breaking news
Jogulamba
-
పుట్టెడు దుఃఖంలో ‘పది’ పరీక్షకు హాజరు
కేటీదొడ్డి: కన్నతండ్రి ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్లాడి గుండె తల్లడిల్లింది. కంటిపాపలా చూసుకున్న తండ్రి భౌతికంగా దూరమైనా ఆశయమే లక్ష్యంగా ఆ విద్యార్థి పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటీదొడ్డి మండలం గంగన్పల్లికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదానందం ఆచారి మృతిచెందారు. ఇంట్లో పార్థివదేహం ఉండగానే బుధవారం పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జరిగే హిందీ పరీక్షకు అతడి కుమారుడు సాయివిష్ణు హాజరు కావాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎంఈఓ విజయభాస్కర్, ఉపాధ్యాయులు విద్యార్థికి ధైర్యం చెప్పడంతో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్నంత సేపు ఆ విద్యార్థి కళ్లు కన్నీళ్లతో నిండిపోవడం చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
టీజీఆర్జేసీ సెట్– 2026 కు దరఖాస్తుల ఆహ్వానం
ఎర్రవల్లి: రాష్ట్రంలోని 35 గురుకుల (రెసిడెన్సియల్) జూనియర్ కళాశాల లు, 93 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీఆర్జేసీ సెట్– 2026 కు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోఆర్డినేటర్ బి. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు మే 3వ తేదీన ఉంటుందని, మార్చి 2026 లో పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు సంబంధిత వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. దరఖాస్తు రుసుము రూ.200 ఉంటుందని, ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 040– 24734899, 78429 91708, 180024 52428 లను సంప్రదించాలని కోరారు. -
నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి
అలంపూర్: నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే విజయుడు అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం అలంపూర్ నియోజకవర్గ స్థానిక సమస్యలపై ప్రస్తావించినట్లు తెలిపారు. నియోజకవర్గం రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో అభివృద్ధికి దూరంగా ఉన్నామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందక, ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యవసర సేవల కోసం హైదరాబాద్కు రావాలంటే కనీసం 250 కి.మీ ప్రయాణించాల్సి రావడంతో సకాలంలో వైద్య అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలంపూర్ చౌరస్తాలో వంద పడకల ఆస్పత్రి ఉన్నా.. వైద్య సిబ్బంది లేక సేవలు అందడం లేదన్నారు. అదేవిధంగా డయాలసిస్, కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పొరుగున ఏపీలోని కర్నూల్లో పేద, మధ్య తరగతి, జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలో అగ్రిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ప్రోటోకాల్పై స్పీకర్కు ఫిర్యాదు అలంపూర్: ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు స్పీకర్ గడ్డం వినోద్కు ఫిర్యాదు చేశారు. అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తనకు అధికారులు అధికారిక కార్యక్రమాల ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అందజేస్తున్న రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందులకు ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
నూతన ఆశల లోగిలి
జోగుళాంబ గద్వాలగద్వాలన్యూటౌన్/రాజోళి/ఎర్రవల్లి: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని బుధవారం నుంచే జిల్లాలోని ఆలయాలు సుందరంగా ముస్తాబు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉగాది సందడి కొట్టొచ్చినట్లు కనిపించింది. పట్టణాల నుంచి ప్రజలు గ్రామా లకు రావడంతో పాటు ఇంటర్ పరీక్షలు కూడా పూర్తవడంతో గ్రామాలు కళకళలాడుతున్నా యి. జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్, రథశాల, కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ తదితర ప్రాంతాలన్ని కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. గద్వాలతో పాటు అయిజ, రాజోళి, ఎర్రవల్లి, శాంతినగర్, అలంపూర్ పట్టణాల్లో సైతం ఉగాది హడావుడి కనిపించింది. ఉగాదిని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో సుంకులమ్మ, ఈదమ్మ ఆలయాల వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో కోళ్లను బలిస్తారు. అందుకుగాను ఆలయ నిర్వాహకులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని మార్కండేయస్వామి ఆలయం, అహోబిల మఠం, శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం, నది ఆగ్రహారంలోని ఆలయాల వద్ద, జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన అలంపూర్, బీచుపల్లి, మల్దకల్, పాంగుంట, చింతరేవుల తదితర ఆలయాలలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. నేడు ఉగాది సంబురం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ప్రధాన ఆలయాల్లో పంచాగ శ్రవణం చేయనున్న పండితులు -
ఉడిమిళ్లలో గుప్తనిధుల తవ్వకాలు
అమ్రాబాద్: పదర మండలం ఉడిమిళ్ల సమీపంలోని వినాయకగుడి మాన్యంలోగల చిన్న వినాయకుడి విగ్రహం ఎదుట గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొంతమంది స్థానికులు ఈ నెల 13న రాత్రి గుడి ఎదుట జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారుకాగా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్ఆర్ఓ వీరేష్గౌడ్ను వివరణ కోరగా తవ్వకాలు రెవెన్యూ భూమిలో ఉండటం వల్ల గ్రామ పంచాయతీ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. స్థానికులు ఉండటంతో గ్రామపెద్దల ఒత్తిడితో కేసు నమోదు చేయనట్లు సమాచారం. -
మన్యంకొండలో వసంత నవరాత్రి ఉత్సవాలు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణలు నిర్వహించనుండగా, మధ్యాహ్నం 11 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వంచనున్నారు. రాత్రి స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో సుందరకాండ పారాయణం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. 28న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం అఖండ భజన ప్రారంభమవుతుంది. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొందాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు కోరారు. -
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
గోపాల్పేట: రసాయన ఎరువులతో పండిన పంటలకు మార్కెట్లో విలువ తగ్గుతోందని.. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంతో లాభదాయకమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని జయన్నతిర్మలాపూర్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఏళ్ల కిందట చూసుకుంటే దేశంలో పండించే పంటలకు ఎంతో విలువ ఉండేదని.. 200 రోజుల్లో పంట దిగుబడి వచ్చేదని సాంబార్, వరి వంగడాలు చాలా ఏపుగా పెరిగి దిగుబడి అధికంగా ఉండేదని వివరించారు. ప్రస్తుత సమయంలో దిగుబడి అధికంగా రావాలన్న ఉద్దేశంతో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో బయటి దేశాల్లో డిమాండ్ తగ్గిందని వివరించారు. రైతులు ఇప్పటికై నా రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి సేద్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామంలో 125 మంది ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సానుకూలంగా ఉన్నారని.. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరగనుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి గోపాల్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, భాస్కర్రెడ్డి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
అడ్డాకుల: చట్టాలపై అందరూ అవగాహన పెంంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. హెల్ప్ లైన్ సెంటర్ 15100కు డయల్ చేసి న్యాయ సహాయం కోసం తగిన సలహాలు పొందవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, చిన్న పిల్లలు, మానసిక, శారీరక దివ్యాంగులు, అనాధలు, సీనియర్ సిటిజన్ల కేసుల కోసం ఉచితంగా న్యాయవాదులను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. న్యాయ సహాయం కోసం మొదట పారా లీగల్ వలంటీర్లను సంప్రదించాలని కోరారు. రైతులకు సంబంధించిన చట్టాల గురించి వారికి అవగాహన కల్పించారు. మూసాపేటలోని అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్కు వెళ్లి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలని, సమాజంలో అందరు సత్ప్రవర్తనతో మెలగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.రాంచందర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఉప సర్పంచ్ దేవుని శ్రీను, లీగల్ వాలంటీర్ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
జూరాల కాల్వలోకి దూసుకెళ్లిన కారు
వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణ శివారులోని జూరాల కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ చెందిన షకీల్ కారులో పెబ్బేరు మండలంలోని సూగూరుకు వస్తుండగా మార్గ మధ్యలో పెబ్బేరు శివారులోని జూరాల కాల్వ వద్ద బైక్ అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కారులో ఉన్న షకీల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు వెనుక అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. బస్టాండ్లో వృద్ధురాలు మృతి మరికల్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ధన్వాడకు చెందిన లలిత (65) భర్త ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి మరికల్లో యాచిస్తూ బస్టాండ్లోనే ఉండేది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. హోటళ్లపై అధికారుల దాడులు తెలకపల్లి: పట్టణంలోని పలు హోటళ్లపై రెవెన్యూ, పోలిసులు దాడులు నిర్వహించారు. సిలిండర్ కొరత నేపథ్యంలో వినియోగదారులు సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపట్టి అక్రమంగా వినియోగిస్తన్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. దాదాపు ఏడు డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో నాయబ్ తహసిల్దార్ పట్టాబి, ఎస్ఐ నరేష్, ఆర్ఐ రామస్వామి, జీపీఓలు పాల్గొన్నారు. ఆలయానికి బంగారం విరాళం కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురం గ్రామంలోని వెలసిన శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయానికి కర్ణాటక రాష్ట్రం కురుతిప్లకు చెందిన నారాయణరెడ్డి, దివ్యవాణి దంపతులు బుధవారం తులం బంగారు ఉంగారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతలను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు
వర్మీ కంపోస్టు ఎరువు జీలుగ ఎరువు అలంపూర్: పంటల సాగులో కొన్నేళ్లుగా రసాయన ఎరువుల వాడకం విపరీపతంగా పెరిగింది. దీంతో నేల తన సహజత్వాన్ని కోల్పోతుంది. భూసారం క్షీ ణిస్తుండడంతో అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పంట ఉత్పత్తుల్లోనూ రసాయ న ఎరువులు, పురుగు మందుల అవశేషాలు ఉండి ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో నేల సంరక్షణకు సేంద్రియ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి వాటి స్థానంలో పశువులు, గొర్రెలు, మేకల, కోళ్ల ఎరువులు, వేప, కానుగ లాంటి వృక్ష సంబంధిత ఎరువులు వర్మి, పచ్చిరొట్టె ఎరువులు వేయాలి. భూమిలో పోషకాల లభ్యతకు అనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. సేంద్రియ ఎరువుల్లో స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ శాతం ఎంత ఉందని తెలసుకోవాలి. దీనిని బట్టి సేంద్రియ ఎరువులు పంటకు వేయాలి. ఇలా చేయడం వలన భూమి సారవంతం కావడంతో పాటు పెట్టుబడి తగ్గి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని ఏడీఏ వివరించారు. పాడి–పంట -
పీఏసీఎస్ మాజీ చైర్మన్ బలవన్మరణం
నాగర్కర్నూల్ క్రైం: క్రషర్ మెషిన్ మూసివేశారని మనస్తాపానికి గురైన నాగర్కర్నూల్ పీఏసీఎస్ మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్రెడ్డి (60) బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. నాగర్కర్నూల్ మండలం వనపట్లకు చెందిన శ్రీనివాస్రెడ్డి గ్రామ శివారులో క్రషర్ మెషిన్ ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన కొందరు క్రషర్ మెషిన్పై ఫిర్యాదు చేయడంతో అధికారులు మూసివేశారు. నాటి నుంచి క్రషర్ కార్యకలాపాలతో పాటు లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్రెడ్డి.. క్రషర్ మెషిన్ వద్ద ఉన్న తన నివాసంలో ఉరివేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కొల్లాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. శ్రీనివాస్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
రైతుల సంక్షేమానికి కృషి
గద్వాల: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని, పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం గాలికుంటు వ్యాఽ ది నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వాహనాన్ని కలెక్టరేట్లో ప్రారంభించారు. ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలి సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్పాం సాగు చేస్తే 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం వస్తుందని కలెక్టర్ అన్నారు. ఆయిల్పాం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఐడీఒసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అధిరులు తదితరులు ఉన్నారు. గ్యాస్ వినియోగదారులు నిబంధనలు పాటించాలి గద్వాల: గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే వినియోగదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రిజ్జాన్బాషా షేక్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు అంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో బుధవారం కలెక్టర్ పట్టణంలోని రాఘవేంద్ర, ధనుష్, హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యా స్ బుకింగ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధన ల ప్రకారం ప్రతి సిలిండర్ బుకింగ్కు మధ్య 45 రో జులు సమయం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అనంతరం కేజీబీవీ ల గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌర సరఫరా అధికారి స్వామికుమార్, ఏజెన్సీల ప్రతినిధులు ఉన్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్జాన్బాషా షేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల, ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వ హణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ ఉషారాణి, శివశంకర్, ప్రసాద్, సిబ్బంది, విద్యార్ధులు ఉన్నారు. -
త్వరలోనే పరిహారం..
కొల్లాపూర్ సమీపం నుంచి కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం వరకు రెవెన్యూ భూముల సేకరణకు ఏడాది కిందటే నోటిఫికేషన్ ఇచ్చాం. రైతుల నుంచి భూ యాజమాన్య పత్రాలను స్వీకరించాం. పరిహారం చెల్లింపు కోసం నేషనల్ హైవే అధికారులకు ఆ వివరాలు పంపించాం. త్వరలోనే పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ కేంద్రం సానుకూలం.. ఆసియాలోనే మొదటిసారిగా భారీ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ హైవే నిర్మాణం, బ్రిడ్జి పనుల గురించి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందంగా వెళ్లి కలిశాం. అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినందున పనుల్లో వేగం పెంచుతామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. – ఎల్లేని సుధాకర్రావు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి -
‘ఆరు గ్యారంటీలు అటకెక్కించారు’
అయిజ: కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా అటకెక్కించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ రజనీకాంత్రెడ్డికి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇదే విధమైన పాలన కొనసాగిస్తే భవిష్యత్లో ప్రజల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి, భీమసేనరావు, మహేష్, భగత్రెడ్డి, లక్ష్మణ్గౌడ్, రాజశేఖర్, భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యంతో సుస్థిర దిగుబడులు
అలంపూర్: ప్రకృతి సేద్యంతో సుస్థిర దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ సక్రియా నాయక్ అన్నారు. అలంపూర్ మండలం బుక్కాపురం రైతువేదికలో మంగళవారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రకృతి సేద్యం రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. అదే విధంగా పర్యావరణానికి మేలు చేకూరడంతో పాటు మానవాళికి నాణ్యమైన ఆహారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ నాగార్జున్ రెడ్డి, సర్పంచ్ రూపదేవి, ఏఈఓలు నీలిమ, శిరీష, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయండి అయిజ: కేంద్ర ప్రభుత్వం రైతులకు కీడుచేసే విధంగా చేసుకున్న అమెరికా, భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దుచేయాలని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం అయిజలో వివిధ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి.. నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్న కేంద్రం.. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి జీరో పన్ను చేసి, దేశ రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేకమైన 2025 విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీపీఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశావర్కర్లకు రూ.18వేల వేతనం ఇవ్వాలి
గద్వాల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు రూ. 18వేల వేతనం ఇచ్చేలా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించాలని సీఐటీయూ నాయకుడు ఉప్పేరు నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశావర్కర్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదన్నారు. ఆశావర్కర్లకు కేంద్ర ప్రభుత్వం రూ.1,500 పారితోషికం పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 28న చలో హైదారాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, కాంతమ్మ, పద్మ, సరస్వతి, శశికళ, నర్సమ్మ, మేరీ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ పీఆర్సీ ప్రకటించాలి
అలంపూర్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలోని ప్రైవేటు పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను ప్రకటించడంతో పాటు టీఎస్జీఎల్ఐ జెడ్పీ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్ సరెండర్ బిల్స్, మెడికల్ రియంబర్స్మెంట్, విశ్రాంత ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. కేజీబీవీ యూఆర్ఎస్, సమగ్ర శిక్షణ ఉద్యోగులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ కార్డుల జారీ ట్రస్టులో టీఎస్ యూటీఎప్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం గద్వాల మండలం మదనపల్లికి చెందిన టీఎస్ యూటీఎఫ్ కార్యకర్త ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మోహన్ కుమార్ ఇటివల మృతిచెందగా.. అతడి కుటుంబానికి టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి నుంచి రూ. 6లక్షల చెక్కును అందజేశారు. ఈ నెల 29న అలంపూర్లో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి.రమేశ్, ప్రధాన కార్యదర్శి ఎం.గోపాల్, రాష్ట్ర కార్యదర్శి రవి ప్రసాద్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ నాయుడు, నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూముల బదలాయింపు..
పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వరకు కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఈ ప్రాంతం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. అదేవిధంగా వంతెనకు అనుసంధానంగా జాతీయ రహదారి నిర్మించే ప్రాంతాల్లోనూ అటవీ భూములు ఉన్నాయి. కొల్లాపూర్ నుంచి ఐకానిక్ బ్రిడ్జి నిర్మించే వరకు మొత్తం 53 హెక్టార్ల భూమి ఉండగా.. అందులో 25 హెక్టార్ల భూమి అటవీ ప్రాంతంలోనిది. అటవీ శాఖ నుంచి భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు భూ బదలాయింపు ప్రక్రియ చేపట్టారు. అమ్రాబాద్ సమీపంలో రెవెన్యూ భూమి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో గతేడాది అక్టోబర్ 28న రాష్ట్ర ఫారెస్టు అధికారులు, ఈ ఏడాది ఫిబ్రవరి 21న సెంట్రల్ ఫారెస్టు అధికారుల బృందం అటవీ భూమిలో జాతీయ రహదారి నిర్మించబోయే ప్రాంతాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపారు. మార్చి మొదటి వారంలో అటవీ భూముల బదలాయింపునకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. -
ఐకానిక్కు అడుగులు
జోగుళాంబ గద్వాల● ఇటీవలే అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ ● టెండర్లు ఓపెన్ చేయడమే తరువాయి ● ఆలోగా వంతెనకు అప్రోచ్ రోడ్లు నిర్మించేలా చర్యలు ● కొల్లాపూర్ నుంచి మల్లేశ్వరం వరకు భూ సేకరణ వేగవంతం బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి–167కే పనులకు అన్ని రకాల అడ్డంకులు తొలగుతున్నాయి. కొన్నిచోట్ల ఈ రహదారి నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్తుండగా.. మల్లేశ్వరం– సంగమేశ్వరం మధ్యలో కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం సైతం నల్లమల అటవీ భూ భాగంలోనే ఉంది. ఇన్నాళ్లు అటవీ క్లియరెన్స్ లేకపోవడంతో ఈ పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతుండగా.. ఇటీవలే జాతీయ అటవీ శాఖ నుంచి రహదారి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలకు అనుమతులు లభించాయి. దీంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు చర్యలు ప్రారంభించారు. టెండర్ల ఓపెన్పైనే ఉత్కంఠ రూ.963 కోట్ల వ్యయంతో కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి టెండర్ల కాలపరిమితిని రెండున్నరేళ్లుగా అధికారులు పొడిగిస్తూ వస్తున్నారు. అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ కోసమే ఇన్నాళ్లు ఆగుతూ వచ్చారు. 2023 అక్టోబర్లో బ్రిడ్జి టెండర్లను ఆహ్వానించగా.. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు టెండర్ దాఖలు చేశాయి. కానీ, ఇప్పటి వరకు టెండర్లు ఓపెన్ చేయలేదు. ఈ నెల 16 వరకు టెండర్లకు చివరి గడువుగా ఎన్హెచ్ అధికారులు తమ వెబ్సైట్లో పొందుపర్చారు. అటవీ శాఖ క్లియరెన్స్ వచ్చినందున త్వరలోనే టెండర్లు ఓపెన్ చేస్తారని అఽధికారులు చెబుతున్నారు. ● కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి తొలగిన అడ్డంకులు -
జిల్లా అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
గద్వాల: జిల్లా జనాభాలో మహిళలే అధికంగా ఉండగా.. ఉద్యోగుల్లో సైతం మహిళల సంఖ్య ఎక్కువేనని.. అందరూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్.. జ్యోతిప్రజ్వలన, తెలంగాణ గీతాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికంగా బాల్యవివాహాలు చేస్తున్నారని, దీనివల్ల అనేక దుష్ప్రరిణామాలు ఎదురవుతాయన్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో పోక్సో కేసులు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. బాలికలకు గుడ్టచ్, బ్యాడ్టచ్పై అవగాహన కల్పించాలని సూచించారు. వరకట్న వేధింపులు ఇతర సమస్యలపై మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తేనే దోషులకు శిక్షపడుతున్నారు. సఖి కేంద్రంలో కౌన్సెలింగ్ వారికి అవసరమైన సాయం అందిస్తున్నామన్నారు. అదే విధంగా మహిళల అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన మహిళలు ప్రసగించారు. మహిళా సంక్షేమంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకు ముందు పలు విద్యాసంస్థలకు చెందిన విద్వార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, డీడబ్ల్యూఓ సునంద, డీఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి పాల్గొన్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. కేజీబీవీల్లో పటిష్ట భద్రత ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అనుమతి లేనిది బయటి వ్యక్తులను అనుమతించరాదన్నారు. అదే విధంగా పరిశుభ్రత, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన భోజనం వంటివి తప్పకుండా కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఈఓ విజయలక్ష్మి, మధుసూదన్, అంపయ్య ఉన్నారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను కలెక్టర్ శాలువాలతో సత్కరించి అభినందించారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ కృష్ణయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
జన గణనపై అవగాహన పెంచుకోవాలి
గద్వాల: జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా మొదట ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, అందుకనుగుణంగా గణనపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన, ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026లో మొదటి విడతలో ఇళ్ల గణన కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ విధానంలో స్మార్ట్ఫోన్ ద్వారా చేపట్టాలన్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదు చేసి ఇళ్ల జాబితా రూపొందిస్తారన్నారు. ఈ ప్రక్రియను ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లు, చార్జీ అధికారులైన తహసీల్దార్లు, ఎంపీడీఓలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉండే జనాభా ఆధారంగా బ్లాక్లుగా విభజించుకుని గణన చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఇళ్ల గణన పూర్తయితే 2027 ఫిబ్రవరిలో ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నిర్దేశించి 33 ప్రశ్నలను అడిగి వివరాలను నమోదు చేస్తారన్నారు. ప్రస్తుతం చేపట్టే గణన ఆధారంగానే భవిష్యత్లో వివిధ వర్గాలకు పథకాలు అందుతాయన్నారు. జిల్లాలో సుమారు 1,100 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అవసరమవుతారని, ఉపాధ్యాయులకు ఈ విధులను అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాబితా రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, సెన్సెస్ ఆపరేషన్ జేడీ లాజర్, సీపీఓ పాపయ్య, ట్రైనర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఎరువుల కొరత రానీయొద్దు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలో సుడిగాలి పర్యటన చేసి ఎరువుల దుకాణాలు, గాంధీచౌక్లోని దూద్ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువు దుకాణంలో స్టాక్, ధరలను పరిశీలించారు. అన్ని విక్రయాలను ఈపాస్ యంత్రం ద్వారా మాత్రమే నిర్వహించాలని, లైసెన్స్ లేకుండా ఎరువుల విక్రయాలు చేపట్టరాదన్నారు. అనంతరం గాంధీచౌక్లోని దూద్దవాఖానాలో వైద్య సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలన్నారు. అంతకు ముందు గోనుపాడు శివారులో సాగుచేసిన పంటలను పరిశీలించారు. డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. -
2,428 క్వింటాళ్ల వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 2,428 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.8,020, కనిష్టంగా రూ.2,821, సరాసరిగా రూ.5,149 ధరలు లభించాయి. అలాగే 164 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,179, కనిష్టంగా రూ.3,419, సరాసరిగా రూ.6,179 చొప్పున పలికాయి. 29 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.7,089, కనిష్టంగా రూ.6,759, సరాసరిగా రూ.7,069 చొప్పున ధరలు వచ్చాయి.పంట మార్పిడితో అధిక దిగుబడులు గోపాల్పేట: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం గోపాల్పేట రైతువేదికలో డీఏఓ ఆంజనేయులుగౌడ్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతులు సహజసిద్ధంగా లభించే మక్కిన పశువుల ఎరువులు, జీవామృతం, నీమాస్త్రం, దశపత్రి తదితర కషాయాలతో పంటల్లో చీడపీడలను నివారించవచ్చన్నారు. ఏటా ఒకే రకం పంటను వానాకాలం, యాసంగి సీజన్లో పండించకూడదని.. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అమరచింత: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలపేతం చేయడానికే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివాసేనారెడ్డి అన్నారు. సోమవా రం అమరచింతలోని పార్టీ కార్యాలయ ఆవరణలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం నాగరాజ్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. గ్రామాల్లో సర్పంచులతో పాటు పార్టీ అధ్యక్షుడికి సైతం అదే స్థాయిలో అధికారాలు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ఎవరికి అందించాలనే పూర్తి స్వేచ్ఛ గ్రామ పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం నాగరాజ్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తామన్నారు. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. -
బైపాస్పై ఆశలు
●జడ్చర్ల: జడ్చర్లకు బైపాస్ మంజూరుపై ఆశలు చిగురిస్తున్నాయి. జడ్చర్ల పట్టణ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించిన బైపాస్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం పంపే కబురు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న జడ్చర్ల పట్టణం గుండా ప్రయాణం నరకప్రాయంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు జడ్చర్ల దాటితే సరి అన్న ఆందోళనలో ప్రయాణాలు సాగిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం కూడా అడ్డదిడ్డంగా ఉండడంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారులు ఇరుగ్గా ఉన్నాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు.. రహదారుల వెడల్పునకు ఎక్కడా పొంతన లేక అడుగడుగునా ట్రాఫిక్తో నిత్యం సతమతమవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి–44, ఇంకోవైపు ఎన్హెచ్–167తోపాటు రాష్ట్రీయ రహదారులు సైతం పట్టణం నడిబొడ్డుగుండా వెళ్తున్నాయి. వీటికి తోడు రైల్వే మార్గం కూడా ఉండడంతో రాకపోకలు అంత సునాయసంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రైల్వే మార్గం కారణంగా రెండు ప్రాంతాల రాకపోకలు సిగ్నల్గడ్డ వద్ద ఉన్న సింగిల్ బ్రిడ్జి మీదుగా మాత్రమే దాటే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాగే జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఎన్హెచ్–44పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర సైతం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఇలా అనేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ప్రజలు భావిస్తున్నారు. ట్రాఫిక్తో సతమతం.. జడ్చర్ల మీదుగా ఒక్క హైదరాబాద్కు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర తదితర ఉత్తర, దక్షిణ భారతం వైపు భారీ సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే జడ్చర్ల పట్టణం గుండానే అది కూడా సింగిల్ రోడ్డుగా ఉన్న ఒక చిన్నపాటి రైల్వే వంతెనపైనే రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. కాగా ఇటీవల జాతీయ రహదారి–167 విస్తరణ పనులలో భాగంగా ఒకవైపు సింగిల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయగా.. మరోవైపు బ్రిడ్జి విస్తరణ పనులు నిలిచిపోవడంతో గుంతల రహదారిపైనే రాకపోకలు సాగుతున్నాయి. జడ్చర్ల పట్టణం వ్యూ డీపీఆర్కు రంగం సిద్ధంతో ముందడుగు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం అన్నీ సవ్యంగా జరిగితే జడ్చర్ల మరింత అభివృద్ధి ఈ నెలాఖరులోగా.. జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. అ యితే బీఆర్ఎస్ పాలనలో బైపాస్ రోడ్డుకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపాదించినా కార్యాచరణ రూపొందలేదు. తాజాగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్గడ్కరీకి ప్రతిపాదించడంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెలాఖరులోగా బిడ్డింగ్ ఓపెన్ చేసి డీపీఆర్ బాధ్యతలను అప్పగించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ నెలాఖరులోగా డీపీఆర్ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
మళ్లీ మొండిచెయ్యి..
నిధుల కేటాయింపులో మల్లమ్మకుంటకు దక్కని చోటు రాజోళి: ఆర్డీఎస్ రైతులకు జీవం పోస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో కీలకపాత్ర పోషించే మల్లమ్మ కుంటపై మళ్లీ చిన్నచూపే చూశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మూడు రిజర్వాయర్లు (మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు) నిర్మిస్తేనే ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు వరకు పుష్కలంగా సాగునీరు అందేలా డిజైన్ చేశారు. కానీ, రైతుల అవసరాల దృష్ట్యా నీటిని మోటార్ల ద్వారా ఆర్డీఎస్ కెనాల్లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో ఆయకట్టు పూర్తిగా కాకపోయినా కొంతమేర నీరంది పంటలు పండుతున్నాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నేటికీ పూర్తికాకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మూడు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోపాటు జరుగుతున్న కాలయాపన, భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో మూడు రిజర్వాయర్లు కాకపోయినా కనీసం మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక్కటైనా పూర్తి చేస్తే ఆయకట్టును కాపాడుకోవచ్చని అంటున్నారు. కానీ, దానిపై కూడా ప్రభుత్వం అడుగు ముందడుగు వేయడం లేదు. తుమ్మిళ్ల ఎత్తిపోతలలో మొదటి రిజర్వాయర్ మల్లమ్మ కుంటనే. 1.02 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. వర్షాకాలం మొదట్లో తుంగభద్ర నదిలో వరద ఉన్న సమయంలో నీటిని ఈ రిజర్వాయర్లో ఎత్తిపోసి.. ఆయకట్టుకు సాగునీరు అవసరమైన సమయంలో వాడుకునేలా ప్లానింగ్ చేశారు. తుమ్మిళ్ల లిఫ్టు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం పైప్లైన్ ద్వారా నీటిని కెనాల్లో వదులుతున్నారే తప్ప.. రిజర్వాయర్ పనులు మొదలుపెట్టడం లేదు. నాలుగేళ్ల తర్వాత 2024లో మల్లమ్మకుంటకు సంబందించి భూ సేకరణ పనులపై కొంత కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. మూడు రిజర్వాయర్లు.. పెండింగ్ ప్రాజెక్టుల్లోనూ ప్రాముఖ్యం కల్పించని వైనం ఈ రిజర్వాయర్పైనే ఆశలు పెట్టుకున్న ఆర్డీఎస్ రైతులు ఇప్పటికే భూ సేకరణకు ప్రతిపాదనలు -
వీబీజీ రాం బిల్లు రద్దు చేయాలి
గట్టు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రాం చట్టం వ్యవసాయ కూలీలకు తీవ్రనష్టం చేసేలా ఉందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నర్సింహ అన్నారు. సోమవారం ఆయన గట్టులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఉపాధి కూలీల చేత పనిచేసే చోట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా ఉపాధి కూలీలు పని అడిగే హక్కు కోల్పోతారని ఆరోపించారు. ఈ చట్టం వల్ల ఇప్పటికే వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పనిచేస్తున్న కూలీల కళ్ల ఫొటోలను తీసి అప్లోడ్ చేస్తున్నారని, కొందరు కూలీలవి సరిగా నమోదు కాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం చెల్లించాల్సి ఉండగా, కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చెల్లించాలనే కొత్త నిబంధన పెట్టిందని విమర్శించారు. కొత్త చట్టాన్ని రద్దు చేసిన పాత, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
పట్టాలెక్కిన కొడంగల్
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక ● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ వర్క్స్ ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు. స్టేజీ–1 పనులు ప్రారంభం.. రూ.4,885 కోట్ల వ్యయంతో కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం పనులను మూడు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. మొదటి విడత కింద రూ.2,945 కోట్ల పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో స్టేజీ–1 (కాట్రేవులపల్లి), స్టేజీ–2 (ఊట్కూరు/బాపూర్), స్టేజీ–3 (జాయమ్మ చెరువు)కి సంబంధించి పంప్హౌస్లు, పైపులైన్ పనులు చేయాలి. ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రూ.1,400 కోట్లు మంజూరు కాగా.. సంబంధిత కాంట్రాక్టర్లు స్టేజీ–1లో భాగంగా మక్తల్ మండలం కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ పనులు ప్రారంభించారు. అదేవిధంగా కాట్రేవులపల్లి, మంథన్గోడు, కాచ్వార్ మీదుగా ఊట్కూరు పెద్దచెరువు వరకు అనుసంధానం చేసేలా ప్రెషర్ మెయిన్ పైపులను కాచ్వార్ వద్ద అందుబాటులో ఉంచారు. ఆ రిజర్వాయర్లు ఇవే.. ఊట్కూరు (మక్తల్), జాజాపూర్, పేరుపళ్ల జాయమ్మ (నారాయణపేట), కాన్కుర్తి (దామరగిద్ద), దౌల్తాబాద్, కొడంగల్, హస్నాబాద్, బొంరాస్పేట, లక్ష్మీపూర్, ఈర్లపల్లి (కొడంగల్). సీఎం ప్రత్యేక నజర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014లో జీఓ 69 ద్వారా కొడంగల్ లిఫ్ట్కు అప్పటి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ప్రభుత్వం దీన్ని పక్కనబెట్టి పాలమూరు–రంగారెడ్డి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు నీరందించేలా ముందుకు సాగింది. అయితే ఆనాడు జీఓ 69ని తీసుకురావడంలో అప్పటి కొడంగల్ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఈ క్రమంలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ కొడంగల్ ఎత్తిపోతలపై ఆశలు చిగురించాయి. ఆయన ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేకంగా దృష్టిసారించి.. పలు సమీక్షలు, భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ అడ్డంకులు అధిగమించి కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడంతో మూడు నియోజకవర్గాల రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
చెరువులు, బావుల వద్ద అప్రమత్తం
● చిన్నారుల రక్షణపై పోలీసు నిఘా ● ఈత కొట్టేందుకు వెళ్లి ఇటీవల ఓ విద్యార్థి మృతి ● గతేడాది జరిగిన ఘటనలపై ఆరా గద్వాల క్రైం: వేసవి సెలవుల్లో చిన్నారులు వినోదం కోసం ఎంచుకునే మార్గాలు విషాధం కాకూడదని పోలీసులు సూచిస్తున్నారు. వేసవి తాపం నుంచి రక్షణ పొందేందుకు చెరువులు, బావులు, నీటి గుంతల్లో ఈత పడేందుకు పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో సరదా కోసం ఈత పడే సమయంలో కొందరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు నిరంతరం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈత రాని వారు నీటి కుంటలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి కొందరు బావుల్లో సరదా ఆటల పేరుతో ఎక్కువ సేపు మునగడం, మరికొన్ని వింత చేష్టలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బావుల్లో కంప చెట్లు, రాళ్లు ఉండడంతో వాటిలో చిక్కుకొని మరికొందురు మృత్యువాత పడుతున్నారని, ఈత వెళ్లే సమయంలో ఇలాంటి ప్రమాదాలను గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు. గతేడాది ఏడుగురు చిన్నారులు ఈతకు వెళ్లి మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు, బావులు, నీటి గుంతల పరిసర ప్రాంతాల్లో పోలీసుశాఖ నిఘా ఏర్పాటు చేసింది. ఘటనలు.. ● మల్దకల్ మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన విద్యార్థి (13) ఈ నెల 8 వ తేదీన తోటి స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ● అయిజ మండలం మూగోనిపల్లికి చెందిన విద్యార్థి (10) మార్చి 16, 2025 న గ్రామ సమీపంలోని బావిలో ఈత కొట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి పై నుంచి దూకగా.. నీటిలో ఉన్న కర్ర ముక్క గొంతుకు గుచ్చుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ● గట్టు మండల కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి (17) ఏప్రిల్ 10, 2025 న గ్రామం సమీపంలోని బావికి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. పిల్లలకు వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు రక్షణగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల సంతోషాలను స్వీకరిస్తూనే వారిని సరైన మార్గంలో తీసుకువెళ్లాలి. చిన్నారులకు ఈత నేర్చించాలనుకుంటే తల్లిదండ్రులే దగ్గరుండి తీసుకెళ్లాలని కోరారు. వాళ్లకు స్నేహితులకు ఈత వచ్చు అని, వారే నేర్పిస్తారనే ధోరణిలో తల్లిదండ్రులు ఉంటే అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే వేగంగా స్పందించేందుకు పిల్లల్లో ఆలోచనా శక్తి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఒంటరిగా నీటి కుంటల వద్దకు వెళ్లకూడదని అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులకు ఈత నేర్పించే సమయంలో మొదట వాళ్లు అలవాటు పడే వరకు రక్ష ణ చర్యలు తీసుకోవాలని సూ చించారు. తప్పనిసరిగా లైఫ్జాకెట్లు, కట్టెలతో తయారు చేసిన బెండ్లు వాడాలన్నారు. కొన్నిసార్లు పిల్లలకు ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లను కట్టి పంపి స్తారని, అలా చేయకూడదన్నారు. అనుకోని పరిస్థితుల్లో వాటిలోకి నీరు వెళితే చిన్నారులు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వీయ జాగ్రత్తలపై నిరంతరం అవగాహన కల్పిస్తాం. వ్యవసాయ బావులు, రిజర్వాయర్లు, నీటి కుంటల వద్దకు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై గ్రామ పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశాం. నిరుపయోగంగా ఉన్న బోరు వెల్స్ను మూసివేసేలా గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు చొరువ తీసుకోవాలి. దీనిపై కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సుల ద్వారా వివరిస్తాం. తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహరించాలి. ప్రమాదభరితంగా ఉన్న బావులు, చెరువులు, నీటి కుంటల వద్ద ప్రహారీ ఏర్పాటుకు కృషి చేస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ -
రైతుకు కూర‘గాయాలు’
గద్వాల వ్యవసాయం: కూరగాయలు సాగు చేసిన రైతులు విలవిలలాడుతున్నారు. బావులు, బోర్లలో ఉన్న నీటి లభ్యత ఆధారంగా సాగు చేసిన కూరగాయల పంటను అధిక ఉష్ణోగ్రతలు దెబ్బతీస్తున్నాయి. వేడి కారణంగా పూత రాలుతోంది. కాయలు వచ్చిన చోట వాటి రంగులు మారుతున్నాయి. వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గి, ఆర్థికంగా నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సాధారణ పంటలతో పాటు రెండు సీజన్లతో కలిపి ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో ఇక్కడి రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ధరూర్ మండలంలో బెండ, టమాట, మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాట, బీర, సోరకాయ, బెండ, కాకర, అయిజలో బెండ, చిక్కుడు, వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ఉల్లి, అలంపూర్లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాట, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటతో ఆయా మండలాల్లో ఆకుకూరలు సైతం సాగు చేస్తారు. ఏటా వానాకాలం సీజన్లో 4 వేల నుంచి 5 వేల ఎకరాల్లో, యాసంగిలో 3 నుంచి 4 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు అవుతున్నట్లు ఉద్యానశాఖ రికార్డులు చెబుతున్నాయి. అయితే 2025–26 వానాకాలం సీజన్ కూరగాయల రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా 3,750 ఎకరాల్లో సాగు చేయగా.. జూన్, జూలైలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన అధిక వర్షాలు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచి తోటలు నీట మునిగాయి. అక్టోబర్లో కురిసిన వర్షాలు సైతం నష్టాన్ని మిగిల్చాయి. చేతికి వచ్చిన కొద్దిపాటి కూరగాయలు సైతం రంగులు మారడంతో నాణ్యత తగ్గి బహిరంగా మార్కెట్లో ఆశించిన ధర పలకలేదని రైతులు వాపోయారు. వానాకాలంలో కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులో భూగర్భ జలం పెరిగింది. దీంతో యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,450 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. కొంతమంది రైతులు విత్తనాలు వేయగా.. చాలా మంది నారుమళ్లతో కూరగాయల సాగు చేశారు. అయితే గడిచిన ఇరవై రోజల నుంచి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. తెల్లవారుజామున చలిగా ఉంటుండగా.. ఉదయం 9గంటల నుంచే ఉష్ణోగ్రతలు మొదలవుతున్నాయి. అప్పటి నుంచి క్రమేణ ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. అధికంగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు భూమిలో తేమశాతం తగ్గిపోయింది. దీంతో కూరగాయల పూత రాలుతోంది. మొక్క పెరగడం లేదు. ఎండవేడిమికి టమాట, క్యాప్సికం, క్యాలిఫ్లవర్, కాకర, బీర, వంకాయ తదితర కూరగాయల రంగులు మారి, సైజులు తగ్గిపోతున్నాయిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టుపైనే కాయలు కుచించుకుపోతున్నాయని అంటున్నారు. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు కనబడటం లేదని వాపోతున్నారు. వానాకాలంలో అధిక వర్షాలతో, యాసంగిలో అధిక ఉష్ణోగ్రతలతో ఆర్థికంగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలో తగ్గిన తేమశాతం రాలుతున్న పూత.. మారుతున్న కాయల రంగులు దిగుబడిపై తీవ్ర ప్రభావం కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీని ప్రభావం కూరగాయల పంటలపై ఉంటుంది. ఎండ వేడిమి తగలకుండా షెడ్నెట్లు ఏర్పాటు చేసుకోవాలి. కాయలు, పూత రాలకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతులు ఉద్యానశాఖ అధికారుల, సిబ్బంది సలహలు, సూచనలు తీసుకోవాలి. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
నేటి నుంచి ఒంటిపూట బడులు
గద్వాల: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసిన పాఠశాలలను మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగనుంది. తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసుకోండి కందనూలు: ఎస్సీ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎస్సీలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే వివిధ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి గాను ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోళ్లకు రాయితీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 21 నుంచి 50 ఏళ్ల వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల వార్షిక ఆదాయం మినహాయింపు ఉంటుందని.. అర్హత కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్బుక్లతో tsobmmr.cgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 17 నుంచి 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేదల గొంతుక కాన్షీరాం గద్వాల న్యూటౌన్: పేదల గొంతుకై తన జీవిత చరమాంకం వరకు పోరాడిన కాన్షీరామ్ అని భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వి.మహేందర్ కొనియాడారు. ఆదివారం కాన్సీరామ్ జయంతిని పురస్కరించుకుని భీమ్ఆర్మీ నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాది మధుసుదన్బాబు, వినయ్, వీరేష్, ఏసేపు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం ఎర్రవల్లి: రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ 92వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై నాయకులతో కలిసి కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో శాంతిరాజు, రాంబాబు, రాముడు, శివ, బొజ్జన్న, బుచ్చన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.: మొబైల్ వాహనాలతో న్యాయ సేవలు పాలమూరు: తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించడానికి రెండు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభించినట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ఒక ప్రటకనలో తెలిపారు. ఈ మొబైల్ వాహనాలు రొటేషన్ పద్ధతిలో జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ లీగల్ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ ప్రచార కార్యక్రమాలు, జైలు సందర్శన చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు చట్టాలపై అవగహన కల్పించడం, బాధితులకు న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయ సేవలను దగ్గర చేయాలనే లక్ష్యంతో ఈ మొబైల్ వాహనాలు ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశమన్నారు. టోల్ఫ్రీ నం.15100 ద్వారా న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. ఈ మొబైల్ వాహనాల్లో మొదటి క్యాబిన్లో కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీ, వెబ్ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, సీసీటీవీ, యూపీఎస్, రెండో క్యాబిన్లో జ్యుడీషియల్ అధికారులు, ప్యానెల్ న్యాయవాదులు, పీఎల్ఓలు, ఇతర సిబ్బంది ఉంటారని తెలిపారు. -
‘పది’ పరీక్షలు ప్రారంభం
గద్వాల: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. కాగా.. తొలిరోజు మొత్తం 8,055 మంది విద్యార్థులకు గాను 8,038 మంది హాజరవగా.. 17 మంది గైర్హాజరు అయ్యారని డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ గద్వాల పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు రావొద్దని, అదేవిధంగా మాప్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు తీసుకురావొద్దని చెప్పారు. వేసవి దృష్ట్యా తాగునీటి వసతి, ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా డీఈఓ విజయలక్ష్మి పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. తొలిరోజు 16మంది గైర్హాజరు -
చేపలు విలవిల!
మృతిచెందిన చేపలు తొలగించాలి.. చెరువులో చనిపోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా గోతి తీసి పూడ్చిపెట్టాలి. వెంటనే సున్నమును హెక్టారుకు 100 నుంచి 250 కిలోల మోతాదులో చల్లాలి. అప్పటికీ అదుపులోకి రాకుంటే నీటినాణ్యత పెంచే రసాయనాలు అనగా బీకేఎస్ను హెక్టార్కు లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యలతో నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరాన్న జీవులు చనిపోతాయి. ప్రాణ వాయువు పెంచడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేయాలి. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే వేసవిలో చేపలు చనిపోకుండా ఉంటాయి. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ అమరచింత: జిల్లాలోని చెరువులు, కుంటలతో పాటు రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. వేసవిలో నీరు వేడెక్కి ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం ఉంటుంది. తగిన ముందస్తు చర్యలు చేపడితే చేపలు మృతి చెందకుండా నివారించే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈసారి రాయితీ చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో ఎదుగుదల లేక మత్స్యకారులు ఆందోళన చెందుతున్న తరుణంలోనే ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉన్న చేప పిల్లలను ఎలా బతికించుకోవాలని సతమతమవుతున్నారు. వేసవిలో అధిక ఉష్ణ్రోగ్రత, చేపల సాంద్రత అధికంగా ఉండటం, నీరు క్రమేపి తగ్గడంతో నీటిలో ప్రాణవాయువు కొరత, నాణ్యత తగ్గిపోవడం తదితర కారణాలతో చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటాయి. రోగకారక సూక్ష్మజీవులతో వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున మత్స్యకారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. నిషితంగా పరిశీలిస్తే.. చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలను రోజు గమనిస్తూ ఉండాలి. మచ్చుకు కొన్ని చేపలు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక మరియు రెక్కల స్వభావంతో పాటు మొప్పల రంగు, పై జిగురు లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన తర్వాత సంబంధిత మత్స్యశాఖ అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ చర్యలు సత్వరమే చేపడితే ఆర్థిక నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు. వేసవిలో ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణ సాధ్యం అవగాహన కల్పిస్తామంటున్న మత్స్యశాఖ అధికారులు ఆక్సిజన్ మోతాదు గుర్తించండి ఇలా.. ఉదయాన్నే చేపలు చెరువు పైభాగాన నోరు తెరుచుకొని తిరుగుతుంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలి. అలాంటి సమయంలో చెరువులో నీరు పెట్టడం, అది సాధ్యం కాని పక్షంలో పెద్ద చేపలను పట్టి విక్రయించడంతో కాస్త నష్టాన్ని అధిగమించవచ్చు. చేపల సాంద్రత తగ్గడంతో ప్రాణవాయువు కొరత అధిగమించవచ్చు. చేపలు మార్కెట్ సైజ్ రాలేదని, ధర తక్కువగా ఉందని, ఐస్ దొరకడం లేదనే కారణాలతో నిర్లక్ష్యం చేయొద్దు. చెరువులో నీటి నాణ్యత తగ్గినప్పుడు సున్నము ఒక హెక్టారుకు 100 నుంచి 250 కిలోల వరకు చల్లితే నీటి నాణ్యత పెరగడమే కాకుండా ప్రాణవాయువు శాతం పెరిగి ఉదని సూచికను అదుపులో ఉంచుతుంది. చెరువులో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఉండాలి. లేనియెడల రాత్రిళ్లు అవి కార్బన్ డై ఆకై ్సడ్ విడుదల చేయడంతో ప్రాణవాయువు కొరత ఏర్పడి చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో మత్స్యకారులు గిట్టనివారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపితే పెంచే కర్పూజాతి చేపలే కాకుండా కొర్రమట్ట, మార్పు, జెల్లలు మొదలైన తక్కువ ఆక్సిజన్ను తట్టుకునే చేపలు, కప్పలు, నీటి పాములు సైతం చనిపోతుంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
తరచుగా తనిఖీలు చేపట్టాలి..
వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి. – వర్దం సైదులు, అచ్చంపేట మోసాలను అరికట్టాలి.. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ఇలా ఏవైనా కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళితే తూకాలలో మోసాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎలక్ట్రానిక్ తూకాలు వాడాల్సిన చోట చాలా వరకు మ్యాన్వల్ తూకాలనే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా తూకాలలో మోసాలు పెరిగి కష్టమర్లు నష్టపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మోసాలను అరికట్టాలి. – నాయుడు, గద్వాల పర్యవేక్షణ లేదు.. ప్రస్తుతం బంగారు ధర ఆకాశంలో ఉంది. శుభాకార్యలకు కొనుగోలు చేసేందుకు వెళితే తూకాలలో మోసాలు జరిగి కష్టమర్లు చాలా నష్టపోతున్నారు. దీనిపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు పత్తాలేకుండా పోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకుని కష్టమర్లు నష్టపోకుండా చూడాలి. – రమేష్, గద్వాల● -
బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ఎన్నికై న బీసీ ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని పార్లమెంట్ వద్ద అనేక సార్లు ధర్నాలు చేపట్టాలని, పలువురు మంత్రులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. ఎంపీలు, ప్రతిపక్ష పార్టీలను కలిసి ఈ విషయంలో వి/్ఞప్తి చేశామన్నారు. ఈ క్రమంలో కొన్ని డిమాండ్లను కేంద్రప్రభుత్వం నెరవేర్చిందన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ద హోదా, కేంద్రంలో ఓబీసీల వర్గీకరణకు అంగీకరించిందని, అంతేకాకుండా వివిధ వృత్తుల వారికి రూ.90 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు జీఓలు జారీ చేసిందని తెలిపారు. మరో రెండు డిమాండ్లు అలాగే ఉండిపోయాయని, మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ ఇవ్వడం ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గురుకులాలు, ఇతర పాఠశాలల మాదిరిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ, విద్య విషయాల్లో ఇచ్చే రిజర్వేషన్ను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 40 శాతానికి పెంచాలన్నారు. కార్యక్రమంలోమాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మేయర్ మమత, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, బీసీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య -
సిలిండర్లు బ్లాక్లో విక్రయిస్తే చర్యలు
గద్వాల: జిల్లాలో ఎవరైనా గ్యాస్ సిలండర్లు బ్లాక్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ హెచ్చరించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎల్పీజీ డీలర్ల దగ్గర బుకింగ్ స్టాక్, సరఫరాపై ప్రతిరోజు రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎల్పీజీ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని చెప్పారు. ఆస్పత్రులు, వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటి సంస్థలకు ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలని సూచించారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య దుకాణాల నుంచి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగానే సిలిండర్లు ఇండెంట్ పెట్టేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందుకోసం పోలీసు శాఖ నిరంతరం విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, సివిల్ సప్లయ్ అధికారి స్వామికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి.. జిల్లా అభివృద్ధి కోసం గత కలెక్టర్ బీఎం సంతోష్ ఎంతో కృషి చేశారని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఇది వరకే బదిలీ అయిన ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ బీఎం సంతోష్కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం చేశారు. -
తూకం తప్పుతోంది!
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వినియోగించే ప్రతి వస్తువులోనూ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తాగే పాల దగ్గరి నుంచి ఆరోగ్యానికి కాపాడుకునేందుకు వినియోగించే మందుల వరకు ప్రతీది కల్తీయే. ప్రతి వస్తువు సరైన తూకంలో లభిస్తున్నాయా అంటే అనుమానమే. కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రశ్నించేతత్వం లేనంత వరకు ఈ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికై నా వినియోగదారులు మేల్కొని తప్పును నిలదీయాలి. మోసాన్ని వేలెత్తిచూపి.. జరిగిన నష్టానికి న్యాయం పొందాలి. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – పాలమూరు వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన కోసం 08542- 245633 నంబర్కు ఫోన్ చేయాలి● వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలను తెలుసుకోవాలి ● కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి ● వినియోగదారుడికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన తప్పనిసరి 1967 : పౌర సరఫరాల శాఖ వినియోగ ఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు. వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్,టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణ, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల వల్ల వినియోగదారులు నష్టపోతే ఇలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది. జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు.రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత సదరు వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ వన్సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ వేసుకోవాలి. నాణ్యతపై ప్రశ్నిద్దాం..!‘నగరానికి చెందిన చంద్రశేఖర్, సుమిత్ర దంపతులతో పాటు వారి పిల్లలు కలిసి 2008 నవంబర్ 26న రూ.21,250తో టీటీడీలో శ్రీవారి మేల్ చాట్ వస్త్ర సేవ టికెట్లు బుక్ చేసుకున్నారు. అప్పటి నుంచి సంవత్సరాల పాటు ఎదురుచూసినా స్వామి సేవలో పాల్గొనడానికి అవకాశం రాలేదు. చివరికు 2021 సెప్టెంబర్ 10న స్లాట్ బుకింగ్ అయిందని కరోనా కారణంగా ఆ సేవ రద్దు చేసినట్లు తెలిపారు. దాని స్థానంలో బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అయిన కూడా వారికి టీటీడీ అవకాశం కల్పించలేదు. దీంతో చంద్రశేఖర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. దీంతో కోర్టు చంద్రశేఖర్కు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తారా లేక జైలుకు వెళ్తారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీటీడీ 2025 ఆగస్టు 14, 15తేదీలలో చంద్రశేఖర్ దంపతులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్పల్లిలో మూడు నెలల కింద రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటా తూకాల్లో మోసాలు చేస్తున్నట్టు రైతులు గుర్తించారు. పత్తి సంచుల బరువు ఎలక్ట్రానిక్ కాంటాలో తక్కువగా చూపుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అచ్చంపేట మార్కెట్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పినా ఇప్పటివరకు తనిఖీలు చేపట్టలేదు.’ -
వంటగ్యాస్ కొరత లేకుండా చర్యలు
గద్వాల: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై సమీక్షించారు. జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు గృహ సంబంధ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యావేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలో యాసంగి సీజన్లో పంటలు సాగుచేసుకున్న రైతులకు ఇబ్బంది తలెత్తకుండా సాగునీరు సరఫరా చేయాలన్నారు. పంటలకు స్టోరేజ్ పాయింట్స్ కొ రత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నా రు. అదే విధంగా ఆయిల్పాం సాగును పెంచేందు కు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనా రాయ ణ, సివిల్సప్లయ్ అధికారులు స్వామికుమా ర్, విమల, డీఏఓ వీరప్ప, ఎస్ఈ రహీముద్దీన్, ఈఈ శ్రీనివాస్, ఉద్యానశాఖ అధికారి అక్బర్ ఉన్నారు. పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా సవరణ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మంచి పురోగతి సాధిస్తున్నామన్నారు. ఇదే విధంగా కొనసాగిస్తూ నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. పెండింగ్లో ఉన్న డీఎస్ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సూపర్వైజర్లు, బీఎల్ఓలు అంకితాభావంతో పనిచేయాలని.. మండల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ హరికృష్ణ, సూపరింటెండెంట్ మంజుల, ఎన్నికల విభాగం అధికారి సురేశ్ పాల్గొన్నారు. పకడ్బందీగా ‘పది’ పరీక్షలు పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా తల్లిదండ్రులతో పాటు సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు చొరవ చూపాలన్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు, డీఈఓ విజయలక్ష్మి ఉన్నారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 8,110మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్కు తావులేకుండా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలన్నారు. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. వెల్ఫేర్ బోర్డుతోనే పథకాలు అందించాలి గద్వాల: కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ, కార్యదర్శి వీవీ నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఏఓ భూపాల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ భవన, ఇతర నిర్మాణరంగ కార్మిక సంక్షేమ బోర్డు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం వల్ల అర్హులైన కార్మికులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కాకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారానే పథకాలు అందించాలని వారు కోరారు. వేరుశనగ క్వింటా రూ.8,006 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శుక్రవారం 1,129 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 8,006, కనిష్టంగా రూ. 3,219, సరాసరి రూ. 6,020 ధర పలికింది. అదే విధంగా 56 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,171, కనిష్టంగా రూ. 2,119, సరాసరి రూ. 6129 ధరలు వచ్చాయి. 19 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 7,129, కనిష్టంగా రూ. 2,003, సరాసరి రూ. 7,029 ధరలు పలికాయి. -
పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
గట్టు: సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నర్సింగ్రావు అన్నారు. శుక్రవారం గట్టులో కమ్యూనిటీ రిసోర్స్పర్సన్లకు సమ్మిళిత జీవనోపాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొదటి విడతగా ఎంపికచేసిన 17 గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉన్న వారిని శాసీ్త్రయంగా గుర్తించి.. వారికి ప్రభుత్వ ఫలాలు నేరుగా అందించడమే లక్ష్యమన్నారు. పేద కుటుంబాలకు ఆధార్, ఓటరుకార్డులు వంటి ప్రాథమిక ధ్రువపత్రాలను అందజేయడంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. అదే విధంగా శాశ్వత ప్రాతిపదికన జీవనోపాధి మార్గాలు చూపిస్తామన్నారు. కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా.. సామాజిక, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ బృహాత్తర కార్యక్రమంలో సీఆర్పీలు కీలక పాత్ర పొషించాలని.. క్షేత్రస్థాయిలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసరావు, డీపీఎం సలోమి, ఎంపీడీఓ చెన్నయ్య, సమాఖ్య సభ్యులు వెంకటేశ్వరి, అక్షర, మహేశ్వరమ్మ, ఏపీఎం మారుతి, నీతి అయోగ్ కోఆర్డినేటర్ అఫ్జల్ పాల్గొన్నారు. -
యువతకు ఉపాధి లభిస్తుంది..
గతంలో ఆయిల్ మిల్లు ఏర్పాటుకోసం కొండపేట, యాక్తాపురం గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములను దానం చేశారు. వారి కుటుంబాలకు మిల్లులో ఉద్యోగాలు సైతం కల్పించారు. ప్రస్తుతం మా గ్రామపంచాయతీ పరిధిలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆయిల్ మిల్లు ప్రారంభమైతే వారికి ఉపాధి దొరుకుతుంది. – విజిత, సర్పంచ్, బీచుపల్లి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.. జిల్లాలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రైతులు లాభదాయక ఆయిల్పాంను సాగుచేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఆయిల్పాం సాగుచేసే రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి. – అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి త్వరలోనే ప్రారంభం.. బీచుపల్లి ఆయిల్ మిల్లులో రూ. 47కోట్ల వ్యయంతో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈటీపీ వంటి పనులు ప్రారంభమయ్యాయి. మిల్లులోని 11 భవనాల్లో ఎన్డీటీ బృందం నాణ్యతా ప్రమాణ పరీక్షలు నిర్వహించింది. రైతు సేవాకేంద్రం నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. రైతులకు ఆయిల్పాం పంటలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఆయిల్పాం సాగుకు అవసరమైన డ్రిప్, ఎరువులు, హార్వెస్టింగ్, ఇతర పరికరాలను కూడా త్వరలోనే ఆయిల్ మిల్లులో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. – సుధాకర్రెడ్డి, జనరల్ మేనేజర్, తెలంగాణ ఆయిల్ఫెడ్ ● -
రైతులకు ప్రోత్సాహకాలు..
ఆయిల్పాం సాగును ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం రైతులకు అనేక రాయితీలు అందిస్తోంది. రూ.193 విలువైన ఒక్కో మొక్కను కేవలం రూ.20కే అందించి.. మిగిలిన రూ. 173ను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తోంది. వీటితో పాటు ఎకరాకు నాలుగేళ్ల వరకు రూ. 2,100 చొప్పున నిర్వహణ కోసం అందిస్తుంది. అదే విధంగా అంతర పంటలు సాగుచేస్తే మరో రూ. 2,100 వరకు అదనంగా చెల్లిస్తుంది. 12 ఎకరాల వరకు డ్రిప్ సౌకర్యాలను సబ్సిడీ ద్వారా అందిస్తుంది. పండించిన పంటను ఆయిల్ కంపెనీలే కొనుగోలు చేసేలా బై–బ్యాక్ ఒప్పందాలు చేసుకోవడంతో పాటు మద్దతు ధర ప్రకటించి.. రైతులకు కొండంత అండగా నిలుస్తుంది. -
బీడీ కార్మికుల పోరుబాట
●బీడీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ చిన్నచింతకుంటలో భారీ ప్రదర్శన నిర్వహించి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు వేతన పెంపు డిమాండ్ నోటీసులు అందించాం. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలని కోరాం. దీంతోపాటు పీఎఫ్, ఈపీఎఫ్ ప్రతి కార్మికుడికి వర్తింపచేజేయాని విన్నవించాం. – రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం, అమరచింత నెలలో 20 పనిదినాలు ఉండగా.. 15 వేల బీడీలు తయారు చేస్తున్నాం. కుటుంబ పోషణ బీడీల తయారీపైనే ఆధారపడింది. వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లిస్తున్నారు. కూలి సరిపోక పోషణ భారంగా మారింది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా రూ.400 చెల్లిస్తే బాగుంటుంది. – సులోచనమ్మ, బీడీ కార్మికురాలు, అమరచింత చాలీచాలని కూలితో ఇబ్బందులు పడుతున్నా ం. యాజమాన్యం వెంటనే ధరలు పెంచాలి. అలాగే జరిమానాను పూర్తిగా రద్దు చేయాలి. పొద్దంతా కూర్చొని తయారుచేసిన వెయ్యి బీ డీలకు రూ.400 చెల్లించాలి. లేనిపక్షంలో కార్మిక సంఘంతో కలిసి ఆందోళన చేపడతాం. – సరోజ, బీడీ కార్మికురాలు, మస్తీపురం అమరచింత: మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బీడీ కూలి పెంచాలంటూ కార్మికులు, కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలంటూ గురువారం టీయూసీఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలోని బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు డిమాండ్ నోటీసులు అందజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బీడీ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సమావేశంలో గర్జించారు. ప్రస్తుతం వెయ్యి బీడీల తయారీకి రూ.230 నుంచి రూ.290 చొప్పున యాజమాన్యాలు చెల్లిస్తున్నాయి. రెండేళ్లకు ఓసారి కూలి ధరలు పెంచాలనే నిబంధన ఉండటంతో ఈసారి రూ.400 చెల్లించాలనే డిమాండ్తో కార్మికులు కార్మిక సంఘాల నాయకులతో కలిసి పోరాటం సాగించేందుకు సిద్ధమవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట కేంద్రంగా బీడీ ఫ్యాక్టరీలు అనేకం కొనసాగుతున్నాయి. ప్రధాన శాఖలు అక్కడే ఉండగా.. వివిధ గ్రామాలు, పట్టణాల్లో చిన్న చిన్న బీడీ ఖార్కానాలు కొనసాగిస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి చండూల్, వస్తాద్, రెడ్డి, మహరాజ్, రింగ్రెడ్డి, 6 నెంబర్, సంఘం, ఆజాం, అమృతం తదితర బీడీ ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయి. రెండేళ్లకు ఓసారి వేతన సవరణ.. ప్రతి రెండేళ్లకు ఒకసారి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల వేతనాలు పెంచాలనే నిబంధన ఉంది. ప్రసు ్తతం గడువు ముగియడంతో టీయూసీఐ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు గురువారం చిన్నచింతకుంటలో ఆందోళన చేపట్టి అక్కడి బీడీ ఫ్యాక్టరీ యా జమాన్యాలను కలిసి వేతన పెంపు డిమాండ్ నో టీ సులు అందజేశారు. త్వరలోనే యాజమాన్యాలు బీడీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 40 వేల పైచిలుకు బీడీ కార్మికులు ఉంటారు. రోజు తమ గ్రామాల్లోని బీడీ ఫ్యాక్టరీ బ్రాంచ్లకు వెళ్లి వెయ్యి బీడీల తయారీకి వినియోగించే ఆకు, పొగాకు తీసుకొచ్చి తయారుచేసి మధ్యాహ్న సమయంలో ఫ్యాక్టరీకి అప్పగిస్తారు. వారికి ఇచ్చిన పుస్తకంలో రోజువారీ బీడీ లెక్కలు రాసుకుంటూ నెలలో రెండు పర్యాయలు కూలి డబ్బులు చెల్లిస్తుంటారు. కాగా ఫ్యాక్టరీల యాజమాన్యం బీడీల తయారీలో వేస్టేజీ పేరుతో చెల్లించే వేతనంలో కొంతమేర జరిమానా రూపంలో కోత విధిస్తోంది. దీనిని ఎత్తివేయాలని కార్మికులు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచాలంటూ యాజమాన్యాలకు నోటీసులు ప్రస్తుతం వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లింపు రూ.400 చెల్లించాలని డిమాండ్ ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది కార్మికులు -
‘ఇందిరమ్మ ఇంటి’ బిల్లుల కోసం లంచం డిమాండ్
రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి అయిజ: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లు చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బోయ రంగన్న ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు చేసేందుకు లబ్ధిదారుల నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంల సమీపంలో లబ్ధిదారుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి మొదటి విడత బిల్లు చెల్లించేందుకు, తదుపరి మూడు వాయిదాలకు అంతరాయం లేకుండా బిల్లులు చెల్లించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశారని, లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఓ ఫిర్యా దుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్లో జడ్జి ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
శరవేగంగా..
బీచుపల్లి ఆయిల్ మిల్లులో సివిల్ పనుల జోరు ఎర్రవల్లి: జిల్లాలోని ఆయిల్పాం రైతులకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలోని పాత విజయ ఆయిల్ మిల్లులో చేపట్టిన సివిల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 95.20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 47కోట్ల వ్యయంతో మిల్లు నిర్మించేందుకు తెలంగాణ ఆయిల్ఫెడ్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. మిల్లులో సివిల్ పనులు పూర్తయిన వెంటనే టెక్నికల్, రిఫైనరీ మిషన్ ఫిట్టింగ్ తదితర పనులు ప్రారంభించనున్నారు. త్వరలో మిల్లును రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయిల్పాం సాగుపై ప్రత్యేక దృష్టి.. జిల్లాలో ఆయిల్పాం సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మన ఊరు – మన ఆయిల్పాం – మన భవిష్యత్ అనే నినాదంతో ఉద్యాన, వ్యవసాయశాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,751 మంది రైతులు దాదాపు 7200 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగుచేస్తున్నారు. ఈ ఏటా మరో 471 ఎకరాల్లో సాగు చేసేందుకు కసరత్తు చేపట్టారు. ఆయిల్పాం క్రషింగ్ మిల్లు అందుబాటులోకి వస్తే.. సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దళారుల బెడద లేకుండా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం లభిస్తుంది. టన్ను ధర రూ.21,546 గతంలో ఒక టన్ను ఆయిల్పాం ధర రూ. 20,450 ఉండగా.. ప్రభుత్వం ఈ నెల 1 నుంచి రూ. 21,546 మద్దతు ధరను ప్రకటించింది. భవిష్యత్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నాలుగేళ్లలో తోటల నుంచి ఎకరాకు సగటున 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. రవాణా ఖర్చులు తగ్గించేందుకు శాంతినగర్ సమీపంలో వెంకటపురం స్టేజీ, ధరూర్ మండలంలో కూడా గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నారు. బీచుపల్లి ఆయిల్ మిల్లు అందుబాటులోకి వస్తే.. జిల్లా ఆయిల్పాం సా గులో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. రూ. 47కోట్లతో కొనసాగుతున్న మిల్లు నిర్మాణం త్వరలోనే ఏర్పాటుకానున్న రిఫైనరీ మిషన్లు జిల్లాలో 7,200 ఎకరాల్లో ఆయిల్పాం సాగు విస్తీర్ణం ఆర్థికంగా అభివృద్ధి చెందనున్న రైతులు -
జోగులాంబ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
సాక్షి, జోగులాంబ గద్వాల: లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలకు చిక్కాడు. అయిజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రంగన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా.. క్లియరెన్స్ ఇవ్వడానికి కార్యదర్శి ఏకంగా రూ. 20 వేలు డిమాండ్ చేశారు.మొత్తం రూ. 20 వేలకు గాను రూ.15 వేలు ఒప్పందం కుదుర్చుకున్న కార్యదర్శి.. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్గా దొరికిపోయాడు. కార్యదర్శి రంగన్నను అరెస్టు చేసి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. -
ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం
గద్వాల: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు దిగ్విజయం చేయడంలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. ప్రజాసంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అమలు చేసేలా ఎక్కడా, ఎలాంటి వైరుధ్యాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో మహిళలు అధిక సంఖ్యలో సర్పంచులు, కౌన్సిలర్లుగా గెలుపొందడం శుభపరిణామమన్నారు. 99 రోజులపాటు పది అంశాలతో చేపడుతున్న కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 2న గ్రామ, వార్డుసభలు నిర్వహించి ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధులు కీలకంగా ఉండేందుకు గాను ఒకరోజు శిక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సందేహాలు ఉంటే మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేస్తారని చెప్పారు. సామాజిక సమస్యలను రూపుమాపాలి జిల్లాలో అధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయని, అలాగే పలు సామాజిక సమస్యలు నెలకొన్నాయని, వాటిని రూపుమాపేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసుకుని మరమ్మతు చేయించడం జరిగిందన్నారు. నూనతంగా ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాఠశాలల పనితీరు మెరుగుపర్చేలా తరచూ పర్యవేక్షణ చేయాలన్నారు. బాలికలు చదువులు మధ్యలోనే ఆపేయకుండా ఉన్నత విద్యాభ్యాసం చేసేలా ప్రోత్సాహం అందించాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉందని త్వరలో మరోసారి జనాభా గణన చేపడుతున్నందున అక్షరాస్యత శాతం పెంచేలా కృషిచేయాలన్నారు. పిల్లల్లో న్యూట్రిషన్ సమస్యల నివారణకు అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. పోలీసుశాఖ డ్రగ్స్, రహదారి భద్రత కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ -
సర్వర్ సమస్య వస్తోంది..
నగరంలో మా ఏజెన్సీ పరిధిలో నెలకు 3 వేల వరకు కమర్షియల్ సిలిండర్లు అందిస్తున్నాం. వాటన్నింటినీ పూర్తిగా నిలిపివేశాం. ఇళ్లకు ఇచ్చే వాటిలో ఎలాంటి సమస్య లేదు.. వాటిని సక్రమంగా అందిస్తున్నాం. రెండు, మూడు కనెక్షన్స్ ఉన్న వాళ్లు మొత్తం అడ్వాన్స్ బుక్ చేసుకోవడానికి చూస్తున్నారు. దీంతో సర్వర్ సమస్య వస్తోంది. హోటల్స్, పరిశ్రమలు ఇతర కమర్షియల్ వాటికి ఇవ్వడం లేదు. తర్వాత ఎలా ఉంటుందనే అంశంపై నేడు సమావేశం ఉంటుంది. – లక్ష్మీకాంత్రెడ్డి, స్వప్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు హోటల్ నిర్వహణ కష్టంగా ఉంది మా రెస్టారెంట్లో రోజుకు నాలుగు సిలిండర్లు అవస రం అవుతాయి. ప్రస్తుతం ఒకటి ఇచ్చారు. దీంతో హోటల్ నడపటం చాలా కష్టం. మా దగ్గర 150 రకాల వంటకాలు ఉంటా యి. కానీ సిలిండర్ల కొరత వల్ల బిర్యానీతో పాటు ఒకటి రెండు రకాల వంటలు చేయాల్సిన పరిస్థితి. రోజు కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం కష్టం. ఇలాగే కొనసాగితే హోటళ్ల నిర్వహణ పూర్తిగా కష్టంగా మారుతుంది. – నిరంజన్రెడ్డి, శిల్పి హోటల్ యాజమాని, మహబూబ్నగర్ సిలిండర్లు లేవని చెబుతున్నారు సాధారణంగా కట్టెల పొయ్యిపై అన్ని రకాల టిఫిన్స్ చేయడం సాధ్యం కాదు. టిఫిన్ హోటల్స్కు తప్పక సిలిండర్లు అవసరమవుతాయి. అవంతి హోటల్లో నిత్యం 5 సిలిండర్ల వినియోగం ఉంటుంది. ప్రస్తుతం కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్యాస్ ఏజెన్సీల దగ్గర సిలిండర్లు లేవని చెబుతున్నారు. – చంద్రశేఖర్ శెట్టి, అవంతి హోటల్ ● -
జాతీయ సమగ్రతను పెంచుతాయి: వీసీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ల వల్ల జాతీయ సమగ్రతను పెంపొందిస్తాయని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటకలోని రాయచూర్లో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ను పీయూ విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ క్యాంపులో విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయం అని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి క్యాంపులో పాల్గొనడం వల్ల పలు అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. జాతీయ ఐక్యత, సహకారం, సామాజిక బాధ్యత.. తదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఇందులో నేర్చుకున్న అంశాల ద్వారా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, లీడర్లు సోమ్లా, అధ్యాపకులు భూమయ్య, రవికుమార్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధం తెచ్చినగుదిబండ
పాలమూరు: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం స్థానికంగా కన్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు నెలకొనడంతో కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వాణిజ్య సిలిండర్ల పంపిణీలో కోతలు మొదలయ్యాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. ఇలాగైతే హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో కోత పెట్టడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఏజెన్సీలు నిలిపేయడం, ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. రెట్టింపు మొత్తం ఇస్తామన్నా సిలిండర్ దొరకడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో రోజుకు 2 వేల సిలిండర్లు ఉమ్మడి పాలమూరులో మహబూబ్నగర్ జిల్లాలో 25 ఏజెన్సీల పరిధిలో 3,01,395 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఉజ్వల 40,199, దీపం 44,445 కనెక్షన్లు ఉన్నాయి. డొమెస్టిక్, కమర్షియల్ 2,16,651 కనెక్షన్లు ఉన్నాయి. కాగా.. మహబూబ్నగర్ నగరంలో రోజుకు 2 వేల కమర్షియల్ సిలిండర్ల వినియోగం ఉంటుందని సమాచారం. జోగుళాంబ గద్వాల జిల్లాలో 11 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. 1,99,150 డొమెస్టిక్ కనెక్షన్లు, 850 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 9 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. 139,838 డొమెస్టిక్, 657 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో పెద్దపెద్ద హోటళ్లు, మెస్లు దాదాపు 350 వరకు ఉండగా... చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీపాయింట్లు సుమారు నాలుగు వేల వరకు ఉంటాయని అంచనా. వీటన్నింటిలో కమర్షియల్ సిలిండర్లనే వాడుతున్నారు. ● ప్రస్తుతం అన్ని రకాల హోటల్స్, రెస్టారెంట్లకు గ్యాస్ ఇవ్వడం నిలిపివేశారు. పొయ్యిలు మండించి బట్టీలు నిర్వహించే హోటళ్లకు ఇబ్బంది లేకున్నా.. గ్యాస్ మీదే ఆధారపడి వారు పూర్తిగా సందిగ్ధంలో పడ్డారు. దీంతో గృహావసరాలకు వాడాల్సిన సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. రెండు రోజులుగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోయింది. దీంతో హోటళ్లు, రోడ్లపై ఉండే టిఫిన్ సెంటర్లు, మిర్చి బండిలు, ఇతర తినుబండరాల దుకాణాల్లో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. -
జోగుళాంబదేవి హుండీ ఆదాయం రూ.99.55 లక్షలు
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ క్షేత్రంలోని శ్రీజోగుళాంబదేవి అమ్మవారి హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, ఆలయ ఈఓ దీప్తి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారి ఆలయంలోని హుండీలను లెక్కించగా రూ.99,55,566 ఆదాయం సమకూరినట్లు ఈఓ దీప్తి తెలిపారు. అలాగే 28 గ్రాముల మిశ్రమ బంగారం, 298 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని పేర్కొన్నారు. వీటితోపాటు విదేశీ కరెన్సీలైన యూఎస్డీ 39, ఫౌండ్స్ 10, ఓమన్ 100 బైసా హుండీల ద్వారా వచ్చినట్లు చెప్పారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీలను ఉగాది పండగ తర్వాత లెక్కించనున్నట్లు ఈఓ వెల్లడించారు. అమ్మవారి హుండీ ద్వారా వచ్చిన నగదును డీసీసీ బ్యాంక్లో జమ చేశామన్నారు. -
బావోజి జాతర వాల్పోస్టర్ ఆవిష్కరించిన సీఎం
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలిసిన గిరిజన ఆరాధ్య దైవం గురులోకామసంద్ బావోజి జాతర గోడపత్రికను గురువారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 1 నుంచి జరిగే ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆలయ కమిటీ ఆహ్వాన పత్రిక అందజేసింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గోపాల్నాయక్, పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్లర్ లక్ష్మీకాంత్రాథోడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు నర్సింహులు, నిడ్జింత తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్రెడ్డి, సుభాష్ నాయక్, రవి నాయక్, రాజేష్ రాథోడ్, అనిల్నాయక్, లాల్యానాయక్, నర్సింహారెడ్డి, రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహాలపై ప్రభావం
జిల్లాలో ప్రైవేట్ వసతి గృహాలకు పూర్తిగా సిలిండర్ల పంపిణీ పూర్తిగా నిలిపివేశారు. ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లోనూ నిత్యం మూడు సిలిండర్లు వాడుతారు. సరఫరా నిలిచిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ వసతి గృహాలకు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంటలు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా చేయాలని ఆదేశాలు వస్తుండటంతో కోత విధిస్తూ అరకొరగా సరఫరా చేస్తూ పొదుపుగా వాడుకోమని చెబుతున్నారు. అయితే మరో రెండు, మూడు రోజుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు. కాగా.. గృహ వినియోగ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. కొరత లేదని చెబుతున్నా బుకింగ్లో సర్వర్ పని చేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. సరఫరాలోనూ ఆలస్యం జరుగుతోంది. కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారుల నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. -
సంతోషంగా ఉంది..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు అవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేవరకద్ర, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్లు కూడా ఏబీఎస్ఎస్ కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. – దిడ్డి గోపాల్ నారాయణ, డీఆర్యూసీసీ మెంబర్ -
ఉమ్మడి జిల్లాలో నాలుగు స్టేషన్లు
రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. -
గాడిన పడేనా?
గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలో బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరిగి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీయడంతో పాటు సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అంతకు ముందు వైద్యులతో కలెక్టర్ సమావేశమై.. జిల్లా ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య, వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలు, మందుల స్టాక్పై వాకబు చేశారు. రోజువారీ ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్స్, రెఫరల్ కేసుల రికార్డులను పరిశీలించారు. వైద్యుల కొరత, సిబ్బంది సమస్యలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. జిల్లా ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న మెడికల్ కళాశాల వైద్యుల వివరాలను తెలుసుకున్నారు. కాగా, కలెక్టర్ తనిఖీ నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో విధులు నిర్వహించడం కొసమెరుపు. త్వరలో పోస్టుల భర్తీ.. జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత తీర్చేందుకు త్వరలోనే అన్ని పోస్టులను భర్తీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ కర్ణాటక ప్రజలు సైతం వైద్యసేవలు పొందుతున్నారన్నారు. రోగుల సంఖ్య గణనీయంగా ఉందన్నారు. అత్యవసర కేసుల విషయంలో వీలైనంత వరకు ఇక్కడే సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రెఫరల్ చేయాల్సిన క్రమంలో కచ్చితమైన నివేదికను అందజేయాలన్నారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. ప్రసవాల విషయంలో శస్త్రచికిత్సకు అవకాశం లేకుండా సాధారణ కాన్పు అయ్యేలా చూడాలన్నారు. శిశువు మృతిపై విచారణ.. జిల్లా ఆస్పత్రిలో ఈ నెల 10న శిశువు మృతిచెందిన ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. గట్టు మండలం తప్పెట్లమొర్సుకు చెందిన మీనాక్షి రెండో కాన్పు కోసం 9న జిల్లా ఆస్పత్రికి రాగా.. ప్రసవ సమయంలో వైద్యులు అందుబాటులో లేని కారణంగా కాన్పు చేయలేదని.. 10వ తేదీ తెల్లవారుజామున పురిటినొప్పులు అధికం కావడంతో వైద్యులు సిజేరియన్ చేసినప్పటికీ శిశువు మృతిచెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్కు తెలియజేశారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే శిశువు ప్రాణాలు దక్కేవని రోధించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హామీ ఇచ్చారు. జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీ అన్ని వార్డుల్లో తిరిగి వైద్యసేవలపై ఆరా విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని ఆదేశం -
సమస్యల వెల్లువ..
వైద్యులతో సమీక్ష అనంతరం నవజాత శిశువు, గైనకాలజీ, దంత, కంటి, కాన్పుల వార్డు, అత్యవసర విభాగం, స్కానింగ్, టీ హబ్, ఎక్స్రే, చిల్డ్రన్స్, ఈఎన్టీ, రేడియాలజీ తదితర వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆయా విభాగాల్లో సేవలు పొందుతున్న రోగులతో స్వయంగా మాట్లాడి, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై వాకబు చేశారు. ఈ క్రమంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వివిధ పరీక్షల కోసం తీసుకెళ్లాల్సిన కేర్ టేకర్స్ అందుబాటులో లేకపోవడంతో తామే స్వయంగా వీల్చైర్పై తీసుకెళ్తున్నామని కుటుంబ సభ్యులు కలెక్టర్కు వివరించారు. అదే విధంగా ఆస్పత్రిలోని మూత్రశాలలకు తాళాలు వేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ క్రమంలో స్కానింగ్ సెంటర్లో మూత్రశాలకు తాళం వేయడాన్ని గుర్తించిన కలెక్టర్.. సిబ్బందిని మందలించారు. రోగులకు సేవలు అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పెంచేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలన్నారు. రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘ఉపాధిహామీ’పై నిర్లక్ష్యం తగదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై వివక్ష చూపుతూ లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందని.. ఉపాధి కూలీలకు అండగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీ రాంజీగా పేరు మార్చి జీఓ తీసుకురావడం దారుణమన్నారు. కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం సిగ్గుమాలిన చర్యగా అభి వర్ణించారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి పనులు చేస్తున్నా కూలి డబ్బుల అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్ధితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ముదురుతున్నందున నీడ కోసం షేడ్నెట్లు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారి కూలి రూ.307 చెల్లిస్తున్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని.. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి, మహమూద్, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర, బుచ్చన్న, శంకర్రాజు, విజయ్, అనంతమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తున్నామనే సాకుతో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద దేశంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయిల్ సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, ఇజ్రాయిల్కు అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనే స్వార్థంతోనే అమెరికా ఇలాంటి చర్యలకు పూనుకొంటుందని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర క్యార్యదర్శి జాన్వెస్లీ -
యువతకు కిడ్నీ గండం
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవన విధానంతో యువత ఒత్తిడికి లోనవుతోంది. దీనికితోడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారానికి అలవాటు పడటం, మానసిక ఒత్తిడి, ఎక్కువగా నొప్పులకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ వాడటం, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యం, పొగాకుకు బానిసవ్వడం తదితర అలవాట్లు కిడ్నీ రోగాలకు దారితీస్తోంది. రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహారం తినేటప్పుడు మాత్రమే యువత నీళ్లు తాగుతుండటం వల్ల శరీరానికి అవసరమైన నీరు సరిపోవడం లేదు. మరోవైపు ప్రాథమిక స్థాయిలో కిడ్నీ సమస్యలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది. జిల్లాలో 28– 30 ఏళ్ల వయస్సులో అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్న వారిలో కిడ్నీలు దెబ్బతింటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 479 మందికి డయాలసిస్ ఉమ్మడి పాలమూరులో గద్వాల, వనపర్తి జిల్లాలో అధికంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో డయాలసిస్ రోగులు అధికంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితితోపాటు ఆహార అలవాట్ల వల్ల కూడా కిడ్నీ బాధితులు అధికం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 77 మిషన్ల ద్వారా 479 మంది రోగులకు నిత్యం డయాలసిస్ చేస్తున్నారు. కొత్తగా ఆత్మకూర్లో ఐదు, మక్తల్లో ఐదు మిషన్లతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మార్చి రెండో గురువారం.. ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తారు. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా 9– 10 సెంటిమీటర్ల వెడల్పుతో పాటు 150గ్రాముల బరువు కల్గి ఉంటాయి. కిడ్నీ ప్రధాన శరీరంలోని నీటి లవణాల సమత్యులత, రక్త తయారీలో కీలక పాత్ర, మూత్రం తయారీ చేస్తుంటాయి. ప్రధానంగా కిడ్రీలలో సమస్య తీవ్రతరం అయితే తప్ప లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఆకలి మందగించడం, నీరసం, వాంతులు, చిరాకు, బరువు తగ్గడం, కాళ్ల వాపులు, మూత్రం తగ్గడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్ర, ఒత్తిడి లేకుండా జీవనం, సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. రోగులకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే డయాలసిస్ చేపట్టాలి. అందుబాటులో కేంద్రం ఉంటే రోగికి మేలు జరుగుతుంది. సుదూరంలో ఉండటం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉంటే ఎరిత్రోఫాయింట్ ఇంజెక్షన్ ఇస్తారు. మరీ తక్కువగా ఉంటే నేరుగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమీపంలోనే కేంద్రం ఉంటే ఇలాంటి సందర్భాల్లో రోగి కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండదు. కిడ్నీ రోగులకు ఒక్కసారిగా బీపీ పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రాలు దగ్గరలోనే ఉంటే వెంటనే రోగిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ. మూత్రపిండం.. జరభద్రం మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు మోతాదులో నీళ్లు తాగక అనర్థాలు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధిత బాధితులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
పారదర్శక సేవలు అందించాలి
గద్వాల: లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జిల్లాలో శిక్షణ పూర్తిచేసుకున్న 69 మంది సర్వేయర్లకు బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో లైసెన్స్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల సర్వేకు సంబంధించి సమగ్ర శిక్షణ పూర్తిచేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రైవేటు భూములతో పాటు నక్షలేని గ్రామాల్లో సర్వే చేయవచ్చన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సర్వేయర్లకు పారితోషికం చెల్లించనున్నట్లు తెలిపారు. భూముల సర్వే కోసం దరఖాస్తు చేసుకునే పౌరులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిబంధనలు అనుసరించి సర్వే చేయాలన్నారు. భవిష్యత్లో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు కూడా లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ భూపాల్రెడ్డి, జిల్లా సర్వే అధికారి నూకరాజు, డీఈ గోవిందు పాల్గొన్నారు. నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శిక్షణ తరగతులకు సర్పంచులు, కౌన్సిలర్లు విధిగా హాజరు కావాలని కోరారు. పడిపోయిన ఉల్లి ధరలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు సుమారు 6 వేల బస్తాలలో ఉల్లిని అమ్మకానికి తీసుకురావడంతో యార్డు మొత్తం ఉల్లి కుప్పలతో నిండిపోయింది. ఈ వారం వేలంలో ఉల్లి ధరలు బాగా పడిపోయాయి. క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.1,200, కనిష్టంగా రూ.900 వరకు ధర పలికింది. ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలామంది తెచ్చిన ఉల్లిని తిరిగి తీసుకుపోలేక వచ్చిన ధరలకే విక్రయించారు. స్థానిక వ్యాపారులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొని ఉల్లిని కొనుగోలు చేశారు. మార్కెట్ వ్యాపారులు 50 కిలోల బస్తాలుగా తూకం వేసి గరిష్టంగా రూ.600, కనిష్టంగా రూ.450 చొప్పున విక్రయించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఎర్రవల్లి: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని జింకలపల్లి, మునుగాల ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్ఎన్, ఎఫ్ఎల్ఎస్ రికార్డులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. అదే విధంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను డీఈఓ స్వయంగా పరిశీలించారు. రోజు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కూరగాయలు, ఆకుకూరల వద్ద వంట సిబ్బంది తప్పనిసరిగా శుభ్రత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి.. విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని సూచించారు. డీఈఓ వెంట ఎంఈఓలు అమీర్ పాషా, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
పలుమార్లు సర్వే..
ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా రూ. 60లక్షలతో హైదరాబాద్కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరునెలల పాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించారు. సర్వేకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. -
ఆయిల్పాం సాగుతో స్థిర ఆదాయం
ఎర్రవల్లి: ఆయిల్పాం సాగుతో రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని ఆయిల్ఫెడ్ జిల్లా అధికారి శివనాగిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పుటాన్దొడ్డి రైతువేదికలో వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్పాం సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్పాం సాగు చేపట్టే రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. ఎకరాకు 55 మొక్కలు నాటుకోవాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా ఆయిల్పాం మొక్క ధర రూ.190 ఉండగా.. ప్రభుత్వం సబ్సిడీపై కేవలం రూ.20కే అందిస్తుందన్నారు. నాలుగేళ్ల పాటు అంతర పంటల సాగు చేసుకోవడంతో పాటు తోట నిర్వహణ కోసం ఎకరానికి రూ. 4,200 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం బీచుపల్లి ఆయిల్ మిల్లులో సివిల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని.. త్వరలోనే రిఫైనరీల ఏర్పాటుతో కంపెనీ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ● రెయిన్ ఫీడ్ క్లస్టర్ పరిధిలోని రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డివిజన్ హార్టికల్చర్ అధికారి ఇమ్రానా అన్నారు. రైతులు సుస్థిర వ్యవసాయ పద్ధతులతో వైవిద్యమైన పంటల సాగుతో మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీన్ని ద్వారా ఉద్యాన, పశు, మత్స్య తదితర రంగాలకు చెందిన వారు సైతం తమ వృత్తుల్లో గణనీయమైన అభివృద్ధి సాధించవచ్చన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ సురేశ్గౌడ్, ఆయిల్ఫెడ్ కంపెనీ అధికారి రామకృష్ణ, ఏఈఓలు నరేశ్, బిందు, జెన్నిఫర్ పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
● అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేసి.. కనీసం 85 శాతం పురోగతి సాధించాలని సూచించారు. అదే విధంగా భూభారతి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కుల, ఆదాయ ఎఫ్–లైన్ పిటీషన్లు ఇతర ధ్రువపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలన్నారు. సర్వేయర్లపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని.. సర్వేయర్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని అన్నారు. జనాభా గణన–2027 పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలోనే ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 12న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బాధ్యతతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని.. అందులో భాగంగానే గేదెల కొనుగోలుకు సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మినీ డెయిరీ పథకానికి ఎంపికై న 44 మంది రైతులు గేదెల కొనుగోలు నిమిత్తం ఉత్తరప్రదేశ్కు బయలుదేరారు. వీరి బస్సును కలెక్టరేట్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారి నుషిత పాల్గొన్నారు. -
డిజిటల్ క్రాప్ సర్వే పూర్తిచేయండి
అలంపూర్: డిజిటల్ క్రాప్ సర్వేను సకాలంలో పూర్తిచేయాలని ఏడీఏ సక్రియా నాయక్ అన్నా రు. అలంపూర్ మండలం కోనేరులో మంగళవారం డిజటల్ క్రాప్ సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. వలంటీర్ల ద్వారా యాసంగి పంటల నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. అలంపూర్ మండలంలో 8,478 పంట సర్వే నంబర్లు నమోదు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 2600 సర్వే నంబర్లలో పంటల నమో దు పూర్తిచేసినట్లు వివరించారు. ఈ నెల 20వ తేదీలోగా సర్వేను పూర్తిచేయాలని వలంటీర్లకు సూచించారు. కార్యక్రమంలో ఏఓ నాగార్జునరెడ్డి, ఏఈఓలు నీలిమ, శ్రీధర్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు నిధులు..
ర్యాలంపాడు రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ ఆనకట్టలోని రాక్టోల్ లేయర్ల మట్టి నమూనాలు, తూముల అడుగు భాగంలోని నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టనున్నారు. త్వరలోనే పనులు.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. పుణె నుంచి వచ్చే తుదినివేదిక ఆధారంగా త్వరలోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టి.. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ ● -
అన్నదాతలకు డ్రోన్లు
నారాయణపేట: రాష్ట్రంలో పంటల సాగును ఆధునికీకరించి రైతులకు అండగా నిలిచేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తుండగా.. పంటలపై పురుగు మందులు పిచికారీ చేసేందుకు తాజాగా డ్రోన్లు పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా పంటలకు పురుగు మందులు, సూక్ష్మ పోషకాలను అందించేందుకు డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తి మేరకు డ్రోన్లను సబ్సిడీపై అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. రూ.4 లక్షల రాయితీ.. తొలి దశలో జిల్లాకు 10 డ్రోన్లను పంపిణీ చేస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. యూనిట్ వ్యయం రూ.15 లక్షలు ఉండగా.. రూ.4 లక్షల రాయితీ ఇవ్వనున్నారు. రైతు ఉత్పత్తిదారు సంఘాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎస్ఎంఏఎం పథకంలో.. తొలివిడతలో జిల్లాకు 10 కేటాయింపు రాయితీపై రైతులకు పంపిణీ ఎఫ్ఓపీలు, పీఏసీఎస్లకు ప్రాధాన్యం పురుగు మందుల పిచికారీకి తప్పనున్న వెతలు -
సన్మార్గంలో పయనిస్తేనే ఉజ్వల భవిష్యత్
ఎర్రవల్లి: విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి, సన్మార్గంలో పయనిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పదవ బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. మంగళవారం బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుని ముందుకుసాగాలని సూచించారు. ముఖ్యంగా పోటీ పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలన్నారు. భవిష్యత్లో ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్ధులకు పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్రెడ్డి, ఆర్ఐలు శ్రీనివాసులు, ఆర్పీ సింగ్, పాఠశాల ప్రిన్సిపాల్ శేషావలి తదితరులు పాల్గొన్నారు. -
ర్యాలంపాడుకు మోక్షం
గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్కు నాలుగేళ్ల క్రితం లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ.. 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు అందించకుండా క్రాప్హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ర్యాలంపాడు రిజర్వాయర్కు మరమ్మతు చేయాలని రైతులు ప్రతి ఏడాది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైదరాబాద్, పుణె నుంచి ఇంజినీరింగ్ నిపుణుల బృందం రిజర్వాయర్ను సందర్శించి.. సర్వే చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎట్టకేలకు ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు మోక్షం లభించింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లకే లీకేజీలు.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ప్రజలకు తాగునీటితో పాటు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు పరుగులు పెట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. వైఎస్సార్ అకాలమరణంతో అసంపూర్తిగా నిలిచాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తం 20 టీఎంసీల సామర్థ్యంతో ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం.. గుత్తేదారు లోపభూయిష్ట నిర్మాణంతో రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ మరమ్మతుకు రూ. 4.92 కోట్లు మంజూరు సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు కేటాయింపు రూ. 3.66కోట్లతో జలాశయం ఆనకట్ట, తూములకు మరమ్మతు త్వరలోనే ప్రారంభంకానున్న పనులు -
పకడ్బందీగా డిజిటల్ క్రాప్ సర్వే
రాజోళి: డిజిటల్ క్రాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. సోమవారం వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామంలో పర్యటించిన ఆయన పంటలను పరిశీలించారు. ప్రతి పంటను కాపాడుకునేందుకు రైతులు చేసే కృషి ఎనలేనిదని, వారు చేస్తున్న సాగును అధికారులు కూడా నమోదు చేయాలన్నారు. అనంతరం మండలంలోని పలుచోట్ల ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. దుకాణాల యజమానులు తప్పకుండా రైతులు కొనుగోలు చేసిన వాటికి బిల్లు ఇవ్వడంతోపాటు నాణ్యమైన విత్తనాలు, మందులు అమ్మాలని, ప్రతి దానికి రిజిష్టర్ నిర్వహణ తప్పకుండా ఉండాలన్నారు. ఎలాంటి తేడాలు కనిపించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డీఏఓ వెంట మండల ఏఓ రాధ తదితరులున్నారు. వేరుశనగ క్వింటా రూ.8,402 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 1,501 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.8,402, కనిష్టంగా రూ.4,229, సరాసరిగా రూ.6,942 ధరలు లభించాయి. అలాగే 15 క్వింటాళ్ల కంది రాగా.. రూ.7,206 ఒకే ధర పలికింది. 17 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టంగా రూ.6,159, కనిష్టంగా రూ.5,829, సరాసరిగా రూ.6,159 ధరలు వచ్చాయి. ● నారాయణపేట మార్కెట్యార్డులో పెసర క్వింటా గరిష్టంగా రూ.7,977, కనిష్టంగా రూ.7,427, వేరుశనగ గరిష్టంగా రూ.8,169, కనిష్టంగా రూ.5,940, జొన్నలు గరిష్టంగా రూ.5,369, కనిష్టంగా రూ.5,160, అలసందలు గరిష్టంగా రూ.6,209, కనిష్టంగా రూ.5,600, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,969, కనిష్టంగా రూ.6,501, తెల్లకందులు గరిష్టంగా రూ.7,629, కనిష్టంగా రూ.6,769 ధరలు పలికాయి. రేపు జిల్లా అథ్లెటిక్స్క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈనెల 15న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కార్నివాల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈనెల 11వ తేదీన స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్లలోపు బాలబాలికలకు 60 మీ., 600 మీటర్ల పరుగు, 20 ఏళ్లలోపు వారికి 100 మీ., 400మీటర్ల పరుగు, పురుషులు, మహిళలకు 100 మీ., 400మీటర్ల పరుగు పందెం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్ఎస్సీ మెమో, జనన ధ్రువీకరణ పత్రం, కులధ్రువపత్రంతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు. -
రాజీ కేసులపై స్పెషల్ డ్రైవ్
గద్వాల క్రైం: పెండింగ్ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో అడుగులు వేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవికుమార్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీసు శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్ కేసులు, రాజీ కాదగిన కేసులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. ఈ నెల 28న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే నేటికీ చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ, రోడ్డు ప్రమాద, బ్యాంకు రుణాలు, స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఆ శాఖ సిబ్బందితో మాట్లాడి విపత్కర కేసుల అంశాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. సమావేశంలో న్యాయమూర్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక పోరాటాలను ఉధృతం చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: వెనుకబడిన వర్గాలపై రోజురోజుకు దాడులు, అన్యాయాలు, వివక్షలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు సామాజిక పోరాటాలకు సిద్ధం కావాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్కుమాల్ అన్నారు. సోమవారం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా రెండో మహాసభలు జిల్లాకేంద్రంలోని సురవరం వెంకట్రామిరెడ్డి భవన్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, సామాజిక రుగ్మతలు ఇంకా ప్రజలను పట్టి పీడిస్తుందన్నారు. హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దళితులకు కేటాయించిన సబ్ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారన్నారు. దళితుల భూ సమస్యలు, ఉపాధి సమస్యలు, విద్యావకాశాల లోపం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయకపోవడం వంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నాయన్నారు. డీహెచ్పీఎస్ రాష్ట్ర రెండో మహాసభలను ఏప్రిల్ 17, 18వ తేదీల్లో వరంగల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భార్గవి, పద్మావతి, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
17, 18న యూనివర్సిటీల కన్వెన్షన్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్ను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వెన్షన్కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్ రమేష్బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్సీ రవికుమార్, మధుసూదన్రెడ్డి, బెక్కం జనార్దన్, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్, భరత్, శేఖర్, సాయి పాల్గొన్నారు. -
కానరాని రొయ్య
గద్వాల వ్యవసాయం: జిల్లాలో గడిచిన ఏడాది (2024– 25) రొయ్యల సీడ్ను వదలలేదు. ఈసారి కూడా ప్రభుత్వం బడ్జెట్ను అరకొరగా కేటాయించడంతో రొయ్యల సీడ్ను తక్కువగా వదిలారు. ఇక్కడి జలాశయాలు, వాతావరణ పరిస్థితులు రొయ్యల సాగుకు అనుకూలంగా ఉండి.. రొయ్యల ఉత్పత్తి బాగున్నా.. ప్రభుత్వ నిర్వాకం మూలంగా సాగు, ఉత్పత్తి తగ్గుతున్న పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రొయ్యల విక్రయాలతో జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తుంది. జిల్లాలో నీటి వనరులు.. జోగుళాంబ గద్వాల జిల్లాలో 93 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. ఇందులో 7,162 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరే కాక మరో 3వేల మంది దాకా కుటుంబ సభ్యులున్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్వాటర్, 6 రిజర్వాయర్లు, 38 నోటిఫైడ్ చెరువులతోపాటు వందల సంఖ్యలో చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్ను వదిలి పెంచుతున్నారు. ఆలస్యంగా.. తక్కువగా రొయ్యల సాగు, ఉత్పత్తిలో భాగంగా రొయ్య సీడ్ కోసం ప్రభుత్వం రాష్ట్ర మత్స్యశాఖకు బడ్జెట్ కేటాయిస్తుంది. ఈ బడ్జెట్తో రొయ్యల సీడ్కు సంబంధించి మత్స్యశాఖ రాష్ట్రస్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ ఆయా జిల్లాలకు నిర్దేశించిన సీడ్ సంఖ్య ప్రకారం సప్లయ్ చేస్తారు. అయితే 2024– 25 సంవత్సరానికి సంబంధించి రొయ్యల సీడ్ కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడంతో రొయ్యలను వదలలేదు. ప్రస్తుత సంవత్సరం (2025– 26) సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ ఆలస్యంగా, తక్కువ కేటాయించింది. దీంతో జిల్లాలోని జలాశయాల్లో 22లక్షల రొయ్యల సీడ్ మాత్రమే వదిలారు. జలాశయాల్లోని నీటి లభ్యత ఆధారంగా ఏటా వదిలే సీడ్ సంఖ్య పెంచాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తగ్గిస్తూ వస్తోంది. మార్కెట్లో మంచి డిమాండ్.. రొయ్యలు బోన్లెస్గా ఉండటంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గద్వాల ప్రాంతంలో కిలో రూ.300–400 వరకు ధరలున్నాయి. అయితే రొయ్యల సీడ్ వదిలిన ఆరేడు నెలల తర్వాత వీటిని పట్టుకొని విక్రయించాల్సి ఉంటుంది. అయితే మత్స్యకారులు అర్ధరాత్రి రిజర్వాయర్లలోకి వెళ్లి వలలు కట్టి, తిరిగి తెల్లవారుజామున వాటిని తీసుకొస్తారు. కాగా రొయ్య సీడ్ను వదలకపోవడంతో మత్స్యకారులు గడిచిన ఏడాది ఆర్థికంగా నష్టపోయారు. ఐదేళ్ల రొయ్యల ఉత్పత్తిని బట్టి గతేడాది (2024– 25) 286 టన్నుల ఉత్పత్తి నష్టపోయారు. అలాగే 2023– 24తో పోల్చితే ఈసారి 10 లక్షల తక్కువ సీడ్ వదిలారు. ఇలా తక్కువ వదలడం వల్ల ఈ ఏడాది కూడా మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది. జిల్లాలో గణనీయంగాతగ్గుతున్న సీడ్ విడుదల అరకొరగా బడ్జెట్ కేటాయింపులు గతేడాది పూర్తిగా ఎగనామం పెట్టిన ప్రభుత్వం అనుకూలమైన పరిస్థితులున్నామీనమేషాలు జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులు ప్రభుత్వ నిర్ణయమే.. జిల్లాలోని జలాశయాలు రొయ్యల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. అయితే 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని జలాశయాల్లో 22 లక్షల సీడ్ వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం జనవరి, ఫిబ్రవరి మొదటి వారం నాటికి రొయ్యల సీడ్ను వదిలాం. సీడ్ తక్కువ చేయడం, ఎక్కువ చేయడం ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. – షకీలాబానో, జిల్లా మత్స్యశాఖ అధికారి -
గడువుల ఎత్తిపోతల..!
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలోనే పాలమూరు–రంగారెడ్డి పనులను పూర్తి చేసేందుకు ఈ ఏడాది మార్చి వరకు గడువు విధించింది. అయితే తాజాగా ప్రభుత్వం మరో 20 నెలల్లో పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకుంది. మొత్తానికి 2027 నవంబర్ వరకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ని వినియోగంలోకి తె స్తామని ప్రభుత్వం చెబుతుండగా, ఈసారైనా అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే అవసరమైన నిధులు కేటాయిస్తేనే పనుల్లో కదలిక వస్తుంది. భూసేకరణ వేగవంతం.. పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేసేందుకు ప్రధానంగా భూసేకరణ సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. ఏళ్ల కిందట ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టినా ఇప్పటి వరకు భూసేకరణ పూర్తి కాలేదు. ఈ ఏడాది జూన్ 2 లోగా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్ట్ల భూసేకరణ పూర్తి చేయడంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. దీనితో పాటు పెండింగ్లో ఉన్న పునరావాస ప్యాకేజీలను సైతం పూర్తి చేసేందుకు మొత్తం రూ.5 వేల కోట్లు నిధులు అవసరం కానున్నాయి. నిధులు వస్తేనే పనులు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడంలో నిధుల కేటాయింపు విషయమే కీలకంగా మారింది. 2014లో మొత్తం రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ను ప్రారంభించగా ఏటా ప్రాజెక్ట్ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లతో కలిపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం రెండేళ్ల కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఇంకా రూ. 22 వేల కోట్లు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే మిగతా నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రూ.909 కోట్లు, కోయిల్సాగర్ రూ.185 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ.220 కోట్లు, నెట్టెంపాడు కోసం రూ.252 కోట్లను వచ్చే ఏడాది కాలంలో ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే ప్రాజెక్టుల పనుల్లో పురోగతి ఉండనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఆశలు.. పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేస్తేనే ఉమ్మడి జిల్లాకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలుగనుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పంప్హౌజ్ల్లో మోటార్ల బిగింపు, కాల్వల తవ్వకాలు కొనసాగుతున్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల ప్రధాన కెనాల్లో కుడికిళ్ల వద్ద 2.5 కి.మీ. మేర కెనాల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం కోసం ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు భారీస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు. ‘పాలమూరు–రంగారెడ్డి’ పనులు పూర్తి చేసేందుకు మరోసారి గడువు పెంపు 20 నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించిన ప్రభుత్వం వచ్చేమార్చిలోగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ పెండింగ్ పనులు పూర్తి అనుకున్న సమయానికి పనులకు కావాలంటే నిధులు తప్పనిసరి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసుల ఆశలు -
పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక..
చాలా ఏళ్ల నుంచి మత్స్యశాఖ చేపల పెంపకంపై మాత్రమే దృష్టిపెడుతూ వస్తోంది. అయితే మార్కెట్లో రొయ్యలకు డిమాండ్ పెరగడంతో వాటి పెంపకంపై ఏడేళ్ల క్రితమే మత్స్యశాఖ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్గా 2019– 20లో జూరాల జలాశయంలో 6 లక్షల రొయ్యల సీడ్ను వదిలింది. అధికారులు, మత్స్యకారులు భావించినట్లుగానే రొయ్యల ఉత్పత్తి బాగా జరిగింది. దీనికి ప్రధాన కారణం రొయ్య బాగా పెరగడానికి జలాశయ అడుగు భాగంలో ఇసుక నేలలు ఉండటంతోపాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి మత్స్యశాఖ అధికారులు 2023– 24 వరకు ఏటా రొయ్యల సీడ్ను వదిలే సంఖ్య పెంచుతూ వచ్చారు. -
ఇప్పుడే నిప్పుల కొలిమి
● మూడురోజుల నుంచి పెరిగిన ఎండలు పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇంతలా మండుతుంటే.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతుండగా వాతావరణ కాలుష్యంతో వేడి తీవ్రత మరింత అధికమవుతోంది. జిల్లాలో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ఎండల తీవ్రత వల్ల ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకునే పనిలో ప్రతిఒక్కరూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తున్న క్రమంలో వచ్చే వారంరోజుల్లో కూలర్ల కొనుగోళ్లు అధికంగా పెరగనున్నాయి. ● ఉమ్మడి పాలమూరులో ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పీహెచ్సీల్లో అవసరమైన మందులతోపాటు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో దినసరి కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. -
గట్టు బ్లాక్ను అభివృద్ధిపరచడమే ధ్యేయం
గద్వాల: జిల్లాలోని గట్టు బ్లాక్ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రీజినల్ బెస్ట్ ప్రాక్టీస్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరపున జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి యాస్పిరేషనల్ ప్రోగ్రాంకు ఎంపికై న గట్టు మండలంలో విద్యారంగంలో అమలుచేస్తున్న వినూత్న కార్యక్రమాలను సెమినార్లో కలెక్టర్ సమగ్రంగా వివరించారు. గట్టు మండలంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండేదని, విద్యా ప్రమాణం లోపం వంటి సవాళ్లను జిల్లా పరిపాలన యంత్రాంగం గుర్తించి వాటిని అధిగమించేందుకు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమణాలు మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న పలు వినూత్న కార్యక్రమాలను సెమినార్లో ప్రస్తావించారు. జోగుళాంబ గద్వాల పరిపాలన యంత్రాంగం గట్టు బ్లాక్ చేపట్టిన ఉత్తమ కార్యాచరణను అభినందిస్తూ నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్ కలెక్టర్ రిజ్వాన్బాష షేక్కు జ్ఞాపిక అందజేశారు. -
జోగుళాంబ క్షేత్రం మహిమాన్విత శక్తిపీఠం
అలంపూర్: జోగుళాంబ అమ్మవారి క్షేత్రం మహిమాన్విత శక్తిపీఠం అని శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీస్వామి అన్నారు. విజయ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న ఆయన శనివారం ఉదయం ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చక స్వాములతో కలిసి శృంగేరి పీఠాధిపతులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతులు జోగుళాంబ ఆలయంలో శ్రీచక్రార్చనలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు చేశారు. స్థానికంగా ఉన్న కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం క్షేత్ర పరిసరాల్లోని నవ బ్రహ్మ, కంచి కామాక్షమ్మ ఆలయాలను సందర్శించి.. శిల్పకళా నైపుణ్యాలను పరిశీలించారు. అలాగే పురావస్తు శాఖ మ్యూజియానికి వెళ్లి అక్కడి ప్రాచీన శిల్పాలు, విగ్రహాలను పరిశీలించడం జరిగింది. అనంతరం జోగుళాంబ అమ్మవారి ఆలయంలో భక్తులకు ప్రవచనం చేశారు. ఎమ్మెల్యే విజయుడు శృంగేరి పీఠాధిపతులను దర్శనం చేసుకున్నారు. క్షేత్ర అభివృద్ధిపై పీఠాధిపతులకు వినతిపత్రం అందజేశారు. శృంగేరి పీఠాధిపతులు భారతీస్వామి -
గ్రామాల్లో పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత
అలంపూర్/ మానవపాడు: గ్రామాల్లో పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. అలంపూర్ మండలంలోని కాశీపురం, మానవపాడు మండల కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను ఆయన శనివారం పరిశీలించారు. ముందుగా కాశీపురంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి శుభ్రపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని, తద్వారా రీసైక్లింగ్ చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను కాల్చడం వలన వచ్చే పొగతో శ్వాస సంబంధ, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు పద్మావతి, రాఘవ, సర్పంచ్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అనుకోని అవకాశం
గద్వాల: ‘మా కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది.. మామ, అత్త, భర్త తుమ్మల నర్సింహులు కౌన్సిలర్లుగా పనిచేశారు. రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది.. ప్రజలు ఎలాంటి సమస్యలతో వస్తారు అనేది గమనిస్తూ ఉండేదాన్ని.. అయితే ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను.. చైర్పర్సన్గా అవకాశం లభిస్తుందని ఊహించలేదు..’ అని గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి అన్నారు. దీనికి ప్రధాన కారణం భర్త సంపూర్ణ సహకారంతోపాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆశీస్సులతో వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో ముఖాముఖిగా మాట్లాడారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇందుకోసం శానిటేషన్ పనులను తెల్లవారుజామునే నేరుగా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తున్నాను. బాగా పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం ఇస్తున్నా. అదేవిధంగా కొంతమంది సిబ్బంది హాజరు కాకుండా విధులకు డుమ్మా కొడుతున్నారు. వారి సమస్యలు తెలుసుకొని ఇబ్బందులు తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాను. తెల్లవారు జామునే క్షేత్రస్థాయిలోకి.. పిల్లలకు ఉన్నత విద్య.. మాది రాజకీయ కుటుంబ నేపథ్యం కావడంతో మా భర్త ఎప్పుడూ కూడా బిజీబిజీగా ఉంటారు. నాకు ఇద్దరు పిల్లలు కుమారుడు బీటెక్ పూర్తి చేసి.. చండీఘడ్లో ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా అమ్మాయి మహాలక్ష్మి బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. వీరిద్దరిపై చిన్నప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని, మంచి భవిష్యత్ ఉంటుందని చెబుతూ బాగా చదువుకునేలా చేశాను. పట్టణమే నా ఇల్లు.. మొన్నటి వరకు నా కుటుంబం, ఇల్లు మాత్రమే.. ఇప్పుడు గద్వాల పట్టణమే నా ఇల్లు. గద్వాల పట్టణాన్ని నా సొంత ఇల్లుగా భావించి అభివృద్ధి చేయాలని ఉంది. ఇందుకోసం ముందుగా పట్టణ పరిస్థితులు, అవసరాలు ఇతరత్రా వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సహకారంతో ముందుకెళ్తాను. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తాను. రాజకీయాల్లోకి వస్తా.. చైర్పర్సన్ అవుతానని ఊహించలేదు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పటిష్ట చర్యలు ఎమ్మెల్యే సహకారంతో గద్వాల అభివృద్ధికి కృషిచేస్తా చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు.. భవిష్యత్ ‘సాక్షి’తో గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి -
నేతన్నలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి
రాజోళి: చేనేత కార్మికులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నూతన ఉత్పాదకాలను మార్కెట్లోకి తీసుకురావాలని పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. శనివారం మండల కేంద్రం రాజోళిలో సెంట్రల్ సిల్క్ బోర్డు సైంటిస్టులు దీపక్ చౌహాన్, సంజయ్ గుప్తాలతో కలిసి ఎలక్ట్రానిక్ జాకాట్పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులకు మగ్గాలపై, పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ జాకాట్ల వినియోగంతో కార్మికులకు కలిగే మేలును వివరించారు. ప్రధానంగా గుంత మగ్గాలు, ఫ్రేమ్ మగ్గాలపై ఎలక్ట్రానిక్ జాకాట్లను వినియోగించడంలో కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని, ఏ మగ్గాల ౖపైనెనా ఇబ్బందులు లేకుండా ఎలా వాడాలనే విషయాలను తెలియజేశారు. ఎలక్ట్రానిక్ జాకాట్లపై 75 శాతం రాయితీ ఉందని, వాటిపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించి కార్మికులను తీర్చి దిద్దుతామని, ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గుంత మగ్గాలపై తయారు చేసిన చీరలను పరిశీలించారు. వాటిలో వాడుతున్న సిల్క్ ఇతర సామగ్రి వివరాలను అడిగి తెలసుకుని, కార్మికులతో చర్చించారు. కార్యక్రమంలో సెంట్రల్ బోర్డు టెక్నికల్ అసిస్టెంట్ అశోక్ దేశాయ్, హ్యాండ్లూమ్ డీఓ సుధారాణి, సర్పంచ్ గంగిరెడ్డి, దోత్రే నారాయణ, చేనేత కార్మికులు పాల్గొన్నారు. పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత -
నీతి ఆయోగ్ సెమినార్కు గట్టు ఎంపిక
గద్వాల: నీతి ఆయోగ్ నిర్వహించనున్న ప్రాంతీయ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్కు జిల్లా నుంచి గట్టు బ్లాక్గా ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్స్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఎంపికై న వివిధ జిల్లాల్లో నిర్దేశిత అంశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను గుర్తించి ఇతర ప్రాంతాల ప్రతినిధులతో వాటిని పంచుకునేందుకు సోమవారం విశాఖపట్నంలో నీతి ఆయోగ్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం–3 పరిధిలో మొత్తం ఆరు రాష్ట్రాలు పాల్గొంటున్నాయని, ఇందులో తెలంగాణ నుంచి గద్వాల, నిర్మల్ జిల్లాలు మాత్రమే ఎంపిక కావడం విశేషమన్నారు. ఇతర జిల్లాల నుంచి అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ గట్టు బ్లాక్లో విద్యారంగంలో అమలుచేస్తున్న కార్యక్రమాల గురించి సెమినార్లో తెలియజేసేందుకు గట్టు బ్లాక్ ఎంపిక కావడం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగే ఈ సెమినార్లో గట్టు బ్లాక్లో విద్యారంగం సాధించిన ప్రగతిపై ఇతర రాష్ట్రాలతో పంచుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. సెమినార్లో తాను ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గట్టు మండలం గతంలో విద్యారంగంలో తక్కువ అక్షరాస్యత, విద్యార్థుల డ్రాప్ అవుట్స్, పాఠశాలల్లో టీచర్ల కొరత, తక్కువ ఫలితాలు వంటి సమస్యలు ఉండేవన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గత రెండేళ్లుగా విద్యా వలంటీర్ల నియామకం, సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు, మోడల్ పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. గట్టు, కేటీదొడ్డి మండలాల్లో బాలకార్మిక వ్యవస్థ నిరోధక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 9–12వ తరగతి విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్, ప్రేరణాత్మక కార్యక్రమాలు, డ్రాప్అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడం మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. భవిష్య భారత్, టీచ్ఫర్ చేంజ్, ఎంవీ ఫౌండేషన్ తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఉదయం పోషకాహార కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా విద్యార్థులలో చదువుపై ఆసక్తి పెరిగి డ్రాప్అవుట్స్ తగ్గిపోయాయన్నారు. అంతేకాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో వారు పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. పదో తరగతి ఫలితాలు గణనీయంగా మెరుగైనట్లు వివరించారు. దీనికి విద్యాశాఖ, విద్యార్థుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధుల కృషి కారణమన్నారు. -
ఎవరినీ ఉపేక్షించం..
జిల్లాలో రేషన్ బియ్యం దందాపై ప్రత్యేక నిఘా ఉంచాం. వ్యూహాత్మకమైన చర్యలతో వ్యాపారులు, డీలర్లు ఎవరనే అంశాలపై నివేదిక ద్వారా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. సిబ్బంది నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా, నిల్వలు ఉన్నట్లు తెలిస్తే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. గతంలో నమోదైన కేసులు, వ్యాపారులు, సహకరించిన వ్యక్తులెవరు అనే కోణంలో నిఘా ఉంచాం. బియ్యం కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల● -
సామాజిక మార్పుతోనే విజయం
గద్వాల క్రైం: తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుతోనే ప్రతి మహిళా అన్నిరంగాల్లో విజయం సాధిస్తుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో మహిళా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసు శాఖలో మహిళా సిబ్బంది కోసం మరిన్ని సంస్కరణలు అవసరమన్నారు. ఇంటా, బయటా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై లైంగిక దాడి లాంటి సమస్యల వలయంలో ఎందరో చిక్కుకున్నారని, ఇలాంటి వాటిపై ప్రతిఒక్కరు చైతన్యం కావాలని కోరారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం నిర్వహించడం కంటే ప్రతిక్షణం లింగ వివక్ష లేకుండా అందరూ సమానమేనని గుర్తిస్తే ఎంతో బాగుంటుందన్నారు. మారుతున్న కాలానుగుణంగా సామాజిక మార్పుతో విజయాలు సాధిస్తామన్నారు. జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోలీసు శాఖ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పలు విషయాలపై సలహాలు అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు, ఎస్ఐలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
తొలిరోజు పరిశుభ్రత కార్యక్రమాలు
గద్వాల: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం జిల్లావ్యాప్తంగా మొదలైంది. కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అధికారులు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు కార్యక్రమంలో గ్రామ పంచాయతీలలో సర్పంచులు, కార్యదర్శులు, మున్సిపాలిటీలలో చైర్మన్లు, కమిషనర్లు, మండలాల పరిధిలో రెవెన్యూ శాఖకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలు, వార్డులలో ర్యాలీలు నిర్వహించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. 99 రోజులపాటు నిర్దేశించిన షెడ్యూల్డ్ ప్రకారం 10 ముఖ్య అంశాలలో పరిశుభ్రత కార్యక్రమంతో మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అన్ని శాఖలలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 15వ వరకు పరిశుభ్రత కార్యక్రమంతోపాటు పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇదివరకే శాఖల వారీగా ఉన్న పెండింగ్ ఫైళ్లపై కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మార్చి నెల ముగిసేలోపు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి నిర్దేశించిన లక్ష్యం సాధించేలా అవరమైన చర్యలు చేపడుతున్నారు. -
జోగుళాంబ క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి
అలంపూర్: పట్టణంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతికి అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పీఠాధిపతులు అలంపూర్కు వచ్చారు. క్షేత్రానికి చేరుకున్న పీఠాధిపతులకు అర్చక స్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీజోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పీఠాధిపతులకు పాదుకా పూజలు నిర్వహించారు. అనంతరం శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతిస్వామి ఆలయ ప్రాంగణంలోని కుంకుమార్చన మండపంలో చంద్రమౌలీశ్వర ఆరాధన, శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. ఉదయం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
‘ఖిల్లా’ ఎంపీడీఓకు సైతం..
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల ఎంపీడీఓ విజయసింహారెడ్డి సివిల్స్లో మెరిశారు. హైదరాబాద్లోని మనికొండలో నివాసం ఉంటున్న అంజిరెడ్డి, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రంసింహారెడ్డి ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి గ్రూప్–1లో కొలువులు సాధించాడు. ఇప్పుడు కూడా అన్న విజయసింహారెడ్డి సివిల్స్లో ఆలిండియా 682వ ర్యాంక్ సాధించగా.. ఆయన తమ్ముడు విక్రమ్సింహారెడ్డి కూడా 541 ర్యాంక్ సాధించారు. విషయం తెలిసిన వెంటనే ఖిల్లాఘనపురంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది విజయసింహారెడ్డికి స్వీట్లు తినిపించి.. అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీ నాయకులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ
పట్టుదలతో చదివి ర్యాంకులు.. నిజాలాపూర్ గ్రామానికి చెందిన మునుగల్ఛేడ్ సత్యయ్య, యశోద దంపతుల కుమారుడైన ఎం.వెంకటేష్ ప్రసాద్ హైదరాబాద్లోని పటాన్చెరువు శ్రీసాయి పబ్లిక్ స్కూల్లో 1, 2వ తరగతులు, 3వ తరగతి కొత్తకోటలోని జీటీ నారాయణ, 4 నుంచి 10వ తరగతి వరకు మహబూబ్నగర్లోని చైతన్య సెంట్రల్ స్కూల్లో చదివారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ ఫిజిక్స్), పీజీ పూర్తి చేశారు. వెంకటేష్ ప్రసాద్ తండ్రి సత్యయ్య ప్రస్తుతం కోయిలకొండ మండలంలో ట్రాన్స్కో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి యశోద గృహిణి. వీరు మహబూబ్నగర్లోని శేషాద్రినగర్లో నివాసముంటున్నారు. గతేడాది సివిల్స్లో 700వ ర్యాంకు సాధించిన వెంకటేష్.. ఈసారి సత్తా చాటి 358వ ర్యాంక్ పొందాడు. 2025లో విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాదించాడు. గతేడాది సెప్టెంబర్ 27న డిప్యూటీ కలెక్టర్గా ఉత్తర్వు అందుకున్న ఆయన అదేనెల 29న నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్లో గ్రూప్–1 అధికారుల శిక్షణలో ఉన్నాడు. ‘ఐఏఎస్ సాధించడమే లక్ష్యం. మరోసారి ప్రయత్నించి.. ఐఏఎస్ సాధిస్తా.’ అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు వెంకటేష్ ప్రసాద్. -
నిద్దరోతున్న నిఘా..
జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం తరలింపు ● డీలర్లు.. వ్యాపారులే మాఫియాగా దందా ● మామూళ్ల మత్తులో తూగుతున్న సివిల్ సప్లయ్ శాఖ? ● అడపాదడపా పోలీసుల తనిఖీల్లో పట్టివేత ● గతేడాది 985.8 క్వింటాళ్ల బియ్యం సీజ్గద్వాల క్రైం: పేదోడి బియ్యంపై అక్రమార్కులు పెత్తనం చెలాయిస్తున్నారు. నెలనెలా చౌకధర దుకాణాల నుంచి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సరఫరా చేస్తుంది. అయితే డీల్లరు, వ్యాపారులే మాఫియాగా మారి లబ్ధిదారులకు కిలో రూ.12 చొప్పున చెల్లించి.. వ్యాపారులకు రూ.20కి విక్రయించి.. అక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు రూ.30 చొప్పున యథేచ్ఛగా తరలిస్తున్నారు. అయితే దీనిని ఆదిలోనే నిలువరించాల్సిన సివిల్ సప్లయ్ శాఖలోని కొందరు అక్రమార్కులు మామూళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు శాఖ చేపడుతున్న తనిఖీల్లో అడపాదడపా అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుబడుతోంది. జిల్లాలో గతేడాది 985.8 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేయగా.. ఈ సంవత్సరం 70 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు.. గద్వాల జిల్లాలో నిత్యం వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీసుల తనిఖీలో పట్టుబడుతున్నాయి. అయితే మాఫియా చేతుల్లో ఎన్ని వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం రాష్ట్రాలు దాటి బయటి మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయో చెప్పలేని దుస్థితి ఉంది. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యాపారులు సైతం ఇదే రూట్లో అధికారుల కళ్లకు గంతలు కట్టి తరలిస్తున్నారు. సివిల్ సప్లయ్, ఎన్ఫోర్సుమెంట్ విఫలమైతే విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ప్రతినెలా మాఫియా ఆయా శాఖల అధికారులకు మామూళ్లు ఇస్తుండటంతో చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసుల తనిఖీలో పట్టుబడితే తప్ప రేషన్ బియ్యం మాఫియాను కట్టడి చేయడం లేదు. పూర్తిస్థాయిలో విచారణకు పోలీసు యంత్రాంగం అడుగులు వేస్తే మాఫియాను నిలువరించేందుకు దోహదం పడుతుంది. గతంలో పలువురు రైస్ మిల్లర్లు పెద్దఎత్తున్న అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు తెలియడంతో పలు మిల్లులు సీజ్ అయిన సంఘటనలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో డీటీ స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో అక్రమార్కులు వివిధ రూట్లలో వ్యాపారం చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
● 99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. ● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో తాగునీటి సమస్యను ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉందని, ఇందుకు గాను ముందుగానే అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందిన వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని సూచించారు. లబ్ధిదారుల జాబితా, నోడల్ అధికారుల జాబితా, దరఖాస్తుల వివరాలను అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. 46 లక్షల మంది మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఒక్కోరోజు తాను పాల్గొంటానని పేర్కొన్నారు. ఇందులో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయని, 99 రోజుల కార్యక్రమానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సైతం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. అటవీ పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల సమావేశాలు నిర్వహించేలా చూస్తామన్నారు. అందరూ చొరవ తీసుకోవాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదటిరోజు నుంచి చివరి వరకు అదే ఉత్సాహంతో నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. 99 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని, కలెక్టర్లు, అధికారులు చొరవ తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్బాషా షేక్, నారాయణపేట అదనపు కలెక్టర్ ఫణీంద్రరెడ్డి, మహబూబ్నగర్ మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ఆయా జిల్లాల ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ప్రచార వాల్పోస్టర్లు, టీషర్ట్లను ఆవిష్కరించారు. -
విద్యార్థుల భవిష్యత్కు ‘పదో తరగతి’ కీలకం
గద్వాల: విద్యార్థుల భవిష్యత్కు పదో తరగతి ఎంతో ముఖ్యమైనదని, ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఇదొక కీలక దశ అని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో పదో తరగతి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల నిపుణులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలో వచ్చిన మార్కులను పరిశీలించగా అధిక శాతం గణితం, హిందీ, తెలుగు సబ్జెకులలో తక్కువ మార్కులు వచ్చాయన్నారు. అలాగే ఆయా సబ్జెక్టులలో విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించడం జరిగిందన్నారు. ఈ నెల 14 నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానుండటంతో ప్రధానంగా సీ, డీ కేటగిరిలలో ఉన్న విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల నుంచి అడిగే ముఖ్యమైన అంశాలను తెలియజేసేందుకు నిపుణులచే అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. పరీక్షలకు చాలా తక్కువ సమయం ఉండడంతో సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. గతేడాది 2024– 25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 26వ స్థానం, 2023– 2024 విద్యా సంవత్సరంలో 31 స్థానంలో ఉందన్నారు. ఈసారి మన జిల్లా కనీసం టాప్–15లో ఉండేలా ఫలితాలు రావాలంటే ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షకు నాలుగైదు రోజులు ఖాళీ ఉండడంతో ఆ సమయంలో వివిధ సబ్జెక్టులోని ముఖ్యమైన ప్రశ్నల గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు కూడా తప్పనిసరిగా పరీక్షల మధ్యన వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా సాధన చేయాలన్నారు. అలాగే ఒత్తిడి, భయాన్ని వీడి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. ఇందుకోసం ధ్యానం చేయాలని, పరీక్షలు ముగిసే వరకు సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, తగినంత నిద్రపోవాలని సూచించారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీకాంత్, సెక్టోరియల్ అధికారి మైఖేల్, ఆయా సబ్జెక్టు నిపుణులు పాల్గొన్నారు. -
10 అంశాలు.. 99 రోజులు
‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’కు సిద్ధం చర్చకు వచ్చే అంశాలు.. గ్రామ సభల్లో రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, గృహజ్యోతి, సోలార్ పంప్లు, మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణ, హెచ్పీవీ వేక్సినేషన్, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, సన్న ధాన్యానికి బోనస్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మహాలక్ష్మి, ఆదర్శ పాఠశాలలు, నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వంటి తదితర పథకాల అమలు, లోపాలపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో రెండేళ్ల ప్రగతి నివేదికను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ప్రభుత్వ శాఖల వారీగా సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. తాజా సభల్లో వచ్చిన వాటిని సైతం పొందుపరిచి.. రాష్ట్ర స్థాయి అధికారులకు అందజేసే కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యాచరణను పకడ్బందీగా నిర్వహించేలా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల వారీగా అధికారులతో పలు పర్యాయాలు సమీక్షించారు. గురువారం సైతం కలెక్టర్ కార్యాలయాల్లో సమావేశం నిర్వహించి లోటుపాట్లు లేకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలు, జాగ్రత్తలను వివరించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: హామీల అమలు, ‘అధికార’ యంత్రాంగం పనితీరును మెరుగు పర్చడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిని ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పది అంశాల (థీమ్)ను ప్రాధాన్యతగా తీసుకుని 99 రోజుల ప్రణాళికతో సర్కారు సూచించిన కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిరోజు శుక్రవారం తొలుత మహబూబ్నగర్ జిల్లాలోని సమీకృత కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఉదయం సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి పాలమూరులోని ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఐదు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తదితర అధికారులు హాజరుకానున్నారు. సన్నాహక సమావేశం అనంతరం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పురపాలికలు, పంచాయతీల పరిధిలో పరిసరాల పరిశుభ్రత.. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నోడల్ అధికారులుగా అదనపు కలెక్టర్లు.. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో ఎంచుకున్న పది ప్రధాన అంశాల్లో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ఆయా శాఖల కు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్లను ప్రభుత్వం నోడల్ అధికారులుగా నియమించింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మండల స్థాయిలో ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించారు 5 దశల్లో సభలు.. 99 రోజుల పాటు ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ఐదు దశల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యమయ్యేలా సభలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ రెండో తేదీన గ్రామస్థాయిలో, 16న మండలస్థాయిలో, మే రెండో తేదీన నియోజకవర్గ, 22న జిల్లా, జూన్ 2న రాష్ట్రస్థాయిలో సభల నిర్వహించేలా అధికారులు ముందుకుసాగుతున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో జరిగే సభల్లో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉన్నవాటిపై తగిన చర్యలకు ఉపక్రమించనున్నారు. కొత్త రేషన కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి ఆయా పథకాలకు కొత్త లబ్ధిదారుల వివరాల నమోదుతోపాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. కాగా, ఇటీవల ఎన్నికై న సర్పంచ్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు/చైర్పర్సన్లకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక ఉద్దేశం, ప్రాధాన్యంపై అవగాహన కల్పించేలా ఈ నెల 12న ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.9,289 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మా ర్కెట్ యార్డుకు గురువారం 756 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.9,289, కనిష్టంగా రూ.3,149, సరాసరిగా రూ. 8,072 పలికాయి. అలాగే 7 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,129, కనిష్టంగా రూ.5,829 వచ్చాయి. కా,/ము: కార్పొరేషన్ /మున్సిపాలిటీ మార్చి 6 నుంచి 15 పరిసరాల పరిశుభ్రత.. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ ఏప్రిల్ 13 నుంచి 18 రోడ్డు భద్రత మే 11 నుంచి 16 వరకు విద్య, అభివృద్ధి ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత.. డ్రగ్స్ నియంత్రణ మే 25 నుంచి 30 వరకు మహిళల సాధికారత ఏప్రిల్ 20 నుంచి 26 సంక్షేమ పథకాలు మే 18 నుంచి 23 వరకు యువత.. క్రీడలు జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణ పరిరక్షణ మే 4 నుంచి 10 వరకు వ్యవసాయం.. రైతు సంక్షేమం ఏప్రిల్ 6 నుంచి 11 ఆరోగ్యం 10 ప్రధాన అంశాలు ఇవే.. నేడు పరిసరాల పరిశుభత్ర..ఫైళ్ల క్లియరెన్స్తో శ్రీకారం ప్రారంభించనున్న ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర హాజరుకానున్న మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి సైతం.. జూన్ 12 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు జిల్లా, మండల స్థాయిలో పర్యవేక్షణకు నోడల్ అధికారుల నియామకం -
వట్టెం వెంకన్న కల్యాణం
కనులపండువగా.. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య వట్టెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం అలివేలుమంగ, గోదాదేవి సమేత వెంకన్నల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంతనర్సింహారెడ్డి, ఉప్పల కృష్ణయ్య దంపతులు సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలతో ప్రధాన అర్చకులు సముద్రాల శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం కల్యాణతంతు జరిపించారు. వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. – బిజినేపల్లి -
‘మిర్చి బస్తాలు మాయం’పై కేసు నమోదు
మానవపాడు: ఏపీలోని గుంటూరు లీలగాయత్రి కోల్డ్ స్టోరేజ్లో మండల కేంద్రానికి చెందిన రైతులు నిల్వ ఉంచిన మిర్చి బస్తాలు మాయం చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ స్వామి తెలిపారు. స్థానిక రైతులు సాయిబాబ, నాగశేషి, బజారి, రాముడు, విజయ్, నాగరాజు, రమేష్ 2023 సంవత్సరంలో సూపర్–10 రకం మిర్చి 1,357 బస్తాలు లీలగాయత్రి కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచగా.. రైతుల ప్రమేయం లేకుండా సదరు యాజమాన్యం శివరామకృష్ణ, ఏజెంట్ వెంకటేశ్వర్లు మిర్చిని అమ్ముకున్నారు. ఈ ఘటనపై ‘సాక్షి’లో ‘దాచుకుంటే.. దోచుకున్నారు!’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకున్నారు. మోసపోయిన రైతులు గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కోల్డ్ స్టోరేజీ యజమాని శివరామకృష్ణ, ఏజెంట్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నోటమాట రావట్లే..!
ధరలు లేక రైతన్నల ఆవేదన ● కొన్నిరోజులుగా కిలో రూ.5 మించని రేటు ● అదనపు భారంగా మారిన కూలీలు, మార్కెట్కు తరలింపు వ్యవహారం ● ఆరుగాలం శ్రమించి జీవాలకు వదిలేస్తున్న వైనం ● జిల్లాలో చాలా వరకు తోటల తొలగింపు ●సాగు పెరగడం వల్లే.. యాసంగి సీజన్లో టమాట బాగా పండింది. స్థానికంగా సాగైన టమాటతోపాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, ప్రధానంగా మదనపల్లి నుంచి ఇక్కడి మార్కెట్కు బాగా వస్తోంది. పంట సాగు విస్తీర్ణం బాగా ఎక్కువ అయ్యింది. దీని వల్లే ధరలు పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖాధికారి పంట తీసివేశా.. అర ఎకరాలో టమాట వేశాను. జనవరి మూడో వారంలో పంట చేతికి వచ్చింది. ఆ నెలలో కొంత రేట్లు వచ్చాయి. ఫిబ్రవరిలో తగ్గాయి. గత కొద్ది రోజుల నుంచి కనీసం కూలీల, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రాలేదు. చేసేది లేక పంట తీసివేశా. – సుదర్శన్రెడ్డి, రైతు, గద్వాల టమాట రైతులు విలవిలలాడుతున్నారు. ధరలు రాక అల్లాడుతున్నారు. కనీసం టమాట తెంపిన కూలీలు, మార్కెట్కు తీసుకెళ్లే రవాణా చార్జీలు కూడా రాక.. తాము ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొంతమంది రైతులు జీవాలకు వదిలేస్తే.. మరికొంత మంది తమ చేతులతోనే తొలగిస్తున్నారు. గడిచిన ఏడాది కూడా ఈ సమయంలో ఇలానే ధరలు పడిపోయి ఆర్థికంగా నష్టపోగా.. అవే పరిస్థితులు ఈసారి కూడా దాపురించాయని ఆవేదనకు లోనవుతున్నారు. మార్కెట్లో లభిస్తున్న ధరలు చూసి తమకు నోటమాట రావడం లేదని వాపోతున్నారు. – గద్వాల వ్యవసాయం నడిగడ్డలో ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో బోర్లు, బావుల కింద టమాట పండిస్తున్నారు. ధరూరు, మల్దకల్, గద్వాల, ఇటిక్యాల, అయిజ, వడ్డేపల్లి, మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. టమాట విత్తిన నాటి నుంచి 55– 60 రోజులకు పంట చేతికి వస్తుంది. ఎకరాకు కనీసం రూ.15–18 వేల వరకు ఖర్చు అవుతోంది. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత టమాట తెంపడానికి ఒక కూలీకి రోజుకు రూ.400, మార్కెట్కు తీసుకెళ్లడానికి ఒక బాక్స్కు దూరాన్ని బట్టి రూ.20–40 వరకు వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత యాసంగి సీజన్లో 372 ఎకరాల్లో ఇక్కడి రైతులు టమాట సాగు చేశారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో 20 కిలోల టమాటల బాక్సుకు రూ.50–120 ధర చెల్లిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నెల ధర (రూ.లలో..) డిసెంబర్ 600– 700 జనవరి 400– 500 ఫిబ్రవరి 150– 200 మార్చి 50– 120 -
ధరలు.. నేలచూపు
చేతికి వచ్చిన పంటను డిసెంబర్ నుంచి విక్రయించడానికి మార్కెట్కు టమాటను తీసుకెళ్లారు. ఇదే సమయంలో కర్నూలులోని పత్తికొండ, దేవనకొండ, ఆలూరు, ఆస్పరి, ప్యాపిలి, చిత్తూరు జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి ఇక్కడి హోల్సేల్ మార్కెట్కు దిగుమతి అవుతోంది. అక్కడి టమాటకు తోడు ఇక్కడి రైతులు పండించిన టమాట కూడా మార్కెట్కు వస్తోంది. అయితే డిసెంబర్లో ఓ మాదిరి ధరలు వచ్చాయి. జనవరిలో కొంత తగ్గగా.. ఫిబ్రవరిలో మరికొంత.. ప్రస్తుత మార్చి నెలలో పూర్తిగా పడిపోయాయి. కొంతమంది టమాట తెంపిన ఖర్చులు కూడా రాావని చేలల్లోనే పారబోశారు. ఇంకా కొంతమంది టమాట చేనును జీవాలకు వదిలేశారు. ధరలు రాక టమాట ఆర్థికంగా నష్టపోతున్నామని, తమకు తెంపిన కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. గడిచిన ఏడాది కూడా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇదే పరిస్థితి ఎదురై ఆర్థికంగా నష్టపోయామని.. ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వేతన వెతలు
మానవపాడు: మండల పరిషత్ కార్యాలయాలు, పంచాయతీ క్లస్టర్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. వీరికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో ధ్రువపత్రాల జారీ, పంచాయతీ ఆదాయ, వ్యయాలు, పన్నుల వసూళ్లు, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలు, గృహ నిర్మాణాలకు అనుమతులు తదితర పనులను ఈ–పంచాయతీ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. వీరికి నెలనెలా వేతనం అందించకపోవడంతో పాటు వచ్చే అరకొర జీతంలోనూ కోత పెడుతుండటంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మండలానికో ఆపరేటర్.. జిల్లాలోని 13 మండలాల్లో 284 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల పరిషత్ కార్యాలయాల్లో 13 మంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. పంచాయతీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం.. ధ్రువపత్రాల జారీ నుంచి ప్రభుత్వ పథకాల దరఖాస్తుల నమోదు తదితర పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఆపరేటర్లకు వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదు నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే మార్చిలోనూ వేతనాలు చెల్లించకపోతే సమ్మెబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇచ్చే వేతనంలోనూ కోత.. ఈ–పంచాయతీ ఆపరేటర్లకు గతంలో నెలకు రూ. 22,750 చొప్పున ఆయా పంచాయతీల నుంచి ఎంపీడీఓలు సర్దుబాటు చేశారు. అయితే ప్రభుత్వం గతేడాది జూన్ నుంచి రూ.3,250 కోత విధించి.. రూ. 19,500 చెల్లిస్తుంది. అది కూడా ప్రతినెలా కాకుండా రెండు, మూడు నెలలకోసారి చెల్లిస్తుండటంతో ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి నేటి వరకు వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఈ–పంచాయతీ ఆపరేటర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. ఈ–పంచాయతీ ఆపరేటర్లకు ఐదు నెలలుగా అందని జీతాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం పెండింగ్ వేతనాలు చెల్లించాలని వేడుకోలు -
జోగుళాంబ సన్నిధిలో రాజస్తాన్ హైకోర్టు జడ్జి
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రాన్ని బుధవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజతో కలిసి రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ యాగేంద్రకుమార్ పురోహిత్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి, వేద ఆశీర్వచనం పలికారు. న్యాయమూర్తుల వెంట స్థానిక తహసీల్దార్ ప్రభాకర్, ఆలయ అధికారి ప్రదీప్, కోర్టు సిబ్బంది చిన్న రాజు ఉన్నారు. డిజిటల్ క్రాప్ సర్వేవేగవంతం చేయాలి ఉండవెల్లి: డిజిటల్ క్రాప్ సర్వేను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు. బుధవారం ఉండవెల్లి, భైరాపురం, డి.బూడిదపాడు, పుల్లూరు గ్రామాల్లో డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. వలంటీర్లు క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించి పంటల వివరాలను నమోదు చేయాలన్నారు. ప్రతి క్లస్టర్లో వలంటీర్ల సర్వే తీరును ఏఈఓలు, ఏఓలు పరిశీలించాలని సూచించారు. అదే విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హచ్చరించారు. అనంతరం అలంపూర్ చౌరస్తాలో మన గ్రోమర్ సెంటర్లో ఎరువుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. డీఏఓ వెంట ఏఓ అనిత, ఏఈఓ హసినా ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.9,341 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 663 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,341, కనిష్టంగా రూ. 4,329, సరాసరి రూ. 6500 ధర పలికింది. అదే విధంగా 7 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,236, కనిష్టంగా రూ. 6,829, సరాసరి రూ. 6886 ధర లభించించి. 23 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టం రూ. 6,129, కనిష్టంగా రూ. 5,619, సరాసరి రూ. 6,019 ధర పలికింది. -
గుడ్డెందొడ్డి.. అప్గ్రేడ్
● రిజర్వాయర్ సామర్థ్యం 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు అనుమతులు వచ్చాయి.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్వే పనులు మొదలుపెట్టాం. ఇందుకోసం రూ.16 లక్షలు విడుదలయ్యాయి. పనులు వేగవంతంగా పూర్తిచేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి డీపీఆర్ను సమర్పిస్తాం. – రహీముద్దీన్, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 9 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టుకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ, ఇదే ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్లో మాత్రం ఆయకట్టుకు నీటి కష్టాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించిన సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్లో సాగయ్యే ఆయకట్టుకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. 120 రోజులపాటు వరద గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకొనే వెసులుబాటు లభిస్తుంది. వరద సమయంలో రోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా ప్రణాళిక ఈ నెల చివరి నాటికి డీపీఆర్ సిద్ధం చేసేలా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతున్నసర్వే పనులు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు తీరనున్న సాగునీటి కష్టాలు -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై నిర్లక్ష్యం చేయెద్దు ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: జిల్లాలో ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 90 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని.. అన్నిశాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమావేశమై ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి.. 99 రోజుల కార్యక్రమాలపై పక్కా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. భూ భారతి, ట్రేడ్ లైసెన్స్, భవన నిర్మాణాల అనుమతులు తదితర దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల సన్నాహాకం, పాఠశాలల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. సీ, డీ కేటగిరీల్లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలతో సాధన చేయించి.. విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా పరీక్షలకు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ సమావేశమై.. వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి వివిధ అంశాలను తెలియజేస్తూ, ప్రేరణ కలిగించారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి.. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్కు ఎంతో ముఖ్యమని.. ఇందులో మంచి మార్కులు సాధిస్తే భవిష్యత్లో ఉన్నత చదువులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, హెచ్ఎం రేణుకాదేవి పాల్గొన్నారు. -
రూ.5– 6 వేల కోట్ల వ్యయం..
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించి 14,700 ఎకరాల్లో చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు రూ.5– 6 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇది వరకే ఈ రిజర్వాయర్ను 1,400 ఎకరాలలో నిర్మించారు. సామర్థ్యం పెంచేందుకు అదనంగా మరో 700 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీంతో రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ● గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నింపిన నీటిని తిరిగి జూరాల ప్రాజెక్టు రిజర్వాయ ర్కు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండడం రాష్ట్రంలోనే తొలిసారి. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ -
ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు
మానవపాడు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని జల్లాపురంలో బుధవారం అడిషనల్ కలెక్టర్, డీఆర్డీఓ నర్సింగ్రావు, డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయితో కలిసి ఆయన పల్లె దవాఖానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పల్లె దవాఖానాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నందిని, డిప్యూటీ డీఎంహెచ్ఓ సిద్దప్ప, ప్రోగ్రాం ఆఫీసర్లు మహ్మద్ అలీ, యూకుబ్ బాషా, డీఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, డీపీహెచ్ఎన్ఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. రంగనాథుడి రథోత్సవం
● మార్మోగిన గోవింద నామస్మరణ ● భారీగా తరలివచ్చిన భక్తజనం ● పాల్గొన్న ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఎమ్మెల్యే తదితరులు వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 11.30 గంటలకు అశేష జనవాహిని నడుమ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా వివిధ రకాల రంగురంగుల పూలు, మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో రథాన్ని ముస్తాబు చేశారు. వనపర్తి సంస్థానాధీశుడు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా కృష్ణదేవరావు, ఆయన కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకుడు విష్ణునారాయణశర్మ పర్యవేక్షణలో వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం నుంచి రథం వద్దకు తీసుకొచ్చి ఆసీనులు చేశారు. సంస్థానాధీశుడు రాజా కృష్ణదేవరావు టెంకాయ కొట్టగా ఆయనతో పాటు వారి కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే భక్తులతో కలిసి రథాన్ని ప్రధాన ఆలయం నుంచి గోదాదేవి ఆలయం వరకు లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు, వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు రథం ముందు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. సాయంత్రం భక్తులు రథాన్ని తిరిగి ఆంజనేయస్వామి ఆలయం వరకు, అటు నుంచి రథశాలకు చేర్చారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీరంగాపురం సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన మంగలి నారాయణదాస్ జ్ఞాపకార్థం వారి కుమారులు ఎన్.జయప్రకాష్ కుటుంబసభ్యులతో కలిసి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయ ఆవరణలో వెలిసిన మిఠాయిలు, బొమ్మలు, గాజుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాంబు, ఎస్ఐ హిమబిందు సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మద్దిలేటి, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వెంకటయ్య యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సంబంధం లేకున్నా బలిచేశారు..
వాస్తవానికి నేను ఆర్ఎంఓను కాదు. నన్ను ఆర్ఎంఓగా పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయాను. ఘటన చోటుచేసుకున్న సోమవారం రోజు నా డ్యూటీ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లా. డ్యూటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రి నుంచి వచ్చేశాను. మార్చురీలో జరిగిన సంఘటన నాకు తెలియదు. ఆ సమయంలో నేను ఆన్డ్యూటీలో కూడా లేను. జరిగిన ఘటన బాధాకరమే.. అయినా నా నిర్లక్ష్యం లేకున్నా నాపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయం. దీన్ని మా డాక్టర్స్ యూనియన్ దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నతాధికారులు మరోసారి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. – డాక్టర్ ఎస్.హరినాథ్, సీఏఎస్ (పీడియాట్రిషన్) జడ్చర్లలో కొత్తగా నిర్మించిన వంద పడకల ఆస్పత్రి -
పూర్తిస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ..
జడ్చర్ల పట్టణంలోనే బాదేపల్లిలో 30 పడకల ఆస్పత్రి ఉండేది. దీన్ని బీఆర్ఎస్ హయాంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కల్వకుర్తి రోడ్డులో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనంలోకి మార్చారు. ప్రారంభ సమయంలో మార్చురీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాదేపల్లి ఆస్పత్రి పరిధిలోని మార్చురీలోనే మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాలను సైతం అక్కడే భద్రపరుస్తున్నారు. కిలోమీటరున్న దూరంలో ఉండగా.. పర్యవేక్షణ కొరవడడంతో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ముందుగా బాదేపల్లిలో మార్చురీ, ఆ తర్వాత కల్వకుర్తి రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి, మార్చురీని సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్చురీలో ఉన్న మూడు ఫ్రీజర్లను పరిశీలించారు. మార్చురీ నిర్మాణం పూర్తయి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. పాత ఆస్పత్రినే పోస్టుమార్టం నిర్వహించడంపై అధికారులు, డాక్టర్లకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఆస్పత్రి నిర్వహణ, వైద్యుల పనితీరు సరిగ్గా లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే దానికి అద్దం పడుతోంది. -
గట్టులో భూ మాయ
గట్టు: మండల కేంద్రమైన గట్టులో భూ మాయ వ్యవహారం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న అసలు భూ యజమాని మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని రాయాపురం గ్రామానికి చెందిన తిమ్మప్పకు గ్రామ శివారులోని సర్వే నంబర్ 81/8లో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే తిమ్మప్ప సుమారు 15 ఏళ్ల క్రితం చనిపోవడంతో అతడి భార్య సువర్ణ బతుకుదెరువు నిమిత్తం జడ్చర్లకు వెళ్లింది. ఈ క్రమంలోనే తారాపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి ఆధార్తో సదరు భూమికి లింకు చేశారు. కొన్నాళ్లకు తిమ్మప్ప చనిపోగా.. 2024లో ఆ భూమిని అతడి కుమారుడు సంకటి ముణెప్పకు వారసత్వంగా బదిలీ చేశారు. ఆ తర్వాత గట్టులో ఆన్లైన్ సర్వీస్ సెంటర్ నిర్వహించే లక్ష్మణ్ అనే వ్యక్తి సంకటి ముణెప్పకు రూ. 50వేలు చెల్లించి.. గత ఫిబ్రవరిలో ఆ భూమిని తాను కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి తన పేరున తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ వ్యవహారంలో ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు లక్ష్మణ్తో పాటు తారాపురం గ్రామ సర్పంచ్ భర్త కీలకంగా వ్యవహరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికారులతో వాగ్వాదం.. అక్రమ భూ బదలాయింపు వ్యవహారం బయట పడటంతో బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులను వెంటపెట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భర్త పేరున ఉన్న భూమిని తనకు తెలియకుండా వేరే వ్యక్తుల పేరుపై ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ.. బాధితురాలు సువర్ణ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ భూమిని అక్రమంగా తన పేరుపైకి మార్చుకున్న లక్ష్మణ్పై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పోలీస్స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న లక్ష్మణ్ తరఫు వారు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ● ఈ వ్యవహారంపై తహసీల్దార్ విజయ్కుమార్ను వివరణ కోరగా.. అసలైన వారసులం తామే అని చె బుతున్న రాయాపురం సువర్ణ ఇప్పటి వరకు సరైన ఆధారాలను సమర్పించలేదని తెలిపారు. ఈ విషయంపై తాము పూర్తి విచారణ చేస్తామని.. మోసం జరిగినట్లు తేలితే సదరు వ్యక్తులపై క్రిమనల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సరైన పత్రాలు ఉంటే ఆర్డీఓ అప్పీలు ద్వారా భూ బదలాయింపును రద్దు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఒకరి భూమికి మరొకరి ఆధార్ లింకు నకిలీ పత్రాలతో భూ బదలాయింపు.. ఆపై విక్రయం! అసలు భూ యజమానికి తెలియడంతో అధికారులకు ఫిర్యాదు -
మాజీ ఎమ్మెల్యేకు నివాళి
గద్వాల: మాజీ ఎమ్మెల్యే ఉప్పల గోపాల్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని సీనియర్ సిటీజన్ సంఘం నాయకులు నాయకులు వైండింగ్ రాములు, మోహన్రావు, భీంసేన్రావు అన్నారు. మంగళవారం గోపాల్రెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్, రమేష్గౌడ్, అచ్చన్నగౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో అశ్వవాహనసేవ అడ్డాకుల: మండలంలోని కందూర్లో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారికి అశ్వవాహనసేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయం ముందున్న చిన్న తేరును పూజారులు శుద్ధి చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూజారులు తీసుకువచ్చి చిన్న తేరుపై ఉన్న అశ్వవాహనంపై అలంకరించారు. ఈ సందర్భంగా తేరు ముందు పండితులు హోమం నిర్వహించారు. భక్తులంతా కలిసి తేరును జయజయధ్వానాల మధ్య కొద్ది దూరం వరకు తీసుకెళ్లి అశ్వవాహనసేవ ముగించారు. మంగళవారం ఉదయం చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని మూసి ఉంచారు. రాత్రి 7 గంటల తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. తర్వాత స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, బలిహరణ తదితర పూజలు జరిపించారు. గ్రామంలో ఉన్న స్వామివారి వెండి ముఖం, నాగపడగలను రాత్రి పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ప్రధాన ఆలయంలో శివలింగానికి వెండి ముఖం, నాగపడగను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. -
‘సంత’ర్పణం..!
వనపర్తి: దక్షిణ తెలంగాణలో అత్యంత ఆదాయం సమకూరే పెబ్బేరు సంతపై అధికార పాలకవర్గం ఊదాసీనత ప్రదర్శిస్తోంది. ఏటా రూ.కోట్ల ఆదాయం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటి వరకు పెబ్బేరు పురపాలికకు చెందాల్సిన సుమారు రూ.12 కోట్ల ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి చేరుతున్నాయన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది. చివరగా నాలుగేళ్ల కిందట సంత వేలం నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించగా.. వారు వారాంతపు సంతలో పశువులు, కోళ్లు, ఇతర వస్తువుల విక్రయదారుల నుంచి తైబజార్ వసూలు చేసి పురపాలికకు చెల్లించేవారు. ప్రస్తుతం టెండర్ల నిర్వహణ లేకపోవడంతో భారీగా ఆదాయం కోల్పోతోంది. అలాగని సంతలో తైబజార్ వసూళ్ల పర్వం ఆగలేదు. అటు చిరు వ్యాపారులకు తైబజార్ భారం తప్పక.. ఇటు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరకపోగా.. మధ్యలోని కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంత ఆదాయాన్ని దండుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్చకులకు సంతస్థలంపై హక్కు కల్పిస్తూ కోర్టు తీర్పు వెలువడటంతో మున్సిపాలిటీ టెండర్ నిర్వహణకు వెనకడుగు వేసింది. ఈ అవకాశం కొందరికి కాసుల పంటగా మారిందని చెప్పవచ్చు. ఇదీ వివాదం.. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల భూమి ఉండగా.. అందులోని 16 ఎకరాల్లో పెబ్బేరు గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి కొనేళ్లుగా ప్రతి శనివారం వారాంతపు సంత నిర్వహిస్తున్నారు. సంతపై వచ్చే ఆదాయాన్ని పాలకవర్గం తీర్మానం మేరకు పట్టణాభివృద్ధికి వెచ్చించేవారు. ఈ స్థలం తమదంటూ ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మధ్యలో చాలాకాలం కోర్టులో కేసు నడుస్తుండేది. గత ప్రభుత్వ హయాంలో సంత నిర్వహించే స్థలాన్ని రెవెన్యూశాఖకు అప్పగిస్తే.. అంతే స్థలాన్ని మరోచోట చూపించేలా అర్చకులు ఒప్పందం కుదుర్చుకొని హక్కులు మార్చుకున్నారు. కాగా సంత స్థలం వదులుకున్న అర్చక కుటుంబాలకు రెవెన్యూశాఖ భూమి చూపించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సంత స్థలంలో క్రయ విక్రయాలు జరగకుండా, టెండర్లు నిర్వహించకుండా నిషేధం విఽధించడంతో వివాదం మొదలైంది. కానీ నేటికీ సంత కొనసాగిస్తూ వ్యాపారులు, గొర్రెలు, మేకలు, పశువుల కొనుగోలు చేసిన రైతుల నుంచి డబ్బులు వసూలు ఆగకపోవడం గమనార్హం. పట్టణంలోని వివిధ దుకాణాలకు వచ్చే ఆటోలు, ట్రాన్స్పోర్టు లారీలు, డీసీఎం వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంతపై వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీలో జమ చేయకపోయినా.. బ్యాంకులో జాయింట్ ఖాతా తెరిచి అందులో జమ చేస్తున్నట్లు సంత నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు అఽధికారులకు ఇప్పటి వరకు అందజేయకపోవడం గమనార్హం. వారానికి రూ.6.36 లక్షలు.. గతంలో టెండర్లు నిర్వహించగా వారానికి రూ.6.36 లక్షల చొప్పున మున్సిపాలిటీకి చెల్లించాలని నిర్ణయించారు. పెబ్బేరు మున్సిపాలిటీకి సమకూరే ఆదాయంలో వారాంతపు సంత, తైజజారే అత్యధికం. పశువులు ఒక్కింటికి రూ.100, గొర్రెలు, మేకలకు రూ.10 నుంచి రూ.50 వరకు, తైబజారు రూ.10 నుంచి రూ.50 దాకా వసూలు చేస్తున్నారు. తైబజార్ వసూలు చేసేందుకు పశువులు, మేకలు, గొర్రెలకు విడివిడిగా కాంట్రాక్టర్లు ఉన్నారు. పెబ్బేరులో కొనసాగని సంత వేలం రూ.కోట్ల ఆదాయం కోల్పోతున్న పురపాలిక కోర్టు వివాదంతో నిలిచిన వైనం పాలకవర్గం ఉదాసీనత.. ప్రైవేట్ వ్యక్తులదే జోరు -
నాలుగేళ్లుగా టెండర్లు లేవు..
కోర్టు తీర్పు వెలువడిన తర్వాత సంత వేలం నిర్వహించడం లేదు. చివరిసారి నిర్వహించిన వేలం పాటలో మున్సిపాలిటీకి రూ.3.36 కోట్ల ఆదాయం సమకూరింది. పురపాలిక నాలుగేళ్లుగా రూ.కోట్లలో ఆదాయం కోల్పోయింది. – గణేష్, మేనేజర్, పెబ్బేరు పురపాలిక శాశ్వత పరిష్కారం చూపిస్తాం.. పెబ్బేరు సంత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించి అర్చకులతో శాంతియుత చర్చలు జరుపుతున్నారు. అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. – శ్రీనివాస్గౌడ్, పుర చైర్మన్, పెబ్బేరు ● -
ఈ కాల్వ.. యమడేంజర్!
●నీటి ప్రవాహాన్ని తెలియజేయాలి.. జూరాల ఎడమ కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని ప్రాజెక్టు అధికారులు సిబ్బంది ద్వారా సమీపంలోని గ్రామాల ప్రజలకు తెలియజేయాలి. వారాబంది ద్వారా ఎన్ని రోజులు నీటిని అధికంగా వదులుతారు.. ఎన్ని రోజులు నీటిని నిలిపివేస్తారనే విషయాలను అక్కడి రైతులతో పాటు ప్రజలకు వివరిస్తే ప్రాణ హానిని నివారించవచ్చు. – హన్మంతు, మాజీ ఎంపీటీసీ, నందిమళ్ల అవగాహన కల్పిస్తున్నాం.. జూరాల ప్రాజెక్టు నుంచి రామన్పాడ్ రిజర్వాయర్ వరకు ఉన్న ప్రధాన ఎడమ కాల్వ వెంట నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. వారబందితో సంబంధం లేకుండా కాల్వకు నీటిని నిరంతరం అందిస్తుంటారు. వారబంది రోజుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందని సమీప ప్రాంతాల యువకులు, చిన్నారులు ఈత కోసం కాల్వను ఆశ్రయిస్తుంటారు. కాల్వలోని నాచు అధికంగా ఉండటంతో కాలుజారి కాల్వలో గల్లంతై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనిపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూరు అమరచింత: జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలో దిగి గల్లంతు కావడం.. విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. జూరాల ఎడమ కాల్వ ఏర్పాటుచేసి నేటికీ 24 ఏళ్లు గడుస్తున్నా కాల్వ సమీపంలోని గ్రామాల ప్రజలకు చాలా వరకు నీటి ప్రవాహ ఉధృతి తెలియకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే చిన్నారులు, యువత ఈత సరదాతో కాల్వలోకి దిగి ప్రాణాలను కోల్పోతున్నారు. జూరాల ప్రాజెక్టు సమీపంలోని నందిమళ్ల గ్రామంలో ఈ ఘటనలు అధికంగా చోటు చేసుకోన్నాయి. అయితే ప్రాజెక్టు అధికారుల రక్షణ చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. రామన్పాడు వరకు ప్రమాదమే.. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీటిని అందించే రామన్పాడ్ ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే విడుదల చేస్తుంటారు. ప్రాజెక్టు నుంచి రామన్పాడ్ వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర కాల్వ ప్రవహిస్తోంది. రామన్పాడ్ రిజర్వాయర్ వరకు ఉన్న సమీప గ్రామాల వద్ద దాదాపు 10 చోట్ల కాల్వలో దిగుడు మెట్లు ఏర్పాటుచేశారు. దీంతో నందిమళ్ల, మూలమళ్ల, జూరాల తదితర గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగుతూ.. తమతమ అవసరాలను తీర్చుకుంటుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోవడం.. రామన్పాడ్ రిజర్వాయర్లో మృతదేహాలు లభించడం సర్వసాధారణంగా మారింది. ఐదేళ్లుగా జూరాల కాల్వలకు ప్రతి సీజన్లో వారాబందితో నీటిని వదులుతున్న విషయం రైతులకు తప్ప ఇతరులకు తెలియకపోవడమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. జూరాల గ్రామ సమీపంలో వెళ్తున్న ప్రధాన ఎడమ కాల్వ లోతుగా, భయంకరంగా ఉండటంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఒక్క గ్రామంలోనే 17 మంది మృత్యువాత.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల గ్రామంలోనే 11 ఏళ్ల కాలంలో 17 మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన బండి పెద్ద హన్మంతు, కోళ్ల రంగన్న, మాల రాజు, చింతలమ్మ, బోయ చెన్నమ్మ, బోయ బొజ్జన్న, తెలుగు కాశీమన్న, చిన్నరాయుడు, రాజ్మీ బేగం, మహిమూద్, కుర్వ మణెమ్మ, అలుక్కోడి సరిత తదితరులు గల్లంతై మృతిచెందారు. గత నెలలో ఈత పడేందుకు వెళ్లి చిన్నారి ఆరిఫ్ గల్లంతయ్యాడు. అదే విధంగా మూడేళ్ల క్రితం పెబ్బేరు సమీపంలోని కాల్వలో ముగ్గురు, ఆత్మకూర్ సమీపంలోని గుంటిపల్లి వద్ద 8మంది గల్లంతు కాగా.. గతేడాది మరో ఇద్దరు కాల్వలో గల్లంతై మృతిచెందారు. ప్రాణాలను హరిస్తున్న జూరాల ఎడమ కాల్వ వారాబందీతో కానరాని నీటి ప్రవాహం స్నానానికి, దుస్తులు ఉతికేందుకు వెళ్లి గల్లంతు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు రక్షణ కంచె ఏర్పాటు చేయాలి.. గుంటిపల్లి క్రాస్రోడ్డు సమీపంలోని జూరాల కాల్వ వద్ద తరచుగా ప్రజ లు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నీటి ప్రవాహంపై అవగాహన లేక ఎంతో మంది కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందడం విచారకరం. మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాజెక్టు అధికారులు కాల్వ వెంట ఉన్న మెట్ల వద్ద రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. – వెంకటేశ్, నందిమళ్ల -
ఉద్యానశాఖ పథకాలను వినియోగించుకోండి
ఎర్రవల్లి: రైతులు ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ డివిజన్ అధికారి ఇమ్రానా అన్నారు. సోమవారం మండలంలోని బీచుపల్లి ఆయిల్పాం నర్సరీలో వర్షాధార ప్రాంత అభివృద్ధిలో భాగంగా రైతులకు కూరగాయలు బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై కొండేరు, జింకలపల్లి గ్రామాలకు చెందిన 97 మంది రైతులకు రూ.6 లక్షల విలువ గల 1,746 కూరగాయల బుట్టలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతులు వైవిధ్యమైన పంటలు సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంభించి మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీని ద్వారా జిల్లాలో ఉద్యాన, పశు, మత్స్య తదితర రంగాలకు చెందిన లబ్ధిదారులు సైతం తమ వృత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. దీనిద్వారా రైతులు గ్రూపులుగా కలిసి వ్యవసాయాన్ని చేసి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభసాటిగా మార్చుకోవచ్చన్నా రు. కార్యక్రమంలో క్షేత్రస్థాయి ఉద్యానవన అధికారి అరుణమ్మ, సర్పంచులు ఈరన్న, మద్దిలేటి, ఉపసర్పంచ్ రాముడు, రైతులు పాల్గొన్నారు. -
శ్రీపాదరావు సేవలు మరువలేనివి
ఎర్రవల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దుద్దిళ్ల శ్రీపాదరావు చేసిన సేవలు మరువలేనివని పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పాణి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్లో దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభను నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా నడిపిస్తూ అధికార– విపక్షాలకు సమాన అవకాశాలు కల్పించిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. శాసనసభ గౌరవం, నియమావళి పటిష్టతకు ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రజల సమస్యలను శాసనసభలో బలంగా ప్రస్తావిస్తూ, సరళ జీవనం, ఉన్నత విలువల రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజాసేవలో ముందుండాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాజేశం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
గద్వాల: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ అన్నారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి.. నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు, సీసీ కెమెరాల పనితీ రు, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు ఇతర సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకురావొద్దని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ రాజేశ్వర్ పాల్గొన్నారు. స్పీకర్ పదవికే వన్నె తెచ్చారు.. శాసనసభ సభాపతి పదవికి వన్నె తీసుకొచ్చిన గొప్ప నేత దుద్దిళ్ల శ్రీపాదరావు అని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీపాదరావు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు. శ్రీపాదరావు ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దాచుకుంటే.. దోచుకున్నారు!
ఏపీలో మోసపోయిన గద్వాల మిర్చి రైతులు ● రైతులకు తెలియకుండానే 1,357 బస్తాల విక్రయం ● గుంటూరులోని ఓ ట్రేడర్, కోల్డ్ స్టోరేజీ యజమానులు కుమ్మకై ్క బాగోతం ● అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారుల చుట్టూ రైతన్నల ప్రదక్షిణలు ●అధికార నేతలమని బెదిరిస్తున్నారు.. గుంటూరులోని లీల గాయత్రి కోల్డ్స్టోరేజీ నిర్వాహకులు మాకు తెలియకుండా మేము నిల్వ చేసిన మిర్చి బస్తాలను అమ్ముకున్నారు. ఇదేంటని అడిగితే మాకు సంబంధం లేదు.. ట్రేడింగ్ కంపెనీ వాళ్లు తీసుకున్నారని చెబుతున్నారు. బస్తాలకు సంబంధించి బాండ్లు మా పేరున ఇచ్చారు.. ఆ బస్తాలు మాకే ఇవ్వాలి.. ట్రేడర్కు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు. అధికార నేతలమంటూ బెదిరిస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో అప్పులయ్యాయి. నిల్వ మిర్చి పైనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాం. ఇరు ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలి. లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – నాగశేషి, రైతు, మానవపాడు, జోగుళాంబ గద్వాల జిల్లా సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామనుకుని నిల్వ చేసుకున్న ఆ మిర్చి రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ట్రేడింగ్ కంపెనీ, కోల్డ్స్టోరేజీ కుమ్మకై ్క నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. నట్టేట మునిగినట్లు ఆలస్యంగా తెలుసుకున్న ఆ రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఓ కోల్డ్స్టోరేజీ నిర్వాహకుల చేతిలో మోసపోయిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మిర్చి రైతుల కన్నీటి గాథ.. గద్వాల జిల్లా మానవపాడు, బోరవెల్లి గ్రామానికి చెందిన రైతులు సాయిబాబా, నాగశేషి, బజారి, రాముడు, విజయ్, నాగరాజు, రమేష్ 2023 మే 6న తాము పండించిన సూపర్–10 రకం మిర్చి 1,357 బస్తాలను అమ్ముకునేందుకు ఏపీలోని గుంటూరు వ్యవసాయ మార్కెట్కు తీసుకెళ్లారు. అయితే మద్దతు ధర తక్కువ ఉండడంతో ఈశ్వరి ట్రేడింగ్ కంపెనీ ద్వారా లీల గాయత్రి కోల్డ్స్టోరేజీలో నిల్వ చేశారు. ట్రేడింగ్ కంపెనీ ద్వారా వచ్చిన బాండ్లను సదరు రైతులు కోల్డ్ స్టోరేజీ నిర్వాహకుల వద్ద తాకట్టుపెట్టి ఒక బస్తాకు రూ.3 వేల చొప్పున లోన్ తీసుకున్నారు. మార్కెట్లో మంచి ధర వచ్చే వరకు వేచి చూస్తున్న క్రమంలో రెండున్నరేళ్లు గడిచింది. ప్రతి సంవత్సరం ఒకట్రెండు సార్లు ఒక్కొక్కరు వెళ్లి ఆ బస్తాలను చూసుకునే వారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులకు రైతులు ఫోన్ చేయగా.. మీ బస్తాలు లేవని చెప్పడంతో వారు కంగుతిని గుంటూరుకు వెళ్లారు. గుంటూరులోని కోల్డ్స్టోరేజీలో నిల్వ -
నర్వ.. ప్రగతి బావుటా
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్కు ఎంపికతో మహర్దశ నర్వ: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గాను దేశంలో 500 వెనకబడిన ప్రాంతాలను గుర్తించగా.. ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వా ల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లా లో నర్వ మండలాన్ని ఎంపిక చేసింది. ఇందులో సమగ్ర అభివృద్ధి సాధించేలా.. ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టిసారించింది. ఈ మేరకు మొదటి మూడు నెలలపాటు చేపట్టిన న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్ (వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్) విభాగాల్లో మెరుగైన పనితీరుపై ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానం, మొత్తం జాతీయ స్థాయిలో నర్వ మండలం యాస్పిరేషన్ బ్లాక్ 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలు విడుదల చేశారు. అలాగే దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు నర్వ బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన వాటర్ బడ్జెటింగ్ ఇన్ యాస్పిరేషనల్ బ్లాక్స్ నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గతేడాది డిసెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్లో డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై ఢిల్లీలోని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట కలెక్టర్తో వీసీ నిర్వహించి నర్వ గురించి చర్చించి 12 ప్రతిపాదనలతోపాటు మరో 2 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఇందులో శ్రీపునరుత్పాదక పర్యావరణ అనుకూల ఆహారం (నర్వ కేజీబీవీలో సౌరశక్తితో పనిచేసే వంటగది) కోసం రూ.1.2 కోట్లు మంజూరు చేశారు. అలాగే స్పార్క్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ ఏఐ రెడినెస్ నాలెడ్జ్ (ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్ల స్థాపన)కు ఆమోదం తెలిపారు. మండలంలో 6 అంగన్వాడీ భవనాలు, డైనింగ్హాల్ కోసం రూ.1.5 కోట్లు, మండలంలోని 3 కేంద్రాలలో ఫేర్ ప్రైస్ షాప్స్ (సూపర్ మార్కెట్ మోడల్) ఏర్పాటు కోసం రూ.3.73 లక్షలు, ఫ్రంట్లైన్ వర్కర్స్ బెస్ట్ ప్రాక్టీస్ అప్రిసియేషన్ అవార్డు కోసం రూ.2 లక్షలు, మండలంలోని 22 పాఠశాలల్లో ఏఐ డిజిటల్ ల్యాబ్తోపాటు సోలార్ కిచెన్ కోసం రూ.1.2 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.15 లక్షల నిధులు మంజూరు కానున్నాయి. 2024–25లో యాస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమానికి ఎన్నిక ఆరు విభాగాల్లో ఉత్తమ పనితీరుపై ప్రశంసలు దక్షిణ భారతంలో ప్రథమ, జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూరనున్న మరిన్ని నిధులు సంపూర్ణ అభియాన్ ద్వారా ఆరు విభాగాల్లో చేపట్టిన పనులపై గతేడాది డిసెంబర్ 27న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ప్రాంతంలో పర్యటించి కేంద్రానికి నివేదిక అందించారు. ఇందుకు యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతి కోసం నర్వ కేజీబీవీలో సౌరశక్తి ఆధారిత వంటశాల (సోలార్ ఫర్ హెల్తీ రినివబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఈటింగ్) స్థాపన కోసం రూ.62.15 లక్షలు మంజూరు చేసింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మొదటి విడతగా రూ.15,53,750 మంజూరు చేశారు. ఈ నిధులతోపాటు పీఎంశ్రీ పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్ల ఏర్పాటు కోసం రూ.58,13,070 మంజూరు చేశారు. దీంతోపాటు 6 నెలలుగా నర్వ మండలంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి రూ.8 లక్షలు విడుదల చేయించి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కూర్చునేందుకు ప్రీ స్కూల్ బల్లలు, కుర్చీలు, గోడలపై పేయింటింగ్స్, మ్యాపులు, మంకీ బార్స్, బెడ్షీట్స్ వంటి పరికరాలను మండలంలోని 33 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. -
కల్యాణం.. కమనీయం
కందూరు శ్రీరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. దక్షిణకాశీగా వెలుగొందుతున్న ఆలయంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో మహిళలు సిద్దం చేసిన తలంబ్రాలను గ్రామస్తులు పల్లకీలో ఉంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో ఉంచారు. అనంతరం పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సన్నాయి వాయిధ్యాల నడుమ ఆలయం లోపలి నుంచి కల్యాణ మండపంలోకి తెచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితులు ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను కట్టించి, జీలకర్ర, బెల్లం పెట్టించారు. వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య పార్వతి మెడలో మంగళసూత్రాన్ని కట్టించి కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. అనంతరం కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. – అడ్డాకుల -
‘అమ్మ’కు అక్షరం
● స్వయం సహాయక సంఘాల మహిళలకు చదువు ● కొనసాగుతున్న అభ్యాసన కేంద్రాలుగద్వాల న్యూటౌన్: మానవ జీవితంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో విద్య అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఒక్కరికీ కనీసంగా చదవడం, రాయడం నేర్చుకోవడం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో ‘అమ్మకు అక్షర మాల’ పేరుతో నిరక్షరాస్యులైన స్వయం సహయక సంఘాల మహిళలను అక్ష్యరాస్యులుగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీనికి అనుగుణంగా జిల్లాలో నిరక్షరాస్యులను గుర్తించి, వలంటీర్ల ద్వారా వారికి చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్ఈపీ–2020 కి అనుగుణంగా పదిహేనేళ్లు పైబడిన వారికి విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అండర్స్టాండింగ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)లోని వయోజన విద్యా విభాగం సైతం నిరక్ష్యరాస్యులకు చదువు చెప్పించేందుకు సిద్ధమైంది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహయక సంఘాల నిర్వహణను చూస్తుంది. అయితే ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న చాలా మంది మహిళలు నిరక్ష్యరాస్యులుగా ఉన్నారు. వీరికి కనీసంగా చదవడం, రాయడం, సంతకం చేయడం వంటివి అయినా ప్రభుత్వం నిర్ణయించింది. పది మంది మహిళలతో ఒక స్వయం సహయక సంఘం ఏర్పాటవుతుంది. పదిహేను నుంచి ఇరవై సంఘాలతో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామైఖ్య సంఘం (వీఓఏ) ఏర్పాటవుతుంది. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో ఏరియా లెవెల్ ఫెడరేషన్ (ఏఎల్ఎఫ్) ఉంటుంది. ఇలా ఒక్కో గ్రామైఖ్య సంఘం.. ఏఎల్ఎఫ్ల కింద 150 నుంచి 200 మంది మహిళలు ఉంటారు. వీఓఏలను ఓబీలు, బుక్ కీపర్లు, ఏఎల్ఎఫ్లను ఓబీలు, ఆర్పీలు నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఓబీలు, బుక్కీపర్లు, ఆర్పీల ద్వారా సెర్ప్, మెప్మా అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను గుర్తించేందుకు గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో ఉల్లాస్ అనే యాప్తో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జిల్లాలోని 13 మండలాల పరిధిలో 60,805 మందిని, పట్టణ ప్రాంతాలకు సంబంధించి నాలుగు మున్సిపాలిటీల పరిధిల్లో 4,222 మంది కలిపి మొత్తంగా 65,127 మందిని నిరక్ష్యరాస్యులుగా గుర్తించారు. నిరక్షరాస్యులను గుర్తించిన తర్వాత వారికి చదువు చెప్పేందుకు వీఓఏలు, ఆర్పీలు, ఓబీలను వలంటీర్లుగా నియమించారు. ఇందుకోసం డిసెంబర్లో రీసోర్స్పర్సన్లు వలంటీర్లకు శిక్షణ అందించారు. వయోజన విద్యాశాఖ ద్వారా వలంటీర్లకు, అభ్యాసకులకు వేర్వేరుగా ముద్రించిన బుక్ మెటీరియల్ అందించారు. ఈ మెటీరియల్ ఆధారంగా ఆయా గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వీధులు, ఆలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర ముఖ్య స్థలాలను కేంద్రాలుగా చేసుకొని ఒక్కో వలంటీర్ సాయంత్రం వేళల్లో పది మందికి శిక్షణ ఇవ్వాలి. కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయిలో సెర్ప్ అధికారులు సీసీలు, ఏపీఎం, డీపీఎంలు, పట్టణ ప్రాంతాల్లో సీఓలు, టీఎంసీలు, ఏడీఎంసీలు పర్యవేక్షిస్తున్నారు. -
తల్లిదండ్రుల నిఘా అవసరం
పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిత్యం నిఘా ఉంచాలి. స్నేహి తులు, బంధువులు, తెలిసినా వ్యక్తులైనా సరే వారితో ఎంత చనువుగా ఉండాలనే నియమాలను పిల్లలకు తెలియజేయాలి. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలి. చిన్నతనంలో పిల్లలు సామాజిక మాధ్యమాల వైపు వెళ్లకుండా వీలైనంత వర కు కట్టడి చేయాలి. పని ఒత్తిడిలో తల్లిదండ్రు లు పిల్లలపై దృష్టి పెట్టని కారణంగానే చాలా వరకు చెడు దారిలో ప్రయాణిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక నుంచైనా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. – ధరణి, గృహిణి, గద్వాల మైనర్ బాలికల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరించిన, అత్యాచారానికి పాల్పడిన కేసు ల్లో నిందితులు తప్పించుకోలేరు. ప్రభుత్వం కఠిన చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. పోక్సో కేసుల్లో నిందితులకు న్యాయస్థానంలో బెయి ల్ ఉండదు. వీలైనంత త్వరగా శిక్షలు పడేలా పోలీసు, న్యాయవ్యవస్థలు సంయుక్తంగా ప ని చేస్తున్నాయి. దాడులకు గురైన వారికి స్వే చ్ఛాయుత వాతావరణంలో రక్షణ ఉంటుంది. ఇటీవల మైనర్పై జరిగిన ఘటన పై పూర్తి ఆధారాలు సేకరించాం. నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసుశాఖ కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది. – శ్రీనివాసరావు, ఎస్పీ ● -
పూత, పిందెలు రాలుతున్నాయి..
నాకు పదెకరాల్లో మామిడి తోట ఉంది. ఇరవై రోజుల నుంచి తోటకు బూడిద తెగు లు, తేనెమంచు పురు గు ఉధృతి ఎక్కువైంది. తెగుళ ్ల నివారణ కోసం ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. దీనివల్ల మామిడి పూత, పిందెలు రాలిపోతున్నాయి. ఈ ఏడాది పంట దిగుబడులు అధికంగా తగ్గుతాయి. – గోపి, రైతు, వెంకటాపురం, కేటీదొడ్డి మండలం నాకు సొంతంగా పదెకరాల మామిడి తోట ఉంది. మరో పదెకరాలు కౌలుకు తీసుకున్నాను. తోటకు పూత బాగా వచ్చింది. అయి తే కొద్ది రోజుల నుంచి తేనెమంచు, నల్లతామర పురుగుతో పూత మొత్తం రాలిపోయింది, కాసిన పిందెలు రాలుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. – తిమ్మయ్య, రైతు, గట్టు ఈ ఏడాది మామిడి తోటలకు పూత బాగా వచ్చింది. కొన్ని రోజులుగా వాతావరణ మార్పులతో నల్లతామర, తేనెమంచు పురుగు ఉధృతి పెరిగిన విషయం మా దృష్టికి వచ్చింది. మామిడి తోటలకు ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు తగిన సూచనలు చేస్తున్నాం. ఉద్యానశాఖ సిబ్బంది ద్వారా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తాం. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి ● -
రాలుతున్న ఆశలు!
జోగుళాంబ గద్వాల● మామిడి తోటలపై తెగుళ్ల ప్రభావం ● భారీగా నేలరాలుతున్న పూత, పిందెలు ● దిగుబడులపై తీవ్ర ప్రభావం.. ఆందోళనలో రైతులు ● వాతావరణ మార్పులే కారణం శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మండలం మామిడి కాపు దశలో తోటలు ఉన్నవి కేటీదొడ్డి 2,380 1,385 గట్టు 800 690 ధరూరు 550 445 మల్దకల్ 470 355 గద్వాల 300 210 అయిజ 150 130 ఇటిక్యాల 130 120 వడ్డేపల్లి 140 120 రాజోళి 70 60 అలంపూర్ 10 5 ఉండవెల్లి 10 5 మానవపాడు 10 5 కేటీదొడ్డి శివారులోని మామిడి తోట గద్వాలవ్యవసాయం: మామిడి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. 15 రోజులుగా వాతావరణంలో వచ్చి న మార్పులు మామిడి తోటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. బూడిద తెగులు, నల్లతామ ర (బ్లాక్ త్రిప్స్), తేనెమంచు పురుగు ఉధృతితో పూత, పిందెలు రాలిపోతున్నాయి. కళ్లెదుటే నేలరాలుతున్న పూత, పిందెలను చూసి రైతులు వేదనకు గురవుతున్నారు. దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతం ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే.. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పా టు నెట్టెంపాడు ఎత్తిపోతల రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోరు బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటుండటంతో మామిడి, బత్తాయి, పొప్పాయి, జామ, సపోట తదితర పండ్లతోటలను సాగుచేస్తున్నారు. వీటిలో మామిడి సాగు ఎక్కువగా ఉంది. రైతు లు బేనిస, దశిరి, కేసరీ, హిమా యతీ రకాలను పండిస్తున్నా రు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 5,020 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా.. ఈ ఏడాది 3,525 ఎకరాల్లో తోటలు కాపు దశలో ఉ న్నాయి. గత డిసెంబర్, జనవరి నుంచే మామిడి పూత పూయ డం ప్రా రంభమైంది. పూత పూ సిన నెల రోజులకు పిందెలు కాయడం.. ఆ తర్వా త నెల, రెండు నెలలకు కా య సైజు పెరుగుతూ వస్తుంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలకు ఈసారి పూత లు బాగా వచ్చాయి. పూతలను చూసి రైతులు సంతోషపడ్డారు. వీరి సంతోషం ఎక్కువ రోజులు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తగ్గనున్న దిగుబడులువాతావరణంలో వచ్చిన మార్పులతో మామిడి తోటలకు తెగుళ్ల బెడద నెలకొంది. 15 రోజలుగా రాత్రివేళల్లో చలి, పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో నల్లతామర పురుగు, తేనెమంచు పురుగు తోటల్లో వీపరీతంగా ఆశిస్తోంది. ఈ పురుగు విసర్జించే జిగురు లాంటి ద్రవాల వల్ల, బూడిద తెగుళ్లతో మామిడి పూతలు, పిందెలు రాలిపోతున్నా యి. ప్రధానంగా జనవరిలో పూత వచ్చి.. ఫిబ్రవరిలో పిందెలు వచ్చిన చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పూత, పిందెలు రాలిపోతుండటంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా తెగుళ్ల ఉధృతి తగ్గడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, మామిడి తోటలను కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పూతకు రాకముందే తోటలను కౌలుకు తీసుకుంటారు. ప్రస్తుతం వచ్చిన పూత, కాసిన పిందెలు రాలడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతున్నారు. -
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేద్దాం
గద్వాల: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా కలెక్టర్గా బదిలీపై వచ్చిన ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో జిల్లా వెనుకబడిందని.. ఓటరు మ్యాపింగ్పై సంబంధిత బీఎల్ఓలకు లక్ష్యాలను నిర్ధేశించి.. వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు విద్యాశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తిచేసి.. రైతులందరికీ కామన్ రిజిస్ట్రేషన్ గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ 39 పారామీటర్లలో మెరుగుపడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తాను పనిచేసిన జనగామ జిల్లాను మొదటి స్థానంలో సాధించిందని.. గద్వాల సైతం మెరుగైన స్థానంలో ఉండేలా పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● రంజాన్ మాసం నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా కేంద్రంలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లీంలు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. -
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాలోని అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు క్రీడలు, యువజనశాఖ జిల్లా అధికారి ఎం.కృష్ణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. పాఠశాలల్లో 20 బాలురకు, మరో 20 బాలికలకు సీట్లు ఉంటాయన్నారు. ఎంపికై న విద్యార్థులు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని.. ఆసక్తిగల వారు మార్చి 4వ తేదీలోగా tgss.telangana. gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకం
ఎర్రవల్లి: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని.. ప్రభుత్వం అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకొని పల్లెల ప్రగతికి పాటుపడాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. స్థానిక పదో బెటాలియన్లో ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, రాజోళి, అయిజ మండలాలకు చెందిన 99 మంది సర్పంచులకు ఐదు రోజులపాటు నిర్వహించిన రెండో విడత శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి సర్పంచ్ అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టం నిబంధనలు, విధులు, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు, అధికారుల సంప్రదింపు విధానం వంటి అంశాలపై సర్పంచులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తూ.. ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యకు బలమైన పునాదులుగా మార్చాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలను ప్రోత్సహిస్తూ.. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న సర్పంచులకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, డీఎల్పీఓ ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తాం
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పించి.. బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి పదో బెటాలియంలో ఎస్పీ శ్రీనివాసరావు, కమాండెంట్ జయరాజుతో కలిసి నూతన కన్వెన్షన్ హాల్, పాఠశాల వేదిక, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ సిబ్బందితో అడిషనల్ డీజీపీ సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల పలు ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. అదే విధంగా ప్రతిభను కనబర్చిన పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ● పోలీస్ వృత్తి ఎంతో ఉత్తమమైనదని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బెటాలియన్లో అందిస్తున్న అత్యాధునిక వసతులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి.. బెటాలియన్కు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు నర్సింహరాజు, ఆర్పీ సింగ్, ధర్మారావు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ -
అనూహ్య మలుపులు
సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో దాడి ఘటన అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల పోరా టం కొనసాగడంతోపాటు ఉన్నత స్థాయిలో ఎస్సీ, బీసీ కమిషన్లు సైతం విచారణలో భాగమయ్యాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్పందించి నాలుగు వారాల్లో ఘటనపై పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ నెల 18న జాతరలో దాడి ఘటన చోటుచేసుకోగా 21న పసిపాప మరణం నుంచి వరుసగా ఏడు రోజులపాటు నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో పోలీసుల నిఘా వైఫల్యంతోపాటు బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన తర్వాత స్పందనపై విమర్శలు.. కుమ్మెర మల్లన్న జాతరలో ఏటా పదివేల మందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రానికి 11 కి.మీ దూరంలో కుమ్మెర ఉండగా.. భారీ సంఖ్యలో పాల్గొనే జాతరలో పోలీసుల భద్రత ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్టు ఎస్సీ, బీసీ కమిషన్ చైర్మన్లు స్పష్టం చేశారు. దాడి ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఏం జరుగుతుందన్న దానిపై, అసలు నిజా లు తెలుసుకోవడంలో పోలీస్ నిఘా వ్యవస్థ సైతం వైఫల్యం చెందినట్లు విమర్శలు వస్తున్నాయి. దాడి ఘటన చోటుచేసుకున్న తర్వాత బాధితులపై పోలీసులు చూపిన వైఖరి వివాదాస్పదమైంది. బాధితులపైనే కేసుతో.. జాతరలో గణేశ్ను కొబ్బరికాయల గదిలో తలుపులు వేసి బంధించి 8 మంది వరకు దాడి చేసినట్లు బయటకు వచ్చిన వీడియోల్లోనే స్పష్టమైంది. దాడి ఘటన వెంటనే ముందుగా బాధితుడు గణేశ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీస్స్టేషన్ దాకా వచ్చాక ముందుగా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం వివాదానికి దారితీసింది. నిందితుల పట్ల పోలీసులు గౌరవ మర్యాదలతో ప్రవర్తించారని, తమను మాత్రం నిర్లక్ష్యం చేశారని బాధితులు పదేపదే ఆరోపించారు. గణేశ్పై దాడి జరిగింది స్పష్టమైనప్పటికీ, నిందితుడు శ్రీనివాస్రెడ్డికి గాయాలు అయ్యాయన్న కారణంతో బాధితులపైనే కేసు నమోదు చేయడం ఆగ్రహావేశాలకు దారితీసింది. దాడి ఘటన తర్వాత మూడు రోజులకు ఫిబ్రవరి 21న రెండు నెలల పాప మరణంతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితులు రోడ్డెక్కారు. ప్రజాసంఘాల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదుచేశారని, లేకపోతే మరింత నీరుగార్చేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోతుగా విచారణ.. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబంపై దాడి జరగగా ఇది ఆధిపత్య వర్గం నుంచి పోరుగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ క్రమంలో నిందితులపై హత్యకేసు నమోదుచేయాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అయితే పోలీసులు దాడి ఘటనలో పాల్గొన్నవారు ఎవరు.. ఏం జరిగిందన్న దాంతోపాటు బాధితులపైనా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరగా ఏం తేలుతుందోనని, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందోనన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతుండగా.. ఇప్పటి వరకు ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. క్లిష్టతరంగా మారిన కుమ్మెర జాతరలో దాడి ఘటన బాధితులపైనా లోతుగా సాగుతున్న విచారణ చివరికి ఎటువైపు దారితీస్తుందోనన్న అనుమానం పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యంపై విమర్శలు శుక్రవారం నిజనిర్ధారణ కోసమని కాంగ్రెస్ నేతల బృందం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుమ్మెర ఘటన విషయంలో అవాస్తవాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని, వాస్తవాలను గమనించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పసిపాప మృతిపై రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ముఖ్యనేతలతోపాటు ఆందోళన నిర్వహించిన వారితో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగినట్టు అనిపిస్తే తాను పార్టీని వదిలైనా వారితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు
గద్వాల(మల్దకల్): సేంద్రియ వ్యవసాయంతో అధి క లాభాలు సాధించవచ్చని, రైతులు పంటల సాగు లో రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూ చించారు. గురువారం మల్దకల్లో రైతులు సాగుచేసిన వరిపంటను ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో భూ సారం దెబ్బతిని.. పంటలు నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేర కు రైతులు పంటల సాగు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభా లు వచ్చే పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. అనంతరం పంటలకు ఆశించే చీడపీడల నివారణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించా రు. అంతకు ముందు మల్దకల్ సింగిల్విండో ఎరువుల గోదాంను తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏడీఏ సంగీతలక్ష్మి, ఏఓ రాజశేఖర్, ఏఈఓలు ఉన్నారు. -
ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా ఇంటివద్దకే తలంబ్రాలు
స్టేషన్ మహబూబ్నగర్: భద్రాచలంలో వచ్చే నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్, లాజిస్టిక్ ఏటీఎం బద్రి నారాయణ తెలిపారు. తలంబ్రాలు చేరవేసే కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం రీజినల్ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.151 చెల్లించి సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వచ్చే నెల 31 వరకు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్లు గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి డిపో 91542 98609, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో 91542 98611, మహబూబ్నగర్, షాద్నగర్, నారాయణపేట, కోస్గి డిపో 91542 98612, ఉమ్మడి జిల్లా 91542 98637 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మీధర్మ, డిపో మేనేజర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ను దిగ్బంధిస్తాం
నిందితులను అరెస్టు చేయకపోతే.. ● రాష్ట్ర ఉద్యమంగా కుమ్మెర ఘటనను ముందుకు తీసుకెళ్తాం ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ నాగర్కర్నూల్ క్రైం: రెండు నెలల పసిపాపను చంపిన ఘటనలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే హైదరాబాద్ను దిగ్బంధిస్తామని దిగ్బందిస్తామని.. ముఖ్యమంత్రి ఇంటితో పాటు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ కుల, మతపరమైన ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కుల అహంకారంతో ఈ దాడి జరిగిందని.. ఇందుకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారి మృతి ఘటనపై పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామన్నారు. బడుగు బలహీన వర్గాలు ఐక్యమత్యతో ఉంటూ ఇలాంటి ఘటనలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మీడియాకు ఒక బులిటెన్ జారీ చేసి, అందులో బాధితులనే నిందితులుగా చూపడం.. చిన్నారి మృతదేహంపై, అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని ప్రకటించడం.. ఘటన జరిగిన సమయంలో కుమ్మెర గ్రామంలో ఆ చిన్నారి లేదని చెప్పడాన్ని చూస్తే కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీసులు, పాలకులు కుట్రలు పన్నుతున్నారని స్పష్టమవుతుందని అన్నారు. పోలీసు వ్యవస్థ న్యాయం వైపు ఉండాలని హితవు పలికారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. పోలీసులు శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేయాలని ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెండింగ్ కేసులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. వివిధ సమస్యలపై స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలన్నారు. స్టేషనలో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, ప్రదీప్కుమార్, రవి, నాగేశ్వరెడ్డి, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, శేఖర్, మల్లేష్, శ్రీహరి, నందికర్ ఉన్నారు. -
పీఆర్సీ ప్రకటించాలి
ఉప్పునుంతల: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జక్క రామస్వామి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తాడూరు యూపీఎస్లో నిర్వహించిన డీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని ప్రకటించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నం.25ను రద్దుచేసి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు డి భాస్కర్రెడ్డి, ఉపాధ్యక్షులు రత్నప్రసాద్, కె.జ్యోతి, కార్యదర్శులు పి.జానకీరాం ఉన్నారు. -
మైనర్లు పెడదోవ!
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేయాలి. వారు అడిగినన్ని డబ్బులు ఇవ్వకుండా స్వయంగా వా రి అవసరాలను గుర్తించి తీర్చాలి. పిల్లలు వాహనాలు నడపడం తప్పు అనే విషయాన్ని గ్రహించాలి. రోడ్డుపై వాహనం నడిపే క్రమంలో మైనర్లకు సరైన అవగాహన, సామర్థ్యం ఉండకపోవడంతో ప్రమాదాలు జరుగుతాయి. వినోదాలతో చేసే కార్యక్రమాలను నిలువరించాలి. డబ్బు విలువ తెలియజేయాలి. చెడు వ్యసనాలకు దారితీస్తున్న అంశాలను తెలుసుకుని సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలి. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల గద్వాల క్రైం: మైనర్ల వింత పోకడలు అధికమయా యి. నానాటికీ సరదా వ్యసనాలపై మోజు పడు తూ.. ఒకరిని చూసి మరొకరు చెడు అలవాట్లకు బానిసగా మారుతున్నారు. ముఖ్యంగా మైనర్ల చేతి లో బైక్ ఉంటే చాలు.. వారి స్పీడ్కు కళ్లెం వేయలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో రయ్.. రయ్మంటూ హల్చల్ చేస్తున్నారు. రాత్రివేళ పెట్రోలింగ్ సమయంలో పోలీసులకు దొరికిన ఘటనలు అనేకం ఉన్నాయి. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా కొరవడి.. చేజుతుల్లారా వారి భవిష్యత్ను అంధకారంలోకి నెడుతున్నారు. మత్తు పదార్థాలకు బానిసై.. చాలా మంది మైనర్లు మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. తమ వద్ద డబ్బు లు లేకపోతే ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులు చోరీ చేయడం.. వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించగా వచ్చిన డబ్బులతో మద్యం, పొగాకు, పాన్ మాసాల వంటి వాటిని తీసుకుంటున్నారు. ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే స్నేహితులందరూ పట్టణ శివారు ప్రాంతానికి చేరుకొని వేడుకలు జరు పుకొంటున్నారు. అర్ధరాత్రి దాటగానే నడిరోడ్డుపై కేక్ కట్ చేసి.. హంగామా చేయడం సాధారణంగా మారింది. కొందరు మద్యం మత్తులో ఏం చేస్తున్నా రో తెలియని పరిస్థితికి చేరి.. కేక్ను ముఖానికి రుద్దడం, బర్తడే బంప్స్ పేరుతో ఇష్టమొచ్చినట్లు కొట్టడం వంటి చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ వింత పోకడ పల్లెలకూ సైతం పాకింది. ఏదైనా కార్యక్రమం ఉందటే చాలు.. వారికి పండుగ వాతావరణంగా మారుతుంది. ఒకరిని చూసి మరొకరు చెడు వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని తమ పిల్లలు వక్రమార్గంలో వెళ్లకుండా చూసుకోవాలి. బైక్లతో రయ్.. రయ్మంటూ హల్చల్ అడ్డుకట్ట వేయని కుటుంబ సభ్యులు పోలీసుల తనిఖీలో పట్టుబడుతున్నా మారని తీరు చెడు వ్యసనాలకు బానిసగా మారుతున్న వైనం -
ఘటనపై ఆధారాలివ్వండి
సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్ష్యులందరినీ విచారిస్తున్నామని చెప్పారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నామని, అయితే కేసు పురోగతి కోసం బాధిత కుటుంబ సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతరలో గణేశ్, చంద్రకళపై దాడి చేసినట్లు మాత్రమే బాధితులు మొదట ఫిర్యాదు చేశారని ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. మొదట ఫిర్యాదులో మౌనిక, ఆమె బిడ్డపై దాడి ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. మౌనికతోపాటు బిడ్డపై దాడికి సంబంధించిన ఏ చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసుగా మార్చి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే తమకు సమర్పించి కేసు పురోగతికి సహకరించాలని కోరారు. ‘ఈ నెల 18న కుమ్మెర జాతరలో తమపై దాడి జరిగిందని రాత్రి 8.30 గంటల సమయంలో శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తలపై రక్తస్రావం, గాయాలు ఉండటం, కాగ్నిజబుల్ ఆరోపణలు ఉండటంతో కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. అదేరోజు రాత్రి 9.30 గంటలకు గణేశ్ తమపై దాడి జరిగిందని 8 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో గణేశ్తోపాటు చంద్రకళపై మాత్రమే దాడి చేశారని పేర్కొన్నారు. మౌనిక, ఆమె పాప ప్రస్తావన ఫిర్యాదులో లేదు. ఆరోపణలు నాన్ కాగ్నిజబుల్ కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేశాం. మెడికల్ రిపోర్టులో సాధారణ దెబ్బలు ఉన్నాయి. ఘటనరోజు ఇచ్చిన ఫిర్యాదులో కులం పేరుతో తిట్టారన్న ప్రస్తావన కూడా లేదు. కుమ్మెర జాతరలో మౌనిక, పాపపై దాడికి సంబంధించి సాక్ష్యాలు లేవు దాడి ఘటనకు ముందే పాప ఆరోగ్యం క్షీణించడంతో నీలోఫర్లో చికిత్స మొదటి ఫిర్యాదులో గణేశ్, చంద్రకళపై దాడి మాత్రమే ప్రస్తావన చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసు నమోదు చేస్తాం విలేకరుల సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ కుమ్మెర జాతరలో మౌనిక, ఆమె పాపపై దాడి జరిగిందన్న దానికి విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఏ చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసుగా మార్చి చర్యలు తీసుకుంటాం. ఈ నెల 18న ఘటన జరిగితే 21న పాప మరణించే వరకు ఎక్కడా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా లేదు. బాధితురాలికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పరిహారాన్ని త్వరగా అందించేందుకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాలు, ఆధారాలు ఇవ్వమని అడిగినా కుటుంబం సహకరించలేదు. ఆధార్, రేషన్ లాంటి కనీస ఆధారం కూడా ఇవ్వలేదు. డిసెంబర్ 21న పాప తక్కువ బరువు 1.44 కేజీలుగా జన్మించింది. ఘటనకు ముందే పాప శ్వాస సంబంధ, న్యూమోనియా, జాండీస్ వంటి సమస్యలతో నీలోఫర్లో 30 రోజులపాటు చికిత్స పొందింది. పోస్టుమార్టం రిపోర్టులో అంతర్గత, బహిర్గత గాయాలు ఏమీ లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. హిస్టోపాథాలజీ, విస్త్రా రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయి. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షల నిర్వహణ
గద్వాలన్యూటౌన్: జిల్లాలో వచ్చేనెల 14 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేయాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం స్థానిక బాలభవన్లో పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, కస్టోడియన్లతో నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్ష సామగ్రిని జాగ్రత్తగా భద్రపర్చాలని తెలిపా రు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతించరాదన్నారు. ప్రతి కేంద్రంలో క్లాక్రూం ఏర్పా టు చేయాలన్నారు. అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు ఏఎన్ఎంలు అందుబాటులో ఉండాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఏసీజీఈ శ్రీనివాస్, డీసీఈబీ సెక్రెటరీ ప్రతాప్రెడ్డి ఉన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం అర్హత గల ప్రైవేటు పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉ మాపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. స్టేట్ లేదా సెంట్రల్ బోర్డు గుర్తింపు పొంది.. గత ఐదేళ్లలో 7, 10వ తరగతుల్లో కనీసం 90 శాతం ఉత్తీర్ణత శాతం నమోదై ఉండాలని.. 50 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాఽ దించాలని పేర్కొ న్నారు. అదే విధంగా పాఠశాలలలో విశాలమైన తరగతి గదు లు, క్రీడా ప్రాంగణం, విద్యార్థులకు తగిన సౌకర్యాలు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, 50 శాతం కంటే ఎక్కువ సాధారణ సిబ్బంది ఉండాలన్నారు. అర్హత గల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో మార్చి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. -
పోరాటం ఆపొద్దు..!
బాధితులకు న్యాయం జరిగే దాకా అండగా నిలబడదాం ● మానవత్వానికి మాయని మచ్చగా దాడి ఘటన ● రెండు నెలల పసిపాపపై ఇంత క్రూరత్వమా? ● ఒక్క వ్యక్తిపై 20 మంది దాడి చేయడం సిగ్గుచేటు ● ‘కుమ్మెర’ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ కుమ్మెర ఘటనలో నిరుపేద కుటుంబంపై దాడికి పాల్పడటం అధికార దురహంకారానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఒక్క వ్యక్తిపై 20 మంది కలిసి దాడి చేయడం, పసిపాప అని కూడా చూడకుండా కాలితో తన్నడం మానవత్వానికే మచ్చగా మిగిలిందని విమర్శించారు. ఇలాంటి ఘటనపై ప్రజలంతా స్పందించాలని, మనసున్న మనుషులంతా ఏకం కావాలని కోరారు. హంతకులను శిక్షించే దాకా సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన పసిపాపకు కుల, మతాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పుట్టిన 5 నిమిషాలకు పుట్టేదే కులం, మతమని.. మనుషులు పుట్టించిన కులం పేరుతో దేవుని దర్శనాలకు రాకుండా ఎలా చేస్తారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబంలో జరిగితే పోలీసులు ఇలాగే స్పందిస్తారా..? అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రాంతం కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. మహేంద్రనాథ్తోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న లాంటి ప్రజా కవులు ఇక్కడి ప్రాంత సామరస్యం కోసం కృషిచేశారని చెప్పారు. కులాలు, మతాల పిచ్చి వదిలి.. సామాజిక చైతన్యం కావాలన్నారు. మానవ మృగాలకు శిక్ష పడేందుకు అందరం ఏకమవ్వాలని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు. -
దుర్మార్గులకు శిక్ష పడాలి
సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర ఘటనలో దాడికి పాల్పడిన నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని, అందరికీ శిక్షపడేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి కమిషన్ తరపున రూ.లక్ష చెక్కును అందజేశారు. కుమ్మెరలో కుటుంబం జీవించలేని పరిస్థితులు ఉన్నాయని వారికి రక్షణ కల్పించాలని సూచించారు. జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు ఏర్పాటు, గణేశ్కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. ● నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోండి ● కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
గద్వాల: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్షకు 4,539 మంది విద్యార్థులకు గాను 4,407 మంది హాజరయ్యారు. జనరల్లో 100 మంది, ఒకేషనల్ విభాగంలో 36 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. కాగా, జిల్లా కేంద్రంలోని జ్ఞానప్రభ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బీఎం సంతోష్ పరిశీలించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షల అనంతరం జవాబుపత్రాలను సురక్షితంగా తరలించాలన్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయరాజు, డీఎస్పీ మొగులయ్య ఉన్నారు. మొదటి పరీక్షకు 136 మంది గైర్హాజరు -
అంతులేని అవినీతి!
గద్వాల తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాల జోరు ● పైరవీకారులను పెంచి పోషించిన గత తహసీల్దార్ ● ప్రతి పనికి లెక్కగట్టి వసూలు ● ఆరోపణలు వెల్లువెత్తడంతో బదిలీ వేటు ● గతంలోనే సదరు తహసీల్దార్ అక్రమార్జనను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ●గద్వాల: జిల్లా కేంద్రమైన గద్వాల తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇటీవల బదిలీ వేటు పడిన ఓ తహసీల్దార్ అవినీతికి మారుపేరుగా నిలిచి దొరికినకాడికి దోచేశారు. ఆయన ఏకంగా తన చాంబర్లోనే పైరవీకారులతో లావాదేవీలు కొనసాగిస్తున్న వైనాన్ని గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అవినీతి అధికారిపై పెద్దఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు.. ఇటీవల ఆయనపై బదిలీ వేటు వేయడం జిల్లా కేంద్రంలో హాట్ టాఫిక్గా మారింది. అధికారుల సంతకాలు ఫోర్జరీ.. తహసీల్దార్ కార్యాలయం వద్ద తిష్టవేసిన కొందరు రైటర్లు ఏకంగా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ధ్రువపత్రాలు జారీ చేసిన ఘటనలు వెలుగుచూశాయి. వీటిపై సదరు అధికారులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు సైతం చేశారు. అయితే అవినీతికి కేరాఫ్ అడ్రస్గా పేరుగాంచిన సదరు పెద్ద సార్ అండగా నిలవడంతో ఎలాంటి చర్యలు లేకుండాపోయాయి. అనుమతులు లేకుండానే.. తహసీల్దార్ కార్యాలయ పరిసర ప్రాంతంలో రాజీవ్మార్గ్ రోడ్డు పక్కన వెలసిన రైటర్లకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు కాని.. రైటర్లుగా కొనసాగేందుకు ఎలాంటి లైసెన్స్ లేవు. కానీ వీరు మాత్రం రోడ్డుపక్కన దర్జాగా టేబుళ్లు, కుర్చీలు వేసుకుని అక్రమాలకు పాల్పడున్నారు. కాగా, అనుమతులు లేకుండా వ్యాపారాలు, ఇతర లావాదేవీలు చేస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అక్రమార్కుల వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇందుకు వారికి చోటామోటా లీడర్లు అండగా నిలిచి కొమ్ముకాస్తుండటమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా పేరుగాంచి బదిలీ వేటుకు గురైన సదరు పెద్ద సార్ స్థానంలో కొత్తగా వచ్చిన అధికారి బాధ్యతలు స్వీకరించేందుకు బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం. ఏ ఫైల్ ఎక్కడ ఉందో.. ఎక్కడ మాయం చేశారో అనే భయంతో ఉన్నారనే ప్రచారం ఉందంటే.. గతంలో ఇక్కడ పనిచేసిన పెద్ద సార్ ఏస్థాయిలో దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. కొత్తగా వచ్చే అధికారి మూడంచెల అక్రమాలకు చెక్పెట్టి నేరుగా సేవలు అందించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మూడంచెలుగా పైరవీకారులు..
గద్వాల తహసీల్దార్ కార్యాలయ ప్రహరీని అనుసరించి రాజీవ్మార్గ్ రోడ్డు వెంట కొందరు రైటర్ల ముసుగులో తిష్టవేశారు. కార్యాలయంలో ఏ చిన్న పనికావాలన్నా వీరి ద్వారానే జరగాలన్నది ఇక్కడి రూల్. ప్రతి పనికి వీరు రేట్లు ఫిక్స్ చేశారు. కాలయాపన లేకుండా కులం, ఆదాయం, లోకల్ సర్టిఫికెట్ కావాలంటే రూ.200 నుంచి రూ. 500 వరకు చెల్లించాల్సిందే. అదే విధంగా భూ సంబంధ డాక్యుమెంట్లకు రూ. 1,000 నుంచి రూ. 1,500 చెల్లించాలి. ఇక ప్రభుత్వం పేదలకు అందించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలకు ఏకంగా రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు ముట్టజెప్పాల్సిందే. మొదటి దశలో ఇలా ఫిక్స్ చేసిన ధరలు సదరు రైటర్లకు చెల్లిస్తేనే పనికి సంబంధించిన ఫైళ్లు రెండో దశలో కార్యాలయం వెలుపల చెట్లకింద ఉండే పైరవీకారుల వద్దకు వెళ్తుంది. ఈ పైరవీకారులు మూడవ దశలో కార్యాలయంలో పెద్ద సార్ను సంప్రదిస్తారు. అనంతరం సదరు పెద్ద సార్కు ముడుపులు ముట్టజెప్పిన అనంతరం ఫైళ్లు సంబంధిత సెక్షన్ అధికారుల టేబుల్పైకి చేరుతుంది. అక్కడ కూడా వారికి చెల్లించాల్సిన ముడుపులు అందిన తర్వాత ఫైళ్లకు మోక్షం లభిస్తుంది. ఇలా గద్వాల మండల రెవెన్యూ కార్యాలయంలో మూడంచెల అవినీతికి పాల్పడుతూ గత తహసీల్దార్ రూ. కోట్లలో దోచుకున్నారని సదరు కార్యాలయ సిబ్బందే బాహాటంగా చర్చించుకుంటున్నారు. -
అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
అలంపూర్: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాలకు చెందిన 515 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నానని.. ఒకేసారి ఇంత మంది లబ్ధిదారులకు చెక్కులు అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
రేపు మెగా ఉద్యోగ మేళా
గద్వాలన్యూటౌన్: మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.మీనాక్షీ, సీపీడీసీ మెంబర్ సాయిశ్యామ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో ఉద్యోగ మేళా బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మేళాలో జస్ట్ డయల్, క్యాలిబర్, మెడ్ ప్లస్, టాషియన్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగానికి ఎంపికై న వారికి అదే రోజు అపాయిమెంట్ లెటర్ అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్, కేరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ సమత, అధ్యాపకులు దేవుజా, జగన్మోహన్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
గద్వాల క్రైం: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ ఈ నెల 22 నుంచి రెండో దశ అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా గద్వాల, అలంపూర్, అయిజ, మానవపాడు, ఇటిక్యాల, శాంతినగర్, ధరూరు, మల్దకల్ తదితర మండలాల్లో పోలీసు సిబ్బంది వాహనాదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై వాహనదారుల్లో అవగాహన పెంపొందించడం, సురక్షిత ప్రయాణం కల్పించడమే అరైవ్.. అలైవ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వారం రోజులపాటు అవగాహన కార్యక్రమా లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మరోవైపు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. -
ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యం
అలంపూర్/మానవపాడు: ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా 108, 102 సిబ్బంది పనిచేయాలని నేషన ల్ క్వాలిటీ ఆడిటర్ షేక్ ఫయాజ్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో మంగళవారం అలంపూర్, ఉండవెల్లి, వడ్డేపల్లి మండలాలకు చెందిన 108, 102 అంబులెన్స్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్ల్లో ఆక్సిజన్ సిలిండర్లు, సక్షన్ మెషీన్, మానిటర్లు, స్ట్రెచర్లు తదితర పరికరాల పనితీరుతో పాటు మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, స్టాక్ రిజిస్టర్, పేషెంట్ కేర్ తదితర రికార్డులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, రోగుల తరలింపు, పరిశుభ్రత, భద్రతా నియమాలపై ఆరా తీశారు. సేవలను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. 108 సిబ్బంది ప్రజలకు అంకితభావంతో సేవలు అందించాలన్నారు. అత్యవసర సమయాల్లో ఒక క్షణం కూడా ఎంతో విలువైనదని.. ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లా మేనేజర్ రత్నమయ్య మాట్లాడుతూ.. 108 సేవలను ప్రజలకు అత్యవసర సమయంలో వేగవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వారి వెంట ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీ షియన్లు ఆనంద్, రాధామోహన్, రేణుక, దేవేందర్, పైలెట్లు నరేష్, సురేశ్ ఉన్నారు. -
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
గద్వాల: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివా హాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాల ని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31వ తేదీ వర కు చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమంలో 77 మంది బాలల ను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపా రు. 2019 నుంచి 2025 వరకు జిల్లావ్యాప్తంగా 2,323 మంది పిల్లలను రక్షించి.. వారికి పునరావా సం, విద్య ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన ట్లు వివరించారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికు లు ఉన్నా, బాల్యవివాహానికి యత్నించినా వెంటనే డయల్ 100 లేదా 1098 నంబర్లకు సమాచా రం అందించాలని ఆయన కోరారు. సమావేశంలో అద నపు కలెక్టర్లు నర్సింగ్రావు, శంకర్, జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి సునంద, డీఈఓ విజయలక్ష్మి ఉన్నారు. ● ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని.. హాల్టికెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావొద్దన్నారు. ఎవరైనా మాల్ప్రాక్టీస్కు పాల్పడికే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నిర్లక్ష్యమే ‘పాప’మైంది
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతర నిర్వహణ మొదలు, దాడి ఘటన, తర్వాత కేసుల దర్యాప్తులోనూ అధికారుల నిర్లక్ష్యం కనిపించిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. మంగళవారం జిల్లాలోని నాగర్కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఆలయం వద్ద సంఘటన చోటుచేసుకున్న ప్రదేశాన్ని బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల బృందం పరిశీలించింది. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికను పరామర్శించారు. వారి నుంచి ఘటనకు కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర బీసీ కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, సమగ్ర విచారణ చేపడుతున్నట్టు వివరించారు. కుమ్మెర గ్రామంలో ఆలయ పరిసరాలు, సంఘటనా స్థలం, బాధిత కుటుంబం ఇంటిని పరిశీలించిన తర్వాత పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, భద్రతాలోపాలు తేటతెల్లమయ్యాయని వెల్లడించారు. నిరసనలు ఉధృతం.. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాసంఘాల నాయకులు నిరసన శిబిరానికి చేరుకుని బాధితులకు మద్దతు తెలుపుతున్నారు. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసింది. ప్రభుత్వం దిగిరావాలి.. కుమ్మెర ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెండు నెలల పసిపాప ఉందని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దాడులు కొనసాగుతున్నాయని, వీటిని ప్రభుత్వం అరికట్టాలన్నారు. తమిళనాడులో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తరహాలో రాష్ట్రంలోనూ ఒక వర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వారి అరాచకాలు పెరిగాయని చెప్పారు. వారిపై ఇలాంటి దాడులుంటాయా? పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పైనే దాడులు కొనసాగుతున్నాయని, ఉన్నత వర్గాలపై ఇలాంటి దాడులు ఎక్కడైనా ఉంటాయా అని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ప్రశ్నించారు. ఉన్నత వర్గాల, పెత్తందారుల చేతుల్లో దాడికి గురైతే పోలీసులు మాత్రం బాధితులపైనే మొదట కేసులు పెట్టారన్నారు. ప్రజాసంఘాల ఒత్తిడితో మాత్రమే తర్వాత నిందితులపై కేసు పెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసిన నిందితులందరిపై చర్యలు తీసుకోవాలని, అందరినీ రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగాలి కుమ్మెరలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఎంపీ మల్లు రవి చెప్పారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. నేడు కేటీఆర్ రాక.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 10 వేలకు మించి భక్తులు.. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, టి.సురేందర్, బాలలక్ష్మి బృందం కుమ్మెర గ్రామాన్ని సందర్శించారు. 10 వేలకు మించి భక్తులు పాల్గొనే జాతర నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఆలయంలో టికెట్, నిర్వహణ విషయంలో ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా.. పూర్తిగా సర్పంచ్, గ్రామ పెద్దల పెత్తనమే కొనసాగిందన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయా ల్సి ఉండగా, కనీస స్థాయిలో ఏర్పాట్లు లేవన్నా రు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి పర్యవేక్షణ, ఏర్పాట్లు లేవని చెప్పారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొనే జాతరలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం దురదృష్టకరమన్నారు. కలెక్టర్ సంతో ష్, ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్, ఆర్డీఓ సురేశ్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరుల నుంచి వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర వివ రాలను నివేదిక అందించాలని ఆదేశించారు. కుమ్మెర ఘటనకు అధికారుల వైఫల్యమే కారణం రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ కరువు చిన్నారి మృతిపై విచారణ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లాకేంద్రంలో నాలుగోరోజు కొనసాగిన నిరసనలు -
శిల్పకళా నిలయం.. శ్రీరంగాపురం
● 2న శ్రీవారి కల్యాణం.. 4న రథోత్సవం ● వచ్చే నెల ఆరోతేదీ వరకుకొనసాగనున్న జాతర వనపర్తి రూరల్: జిల్లాలోని పురాతన వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా పేరొందిన శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుంచి ఉగాది పండుగ వరకు జాతర కొనసాగుతుంది. అన్ని ఆలయాల్లో రాత్రి వేళల్లో రథోత్సవం జరుగుతుండగా.. ఇక్కడ మాత్రం ఉదయం 10.30 గంటలకు రథోత్సవం నిర్వహించడం విశేషం. ఉత్సవాలకు స్థానికులేగాకా వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ చరిత్ర.. మండలంలోని కొర్విపాడు (నేటి శ్రీరంగాపురం)లో సుమారు 340 ఏళ్ల క్రితం (క్రీ.శ.1670 కాలంలో..) సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు హయాంలో ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది. గ్రామంలోని రంగసముద్రం చెరువు ఒడ్డున గరుడాద్రి మీద నిర్మించిన రంగనాయకస్వామి ఆలయం అపర శ్రీరంగంగా పేరొందింది. శ్రీరంగనాథస్వామి ఆలయం నిర్మాణంతో కొర్విపాడుగా పిలుచుకునే గ్రామం శ్రీరంగాపురంగా వాడుకలోకి వచ్చిందని ప్రతీతి. తమిళనాడులోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీరంగంకు సమానంగా ఇక్కడి శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగం వెళ్లి స్వామివారిని దర్శించుకునే శక్తిలేని భక్తులు శ్రీరంగాపురంలోని ఆలయాన్ని దర్శించి తరించవచ్చని భక్తుల నమ్మకం. ఉట్టిపడే శిల్పసంపద.. ఆలయంలోని అద్భుతమైన శిల్పకళాసంపద భక్తులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఆకాశాన్నంటే అంతస్తులతో ఆలయం భక్తులకు స్వాగతం పలుకుతోంది. శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమ వైపున చతుర్భుజ తాయారు ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం పక్కనే నాటి ప్రభువులు నిర్మించిన రంగసముద్రం అనే సువిశాలమైన చెరువు చూపరులను ఆకట్టుకుంటుంది. కార్యక్రమాల వివరాలు.. బుధవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, రాత్రి విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అంకురార్పణ, భేరీపూజ గురువారం ధ్వజారోహణం, రాత్రి దేవత ఆహ్వానం, భేరీపూజ 27న ఉదయం శ్రీవారి మూలమంత్ర హవనం, రాత్రి సూర్యప్రభ వాహనం 28న రాత్రి శేషవాహన తిరువీధి సేవ మార్చి 1న రాత్రి హనుమద్వాహన సేవ, మండపోత్సవం. 2న చతుస్థానార్చన, సాయత్రం 6 గంటలకు మోహిని అలంకారం, రాత్రి 8 గంటలకు గరుడవాహన సేవ, 10 గంటలకు శ్రీవారి కల్యాణం 3న ఉదయం శ్రీవారి సేవ, గజవాహన సేవ (చంద్ర గ్రహణం సందర్భంగా అనంతరం ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు ఆలయం మూసివేత) 4న ఉదయం 10 గంటలకు రథోత్సవం, తిరిగి రాత్రి 10.30 గంటలకు రథోత్సవం 5న ఉదయం శ్రీవారి మూలమంత్ర హవనం, రాత్రి పార్వేట, అశ్వవాహన సేవ 6న ఉదయం పూర్ణాహుతి, అవభృత స్నా నం, తీర్థప్రసాద వితరణ, రాత్రి ధ్వజ అవరోహణం, నాగవెల్లితో ఉత్సవాల ముగింపు. -
మొబైల్ యాప్తో సేవలు
గద్వాల: మీసేవ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టరేట్ ఏఓ భూపాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మొౖబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీసేవ కేంద్రంలో స్వీకరించే దరఖాస్తులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మీసేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వివరాలను యాప్లో నమోదు చేసి.. జియోట్యాగ్తో లైవ్ ఫొటోలు అప్లోడ్ చేయడం ద్వారా నకిలీ దరఖాస్తులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శివ, ఆర్ఐలు, గ్రామపరిపాలన అధికారులు పాల్గొన్నారు. నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత ధరూరు: జిల్లావ్యాప్తంగా బుధవారం మిషన్ భగీరథ పథకం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రవిచంద్రకుమార్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేవులపల్లి వద్ద ఉన్న మిషన్ భగీరథ పథకం హెడ్వర్క్స్ నీటిశుద్ధి కార్మాగారాన్ని శుభ్రపరిచేందుకు నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు పేర్కొ న్నారు. గురువారం యథావిధిగా సరఫరా ఉంటుందని తెలిపారు. బీచుపల్లి హుండీ ఆదాయం రూ.58.66లక్షలు ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయ హుండీని మంగళవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ సమక్షంలో లెక్కించారు. ఏడాదిగా భక్తులు సమర్పించిన కానుకలను రెండురోజుల పాటు లెక్కించగా.. రూ. 58,66,649 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ రామన్గౌడ్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో గద్వాల యూనియన్ బ్యాంకు సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బంది, వనపర్తి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,852 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 319 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,852, కనిష్టంగా రూ. 3,100, సరాసరి రూ. 6,700 ధర పలికింది. అదే విధంగా 24 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,116, కనిష్టంగా రూ. 6,889, సరాసరి రూ. 7,039 ధరలు వచ్చాయి. 10 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,129, కనిష్టంగా రూ. 6,019, సరాసరి రూ. 6019 ధరలు పలికాయి. -
సర్వం సిద్ధం..
● నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ● జిల్లాలో 14 కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 8,471 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు మాస్ కాపీయింగ్ నిరోధానికి సిట్టింగ్, ఫ్లయింగ్ సా్వ్క్డ్స్ ఏర్పాటుచేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో సీనియర్ లెక్చరర్తో పాటు రెవెన్యూ అధికారి, ఓ ఏఎస్ఐ ఉంటారు. సిట్టింగ్ స్క్వాడ్ బృందంలో ఇద్దరు సీనియర్ లెక్చరర్లు ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తారు. పోలీసు బందోబస్తు నడుమ పరీక్షలు సజావుగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులను పూర్థిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. నిమిషం నిబంధనను కొంత సడలించినారు. పరీక్ష కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులు, ఇన్విజిలేటర్లు తప్పనిసరిగా గుర్తింపుకార్డు తమ వద్ద ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికి కూడా సెల్ఫోన్ అనుమతి లేదు. గద్వాల: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇది పరీక్షా కాలం. ఇన్నాళ్లు తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టిన వారు ఇప్పుడు పరీక్షలు సజావుగా రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. ఉత్తమ ఫలితాలు రాబట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఆయా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇంటర్మీడియట్లో ప్రతిభ చాటితేనే ఉజ్వల భవితకు బాటలు పడతాయి. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు నర్సింగ్రావు, లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులతో ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్షించి.. పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. -
పసిబిడ్డ చనిపోయినా పట్టించుకోరా?
● బాధితులపైనే కేసులు పెడతారా.. ● కుమ్మెర ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కందనూలు: కుమ్మెర జాతరలో నిరుపేద కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిబిడ్డను కోల్పోయిన ఘటన దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు బిడ్డగా చెబుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఈ ప్రాంతంలోనే ఒక దళిత మహిళకు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యేల చేతిలో నియోజకవర్గ అధికారులంతా కీలుబొమ్మలుగా మారారని.. ఫలితంగానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలన విషయంలో పట్టు కోల్పోయారని ఆయన ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేస్తే.. దాడికి పాల్పడిన నిందితుల నుంచి ఫిర్యాదు తీసుకుని బాధితులపైనే కేసులు పెట్టే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే కొనసాగుతున్నాయని.. అమాయకులపై అక్రమ కేసులు బనాయించి అధికారాన్ని చెలాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, కట్టా సుధాకర్రెడ్డి తదితరులున్నారు. -
పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకం
ఎర్రవల్లి: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం పదో బెటాలియన్లో ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, రాజోలి, అయిజ మండలాలకు చెందిన 99 మంది సర్పంచులకు నిర్వహించిన రెండో విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సర్పంచ్ పదవి అత్యంత ముఖ్యమైనదని, ప్రతి సర్పంచ్ అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలన్నారు. ఐదు రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమానికి సర్పంచులు తప్పనిసరిగా హాజరై పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం అన్ని నియమాలు, నిబంధనలు, విధులు, నిధులు, 15వ ఫైనాన్స్ కమిషన్, ప్రభుత్వ పథకాల వినియోగం, అధికారుల సంప్రదింపు తదితర అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి, ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యకు బలమైన పునాదులుగా మార్చాలని కోరారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి.. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం సర్పంచుల బాధ్యత అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా సర్పంచులు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, బెటాలియన్ కమాండెంట్ జయరాజు, ఏఎస్పీ శంకర్, డీపీఓ శ్రీకాంత్, డీఎల్పీఓ ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశం హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై కలెక్టర్కు నేరుగా వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 64 ఫిర్యాదులు వచ్చాయని, వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఇన్చార్జి ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసరంలో సీపీఆర్ తప్పనిసరి
గద్వాల క్రైం: గుండె జబ్బుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో బయటపడేసి, ప్రాణాలను నిలిపే అద్భుతమైన వైద్య ప్రక్రియ సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససీటేషన్) అని జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి కిరణ్మయి అన్నారు. సోమవారం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీపీఆర్పై ఆర్బీఎస్కే సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సడెన్ హార్ట్ ఎటాక్ బారినపడిన సందర్భంలో సీపీఆర్ ద్వారా ప్రాణాలను నిలపవచ్చన్నారు. విశ్వసనీయమైన వైద్య సేవలతో, ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. రోగి ప్రాణాలను కాపాడటంలో సీపీఆర్ సమర్థవంతమైన వైద్య ప్రక్రియ అన్నారు. చాతీపై అరచేతుల సహాయంతో ఒత్తిడి ప్రయోగిస్తూ.. శ్వాస ప్రక్రియను పునరుద్ధరించాలని చెప్పారు. దీంతో అవయవాలకు రక్త సరఫరా జరిగి ప్రాణాపాయం తప్పుతుందున్నారు. సీపీఆర్ ద్వారా జీవనక్రియనాలు మూడు రెట్ల వేగంతో జరుగుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. సీపీఆర్పై పౌర సమాజానికి అవగాహన లేకపోవడంతో.. నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సిద్ధప్ప, రాజు, ఆర్బీఎస్కే నోడల్ అధికారి జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రం తనిఖీ మానవపాడు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సోమవారం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసూనరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వైద్యసిబ్బంది హాజరు పట్టిక, మందుల గది, ల్యాబ్, కాన్పుల గది, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వైద్య సిబ్బంది తప్పకుండా దీర్ఘకాలిక రోగాలకు మందులు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ల్యాబ్లో డెలివరీ అయిన తల్లి, బిడ్డలను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో హెలెన్, అక్కమ్మ, చంద్రన్న, తిరుమలరావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పామాయిల్ సాగుతో అధిక లాభాలు
ధరూరు: పామాయిల్ తోటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన అధికారి రాజశేఖర్ అన్నారు. సోమవారం మండలంలోని కోతులగిద్ద గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు గోవిందమ్మ అధ్యక్షతన రైతులకు పామాయిల్ సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్గకాలిక, స్థిరమైన ఆదాయ వనరు పామాయిల్ సాగుపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శాసీ్త్రయ పద్ధతులు, ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు, ప్రభుత్వం అందించే సబ్సిడీపై అవగాహన కల్పించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.


