Jogulamba
-
ఆసక్తి ఉన్న రైతులకు..
మండలంలో వంద శాతం సబ్సిడీపై మినుము విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. నీటి లభ్యత ఉండి సాగుకు ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి విత్తనాలు ఇస్తున్నాం. ఒక పట్టాదారు పాస్ పుస్తకానికి 4 కిలోల మినీ కిట్ అందించాం. ప్రస్తుతం వచ్చిన విత్తనాలను రైతులను గుర్తించి పూర్తి స్థాయిలో పంపిణీ చేశాం. – నాగార్జున్ రెడ్డి, ఏఓ, అలంపూర్ పప్పుదినుసుల సాగుతో లాభాలు పప్పుదినుసు పంట సాగుతో లాభాలు పొందవచ్చు. మార్కెట్లో పప్పుదినుసులకు మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం పప్పుదినుసుల సాగు పెంచడానికి పయత్నాలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా కొద్ది మంది రైతులను ఎంపిక చేసి ఉచితంగా విత్తనాలు అందించడం జరుగుతుంది. జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా ఉచితంగా పంపిణీ చేసిన విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ● -
ప్రాణాలకు ముప్పు తెచ్చే ఫ్యాక్టరీ పెట్టొద్దు
రాజోళి: ప్రాణాలకు ముప్పు తెచ్చే ఫ్యాక్టరీ పెట్టొద్దని పెద్దధన్వాడ ప్రజలు డిమాండ్ చేశారు. మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శనివారం 17వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గ్రామంతో పాటు ఆయా గ్రామాల రైతులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే చిన్నకారు రైతులు వీధిన పడతారని, ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ భూములు దెబ్బతినడమే కాకుండా, పంటలు చేతికి రాకుండా పోతాయని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని, రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. -
లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం
ధరూరు: ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరుకునేందుకు నిరంతరం కష్టపడి చదవాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. మండలంలోని మార్లబీడు గ్రామ శివారులోని నెట్టెంపాడు ఎత్తిపోతల క్వార్టర్స్లో కొనసాగుతున్న కేటీదొడ్డి మండల ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి కలెక్టర్ బస చేయగా.. శనివారం ఉదయం పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువు ఎంత ముఖ్యమో వ్యాయామం అంతే ముఖ్యమని, ప్రతి రోజు ఉదయం వాకింగ్ వంటి వాటిని చేసి ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చునని తెలియజేశారు. చదవడం ఒక్కటే కాకుండా దాని అసలైన అర్థాన్ని, ప్రాముఖ్యతను గ్రహించాలన్నారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు లాజికల్ ఆలోచనలను వృద్ధి చేసుకుంటూ చదవాలన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ను, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో ఆహార నాణ్యత లోపంపై సంబంధిత కాంట్రాక్టర్, పర్యవేక్షణ లోపంపై వార్డెన్, ప్రిన్సిపాల్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఆహార నాణ్యత లోపంపై వివరణ ఇవ్వాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సక్రమంగా పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారుడిని అభినందించిన కలెక్టర్ గద్వాల: ఈ నెల 1, 2వ తేదీల్లో నేపాల్లో జరిగిన ఏషియన్ షూటింగ్ బాల్ చాంపియన్ షిప్లో ఇండియా మొదటి స్థానం నిలవడంలో.. అందులో జిల్లా క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ కనబర్చడం గొప్ప విషయమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం క్రీడాకారుడు కె.మంజూనాథ్ను కలెక్టర్ ఆయన చాంబర్లో ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం క్రీడాకారుడు, ఇతర క్రీడాధికారులు.. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి జితెందర్, పీడీ కృష్ణయ్య, బీసన్న, రాజేందర్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ భోజనం నాణ్యతగా లేకపోవడంపై వార్డెన్, ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీసులు -
గజవాహనంపైఊరేగిన వేంకటేశ్వరస్వామి
మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించిన గజవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారిని గర్భగుడిలోకి తీసుకెళ్లి అభిషేకాలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. – మహబూబ్నగర్ రూరల్ -
ధరణి దరఖాస్తులను క్లియర్ చేయండి
గద్వాల: జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్షించారు. ప్రజావాణి, మీసేవ కేంద్రాలలో వచ్చిన ధరణి దరఖాస్తులను క్లియర్ చేయాలని అదేవిధంగా కుల, ఆదాయ, ఓబీసీ సర్టిఫికెట్లపై ప్రత్యేక శ్రద్ధఉంచి ఎప్పటికప్పు డు క్లియర్ చేయాలన్నారు. కొత్త రేషన్కార్డులు పొందిన కుటుంబాల వివరాలను సమర్పించాలన్నారు. బర్త్ సర్టిఫికెట్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, ఎక్స్ సర్వీస్మెన్, ప్రొహిబిటెడ్, పెండింగ్ మ్యూటేషన్ సక్సెషన్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏవో నరెందర్, డీఎస్డీవో స్వామి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలపై.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేసే వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు అన్నారు. శనివారం కలెక్టరేట్లో సీఆర్పీలతో మాట్లాడారు. గ్రామీణప్రాంతాల్లో ప్రజాసంఘాల శక్తిని పెంచడం, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం అదేవిధంగా స్థానిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో సామర్థ్యాన్ని పెంచేలా అవగాహన కల్పించాలన్నారు. ఈసమావేశంలో ఏపీఓ నర్సింహులు, సంగీత తదితరులు పాల్గొన్నారు. -
పప్పుధాన్యాల సాగుకు.. ప్రోత్సాహం
అలంపూర్: ఏటికేడు పప్పుదినుసుల సాగు తగ్గుతూ వస్తోంది.. రైతులకు సరైన దిగుబడి రాకపోవడం.. మద్దతు ధర అందకపోవడమూ ఓ కారణం. ఇదిలాఉండగా, పప్పుదినుసుల సాగు తగ్గితే మార్కెట్లో తీవ్ర కొరత నెలకొనే ప్రమాదం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పప్పుదినుసుల సాగు పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈమేరకు జాతీయ ఆహార భద్రత పథకం ద్వార పప్పుదినుసుల పంట విత్తనాలు వంద శాతం సబ్సిడీపై ఉచితంగా అందిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనువుగా ఈ పథకం ద్వారా విత్తనాలు సరఫరా చేస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలోని మూడు మండలాలను ఎంపిక చేసి పప్పుదినుసుల్లో ప్రధానంగా ఉన్న మినుము విత్తనాలు ఉచితంగా అందిస్తోంది. మూడు మండలాల ఎంపిక జిల్లాలో ఆహార భద్రత పథకం కింద మినుము విత్తనాల పంపిణీకి ప్రస్తుతం మూడు మండలాలు అలంపూర్, ఎర్రవల్లి, ఉండవెల్లిని ఎంపిక చేశారు. నీటి లభ్యతోపాటుగా మినుములు అధికంగా సాగు చేసే ప్రాంతాలు కావడంతో వీటిని ఎంపిక చేసినట్లు సమాచారం. జిల్లాకు 500 ప్యాకెట్ల మినుములు వచ్చాయి. ఒక్కో దాంట్లో 4 కిలోల విత్తనాలు ఉంటాయి. అలంపూర్, ఎర్రవల్లి మండలానికి 8 క్వింటాళ్ల చొప్పున 16 క్వింటాళ్లు, ఉండవెల్లి మండలానికి 4 క్వింటాళ్లు సరఫరా చేశారు. సాగు చేసే రైతులను ఎంపిక చేసి వాటిని వంద శాతం సబ్సిడీపై ఉచితంగా అందిస్తారు. ప్రస్తుతం మండలాల్లో వీటి పంపిణీ ప్రారంభించారు. సాగు పెంచడమే లక్ష్యం దేశంలో పెరుగుతున్న ఆహార ఉత్పత్తులు పెంచడమే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాతరవణ పరిస్థితులకు అనువుగా కొత్తరకం విత్తనాలను అందుబాటులోకి తేవడానికి వ్యవసాయ శాఖ నిరంతరం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ప్రతి ఏడాది పప్పుదినుసు విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు. సాగు చేసిన పంట నాణ్యత ప్రమాణాలు, దిగుబడులను అంచనా వేసి మరింత పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పప్పుదినుసుల సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. పప్పుదినుసుల సాగు పెంచడానికి ఆహార భద్రత పథకం ద్వారా తగ్గుతున్న సాగును గుర్తించి ఆయా ప్రాంతాల్లో పప్పుదినుసుల విత్తనాలను ఉచితంగా అందిస్తు సాగును ప్రొత్సహిస్తున్నారు. వాతావరణంలో అనేక మార్పులు సంభివిస్తుంటాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాల విత్తనాలు ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. దీంతో వ్యవసాయ శాఖ పరిశోధనలు చేసి కొత్తరకం విత్తనాలను ఉత్పత్తి చేసి.. ఈ రకం విత్తనాలను ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా సాగు చేస్తోంది గమనించడానికి ఎక్కువ మొత్తంలో పంట సాగు చేసే రైతులను ఎంపిక చేసి ఒక ఎకరం లేదా రెండు ఎకరాల్లో వాటి పరిశీలనలు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఏడాది కొంత మంది రైతులకు ఉచితంగా విత్తనాలు అందజేస్తున్నారు. వంద శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు జిల్లాకు 20 క్వింటాళ్లు మంజూరు అలంపూర్, ఎర్రవల్లి, ఉండవెల్లి మండలాలు ఎంపిక జాతీయ ఆహార భద్రత పథకం కింద పంపిణీ పప్పుదినుసుల సాగు పెంచడమే లక్ష్యం -
గుండెపోటా.. వైద్యులు లేరు!
●‘ఇటీవల ఓ జిల్లా స్థాయి అధికారి గుండెపోటు బారినపడ్డారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించాక మళ్లీ హైదరాబాద్ రెఫర్ చేసి పంపారు. మరో ఘటనలో 35 ఏళ్ల యువకుడికి గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఆదివారం వైద్యులు లేరని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది. ఫలితంగా గుండెపోటు బారినపడి జనరల్ ఆస్పత్రికి వచ్చిన బాధితులు ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్కు తరలించే క్రమంలో మృతి చెందిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇటీవల విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్కు సడెన్గా గుండెపోటు రావడంతో చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చిన కార్డియాలజీ విభాగం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. అందుబాటులోకి తెస్తాం.. ఐఎంఏతో సమన్వయం చేసుకుని ప్రైవేట్లో ఉన్న వైద్యులతో మాట్లాడటం జరిగింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఓపీ చూడటానికి కసరత్తు చేస్తున్నాం. త్వరలో జనరల్ ఆస్పత్రిలో ప్రైవేట్ కార్డియాలజిస్ట్ సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకొస్తాం. – సంపత్కుమార్సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పాలమూరు: ఇటీవల జిల్లాలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే పాలమూరు ప్రజలకు గుండెపోటు వస్తే అంతే సంగతులు అనే విధంగా మారాయి పరిస్థితులు. ఇటు ప్రభుత్వ ఆస్పత్రి.. అటు ప్రైవేట్లోనూ సరైన వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్కు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో రూ.లక్షల్లో వైద్య ఖర్చులు భరించలేక బాధితులు అవస్థలు పడుతుండగా.. మరికొందరు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుతో వచ్చే బాధితులకు కనీసం ప్రాథమికంగా చేసే చికిత్స సైతం అందుబాటులో లేకుండాపోయింది. జనరల్ ఆస్పత్రిలో 2డీ ఎకో మిషన్ అందుబాటులో ఉన్నా టెక్నీషియన్ లేక వాడటం లేదు. ఇక ఈసీజీ అందుబాటులో ఉన్న రిపోర్ట్ సక్రమంగా వస్తుందా.. రాదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్లోనూ అంతే.. పాలమూరు పట్టణంలో ప్రైవేట్ సెక్టార్లో నాలుగు క్యాథ్ ల్యాబ్లు ఉండగా ఆరుగురు వరకు కార్డియాలజిస్ట్లు అందుబాటులో ఉన్న కార్డియోథొరాసిక్ సర్జన్లు ఒక్కరు కూడా లేరు. దీంతో గుండెకు సంబంధించిన ఏదైనా చిన్నపాటి సర్జరీ చేయాలన్నా హైదరాబాద్ నుంచి టీంలు రప్పించి ఇక్కడ చేస్తున్నారు. ఇందుకోసం రోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. చాలా వరకు మేజర్ సర్జరీలు ఉంటే అందరూ హైదరాబాద్కు వెళ్తున్నారు. స్థానికంగా ఒకటి రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొంత మేర సేవలు అందుబాటులో ఉన్న ఫీజులు మాత్రం భారీగా ఉంటున్నా యి. ఎంజియోగ్రాం చేయించుకోవడానికి రూ.15 వేల – 25 వేల వరకు ఖర్చు అవుతోంది. ఒకవేళ స్టంట్ వేయాల్సి వస్తే అదనంగా రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కూడా అందుబాటులో లేకపోవడంతో నిరుపేదలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. కలెక్టర్ చెప్పినా.. జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి రాని కార్డియాలజీ సేవలు ప్రైవేట్ వైద్యులతో ఓపీ సేవలు అందించాలని కలెక్టర్ సూచించినా అమల్లోకి రాని వైనం ప్రైవేట్లోనూ అందుబాటులో లేని కార్డియోథొరాసిక్ విభాగం గుండె సమస్యలు అంటేనే హైదరాబాద్కు సిఫార్సు అత్యవసర వేళలో ప్రాణాలు కోల్పోతున్న బాధితులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో.. పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో అయిన అన్ని విభాగాలు అందుబాటులోకి వచ్చి హైదరాబాద్కు పోయే బాధ తప్పుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. కొత్తగా నిర్మించే ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం అందుబాటులో ఉండి అందులో అత్యాధునిక క్యాథ్ల్యాబ్, థోరాసిక్ సర్జరీ థియేటర్, ఇతర పరికరాలు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక అవసరమైన గుండె వైద్య నిపుణులు, కార్డియో థోరాసిక్ సర్జన్లను నియమిస్తే తప్ప పాలమూరు వాసుల సమస్యలు తీరవు. జనరల్ ఆస్పత్రిలో గుండెపోటు రోగులను పరీక్షించడానికి ప్రైవేట్ కార్డియాలజిస్ట్లను రప్పించి వారంలో నాలుగు రోజులు ఓపీ చూసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయేందిర ఐఎంఏ అధ్యక్షుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్కు సూచించారు. కమిటీ సమావేశం జరిగి దాదాపు 25 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ విధానం అమల్లోకి రాలేదు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే మాదిరిగా ప్రైవేట్ గుండె వైద్యులను తీసుకువచ్చి ఓపీ చూసేలా ఏర్పాట్లు చేసినా ఒకటి రెండు రోజులు కూడా రోగులకు అందుబాటులో ఉండలేదు. దీంతో గుండెకు సంబంధించిన సమస్య వస్తే పేదవాడు సైతం జనరల్ ఆస్పత్రి రావడం లేదు. ఇక ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల్లో ఎవరికై నా గుండె సమస్య వస్తే జనరల్ మెడిసిన్ వైద్యుడితో పరీక్షిస్తున్నారు. రోగికి సమస్య తీవ్రత అధికంగా ఉంటే బయటకు రెఫర్ చేసి పంపుతున్నారు. -
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
ఇటిక్యాల: వైద్య సిబ్బంది విధిగా సమయపాలన పాటించి రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ సిద్దప్ప అన్నారు. శుక్రవారం ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న వివిధ సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు. టీబీ మరియు లిప్రసి వ్యాధులను గుర్తించి వెంటనే వారికి సరైన చికిత్స అందించాలని సూచించారు. ఈ నెల 10న జరిగే నులి పురుగుల దినోత్సవ కార్యక్రమంలో 1–19 సంవత్సరాలలోని చిన్నారులకు మాత్రలు వేసి 100శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆరోగ్యకేంద్రంలోని ల్యాబ్, డెలివరి గదులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఓ తిరుమల్రెడ్డి, హెచ్ఈ మధుసూదన్రెడ్డి, డాక్టర్ రాధిక, ఎంఓలు సత్యమ్మ, వెంకటేశ్వర్లు, హెచ్ఎస్ పరశురాం పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
ఎర్రవల్లి: విద్యార్థులు తోటి విద్యార్థులతో క్రమ శిక్షణతో మెలగాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్డి గంటా కవితా అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆశయంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశలోనే చాలా మంది చెడు వ్యసనాల బారిన పడి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టంతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రుతకు మంచి పేరును తీసుకు రావాలని ఆమె సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వంట వారికి, పాఠశాల సిబ్బందికి పరిశుభ్రత, మెనూ గురించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాద్యాయులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
‘సీఎంఆర్’ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలి
గద్వాల: సీఎంఆర్ (కస్టమ్ మిల్లిడ్ రైస్) డెలివరీగా త్వరగా అయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మిల్లర్లకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వానాకాలం 2024–25 ధాన్యం డెలివరీపై 37 మంది రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి రైసు మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి సరఫరా చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. సీఎంఆర్ సమయానికి సరఫరా చేయడం ద్వారా పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే ఆహార భద్రతలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుందని ఆయన అన్నారు. సన్న బియాన్ని సమర్ధవంతంగా డెలివరీ చేయాలని సూచించారు. ఖరీఫ్ 2024–25 పంటకు సంబందించి ఇప్పటివరకు ఇవ్వని బ్యాంక్ గ్యారెంటీలను త్వరగా ఇవ్వాలన్నారు. రైస్ మిల్లులో నిలువ ఉంచిన ధాన్యన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్ఓ స్వామి కుమార్, జిల్లా మేనేజర్ విమల, మిల్లర్లు పాల్గొన్నారు. -
సమీకృత మార్కెట్ను వినియోగంలోకి తేవాలి
అయిజ: మున్సిపాలిటీలో రెండేళ్ల క్రితం రూ.2 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ నిర్మాణం నిరుపయోగంగా ఉందని, వినియోగంలోకి తీసుకరావాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు భగత్రెడ్డి కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులును బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈసందర్భంగా కమిషర్కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పట్టణంలో ప్రతి గురువారం ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నిర్వహించే సంత వలన అనేక ఇబ్బందులు కులుగుతున్నాయని తెలిపారు. చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు వారాంతపు సంతకు వస్తుంటారని, దానివలన ట్రాఫిక్ జామ్ అవుతుందని వాపోయారు. రోడ్డు పక్కన మాంసం, చేపలు, కూరగాయలు తదితర వస్తువులు విక్రయించడం వలన వ్యర్థ పదార్థాలు రోడ్డున పారవేస్తున్నారని, దీంతో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. సమీకృత మార్కెట్ భవనంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి అక్కడ క్రయ, విక్రయాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరయ్య చారి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. బోధన విధానంలో మార్పు రావాలి గద్వాలటౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన విధానంలో మార్పులు రావాలని జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారిణి ఎస్తేర్రాణి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, మోమిన్మహల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకరోజు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు ఉపయోగాలపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నూతన సాంకేతిక విధానాలను అందిపుచ్చుకోవాలన్నారు. తద్వారా విద్య బోధన చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇందుకోసం ఎన్నో నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తుందన్నారు. కోర్సు డైరెక్టర్లు జహురుద్దీన్, వెంకటనర్సయ్య, శోభరాణిలతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల ఎంఆర్సీలు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,201 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శుక్రవారం 599 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టంగా రూ.6201, కనిష్టంగా రూ. 3070, సరాసరి రూ.4789 ధరలు పలికాయి. అలాగే, 77 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6899, కనిష్టం రూ.6089, సరాసరి రూ.6835 ధరలు వచ్చాయి. 8 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ఽరూ. 5539 ధరలు లభించింది. -
భోజనం నాణ్యతగా లేకుంటే చర్యలు
ధరూరు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని.. నాణ్యతలో రాజీపడితే చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద ఉన్న గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, టీచర్లు పాఠాలు బాగానే చెబుతున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈక్రమంలో పలువురు విద్యార్థులు భోజనం నాణ్యతగా ఉండడం లేదని కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత వంట కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల సంఖ్య, ప్రస్తుత హాజరు వివరాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాత్రి గురుకులంలోనే కలెక్టర్ బస చేశారు. గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. రాత్రి బస -
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
అలంపూర్: కంది కొనగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన రాష్ట్ర ప్రధాన అధికారి రవిచంద్ర అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంది కొనుగోళ్లను ఆయన, ఎన్సీపీఎఫ్ అధికారులు దువ్వా వినయ్, మహానామలు శుక్రవారం పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి రోజువారిగా జరుగుతున్న కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి కొనుగోళ్ల నేపథ్యంలో రైతులు ఎదుర్కొనే సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా ఎకరాకు 3.31 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నీటి లభ్యత భూసార ఆధారంగా రైతులకు ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అధికారులకు వివరించారు. దీంతో ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున కేంద్రాల్లో కొనుగోలు చేయాలని కోరగా.. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎన్సీసీఎఫ్ అధికారి పేర్కొన్నారు. కేంద్రాల్లో విక్రయించాల్సిన రైతుల వివరాలు ఆన్లైన్లో తప్పనిసరిగా ఉండాలన్నారు. కేంద్రాలకు నాణ్యమైన కందులు తీసుకొస్తే రైతుల నుంచి ఎంత వచ్చిన కొనుగోలు చేస్తామన్నారు. క్వింటాకు రూ. 7550 మద్దతు ధర కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా మేనేజర్ గౌరి నాగేశ్వర్, పీఏసీఎస్ కార్యదర్శి కేశవరెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు. అనంతరం జోగుళాంబ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
జూరాల పరిధిలో ఇలా..
వినియోగించుకునే అవకాశం ఉన్నది 1.58 టీఎంసీల 40.0 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న నీటినిల్వ శ్రీశైలం పరిధిలో ఇలా.. ప్రస్తుతం ఉన్న నీటినిల్వ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం -
12 నుంచి నాలుగో ఇండెంట్
శాంతినగర్: తుంగభద్ర డ్యాం నుంచి ఈనెల 12న నాలుగో ఇండెంట్ పెట్టేందుకు నీటి పారుదలశాఖ అధికారులు (ఈఎన్సీ) నిర్ణయం తీసుకున్నట్లు ఆర్డీఎస్ ఈఈ విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్డీఎస్ వాటాగా 2024–25లో 5.896 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం (టీబీ డ్యాం ద్వారా) ఒప్పందం చేసుకుందన్నారు. అందులో భాగంగా మొదటి ఇండెంట్ గతేడాది డిసెంబర్ 26న 1.078 టీంఎంసీలు, రెండో ఇండెంట్ జనవరి 8న 1.04 టీఎంసీలు, మూడో ఇండెంట్ జనవరి 23న 1.555 టీంఎసీలు పెట్టినట్లు ఈఈ వివరించారు. నాలుగో ఇండెంట్ 1.166 టీఎంసీ ఈనెల 12 నుంచి 22 వరకు 11 రోజుల పాటు మొదటి 5 రోజులు రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున, మిగతా ఆరు రోజులు రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తారని, రైతులు సాగునీటి కొరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. చివరి ఇండెంట్ 1 టీఎంసీ వుంటుందని, పంటలకు అవసరమని రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు ఐదో ఇండెంట్ పెడతామని ఈఈ పేర్కొన్నారు. -
‘సీఎంఆర్’ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలి
గద్వాల: సీఎంఆర్ (కస్టమ్ మిల్లిడ్ రైస్) డెలివరీగా త్వరగా అయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మిల్లర్లకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వానాకాలం 2024–25 ధాన్యం డెలివరీపై 37 మంది రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి రైసు మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి సరఫరా చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. సీఎంఆర్ సమయానికి సరఫరా చేయడం ద్వారా పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే ఆహార భద్రతలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుందని ఆయన అన్నారు. సన్న బియాన్ని సమర్ధవంతంగా డెలివరీ చేయాలని సూచించారు. ఖరీఫ్ 2024–25 పంటకు సంబందించి ఇప్పటివరకు ఇవ్వని బ్యాంక్ గ్యారెంటీలను త్వరగా ఇవ్వాలన్నారు. రైస్ మిల్లులో నిలువ ఉంచిన ధాన్యన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్ఓ స్వామి కుమార్, జిల్లా మేనేజర్ విమల, మిల్లర్లు పాల్గొన్నారు. -
లక్ష్యం.. శత శాతం
వివరాలు 8లో u●సకాలంలో బిల్లులు చెల్లించాలి ఆస్తిపన్ను వసూళ్లు శతశాతం సాధించేలా తగిన ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి బిల్లులు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొండి బకాయిదారుల వివరాల జాబితాను రూపొందించేందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సకాలంలో బిల్లులు చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్ గద్వాలటౌన్: మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు అయిన ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో పన్నులను నూరుశాతం వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ దిశగా పూర్తి స్థాయిలో పన్నులను రాబట్టాలని అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొండి బకాయిదారుల వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. వీటిలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చారు. ప్రత్యేక కార్యాచరణ.. జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో వందశాతం పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార మాద్యమాలు, కరపత్రాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు లాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎక్కువ మొత్తం పన్నులు చెల్లించాల్సి ఉన్న బకాయిదారులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నా రు. పన్నుల వివరాలను గృహ యజమానుల సెల్ఫోన్లకు మెసేజ్ పంపేందుకు చర్యలు చేపట్టారు. రాయితీలతో ఊరట గత మూడేళ్లు ఆర్థిక సంవత్సరం మొదట్లో పన్ను వసూళ్లు పూర్తిగా మందగించాయి. దీంతో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే విధంగా.. పన్ను చెల్లింపుదారులకు రాయితీ ప్రకటించింది. దీంతో చాలవరకు అప్పట్లో పన్నులు వసూళ్లు అయ్యాయి. గత ఏడాది ముందుస్తు పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీ ఇచ్చింది. అదేవిధంగా మొండిబకాయిలపై 90 శాతం రాయితీ కల్పించింది. వీటి వలన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చాలా వరకు మొండి బకాయిలు చాలావరకు వసూలయ్యాయి. ప్రభుత్వం కల్పించిన రాయితీలను సైతం ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని మున్సిపాలిటీలలో వంద శాతం పన్ను వసూలు చేసేలా ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టారు. జిల్లాలో ఆస్తిపన్ను వివరాలు... మున్సిపాలిటీ అసెస్మెంట్లు లక్ష్యం వసూలు (రూ.లలో) (రూ.లలో) గద్వాల 15,865 7.13 కోట్లు 2.40 కోట్లు అయిజ 8,065 1.72 కోట్లు 71 లక్షలు అలంపూర్ 3,983 48.03 లక్షలు 23.60 లక్షలు వడ్డేపల్లి 3,980 1.03 కోట్లు 68.06 లక్షలుజిల్లాలో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి నాలుగు మున్సిపాలిటీలు.. రూ.10.36 కోట్లు దాటిన మొత్తం డిమాండ్ మొండి బకాయిదారుల జాబితా సిద్ధం -
ప్రమాద ఘంటికలు
శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో అడుగంటిన జలాలు ● పోటాపోటీగా తరలింపుతో వేసవికి ముందే భారీగా తగ్గిన నీటిమట్టం ● మరో నెలరోజుల్లోనే డెడ్ స్టోరేజీకి రెండు ప్రాజెక్టులు ● ఇప్పటికే యాసంగి పంటలకు వారబంధీ పద్ధతిలో సాగునీరు ● అప్రమత్తం కాకపోతే తాగునీటికీ తిప్పలే సాక్షి, నాగర్కర్నూల్: వేసవికి ముందే శ్రీశైలం, జూరాల జలాశయాల్లో నీటినిల్వలు భారీ స్థాయిలో అడుగంటుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా నీటిమట్టం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా వేసవి సమీపించక ముందే ఈ రెండు జలాశయాలు సగానికి ఖాళీ అయ్యాయి. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 84.66 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. శ్రీశైలం డ్యాంలోని నీటిని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కోసం ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకోవడంతో ప్రస్తుతం జలాశయం నీరు సగానికి మించి అడుగంటింది. ప్రస్తుతం ఉన్న నీటినిల్వ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న నీటినిల్వ తాగునీటికి ప్రణాళిక.. 4 టీఎంసీలపై ఆశలు.. డెడ్ స్టోరేజీకి నీటినిల్వ.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం జలాశయంలో కేవలం 5.287 టీఎంసీల నీరు ఉండగా.. కేవలం 1.58 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నీటితోనే ఆయకట్టు కింద యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందించడంతోపాటు తాగునీరు అందించడం కష్టసాధ్యంగా మారింది. జూరాల డ్యాంలో నీరు భారీస్థాయిలో పడిపోవడంతో వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ జలాశయం నుంచి కనీసం ఐదు టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని ఆ రాష్ట్రాన్ని ఇటీవల ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్బాబు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విన్నవించారు. ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి. ఇప్పటికే జూరాల జలాశయంలోని నీరు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నారాయణపూర్ నుంచి నీటి విడుదలపై ఆశలు నెలకొన్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కోసం ప్రణాళికను సిద్ధం చేశాం. శ్రీశైలం రిజర్వాయర్లో ఇకపై విద్యుదుత్పత్తి చేపట్టకుండా.. నీటిని నిల్వ ఉంచేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తాం. డ్యాంలో 40 టీఎంసీల నీటిమట్టం వరకు తాగునీటి వినియోగానికి వీలు ఉంటుంది. – శ్రీనివాస్రెడ్డి, ఈఈ, నీటి పారుదల శాఖ -
అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గం
రాజోళి: మండలంలోని పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్ష గురువారం 15 వరోజుకు చేరింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఫ్యాక్టరీకి సంబందించిన ఆస్తులకు చిన్న పాటి నష్టం కలిగినా తమపై కేసులు నమోదు చేస్తున్నారని, రెవెన్యూ, పోలీసు అధికారులు తమపై దీక్షలు విరమించాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. కాని తమ జీవనోపాధిగా ఉన్న వ్యవసాయాన్ని వదిలి ఫ్యాక్టరీని గ్రామంలో ఏర్పా టు చేయనివ్వమని అన్నారు. రానున్న భవిష్యత్తు పిల్లలదేనని అలాంటి వారికి అవసరమయ్యే వసతులను కోల్పోయే విధంగా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, అలాంటి మహమ్మారిని గ్రామంలోకి రానివ్వమని అన్నారు. కార్యక్రమంలో పెద్ద ధన్వాడతో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
మల్దకల్: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిత్య పరాశ్రీ స్వామిజీ భక్తులకు సూచించారు. గురువారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో శివస్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ దైవచింతనను కలిగి ఉండి ఆధ్యాత్మికపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు హిందువులంతా ఏక తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంట్లో ఉన్న దేవుడు ఇంటిల్లిపాదిని కాపాడితే, గుళ్లో ఉన్న దేవుడు లోకాన్ని రక్షిస్తాడన్నారు. యువత చెడు వ్యసనాలు వీడి సన్మార్గంలో నడవాలని, ప్రాచీన కాలం నుంచి వస్తున్న హిందూ సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటన్నింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు మనందరిపై ఉందన్నారు. అంతకుముందు ఆదిశిలా క్షేత్రంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా సంయోగ్ జగదీశ్వర్రెడ్డి, విహెచ్పీ నాయకులు దేవేందర్ రాజు, ఓబులేష్, రామాంజనేయులు, గోవిందు, రెడ్డప్ప, కిష్టన్న, రంగస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు , తిరుమలేష్, దుర్గాప్రసాద్, మల్దకల్, శివస్వాములు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో కొన్ని సంఘటనలు..
● 2025 జనవరి 19వ తేదీన గద్వాల పట్టణంలోని మైనార్టీ కులానికి చెందిన ఓ వ్యక్తి ధరూర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారితో పట్టణ శివారులోని రెండు ప్లాట్లను రూ.25లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు యజమాని స్థలం వద్దకు వెళ్లగా.. ఈ భూమి ప్రభుత్వ స్థలమని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని బోర్డు కనిపించింది. దీంతో జరిగిన మోసంపై బాధితుడు సదరు వ్యాపారిని ప్రశ్నించగా వేరే చోట ఉన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిస్తానని నమ్మబలికాడు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా అతని ఫిర్యాదు మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారిపై పట్టణ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. ● 2024 నవంబర్ 22వ తేదీన గద్వాల మండలానికి చెందిన ఓ మహిళ గద్వాల పట్టణంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద రూ.2.50లక్షలకు ప్లాట్ కొనుగోలు చేసింది. అయితే కొన్ని నెలల తర్వాత ప్లాట్కు సంబంధించిన పత్రాలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసి తీయగా అప్పటికే ఇద్దరు వ్యక్తులపై ప్లాట్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. దీంతో సదరు వ్యాపారిని మహిళ నిలదీయగా.. మరో చోట స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పాడు. నేడు రేపు అంటూ కాలయాపన చేయడంతో బాధితురాలు న్యాయం చేయాలని పట్టణ పోలీసు స్టేషన్ను ఆశ్రయించింది. దీంతో సదరు వ్యాపారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ● 2024 డిసెంబర్ 12వ తేదీన జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఓ వ్యక్తి పట్టణానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో రూ.50లక్షలు వెచ్చించి ప్లాట్ కొనుగోలు చేశాడు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో అసలు విషయం తెలిసింది. ఈ స్థలాన్ని రోడ్డు నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం సేకరించి.. సదరు వ్యాపారికి నష్టపరిహారం సైతం చెల్లించింది. ఈ విషయాన్ని దాచి తనను మోసం చేశాడని పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అలాగే, కొందరు వెంచర్ల నిర్వాహకులు ఒక ప్లాట్ను ఇద్దరికి విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. వెంచర్లో ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తికి కేవలం ప్లాట్ నంబర్ మాత్రమే కేటాయించడం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత అధికారులు గుర్తించినా వారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసి పంపించేస్తున్నారు. ఎప్పుడైతే వారు ఇల్లు నిర్మించుకునేందుకు వెళ్తారో అప్పుడు మోసాలు బయటకు పడుతున్నాయి. ఇలా జిల్లా కోర్టులో ఎన్నో కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇప్పటికై నా నిబంధనలు కఠినతరం చేయాలని.. మరొకరు మోసపోకుండా దోషులను చట్టప్రకారం శిక్షించాలని.. బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ● 2025 ఫిబ్రవరి 3వ తేదీన శాంతినగర్కు చెందిన ఓ వ్యక్తి అయిజ పట్టణంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వేసిన వెంచర్లో రెండు ప్లాట్లను రూ.59లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే రిజిస్ట్రేషన్ చేయించడంలో రోజులు, నెలలు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఎక్కడో మోసం జరిగిందని గ్రహించి విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయమై విచారణ చేయించాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
యూపీఎస్ విధానాన్ని సంఘటితంగా వ్యతిరేకిద్దాం
అలంపూర్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రవేశపెట్టబోయే యూపీఎస్ విధానాన్ని సంఘాలకు అతీతంగా వ్యతిరేకిద్దామని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. గురువారం అలంపూర్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, జిల్లా సీపీఎస్ నాయకులతో కలిసి మార్చి 2న నిర్వహించే చలోధర్నా, సీపీఎస్ యుద్ధభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ... ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త సీపీఎస్ విధానం అమలు చేయనుందని, ఈ విధానాన్ని ఆదిలోనే వ్యతిరేకించాలన్నారు. సంఘాలు సంఘటితంగా వ్యతిరేకించకపోతే 20 ఏళ్ల క్రితం పరిస్థితులు పునరావృతం అవుతాయని అన్నారు. పదవీ విరమణ అయ్యే ఉద్యోగులకు నెలకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు చాలీచాలలని పింఛన్ ఇస్తారని అన్నారు. ఉద్యోగులంతా ఏకమై మార్చిన 2న హైదరబాద్ ధర్నా చౌక్లో జరిగే సీపీఎస్ యుద్ధభేరికి పెత్తఎత్తున తరలివచ్చి ప్రభుత్వాలకు మన ఆవేదన తెలియజేద్దామన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని జిల్లా నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రమేష్ కుమార్, ప్రతాప్ రెడ్డి, కృష్ణ, అమరేందర్ రెడ్డి, శ్రీనివాసులు, నాగరాజు, జగదీష్, మస్తా ఆయా శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మోదీ, చంద్రబాబు మెప్పు కోసమే దళితుల విభజన
మహబూబ్నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ అంశం అసెంబ్లీలో పూర్తిగా అశాసీ్త్రయమైనదని, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వర్గీకరణ చేపట్టారని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన మాలలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మోసం చేశారని అన్నారు. వర్గీకరణకు పూర్తిగా మద్దతు ఇచ్చిన బీజేపీ.. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు వర్గీకరణ అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం సీఎం రేవంత్రెడ్డికి తెలియదా అని అన్నారు. మోదీ, చంద్రబాబుల మెప్పు కోసమే రేవంత్రెడ్డి దళితులను విభజించారని ఆరోపించారు. 2011 జనాభా లెక్కలలో ఉపకులాల గణన జరగలేదని, తప్పుడు జనాభా లెక్కలతో వర్గీకరణ చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు దాటిన తర్వాత పాత లెక్కలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగడమే శాసీ్త్రయం కాదని, మాలల జనాభాను పూర్తిగా తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మాలలకు జరుగుతున్న అన్యాయంపై గడపగడపకు వెళ్లి పోరాట చైతన్యాన్ని నింపుతామని తెలిపారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు జి.చిన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గోనెల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, నాయకులు రవికుమార్, ఆంజనేయులు, యాదయ్య, శ్రీనివాస్, రవి, హరిప్రసాద్, సహదేవ్, సూర్య, రాజు, కిరణ్ పాల్గొన్నారు. -
వాలీబాల్ అకాడమీ.. అటకెక్కించారు!
మెయిన్ స్టేడియంలో మూడేళ్ల క్రితం పునఃప్రారంభం గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వస్తారు.. మహబూబ్నగర్లో గతంలో ఉన్న వాలీబాల్ అకాడమీలోనే నేను ఓనమాలు నేర్చుకున్న. అకాడమీ నుంచి అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయస్థాయి మ్యాచుల్లో ఆడాను. స్పోర్ట్స్ కోటాలో ఇన్కమ్ టాక్స్ శాఖలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం కూడా వచ్చింది. వాలీబాల్ హాస్టళ్లు, అకాడమీ ఏర్పాటయితే నా లాంటి ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – యశ్వంత్కుమార్, అంతర్జాతీయ క్రీడాకారుడు, మహబూబ్నగర్ త్వరలో ప్రవేశాలు వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల గురించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు నివేదిక ఇచ్చాం. అనుమతులు రాగానే అకాడమీ సెలక్షన్స్, ప్రవేశాలు నిర్వహిస్తాం. అకాడమీ ఏర్పాటు తో నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీయవచ్చు. క్రీడాకారులకు మెరుగైన వసతి, ఉత్తమమైన శిక్షణ లభిస్తుంది. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ పాలమూరు జిల్లాకు వాలీబాల్ అకాడమీని మంజూరు చేసింది. నాలుగేళ్ల పాటు నడిచిన అకాడమీలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ చాటారు. దీంతో అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడ శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. వీరు మొదట్లో అకాడమీలో వాలీబాల్లో ఓనమాలు నేర్చుకొని దేశానికి ప్రాతినిథ్యం వహించేస్థాయికి ఎదిగారు. పలువురు క్రీడాకారులు జాతీయ సీని యర్ వాలీబాల్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008లో ఈ అకాడమీని మూసివేశారు. మూడేళ్ల క్రితం వసతుల ఏర్పాటు.. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరగడంతో.. మూడేళ్ల క్రితం వాలీబాల్ అకాడమీ తిరిగి పునఃప్రారంభమైంది. రూ.19.70 లక్షల నిధులతో స్టేడియం ఆవరణలోని స్విమ్మింగ్పూల్ కాంప్లెక్స్ గదులను అకాడమీ క్రీడాకారుల వసతి కోసం కేటాయించారు. గదుల ఆధునికీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. మంచాలు, టేబుల్స్, బీరువాలతో పాటు క్రీడాకారుల వసతి కోసం ఇతర వస్తువులను కూడా సిద్ధంగా ఉంచారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను తీసి వేసి వాటి స్థానంలో నూతన కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్ లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. గోడ చుట్టూ ఆకర్షణీయంగా వాలీబాల్ క్రీడాచిత్రాలను తీర్చిదిద్దారు. ప్రవేశాలపై సందిగ్ధం? మెయిన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నూతన వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని అండర్ 14–18 ఏళ్ల బాలబాలికలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 187 మంది బాలురు, 46 బాలికలు.. మొత్తం 233 మంది ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని అకాడమీకి ఎంపిక చేయాల్సి ఉంది. అయితే సెలక్షన్ నిర్వహించి రెండేళ్లు దాటినా.. క్రీడాకారులకు ప్రవేశాలు కల్పించలేదు. కోచ్ల నియామకాలు కూడా జరగలేదు. ఒకవేళ అకాడమీ ప్రారంభిస్తే.. గతంలో జరిగిన సెలక్షన్స్లో ప్రతిభ చాటిన వారికి ప్రవేశాలు ఇస్తారా లేదా మళ్లీ కొత్తగా సెలక్షన్స్ నిర్వహిస్తారా అనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. ి● వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల ఔత్సాహిక క్రీడాకారులకు మహర్దశ కలుగుతుంది. నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో బాలబాలికలకు మెరుగైన శిక్షణ అందజేసి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతారు. అయితే మూడేళ్ల క్రితమే అకాడమీ తిరిగి ప్రారంభమైనా ప్రవేశాలు కల్పించకపోవడంపై సీనియర్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా ప్రవేశాలు కల్పించాలని సీనియర్లు కోరుతున్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రస్థాయి ఎంపికలు సైతం పూర్తి అంతటితోనే ఆగిపోయిన ప్రక్రియ అకాడమీలో క్రీడాకారుల ప్రవేశాలపై సందిగ్ధం? -
‘రియల్’ మోసాలు
వివరాలు 8లో u●కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలి. సర్వే నంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీలో నిర్దేశించిన వివరాలు వెలుగులోకి వస్తాయి. గ్రామ పంచాయతీ, మున్సిపల్, డీటీడీసీ అనుమతి తదితర అనుమతులు కలిగిన వెంచర్లు ఏవో తెలుసుకోవాలి. బాధితుల ఫిర్యాదులపై విచారణ చేపట్టి మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. భూ సంబంధ కేసులు, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ గద్వాల క్రైం: సొంతింటి కలను అవకాశంగా మార్చుకొని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలకు తెరలేపుతున్నారు. ఒకే ప్లాట్ను ఒకరికి తెలియకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం.. ప్రభుత్వ స్థలాన్ని సైతం కప్పి పుచ్చి విక్రయించడం.. చివరికి ఇల్లు నిర్మించుకునే సమయంలో ఈ స్థలం మాదంటే.. మాది అంటూ ఒకరిపై ఒకరు గొడవకు దిగడం.. చివరికి పంచాయితీ పోలీసుల వద్దకు వెళ్లగా మోసపోయినట్లు తెలిసి పలువురు బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇటీవల పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా రియల్ మాయగాళ్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వెంచర్లు ఏర్పాటు చేసి సామాన్య ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. పోలీసుశాఖ నిర్వహించిన గ్రీవెన్స్లో ప్లాట్ల క్రయ విక్రయాలపై జరిగిన మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆరు నెలల వ్యవధిలో 60కు పైగా ప్లాట్ల మోసాలపై ఫిర్యాదులు వచ్చాయంటే తీవ్రత అర్థమవుతోంది. ఒకే ప్లాట్ను పలువురికి విక్రయం డబుల్ రిజిస్ట్రేషన్లతో బురిడీ కొట్టిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇల్లు నిర్మించుకునే సమయంలో అసలు విషయం వెలుగులోకి.. ఇబ్బందులు పడుతున్న ప్లాట్ల కొనుగోలుదారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు.. పలువురిపై కేసులు జిల్లాలో ఆరు నెలల్లో 60కి పైగా ఫిర్యాదులు