్పడు అడిగినాసరే పూర్తి సమాచారం ఇవ్వాలని అన్నారు. మృతిచెందిన వారికి అనేక నెలలుగా పించన్లు బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయని, వారి వివరాలు సేకరించి రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసి భూగ్భ జలాలను పెంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా త్వరలో విడుదల అవుతుందని, అనర్హులను గుర్తించి వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎల్ఆర్ఎస్ నిరంతర ప్రక్రియ అని, కమర్షియల్ టాక్స్ చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మండలంలోని ఉప్పల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం నాణ్యత, గోడౌన్ సదుపాయాలు, రైతులకు జారీచేసే రసీదులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పొరపాట్లకు తావు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. మల్దకల్: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు హెచ్చరించారు. మల్దకల్ ఎంపీడీఓ కార్యాలయన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయగా.. కొందరు విధులకు హాజరుకాలేదు. సమయపాలన పాటించి ప్రతి ఒక్కరు విధులకు సక్రమంగా హాజరుకావాలని ఆదేశించారు. నర్సరీలలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పెంచి సంరక్షించాలని అన్నారు. -
రేపటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో వైస్చాన్స్లర్తో జరిగిన సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దీనికి తోడు పీయూ అధికారులు సైతం కళాశాలల అఫ్లియేషన్స్, ర్యాటిఫికేషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే వరకు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఈ నెల 6న జరిగే డిగ్రీ పరీక్షలను సైతం నిర్వహించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జహీర్అక్తర్, ఫణిప్రసాద్, సత్యనారాయణగౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.