breaking news
Jogulamba
-
నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్!
పాలన సూపర్ అంటే చాలు.. నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం.. మీ వెనుకే ఉంటాం అంటే అందలం.. ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్.. ..పాలమూరు యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో ఇటీవల జరుగుతున్న చర్చ ఇది. విశ్వవిద్యాలయ పరిపాలనలో ముఖ్య భూమిక వహిస్తున్న వారు సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష ప్రదర్శిస్తూ.. అనుభవం లేకున్నా తమ అనుకూల వర్గానికి కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది రెండు (రెగ్యులర్, కాంట్రాక్ట్) గ్రూప్లుగా చీలిపోగా.. అంతర్గత వార్ ముదిరినట్లు సమాచారం. పాలకుల ఏకపక్ష వైఖరి, అసమర్థ నిర్ణయాలతో పీయూలో పాలనగాడి తప్పిందనే విమర్శల నేపథ్యంలో ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పాలన సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష 8 ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఐదింట కాంట్రాక్ట్ లెక్చరర్లే.. ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే కీలక బాధ్యతలు అనుభవం ఉన్నా.. మిగతా వారికి మొండిచేయి -
కొలువుదీరిన బొజ్జగణపయ్య
గద్వాలన్యూటౌన్: వినాయక చవితి ఉత్సవాలను సోమవారం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమా రు వెయ్యికి పైగా వినాయక ప్రతిమలను ప్రతి ష్ఠించారు. రంగురంగుల విద్యుద్దీపాలు, పలు రకాల పుష్పాలతో గణేశ్ మండపాలను శోభా యమానంగా తీర్చిదిద్ది.. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడికి ఇష్టమైన వంటకాలతో నైవేద్యాలు సమర్పించారు. వాడవాడలా భక్తి గీతాలు, భజనలతో హోరెత్తాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గణనాథులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దర్శించుకున్నారు. ఆయా మండపాల వద్ద పార్వతీ తనయుడికి ప్రత్యేక పూజలు చేశారు. సకాల విఘ్నాలు తొలిగి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. డీసీసీ అధ్య క్షుడు రాజీవ్రెడ్డి, కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. -
కేఎల్ఐకి పాలమూరు నీరు
నాగర్కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నీటిని కేఎల్ఐ ఆయకట్టుకు అనుసంధానించే మరో మార్గం అందుబాటులో ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని మళ్లించేలా గతంలోనే ఏర్పాటు చేసిన ఇంటర్లింక్ స్లూయిస్ ఇందుకు ఉపయోగపడనుంది. నార్లాపూర్–ఎల్లూరు రిజర్వాయర్లను జంట జలాశయాలుగా పరిగణించేలా ఈ అనుసంధానం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే పీఆర్ఎల్ఐ ద్వారా నార్లాపూర్లోకి వచ్చే నీటిని ఎల్లూరుకు మళ్లించి.. అక్కడి నుంచి కేఎల్ఐ పరిధిలోని ఇతర రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. పీఆర్ఎల్ఐ నీటితో కొత్త వెసులుబాటు శ్రీశైలం నుంచి ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక పంపు పనిచేస్తే సుమారు 800 క్యూసెక్కులు, రెండు పంపులు పనిచేస్తే 1,600 క్యూసెక్కుల వరకు నీటిని తరలించే సామర్థ్యం ఉంది. అయితే విద్యుత్ సమస్యలు, పంపుల నిర్వహణ, మరమ్మతుల కారణంగా నిరంతరాయంగా పంపింగ్ చేయడం కష్టంగా మారుతోంది. దీంతో కేఎల్ఐ కాల్వలకు ఆశించిన స్థాయిలో నీరు చేరడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పీఆర్ఎల్ఐ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి ఎల్లూరుకు మళ్లించే అవకాశం ఉందని సంబంధిత ఇంజినీర్లు చెబుతున్నారు. రోజుకు 0.3 టీఎంసీ ఎత్తిపోత పీఆర్ఎల్ఐలో ఒక పంపును రోజంతా నడిపితే సుమారు 0.3 టీఎంసీ నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో సుమారు 4 టీఎంసీల నీరు ఉన్నట్లు అంచనా. రిజర్వాయర్లోకి మరింత నీటిని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో.. అవసరమైనప్పుడు ఇంటర్లింక్ ద్వారా ఎల్లూరుకు తరలించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు. నార్లాపూర్ నుంచి స్లూయిస్ ద్వారా నీటిని ఎల్లూరులోకి విడుదల చేసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. గుడిపల్లి నుంచి కేఎల్ఐ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు. అటు నుంచి నీటి తరలింపు.. ఇటు వినియోగంపై ఆందోళన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ.. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలిస్తున్నదని తెలంగాణకు చెందిన నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 8 వేల క్యూసెక్కులు, వెలిగొండ ద్వారా 3,500 క్యూసెక్కులు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి తదితర మార్గాల ద్వారా మరో 3,500 క్యూసెక్కుల వరకు నీటిని తరలించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. మొత్తం మీద సుమారు 15 వేల క్యూసెక్కుల వరకు నీరు తరలిపోతే శ్రీశైలం నిల్వలు వేగంగా తగ్గే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తనకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. పీఆర్ఎల్ఐ పంపులను అందుబాటులోకి తెచ్చి, నార్లాపూర్–ఎల్లూరు అనుసంధానాన్ని వినియోగిస్తే కేఎల్ఐకి నీటి లభ్యత పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ అవకాశం ఉంది నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని పంపించే అవకాశం ఉంది. రెండు రిజర్వాయర్ల మధ్య ఇంటర్లింక్ నిర్మించారు. పాలమూరు–రంగారెడ్డి నీటిని స్లూయిస్ ద్వారా కేఎల్ఐకి సంబంధించిన ఎల్లూరు రిజర్వాయర్కు పంపించడానికి వీలుంది. – లోకిలాల్ నాయక్, కేఎల్ఐ డీఈఈ నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు మళ్లించే అవకాశం ఇంటర్లింక్ స్లూయిస్తో రోజు 800 క్యూసెక్కుల వరకు తరలింపునకు వీలు కేఎల్ఐ పరిధిలో పెరగనున్న నీటి లభ్యత.. ఆయకట్టుకు ప్రయోజనం -
భార్య కుటుంబం.. పోలీసులే కారణం
● మృతుడి సూసైడ్ నోట్లో ఆరోపణలు.. పోలీసుశాఖలో కలకలం ● భార్య ఫిర్యాదుతో కేసు.. సఖి సెంటర్లో కౌన్సెలింగ్ ● మనస్తాపంతో ఈ నెల 5న బూరెడ్డిపల్లి గ్రామవాసి నరేశ్చారి ఆత్మహత్యయత్నం.. చికిత్స పొందుతూ మృతి గద్వాల క్రైం: భార్యతో వివాదాలు, పోలీసుల వ్యవహార తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి భార్య కుటుంబసభ్యులతో పాటు కొందరు పోలీసులు కారణమంటూ అతడు రాసినట్లు చెబుతున్న లేఖ వెలుగులోకి రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అయితే మృతుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆరోపణలపై విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ధరూరు మండలం బూరెడ్డిపల్లికి చెందిన వడ్ల నరేశ్చారి (34) కేటీదొడ్డి మండలానికి చెందిన రాణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొంతకాలం హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసిన దంపతులు అనంతరం గద్వాలలోని రెండో రైల్వేగేట్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సుమారు రెండు నెలల క్రితం నరేశ్చారి ప్రవర్తనపై రాణి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సఖీ సెంటర్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులపై ఆరోపణలు ఈ క్రమంలో తన భార్యకు ఓ ఏఆర్ కానిస్టేబుల్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నరేశ్చారి ఆరోపించినట్లు సమాచారం. తనపై తప్పుడు కేసు నమోదుకు కానిస్టేబుల్తో పాటు తన తల్లి, భార్య తమ్ముడు కారణమని పేర్కొంటూ గత జూన్ 25న ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్, ఏఆర్ కానిస్టేబుల్ బాలు, అత్త సరిత, కిట్టుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భార్య తిరిగి తనతో కాపురానికి రావాలని నరేశ్చారి కోరినప్పటికీ ఆమె అందుకు అంగీకరించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ నెల 5న శంషాబాద్ ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. పది రోజుల పాటు చికిత్స పొందుతూ సోమవా రం మృతి చెందాడు. సూసైడ్ నోట్లో ప్రస్తావన తన మృతికి భార్య కుటుంబ సభ్యులు, కొందరు పోలీసులు కారణమంటూ నరేశ్చారి లేఖ రాసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తనకు న్యాయం జరగలేదని, తన మృతితోనైనా న్యాయం జరుగుతుందని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. మృతదేహం తరలింపులో హైడ్రామా నరేశ్చారి మృతదేహాన్ని సోమవారం రాత్రి గద్వాలలోని ఆయన అద్దె ఇంటి వద్దకు తీసుకురాగా.. ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మృతదేహాన్ని భార్య ఉంటున్న ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో ఎస్ఐ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని సూచించిన క్రమంలో కొంత గందరగోళం చోటుచేసుకుంది. చివరకు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా.. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. విచారణ కొనసాగుతోంది.. నరేశ్చారిపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చామని ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదన్నారు. కానిస్టేబుల్పై చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఆత్మహత్యకు పోలీసులను కారణంగా పేర్కొనడం సరైనది కాదని, మృతుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నరసింహాచారి ఎవరో తనకు తెలియదని, తనపై ఏదైనా ఆరోపణ ఉంటే న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. -
ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే..
పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్కుమార్, కిషోర్కుమార్, నూర్జహాన్, జైపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, చంద్రకిరణ్కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్ చంద్రకిరణ్కు తప్ప.. మిగతా ఐదుగురు సీనియర్లకు ఏ రకమైన కీలక బాధ్యతలు ఇవ్వకుండా మొండిచేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రిజిస్ట్రార్గా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డికి పీజీ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు వీసీ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కరికి 2, 3 బాధ్యతలు.. యూనివర్సిటీ పరిధిలోని ఎనిమిది ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఏకంగా ఐదింటిని కాంట్రాక్ట్ అధ్యాపకులతో భర్తీ చేయడం.. ఒక్కరికి రెండు, మూడు పోస్టుల చొప్పున ఇవ్వడం.. ప్రొఫెసర్ హోదాలో ఉన్న సీనియర్లను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, నామమాత్రపు పోస్టుల్లో నియమించడం విమర్శలకు తావిస్తోంది. రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని కాదని.. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రాధాన్యమివ్వడంపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘సర్’ ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాల: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియలో భాగంగా అన్మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేయాలన్నారు. హియరింగ్కు రాని వారి ఇంటికి బీఎల్ఓలు స్వయంగా వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ సేకరించాలని సూచించారు. అదే విధంగా చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకునే భవిత కేంద్రాల్లోని వికలాంగులైన పిల్లలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇతర వర్గాల వారు కూడ పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నందున అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆయా మండలాల వారీగా దరఖాస్తుదారుల వివరాలను నోటీసు బోర్డులో ప్రకటించాలని తెలిపారు. వీటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అర్హులైన వారికి మంజూరు చేయాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో చేసిన పనుల బిల్లులను పరిశీలించి, జిల్లా పంచాయతీ కార్యాలయానికి పంపించాలన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా పంట పొలాల్లో నీటికుంటలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోర్వెల్స్ రీచార్జ్ పనులను చేపట్టాలన్నారు. ఈ నెల 17న అన్ని కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ● ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. శిశువులకు ఆరునెలల వరకు తల్లిపాల ఆవశ్యకత, అంగన్వాడీ చిన్నారులు బాలమృతం సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 22 నుంచి ఉన్నత, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని సుమారు 40వేల మంది విద్యార్థులకు హెల్త్కార్డులు పంపిణీ చేయడంతో పాటు వివిధ రకాల పరీక్షలను నిర్వహించి, వివరాలను నమోదు చేయాలన్నారు. అనంతరం బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు అనే గోడపత్రికను విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీడబ్ల్యూఓ సునంద, డీఈఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ ముసాయిదాబేగం, డీపీవో శ్రీకాంత్, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్పాషా పాల్గొన్నారు. -
కులాంతర వివాహం జీర్ణించుకోలేకే ఇల్లు కూల్చివేత
గద్వాల క్రైం: కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేకే అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిని కూల్చివేశారని, ఈ మేరకు నిందితులను శనివారం అరెస్టు చేశామని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గద్వాల మండలం రేపల్లె గ్రామానికి చెందిన దళిత యువకుడు రంగముని, బోయ మహేశ్వరి హైదరాబాద్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ నెల 10న రంగముని ఇంటిని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ సంఘటనపై రంగముని చిన్నాన్న చిన్నగోపాల్ అదేరోజు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిని ధ్వంసం చేసి తప్పించుకుని తిరుగుతున్న వీరన్న, పరుశ, వెంకటేష్, పరుశ, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్నలను శనివారం సాయంత్రం గ్రా మ శివారులో ఉన్నట్లు సమాచారం మేరకు సి బ్బంది వారిని అదుపు లోకి తీసుకున్నారన్నా రు. నిందితులను విచారణ చేయగా నేరం అంగీకరించడంతో ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులను అలంపూర్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలి స్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రజలందరూ సోదరభావంతో కలసిమెలసి ఉండాలన్నారు. ప్రజ ల ప్రాణాలు, ఆస్తులపై దాడులు చేస్తే క్రిమినల్ కే సులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తు తం రేపల్లె గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొందని డీఎస్పీ చెప్పారు. -
ఎగువ జలకళ.. దిగువ వెలవెల!
అమరచింత: భూత్పురు రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎగువన ఉన్న రైతులు కాల్వ తూముల షట్టర్లను పగులగొట్టి సాగునీటిని తమ తమ గ్రామాలకు తీసుకెళ్తుండటంతో దిగువన ఉన్న పంట పొలాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. భూత్పురు రిజర్వాయర్ నుంచి అమరచింత, ఆత్మకూర్ మండలాలకు సాగునీరు అందించే భూత్పురు కాల్వ వెంట ఆయకట్టు రైతులు నిత్యం తిరగాల్సిన దుస్థితి నెలకొంది. 32వేల ఎకరాల ఆయకట్టు.. భూత్పురు రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో మక్తల్, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాలు ఉండగా.. మొత్తం 35 గ్రామాల్లోని 32వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రతి వర్షాకాలంలో జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని భూత్పుర్ రిజర్వాయర్కు.. అక్కడి నుంచి కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నారు. ఈసారి గత జూలైలో ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. అయితే చివరన ఉన్న అమరచింత పెద్ద చెరువు, పిన్నంచర్ల గ్రామ చెరువుల్లోకి సాగునీరు చేరుకోలేకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఏడాది పొడవునా కేవలం ఒకే ఒక పంటను పండించుకునే రైతులకు ఈసారి సాగునీరు వస్తుందని ఆరుతడి పంటలను సాగుచేసుకున్నారు. తీరా కాల్వ ద్వారా సాగునీరు రాకపోవడం.. నీటిని ఎగుమ గ్రామాల రైతులు మళ్లించుకుని వెళ్తున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అమరచింత, పిన్నంచర్ల గ్రామాల రైతులు నిత్యం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, యాంకి గ్రామాల వరకు కాల్వ వెంట వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలో రైతులు.. భూత్పురు కాల్వ నీటిని మళ్లించుకునే యత్నంలో భాగంగా నీరు ముందుకు వెళ్లకుండా తూముల షట్టర్లను పగులగొట్టి మూసి ఉంచుతుండటంతో చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరచింత మండలంలోని ధర్మపురం గ్రామానికి సాగునీటిని మళ్లించే తూముతో పాటు మస్తీపురం గ్రామానికి సాగునీటిని మళ్లించే తూమును గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టడంతో సమస్య జటిలంగా మారింది. మూడు నెలలుగా కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నా సమీప చెరువులకు సైతం నీరు చేరకపోవడం ఏమిటని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. 32.5 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట అడుగుకో పంపుసెట్ ఏర్పాటు చేసుకుని పొలాలకు సాగునీటిని మళ్లించుకుని వెళ్తున్నా అరికట్టే వారే కరువయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూత్పురు రిజర్వాయర్ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు ఎగువన ఎడమ కాల్వ తూముల షట్టర్ల ధ్వంసం మూడు నెలలుగా నీరు పారుతున్నా నిండని చెరువులు అమరచింత, పిన్నంచర్ల రైతులకు తప్పని సాగునీటి కష్టాలు -
పెద్ద చెరువు బోసిపోతుంది..
భూత్పురు కాల్వ ద్వారా వచ్చే సాగునీటితో అమరచింత పెద్ద చెరువు నిండి అలుగు పారేది. ఈసా రి కాల్వకు సాగునీరు విడుదల చేస్తున్నా ఎగువలో ఉన్న రైతులు దిగువకు నీరు వెళ్లకుండా తూములను మూసివేసి, నీటిని తమ తమ గ్రామాలకు మళ్లించుకుంటున్నారు. దీంతో అమరచింత పెద్ద చెరువు నీరులేక బోసిపోయింది. బోరుబావులు కూడా రీచార్జి కావడం లేదు. పంటలు ఎండుముఖం పడుతున్నాయి. – లక్ష్మీనారాయణ, రైతు, అమరచింత లష్కర్తో పర్యవేక్షణ.. మక్తల్ మండలం నుంచి నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల వరకు విస్తరించి ఉన్న భూత్పురు కాల్వ వెంట లష్కర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. 32 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట ముగ్గురు లష్కర్లు మాత్రమే ఉన్నారు. తూముల షట్టర్లు ధ్వంసం చేశారని తెలుసుకున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిత్యం కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. – బాలకృష్ణ, ఏఈ, ఇరిగేషన్శాఖ ● -
సంరక్షణపై దృష్టి ఏది?
ప్రభుత్వం పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మొక్కలు నాటడమే లక్ష్యంగా కాకుండా అవి పెరిగే వరకు సంరక్షించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడంతోపాటు నీటి వసతి, రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. లక్షలో మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో బతికి ఉన్నవి ఎన్ని.. వాటి జాడ ఎక్కడ.. అనే దానిపై అధికారులు సమగ్రంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. కానీ, ఇంత వరకు బతికిన మొక్కల వివరాలు లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది జిల్లాకు వన మహోత్సవంలో భాగంగా 11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటికే 10 లక్షల మేర మొక్కలు నాటినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నారు. మరి ఇందులో ఎన్ని బతుకుతాయో వేచిచూడాలి. -
మచ్చలే మకుటంగా.. నల్లమల రాజసం
అచ్చంపేట: నల్లమల గిత్తగా పేరొందిన తూర్పు పొడ జాతి పశువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. తెలంగాణలో నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదాకు నోచుకోలేకపోతోంది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంత పశువుకు గౌరవం కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 2025 మే నెలలో అమ్రాబాద్ మండలం మాచారం వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. లోతట్టు అభయారణ్యంలో.. నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలురకం పొడ జాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు. కోడె దూడలకు డిమాండ్ వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి. తెలంగాణ బ్రాండ్గా తూర్పు పొడ జాతి పశువులు లోతట్టు ప్రాంతంలో మేలురకం పశు సంపద అమ్రాబాద్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర 500 మంది రైతులు.. 20 వేల పశువుల పెంపకం 2020లో ప్రత్యేక పశువుగా గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం కోసం ఎదురుచూపు -
మొక్కే కదా అని.. వదిలేశారు!
మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోంది. అడవులు పెంచాలని, చెట్టను పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా నీరుగారుతోంది. ప్రతిఏటా వన మహోత్సవం పేరుతో లక్షల్లో మొక్కలు నాటుతున్నామని అధికారులు గొప్పగా చెప్పుకొంటున్నా.. నాటిన మొక్కలను సంరక్షించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు. నాటడం వరకే తమ బాధ్యత అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మొక్కలు నాటుతూ ఫొటోలకు ఫోజులు ఇవ్వడం.. లెక్కల్లో చూపించడం తప్ప క్షేత్రస్థాయిలో పచ్చదనం కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు ప్రతిఏటా నాటిన మొక్కల సంఖ్యను లెక్కల్లో కలుపుకొంటూ పొతున్నారు. కానీ, వాస్తవంగా బతికి ఉన్న మొక్కలపై ఎప్పుడూ సర్వే చేయడం లేదు. నాటిన ప్రతి మొక్క ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో బతికి ఉన్నా మొక్కల సంఖ్య జిల్లావ్యాప్తంగా కోట్లలో ఉండాలి. లక్షలో నాటి.. లెక్కల్లో చూపి బతికి ఉన్న మొక్కల వివరాలు మాత్రం లెక్కలు లేకుండా పోయాయని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. రోడ్ల వెంట, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వాటి సంరక్షణను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో అనేక మొక్కలు ఎండిపోయి.. ఖాళీ ప్రదేశాలుగా దర్శనమిస్తున్నాయి. నాటుతారు.. నరుకుతారు జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో గ్రామాల్లోని విద్యుత్ స్తంభాల కింద, పంట పొలాల గెట్ల కింద మొక్కలు నాటడం.. ఆ తర్వాత పెరిగి.. వాటికి అడ్డుగా మారాయని నరకడం పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు. ఒక ప్రణాళిక, లక్ష్యంగా ముందుకు సాగి.. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏపుగా పెరిగేలా మొక్కలు నాటాలన్న విచక్షణ కూడా లేకపోవడం బాధాకరం. ఇకనైనా ఈ తీరు మారి మొక్కలు నాటడంతోపాటు సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. నాటడమే కానీ, సంరక్షణ మరిచిన అధికారులు లక్షల్లో నాటుతున్నట్లు లెక్కల్లో చూపుతున్న వైనం బతుకుతున్నవెన్నో చెప్పలేని దుస్థితి ఆనవాళ్లు లేకుండాపోయిన గతంలో నాటిన మొక్కలు క్షేత్రస్థాయిలో నీరుగారుతున్న వనమహోత్సవ లక్ష్యం -
నైపుణ్యం కలిగిన పశువులు..
మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది. – హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం.. నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పొడ జాతి పశువులు ఉన్నాయి. ఈ పశు సంతతిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పశు జాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ పశువుల వల్ల నల్లమల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలువయ్య, మన్ననూర్, అమ్రాబాద్ మండలంప్రత్యేక హోదా కల్పిస్తాం.. నల్లమల పొడజాతి మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
జాతీయ లోక్ అదాలత్లో 8,486 కేసుల పరిష్కారం
గద్వాల క్రైం: జాతీయ లోక్ అదాలత్లో వివాదాలను పరిష్కరించుకుంటే కక్షిదారుల్లో సోదరభావం పెంపొందడంతోపాటు సమయం, డబ్బు, ఆదా అవుతుందని జిల్లా కోర్టు న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి కేసులు పరిష్కారం చేసుకోకుంటే ప్రయోజనం లేదన్నా రు. సాంకేతిక విప్లవంలో కేసుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇరువర్గాల కక్షిదారులు తమ విలువైన భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని కేసుల నుంచి విముక్తి పొందేందుకు కలిసిరావాలన్నారు. ఈ లోక్ అదాలత్లో 8,486 కేసులు పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసు లకు సంబంధించి ఇరువర్గాల వారిని రాజీ కు దిర్చినట్లు వెల్లడించారు. 16న కబడ్డీ జట్ల ఎంపిక గద్వాల న్యూటౌన్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షరాలు డీకే స్నిగ్ధారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాలుర, సబ్ జూనియర్ బాలికల కబడ్డీ జట్ల ఎంపికలు ఉంటాయన్నారు. ఎంపికలకు వచ్చే జూనియర్ బాలురు 5.11.2006 తర్వాత జన్మించి, 75 కిలోల లోపు బరువు, సబ్ జూనియర్ బాలికలు 13.12.2010 తర్వాత జన్మించి, 55 కిలోల లోపు బరువు ఉన్నవారు అర్హులు అన్నారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు 10వ తరగతి సర్టిఫికెట్, ఆధార్కార్డు, బోనోఫైడ్ ఒరిజినల్ తీసుకురావాలని సూచించారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 94407 26887, 99511 03371లను సంప్రదించాలని కోరారు. దళితులపై సీఎంది కపట ప్రేమ గద్వాల: దళితులపై సీఎం రేవంత్రెడ్డికి ఉన్నది కపట ప్రేమ అని, మరో కులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళితుడి ఇళ్లు కూలగొట్టించిన సర్పంచ్ని ప్రభుత్వం కాపాడుతుండడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కులాంతర వివాహాం చేసుకున్న ఎస్సీ యువకుడి ఇంటిని సర్పంచ్ అండతోనే యువతి కుటుంబ సభ్యులు కూల్చివేశారన్నారు. ఇది పూర్తిగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే నేరమని, అమావనవీయ ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులందరీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ కుట్రతోనే విధ్వంసం జరిగిందని యువతి తెలిపారన్నారు. అయినా ఎఫ్ఐఆర్లో ఇప్పటి వరకు సర్పంచ్ పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. -
సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి
ఎర్రవల్లి: రైతులు క్రమం తప్పకుండా పంటలను పరిశీలిస్తూ.. సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. శుక్రవారం మండలంలోని కోదండాపురం, వేముల గ్రామాల్లో పంట పొలాలను టీఆర్వీకే సమన్వయకర్త డా.అర్చన, ఆర్ఏఆర్ఎస్ పాలెం శాస్త్రవేత్తలు శ్రీరామ్, మమత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తిలో రసం పీల్చే పురుగు ఉధృతి.. తేమ ఒత్తిడి, మిరపలో త్రిప్స్ కారణంగా ఆకులు పైకి ముడుచుకోవడం.. కందిలో స్టెరిలిటీ మొసాయిక్ తెగులు, హెలికోవర్పా పురుగు ఉధృతిని గమనించారు. రసం పీల్చే పురుగుల నివారణకు చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఎసిటమాప్రైడ్ 20శాతం ఎస్పీ ఎకరాకు 100 గ్రాములు లేదా థయోమెథాక్సమ్ 25శాతం డబ్ల్యూజీ ఎకరాకు 100 గ్రాములు వినియోగించాలని సూచించారు. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడరాదని సూచించారు. మిరపలో త్రిప్స్, దోమ, నల్లి నివారణకు నీలి, పసుపు, తెలుపు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైనప్పుడు స్పినెటోరమ్ 11.7శాతం ఎస్ఈ ఎకరాకు 160 ఎం.ఎల్. లేదా స్సినోసాడ్ 45శాతం ఎస్ఈ ఎకరాకు 75 ఎం.ఎల్. పిచికారీ చేయాలని సూచించారు. వైరస్ లక్షణాలతో తీవ్రంగా ప్రభావితమైన మొక్కలను తొలగించి నాశనం చేయాలన్నారు. కందిలో స్టెరిలిటి మొసాయిక్ తెగులును వ్యాప్తిచేసే ఎరియోఫైడ్ మైట్ను నియంత్రించేందకు సిఫార్సు చేసిన అకారిసైడ్ను వినియోగించాలని తెలిపారు. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 5శాతం ఎస్జీ ఎకరాకు 100 గ్రాములు, క్లోరాంట్రనిలిప్రోల్ 18.5 శాతం ఎస్ఈ ఎకరాకు 60 ఎం.ఎల్. సిఫార్సు మేరకు ఉపయోగించాలని సూచించారు. వారి వెంట ఏఓ సురేశ్గౌడ్, ఏఈఓలు ఉన్నారు. -
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన
మల్దకల్లో ధర్నా చేస్తున్న రైతులు మల్దకల్: వ్యవసాయానికి విద్యుత్ కోతలను నిరసి స్తూ రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం మల్దకల్ బస్టాండ్ చౌరస్తాలో అయిజ – గద్వాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో రో డ్డుపైకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా విద్యుత్ సమస్య తీవ్రంగా మారిందన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి కారణాలు లేకుండానే కోతలు విధిస్తున్నారన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించి.. పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రైతులకు సంఘీభావం తెలిపారు. రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విద్యుత్ ఏఈ రాజేశ్ ధర్నా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు తిరుపతిరెడ్డి, వెంకటేశ్, నాగరాజు, కృష్ణారెడ్డి, తిమ్మన్న పాల్గొన్నారు. -
ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని సమ్మె
ర్యాలీ నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు గద్వాలన్యూటౌన్: వారానికి ఐదు రోజుల పనిదినాలను కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో వాణిజ్య బ్యాంకులతోపా టు గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టా రు. ఈ సందర్భంగా స్థానిక ఎస్బీఐ నుంచి యూ బీఐ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం యూ నియన్ నాయకులు ప్రభాకర్రెడ్డి, రవికుమార్, కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలనే తమ డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ విధానం అమలైతే ఉద్యోగుల పని–వ్యక్తిగత జీవన సమతుల్యత మెరుగుపడటంతో పాటు మరింత ఉత్పాహంతో ఖాతా దారులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సందీప్, దిల్కరన్, శ్రీకాంత్రెడ్డి, విజయ్కుమార్, విశ్వేశ్వర్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా సేవలు అందించాలి
ఇటిక్యాల: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాగం పనిచేయాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించంతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై ప్రజలు అందించే అర్జీల పరిష్కారంపై నిర్ల క్ష్యం చేయొద్దన్నారు. పెండింగ్ దరఖాస్తులను ని బంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ కార్యాలయానికి వ చ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది సమయపాలన పాటించాలన్నా రు. సర్ ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తిచేసే లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఆర్ఐలు మధు, మనోహర్ ఉన్నారు. -
మట్టి గణపతులను పూజిద్దాం
అలంపూర్: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని ప్రముఖ సంగీత దర్శకుడు వీడీ శ్రీకాంత్ దేవా పిలుపునిచ్చారు. అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో శుక్రవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. దేవాదాయ, ధర్మాదాయశాఖ ప్రోత్సాహంతో సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా, గాయకులు మహతి, లక్ష్మీగాయంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా తమ పాటల ద్వారా పర్యావరణంపై అవగాహన కల్పించారు. భక్తులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కోరారు. ఆలయాల్లో పర్యావరణ పరిరక్షణకు సహకరించిన ఈఓ దీప్తికి వారు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎర్రబారుతోంది..
–8లో uఅయిజ: తెల్లబంగారం ఎర్రబారుతోంది. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఈ సారి రైతులు 1,72,572 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. అయితే పగలు ఎండ ఎక్కువగా ఉండటం.. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. దీనికి తోడు రసంపీల్చే పురుగులు, దోమలు (జాసీడ్స్) వంటి కీటకాలు దాడి చేయడంతో పంట మరింత వేగంగా దెబ్బతింటోంది. జిల్లాలోని అనేక శివార్లలో పత్తిపంట ఎర్రబారి కనిపిస్తోంది. మొదట ఆకులు పసుపు రంగులోకి మారి, తర్వాత గులాబీ ఎరుపు రంగును సంతరించుకుని రాలిపోతున్నాయి. కాయలు తెరుచుకుని తెల్లని పత్తి కనిపించిన్పటికీ.. ఆకులు రాలడం ద్వారా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే రైతులు దీన్ని ఎర్ర తెగులుగా భావిస్తున్నారు. భయపడి నీరు కడితే మొత్తం పంటకు వ్యాపిస్తుందని.. నీటి తడులు పెట్టడం ఆపేస్తున్నారు. అలంపూర్ 2,090 ధరూరు 4.630 గద్వాల 14,200 గట్టు 14,408 అయిజ 21,525 ఇటిక్యాల 13,170 కేటీదొడ్డి 6,050 మల్దకల్ 27,488 మానవపాడు 21,485 రాజోళి 9,400 ఉండవెల్లి 10,244 వడ్డేపల్లి 19,075 ఎర్రవల్లి 8,807 అధిక ఉష్ణోగ్రతలతో రంగు మారుతున్న తెల్లబంగారం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం ఆందోళనలో పత్తి రైతులు జిల్లావ్యాప్తంగా 1,72,572 ఎకరాల్లో సాగు -
విద్యుత్ ప్రైవేటీకరణను విరమించుకోవాలి
ధరూరు: ప్రభుత్వం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని జెన్కో ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం జూరాల హైడ్రో విద్యుత్ కేంద్రంలో జెన్కో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఆగస్టు 29న టీజీపీఈజేఏసీ ప్రతినిధులు, ట్రాన్స్కో, జెన్కో డిస్కంల ఎండీలతో నిర్వహించిన సంయుక్త సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చింనట్లు తెలిపారు. ఆయా సమస్యలపై రెండు వారాల్లో మరోసారి సమావేశం నిర్వహించి.. చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇచ్చిన హామీకి విరుద్ధంగా జెన్కో యాజమాన్యం యాదాద్రి థరమల్ విద్యుత్ కేంద్రంలో బూడిద నిర్వహణ విభాగం, బొగ్గు నిర్వహణ విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచేందుకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. -
పాడవుతున్నాయి..
ఈ ఏడాది పత్తిపంట బాగా వస్తుందని ఆశించాం. కానీ కాయలు పండకముందే పా డవుతున్నాయి. కొన్ని కాయ లు బయటకు మామూలుగానే కనిపిస్తున్నా.. లోపల చీల్చి చూస్తే పురుగు కనిపిస్తోంది. మందులు వినియోగించినా పూర్తిగా ఆగడం లేదు. – సత్యారెడ్డి, రైతు, అయిజ పత్తి పువ్వులు ముడుచుకుంటున్నాయి. కొని బోళ్లు ముందే తెరుచుకుంటున్నాయి. నూలు కూడా మచ్చలుగా మారుతోంది. ఈ ఒక సమ స్యే కాదు. రెండు సమస్యలు కలిసి వచ్చినట్లు ఉంది. అధికారులు పంట పొ లాలను పరిశీలించి రైతులకు సలహాలు ఇవ్వాలి – లింగన్న, రైతు, అయిజ ఉష్ణోగ్రతల్లో మార్పుతో పత్తిపంట ఎరుపు రంగులోకి మారింది. మెగ్నీషియం లోపంతో మరింతగా ఎర్రబారుతుంది. ఈ సమయంలో క్రిమికీటకాలు పంటపై ఎక్కువగా దాడి చేస్తాయి. పంటకు మెగ్నీషియం సల్ఫేట్, అసిపేట్ పిచికారీ చేయాలి. తేలికపాటి తడులు ఇచ్చి.. మొక్కల మొదళ్ల వద్ద నీరు నిలువకుండా చూసుకోవాలి. పుష్కలంగా నీరు ఉన్న రైతులు మాత్రమే ఇవి పాటించాలి. నీరు లేని వారు పంటను వదిలేయాలి. – వీరయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
హాస్టల్ డిపాజిట్ ఫీజు తగ్గించాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో హాస్టల్ డిపాజిట్ ఫీజు (మెస్) ను తగ్గించాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పీయూ రిజిస్ట్రార్ పి.రమేష్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది బీసీలు బాలురకు రూ.12,100, బాలికలకు రూ.9,100, ఎస్సీ, ఎస్టీలు బాలురకు రూ.11,100, బాలికలకు రూ.9,100, ఓసీలు బాలురకు రూ.18,100, బాలికలకు రూ.16,109 ఉండేదన్నారు. ఈ ఏడాది నుంచి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా బాలురకు రూ.18,000, బాలికలకు రూ.16,100 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇంత మొత్తం చెల్లించలేరని రూ.12 వేలకు తగ్గించాలన్నారు. -
తగ్గిన లడ్డు పరిమాణం.. కేసు నమోదు
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో శుక్రవారం తూనికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. లడ్డు పరిమాణం తక్కువగా ఉందని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా తూనికల జిల్లా అధికారి రవీందర్ మాట్లాడుతూ లడ్డూల తయారీలో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తులకు అందించే లడ్డు పరిమాణం 100 గ్రాములకు గాను 80 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
మరో ఏడాది ఆగాల్సిందే!
నాగర్కర్నూల్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. గతేడాది మే నెలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పర్యటించి 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఇంకా చాలా వరకు పనులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రెండు పంపుసెట్లు ప్రారంభించినా.. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి నిలిపివేశారు. ఏదుల రిజర్వాయర్కు నీటిని సరఫరా చేయడానికి ఓపెన్ కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటమే ఇందుకు కారణం. కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గట్టి రాయి ఉండటంతో నీరు వదలడానికి వీలు కాలేదని, ప్రస్తుతం రాయి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అసంపూర్తిగా ప్రధాన కాల్వ.. నార్లాపూర్ నుంచి ఏదుల మధ్యలో 6.4 కి.మీ., ప్రధాన కాల్వ ఉంది. దాదాపు 40– 25 మీటర్ల వెడల్పు, లోతు ఉంటుంది. కాల్వ తవ్వకాలు జరిగినా కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద హార్డ్ రాక్ ఉండటంతో పనుల్లో వేగం తగ్గింది. దాదాపు ఆ రెండు చోట్ల 8 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి, మట్టి ఉందని అధికారుల అంచనా. గతేడాది మే నెలలో నీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పర్యటించి కాల్వ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గతేడాది డిసెంబర్లోగా పనులు పూర్తి చేస్తే ఈ ఏడాది వానాకాలం సీజన్లో నీళ్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. పనులు కాలేదు. ఇంకా ఓపెన్ కాల్వలో కుడికిళ్ల వద్ద హార్డ్ రాక్తో కాల్వ త వ్వకాలు నెమ్మదించాయి. ఇందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని విమర్శలున్నాయి. తాజాగా పనులు డిసెంబర్లో గా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించినా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్ట్ల సమీక్షకు వచ్చిన తర్వాత పనుల్లో కొంత వేగిరం పెరిగిందనే చెప్పవచ్చు. ఏదేమైనా రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చేది 2027 వానాకాలం సీజన్లోనే. అప్పటి వరకు పాలమూరు– రంగారెడ్డి వినియోగంలోకి రాదు. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ కోసం ఉపయోగించుకునే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇక నార్లాపూర్– ఏదుల మధ్య ఓపెన్ కాల్వతోపాటు 16 కి.మీ., పొడవు సొరంగం ఉంది. సొరంగం పని దాదాపుగా పూర్తి కాగా.. ముందు భాగంలో 50 మీటర్ల పొడవు పని చేయాల్సి ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్లో ఉన్న వడ్డెర గుడిసెలు, సున్నపుతండా వాసులను ఇటీవల ఖాళీ చేయించారు. వచ్చే ఏడాది నాలుగు రిజర్వాయర్లకు నీళ్లు తరలనున్నాయి. ‘పాలమూరు–రంగారెడ్డి’ నీటికోసం తప్పని నిరీక్షణ నార్లాపూర్– ఏదుల మధ్య పూర్తికాని కాల్వ పనులు దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు చర్యలు డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశం.. మార్చి వరకు కొనసాగే అవకాశం ఆ మట్టి తొలిగిస్తేనే ఏదుల రిజర్వాయర్కు సాఫీగా నీరు నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ మధ్య ఓపెన్ కాల్వలో కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద ఉన్న రాయిని తొలిగింపు పనులు వేగవంతం చేశాం. డిసెంబర్ చివరిలోగా తొలిగింపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించాం. రాయి బ్లాస్టింగ్ చేసి లోతు నుంచి బయటకు రాళ్లు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగా ఉంది. కాల్వలో హార్డ్ రాక్ తొలిగిస్తే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీళ్లు తరలించవచ్చు. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్కు అక్కడి నుంచి కర్వెనకు ఎత్తిపోయడానికి పంపుసెట్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తయ్యి.. శ్రీశైలం ప్రాజెక్ట్లో నీళ్లు ఉంటే రిజర్వాయర్లోకి తరలించవచ్చు. – పార్థసారధి, ఇరిగేషన్ ఎస్ఈ ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను 2015లో రూ.35,200 కోట్ల అంచనాలతో అప్పటి సీఎం కేసీఆర్ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కింద నార్లాపూర్ నుంచి ఏదుల, ఏదుల నుంచి వట్టెం, మరోవైపు ఏదుల నుంచి కర్వెన, అక్కడి నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్లకు నీళ్లు తరలిస్తారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం రిజర్వాయర్లు దాదాపుగా పూర్తవగా.. ఉదండాపూర్ పనులు కొనసాగుతున్నాయి. పంపుహౌస్ల్లో మోటార్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. నీళ్లు వస్తే చాలు ఉదండాపూర్ రిజర్వాయర్ మినహాయిస్తే మిగతా రిజర్వాయర్లు ఏదుల, వట్టెం, కర్వెన నీటితో కళకళలాడుతూ.. భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయి. -
గణేష్ మండపాల వద్ద పటిష్ట నిఘా
గద్వాల క్రైం: గణేష్ మండపాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసి.. నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతల విషయాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్ నిర్వహించి అనుమానిత వ్యక్తులను గుర్తించాలన్నారు. గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిమజ్జన ఏర్పాట్లు, ఊరేగింపులో అల్ల ర్లు, ఘర్షణలకు తావులేకుండా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు బలగాలను నియమించాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా మండపాలు, భారీ శబ్ధంతో కూడిన సౌండ్ బాక్స్లు పెట్టిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలన్నారు. చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచి ప్రతి గూడ్స్ వాహనాలు, కంటైనర్లను తనిఖీ చేయాలన్నారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచార ణ చేపట్టాలని, అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. పోలీ సులపై బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం జిల్లా న్యాయశాఖలో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం ఏర్పాటు చేసి కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా వాదనలు వినిపించాలని, బాధితుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని సూచించా రు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిల య్య, సీఐలు శ్రీను, ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. -
పంటలు ఎండిపోతున్నా పట్టదా..?
రాజోళి: అసలే కరువు పరిస్థితులు.. ఆపై తీవ్రమైన కరెంట్ కోతలతో అరకొరగా సాగు చేసిన పంటలు ఎండిపోతున్నా అధికారులకు పట్టడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మాన్దొడ్డి, నసనూరు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, నౌరోజీ క్యాంపు తదితర గ్రామాల రైతులు గురువారం ఉదయం మాన్దొడ్డి సబ్స్టేషన్ వద్దకు చేరు కుని నిరసన తెలిపారు. రోజులో ఎన్నిసార్లు కరెంట్ తీస్తున్నారో తెలియక సతమతమవుతున్నామని, వ్యవసాయానికి ఇచ్చే సరఫరాలో నిత్యం కోతలే ఉండటంతో పంటలకు తడులు అందించలేపోతున్నామని వాపోయారు. ఇప్పటికే పంటలు ఎండు దశకు చేరిన క్రమంలో వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని, కరెంట్ అధికారులకు మాత్రం అది పట్టడం లేదన్నారు. ప్రస్తుతం తడులు అందితే పంటలకు బలమని చెప్పినా కరెంట్ కోతలు మాత్రం ఆగడం లేదని వాపోయారు. ఏ సమయంలో సప్లయ్ ఉంటుంది.. ఎప్పుడు కట్ చేస్తారు.. మళ్లీ ఎప్పుడు వస్తుందో చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అధికారుల తీరు ఇలాగే కొనసాగితే గ్రామ గ్రామాన రైతులు విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తారని, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోతలు తగ్గించి సక్రమంగా సరఫరా చేయాలని కోరారు. -
రైతులు పంట మార్పిడి విధానం చేపట్టాలి
ఇటిక్యాల: రైతులు పంట మార్పిడి విధానం చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. గురువారం ఆయన మండలంలోని సాతర్ల గ్రామ రైతువేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాతల అవగాహన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రైతులు తక్కువ కాలవ్యవధిలో పండే పంటలు, కూరగాయల ను సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు విచక్షణ రహితంగా ఎరువులు వాడటం వలన నేల గుళ్లుబారి దిగుబడి తగ్గడమే కాక పెట్టుబడి పెరిగి నేలలు నిస్సారంగా మారుతాయని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువులు వాడాలని అవసరం మేరకు మాత్రమే ఎరువులు ఉపయోగించాలని, నానో యూరియా, నానో డీఏపీ వాడాలని సూచించారు. పల్లీ @ రూ.7,811 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్కు గురువారం 95 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.7,811, కనిష్టంగా రూ.4,770, సరాసరిగా రూ.6,070 ధరలు లభించాయి. ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి కందనూలు: ఎయిడ్స్పై ప్రతిఒక్కరూ అవగాహన తప్పనిసరిగా ఉండాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆయన కార్యాలయంలో నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి గర్భవతికి హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చిన వారికి క్రమం తప్పకుండా ఏఆర్టీ మందుల వాడకంపై అవగాహన కల్పించాలని చెప్పారు. తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా సిబ్బంది కృషిచేయాలని సూచించారు. హైరిస్క్ గ్రూపులైన ఆటో, లారీ, ట్రక్ డ్రైవర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని, అవసరమైన వారికి హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. 13న ‘కబడ్డీ’ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 13వ తేదీన ఉదయం 9.30 గంటలకు జిల్లాస్థాయి జూనియర్ బాలు ర, సబ్ జూనియర్ బాలికల జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చే జూనియర్ బాలురు 05.11.2006 తర్వాత పుట్టినవారై 75 కేజీల లోపు బరువు ఉండాలని, సబ్ జూనియర్ బాలికలు 13.12.2010 తర్వాత పుట్టిన వారై 55కేజీల లోపు బరువు ఉండాలని పేర్కొ న్నారు. క్రీడాకారులు ఆధార్కార్డు, ఎస్ఎస్సీ ఒరిజనల్ మెమో, జనన ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈనెల 26 నుంచి 29 వరకు జూనియర్ బాలురు, సబ్ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉంటాయని తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గిరిజన నిరుద్యోగ యువత కోసం బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్ కో రా రు. గురువారం జిల్లా గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన మహాసభలో ఆయన మా ట్లాడారు. ఏటా విద్యార్థులు విద్యను ముగించు కుని బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనేక ప్రైవేట్ కంపెనీలు వెలుస్తున్నా రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ రంగంలోనూ స్థానికంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. -
భావితరాలకు స్ఫూర్తి ఐలమ్మ పోరాటం
గద్వాల: భూమి కోసం– భుక్తికోసం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించడమే ఆమెకు నిజమైన నివాళి అని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అప్పుడు పోరాటం చేసిన వారిలో ఐలమ్మ లాంటి చాలా కొద్ది మంది మహిళలు ఉన్నప్పటికీ ఆర్మీ లాంటి గెరిల్లా దళాలను ఏర్పాటు చేసి దోపిడి వ్యవస్ధకు వ్యతిరేకంగా పనిచేశారన్నారు. ఐలమ్మ జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆమె జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, నర్సింగరావు, ట్రెయినీ కలెక్టర్ మనోజ్కుమార్ రెడ్డి, అక్బర్బాషా, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్ఞాన భారత్ మిషన్కు సహకరించాలి గద్వాల న్యూటౌన్: జ్ఞాన భారత్ మిషన్లో భాగంగా జిల్లాలోని పురాతన ఆలయాల చరిత్ర, ఈ ప్రాంత సంస్కృతి, ప్రాచీన సాహిత్యాలను డిజిటలైజేషన్ చేసేందుకు వివిధ రంగాల వ్యక్తులు, పరిశోధకులు సహకరించాలని కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. పర్యాటక జిల్లాలోని ప్రాచీన కట్టడాలకు సంబంధించిన సమాచారం, ప్రముఖ సాహితీవేత్తల రచనలు, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు ఎవరి వద్దనైనా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ఎంఏఎల్డీ డిగ్రీ కళాశాలలో నిర్వహించే సమావేశంలో తెలియజేయాల్సిందిగా కోరారు. -
ఆర్టీసీ మినీ బస్ డిపో నిర్మించండి
అలంపూర్: ఆర్టీసీ మినీ బస్ డిపో నిర్మించాలని హైదరాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే విజయుడు గురువారం కలిసి కోరారు. అలంపూర్ నియోజకవర్గంలో రవాణ సౌకర్యం మెరుగుపర్చాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అలంపూర్ చౌరస్తాలో మినీ ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని వినతిలో పేర్కొన్నారు. డిపో పరిధిలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్రోల్ పంపును ఏర్పాటు చేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రికల్ వాహనాలను, చార్జీంగ్ స్టేన్ నిర్మించాలని, అయిజ బస్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని, అలంపూర్ నియోజకవర్గంలో బస్సుల సంఖ్య పెంచి ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, విద్యార్థులకు సమయానుకూలంగా బస్సు సర్వీసులు నడిపించాలని విన్నవించగా.. మంత్రి సానుకులంగా స్పందించినట్లు వివరించారు. అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి సాగునీటి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. -
రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారులు ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియాలో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉబేదుల్లా కొత్వాల్, జీఏ విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 01.01.2008 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీ కరణ పత్రం, పదోతరగతి మెమో, ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 99853 75737 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 16న (బాలురు), 17న (బాలికలు) జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
అనుమతి లేకుండా మొక్కజొన్న తరలింపు
గద్వాల క్రైం: మార్క్ఫెడ్ అనుమతి లేకుండా గురువారం ఉదయం రెండు డీసీఎంలలో మొక్కజొన్న సంచులను తరలించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. గద్వాల మండలంలోని కొండపల్లి శివారు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ గిడ్డంగుల గోద్దాం నుంచి మార్క్ఫెడ్ అనుమతి లేకుండా మొక్కజొన్నను తరలిస్తున్నారని లారీ అసోసియేషన్ డ్రైవర్లు గుర్తించి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే కొన్ని రోజుల నుంచి గోదాం మేనేజర్, సిబ్బంది కలిసి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారని స్థానిక డ్రైవర్లు ఆరోపించారు. అధికారులు మాత్రం అనుమతి మేరకు మొక్కజొన్నను గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్నామని చెబుతున్నారు. ఈ విషయమై గద్వాల మార్క్ఫెడ్ అధికారి చంద్రమౌలిని ‘సాక్షి’ వివరణ కోరగా దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉండగా గతంలోనూ ఇదే గోదాం వద్ద రెండు లారీల యూరియా సైతం చోరీకి గురైనట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
ఎత్తిపోతలకు విఘాతం
నాగర్కర్నూల్: కరెంట్ కష్టాలు రైతులకే కాదు.. ఏకంగా సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సైతం మొదలయ్యాయి. రాత్రివేళ మూడు రిజర్వాయర్ల వద్ద నీటిని ఎత్తిపోసే పంపుసెట్లు ఆపేయాలని.. ఉదయం వేళ నడపాలని ఎస్ఎల్డీసీ (స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్) నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. ఈ మేరకు తప్పని పరిస్థితుల్లో కొన్ని రిజర్వాయర్ల వద్ద రాత్రివేళ పంపులను ఆపేసి.. మరికొన్ని చోట్ల ఒక పంపుసెట్ నడుపుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితంగా కాల్వల నీటిని నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. మూడు రిజర్వాయర్లు.. కేఎల్ఐ పరిధిలో నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రేగుమాన్గడ్డ వద్ద ఎల్లూరు రిజర్వాయర్కు నీరు ఎత్తిపోస్తారు. అక్కడ ఐదు పంపుసెట్లకు గాను ప్రస్తుతం రెండు మరమ్మతుకు గురవగా మూడు నడుస్తున్నాయి. ఎల్లూరు నుంచి సింగోటం గ్రావిటీ మీదుగా జొన్నలబొగుడకు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐదు పంపులు ఉండగా మూడే నడుపుతున్నారు. గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ కాల్వలకు వదులుతారు. గ్రావిటీ మీద నీరు పారుతుండగా ప్రధాన కాల్వ 160 కి.మీ., కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మరో 60 కి.మీ., మాడ్గుల మండలం నాగిళ్ల వరకు టెలెండ్ కాల్వ వెళ్తుంది. 13 గంటలకు కుదింపు.. ప్రస్తుతం విద్యుత్ సమస్య తీవ్రమైంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి 18 నుంచి 13 గంటలకు కుదించారు. అయితే వాస్తవ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. పది గంటలే సరఫరా అవుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సమస్య కేఎల్ఐ పంపుసెట్లకు తాకడం ఆందోళనకరం. ఎస్ఎల్డీసీ (లోడ్ డిస్పాచ్ సెంటర్) విద్యుత్ వాడకంపై నియంత్రణ విధిస్తున్నారు. మూడు రోజుల నుంచి కేఎల్ఐ పంపుసెట్ల విద్యుత్ వాడకంపై నియంత్రణ చేయాలని, రాత్రివేళ నిలిపివేయాలని సూచిస్తున్నారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 8 గంటల వరకు నిలిపివేస్తే లోడ్ కంట్రోల్ చేయవచ్చని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైంది. వరిసాగు వద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేసినా.. కేఎల్ఐ సాగునీరు విడుదలతో రైతులు వరిసాగుకే మొగ్గుచూపారు. ప్రస్తుతం కేఎల్ఐ కాల్వలో పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. అది కూడా ఎప్పుడు ఆగిపోతాయోనని, చివరికి పంటలు చేతికి వస్తాయో.. లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో కేఎల్ఐ పంపింగ్కు ఆటంకాలు జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల వద్ద మోటార్ల నిలిపివేత ఎస్ఎల్డీసీ సూచన మేరకు రాత్రివేళ నిలుపుదల సాగు, తాగునీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం -
గుడ్డెందొడ్డి @ 15 టీఎంసీలు
గద్వాల: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 9 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఆయా ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టుకు ఎలాంటి నీటి ఇబ్బందులు తలెత్తవు. కానీ, ఇదే ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్లో మాత్రం నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. ఈ నెలాఖరుకు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. తాజాగా భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం రూ.169 కోట్లు విడుదల చేయడంతో ఆయా పనులు మరింత ఊపందుకోనున్నాయి. 120 రోజులపాటు వరద.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా.. 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చే సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకొనే వెసులుబాట లభిస్తుంది. కృష్ణా బేసిన్ పరిధిలో.. కృష్ణా బేసిన్ పరిధిలో నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా 2 లక్షలు, కల్వకుర్తి 3.65 లక్షలు, కోయిల్సాగర్ 30 వేలు, జూరాల 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఏటా సుమారు 6.50– 7 లక్షల ఎకరాల వరకు సాగవుతుంది. ఇందులో 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఎలాంటి ఢోకా లేదు. కానీ, యాసంగి సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా ఆయా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంటుంది. ఇందుకు ఈసారి రబీలో జూరాల కింద ఎడమ కాల్వ పరిధిలోని క్రాప్ హాలిడే ప్రకటించడమే నిదర్శనం. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ తొలి ప్రాజెక్టు జూరాలే.. కృష్ణా బేసిన్లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ఇందిరా ప్రియదర్శిని జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసుకోవడం వంటివి సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. అయినప్పటికీ ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఫలితంగా రబీ సీజన్లో ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు సైతం పనులు మొదలయ్యాయి. నిధులు వచ్చాయి.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రూ.165 కోట్లు విడుదల చేయగా.. రూ.15 కోట్లతో ఇన్వెస్టిగేషన్, డీపీఆర్ తయారీ, మిగిలిన రూ.150 కోట్లతో భూసేకరణ చేపట్టనున్నాం. డీపీఆర్ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం క్షేత్రస్థాయిలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేసి నిర్మాణ పనులు చేపడుతాం. – కేశవరావు, ఎస్ఈ, జూరాల రిజర్వాయర్ సామర్థ్యంపెంపునకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఈ నెలాఖరుకు డీపీఆర్ రూపొందించేలా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే సవరణ పనులు తాజాగా భూ సేకరణ కోసం రూ.169 కోట్లు విడుదల ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు తీరనున్న సాగునీటి కష్టాలు -
పురాతన గ్రంథాలయం పరిశీలన
మానవపాడు: మండలంలోని చెన్నిపాడులో ఉన్న పురాతన గ్రంథాలయం, పలు ఆలయాలను బుధవారం జెడ్పీ సీఈఓ నర్సింగ్రావు పరిశీలించారు. ఇలాంటి గ్రంథాలయాన్ని యు వకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేయాలని, చెన్నకేశవస్వామి, సత్యనారాయణ స్వామి ఆలయాలను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు సీఈఓను కోరారు. కార్యక్రమంలో సీతారామిరెడ్డి, తిరుమల్ర్డెడి, పుల్లారెడ్డి, సర్పంచ్ రత్నకుమార్ పాల్గొన్నారు. మహాధర్నా వాయిదా జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 10న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన మహాధర్నాను వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్రెడ్డి బుధవారం తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈనెల 18న సీఎం రేవంత్రెడ్డితో నాయకులు భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. -
కాళోజీ జీవితం.. స్ఫూర్తిదాయకం
గద్వాల క్రైం: తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ భాషా సంస్కృతులు, ప్రజా చైతన్యానికి కాళోజీ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్ పాల్గొన్నారు. ఆయన ఆశయాలు కొనసాగిద్దాం ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన కవితలతో నిరంతరం శ్రమించిన కాళోజీ నారాయణరావు ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పదవ పటాలం ఇన్చార్జి కమాండెంట్ ఆదినారాయణ అన్నారు. బీచుపల్లి పదవ పటాలంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కవితలతో ప్రజల్లో ఉద్యమ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ, రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడు కాళోజీ అని కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారధిరెడ్డి, వెంకటరమణ, ఆర్ఐలు నిరంజన్రెడ్డి, భార్గవరెడ్డి, ప్రసన్న, తిరుపతి పాల్గొన్నారు. -
శ్రీవెంకటరమణ రైస్మిల్ సీజ్
పాన్గల్: సీఎంఆర్ బకాయిలున్న మండల కేంద్రంలోని శ్రీ వెంకటరమణ రైస్మిల్లును అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆర్ఐ మహేష్ కథనం మేరకు.. రైస్మిల్లుకు 2023–24 సంవత్సరంలో వరి ధాన్యం కేటాయించగా ఇందుకు సంబంధించిన సీఎంఆర్ ప్ర భుత్వానికి అందించకుండా బకాయి పడ్డారు. బకాయిపడ్డ ధాన్యం విలువ రూ.6.93 కోట్లని.. చెల్లించకపోవడంతో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మిల్లును తహసీల్దార్ కార్తీక్రావు, ఎస్ఐ కుర్మయ్య పర్యవేక్షణలో సీజ్ చేసి నట్లు ఆర్ఐ వివరించారు. గ్రామపంచాయతీ కార్య దర్శి నరేష్గౌడ్, జీపీఓ రాధ, మల్లేష్ పాల్గొన్నారు. -
అక్రమాలకు అడ్డుకట్ట!
గద్వాల న్యూటౌన్: స్వయం సహాయక సంఘాల నిర్వహణలో పారదర్శకత.. అక్రమాలకు అడ్డుకట్ట వేయడం.. జవాబుదారీతనం, నిధుల సద్వినియోగం కోసం సామాజిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. వీబీ–జీ రామ్జీ సామాజిక తనిఖీ బృందాలకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 10 నుంచి 15 మంది మహిళలతో స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) ఉన్నాయి. ఇలా ఉన్న 20 నుంచి 25 గ్రూపులు గ్రామైక్య సంఘాలుగా ఏర్పడగా.. సహకార చట్టం ప్రకారం వీటికి కార్యవర్గాలు, మండల, జిల్లా మహిళా సమాఖ్యలు ఉన్నాయి. రూ.కోట్ల్లలో ఆర్థిక లావాదేవీలు.. బ్యాంకు లింకేజీ కింద ఎస్హెచ్జీలకు సీనియార్టీ ప్రాతిపదికన రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి. వీటితో పాటు సభ్యులు ప్రతినెలా రూ. 200 నుంచి రూ.500 పొదుపు చేసుకుంటూ అంతర్గతంగా అప్పులు ఇస్తున్నారు. జిల్లాకు సంబంధించి ప్రతి ఆర్థిక సంవత్సంలో రూ.230 కోట్ల వరకు బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తున్నారు. వీటితో పాటు సభ్యురాలికి వ్యక్తిగతంగా సీ్త్రనిధి నుంచి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఏటా రూ.30 కోట్ల వరకు రుణాలు అందుతున్నాయి. వరిధాన్యం కొనుగోళ్లు, ఎస్హెచ్జీల పొదుపులు, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, కొన్ని రకాల వ్యాపారాలు, స్కూల్ యూనిఫారాల కుట్టుపని తదితర ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ గ్రామైక్య సంఘాలకు ఉంటుంది. ఇక మండల, జిల్లా మహిళా సమాఖ్యలు గ్రామైక్య సంఘాల పొదుపులు, అద్దె బస్సులు, పెట్రోల్ బంక్లు, క్యాంటీన్లు, కొన్ని రకాల వ్యాపారాల నిర్వహణ చూస్తున్నాయి. ఇలా ఎస్హెచ్జీ మొదలుకొని జెడ్ఎంఎస్ వరకు పలు ఆర్థిక కార్యక లాపాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి. జవాబుదారీతనం కోసం.. ఎస్హెచ్జీల్లో అంతర్గత జమ, ఖర్చులు మినహా ఆడిటింగ్ లేదు. దీన్ని సాకుగా తీసుకొని కొన్నిచోట్ల నగదు దుర్వినియోగం, సొంతానికి నిధులు వాడుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇక గ్రామైక్య సంఘాలు, మండల, జిల్లా మహిళా సమాఖ్యలకు సంబంధించి ఎంపిక చేసిన ఆడిటర్లు ఆడిటింగ్ నిర్వహిస్తున్నప్పటికీ పూర్తి వివరాలు సభ్యులందరికీ తెలియడం లేదు. కొన్ని విషయాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించినా.. రికవరీ కావడం లేదు. నిధులు పక్కదారి పట్టినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించాలనే ఉద్దేశంతోనే వీబీ–జీ రామ్జీ బృందాలతో సామాజిక తనిఖీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పలు జిల్లాల్లోని కొన్ని సంఘాలను పైలెట్ ప్రాజెక్ట్లుగా ఎంపిక చేశారు. కొన్ని నెలల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. చిరుతల అలజడి గండేడ్ మండలంలో చిరుతల సంచారం అధికమైంది. ఆగస్టులోనే ఐదు పశువులను పొట్టన పెట్టుకున్నాయి. –8లో uస్వయం సహాయక సంఘాలపై సామాజిక తనిఖీ వీబీ–జీ రామ్జీ బృందాలకు బాధ్యతలు నిధుల వినియోగంలో అవకతవకలు జరగకుండా చర్యలు సంఘాల నిర్వహణలో పెరగనున్న పారదర్శకత -
జోగుళాంబ సన్నిధిలో దేవాదాయశాఖ కమిషనర్
అలంపూర్ రూరల్: ఐదవ శక్తిపీఠం, నవబ్రహ్మాలయాల దివ్యధామ అలంపూర్ క్షేత్రాన్ని బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కమిషనర్కు ఆలయ ఈఓ దీప్తి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి, శేషవస్త్రాలతో సత్కరించారు. కాగా, అలంపూర్ క్షేత్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ జయరాముడు, కౌన్సిల్ సభ్యులు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ విక్రం, కౌన్సిలర్లు మోహన్రెడ్డి, జమ్మన్న, కోఆప్షన్ సభ్యులు కృష్ణమూర్తి, ముజీప్, నాయకులు వెంకట్రామయ్యశెట్టి, చిన్న య్య, సురేశ్, రజినిబాబు, సుందర్రాజ్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. బీచుపల్లి సందర్శన.. ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలో అభయాంజనేయస్వామిని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ ఈఓ పురేందర్ కుమార్, సిబ్బంది పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. -
ఎన్ఎస్యూఐకు కొత్త సారథులు
● ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం స్టేషన్ మహబూబ్నగర్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్, నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్, గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్ను నియమించారు. ఎన్ఎస్యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడుసూచించారు. -
జాయింట్ చెక్ పవర్ తొలగించండి
అలంపూర్: గ్రామ పంచాయతీల జాయింట్ చెక్ పవర్ను రద్దు చేయాలని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొంగోళ్ల ఈశ్వర్ కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని సర్పంచులతో కలిసి కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అప్పులుచేసి మరీ పనులు చేస్తున్నారన్నారు. అయితే జాయింట్ చెక్పవర్తో బిల్లులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు ఇప్పటికే చేసిన పనులకు తక్షణమే ఎంబీలు చేసి, జాప్యం లేకుండా బిల్లులు అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఎర్రమట్టి, ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామానికి ఆర్ఓ ప్లాంట్ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మద్దిలేటి, మహ్మద్ రఫీ, అడివప్ప, మోహన్గౌడ్, హరికృష్ణ, శ్రీనివాసులు, మహేశ్వర్రెడ్డి, విక్రమ్ పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తిచేయాలి గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ వీరభద్రప్ప, కన్వీనర్ ఆలూరు ప్రకాష్గౌడ్ డిమాండ్ చేశారు. బుదవారం కాళోజీ జయంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో పాలమూరు జలసాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్డీఎస్ను ఆధునికకీరించడంతో పాటు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ప్రతిపాదిత రిజర్వాయర్లను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. గట్టు ఎత్తిపోతల సామర్థ్యం పెంచి, సత్వరమే పూర్తి చేయాలన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి కాల్వలను ఏర్పాటుచేసి, పొలాలకు నేరుగా సాగునీరు అందేలా చూడాలన్నారు. జూరాల ప్రాజెక్టులో సిల్ట్ తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. డిండి లిఫ్ట్ పేరుతో జరుగుతున్న జలదోపిడీని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్ బాబు, అతికూర్ రహమాన్, రహమతుల్లా, మోహన్, శంకర ప్రభాకర్, తాహెర్, ఆనంద్, నాగార్జున గౌడ్, భీమన్న, కృష్ణయ్య పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ● ఎంఈఓపై సస్పెన్షన్ వేటు రాజోళి: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈఓ నర్సింహులును సస్పెన్షన్ చేసినట్లు డీఈఓ విజయలక్ష్మి బుధవారం తెలిపారు. వడ్డేపల్లి మండలం రామాపురంలోని విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్ అనుమతి రద్దయినా విద్యార్థుల వివరాలు, తదితర రికార్డులు స్వాధీనం చేసుకోలేదని.. ఈ విషయంపై ట్రెయినీ కలెక్టర్లతో కలిసి గ్రామంలో విచారణ చేశామన్నారు. మరో ప్రైవేటు పాఠశాల కూడా అనుమతి లేకుండా నడుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈఓ నర్సింహులును సస్పెన్షన్ చేసినట్లు డీఈఓ తెలిపారు. -
ఎస్పీ ప్రజావాణికి 17 దరఖాస్తులు
గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 17 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సివిల్ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్స్టేషన్ ముట్టడి ధరూరు: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు సబ్స్టేషన్ను ముట్టడించారు. విద్యుత్ కోతలతో కళ్ల ముందే పంటలు ఎండుముఖం పడుతుండడంతో రైతులు మండలంలోని ద్యాగదొడ్డి సబ్స్టేషన్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పంటలకు సాగు నీరందక ఇబ్బందులు పడుతున్నామని, గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రైతులకు కరెంటు ఇవ్వడంలో విఫలమైందని దుయ్యబట్టారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వేరుశనగ @ రూ.8,410 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు సోమవారం 369 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టం రూ.8,410, కనిష్టం రూ.4,619, సరాసరి రూ.6,549 ధరలు లభించాయి. నేడు మార్కెట్ యార్డు బంద్ గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు మంగళవారం బంద్ ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం దడవాయిలు మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఇందుకోసం సెలవు ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దడవాయిల సంఘం నాయకులు స్థానిక అధికారులకు విన్నవించారు. ఇందుకు అధికారులు సమ్మతించారు. దీంతో యార్డుకు ఎలాంటి పంట ఉత్పత్తులు తీసుకురావద్దని దడవాయి సంఘం అధ్యక్షుడు తిరుపతి రైతులను కోరారు. గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం గట్టు: మండలంలోని బస్వాపురం నుంచి తుమ్మలచెర్వు స్టేజీ వరకు రూ.1.50 కోట్ల వ్యయంతో కొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, సర్పంచు శ్రీరాములుగౌడ్, వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఆనంద్గౌడు తదితరులు ఉన్నారు. విద్యార్థుల కోసం పోరాటం చేస్తే అరెస్టులా? అయిజ: పేద విద్యార్థుల పెండింగ్ ఫీజులను చెల్లించాలని పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నాయకులను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు. కార్యక్రమంలో నరసింహ, భీంసేన్రావు, ప్రదీప్ కుమార్, భగత్రెడ్డి, వెంకటేష్, రాజేశేఖర్, భీమన్న, శ్రీకాంత్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకే అక్షరమాల.. నాన్నకు?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: చదువు వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనం. అక్షరాస్యతతో సమాజంపై అవగాహన పెరగడంతో పాటు హక్కులు, బాధ్యతలపై చైతన్యం వస్తుంది. అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరక్షరాస్యత సమస్య పూర్తిగా తొలగలేదు. వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు గతంలో ‘సాక్షర భారత్’ వంటి కార్యక్రమాలు అమలు చేసినా.. ప్రస్తుతం అవి అంతగా కనిపించడం లేదు. ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులకే అక్షరాలు నేర్పించడంపై దృష్టి సారిస్తోంది. దీంతో నిరక్షరాస్యులుగా ఉన్న పురుషుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రస్తుతం ‘అమ్మకు అక్షరమాల’ వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గత ఏడాది నుంచి ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సెర్ప్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళా సంఘాల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న సభ్యులను గుర్తించి.. చదువు రాని ఇతర సభ్యులకు బోధించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇలా ఒక మహిళ మరో మహిళకు చదువు చెప్పే విధానంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్ఎల్ఎన్ఏటీ)ను ప్రతి మార్చి, ఆగస్టు నెలల్లో నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మూడో తరగతి ఉత్తీర్ణతకు సమానమైన ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 1,63,607 మంది మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. 7.78 లక్షల మంది నిరక్షరాస్యులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 7,78,142 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఇందులో 2,99,907 మంది పురుషులు, 4,78,235 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా నిరక్షరాస్యుల సంఖ్య 1,78,328 అధికం. జిల్లా వారీగా చూస్తే గద్వాల జిల్లాలో అత్యధికంగా 70,619 మంది పురుషులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నారాయణపేటలో అత్యల్పంగా 37,461 మంది ఉన్నారు. అయితే ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం మహిళా సంఘాల సభ్యులకే పరిమితం కావడంతో.. నిరక్షరాస్యులుగా ఉన్న పురుషులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం గమనార్హం. సమాజంలో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించాలంటే మహిళలతో పాటు పురుషులపైనా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పర్యవేక్షణలోనూ ఇబ్బందులు మహిళా సంఘాల సభ్యులకు అక్షరాస్యత బోధన, పర్యవేక్షణ బాధ్యతలను డీఆర్డీఏ ఆధ్వర్యంలోని సిబ్బందే చూస్తున్నారు. గ్రామస్థాయిలో వీఓఏలు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా.. మండల స్థాయి లో ఏపీఎంలు, క్లస్టర్ స్థాయిలో క్లస్టర్ కోఆర్డినేటర్లు పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపా లతో పాటు అక్షరాస్యత కార్యక్రమాన్ని కూడా వీరే చూడాల్సి రావడంతో పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు ఒకే కోఆర్డినేటర్ ఉండటంతో ఐదు జిల్లాల కార్యక్రమాలను పర్యవేక్షించడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతి గ్రామంలో వయోజన విద్యా కేంద్రాలు, ప్రత్యేక బోధనా సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, పరిమిత నిధులతో కార్యక్రమాలు కొనసాగుతుండటంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో పూర్తిగా తొలగని నిరక్షరాస్యత ‘సాక్షర భారత్’కు బదులు ‘అమ్మకు అక్షరమాల’ మహిళా సంఘాల సభ్యులకే పరిమితమైన అక్షరాస్యత కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో 7.78 లక్షల మంది నిరక్షరాస్యులు.. ఇందులో 2.99 లక్షల మంది పురుషులు నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం -
కమనీయం రాములోరి కల్యాణం..
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కల్యాణ తంతను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని జరిపారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని పవిత్ర కష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కనులారా తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వా మి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ స్కూల్స్కు నిధుల వరద
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు.. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్య.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎంపిక చేసిన వాటిని పబ్లిక్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేయనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలిదశలో 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం రూ.87 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ నంబర్ 164ను విడుదల చేసింది. స్థలం ఉన్న బడులకే ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా.. ప్రస్తుతం 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. మరో ఆరు నియోజకవర్గాలకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పాఠశాల లేదా స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రధానంగా ఇప్పటికే స్థలం, భవనాలు అందుబాటులో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. అయితే మహబూబ్నగర్లో మాత్రం మార్కెట్ రోడ్డులోని బాలికల పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో ప్రత్యేక ప్రతిపాదన చేశారు. ఈ పాఠశాలను ఎంవీఎస్ జూనియర్ కళాశాల ప్రాంగణానికి తరలించి.. అక్కడ పబ్లిక్ స్కూల్ భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉమ్మడి జిల్లాలో 8 పాఠశాలలకు రూ.87 కోట్ల నిధులు నర్సరీ నుంచి ఇంటర్ వరకుఒకే క్యాంపస్లో విద్య తరగతి గదులు, ల్యాబ్స్, గ్రౌండ్, మరుగుదొడ్లతో ఆధునిక వసతులు -
పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్తో ప్రభుత్వ విద్యాస్వరూపం మారుతుంది. ఒకే క్యాంపస్లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులతో విద్య అందించే అవకాశం ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్స్, క్రీడా మైదానం, బస్సు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. నారాయణపేట జిల్లాలో మక్తల్, కోటకొండ జెడ్పీహెచ్ఎస్లను పబ్లిక్ స్కూల్స్గా అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ఇది మంచి అవకాశం. – గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట ● -
కనులపండువగా జములమ్మ ఎదుర్కోళ్ల ఉత్సవం
గద్వాల న్యూటౌన్: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజారోణం, గణపతి పూజ చేశారు. సాయంత్రం చేపట్టిన ఎదుర్కోళ్ల ఉత్సవం వైభవంగా సాగింది. అమ్మవారిని, స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి, జమ్మిచేడులోని ఆంజనేయస్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తు ఆలయానికి తీసుకొచ్చారు. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలతో సందడి నెలకొంది. ఆలయ ఈఓ పురందర్కుమార్, మాజీ చైర్మన్లు సతీష్, వెంకట్రాములు ప్రత్యేక పూజలు చేశారు. నేడు కల్యాణ మహోత్సవం ఏటా శ్రావణ మాసంలో చివరి మంగళవారం అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా రకరకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. భారీ కల్యాణ వేదిక, భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:15 గంటలకు జరిగే కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురానున్నారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మల జయలక్ష్మితో పాటు జిల్లాలోని ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. -
నేడు జములమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం
గద్వాల న్యూటౌన్: భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ప్రముఖ జములమ్మ, పరశురామ స్వామివారి సన్నిధిలో శ్రీజమదగ్ని, శ్రీజములమ్మ అమ్మవారి 6వ వార్షిక కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 5గంటలకు ఎదుర్కోళ్లు, మంగళవారం మధ్యాహ్నం 12:15 గంటలకు అభిజిత్ లగ్నంనందు శ్రీజమదగ్ని, శ్రీజములమ్మ అమ్మవారి కల్యాణమహోత్సవం, అనంతరం పల్లకీసేవ నిర్వహించనున్నారు. 9వ తేదీ బుధవారం ఉదయం 8గంటలకు ధ్వజావరోహణం ఉంటుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ముఖద్వారం నుంచి ఆలయం వరకు రంగురంగుల విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించారు. సుమారు 10వేల మంది భక్తులు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉండడంతో వారి సౌకర్యార్థం టెంట్లు, కుర్చీలు, తాగునీటి, భోజన వసతి కల్పించినట్లు ఈఓ పురందర్కుమార్ తెలిపారు. -
రింగ్లో పంచ్.. మెడలో మెడల్స్!
● బాక్సింగ్లో సత్తా చాటుతున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ● పంచ్ పవర్తో పతకాలు సాధిస్తున్న నలుగురు బాక్సర్లు బాక్సింగ్ రింగ్లో ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడాకారులు పంచ్ పవర్ చూపించారు. హైదరాబాద్లో శని, ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో నలుగురు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. పెబ్బేర్ మండలం శాగాపూర్కు చెందిన శ్రీలేఖ స్వర్ణ పతకం సాధించి దక్షిణ భారత చాంపియన్షిప్కు ఎంపిక కాగా.. మహబూబ్నగర్కు చెందిన ఎం.రాజు, నాగర్కర్నూల్ జిల్లా శశికాంత్ రజత పతకాలు, గండేడ్కు చెందిన జె.రాకేష్ కాంస్య పతకం సాధించారు. వరుస విజయాలతో జిల్లాలో బాక్సింగ్పై ఆసక్తి పెరుగుతోంది. శ్రీలేఖ.. స్వర్ణ పంచ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం శాగాపూర్కు చెందిన శ్రీలేఖ ఏడేళ్లుగా బాక్సింగ్లో శిక్షణ పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. తొమ్మిదిసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఏడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. జిల్లాస్థాయిలో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఆమె ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన శ్రీలేఖ.. ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగే ఎలైట్ పురుషుల, మహిళల సౌత్ ఇండియా బాక్సింగ్ చాంపియన్షిప్కు ఎంపికై ంది. భవిష్యత్లో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతోంది. – మహబూబ్నగర్ క్రీడలు -
ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పిస్తాం
శిలాఫలకం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. వివిధ సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రూ.10 లక్షల వ్యయంతో రోడ్డు ప నులు చేపట్టామన్నారు. ఆస్పత్రిలోని మౌలిక వసుతులు, సదుపాయాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఝాన్సీలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ..
మహబూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2007, 2009లో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ నాగేశ్వర్ (స్వతంత్ర అభ్యర్థి), 2015లో రాంచందర్రావు (బీజేపీ), 2021లో సురభి వాణీదేవి (బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్) గెలుపొందారు. ఇప్పటివరకు ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవమే ఎదురైంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఈ స్థానంలో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు పక్కా ప్రణాళికలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందుస్తు కార్యాచరణతో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. -
ఓటు హక్కు కాపాడే బాధ్యత పార్టీ శ్రేణులదే..
మక్తల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని.. అర్హుల ఓటు హక్కును కాపాడే బాధ్యత కార్యకర్తలదేనని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని బీఎల్ఏలు, సూపర్వైజర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలో సుమారు 36 వేల ఓట్లు తొలగించబడ్డాయని.. తాజాగా 76 వేల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలన్నారు. ఎస్ఐఆర్లో సర్పంచులు, వార్డు సభ్యులు, చైర్పర్సన్లు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు. పేద కుటుంబాలకు సరైన న్యాయం అందాలంటే మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిదాలుగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఈ నెల 10న మక్తల్లో ఆవిష్కరించనున్న చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు వాల్పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, పార్లమెంటరీ సర్ ఇన్చార్జ్ రేణుకగౌడ్, మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గుత్తా అమిత్, పుర చైర్పర్సన్ వాకిటి మానస, మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, డైరెక్టర్లు విష్ణువర్ధన్రెడ్డి, ఫయాజ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కుల ధన ధాన్యం
–8లో uగద్వాల క్రైం: సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు జిల్లాలోని కొందరు రైస్ మిల్లు నిర్వాహకులు కష్ట పడ్డాకుండా సొమ్ము రాబట్టాలి (సీఎమ్మార్) అనే కొత్త నిర్వచనం చెప్తున్నారు. జిల్లాలోని మిల్లు యాజమానులు చేస్తున్న ధన.. ధాన్యం దందాలపై ఇటీవల పోలీసుశాఖ పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చే సింది. వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం నుంచి రైస్మిల్లుల యజమానులు సేకరించి గడువులోగా ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ లో విక్రయించి భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో 63కు పైగా రైస్ మిల్లులో ఇదే తరహా దందా కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసులు ● కేటీదొడ్డి మండలానికి చెందిన కమ్మిడిస్వామి రైస్ మిల్లు నిర్వాహకుడు 12,643 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.4.70 కోట్లు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి రాగా నిర్వాహకుడు కుర్వ వీరన్నను ఆగస్టు 27న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ● సూర్య ట్రేడర్స్లో 11,580 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా చేశారు. విలువ రూ.3.50 కోట్లు కాగా శాంతినగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ● అన్నపూర్ణ రైస్ మిల్లులో 24,369 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం కాగా వీటి విలువ రూ.8.21 కో ట్లు.దీనిపై అయిజ పోలీసులు కేసు నమోదు చేశారు. ● శ్రీకృష్ణ రైస్ మిల్లులో 10.132 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా చేయగా.. విలువ రూ.3.76 కోట్లు. గద్వాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ● శ్రీరామ రైస్ మిల్లులో 10,496 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా చేయగా.. విలువ రూ. 2.88 కోట్లు. గద్వాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారులపై విచారణ.. అక్రమార్కులకు సహకరించిన అధికారులపై విచా రణ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి పోలీసుశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి కే జిల్లా సివిల్ సప్లై శాఖలోని ముగ్గురు అధికారులను విచారించారు. త్వరలో మరి కొంతమందిని విచారించే అవకాశం ఉంది. రైస్ మిల్లర్ల అక్రమ వ్యాపారాలపై నిఘా కరువు మామూళ్ల మత్తులో కేటాయింపులు! అధికారుల పాత్రపై విచారణ తప్పించుకునేందుకు వ్యూహం తాజాగా 12,643 మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా -
24న పీయూలో ఉద్యమకారుల సమ్మేళనం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 24న తెలంగాణ ఉ ద్యమకారుల సమ్మేళనం ఉంటుందని పీయూ ఉద్యమకారుల కమిటీ సభ్యులు అన్వర్, రా ము తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీయూ ఆవరణలో సమ్మేళనం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కళాశాలల ఉద్యమకారులు ఆ రోజు జరిగే సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పలువురు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బ్రహ్మం, శివ, కొండా గణేష్, చంద్రకాంత్గౌడ్, ప్రొఫెసర్ భూమయ్య, గోపాల్, సుగుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ఆదివారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 102.058 మి.యూ., దిగువన ఒక యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 88.010 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 190.068 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. కేఎస్పీలో 20.6 అడుగులకు నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు(కేఎస్పీ)లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి 20.6 అడుగులకు చేరింది. గత నెల 19న కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రెండు వారాల పాటు కొన సాగించారు. ఐదు రోజుల క్రితం విడుదల నిలిపివేసి ప్రాజెక్టును నింపేందుకు జూరాల వద్ద రెండు పంపులను నడుపుతూ ఎత్తిపోతల ద్వా రా నీటిని తరలిస్తున్నారు. నీటి విడుదలకు ముందు 18 అడుగులుగా ఉన్న మట్టం ప్రసు ్తతం 20.6 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో 12 అడుగుల నీరు చేరాల్సి ఉంది. -
అదనపు వసూళ్లు వద్దు
గద్వాల: ఆధార్ కేంద్రాల్లో వినియోగదారుల నుంచి ఎవరైనా అదనపు వసూళ్లు చేస్తే చర్యలు తప్పవని ఈడీఏ శివ హెచ్చరించారు. ఆధార్ కేంద్రాల్లో అదనపు రుసుంల వసూలు ఆరోపణల నేపథ్యంలో శనివారం ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ శివ జిల్లా కేంద్రంలోని 5 ఆధార్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాలకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి, నిర్ణీత రుసుం కంటే అదనంగా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. తనిఖీ సమయంలో ఎవరూ అదనపు మొత్తాన్ని చెల్లించినట్లు ఫిర్యాదు చేయలేదని, సెంటర్లో అందుతున్న సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎవరూ మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా ఆధార్ కేంద్రాలను సందర్శించి సేవలు పొందాలని సూచించారు. నిర్వాహకులు నిర్ణీత రుసుం కంటే అధికంగా డబ్బులు వసూలు చేసినట్లయితే వెంటనే 1947కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎం సుధాకర్, ఆధార్ కేంద్రం నిర్వాహకులు తదితరులు ఉన్నారు. -
బలోపేతం చేయాలి
గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వ స్థలాలు కాదు. అవి పేద విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడాలి. జిల్లా విద్యారంగంలో వెనుకబాటు ఉన్న నేపథ్యంలో గ్రంథాలయాలను బలోపేతం చేయడం చాలా అవసరం. – యువతేజేశ్వర్ రెడ్డి, గుడిదొడ్డి పాలకులు దృష్టిపెట్టాలి ప్రభుత్వం, జిల్లా పరిపాలన, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టిపెట్టాలి. గ్రంథాలయాల అభివృద్ధి చెందేందుకు తవమంతు కృషి చేయాలి. అప్పుడే విద్యార్థులు, నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఉపయోగపడుతాయి. – మహ్మద్, అయిజ నివేదిక అందజేస్తాం గ్రంథాలయాల్లో ఉన్న సమస్యల గురించి ప్రతి సంవత్సరం ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. జిల్లా మెత్తానికి రూ.30 వేలు పుస్తకాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడున్న వనరులు, సదుపాయాలు, అవసరమయ్యే వస్తువులు, నిర్మాణాల గురించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. – మనోజ్ కుమార్, ఇంచార్జ్ కార్యదర్శి ● -
ఆలయంలో జిల్లా జడ్జి పూజలు
ధరూరు: మండలంలోని పెద్ద చింతరేవుల శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. శ్రావణ శనివారం పురస్కరించుకొని ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిష్టాచార్యులు, మద్వాచార్యులు, ఈఓ రాజేశ్వర శర్మ, చైర్మన్ గిరిరావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో న్యాయ వాది భీంసేన్రావు తదితరులు పాల్గొన్నారు. మెరుగైన పశువైద్య సేవలు అందించాలి గద్వాల వ్యవసాయం: పశువైద్య సిబ్బంది నిత్యం పాడి రైతులకు అందుబాటులో ఉంటూ, పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ వెంకటనారాయణ అన్నారు. శనివారం జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో మండల పశువైద్యాధికారులు, ప్యారవేట్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి వ్యాక్సినేషన్, ఫిజికల్ వ్యాక్సినేషన్ పూర్తైన వెంటనే ఆన్లైన్లో అప్డేషన్ చేయాలన్నారు. ప్రతి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వైద్యశాలల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ నిబంధనలు అమలు చేయాలన్నారు. జలసాధన దీక్ష వాల్పోస్టర్ విడుదల గద్వాల న్యూటౌన్: కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 9న ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్ట్ల సాధన కోసం జలసాధన దీక్షా దినంగా నిర్వహిద్దామని పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ కమిటీ పిలుపునిచ్చింది. శనివారం టీజేఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ వీరభద్రప్ప మాట్లాడుతూ.. కాళోజీ జయంతి రోజున గద్వాల పాత బస్టాండ్ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన కోసం జల సాధన దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఇతర నాయకులతో కలిసి దీక్ష కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ఆలూరి ప్రకాష్గౌడ్, కోఆర్డినేటర్ మధుసూదన్ బాబు, సభ్యులు శంకర ప్రభాకర్, సుభాన్, వాల్మీకి, వినోద్, కోళ్ల హుస్సేన్, భద్రప్ప, పల్లయ్య పాల్గొన్నారు. -
ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలి
గద్వాల న్యూటౌన్: తెలంగాణ ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించాలని ఆ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ షేక్ ఫరూఖ్ హుస్సేన్ అన్నారు. శనివారం స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఎమ్మెల్సీ కోదండరాం అధ్యక్షతన కమిటీ వేయడం హర్షణీయమన్నారు. ఈ కమిటీ ఉద్యమకారులందరికీ న్యాయం చేసే దిశగా పనిచేయాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 250 గజాల ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. ఉద్యమకారులకు రూ.25 వేల పెన్షన్ అందించాలన్నారు. అనంతరం కమిటీ జిల్లా అధ్యక్షుడిగా అతికూర్ రహమాన్, ప్రధానకార్యదర్శిగా ప్రభాకర్ను నియమించారు. సమావేశంలో నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, భీంసేన్రావు, అబ్దుల్ రవూఫ్, అచ్చన్నగౌడ్, ఆంజనేయులు, తాహేర్, వినోద్, మహమ్మద్ రహమతుల్లా, మక్బుల్, గోపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా ఎలివేటెడ్ కారిడార్
జాతర మైదానంలోని విద్యుత్ సబ్స్టేషన్ నుంచి గుట్టపై ఉన్న ప్రధాన ఆలయం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 20 పిల్లర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 10 పిల్లర్లకు ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. పిల్లర్ల నిర్మాణానికి కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. అమ్మాపురం సమీపం నుంచి కురుమూర్తి గుట్ట వెనుక భాగం మీదుగా ప్రధాన ఆలయం వరకు చేపడుతున్న ఘాట్రోడ్డు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రహదారిని చదును చేసి కంకర పరచారు. బీటీ వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. -
విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసే మా‘స్టారు’
● ‘లిటిల్ టీచర్స్–లిటిల్ లీడర్స్’ వినూత్న కార్యక్రమం ద్వారా గుర్తింపు కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లామా.. పాఠాలు చెప్పామా.. బడి గంటకొట్టంగానే ఇంటికి వచ్చామా.. అన్న తరహాలో విధులు నిర్వర్తిస్తుంటారు. కానీ గట్టు మండలంలోని తప్పెట్లమొర్సు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న అగస్టీన్ మాత్రం పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంలో ముందుంటాడు. ‘లిటిల్ టీచర్స్–లిటిల్ లీడర్స్’ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులలో భాషా, తార్కిక మరియు జీవన నైపుణ్యాల పెంపుదల వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా నో బ్యాగ్డే కార్యక్రమాన్ని ప్రతి నెలా మూడో శనివారం ప్రారంభించారు. పీర్గ్రూప్ లెర్నింగ్ (సమూహ అభ్యసనం) ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా, పాఠశాలలో వందశాతం హాజరు శాతం నమోదైన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానిస్తూ వారిని ప్రోత్సాహిస్తుంటారు. రెండేళ్ల కిందట కేటీదొడ్డి మండలంలోని చింతలకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తుప్పుడు పర్యావరణహిత బయోపాట్స్, వినాయక విగ్రహాలను వేరుశనగ పొట్టుతో తయారు చేసే విధానాన్ని నేర్పించి జాతీయ స్థాయిలో ఇన్నోవేషన్ (సీఎస్ఐఆర్) అవార్డు కూడా సాధించారు. అవార్డు పొందిన విద్యార్థిని శ్రీజ స్టార్టప్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శనం చేశారు. ప్రపంచంలోనే అత్యున్నత విద్యావిధానాలు అమలు చేస్తున్న ఫిన్లాండ్ను సందర్శించేందుకు ఇటీవల రాష్ట్రం తరఫున ఎంపికై న 28 మంది ఉపాధ్యాయుల బృందంలో అగస్టీన్ సభ్యుడిగా ఉన్నారు. -
బీచుపల్లిని దర్శించుకున్న జిల్లా జడ్జి
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కళ్యాణచక్రవర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆలయ అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ చరిత్ర గురించి వివరించారు. విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం గద్వాల న్యూటౌన్: ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ కేవలం ఉపాధ్యాయుల సమస్యలపైనే కాకుండా, విద్యాభివృద్ధికి పాటుపడటం అభినందనీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఎస్టీయూ ఏర్పడి 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంఘం నాయకులతో కలిసి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, మగ్దూం మొయినుద్దీన్, రాఘవచారి, శ్యాంసుందర్రావు లాంటి మహానుభావులు ఎస్టీయూలో పనిచేశారన్నారు. ఈ నెల 27న హైదరాబాద్లోని నాగోల్లో జరిగే ఎస్టీయూ 80వ వసంత వేడుకలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పులిపాటి లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి యూనుస్పాషా, అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్రకౌన్సిల్ సభ్యుడు శంకర్నాయక్, నాయకులు విజయ్భాస్కర్, చెన్నకేశవులు, వెంకటేష్, జయరాజు, శ్రీహరి, కిషోర్ చంద్ర, గౌరి శంకర్, భీమన్న, అయూబ్ తదితరులు పాల్గొన్నారు. -
దారిచూపే గురువులు.. వెలుగునిచ్చే దీపాలు
సొంత ల్యాబ్.. విద్యార్థులకు ఉచిత ప్రయోగాలు! ● బడిని బోధనకు మాత్రమే పరిమితం చేయకుండా.. విజ్ఞానం, విలువలు నేర్పుతున్న టీచర్లు ● వినూత్న బోధనతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు ● రూ.12 లక్షలతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు జీవితానికి దిశానిర్దేశం చేస్తారు. పుస్తకంలోని అక్షరాలను పరిచయం చేయడమే కాదు.. ఆ అక్షరాల వెనుక ఉన్న ప్రపంచాన్ని విద్యార్థులకు చూపిస్తారు. చీకటిలో దారి తప్పినవారికి దీపంలా.. సందిగ్ధంలో ఉన్నవారికి దిక్సూచిలా నిలిచి, ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తారు. అందుకే గురువు తరగతి గదిలో కనిపించే ఓ వ్యక్తి మాత్రమే కాదు.. రేపటి సమాజాన్ని నిర్మించే శిల్పి. పదవీ విరమణ చేసినా బోధనకు దూరం కాకుండా బడిబాట పడుతున్నవారు కొందరైతే.. గణితం అంటే భయపడే విద్యార్థుల్లో ఆసక్తిని నింపుతున్న వారు మరికొందరు. గిరిజన తండాల పిల్లలను బడికి రప్పించి చదువుతో పాటు సేంద్రియ సాగు నేర్పుతున్నవారు.. చాక్లెట్కు బదులు మొక్కను అందించి ప్రకృతిపై ప్రేమను పెంచుతున్నవారు.. సొంత ఖర్చుతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రయోగాల ప్రపంచాన్ని విద్యార్థుల ముందుకు తీసుకొస్తున్నవారు ఇంకొందరు. వారి చేతిలో ఉన్నది సుద్ద ముక్కే.. కానీ ఆ సుద్దతో రాసేది కేవలం పాఠం కాదు.. ఓ విద్యార్థి భవిష్యత్. వారి బోధనలో అక్షరాలే కాదు.. ఆలోచనలు ఉన్నాయి. వారి అడుగుల్లో ఉద్యోగ బాధ్యత కాదు.. రేపటి తరంపై బాధ్యత ఉంది. ఇలా వీరి ప్రతి అడుగు విద్యార్థుల భవిష్యత్ కోసమే. శనివారం (నేడు) జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థి జీవితాల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న గురువులపై ప్రత్యేక కథనం.. – గద్వాల/మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/రాజాపూర్విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లోని సైన్స్ అంశాలను ప్రయోగాత్మకంగా నేర్పేందుకు జెడ్పీహెచ్ఎస్ నవాబ్పేట ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్లో సుమారు రూ.12 లక్షల సొంత ఖర్చుతో షెడ్డు నిర్మించి ఆధునిక సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ప్రయోగాలకు అవసరమైన పరికరాలు, సామగ్రిని సమకూర్చి ‘కలాం డ్రీం ఫోర్స్ ఫౌండేషన్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ప్రయోగాలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ ల్యాబ్ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసి.. తరగతుల వారీగా విద్యార్థులకు ప్రయోగాల కోసం రోజులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 400 మంది విద్యార్థులు ఇక్కడ వివిధ సైన్స్ ప్రయోగాలు చేస్తున్నారు. పుస్తకాల్లో చదివిన అంశాలను స్వయంగా చేసి చూడటంతో వారిలో శాసీ్త్రయ ఆలోచనా విధానం, సైన్స్పై ఆసక్తి పెరుగుతోంది. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు శ్రీధర్ చేస్తున్న కృషికి పలు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు లభించాయి. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవల అభినందించారు. పుట్టిన రోజంటే చాక్లెట్లు పంచుకోవడం సాధారణం. కానీ ఫతేపూర్ జెడ్పీహెచ్ఎస్లో మాత్రం అందుకు భిన్నంగా పుట్టినరోజున మొక్కను నాటడం సంప్రదాయంగా మారింది. పాఠ్యాంశాలతో పాటు ఆచరణాత్మక విద్యను అందిస్తూ పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయంపై విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్న హెచ్ఎం కొల్లూరి వెంకటమ్మ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. విద్యార్థులు తమ పేర్లతో పూలు, పండ్ల మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుంటున్నారు. దీంతో పాఠశాల ఆవరణలో ఇప్పటికే 100కు పైగా మొక్కలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలను విద్యార్థుల భాగస్వామ్యంతో సాగు చేస్తున్నారు. తోటలో పండిన కూరగాయలను పాఠశాల వంటకు వినియోగిస్తున్నారు. దీంతో పుస్తకాల్లో చదివే వ్యవసాయ పాఠాలను విద్యార్థులు కళ్లముందే ఆచరణలో నేర్చుకుంటున్నారు. ‘‘చదువుతో పాటు పర్యా వరణ పరిరక్షణ, మొ క్కల సంరక్షణ, వ్య వసాయం, పరిశుభ్రతను ఆచరణాత్మకంగా నేర్పు తూ బాధ్యతాయుత పౌరులు గా తీర్చి దిద్దుతున్నాం’’ అని హెచ్ఎం వెంకట మ్మ తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితం గడపాల్సిన వయసులోనూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేస్తూ తన సేవలను కొనసాగిస్తున్నారు. 38 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మంగళగిరి నర్సోజి.. నేటికీ వారంలో రెండు రోజులు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. రాజాపూర్, బాలానగర్ మండలాల్లో పనిచేసిన నర్సోజి విద్యార్థుల్లో సైన్స్, గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. లోకాస్ట్, నోకాస్ట్ మెటీరియల్తో వివిధ ఉపకరణాలు తయారు చేసి చంద్రయాన్–3పై అవగాహన కల్పించారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, దక్షిణ భారత సైన్స్ ఫెయిర్లలో వీటిని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొర ప్రాముఖ్యతపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన సొంత ఖర్చులతో బహుమతులు, అభ్యసన సామగ్రి ని అందిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన 2026 సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్లో చంద్రయాన్–3 మోడల్ను ప్రదర్శించి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. బోధనతో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ.. పరిశోధనతో కొత్త ఆలోచనలకు బాటలు వేస్తున్న పాలమూరు యూనివర్సిటీ కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రాజ్కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు వివిధ అంశాల పై పరిశోధనలు, జాతీయ–అంతర్జాతీయ సెమినార్ల నిర్వహణలో ఆయన చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థుల్లో కామర్స్పై ఆసక్తి పెంచేందుకు పోటీలు, అకడమిక్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పరిశోధన పట్ల కూడా ప్రోత్స హించారు. ఆయన పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. అధ్యాపక బాధ్యతలతో పాటు యూనివర్సిటీ పరిపాలనలోనూ కీలకంగా వ్యవహరించిన రాజ్కుమార్.. ప్రిన్సిపా ల్, అదనపు కంట్రోలర్, కంట్రోలర్, ఐక్యూఏసీ డైరెక్టర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. బోధన, పరిశోధన, పరిపాలన లో అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. చాక్లెట్కు బదులు.. మొక్క! వినూత్న బోధనతో విద్యార్థుల్లో కొత్త అలవాట్లు రిటైర్మెంట్ తర్వాత.. తరగతి గదిలోనే! అవిశ్రాంత బడిపంతులు.. మంగళగిరి నర్సోజి మెరుగైన బోధన.. పరిశోధనకు పట్టం! -
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట
కోస్గి/కోస్గి రూరల్: అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ జాప్యం చేయకుండా వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని చెప్పారు. శుక్రవారం సీఎం తన సొంత నియోజకవర్గంలో పర్యటించి.. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 2.53 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రికి కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో దోరెపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్లో బయలుదేరిన సీఎం ముందుగా రూ.6.10 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించడంతోపాటు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలల వివరాలతోపాటు 4 ఎకరాల స్థలంలో 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి సీఎంకు వివరించారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంకకు సూచించారు. రానున్న మార్చిలోగా కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి.. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి చింతల్దిండి రోడ్డులో రూ.30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గురుకుల పాఠశాల, కళాశాలలకు స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి మద్దూరు పర్యటన సందర్భంగా పట్టణంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సెక్రెటరీ శ్రీధర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీను, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, డీఆర్ఓ రాజేశ్వరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్కుమార్, మద్దూర్ మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, వైస్ చైర్పర్సన్ భాగ్యశ్రీ, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాలయ్య, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిపర్యటన సాగింది ఇలా.. 2.53 గంటలకు మద్దూరు మున్సిపల్ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర సీఎం రేవంత్రెడ్డితో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వచ్చారు. 2.56 గంటలకు పేట కలెక్టర్ ప్రియాంక ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 3.00 గంటలకు సీఎం కాన్వాయ్లో డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం సీఎం భవన నిర్మాణ పనులను పరీశీలించారు. 3.25 గంటలకు స్థానిక పాత బస్టాండ్ ఆంజనేయస్వామి ఆలయం మీదుగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు చేరుకున్నారు. అక్కడ సమీప కాలనీలోని మహిళలతో మాట్లాడారు. 3.45 గంటలకు గురుకుల కళాశాల నుంచి బయలుదేరి.. నారాయణపేట– కోస్గి ప్రధాన రహదారిపై ఇరువైపులా నిల్చున్న ప్రజలకు కారు డోర్లో నిలబడి అభివాదం చేస్తూ హెలీప్యాడ్కు చేరుకున్నారు. 4.00 గంటలకు సీఎం, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, కడా చైర్మన్ వెంకట్రెడ్డి హెలిక్యాప్టర్లో కూర్చున్నారు. 4.08 గంటలకు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్బాద్కు హెలిక్యాప్టర్ బయలుదేరి వెళ్లింది. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు డిగ్రీ కళాశాల భవనాన్ని మార్చిలోగా పూర్తిచేయాలి మద్దూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో 1.15 గంటలు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు -
గణితం అంటే.. ఇష్టపడేలా బోధన
విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించి.. ఇష్టంగా నేర్చుకునేలా వివిధ రకాల టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్తో బోధిస్తున్నారు గణిత ఉపాధ్యాయురాలు మాలె శోభారాణి. 14 ఏళ్లుగా ‘అప్రిసియేషన్ మ్యాథ్స్ టీచర్శ్రీగా సేవలందిస్తూ జాతీయస్థాయిలో పలు అవార్డులు, సర్టిఫికెట్లు అందుకున్నారు. ప్రస్తుతం పెద్దమునుగాల్చేడ్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. చదువుతో పాటు సామాజిక, నైతిక విలువలు, క్రమశిక్షణను విద్యార్థులకు నేర్పుతున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అవసరమైన విద్యా సామగ్రిని అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం 2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. ప్రధాని నరేంద్రమోదీ నుంచి ‘సేవాపక్వాడ్’ అవార్డును సైతం అందుకున్నారు. సైన్స్ ఫెయిర్లలో ప్రదర్శనలు ఇస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనను పెంపొందిస్తున్నారు. -
సర్ నోటీసులకు సరైన పత్రాలు ఇవ్వాలి
గద్వాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన పత్రాలు అందజేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఆయా రోజుల్లో బీఎల్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన సమయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సేవలను అందించాలన్నారు. ఓటరు జాబితాలో పేరులేని అర్హులైన పౌరులు ఫారం–6 ద్వారా కొత్తగా తమ పేరును నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో ఏదైనా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం లేదా అనర్హులైన ఓటరు పేరు తొలగించేందుకు ఫారం–7 ద్వారా, ఓటరు వివరాల్లో తప్పులు సరిచేయడం, చిరునామా మార్పుల కోసం ఫారం–8ను సమర్పించవచ్చన్నారు. సర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఏ, బీ, సీ కేటగిరిలో ఉన్న ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలను సమర్చించాలన్నారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,49,282 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 36 వేల మందికి ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, మంజుల, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో విధ్వంసమైన వ్యవసాయం
ధరూరు: రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ విఫల పాలనలో వ్యవసాయం విధ్వంసం జరిగిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హన్మంతు అ న్నారు. ధరూరులోని సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని 12 గంటలకు పరిమితం చేశారని, అందులోనూ ఎడాపెడా కోతలు పెడుతున్నారని విమర్శించారు. రైతులకు మేలు జరిగింది అంటే అది కేవలం బీఆర్ఎస్ పాలనలో మాత్రమే అన్నారు. రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు నామరూపాలు లేకుండా పోతాయని హెచ్చరించారు. అనంతరం గద్వాల విద్యుత్ డీఈతో ఫోన్లో మాట్లాడి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల ఏఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పద్మ, నాయకులు వెంకట్రాములు, రాఘవేందర్రెడ్డి, జనార్దన్రెడ్డి, మోనేష్, ప్రతాప్, శ్రీనివాస్గౌడ్, వెంకటేష్నాయుడు, లక్ష్మీకాంత్రెడ్డి, భరతసింహారెడ్డి పాల్గొన్నారు. ధరూరులో వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు -
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
రాజోళి/ ఉండవెల్లి: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం వడ్డేపల్లి మహిళా సమాఖ్యలో అలంపూర్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించి మాట్లాడారు. పాంపాండ్ల పురోగతి, లేబర్ బడ్జెట్, నివేదికలు, ఎస్టిమేషన్ల తయారీ తదితర పనులపై మండలాల వారీగా అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. లేబర్ బడ్జెట్కు అనుగుణంగా పనులు నిర్వహించాలని, నిత్యం పనులపై పర్యవేక్షణ చేస్తూ.. నాణ్యతగా చేపట్టేలా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని అప్పుడే పనులు వేగవంతంగా సాగుతాయని చెప్పారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై నివేదిక అందించాలని సూచించారు. అనంతరం వడ్డేపల్లిలో జరుగుతున్న పలు పనులను ఆయన పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే ఉండవెల్లిలో రైతు నిర్మిస్తున్న పాంపాండును పరిశీలించారు. తప్పనిసరిగా వీఓ పాంపాండ్లను నిర్మించాలని పేర్కొన్నారు. -
నేడు మద్దూరులో సీఎం పర్యటన
నారాయణపేట/కోస్గి/కొత్తపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మద్దూర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం మద్దూరు పోలీస్స్టేషన్లో నిర్వహించిన ఏఎస్ఎల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. హెలిప్యాడ్ నుంచి సీఎం పర్యటించే మార్గంలో రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్యం, అగ్నిమాపక, బ్యారికేడింగ్ ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. సీఎం రూట్లో రహదారి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, జనసందోహం, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు, తాగునీరు, ఆహార ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం వాహనం వద్దకు ఎవరూ రాకూడదు సీఎం వాహనం సమీపానికి ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు రాకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశించారు. యాక్సెస్ కంట్రోల్, ట్రాఫిక్ నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అంతకుముందు నారాయణపేట కలెక్టర్, ఎస్పీ మద్దూర్ సమీపంలోని హెలీప్యాడ్, డిగ్రీ కళాశాల, గురుకుల బాలికల పాఠశాల/కళాశాల భవన నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. -
పకడ్బందీగా పంటల నమోదు ప్రక్రియ
ధరూరు: జిల్లాలో పంట నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. గురువారం మండలంలోని ఎములోనిపల్లి గ్రామ శివారులో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న పంట నమోదు సర్వేను ఆయన పరిశీలించి.. మాట్లాడారు. పంట నమోదు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. వరి పంట సాగు చేసిన రైతులు ఎక్కడైతే విత్తనాలు కొనుగోలు చేశారో వారి దగ్గరే నమోదు చేయించాలని చెప్పారు. ముఖ్యంగా ఆర్ఎన్ఆర్15048, బీపీటీ 5204, జైశ్రీరాం హెచ్ఎంటీ సోనా, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 715, డబ్ల్యూజీఎల్ 44 వంటి ఏడు రకాల వరి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. సొంత విత్తనాలు వేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే అలాంటి వారు ఏఈఓ దగ్గర డిక్లరేషన్ ఫాం నమోదు చేయించుకోవాలన్నారు. వరి విత్తనాలు కొనుగోలు చేయని రైతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ రాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. నేత్రదాన పక్షోత్సవాలు గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం 41వ నేత్రదాన పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి మాట్లాడుతూ మరణించిన తర్వాత కళ్లను మరొకరికి దానం చేయడం ద్వారా వారికి చూపును అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరు తమ మరణానంతరం నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. నేత్రదాన పక్షోత్సవాలను ఈ నెల 8 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తూ.. కళ్ల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. నర్సరీల నిర్వహణకు పక్కాగా రిజిస్ట్రేషన్ గద్వాల వ్యవసాయం: ఉద్యాన నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించి.. లైసెన్స్ తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉద్యాన శాఖాధికారి రాజ్కుమార్ అన్నారు. గురువారం గద్వాల శివారులోని పలు కూరగాయల నర్సరీలను ఆయన సందర్శించి.. మొక్కల నాణ్యత, నర్సరీల నిర్వహణ, రిజిస్ట్రేషన్, లైసెన్స్ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించకుండా నర్సరీలు నిర్వహిస్తే నర్సరీల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ చట్టం–2010, తెలంగాణ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్– 2017 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసు కుంటామన్నారు. కొన్ని నర్సరీలు ప్రభుత్వ అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా నాసిరకం నారు, మొక్కలను విక్రయిస్తూ.. రైతులకు బిల్లులు ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. రైతులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, చీడపీడలు లేని కూరగాయల నారు, పండ్లు, పూల మొక్కలను అందించడమే నర్సరీ చట్టం ప్రధాన ఉద్దేశం అన్నారు. మొక్కల నాణ్యత, పరిమాణం, ప్రమాణాలకు అనుగుణంగా ధర ఉండాలన్నారు. ఆయన వెంట ఉద్యాన అధికారి రాజశేఖర్ తదితరులున్నారు. -
వేటు.. దారెటు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపిన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్పై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఆయనపై వేటు పడింది. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పిస్తూ.. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన సైతం వెలువడింది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న సీనియర్ నేతపై ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం సృష్టిస్తుండగా.. ఆయన దారెటు అనేది హాట్టాపిక్గా మారింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. చిన్నారెడ్డి 1980 నుంచి 1983 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ 1989 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999–2004, 2004–2009, 2014–2018 కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో 2007 నుంచి 2009 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2018లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2021లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ చేజారడం నుంచి మొదలు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం మొదట ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మేఘారెడ్డికి టికెట్ కేటాయించడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలుపొందగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2024లో చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. అయితే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారడంతో మనస్థాపానికి గురైన ఆయన పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. అనివార్యత పరిస్థితుల్లోనేనా.. సీఎం రేవంత్రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కొండా సురేఖ సైతం విమర్శలు గుప్పించడం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమైపె వేటు వేసే క్రమంలో చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని కాంగ్రెస్తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిన్నారెడ్డి వర్గీయుల్లో అయోమయం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పించిన క్రమంలో ఆయన అనుచర వర్గంలో నిరాశ అలుముకుంది. ఆయన మాట్లాడింది పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు కావని, దశాబ్దాలుగా జెండా మోసిన పాత కార్యకర్తల ఆవేదననే వెళ్లగక్కా రని వారు చెబుతున్నారు. 48ఏళ్ల క్రమశిక్షణకు పార్టీ ఇచ్చిన బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. తమ భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆందోళన, అయోమయం వారిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. గోపాల్పేట మండలం జయన్నతిరుమలాపూర్లోనితన వ్యవసాయ క్షేత్రంలో చిన్నారెడ్డిముదిరిన విభేదాలు.. వనపర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల క్రమంలో మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది. అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పరంగా తనకు ప్రాధాన్యం దక్కడం లేదని పలుమార్లు చిన్నారెడ్డి అసంతృప్తి వెళ్లగక్కారు. కేబినెట్ హోదాలో తనకు కేటాయించిన గన్మెన్లు, ప్రభుత్వ వాహనాన్ని ఉపసంహరించుకున్నారు. తన అనుచరులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మేఘారెడ్డి సైతం ఆయనపై ప్రతి విమర్శలు చేయడం.. ఇలా ఇద్దరి మధ్య క్రమక్రమంగా విభేదాలు మరింత ముదిరాయి. ఘాటు విమర్శలతో.. ఇటీవల గోపాల్పేటలో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, వాటిని భరిస్తూ వస్తున్నానని, లేకుంటే తాను మరో జీవన్రెడ్డిని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ తనకు సీటు ఇచ్చినా ఇక్కడ డబ్బులకు లొంగి తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని అనుభవించిన వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చి మళ్లీ తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 ఏళ్లు కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఈ వ్యాఖ్యలు నియోజవర్గంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి తొలగింపు సీనియర్ నేతపై కాంగ్రెస్ అధిష్టానం ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరువ్యాప్తంగాహస్తం శ్రేణుల్లో కలకలం భవిష్యత్పై జిల్లెల అనుచరుల్లో అయోమయం -
కరెంట్.. కట్కట!
వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తీవ్రమైన కోతలు ● ఇప్పటికే రోడ్లెక్కి అన్నదాతల ఆందోళనలు ● ఖరీఫ్ సీజన్లో 3.28 లక్షల ఎకరాల్లో పంటల సాగు ● జిల్లాలో అత్యధికంగా పత్తి, వరి పంటలు ● ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు గద్వాల: ఎల్నిన్ ప్రభావంతో ఈసారి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వాస్తవానికి వానాకాలం మొదలు జూన్ ఆఖరి వారం మొదలుకొని జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. అధిక వర్షాలు దేవుడెరుగు కనీసం కురవాల్సిన సాధారణ వర్షాలు కూడా కురవలేదు. గడిచిన రెండు నెలల్లో 63 మి.మీ., వర్షపాతం తక్కువ నమోదైందంటే జిల్లాలో ఎల్నినో ప్రభావం ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. వర్షాల పరిస్థితి ఇలా ఉంటే.. ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 3.28 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 1.72 లక్షల ఎకరాల్లో పత్తి, 78 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. అలాగే మొత్తం సాగైన పంటలలో వర్షాధారంగా 1.45 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద 1.83 లక్షల ఎకరాలు సాగుచేశారు. అయితే ఈసారి తక్కువ వర్షాలు నమోదుతో విద్యుత్ వినియోగం పెరగడం, సరఫరా తగ్గడంతో కోతలు మొదలయ్యాయి. దీంతో విద్యుత్ కోతలపై రైతులు జిల్లావ్యాప్తంగా రోడ్డెక్కి ధర్నా చేసున్నారు. మరోవైపు సాగైన పంటలు గట్టెక్కాలంటే ఇంకా మూడు నెలల కాలం ఉంది. మరి అంతవరకు పంటలకు సాగునీరు అందుతుందా.. లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
గద్వాల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాల ను నిరసిస్తూ.. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను మోసపూరిత ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. పాలకులు వ్యక్తిగత ఆదాయంపై దృష్టిసారించి.. సామా న్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలుగా మిగిలిపోయ్యాయని ధ్వజమెత్తారు. మాట తప్పడం.. ప్రజలను మోసం చేయడంలో సీఎం రేవంత్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. నాగర్దొడ్డి వెంకట్రాములు, రాఘవేంద్రరెడ్డి, కోటేశ్, శ్యామల, పద్మ, వెంకటేశ్, రాము, సునీత, జగదీశ్, బస్వారాజ్ పాల్గొన్నారు. -
పంటల నమోదు తప్పనిసరి : డీఏఓ
ఎర్రవల్లి: ప్రతి రైతు తప్పనిసరిగా పంటల నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని తిమ్మాపురం, వల్లూరు గ్రామాల్లో వలంటీర్లు నిర్వహిస్తున్న పంటల నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగుచేసిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలంటే పంటల నమోదు తప్పనిసరిగా ఉండాలన్నారు. లేనిచో పంట విక్రయించే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా వరిసాగు చేసే రైతులు ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్నాలను మాత్రమే పండించాలని సూచించారు. ప్రభుత్వం సన్న రకాలకు ప్రకటించిన రూ.500 బోనస్ పొందేందుకు పంటల నమోదు ఎంతో కీలకమని తెలిపారు. వివిధ పంటలను సాగుచేసిన రైతులు తమ వద్దకు వచ్చే వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వలంటీర్ ద్వారా పంటల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం తిమ్మాపురంలో ధర్తీ మాతా బచావో నిగ్రాణి సమితిపై సమీక్షించారు. ఆయన వెంట ఏఓ సురేశ్గౌడ్, ఏఈఓలు నరేశ్, హసీనా ఉన్నారు. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
గద్వాలన్యూటౌన్: బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ రామేశ్వరమ్మ, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్, మున్సిపల్ వైస్చైర్మన్ శంకర్ అన్నారు. బుధవారం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన చేసి.. ప్రజల హృదయాలు, జీవితాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీటి కొరత తీర్చిన ఘనత మహానేతకే దక్కుతుందని కొనియాడారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్యసేవల విస్తరణ, విద్యకు ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో వైఎస్సార్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలతో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోవిందు, సత్యం, నాయకులు తుమ్మల నర్సింహులు, నరహరి శ్రీనివాసులు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాల శ్రీను, పురుషోత్తంరెడ్డి, గోవిందు, సతీష్, నాగేంద్ర యాదవ్, ధర్మనాయుడు, సుదర్శన్, కౌసర్, కిఫాయత్, శ్రీనివాస్ యాదవ్, మోయిన్, రాజశేఖర్రెడ్డి, డీటీడీసీ నర్సింహులు, శ్రీనివాస్గౌడ్, ఆనంద్, కృష్ణయ్యగౌడ్, ఆనంద్గౌడ్, జహంగీర్, రఫీ, చిన్నమద్దిలేటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
గద్వాల క్రైం: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘సైబర్ జాగ్రత్త దివాస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల స్వరూపాలు కూడా మారుతున్నాయని అన్నారు. గుర్తుతెలియని నంబర్లు, ఆన్లైన్ చాటింగ్లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనల లింక్లను డౌన్లోడ్ చేస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు క్షణాల్లో వ్యక్తిగత గోప్యతను తస్కరించి.. బ్లాక్ మొయిల్తో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. వివిధ కారణాలతో సైబర్ మోసాలకు గురవుతున్నామని చెప్పడం కంటే.. వ్యక్తిగత విషయాలు చెప్పడం ద్వారా మోసానికి గురవుతున్నామనే విషయాన్ని గుర్తించలేకపోవడం జరుగుతుందన్నారు. పోలీసుశాఖ నిరంతరం చైతన్య కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నా.. వారిలో మార్పు లేకపోవడం మరో సమస్యగా ఉందన్నారు. పోలీసు సిబ్బంది చెప్పే స్వీయ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ సూచించారు. అనంతరం ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు. -
పకడ్బందీగా ‘సర్’..
సరైన గుర్తింపు కార్డుతో ఓటుహక్కు పొందాలి ● జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేలా చర్యలు ● అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తాం ● ఈ నెల నుంచే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ‘‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం.. ఓటరు జాబితాలో పేరు, ఇంటి అడ్రస్ పొరపాట్లకు సంబంధించి నోటీసులు జనరేట్ చేస్తున్నాం.. నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేస్తాం..’’ అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. విద్య, వైద్యశాఖల్లో మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. వానాకాలంలో సాగుచేసిన పంటలు దెబ్బతినకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను సవివరంగా వివరించారు. ఆయన మాటల్లోనే.. – గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉన్న 594 పోలింగ్ కేంద్రాల పరిధిలో 5,03,859 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 87.31శాతం (4,39,934 మంది ఓటర్లు) డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 63,925 మంది ఓటర్లు వివిధ రకాల కారణాలతో పెండింగ్లో ఉన్నాయి. వీరికి నోటీసులు ఇచ్చి, సరైన ధ్రువపత్రాలు ఇస్తే ఓటుహక్కు కల్పిస్తాం. అదే విధంగా పేరులో పొరపాట్లు, ఇంటి అడ్రస్లో తప్పులు వంటి కారణాలతో 1,49,281మందికి నోటీసులు జారీ చేస్తున్నాం. వీరు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కార్డులు సమర్పిస్తే, ఓటు హక్కు కల్పిస్తాం. మెరుగైన ఫలితాలకు చర్యలు.. పదో తరగతిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సెప్టెంబర్ నుంచే ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేస్తాం. పోషణ్ యాప్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఇందులో రాష్ట్రంలో జిల్లా 26వ స్థానంలో ఉండేది. నేను వచ్చిన తర్వాత మార్పులు చేపట్టి.. 1వ స్థానంలో నిలిచాం. జిల్లావ్యాప్తంగా 340మంది టీచర్లు తక్కువగా ఉన్నారు. వీరి స్థానంలో 125మంది విద్యా వలంటీర్లను నియమించాం. గట్టు, కేటీదొడ్డి మండలాల్లోనే అత్యధికంగా 60మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా బడిమానేసిన 6వేల మందిని తిరిగి బడుల్లో చేర్పించాల్సి ఉంది. అదే విధంగా డిప్యూటేషన్లపై ఉన్నవారిని రద్దు చేసి, వారి స్థానాలకు పంపడం జరిగింది. రెసిడెన్షియల్, హైస్కూల్ విద్యార్థులకు త్వరలోనే హెల్త్కార్డులు ఇచ్చి.. కంటి, చెవి, రక్తహీనత, బాడీమాస్, చర్మ వ్యాధులకు అవసరమైన వైద్యం అందించేలా చర్యలు చేపడుతాం. ప్రభుత్వ పాఠశాలలను తహసీల్దార్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా అదనపు బాధ్యతలు అప్పగించాం. ఫిర్యాదులు పరిష్కరించేలా.. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తప్పనిసరిగా పరిష్కారం చూపేలా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నాం. నిర్లక్ష్యం వహించే అధికారులకు నోటీసులు ఇచ్చి, పనులు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. భూములకు సంబంధించి 22–ఏ కింద ఏదైనా సమస్య ఉంటే సరైన ఆధారాలతో పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నాం. వేగవంతంగా భూసేకరణ ప్రక్రియ.. జిల్లాలో మల్లమ్మకుంట రిజర్వాయర్కు సంబంధించి ఇటీవల భూసేర్వే పూర్తయింది. త్వరలోనే మిగిలిన పనులను పూర్తిచేస్తాం. ప్రభుత్వపరంగా ఎకరాకు రూ.12లక్షల చొప్పున ఇస్తామన్నాం. అయితే రైతులు ఎక్కువ అడుగుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. పంటలు ఎండకుండా జాగ్రత్తలు.. వానాకాలంలో సాగుచేసిన పంటలు ఎండిపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జూరాలలో 9టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది. వాటిలో తాగునీటికి ఽమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రధానంగా యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేసేలా చర్యలు తీసుకుంటాం. పదిశాతం స్థలాలు కాపాడుతాం.. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో పదిశాతం స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, నివేదిక ఇవ్వాలని కమిషనర్ను ఆదేశించాం. అదే విధంగా భీంనగర్లో ఉన్న పదిశాతం స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించి, సంరక్షణ చర్యలు చేపడుతాం. అవగాహన అవసరం.. సర్ ప్రక్రియపై చాలా మందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్వోలకు పలుమార్లు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. అనామాలీస్ అంటే పేర్లలో పొరపాట్లు ఉన్నవారు బీఎల్వో స్థాయిలోనే పరిష్కరించబడుతాయి. మ్యాపింగ్కు సంబంధించి కలెక్టర్ స్థాయిలో ఉంటుంది. వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. రోగుల సౌకర్యార్థం అదనపు షెడ్లు ఏర్పాటు చేసేందుకు రూ. 50లక్షలు మంజూరు చేశాం. ఆస్పత్రిలో రేడియాలజీ వైద్యుడు అవసరం ఉంది. ఇందుకోసం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ ఎవరు రాలేదు. ‘సాక్షి’ ద్వారా మరోసారి చెబుతున్నాం. అర్హత గల ౖరేడియాలజీ డాక్టర్ వస్తే నేరుగా అప్పాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం. లేదా ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న రేడియాలజీ డాక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 2–3గంటల పాటు పనిచేస్తే, వారికి తగిన ఫీజులు ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం. -
రాజ‘కీ’యం.. రసవత్తరం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్లో అంతర్గత పరిణామాలు, మరోవైపు వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఊపందుకున్న పోటాపోటీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సంబరాలకు సిద్ధమవుతుంటే.. దగా పాలన అంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. వారం రోజుల ఆందోళనలో భాగంగా తొలి రోజు బుధవారం ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు. ఈ రాజకీయ వేడి రాజుకున్న క్రమంలో ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూరు మండల పర్యటన ఖరారు కావడం పాలమూరు వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. కలవని చేతులతో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాల్లోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పలు ప్రాంతాల్లో ప్రెస్మీట్లు పెట్టి తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహబూబ్నగర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి అభివృద్ధిని వివరించడంతో పాటు ఖిల్లాఘనపురం మండలంలో బైక్ర్యాలీ నిర్వహించారు. అయితే మిగతా జిల్లాల్లో వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు దూరంగా ఉన్నాయి. ఇందుకు డీసీసీ నేతలు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ దూకుడు మంత్రంతో.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజా పాలన కాదు.. ఇది దగా పాలన అంటూ వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు బుధవారం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాకేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇచ్చిన గ్యారెంటీలు, రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు భగ్గుమన్నారు. వారం పాటు ఆందోళన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా దూకుడుగా వ్యవహరించాలని మండలాల వారీగా నాయకులు, అనుచరులతో భేటీ అయిన సందర్భంలో ముఖ్య నేతలు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్ఎస్ నిరసనల నడుమ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల నాలుగో తేదీన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గిరిజన గురుకుల భవనాలు, డిగ్రీ కళాశాల, ఇతర మౌలిక వసతుల పనులను పర్యవేక్షించిన తర్వాత నిర్వహించే బహిరంగసభ ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి సమాధానమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాలమూరులో జోరుగా పాలి‘ట్రిక్స్’ సీనియర్ నేత చిన్నారెడ్డి ఎపిసోడ్పై కొనసాగుతున్న ఉత్కంఠ వెయ్యి రోజుల పాలనపై పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి, సంక్షేమంపై కాంగ్రెస్ నేతల ప్రెస్మీట్లు పలు ప్రాంతాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు దగా పాలన అంటూ రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు ఆసక్తి రేపుతున్న సీఎం రేవంత్రెడ్డి మద్దూరు పర్యటన వనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. 2023 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావడం.. తొలుత చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్, ఆ తర్వాత మేఘారెడ్డికి ఇవ్వడం ఇరువురి మధ్య విభేదాలకు దారితీసింది. అయితే చిన్నారెడ్డి గోపాల్పేట వేదిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సీరియస్గా పరిగణించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై భగ్గుమన్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీభవన్, టీపీసీసీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేయగా.. పెండింగ్లోనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి సురేఖ ఎపిసోడ్ నడుస్తుండగా.. ఆ తర్వాత చిన్నారెడ్డిని ఢిల్లీకి పిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయనపై చర్యలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు నడుస్తున్నాయి. -
క్రీడాకారులకు ప్రోత్సాహం
అలంపూర్: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వసతులు కల్పిస్తోందని డీవైఎస్ఓ రామలింగేశ్వరరావు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వైష్ణవి పాఠశాలలో బుధవారం క్రీడా సమాఖ్య జిల్లాస్థాయి వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులు ఆటల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటాలన్నారు. అందుకు ప్రతిభ కలిగిన వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటుందన్నారు. క్రీడల్లో రాణించే వారికి మెరుగైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో కూడా మండల, జిల్లాస్థాయి క్రీడలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ నెల 15లోగా మండలస్థాయి, 30వ తేదీలోగా జిల్లాస్థాయి క్రీడలను పూర్తిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు పద్మావతమ్మ, ప్రియదర్శిని, సుహాసిని, శైలజ, భరత్కుమార్ ఉన్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం అలంపూర్: మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాజేశ్ అన్నారు. బుధవారం స్థానిక 2వ వార్డులో ఆయన పర్యటించి.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కౌన్సిలర్ రాజ్యలక్ష్మి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్ స్వాతి, సురేశ్, రజినీబాబు, డేరన్ ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: జిల్లాలో వెన్నెముక సమస్య, కండరాల క్షీణిత, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియాతో మంచానికుకే పరిమితమైన వారికి అత్యవసర వైద్యసహాయం కోసం దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జౌషధాల కొనుగోలు, ఎస్కార్ట్ అటెండర్ సహా యం కోసం దరఖాస్తులను కలెక్టరెట్లోని మ హిళా శిశుసంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ పత్రాలు, ఆధార్తో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, సహా యం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎకై ్సజ్ శాఖలో భారీగా బదిలీలు నారాయణపేట: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. సీఐ, ఎస్ఐ కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ బుధవారం సాయంత్రం నుంచి వరుసగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ ఆమోదంతో గ్రేటర్ హైదరాబాద్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (ఇన్చార్జి) హరికృష్ణ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎకై ్సజ్ పరిధిలోనూ పలువురు అధికారులకు స్థానచలనం కలిగింది. నారాయణపేట ఎకై ్సజ్ సీఐ అనంతయ్య శేరిలింగంపల్లికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్లగొండ డీటీఎఫ్ సీఐ సైదులు వస్తున్నారు. ● నారాయణపేట ఎకై ్సజ్ సర్కిల్ ఎస్ఐలు గురువయ్య దేవరకొండకు, రమేష్ కోదాడ చెక్పోస్టు, శిరీష తుంగతుర్తికి బదిలీ అయ్యారు. కోస్గి సీఐ బాలకృష్ణ మల్కాజ్గిరికి బదిలీ కాగా.. నారాయణపేట బీఎంపీపీలో పనిచేస్తున్న శ్రావణ్కుమార్ సైబరాబాద్ పరిధిలోని పటాన్చెరువుకు బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో మరికొందరికి.. మహబూబ్నగర్ సీఐ లక్ష్మణ్గౌడ్ కుత్బుల్లాపూర్కు, జడ్చర్ల సీఐ విప్లవ్రెడ్డి దూల్పేట్కు బదిలీ అయ్యారు. నాగర్కర్నూల్ పరిధిలోని ఎస్ఐ చిన్నరాములు మోటూరి హుజూర్నగర్కు, జడ్చర్ల ఎస్ఐ నాగరాజు ఎన్ఫోర్స్మెంట్ మల్కాజ్గిరికి, కోస్గి ఎస్ఐ ఎంఏ జబ్బార్ హయత్నగర్, డీటీఎఫ్ నుంచి కవిత సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ● రేవులపల్లి నుంచి జి.వెంకటేశం మహబూబ్నగర్ సీఐగా, జహీరాబాద్ నుంచి మల్లికార్జునబాబు వనపర్తి సీఐగా, ఎన్ఫోర్స్మెంట్ నుంచి చంద్రశేఖర్ జడ్చర్ల సీఐగా బదిలీపై వస్తున్నారు. మెదక్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఎస్ఐ యాదయ్య జడ్చర్లకు, రామపేట్ నుంచి ఎస్ఐ శివకృష్ణ చెక్పోస్టుకు, హయత్నగర్ నుంచి ఎస్ఐ సరళ కోస్గికి బదిలీ వస్తున్నారు. ఘనపూర్ నుంచి నరేష్ కేతావత్ ఎన్ఫోర్స్మెంట్ మహబూబ్నగర్కు బదిలీపై వస్తున్నారు. -
ఎస్సీల సమగ్ర అభివృద్ధికి సమష్టిగా కృషి
గద్వాల: జిల్లాలో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ వినియోగంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అర్హులైన కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా వినియోగించాలని, లబ్ధిదారుల వివరాలపై శాఖల వారీగా నివేదిక సమర్పించాలని సూచించారు. అలంపూర్ రిజర్వుడ్ నియోజకవర్గ ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పధకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు విద్యుత్, భద్రత సర్టిఫికెట్ తీసుకోవాలని రాత్రి 10 గంటల తర్వాల మైక్ శబ్దాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. బీచుపల్లి, నదీ అగ్రహారం వద్ద కృష్ణానది వినాయకుల నిమజ్జనానికి క్రేన్లు, గజ ఈతగాళ్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు మదన్మోహన్, నర్సింగరావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
అలంపూర్ రూరల్: జిల్లాలో హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించి రెండు వారాల ముందే వారిని నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి వరలక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని క్యాతూర్ పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించారు. మండల వైద్యాధికారి రాధిక ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమీక్ష సమవేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖకు సంబంధించి అమలవుతున్న జాతీయ, రాష్ట్రస్థాయి ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ఆరాతీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణికి సురక్షితమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రనవాలన్నీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది, ఆశాలు పూర్తి సమన్వయంతో పనిచేసి.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ సత్యనారాయణ, హెచ్ఏ బాలీశ్వరయ్యశెట్టి, సూపర్వైజర్లు ఉలిగమ్మ, చంద్రన్న, ఎంఎల్హెచ్పీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్తో సామాజిక భద్రత ప్రశ్నార్థకం గద్వాల న్యూటౌన్: పాత పెన్షన్ విధానం రద్దు చేసి.. సీపీఎస్ విధానం అమలు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ సామాజిక భద్రత ప్రశ్నార్థకంగా మారిందని టీఎస్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సహ అధ్యక్షుడు విష్ణు అన్నారు. సీపీఎస్ అమలై 22 ఏళ్లు అవుతున్నా.. ఓపీఎస్ను పునరుద్ధరించకపోవడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు మంగళవారం నల్లబ్యాడ్జీలు, రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో నవంబర్ 17న సామూహిక సెలవులకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నవంబర్ 17నే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించి.. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని చెప్పారన్నారు. దీనినే మేనిఫెస్టో డేగా పాటిస్తూ.. సామూహిక సెలవు కార్యక్రమాన్ని అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయ వంతం చేయాలని కోరారు. 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానంతో 22 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమలో నాయకులు శ్రీనివాసరెడ్డి, రమేష్కుమార్, బుచ్చన్న, లక్ష్మీనారాయణ, ప్రతాప్, రాజుసాగర్, తిమ్మన్న పాల్గొన్నారు. -
పంచాయతీ నిధులపై రాష్ట్ర అధికారుల విచారణ
● రిటైర్డ్, బదిలీ అయిన అధికారులు సైతం హాజరు గట్టు: గట్టు గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల వినియోగం వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. గట్టు గ్రామస్తుల పేరుతో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులు నాగేశ్వర్రావు, నర్సింగరావు వచ్చి సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వ హించారు. పంచాయతీ పాలకవర్గంతోపాటు గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ అయిన అధికారులు, పదవీ విరమణ పొందిన అధికారితోపాటు ఇతర అధికారులు విచారణకు హాజరయ్యారు. గట్టు పంచాయతీలో రూ.22 లక్షలను ఎలాంటి తీర్మానాలు లేకుండా డ్రా చేసుకున్నట్లు వార్డుసభ్యుడు సంతోష్ విచారణ అధికారుల దృష్టికి తెచ్చారు. మినిట్స్ బుక్ రాయలేదని, 8 నెలలుగా గ్రామసభ నిర్వహించలేదని, పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రూ.90 వేలు ఖర్చు చేశారని ఆరోపించారు. గ్రామ కార్యదర్శులు నకిలీ తీర్మానాలతో బిల్లులు డ్రా చేసుకున్నారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. హరిజన వాడ పాఠశాలను కూల్చివేశారని, ఉన్నత పాఠశాలలో భవనాల కూల్చివేతకు ఎవరి అనుమతులు తీసుకున్నారనే విషయాలు బహిర్గతం చేయాలని మాజీ ఎంపీటీసీ కృష్ణ కోరారు. రైతువేదిక దగ్గర భారత్మాల కాంట్రాక్టర్ మట్టి వేస్తే పంచాయతీ వారు తాము చేసినట్లు నిధులను డ్రా చేసుకున్నారని, పంచాయతీ సర్పంచులకు సంబంధించిన డీజిటల్ కీలను కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గట్టు గ్రామంలో 10 శాతం స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని వాటిపై విచారణ చేయాలని విన్నించారు. ● విచారణ అధికారి, డిప్యూటీ సీఈఓ నాగేశ్వర్రావు మాట్లాడుతూ గట్టు గ్రామస్తులు ఫిర్యాదు మేరకు రూ.10 లక్షలకు సంబందించిన అంశాలపై మాత్రమే తాను విచారణకు వచ్చినట్లు చెప్పారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ కార్యదర్శుల ద్వారా సేకరించి.. ఎంబీ రికార్డులను పరిశీలించారు. ముగ్గురు కార్యదర్శులు మునినాయక్, కుర్మన్న, జగన్నాథరావులను విచారించారు. అనంతరం ప్రత్యేకాధికారుల పాలనలో ఖర్చు చేసిన నిధులు, రైతువేదికతోపాటు ఇతర చోట్ల చేపట్టిన పనులను విచారణ అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎంపీడీఓ చెన్నయ్య, ఎంపీఓలు ఖాజా, రవికుమార్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
తూతూమంత్రంగా నిర్మాణం తొలగింపు
గద్వాల: జిల్లా కేంద్రంలోని భీంనగర్లో 10 శాతం స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడంపై ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కట్టడాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ క్రమంలో ఉదయం నుంచి నిర్మాణం చేపడుతున్న వ్యక్తులకు మున్సిపల్ అధికారుల మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం నోటీసులు ఇచ్చినప్పటికీ మంగళవారం సదరు ఆక్రమణదారుడు నిర్మాణ పనులు యథావిధిగా మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని పనులు ఆపేయాలంటూ చెప్పారు. అయితే పనులు ఆపేయమంటూ సదరు వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అధికారులు పనులు అడ్డుకొని బేస్మెంట్ నిర్మాణాన్ని తొలగించారు. అయితే మొత్తం నిర్మాణాన్ని తొలగించకుండా కొంత మేరకు తొలగించడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గతంలో పాత బస్టాండ్, రెండో రైల్వేగేటు ప్రాంతాల్లో మున్సిపల్కు చెందిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించిన అధికారులు ఇక్కడ మాత్రం తూతూమంత్రంగా తొలగించి మమ అన్పించేలా దీని వెనుకాల అదృశ్య శక్తులు ఎవరనేది ఆసక్తికర చర్చకు తెరలేపింది. అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి, మున్సిపల్ స్థలాన్ని అధికారులు సంరక్షిస్తారా లేక చేతులు దులిపేసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
జాక్పాట్ కొట్టి.. సర్కారుకు ఎగ్గొట్టి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రబీ సీజన్ 2022–23లో వేలం వేసి న సీఎమ్మార్ ధాన్యంలో అక్రమాలు నివ్వెరపరుస్తున్నాయి. ఉమ్మడి పాలమూ రులో రూ.వెయ్యి కోట్లకు పైగా సర్కారు పెట్టుబడిని రైస్ మిల్లర్లు పక్కా పథకం ప్రకారమే అప్పనంగా కాజేశారు. రూ.కోట్లు విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ఫోర్స్ బృందాల తనిఖీల్లో బట్టబయలు కాగా.. ఈ బాగోతం వెనుక ఎవరెవరున్నారనే దానిపై సర్కార్ దృష్టిపెట్టింది. ఈ దందాలో సూత్రధారులు, పాత్రదారులపై ఉన్నతాధికారులు కూపీ లాగుతుండగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మామూళ్లతో కట్టిపడేసి.. 2022– 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని ఆయా జిల్లాల్లో అసోసియేషన్ పేరిట మిల్లర్లందరూ కుమ్మకై ్క ప్రభుత్వానికి తిరిగి బియ్యం ఇవ్వకుండా పెద్దఎత్తున దారి మళ్లించారు. సివిల్ సప్లయ్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిని మామూళ్లతో మచ్చిక చేసుకొని.. దందా సాగించినట్లు తెలుస్తోంది. ముందుగా తమకు కేటాయించిన ధాన్యంలో కొంతమేర పాడై పోయేలా చేసిన మిల్లుల నిర్వాహకులు.. త్రిముఖ వ్యూహంతో నాటకాలకు తెరలేపారు. ఎండకు ఎండి.. వానకు తడిసి తొలుత మిల్లులకు కేటాయించిన ధాన్యంలో కొన్ని బస్తాలను ఆవరణలో ఎలాంటి రక్షణ లేకుండా నెట్టు వేయించారు. ఎక్కువ మొత్తంలో బస్తాలను షెడ్డులో వేశారు. ఆవరణలో వేసిన బస్తాలపై టార్పాలిన్లు లేకుండా, ఉన్నా కప్పీకప్పకుండా, చిరిగిన వాటిని కప్పి కావాలనే వర్షానికి తడిసి.. ఎండకు ఎండేలా చేశారు. ఆ తర్వాత ధాన్యం పూర్తిగా పాడైంది.. మేం వాడుకోలేదు.. బకాయి డబ్బులు కట్టమని అధికారులకు తెలియజేస్తున్నట్లు నటించి.. క్రమంగా మిగతా ధాన్యాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడతో ముందుకెళ్లినట్లు విచారణలో గుర్తించారు. ఆ తర్వాత నాణ్యత లేని ధాన్యం ఇథనాల్, లిక్కర్ ఫ్యాక్టరీలకు ముడిసరుకుగా బ్రోకెన్ రైస్ ఉపయోగపడుతుండడంతో నూకలుగా మార్చి తరలించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. సర్కారు సీరియస్ 2022– 23లో అదనంగా సీఎమ్మార్ ధాన్యం కట్టబెట్టారని.. అకాల వర్షాలతో తడిచి పాడైందంటూ మిల్లర్లు ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నమే చేస్తు న్నారు. ప్రభుత్వం డబ్బులు కట్టాల్సిందేనంటూ స్ప ష్టం చేసినప్పటికీ.. కొందరు మిల్లర్లు అదే ఎత్తుగడ తో ముందుకు సాగుతుండడం పెద్దలకు మరింత ఆగ్రహం తెప్పించింది. అందుకే జిల్లాలు, మిల్లర్ల వారీగా చిట్టా తెప్పించుకొంటుండగా.. అసలు నిజా లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విజిలెన్స్ ఆకస్మిక దాడులు.. కేసుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు మిల్లర్లు భయంతో హైదరాబాద్లోనే మకాం వేసి.. పైరవీలు మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్ కోసం కొందరు ప్రయత్నిస్తుండగా.. తనిఖీలు ఆపాలని మరికొందరు మంత్రులు, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఆ మిల్లుపై ఎనలేని ప్రేమ.. ఉమ్మడి జిల్లాలో విజిలెన్స్ బృందాలు ఇటీవల వరుసగా 14కిపైగా మిల్లులను జల్లెడ పట్టి దాదాపు రూ.245.10 కోట్ల అక్రమాలను బహిర్గతం చేశాయి. నవాబుపేట తీగలపల్లిలోని శ్రీ కనకదుర్గ పారాబాయిల్డ్ రైస్మిల్లు, మహబూబ్నగర్, వనపర్తి, ఖిల్లాఘనపురం, పెబ్బేరు, కొత్తకోట, కేటీదొడ్డి తదితర ప్రాంతాల్లో నిల్వ వ్యత్యాసాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. అయితే హన్వాడ మండలం ఇబ్రహీంబాద్లోని శ్రీలక్ష్మీ బాలాజీ రైస్ మిల్లులో 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మె.ట., ధాన్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలగా.. సదరు మిల్లు నిర్వాహకుడిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. 2022– 23 రబీ సీఎమ్మార్లో మిల్లర్ల నాటకాలు అసోసియేషన్ పేరిట కుమ్మకై ్క త్రిముఖ వ్యూహం.. కావాలని కొంత మేర ధాన్యం పాడైపోయేలా చేసి తొండాట నాణ్యతది మర ఆడించి యథేచ్ఛగా మార్కెట్లో విక్రయం అప్పనంగా సొమ్ము చేసుకుని.. నష్టమంటూ దొంగ కన్నీళ్లు -
మార్గదర్శకాల మేరకు..
కొత్త పింఛన్ల మంజూరులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పెంచింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – ముషాయిదాబేగం, డీఆర్డీఓ నాలుగేళ్ల నుంచి.. మాది చాలా పేద కుటుంబం. నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పుడు సదరం శిబిరానికి వెళ్లగా వైద్యులు పరీక్షించి, ఏడాది కాల పరిమితితో సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో దాని గడువు తీరిపోయింది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నా. మళ్లీ ఈ మధ్యనే మూడేళ్ల కాలపరిమితితో సదరం సర్టిఫికెట్ ఇవ్వగా.. దరఖాస్తు చేసుకున్నాను. – గోవిందు, దివ్యాంగుడు, గద్వాలవయసు పైబడింది.. నేను చేనేత కార్మికురాలిని. చీరలు నేయడమే మా వృత్తి.. ఇదే మాకు జీవనాధారం. వయస్సు మీదబడటంతో ఎక్కువ చీరలు ఇప్పుడు నేయలేకపోతున్నాను. చేనేత పింఛన్కు అర్హురాలిని అయినప్పటికీ కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో రాలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా. ఈసారి వస్తుందని భావిస్తున్నా. – సుజాత, చేనేత కార్మికురాలు, గద్వాల● -
రాఖీ వేళ.. ఆర్టీసీకి కాసుల వర్షం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈసారి రాఖీ పండుగతో ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. వరుసగా సెలవులు రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం గత నెల 27 నుంచి 31వ తేదీ వరకు 490 ప్రత్యేక బస్సులను నడిపారు. పండుగ వేళ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీజియన్ పరిధిలోని పది డిపోల అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. 5 రోజుల ఆదాయం వివరాలు.. ఆగస్టు 27న మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో 5,21,227 మంది ప్రయాణికుల ద్వారా రూ.2,63,11,000 రాగా.. 28న 5,88,639 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,43,32,000, 29న 5,97,940 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,20,47,000 ఆదాయం వచ్చింది. అలాగే ఆగస్టు 30న 5,47,837 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,12,03,000, ఆగస్టు 31న అత్యధికంగా 5,80,705 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,65,37,000 సమకూరింది. ఐదు రోజులకు కలిపి మహబూబ్నగర్ రీజియన్కు మొత్తం రూ.16,04,31,000 వచ్చింది. డిపోల పరంగా చూస్తే మహబూబ్నగర్ అత్యధికంగా రూ.2,55,99,000, రెండో స్థానంలో వనపర్తి రూ.2,14,09,000 ఆదాయం పొందాయి. ఐదు రోజుల్లో రూ.16.04 కోట్ల రాబడి 28.36 లక్షల మంది ప్రయాణం.. 490 ప్రత్యేక బస్సులు ఒక్క 31వ తేదీనే రూ.3.65 కోట్ల ఆదాయం -
చేయూత అందేనా..?
గద్వాల న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది చేయూత పథకం. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, ఆదరణ లేని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు ప్రతినెలా రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున ప్రతినెలా ఆర్థికసాయం అందిస్తున్నారు. అయితే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి నాలుగేళ్లుగా దరఖాస్తులను స్వీకరించలేదు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో అర్హులైన పేదల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. చేయూత పింఛన్ల కోసం జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు దండిగా వచ్చాయి. థర్డ్ పార్టీ ద్వారా విచారించి.. అర్హులను ఎంపిక చేయనున్నారు. నాలుగేళ్లుగా దూరం.. చేయూత పథకానికి అర్హులైన వారు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నాలుగేళ్ల నుంచి కొత్త వాటిని మంజూరు చేయలేదు. వృద్ధుల్లో భర్తకు పింఛన్ ఉండి మరణిస్తే.. ఆయన స్థానంలో భార్యకు, లేదా భార్యకు ఉండి ఆమె మరణిస్తే.. భర్తకు మాత్రమే స్పౌజ్ కింద మంజూరు చేస్తున్నారు. మిగిలిన ఏ విభాగాల్లోనూ కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. కొత్త పింఛన్లు మంజూరు లేకపోవడంతో చాలా మంది అర్హులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా దివ్యాంగులకు పుట్టుకతో అంగవైకల్యం ఉంటేనే పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ మంజూరవుతుంది. అలా కాకుండా ప్రమాదాలు, ఇతర కారాణాలతో వైకల్యం ఉంటే నిర్దిష్ట కాలపరిమితికి (2ఏళ్ల నుంచి 3ఏళ్లు) వర్తించేలా మాత్రమే సదరం సర్టిఫికెట్ ఇస్తారు. నాలుగేళ్లలో చాలా మందికి నిర్దిష్ట గడువుతో సదరం సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ కొత్త పింఛన్ మంజూరు కాకపోవడంతో ప్రభుత్వ సాయానికి దూరమయ్యారు. వీరితో పాటు ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా పేషెంట్లు ఆర్థిక అవస్థలు పడుతున్నారు. థర్డ్ పార్టీ ద్వారా విచారణ? దరఖాస్తులను ప్రత్యేక పోర్టల్లో నమోదు చేస్తున్నారు. అయితే వీటిపై మరోసారి థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేసి, కొత్త పింఛన్లు మంజూరుచేసే అవకాశం ఉంది. ప్రధానంగా దరఖాస్తుదారులకు ఉన్న అర్హత, కుటుంబ ఆర్థిక పరిస్థితి, వాహనాలు, భూమి తదితర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. దండిగా అర్జీలు.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం అన్ని విభాగాల కింద 66,968 మంది చేయూత లబ్ధిదారులు ఉన్నారు. ఒంటరి మహిళలు, వితంతులు, గీత, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు (తలసేమియా, సికిల్సెల్, హీమోఫీలియా, బాధితులు) నుంచి ప్రభుత్వం గత ఆగస్టు 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలోని 13 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 10,215 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పెంచిన నేపథ్యంలో వాటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆసరా పింఛన్ల కోసం జిల్లాలో దరఖాస్తుల వెల్లువ నాలుగేళ్లుగా అర్హుల ఎదురుచూపులు మళ్లీ దరఖాస్తు గడువు పెంచిన ప్రభుత్వం ఈ నెల 15 వరకు అవకాశం ఇప్పటికే 10,215 మంది దరఖాస్తులు -
జిల్లాను రైల్వే హబ్గా తీర్చిదిద్దుతాం
గద్వాల/ఉండవెల్లి/అలంపూర్ రూరల్: జిల్లాను రైల్వే హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల రైల్వేస్టేషన్లో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ముందుగా స్టేషన్ అభివృద్ధిపై ఏర్పాటుచేసిన చిత్రప్రదర్శనను తిలకించారు. అదే విధంగా జోగుళాంబ హాల్ట్లో రూ.6కోట్లతో చేపట్టిన నిర్మాణాలను ఎమ్మెల్యే విజయుడుతో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై రైల్వే డీఆర్ఎం సంతోష్కుమార్ వర్మతో చర్చించారు. అనంతరం గద్వాల స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గద్వాల సంస్థానం సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్ తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా మరో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్ ప్రారంభమై వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 520 ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,883కోట్లతో 118 ఆర్ఓబీ, ఆర్యూబీల పనులు చేపడుతున్నట్లు వివరించారు. గద్వాలలో రూ. 66కోట్లతో మరో ఆర్ఓబీ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జోగుళాంబ హాల్ట్లో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. పలు రాష్ట్రాల నుంచి అలంపూర్ క్షేత్రానికి భక్తులు వస్తున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. జోగుళాంబ హాల్ట్లో అన్ని రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్ క్షేత్రంలో భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు కేంద్ర పర్యాటకశాఖ ద్వారా రూ. 37కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. పర్యాటక అబివృద్ధి పనులపై ఎంపీ, కలెక్టర్తో త్వరలోనే సమీక్షిస్తామన్నారు. రైల్వేలైన్ డంబ్లింగ్తో భూములను నష్టపోతున్న రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని భరోసానిచ్చారు. ● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. విమానాశ్రయాన్ని తలపించేలా గద్వాల రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు స్టాపింగ్ లేదని.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, త్వరలోనే అన్ని రైళ్లు ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. గద్వాల–డోర్నకల్, మాచర్ల–గద్వాల రైల్వేలైన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ.. గద్వాల సంస్థానాదీశులు రైల్వేస్టేషన్ నిర్మాణానికి 100 ఎకరాలకు పైగా స్థలం కేటాయించారని.. ఈ స్థలంలో రైల్వే ప్రాజెక్టులను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలో రూ.66కోట్లతో మరో ఓఆర్బీ నిర్మాణం రూ.42.82కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి జోగుళాంబ హాల్ట్లో రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి -
ఆక్రమణలపై దుమారం
గద్వాల: ‘‘మున్సిపాలిటీలోని భీంనగర్లో రూ.కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు.. ఎన్ని ముడుపులు ముట్టాయి.. అందులో మాకు ఎంత వాటా ఇస్తారు..’’ అంటూ 16వ వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర్ కామ్లీ మున్సిపల్ కమిషనర్ జానకీరాంసాగర్ను సూటిగా ప్రశ్నించారు. మున్సిపాలిటీకి చెందిన పదిశాతం స్థలం కబ్జాపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ.. ప్రశ్నలు సంధించారు. అదే విధంగా కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టిన 13 అంశాల్లో రూ. 6కోట్ల వ్యయానికి సంబంధించి ఒక్కటి అయినా ప్రజా అవసరాలకు సంబంధించి ఉందా అంటూ ప్రశ్నించారు. మొత్తంగా సోమవారం జరిగిన గద్వాల మున్సిపల్ సమావేశం వాడీవేడిగా, రసాభాసగా సాగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగ్రహం.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు 12వ అంశంపై నోట్ ఆఫ్ డీసెంట్ ఇచ్చారు. గంజి వద్ద నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దుకాణాలకు నంబరింగ్ కోసం రూ. 32వేలు ఖర్చు పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ పులిపాటి వెంకటేశ్ నేతృత్వంలో కౌన్సిలర్లు సంటెన్న, గోపాల్, మోహన్, మంజుల సునీత, లత అసమ్మతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంటెన్న మాట్లాడుతూ.. 2022లో జమ్మిచేడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గద్వాల మున్సిపాలిటీ కింద పదిశాతం స్థలంలో నివాసగృహాలు నిర్మించుకునేందుకు అనుమతులు ఎలా ఇస్తారని నిలదీశారు. మున్సిపాలిటీలో మొత్తం పైరవీకారులు, దోచుకునేవారికే అధిక ప్రాధాన్యత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారు మౌనం వహించడం బాధాకరంగా ఉందన్నారు. కౌన్సిలర్ పులిపాటి వెంకటేశ్ మాట్లాడుతూ.. తాము కౌన్సిలర్లుగా గెలుపొంది ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. అలాంటిది ఇప్పుడు రూ. 6కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చూపెట్టడం దారుణమన్నారు. ప్రజాధనం ప్రజల అవసరాలు తీర్చేందుకు ఉండాలి తప్పితే, ఇలా అప్పనంగా ఖర్చుపెట్టేందుకు ఉండరాదని హితవు పలికారు. కన్నీళ్లను మిగిల్చిన పండుగ సోదరులకు రాఖీ కట్టి వస్తుండగా ఓ మహిళ.. రాఖీ కట్టేందుకు వెళ్తూ మరో మహిళ రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. –8లో uనోటీసులకేపరిమితమవుతారా? భీంనగర్లో పదిశాతం స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సింది పోయి.. నోటీసులు ఎందుకు ఇచ్చారని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ రామలింగేశ్వర్ కామ్లీతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. గతంలో పదిశాతం స్థలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను ఎలాంటి నోటీసులు లేకుండానే జేసీబీలతో కూల్చివేశారని.. ఇప్పుడు మాత్రం వారికి నోటీసులతో ఎందుకు సరిపెడుతున్నారని ప్రశ్నించారు. నోటీసుల మూలంగానే ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లేందుకు అనుకూలంగా మారిందన్నారు. ఇందులో అధికారులకు ఎన్ని డబ్బులు ముట్టాయని.. అందులో ఎవరికెంత వాటాలు ఇస్తారని మున్సిపల్ కమిషనర్ను సూటిగా నిలదీయడంతో సభా సమావేశం మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ స్థలం కబ్జాకు గురైన విషయంపై ‘సాక్షి’లో వరుస కథనాలపై సభలో ప్రస్తావించారు. అదే విధంగా రూరల్ పోలీస్స్టేషన్ పక్కన పదిశాతం స్థలం అక్రమంగా పోలీసు వెల్ఫేర్ వారికి కేటాయించి.. అందులో పెట్రోల్బంకు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. వాడీవేడిగా గద్వాల మున్సిపల్ సమావేశం పదిశాతం స్థలంలో అక్రమ నిర్మాణాలపై ముడుపుల ఆరోపణలు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపైపెద్దఎత్తున చర్చ 12వ అంశానికి అసమ్మతి పత్రం అందించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
రాజోళి: ఐసీడీఎస్ సిబ్బంది తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని సీడీపీఓ హేమలత అన్నారు. సోమవారం రాజోళిలో అంగన్వాడీ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి కేంద్రంలో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. ఆన్లైన్లో ప్రతి అంశాన్ని నమో దు చేసి, వివరాలను ఎప్పటికప్పుడు సరిచూ సుకోవాలన్నారు. పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, సర్ ప్రక్రియలో భాగంగా సంబంధిత అధికారులకు అందుబాటులో ఉంటూ.. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించండి గద్వాల: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నర్సింగ్ కాలేజీ, వసతిగృహం, బాలసదన్ ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహంలో మరుగుదొడ్ల సమస్య తీర్చాలని, శిథిలావస్థలో ఉన్న బీసీ బాలబాలికల వసతిగృహాలకు కొత్త భవనాలు నిర్మించాలని కోరారు. అలాగే పుటాన్దొడ్డి, గుర్రంగడ్డ గ్రామాల్లో పాఠశాలలను ప్రారంభించాలని, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని, జిల్లా ఆస్పత్రిలో వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో రోగుల చావులకు కారణమవుతున్న వైద్యులను బదిలీ చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహ, బాలకృష్ణ, వీరేశ్, నర్సింహ, ఎల్లప్ప, చంద్రుడు, మహేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు. పల్లీ క్వింటా రూ.7,709 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్యార్డుకు సోమవారం 210 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,709, కనిష్టంగా రూ. 5,369, సరాసరి రూ.6769 ధరలు పలికాయి. -
జోగుళాంబ సన్నిధిలో మంత్రి పూజలు..
అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం రాత్రి హరిత టూరిజంలో బసచేసిన ఆయన.. సోమవారం ఉదయం ఎంపీ డీకే అరుణతో కలిసి ఆలయాలను దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరస్వామికి అభిషేకాలు, జోగుళాంబ సన్నిధిలో కుంకుమార్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ మధుమోహన్, దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఓ పురేందర్కుమార్, ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, వైస్చైర్మన్ శంకర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, రాంచంద్రారెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: టీచర్స్ డేను పురస్కరించుకుని పాలమూరు యూనివర్సిటీలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. పీయూ వీసీ శ్రీనివాస్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. రీసెర్చ్ సూపర్వైజర్గా వెంకట్రెడ్డి.. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పరిశోధన అంశాల పర్యవేక్షణకు గద్వాల్ పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డిని రీసెర్చ్ సూపర్వైజర్గా నియమిస్తూ వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. -
బదిలీపై వెళ్తే.. బోధించేదెవరు?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకవైపు డీఎస్సీ ద్వారా నియామకాలు సకాలంలో జరగకపోవడం.. మరోవైపు పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన అందడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడుల్లో బోధించాల్సిన స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్ కమిటీలకు కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే 75 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్పై వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలోనే మరో 33 మందికి పైగా ఉపాధ్యాయులను ఫారిన్సర్వీస్పై పంపేందుకు ప్రక్రియ చేపట్టారు. ఇందులో బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్ కళాశాలకు 12 మంది ఉండగా.. మిగిలిన వారు డీఈఓ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు పాఠశాలల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీల్లోనూ పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులను కేటాయించారు. ఒక్క జిల్లాలోనే 33 మందికిపైగా.. మహబూబ్నగర్ జిల్లాలో 33 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్లో ఉండగా.. వీరిలో 22 మంది బీఈడీ, డైట్ కళాశాలల్లో, మిగతా వారు డీఈఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర డీఈఓ కార్యాలయాల్లోనూ పలువురు ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాల కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీల్లోనూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 81 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో ఆరు చొప్పున, మిగతా జిల్లాల్లో ఐదు చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 19 నుంచి వీరికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉపాధ్యాయుల కొరతతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల కొరత ఉండగా.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్ కమిటీలకు కేటాయించడంతో బోధనపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 200 మందికిపైగా ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉండటంతో వారి స్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే విద్యార్థులకు సబ్జెక్టు బోధనలో నష్టం జరిగే ప్రమాదం ఉంది. సర్దుబాటులో భాగంగా ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపే అవకాశం ఉన్నా.. సబ్జెక్టు నిపుణులైన స్కూల్ అసిస్టెంట్ల స్థానాన్ని తాత్కాలిక ఏర్పాట్లతో భర్తీ చేయడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బీఈడీకి 10, డైట్కు 12 మంది ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక్క బీఈడీ కళాశాల, ఒక డైట్ కళాశాల ఉంది. ఇందులో అధ్యాపకులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేశారు. బీఈడీ కళాశాలలో ఉన్న ఏకై న రెగ్యులర్ పోస్టు గోవిందరాజులు నారాయణపేట ఇన్చార్జి డీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక డైట్ కళాశాలలో రెండు రెగ్యులర్ పోస్టులు ఉండగా ఇటీవల మహబూబ్నగర్ డీఈఓగా విధులు నిర్వహించిన రవీందర్ లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్లో ఉన్నారు. మరో పోస్టులో ప్రస్తుత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మెరాజుల్లాఖాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక రెండు కళాశాలల్లో పోస్టుల భర్తీకి సీబీటీ పరీక్ష నిర్వహించి ఈ నెల 6వ తేదీన బీఈడీ కళాశాలకు, 7వ తేదీన డైట్ కళాశాలకు ఇంటర్వ్యూ, డెమోలు నిర్వహించారు. బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్ కళాశాలకు 12 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏడాది కాలానికి ఫారిన్ సర్వీస్పై విధులు కేటాయించనున్నారు. గతంలో తాత్కాలికంగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కొందరి డిప్యూటేషన్లు రద్దు చేసి.. తాజాగా ఎంపికై న వారికి అవకాశం కల్పించనున్నారు. బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత.. అయినా ఇతర విధులకు కేటాయింపు బీఈడీ, డైట్ కళాశాలలకు 22 మంది.. డీఈఓ కార్యాలయాల్లో మరికొందరు ఉమ్మడి జిల్లాలో 75 మందికిపైగా ఫారిన్ సర్వీస్లో.. 81 మంది మానిటరింగ్ టీంల్లో.. అనుభవజ్ఞులైన స్కూల్ అసిస్టెంట్లను బోధనేతర విధులకు పంపడంపైవిమర్శలు -
ముగిసిన ఆరాధనోత్సవాలు
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని షేరెల్లీవీధి, భీనంగర్ రాఘవేంద్రస్వామి మఠాల్లో నిర్వహిస్తు న్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి బృందావనానికి ఫల పుష్ప, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. షెరెల్లీవీధి మఠం నుంచి గద్వాల కోటలోని శ్రీభూలక్ష్మీదేవి ఆలయం వరకు ఉత్సవమూర్తిని రథంపై ఊరేగించారు. భీంనగర్లోని రాఘవేంద్రస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్రావు, మన్నూరు ప్రహ్లదచారి, న్యాయవాది భీంసేన్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక విద్యకు శ్రీకారం
కోస్గి: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కళాశాలలు, సైన్స్ ల్యాబ్ల నిర్వహణకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక్కో కళాశాలకు రూ.25 లక్షలు.. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దశల వారీగా కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. మొదటి విడతలో 19 కళాశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఒక్కో కళాశాలకు సమగ్ర శిక్షా ద్వారా రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.4.75 కోట్లు మంజూరు చేస్తూ ప్రాజెక్టు డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో ఆయా కళాశాలల్లో ప్రత్యేక గదులు నిర్మించి కంప్యూటర్ ల్యాబ్గా వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాంకేతిక విద్యపై పట్టుకు.. ప్రభుత్వం చేపట్టిన పలు సర్వేల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేని కారణంగా నైపుణ్యాలకు దూరమవుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో ఫిజిక్స్వాలా ద్వారా ఐఐటీ, జేఈఈ, ఖాన్ అకాడమీ ద్వారా క్లాట్లో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. మరోవైపు గతేడాది ప్లాట్ ప్యానల్ బోర్డులను సైతం ప్రభుత్వం అందించడంతో కళాశాలల్లో డిజిటల్ బోధన జరుగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించి విద్యార్థులు పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలనే లక్ష్యంతో కళాశాలల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించాలని, త్వరితగతిన నిర్మాణాలు చేసేందుకు ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేయాలని అధ్యాపకులతోపాటు విద్యార్థులు కోరుతున్నారు. జిల్లాల వారీగా ఎంపికై న ప్రభుత్వ కళాశాలలు.. మహబూబ్నగర్ : జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్, బాలికల జూనియర్, జడ్చర్లలోని బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, దేవరకద్ర, బాలానగర్, కోయిల్కొండ జూనియర్ కళాశాలు. నారాయణపేట : మక్తల్, నారాయణపేట జూనియర్ కళాశాలలు నాగర్కర్నూల్ : కల్వకుర్తి, బిజినేపల్లి, నాగర్కర్నూల్ బాలుర కళాశాలలు వనపర్తి : ఆత్మకూర్, వనపర్తి బాలికల జూనియర్ కళాశాల. జోగుళాంబ గద్వాల : గట్టు, అయిజ, ధరూర్, గద్వాల బాలుర, గద్వాల బాలికల కళాశాల. ‘జూనియర్’ విద్యార్థులకు కంప్యూటర్ బోధన మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 19 కళాశాలలు ఎంపిక ల్యాబ్ కోసం ప్రత్యేక గది నిర్మాణం.. నిధులు మంజూరు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు ఆదేశాలు దశల వారీగా అన్ని కళాశాలల్లో అమలు పనుల వేగవంతానికి చర్యలు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. మొదటి విడత ఎంపికై న కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు కంప్యూటర్ ల్యాబ్ గదుల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామీణప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. – సుదర్శన్రావు, జిల్లా ఇంటర్ విద్యాధికారి, నారాయణపేట -
వాయిదాల పర్వం
షట్టర్ ఏర్పాటు చేస్తేనే.. కేఎల్ఐ ప్రాజెక్టు డిజైన్లో అప్రోచ్ చానల్ నుంచి సర్జిపూల్లోకి నీళ్లు వెళ్లే ప్రాంతంలో హెడ్రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దీంతో నది నీళ్లు నేరుగా సర్జిపూల్లోకి చేరుకుంటాయి. వరదలు, నదీ ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్న సమయంలో నీటి ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఏర్పడే ఎయిర్ ఫ్రెషింగ్ లిఫ్టుపై ప్రభావం చూపుతోంది. ఈ కారణంతోనే 5వ నంబర్ మోటార్లోకి నీళ్లు చేరి పాడైంది. అదే సమయంలో పంప్హౌజ్లోని సిమెంట్ కాంక్రీట్ గోడలకు కూడా కొంతమేర పగుళ్లు వచ్చి నది నీళ్లు పంప్హౌజ్లోకి చేరాయి. వీటికి తాత్కాలిక మరమ్మతు చేపట్టి లిఫ్టును నిర్వహిస్తున్నారు. ఈ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించాలంటే అప్రోచ్ చానల్ టన్నెల్ ప్రారంభంలో షెట్టర్ ఏర్పాటు చేయడమే మార్గమని ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. షట్టర్ ఏర్పాటు, మోటార్ల మరమ్మతు జరగాలంటే కేఎల్ఐ లిఫ్టునకు కనీసం 2, 3 నెలల విరామం ఇవ్వాలని, అది ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కొల్లాపూర్: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఫలితంగా ఎల్లూరు లిఫ్టులో పాడైన మోటార్లకు మరమ్మతు ఈ సీజన్లో కూడా చేపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. పాడైపోయిన మోటార్లు.. కేఎల్ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టును ఎల్లూరు సమీపంలోని రేగుమాన్గడ్డ వద్ద నిర్మించారు. ఈ లిఫ్టులో 5 మోటార్లు ఉండగా.. నాలుగు మోటార్లతో నీటి పంపింగ్ చేపట్టి, ఒక మోటార్ను స్పేర్లో ఉంచుకునేలా ఏర్పాట్లు చేశారు. 2012 సెప్టెంబర్లో కేఎల్ఐ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి లాంఛనంగా ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అదే నెలలో ఎయిర్ ఫ్రెషింగ్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పంపు మోటార్లు పాడవగా.. వెంటనే వాటికి మరమ్మతు చేశారు. 2014 సెప్టెంబర్లో 5వ నంబర్ పంపు మోటార్లోకి నీళ్లు చేరి పాడైంది. తర్వాతి కాలంలో మరో పంపు మోటార్ కూడా మరమ్మతుకు గురైంది. మూడున్నరేళ్ల క్రితం నిధులు.. కొన్ని సంవత్సరాల కాలంగా మోటార్ల మరమ్మతు పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. మోటార్ల మరమ్మతు కోసం మూడున్నరేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.16 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో కేఎల్ఐ ద్వారా నీటి లిఫ్టింగ్ను ఆపేసి మోటార్లకు మరమ్మతు చేపట్టేందుకు అప్పట్లో బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు సిద్ధమయ్యారు. అయితే మిషన్ భగీరథ స్కీంకు నీటి ఇబ్బందులు తలెత్తడంతో మరమ్మతు ఆపేసి మళ్లీ యథాతధంగా కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాడైన మోటార్లకు మరమ్మతు చేపట్టడం సాధ్యం కావడం లేదు. పంప్హౌజ్ నుంచి మరమ్మతు కోసం బయటకు తీసిన మోటారు సామగ్రి ప్రతిరోజూ ఎత్తిపోసే నీళ్లు (ఒక మోటారు) 800 క్యూసెక్కులు కేఎల్ఐ మోటార్ల మరమ్మతు ఈ సీజన్ కూడా ఆగాల్సిందే ఎంజీకేఎల్ఐలో ఐదేళ్ల క్రితంపాడైన పంపు మోటార్లు మూడేళ్ల క్రితమే రూ.16 కోట్ల నిధులు కేటాయింపు వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ఎల్లూరు పంప్హౌజ్లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు పాడైన మోటార్లు 2 కొంతకాలం ఆగాల్సిందే.. పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెగ్యులర్గా నీటి ఎత్తిపోతలు కొనసాగితే కేఎల్ఐ ప్రాజెక్టుకు కొంత విరామం ఇవ్వాలనుకున్నాం. అయితే పలు కారణాలతో అది సాధ్యపడటం లేదు. తాగునీటి అవసరాల కోసం రెగ్యులర్గా కేఎల్ఐ ద్వారా నీటి పంపింగ్ కొనసాగిస్తున్నాం. పాడైన మోటార్ల మరమ్మతుకు ఇంకా కొంతకాలం ఆగక తప్పదు. – లోకిలాల్నాయక్, నీటిపారుదల శాఖ ఈఈ -
మహాధర్నాను జయప్రదం చేయండి
గద్వాలన్యూటౌన్: ఉపాధ్యాయ హక్కులు, భవిష్యత్ కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్లో పీఆర్టీయూ టీఎస్ తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి కోరారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానం రద్దు, డీఎస్సీ– 2003 వారికి ఓపీఎస్, పీఆర్సీ అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహధర్నా నిర్వహించే ఇందిరాపార్క్ నీలిసంద్రంగా కన్పించేలా ప్రతి ఉపాధ్యాయుడు నీలి రంగు షర్ట్, చీర, చుడిదార్ ధరించి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, వెంకటేశ్, వాణి ప్రసాద్, ఎల్లస్వామి, ఈదన్న, కృష్ణ, గోవిందు, చంద్రశేఖర్, శ్రీధర్శెట్టి ఉన్నారు. శ్రీశైలంలో 872.10 అడుగుల నీటిమట్టం అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో ఆదివారం సాయంత్రం నాటికి 872.10 అడుగులు (150.8076 టీఎంసీలు)గా నమోదైంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ.. 5,075 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలో శనివారం 153.5060 టీఎంసీలు ఉండగా.. విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటి అవసరాల కోసం సుమారు 3 టీఎంసీల నీటిని వినియోగించారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 8.657 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగర్జునసాగర్కు 17,320 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగునీటి అవసరాలు, సాగునీటి పథకాల కోసం నీటిని తరలిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గ్రూప్–1, 2 ,3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన డిగ్రీ పాసైన యువతకు జనరల్ స్టడీస్లో ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విష్ణునందన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఎల్ కేటగిరీ కింద అర్హులైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మంగళవారం నుంచి 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, ఇందిర ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణం, ఎంఏఎం క్యాంపస్, ఇంటర్మీడియట్ బోర్డు వెనుక, శ్రీబాలాజీ ఎన్క్లేవ్, నాంపల్లి, హైదరాబాద్ అనే చిరునామాకు పంపుకోవాలన్నారు. ఎంపికై న వంద మందికి అక్కడే సెప్టెంబర్ 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. -
అమ్మకు అక్షరం!
అక్షరాస్యులుగా మహిళా సంఘాల సభ్యులు ● ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో చదవడం.. రాయడం నేర్పిస్తున్న వలంటీర్లు ● సెప్టెంబర్ చివరి వారంలో రెండో విడత పరీక్షల నిర్వహణకు కసరత్తు గద్వాలన్యూటౌన్: రోజురోజుకూ సాంకేతికత అభివృద్ది చెందుతోంది. తద్వారా సమాజంలో పరిస్థితులు మారుతున్నాయి. చదువుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఒక్కరికీ కనీసంగా చదవడం.. రాయ డం రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించారు. వలంటీర్ల ద్వారా వారికి చదవడం, రాయడం నేర్పించి.. లక్ష్యం మేరకు మొదటి విడత పరీక్షలు మార్చిలో నిర్వహించారు. సెప్టెంబర్ చివరి వారంలో మిగిలిన వారికి రెండో విడత పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులు 53,257 ఉత్తీర్ణులైన వారు 16,397 మొదటి విడతలో పరీక్ష రాసిన వారు 23,506 ఉత్తీర్ణులు కానివారు 7,109 రెండోవిడత పరీక్షకు హాజరు కావాల్సిన వారు : 36,860 15ఏళ్లు పైబడిన వారికి.. ఎన్ ఈపీ–2020కు అనుగుణంగా 15 ఏళ్లు పైబడిన వారికి విద్య అందించడానికి కేంద్ర ప్రభుత్వం అండర్ స్టాండింగ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పథకాన్ని తీసుకొచ్చింది. పాఠశాలలకు వెళ్లలేని వారికి చదువు నేర్పించడం ఈ పథకం ఉద్దేశం. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)లోని వయోజన విద్యావిభాగం సైతం నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ఫ్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
● కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి ● జోగుళాంబ క్షేత్రంలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షో ప్రారంభం అలంపూర్ రూరల్: ప్రసాద్ స్కీంలో భాగంగా అలంపూర్ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని.. భవిష్యత్లో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి 8 జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి.. జోగుళాంబదేవి సన్నిధిలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షోను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీలు మల్లు రవి డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, టూరిజంశాఖ అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్ ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని, భక్తులు ప్రతిరోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేసేలా మల్టీ మీడియా సౌండ్, లైట్షోను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. గోల్కొండ కోట, ఉస్మానియా కళాశాల వద్ద సౌండ్, లైట్ షో ఏర్పాటు చేశామన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా జోగుళాంబ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కలిసిరావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ● ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయ విశిష్టతను తెలయజేస్తూ, మల్టీ మీడియా సౌండ్, లైట్ షో ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్ నుంచి గద్వాలకు రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో అన్నదాన సత్రం, విశ్రాంతి గదులు ఫుడ్ కోర్టు, తదితర విభాగాలతో పాటు తుంగభద్ర నదిలో బోటు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన జోగుళాంబ, గద్వాల రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, టూరిజం అండ్ కల్చరల్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్రసాద్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గౌతమి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
గట్టు/మల్దకల్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం గట్టు మండలం బల్గెర, గంగిమాన్దొడ్డి, మల్దకల్ మండలం మేకలసోంపల్లి, సద్దలోనిపల్లి, మల్లెందొడ్డి, బూరెడ్డిపల్లి గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి.. నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి.. వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇల్లు మంజూరు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత 3,500 ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో 2,000 నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే పనులు పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచులు విజయ్, తూం కృష్ణారెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, రామకృష్ణనాయుడు, హనుమంతురెడ్డి, బజారి, రమేశ్నాయుడు, గోవిందు, పుల్లారెడ్డి వెంకటన్న, ప్రభాకర్రెడ్డి, సత్యారెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్రెడ్డి, వీరన్న, వెంకటన్న, శివారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణదారులకు నోటీసులు
గద్వాల: జిల్లా కేంద్రంలోని భీమ్నగర్లో మున్సిపాలిటీకి చెందిన పదిశాతం స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న వైనంపై ‘సాక్షి’లో శుక్ర, శనివారం ప్రచురితమైన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. అక్రమ నిర్మాణం చేపడుతున్న సదరు వ్యక్తులకు శనివారం మున్సిపల్ కమిషనర్ జానకీరాంసాగర్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా పనులను తక్షణమే నిలిపివేయాలని చెప్పారు. అయితే సదరు నిర్మాణం చేపడుతున్న వ్యక్తులు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ చెప్పినట్లు తెలిసింది. దీనిపై మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్తో మాట్లాడి, చట్టపరమైన చర్యలతో మున్సిపల్ స్థలాన్ని కాపాడుతామని కమిషనర్ ‘సాక్షి’కి తెలిపారు. -
సొసైటీలు ఆర్థికంగా బలపడాలి
అయిజ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కేవలం రైతులకు రుణాలు ఇచ్చే వ్యవస్థగానే కాకుండా.. వారి ఆదాయం రెట్టింపు కావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అబ్దుల్ నబి అన్నారు. అయిజ సింగిల్విండో ఆవరణలో నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్ను గురువారం ఆయన పరిశీలించారు. సూపర్ మార్కెట్ ద్వారా ప్రతినెలా రూ. 40లక్షల టర్నోవర్ కావడంతో పాటు పురుగు మందుల దుకాణంతో ఏడాదికి రూ. 2కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ గద్వాల బ్రాంచ్ మేనేజర్ ప్రదీప్ కుమార్, సూపర్వైజర్లు రవికుమార్, కిరణ్, పీఏసీఎస్ సీఈఓ మల్లేష్ పాల్గొన్నారు. హక్కులపై అవగాహన ఉండాలి అలంపూర్: విద్యార్థులకు తమ హక్కులను అవగాహన ఉండాలని అలంపూర్ జూనియర్ సివిల్కోర్టు జడ్జి ఆర్వీఎస్ఎస్ మిధున్తేజ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం అలంపూర్ చౌరస్తాలోని బీసీ గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని డార్మెంటరీలు, తరగతి గదులను న్యాయమూర్తి పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోక్సో చట్టం, బాలకార్మిక నిషేధ చట్టం ఇతర చట్టాలకు సంబంధించిన వీడియోలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, బాలకార్మిక వ్యవస్థతో కలిగే నష్టాలను వివరించారు. సమస్య ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, న్యాయవాదులు నారాయణరెడ్డి, నర్సింహులు, శ్రీధర్రెడ్డి, మధు, గజేంద్రగౌడ్, సిబ్బంది జహంగీర్ హుస్సేన్, సాయితేజ, పరశురాం పాల్గొన్నారు. రాహుల్గాంధీ ప్రధానిని చేయడమే లక్ష్యం ఎర్రవల్లి: రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఒంగోలుకు చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాటూరు వెంకటేశ్వర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన రాగా ఫర్ రైస్ ఆఫ్ ఇండియా పాదయాత్ర శనివారం ఎర్రవల్లికి చేరింది. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి బీచుపల్లి హనుమాన్ ఆలయం వరకు ఆయనతో కలిసి సంపత్ కుమార్ పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. దేశ పరిస్థితులు మారాలన్నా.. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలన్నా రాహుల్గాంధీ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, వైస్ చైర్మెన్ కుమార్, షేక్షావలి ఆచారి, జోగుల రవి, వెంకటేశ్ యాదవ్, రుక్మాందర్రెడ్డి పాల్గొన్నారు. -
అవస్థలు పడుతున్నాం..
నేను 18 ఎకరాల్లో పంటల సాగు చేస్తున్నా. స్మార్ట్ఫోన్ లేదు. ఇతరుల సహాయంతో యాప్లో ఎరువులను బుక్ చేద్దామని వెళ్తే.. ఒక్కొక్కరి సారి యాప్ ఓపెన్ కావడం లేదు. పంటలకు ఎరువులు వేసేందుకు అవస్థలు పడుతున్నాం. పంటలను ఎలా పండించాలో అర్థం కావడంలేదు. వ్యవసాయం అంటేనే భయమేస్తుంది. – సుంకన్న, రైతు, గోకులపాడు, మానవపాడు మండలం బుకింగ్ చేసుకోలేకపోతున్నాం అన్ని రకాల ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నాం. యూరియా కోసం పైపాడ్లో బుక్చేస్తే.. మానవపాడు మండలం చెన్నిపాడులో బుక్ అయ్యాయి. దీంతో రవాణా ఖర్చు అధికమైంది. ఎరువుల బుకింగ్ కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. రైతులకు ఎరువుల కష్టాలు లేకుండా చూడాలి. – సంజన్న, రైతు, పైపాడ్, వడ్డేపల్లి ఇబ్బందులు లేకుండా చూస్తాం.. రైతులు యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి. ఇంకా నమోదు చేసుకోని రైతులు ఏఈఓలను సంప్రదించాలి. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రతి డీలర్ షాపు వద్ద వలంటీర్లను ఏర్పాటు చేస్తాం. – వీరప్ప, డీఏఓ ● -
ఆహారంలో నాణ్యత లోపించొద్దు
ధరూరు: విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతగా ఉండాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. శనివారం ధరూరు మండలం గూడ్డెందొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు వసతిగృహాలు, గురుకుల పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థుల కోసం వండిన వంటలను ఆయన పరిశీలించారు. -
ఆదిశిలా క్షేత్రంలో గంప జాతర
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గంప జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. దశమికట్ట వరకు పల్లకీ సేవ చేపట్టారు. గ్రామ పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తజనం దర్శించుకొని భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. దేవరగట్టులోని ఆలయానికి చేరుకున్న స్వామివారికి ప్రత్యేక పూజ ల అనంతరం తిరిగి ఆదిశిలా క్షేత్రానికి చేర్చారు. ప్రతి ఏటా గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి పాల్గొన్నారు. -
వేగవంతంగా భూసేకరణ ప్రక్రియ: కలెక్టర్
గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ.. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఎల్నిన్ ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా జూరాల కుడి కాల్వ పరిధిలో చివరి డిస్ట్రిబ్యూటర్ కింద సాగుచేసే పంటలకు నీటి సరఫరాపై స్పష్టత ఉండాలన్నారు. పంటలు చేతికొచ్చే వరకు రైతులు నష్టపోకుండా ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల భూసేకరణకు ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించి, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేసి, నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్యాకేజీల కింద పెండింగ్లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎస్డీసీ కృష్ణ, ఇరిగేషన్ సీఈ రహీముద్దీన్, ఎస్ఈ కేశవరావు, ఆర్డీవో శ్రీనివాసరావు ఉన్నారు. ● సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీని వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ.. సర్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
యాప్సోపాలు..!
మానవపాడు: ఎరువుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్ విధానం రైతులకు తలనొప్పిగా మారింది. స్మార్ట్ఫోన్ లేని, చదువురాని, ఫోన్ వాడకం తెలియని రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గతంలో కేవలం యూరియాకే పరిమితమైన ఆన్లైన్ (యాప్) విధానాన్ని అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులకు వర్తింజేయడం రైతులను మరిన్ని కష్టాలకు గురిచేస్తోంది. నిరక్షరాస్యులైన రైతులు ఇతరులపై ఆధారపడి బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కౌలు రైతుల పేర్లపై ఎరువులు బుక్ కావడం లేదు. అసలే వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రైతులు.. బోరుబావుల కింద సాగుచేసిన పంటలకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించలేక ఆందోళన చెందుతున్నారు. అధికమైన రవాణా ఖర్చు.. గతంలో రైతులు తమ సమీప గ్రామంలోని ఫర్టిలైజర్ డీలర్ వద్దకు వెళ్లి డబ్బులు లేకపోయినా అప్పుగా ఎరువులు తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం యాప్ విధానంలో మండలాన్ని ఒక యూనిట్గా కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా కాకుండా, వేరే గ్రామంలోని దుకాణాల్లో ఎరువులు బుక్ అవుతున్నాయి. ఫలితంగా రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. ఒకటి లభిస్తే.. మరొకటి దొరకదు రైతులు ఎక్కువగా యూరియా, డీఏపీ కలిపి పంటలకు వినియోగిస్తారు. అయితే యాప్లో ఒక ఎరువు బుకింగ్ అయితే.. మరో ఎరువు బుకింగ్ కావడంలో జాప్యం జరగడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. కాంప్లెక్స్ ఎరువులు 20–20–0–13, 28–28–0, 14–35–14, 10–26–26తో పాటు ఎంఓపీ ఎరువులు సకాలంలో లభించడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న రైతులు మాత్రమే యాప్ వినియోగించేందుకు అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 74శాతం రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. మిగతా వారితో పాటు నిరక్షరాస్యులైన రైతులు యాప్ ద్వారా ఎరువులను పొందేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు ఎరువులు కష్టాలు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఆక్రమణలో లాల్‘కోట’ చిన్నచింతకుంట మండలంలోని లాల్కోటలో కాకతీయుల కాలం నాటి కోట స్థలం క్రమంగా ఆక్రమణకు గురవుతోంది. –8లో u -
రాహుల్గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యంగా పాదయాత్ర
ధరూరు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త, న్యాయవాది కాటూరి వెంకటేశ్వర్లు అన్నారు. జూన్ 19న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన పాదయాత్ర 1,400 కి.మీ., పూర్తి చేసుకుని శుక్రవారం ధరూరుకు చేసుకుంది. పాదయాత్ర ధరూరుకు చేరుకోగా సర్పంచు విజయ్కుమార్ వారికి శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్, అభ్యుదయానికి కృషి చేస్తూ పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. కాశ్మీర్ వరకు కొనసాగే ఈ పాదయాత్ర ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి అడుగు పెట్టిందన్నారు. దేశ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రధానమంత్రి కావాలనేదే తమ లక్ష్యం అన్నారు. తన ప్రయాణంలో అన్ని రాష్ట్రాల్లోనూ రాహుల్గాంధీ ప్రధాని కావాలని బలమైన కోరిక వ్యక్తమైందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ నియోజకవర్గ కోఆర్డినేటర్ రవి, నాయకులు శ్రీహర్ష, సంజీవ్, లాజర్, ఈదన్న, సవారన్న, గోపాల్, రఫి తదితరులు పాల్గొన్నారు. -
బీచుపల్లిలో ముగిసిన పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం లక్ష్మీహయగ్రీవుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్రోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో వేద దివ్యప్రబంధ పారాయణం, యాగశాలలో చుతుస్థానార్చన, మూలమంత్ర మూర్తిహోమం, శాంతిహోమం, మహా పూర్ణాహుతి, పవిత్ర విజర్జన, కుంభ ప్రోక్షణ, మహ నివేదన, వేదదివ్య ప్రబంధ శాత్తుముఱై, ఆచార్య సన్మానం, వేదమహాదాశీర్వచనం వంటి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో 873.4 అడుగుల నీటిమట్టం అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 873.40 అడుగుల వద్ద 156.0124 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నీటి ప్రవాహం లేదు. దీంతో గురువారం 159.3828 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమా రు 3 టీఎంసీల నీటిమట్టం తగ్గినట్లయింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు 35,315 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదాం గద్వాల: బషీర్ బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఐక్యంగా పోరాటాలు చేస్తేనే హక్కులు సాధించగలుగుతామని, అప్పుడే ప్రభుత్వాలు దిగివస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం విద్యు త్ అమరవీరుల స్మారక దినం సందర్భంగా పార్టీ జిల్లా కార్యలయం వద్ద 2000 సంవత్స రంలో బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో అమరులైన బాలస్వామి, విష్ణువర్ధన్రెడ్డి, రామకృష్ణను స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూ లమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నరసింహ, వెంకట్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల నిర్వహణకు నిధులు
● ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేల చొప్పున.. ● గతేడాది కంటే రూ.10 వేలు అదనం ● పర్యవేక్షణ మరింత పటిష్టం చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు నర్వ: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పన, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ఎంఈఓలు, క్లస్టర్ జీహెచ్ఎంలకు అప్పగించి బాధ్యతలను మరింత పెంచింది. వీటి నిరంతర పర్యవేక్షణకు అవసరమైన నిధులను అంచనా వేసి అందుకు అనుగణంగా మంజూరు చేసింది. కొన్ని రోజులుగా నిధుల మంజూరు లేకపోవడంతో పర్యవేక్షణ కాస్తా తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు 2026–27 వార్షిక సంవత్సరానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1.59 కోట్లు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంఈలు, క్లస్టర్ జీహెచ్ఎంల పర్యవేక్షణ.. పాఠశాలల పర్యవేక్షణ ఎమ్మార్సీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఎంఈఓ నెలలో 20 పాఠశాలలని పర్యవేక్షించాలి. ఇందుకోసం ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఉమ్మడి జిల్లాకు రూ.70.20 లక్షలు మంజూరయ్యాయి. టీఎల్ఎం నిర్వహణ, పుస్తకాలు, దినపత్రికలకు రూ.20 వేలు.. స్టేషనరీ, నెట్ సౌకర్యం, ఆజదార్కిట్ వినియోగానికి రూ.25 వేలు, విద్యుత్ బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులకు రూ.20 వేలు వెచ్చించాల్సి ఉంది. ఖర్చులు పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 సీఆర్సీలు, 78 ఎంఆర్సీలు ఉన్నా యి. వీటి నిర్వహణకుగాను ప్రభుత్వం గతేడాది ఒక్కో సీఆర్సీకి రూ.33 వేలు అందించగా.. ఈ ఏడాది రూ.10 వేలు పెంచి రూ.43 వేల చొప్పున రూ.89.01 లక్షలు మంజూరు చేసింది. నిధుల వినియోగం ఇలా.. రోజు పాఠశాలల పరిశీలన, రిపోర్టుల తయారీ, రిజిస్టర్లు, సమావేశాల నిర్వహణ, నెట్ సౌకర్యం, స్టేషనరీ, దినపత్రికల ఖర్చులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. నిర్వహణకు రూ.20 వేలు, టీఎల్ఎంకు రూ.10 వేలు, సమావేశాలకు రూ.3 వేలు, స్టేషనరీ, నెట్చార్జీల కోసం రూ.10 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. జిల్లాలో పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంఆర్సీలు, సీఆర్సీలకు మంజూరైన నిధులతో మరింత బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కో సీఆర్సీకి గతేడాది కంటే అదనంగా రూ.10 వేలు మంజూరయ్యాయి. క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించి బోధన నైపుణ్యాలు పెంచేలా సూచనలు అందిస్తున్నాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో వేదపండితులు మంత్రోచ్ఛరణాల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం జరిపించారు. అలాగే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆనవాయితీగా రథోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిశిలా క్షేత్రం అభివృద్ధికి కృషి ఆదిశిలా క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డీఈఈ ఓంప్రకాష్, ఈఈ రణవీర్, సంజీవ్ తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచన మేరకు శుక్రవారం ఆదిశిలా క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు వారికి పూలమాల వేసి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటో అందజేశారు. -
కేంద్ర మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
అలంపూర్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అధికారులను ఆదేశించారు. అలంపూర్లోని హరిత టూరిజం హోటల్, ప్రసాద్ స్కీం భవనం, జోగుళాంబ రైల్వేస్టేషన్ను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. సోమవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అలంపూర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ముందుగా అలంపూర్ చౌరస్తా సమీపంలోని బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ రైల్వే స్టేషన్ను సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించనున్నట్లు వెల్లడించారు. స్టేషన్లో ప్రయాణికుల హాల్, టికెట్ కౌంటర్, ఇతర విభాగాలను పరిశీలించి.. అభివృద్ధి పనులు, స్టేషన్ ద్వారా రాకపోకలు సాగించే రైళ్ల వివరాలను అసిస్టెంట్ రైల్వే డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో డబ్లింగ్ పనులకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం అలంపూర్లోని హరిత హోటల్ను, ప్రసాద్స్కీం పథకంలో భాగంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అందులో అన్నప్రసాద కేంద్ర నిర్వహణపై ఆరా తీసి.. భక్తులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు. ఆలయాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సౌండ్స్ అండ్ లైట్స్ ప్రదర్శనను కేంద్రమంత్రి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు పర్షవేది, వినోద్కుమార్, విక్రమ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ రాజేష్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ అలంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 22ఏ కింద వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ, ఇతర ఓటర్లకు నోటీసుల పంపిణీ, హియరింగ్ ప్రక్రియలపై సంబంధిత అధికారులతో చర్చించారు. -
బరితెగింపు వ్యవహారంలో.. బెదిరింపుల పర్వం
గద్వాల: నడిగడ్డలో బలిసినోడిదే రాజ్యం అని మరోసారి రుజువైంది. గద్వాల పట్టణం నడిబొడ్డులో భీంనగర్లో ఉన్న పదిశాతం స్థలంలో అక్రమంగా చేపడుతున్న ఆక్రమణదారుడు పనులు ఆపేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా నోటీసులకు భయపడం.. దమ్ముంటే కట్టడాన్ని ఆపండి అని ఎదురుదాడి చేశాడు. దీంతో బిక్కమొఖం వేసుకుని అధికారులు తలదించుకుని వెనుదిరిగి వచ్చారు. ఇదే సామాన్యుడిది అయ్యి ఉంటే వెంటనే పోలీసులను రంగంలోకి దింపి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేవారు. సదరు ఆక్రమణదారుడి బెదిరింపులకు భయపడి అధికారులు వెనుదిరగడం హాట్టాపిక్గా మారింది. ఇదీ అసలు కథ.. జిల్లాకేంద్రంలోని భీంనగర్కాలనీలో అక్రమ నిర్మాణం చేపడుతున్న స్థలం పూర్తిగా పదిశాతం స్థలం. గతంలో ఇది వ్యవసాయ భూమిగా ఉండగా.. కాలక్రమేణా పట్టణం విస్తరించే క్రమంలో సదరు భూ యజమాని వ్యవసాయ భూమిని కాస్త రియల్ ఎస్టేట్ మార్చేసి అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో నిబంధనల మేరకు మున్సిపాలిటీకి పదిశాతం స్థలాన్ని వదిలిపెట్టాల్సి ఉండగా.. అక్కడున్న వ్యవసాయ బావితోపాటు పక్కన కొంతమేర ఖాళీ స్థలం కలుపుకొని పదిశాతం స్థలంగా మున్సిపాలిటీకి అప్పగించారు.లిదిలా ఉండగా అయితే పట్టణం విస్తరించడంతోపాటు జిల్లాకేంద్రంగా ఆవిర్భవించడంతో పదిశాతం స్థలంపై కన్నేసిన సదరు ఆక్రమణదారులు కొద్దికొద్దిగా వ్యవసాయ బావిని మట్టితో పూడ్చివేస్తూ.. ఈ స్థలం మాదేనంటూ బోర్డు సైతం పాతారు. అప్పట్లో దీనిపై విచారణ జరిపిన మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ పదిశాతం స్థలం అని కోర్టులో నిరూపించి హక్కులు సాధించారు. అయితే ఇంత చేసిన అధికారులు పదిశాతం స్థలానికి రక్షణ కంచె ఏర్పాటు చేయలేకపోయారు. లీజుకు సైతం ఇచ్చి.. ఇదిలా ఉండగా గత రెండు, మూడేళ్లుగా ఆ స్థలం చుట్టూ ఆక్రమణదారులు బండలతో కంచె వేసుకుని, చదును చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సమీపంలోని వైద్యశాలలకు సంబంధించి పార్కింగ్ స్థలం కింద కూడా లీజుకు ఇచ్చారు. తర్వాత నాలుగు నెలల కిందట గుట్టుచప్పుడు కాకుండా పెద్దఎత్తున షాపింగ్ కాంప్లెక్స్, భవన నిర్మాణాలు చేపట్టాలని పావులు కదిపారు. మున్సిపాలిటీలో తమకున్న పలుకుబడితో అక్రమ మార్గంలో నిర్మాణాలకు సంబంధించి అనుమతులు సైతం సాధించారు. ఆ తర్వాత మే నెలలో మున్సిపల్ అనుమతులు ఉన్నాయని ధైర్యంగా నిర్మాణ పనులు మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా పదిశాతం స్థలం వ్యవహారం బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని మే నెలలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా.. దీనిపై కౌన్సిలర్ కామ్లీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు సదరు అక్రమ నిర్మాణదారుడుకి నోటీసులు ఇచ్చి పనులు ఆపేశారు. నా తడాఖా చూపిస్తా.. ఇదే విషయమై కౌన్సిలర్ కామ్లీ మరోసారి అధికారులకు ఫిర్యాదు చేస్తూ గట్టిగా నిలదీశాడు. దీంతో గురువారం మున్సిపల్ అధికారులు సదరు అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా మీ నోటీసులకు బెదిరేది లేదు. నాకు అధికార పలుకుబడి ఉంది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. దమ్ముంటే నిర్మాణ పనులు కూల్చేయండి. అప్పుడు నా తడాఖా ఏంటో మీకు చూపిస్తా’ అంటూ బెదిరింపులకు దిగినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ముడుపులు అప్పజెప్పి.. ఇలా పనులు ఆపేసిన క్రమంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న సదరు వ్యక్తి పలుకుబడి గల నాయకుడిని ఆశ్రయించారు. మధ్యవర్తుల ద్వారా బేరసారాలు నెరిపి.. సుమారు రూ.40 లక్షలకుపైనే ముడుపులు ముట్టజెప్పినట్లు పట్టణంలో ప్రచారం సాగుతుంది. ప్రచారానికి బలాన్ని చేకూర్చే తరహాలో పనులు ఆపేసిన సదరు వ్యక్తి తిరిగి పనులు మొదలుపెట్టారు. నోటీసులకు భయపడం.. దమ్ముంటే కూల్చేయండి మున్సిపల్ అధికారులపై అక్రమార్కుల ఎదురుదాడి నిస్సహాయంగా వెనుదిరిగిన సిబ్బంది హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు ఇటు అక్రమార్కులు, అటు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
ప్రత్యేక అనుభూతి..
రాఖీ పండగంటే చాలా ఇష్టం. చాలా విశిష్టత ఉన్న ఈ పండుగ కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూస్తుంటాం. మా అన్న, తమ్మునికి రాఖీ కట్టి ఎంతో అనుభూతి పొందుతాను. ఒకరికొకరం రక్ష అన్న ప్రగాఢమైన అనుబంధం ఇందులో ఉంది. కుటుంబ సభ్యులమంతా ఆనందంగా రాఖీ వేడుకలు జరుపుకొంటాం. – స్రవంతి, గద్వాల ప్రత్యేకమైన రోజు.. ‘రాఖీ’ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. ఒకరికొకరం తోడుగా ఉంటాం అన్న భావన మనస్సులో కలుగుతుంది. ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకొంటాం. సోదరులకు రాఖీలు కట్టి వారీ ఆశీర్వాదాలు తీసుకుంటాం. ప్రతి మహిళకు రాఖీ పండుగ ఓ ప్రత్యేకమైన తీపిరోజు. – సుధ, గద్వాల -
డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం
గద్వాల న్యూటౌన్: డిమాండ్ల సాధనకు ఉద్యోగులు కదం తొక్కారు. గురువారంఽ టీజీజేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, కార్మికులు పెద్దఎత్తున హజరై ధర్నాలో పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను నెరవేర్చేవరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని టీజీజేఏసీ జిల్లా చైర్మన్ నాగార్జునగౌడ్, కోచైర్మన్ గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. 2వ పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని, సీపీఎస్ను రద్దు చేసి, ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా వచ్చేనెల 1న జిల్లా కేంద్రంలో, 10న హైదరాబాద్లో మరోసారి మహాధర్నా నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్కు అందజేశారు. కార్యక్రమంలో టీజీజేఏసీ నాయకులు ఆనంద్, ప్రభాకర్శాసీ్త్ర, లక్ష్మీరెడ్డి, మోహన్, రమేష్, ఎల్లస్వామి, బుచ్చన్న, లక్ష్మీనారాయణ, నాగేష్, విష్ణు, అబ్దుల్బాబు తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ గద్వాల
ఎవరిది.. ఎవరిపై..● భీంనగర్లో పదిశాతం స్థలంలో అక్రమ నిర్మాణం ● నోటీసులతోనే సరిపెడుతున్న అధికార యంత్రాంగం ● మరోవైపు ఫుట్పాత్ ఆక్రమించారంటూ పేదల నిర్మాణాల తొలగింపు ● గద్వాల మున్సిపాలిటీ అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026పెద్దలది అలా.. -
పంట మార్పిడి విధానాలే మేలు
గద్వాల: పంట మార్పిడి విధానాలతోనే రైతులు అధిక లాభాలు సాధించవచ్చని, ప్రస్తుతం ఎల్నిన్ ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తుండడంతో రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో తగ్గిపోవడంతో రైతులు కాల్వల ద్వారా సాగునీటిపై ఎక్కువగా ఆధారపడకుండా కూరగాయలు, పప్పుదినుసులు వంటి స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగుచేయాలన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పంటలు సాగుచేయని రైతులు రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల వరివిత్తనాలకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా బోనస్ చెల్లించడం జరుగుతుందని ఇప్పటికే ప్రకటించినందున అధికారులు ఆ రకాలు సాగుచేసిన రైతుల వివరాలను సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. సాధారణ యూరియాను అధిక మొత్తంలో వినియోగించడం వల్ల భూమి సారవంతం కోల్పోతుందని దీని స్థానంలో రైతులు నానో యూరియాను వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలతో మహిళా రైతులు డ్రోన్లను కొనుగోలు చేసి కూడా ఎరువుల పిచికారీకి వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే శాతం పెరగాలని, రైతు బీమా దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లెయిం చేయాలని సూచించారు. పీఎండీడీకేవై పారామీటర్స్లో ఉన్నతి సాధించేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రకృతి, ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సహించాలని, ప్రతి గ్రామం నుంచి చాంపియన్ ఫార్మర్స్ గురించి డాటా పంపాలన్నారు. వనమహోత్సవం విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రిగార్డెన్స్కు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఏఓ వీరప్ప, ఉద్యావనశాఖ అధికారి రాజ్కుమార్, ఇఫ్కో మేనేజర్ కృపాశంకర్, సీనియర్ శాస్త్రవేత్త గిరిజాదేవి తదితరులు పాల్గొన్నారు. పనితీరు మెరుగుపర్చుకోవాలి ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపర్చుకోవాలని లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వెబ్ఎక్స్ మీట్ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఈఓలు, హెచ్ఎంలు పాఠశాలల సందర్శనలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఈఓ విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి ప్రసాద్, కోఆర్డినేటర్ కర్రెప్ప, మైఖేల్ తదితరులు పాల్గొన్నారు. -
30న కేంద్ర మంత్రి రాక
ఉండవెల్లి: జోగుళాంబ ఆలయ సందర్శన, జోగుళాంబ హాల్ట్ పర్యవేక్షణకు గాను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం విచ్చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ముందుగా ఆదివారం సాయంత్రం రోడ్డు మార్గంలో అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ ప్రసాద్ స్కీం నిధులతో ఏర్పాటు చేస్తున్న లేజర్ లైట్ను వీక్షించి హరిత హోటల్లో బస చేస్తారన్నారు. అనంతరం సోమవారం జోగుళాంబ హాల్ట్ రైల్వేస్టేషన్ పనులను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీసి పర్యవేక్షిస్తారు. అనంతరం గద్వాలకు బయలుదేరి వెళ్తారు. శ్రీశైలంలో 874.874 అడుగుల నీటిమట్టం అచ్చంపేట: వర్షాభావ పరిస్థితలతో శ్రీశైలం జలాశయానికి వరదలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులో గురువారం సాయంత్రం 6 గంటలకు సమయానికి 874.874 అడుగుల వద్ద 159.3828 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 162.0554 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారు 3 టీఎంసీ మేర తగ్గిపోయింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు 35,315 క్యూసెక్కులు నీరు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగునీటి అవసరాలు, సాగునీటి పథకాల కోసం నీటిని తరలిస్తున్నారు. హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేలు ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోంది. కేఎల్ఐ ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. 214 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 214 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.8,101, కనిష్టంగా రూ.5,149, సరాసరిగా రూ.6,881 ధరలు లభించాయి. -
400 ఏళ్ల ‘నూలు’ పండుగ
అచ్చంపేట: రాఖీ పండుగంటే సాధారణంగా అక్కాచెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుకగా చేసుకుంటారు. అయితే అచ్చంపేటలో పద్మశాలీలు మాత్రం వినూత్నంగా జరుపుకొంటారు. రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఇది 400 ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. పురాణాల్లో నూలు గురించి ఉంది. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకొని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ. వైభవంగా ఊరేగింపు 46వ నూలు పూర్ణిమ సందర్భంగా గురువారం సాయంత్రం అచ్చంపేటలోని శ్రీరాంనగర్కాలనీకి చెందిన కోటకిశోర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజల అనంతరం శివపార్వతులను అశ్వవాహనంపై విశేష అలంకరణతో పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగించారు. మహిళలు కోలాటాలు, డప్పులు, మంగళవాయిద్యాలు, హారతులు, అడుగుల భజనలతో భక్త మార్కండేయ శివాలయం వరకు ఊరేగింపు కొనసాగింది. అనంతరం మార్కండేయ ఆలయంలో అఖండ భజనలు నిర్వహించారు. -
12,643 మె.ట ధాన్యం గోల్మాల్
● రూ.40.70 కోట్లు స్వాహా ● మిల్లు యాజమాని అరెస్టు గద్వాల క్రైం: యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో కేసు నమోదు చేసి, నిందితుడిని బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. కేటీదొడ్డి మండలంలోని కమ్మిడిస్వామి రైస్మిల్లు నిర్వాహకుడు నందిన్నెకు చెందిన కుర్వ వీరన్నకు 2023, 2024, 2025 యాసంగి, వానాకాలం సీజన్లలో 17,754.240 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే నిర్వాహకుడు మూడేళ్ల గాను 2,689.316 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అందించాడు. ఇంకా 15,064.924 మె.ట. ధాన్యం అందించాల్సి ఉండగా.. 12,643.040 మెట్రిక్ టన్నుల (3,16,101 బ్యాగులు) వరి ధాన్యం అక్రమంగా విక్రయించి రూ.40,70,82,947 కోట్ల సొమ్ము కాజేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారన్నారు. హైకోర్టు ఈ నెల 17న ఇచ్చిన ఆదేశాల మేరకు టీజీఎస్సీఎస్సీఎల్ జిల్లా మేనేజర్ విమల ఫిర్యాదుతో 25న కేటీదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారని డీఎస్పీ వెల్లడించారు. కలెక్టర్ పర్యవేక్షణలో.. కుర్వ వీరన్న ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు సంబంధిత శాఖ అధికారులు 2025లోనే కేటీదొడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు సంబంధిత కలెక్టర్ పర్యవేక్షణలో విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువు ఇంకా ముగియకపోవడంతో నిందితుడిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో గడువు ముగిసి, నిబంధనలు ఉల్లంఘించాడని తేలడంతో హైకోర్టు, ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు నిందితుడిపై 316(2), 316(5), 318(3), 318 (4) బీఎన్ఎస్, 7 ఈసీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. సదరు నిందితుడిపై పలు హత్య కేసులు సైతం ఉన్నాయని తెలిపారు. అధికారులను విచారించిన వైనం.. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ధాన్యం కేటాయింపులపై పోలీసులు ఆ శాఖలోని ముగ్గురు కీలక ఉద్యోగులను సైతం విచారించారు. అధికారులు తీసుకున్న చర్యలు, తనిఖీలు, నివేదికలపై ఆరా తీశామని డీఎస్పీ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్, విజెలెన్స్ అధికారుల నిఘా ఉన్నప్పటికీ మిల్లు నిర్వాహకుడు ప్రభుత్వాన్ని మోసం చేసిన తీరుపై ప్రశ్నలు సంధించినట్లు వివరించారు. విచారణలో అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని, కీలక ఉద్యోగులను మరోసారి విచారించి తగు చర్య లు తీసుకుంటామన్నారు. నిందితుడిని గురువారం గద్వాల కోర్టులో హాజరుపర్చి, రిమాండ్కు తరలిస్తామన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ఆదర్శప్రాయుడు సురవరం సుధాకర్రెడ్డి
ఉండవెల్లి: జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన సురవరం సుధాకర్రెడ్డి నేటి తరానికి ఆదర్శప్రాయుడని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత అన్నారు. బుధవారం మండలంలోని కంచుపాడులో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ప్రథమ సంస్మరణ సభను కుటుంబ సభ్యులు సురవరం విజయలక్ష్మి, నిఖిల్, కపిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. సుధాకర్రెడ్డి మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదిగి, పార్లమెంట్లో పేదలు, బడుగు బలహీన పక్షాన గళం వినిపించారని కొనియాడారు. రాష్ట్రంలోని ఏదైనా యూనివర్శిటీకి లేదా కళాశాలకు సురవరం పేరు పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. ప్రాగటూరు లిఫ్టు నుంచి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించి అన్నదాతను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఎంపీ నిధులు రూ.50 లక్షలతో మండలంలో అభివృద్ధి పనులు, మరో రూ.10 లక్షలతో కంచుపాడులో సుధాకర్రెడ్డి విగ్రహం, అభివృద్ధి పనులు చేపడతామని ఎంపీ మల్లు రవి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణం, గ్రంథాలయం, సురవరం సుధాకర్రెడ్డి హాల్ను ప్రారంబించారు. కార్యక్రమంలో సర్పంచు నాగలక్ష్మమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్గౌడ్, గోపాల్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం సుప్రభాతసేవ, విశేష తిరువారాధన, సన్నాయి వాయిద్యాల నడుమ పవిత్రమాలలతో గ్రామోత్సవం, యాగశాల ద్వారా తోరణ, ధ్వజకుంభారాధన, మహాకుంభ ఆరాధనలు, పవిత్ర ప్రతిష్ఠ, మూలమంత్ర హోమాలు, పవిత్ర ఆదివాస హోమాలు, లఘు పూర్ణాహుతి, మహానైవేద్య నీరాజనములు, తీర్థ ప్రసాదగోష్టి వంటి పూజలు చేశారు. అదేవిధంగా సాయంత్రం దివ్యప్రభంద పారాయణం, యాగశాల ఆరాధన, నిత్యహోమం, శ్రీరామ మూలమంత్ర గాయత్రీ హోమం, లఘు పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్ రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, పాల్గొన్నారు. సెలవులో రేడియాలజిస్టు.. ఇబ్బందుల్లో రోగులు గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రేడియాలజిస్టు వ్యక్తిగత సెలవులపై వెళ్లడంతో రోగులు ఇబ్బందులు పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యామ్నాయ్య చర్యలు తీసుకోవాల్సిన అధికారులు విఫలమయ్యారని బాధితులు పేర్కొన్నారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గద్వాల మండలం కొండపల్లికి చెందిన ఆశా కార్యకార్త దేవమ్మకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేయాల్సిందిగా సూచించారు. బాధితురాలిని ఆమె భర్త ఆస్పత్రిలోని స్కానింగ్ విభాగం వద్దకు తీసుకెళ్లాడు. అయితే సదరు సిబ్బంది సెలవుల్లో ఉండడంతో స్కానింగ్ చేసేందుకు సమస్యగా ఉందని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయించూకోవాలని సూచించారు. ప్రైవేటులో చూయించుకునే ఆర్థిక స్థోమత లేదని భర్త వైద్యులను వేడుకున్నాడు. కానీ స్కానింగ్ రిపోర్టు ఉంటేనే చికిత్స చేస్తామని వైద్యులు తెగేసి చెప్పారు. లేకపోతే కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా ఉచిత సలహ ఇచ్చారు. దీంతో బాధితురాలి భర్త తనకు ఎదురైన సమస్యను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఘటనపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందజేయాల్సిందిగా కోరాడు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. కలుపు బెడద.. కూలీల కొరత ● రైతన్నలపై అదనపు భారం ● రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు -
నది నీరు వస్తేనే..
సోమవారం రాత్రి ఆర్డీఎస్ ఆనకట్ట వరకు వరద వచ్చిందని అధికారులు అంటున్నారు. ఎగువ ప్రాంతంలో తెలిసిన వారిని అడిగితే మాధవరం దగ్గరలో కొద్దిపాటి వరద నీరు వస్తుందని, మా దాకా వచ్చేందుకు మరో నాలుగు రోజులు పట్టొచ్చన్నారు. మిరప, వరి సాగు చేశాను. నదికి నీరు వస్తేనే పంటలు బతుకుతాయి. – విక్రమ్సింహారెడ్డి, రైతు, చిన్న ధన్వాడ తుమ్మిళ్ల సమాచారం కోసం.. తుమ్మిళ్లలో మోటార్ ఆన్ చేస్తేనే ఆర్డీఎస్ కెనాల్కు నీరు అందుతుంది. దాని కోసం రోజూ విలేకరులు, నాయకులకు ఫోన్ చేస్తున్నాం. ప్రస్తుతం తడులు అందకుంటే పంటకు ఉన్న కొద్ది ప్రాణం కూడా పోతుంది. నదికి నీరు వచ్చి తుమ్మిళ్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారనే సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. – గోపాల్, గోకులపాడు, మానవపాడు మండలం ఎలాంటి సమాచారం లేదు ఎగువ నుంచి నీరు వస్తున్నట్లు మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం నదిలో నీరు అడుగంటింది. తుమ్మిళ్ల మోటార్కు కూడా అందవు. టీబీ డ్యాంలో నిల్వలు తప్ప మిగతా ఎలాంటి సమాచారం లేదు. ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే రైతులకు తెలియచేస్తాం. – రామదాసు, ఆర్డీఎస్ అధికారి -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
కేటీదొడ్డి/ధరూరు: పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం, వెంకటాపురం, చింతలకుంటలో, ధరూరు మండలంలోని మన్నాపురంలో కాంతమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి పేదలను నిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటికే 2 వేల ఇళ్లకు పైగా నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, ఆంజనేయులు, నాయకులు శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, వెంకన్గౌడ్, కృష్ణ, గోపి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు దర్శెల్లి తదితరులు ఉన్నారు. -
శాంతి పథం.. ఇస్లాం మార్గం
గద్వాల న్యూటౌన్: ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ముస్లింలు మిలాద్–ఉన్–నబీ వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని ఉర్ధూఘర్ షాదీఖానాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం రాత్రి మజీద్ లలో ఖురాన్ పఠనంతో జాగరణ చేశారు. పలువురు ముస్లింలు అన్నదానం చేశారు. మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, శాంతి, సోదరభావ మార్గా న్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ మహమ్మద్ ప్రవక్త మార్గంలో నడవాలని మత పెద్దలు మౌలానా సయ్యద్ సుల్తాన్ మోయిద్దీన్ పాషా ఖాద్రి, హజ్రత్ మౌలానా సయ్యద్ షా మాఖ్దుమ్, ఆలీ మూసూమ్ ఖాద్రి సూచించారు. ఇస్లాం అంటే శాంతి అని, ప్రవక్త శాంతిదూత అని పేర్కొన్నారు. ఆచారమేదై నా, మతమేదైనా మంచితనంతో మెలగాలని ప్రవక్త కాంక్షించారని చెప్పారు. అనంతరం మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో షాదీఖానా నుంచి నిర్వహించిన ర్యాలీని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మున్నాబాషా ప్రారంభించగా.. పట్టణంలోని రాజీవ్మార్గ్, వైఎస్సార్ సర్కిల్, గాంధీచౌక్, కూరగాయల మార్కెట్ రోడ్ల మీదుగా ఒంటలపేటలోని అన్వర్ మసీద్ వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం మతపెద్దలను, ముఖ్య అతిథులను మిలాద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో మిలాద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, సయ్యద్ ఫారుఖ్పాష ఖాద్రీ, రహమాన్ పాల్గొన్నారు. -
170.477 మి.యూ. విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. బుధవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 92.876 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 77.601 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 170.477 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 14 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు. -
ఓపీలతో సరి.. సర్జరీలు ఏవీ?
పాలమూరు: పేదలు, సామాన్యులకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు క్రమంగా సన్నగిల్లుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపీ సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత అత్యవసర సేవలకు సీనియర్ వైద్యుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు రాత్రివేళ ఆస్పత్రికి వస్తే నిపుణులైన వైద్యులు అందుబాటులో లేక హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 340లో 212 ఖాళీ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎస్ఆర్, జేఆర్, ట్యూటర్లతో కలిపి 340 వైద్య పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 128 మంది మాత్రమే పనిచేస్తుండగా.. 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పనిచేస్తున్న వారిలో 67 మంది రెగ్యులర్, 61మంది కాంట్రాక్టు వైద్యులు ఉన్నారు. పరిపాలన, టెక్నికల్, నర్సింగ్, ఫార్మసిస్ట్ తదితర విభాగాల్లో 363 పోస్టులకు 235 మంది పనిచేస్తుండగా 128 ఖాళీగా ఉన్నాయి. ఔట్సోర్సింగ్లో 112 పోస్టులకు 95 మంది ఉండగా 17 ఖాళీగా ఉన్నాయి. రాత్రివేళ జూనియర్లే.. కొంతమంది సీనియర్ వైద్యులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఓపీ సమయంలో ఎస్ఆర్, జేఆర్, పీజీ వైద్యులు సేవలందిస్తుండగా.. రాత్రివేళ క్యాజువాలిటీలో హౌజ్ సర్జన్లపైనే ఆధారపడాల్సి వస్తోందని రోగుల బంధువులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థో విభాగం నుంచి రాత్రి అత్యవసర సేవలకు ఒక వైద్యుడు అందుబాటులో ఉండాల్సి ఉన్నా ఆ విధానం అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థోలో 15 ఖాళీలు ఆర్థో విభాగంలో 25 పోస్టులకు గాను 10 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో అవసరమైన పరికరాలు లేక కొన్ని సర్జరీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న రూ.15 లక్షల సీ–ఆర్మ్ యంత్రం, రూ.3 లక్షల ఆర్థో డ్రిల్ మిషన్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇక సర్జరీలు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరుస ఘటనలతో కలవరం ఆస్పత్రిలోని కొన్ని విభాగాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఇంజక్షన్ మార్పిడి ఘటనలో యువకుడు మృతి చెందగా.. తాజాగా శిశువు తొడలో సూది విరిగిన ఘటన కలకలం రేపింది. వార్డుల్లో సిబ్బంది ప్రవర్తనపైనా ఫిర్యాదులు వస్తున్నాయి. చిన్న కేసులకూ రెఫరల్? అత్యవసర, క్లిష్ట కేసులను రెఫర్ చేయడం సమంజసమే అయినా.. పాము కాటుకు గురైన వ్యక్తిని సైతం ఉస్మానియాకు తరలించడం చర్చనీయాంశమైంది. జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన చెన్నయ్య ఈ నెల 22న పాము కాటుకు గురికాగా కుటుంబసభ్యులు జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐదు రోజుల చికిత్స అనంతరం బుధవారం ఉస్మానియాకు తరలించారు. కాగా.. ఆస్పత్రిలో పాము కాటుకు విరుగుడు కంటే ముందు ఇచ్చే ఇంజక్షన్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. కావాల్సిన డ్రగ్స్, మెరుగైన చికిత్స విధానం అందుబాటులో లేక చాలా వరకు కేసులు హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ప్రధాన విభాగాల్లో శస్త్రచికిత్సలకు రోగుల నిరీక్షణ మధ్యాహ్నం తర్వాత కనిపించని సీనియర్లు.. రాత్రివేళ హౌజ్ సర్జన్లతోనే వైద్యం 340 వైద్య పోస్టుల్లో 212 ఖాళీలు.. జనరల్ ఆస్పత్రిలో కలవరపెడుతున్న వరుస ఘటనలు -
గిరిజనేతరులు సై.. చెంచులు నై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పులుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాలను విస్తరించాలనే లక్ష్యంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) కోర్ ప్రాంతంలోని చెంచు పెంటలు, గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ నిర్ణయం, పునరావాస ప్యాకేజీలతో తరలిపోయేందుకు గిరిజనేతర కుటుంబాల నుంచి సానుకూలత కనిపిస్తుండగా.. చెంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా నల్లమలలో పులుల సంరక్షణ, చెంచుల హక్కులు, జీవన విధానం మధ్య సమతుల్యత సాధన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. తొలి దశలో 4 గ్రామాలు.. నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలో రెండో అతిపెద్ద పులుల అభయారణ్యం. 2,611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఆదివాసీ చెంచులు బొడ్డు గుడిసెల్లో ఉంటూ అటవీ ఉత్పత్తుల సేకరణ, చిన్నపాటి వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజనేతరులు (బీసీ, ఎస్టీ, ఓసీ) స్థిరపడ్డారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) అనుమతితో తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లంపెంటకు చెందిన కుటుంబాలను తరలిస్తున్నారు. రెండో దశలో వట్వర్లపల్లిని తరలించనున్నారు. వెళ్లేది లేదు.. వెళ్లడమే సరైన మార్గం.. గ్రామసభల అంగీకారం లేకుండానే రీలొకేషన్ ప్రక్రియ ముందుకు సాగుతోందని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులే తమ జీవనోపాధి అని, జంతువులను దేవుళ్లుగా భావించే తమకు వాటితో ఎలాంటి ఘర్షణ లేదని, అడవిని విడిచి వెళ్లడమంటే తమ ఉనికిని కోల్పోవడమేనని, ఏజెన్సీ హక్కులకు దూరమవుతామని వాపోతున్నారు. బలవంతంగా తరలిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. మరో వైపు అడవిలో భూములకు హక్కు పత్రాలు లేక రుణాలు పొందలేకపోతున్నామని, పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లడమే సరైన మార్గమని గిరిజనేతరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంగీకారం తెలపని 166 కుటుంబాలు.. నల్లమల కోర్ ఏరియా నుంచి తరలిపోయే వారికి పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఎన్హెచ్–167కే పక్కన పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయం, గృహాలు, రోడ్లకు మొత్తం రూ.187.95 కోట్లు కానుండగా.. మొదటి విడతలో 417 కుటుంబాలకు రెండు ఆప్షన్లు కలిపి రూ.62.55 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 257 ఇళ్లకు ప్లాట్లు చేసి రాళ్లు పాతారు. ఈ నెల 18న డిప్ ద్వారా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 256 మందికి ఇంటి స్థలాల పట్టాలు అందజేశారు. తొలిదశలో ఇంకా 166 కుటుంబాలు తరలిపోవడానికి అంగీకారం తెలపలేదు. ఇందులో 85 వరకు చెంచు, మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. నల్లమలలో అడవిబిడ్డల ‘అరణ్య’ రోదన మైదాన ప్రాంతాలకు తరలింపుపై మిశ్రమ స్పందన ఉనికినే కోల్పోతామని ససేమిరా అంటున్న చెంచులు అడవితల్లి నుంచి విడదీస్తే బతకలేమని ఆవేదన -
గట్టులో నిధుల దుర్వినియోగంపై విచారణ
గట్టు: గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం డివిజినల్ పంచాయతీ అధికారి ప్రవీణ్కుమార్రెడ్డి గట్టులో విచారణ చేపట్టారు. గట్టు పంచాయతీకి సంబంధించి రూ.22 లక్షలను ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు పక్కదారి పట్టించారని, వీటిపై సమగ్ర విచారణ నిర్వహించాలని మాజీ సర్పంచు ధనలక్ష్మి డీపీఓకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో విచారణ నిర్వహించిన అధికారులు, మధ్యాహ్నం తర్వాత పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచు భర్త కృష్ణమూర్తి, వార్డుసభ్యులు సంతోష్, తిమ్మప్ప నిధుల డ్రాపై వాగ్వాదం చేసుకున్నారు. పనులు చేయకుండానే పంచాయతీ నిధులు డ్రా చేశారని, వీటిపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వార్డుసభ్యులు విచారణ అధికారికి విన్నవించారు. ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు మునినాయక్, కుర్మన్న, జగన్నాథరావు ద్వారా గడిచిన ఐదు నెలల్లో డ్రా చేసిన నిధులు, వాటికి సంబంధించిన బిల్లులను డీఎల్పీఓ పరిశీలించారు. అంతకు ముందు డీఎల్పీఓ మత్స్యకార కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని మత్స్యకారులు కోరగా.. వాల్మీకుల కోసమని మరి కొంతమంది పట్టుబట్టారు. కమ్యూనిటీ హాల్ వెనక ఖాళీ స్థలం విషయమై విచారణ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ ఖాజా, సర్పంచు నాగరాజు, మాజీ సర్పంచు ధనలక్ష్మి, ఉప సర్పంచు అంజనమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
జోగుళాంబ గద్వాల
బుధవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2026ప్రాణం ఖరీదు గద్వాల: నడిగడ్డ ప్రాంతంలో ప్రాణానికి ఖరీదు కడుతూ తమకున్న రాజకీయ పలుకుబడితో సెటిల్మెంట్లు చేసి చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చేసిన నేరానికి చట్టం ముందు జవాబు చెప్పాల్సిన దోషులు.. బాధిత కుటుంబానికి నగదు చెల్లింపులు చేస్తూ.. కేసులు లేకుండా దర్జాగా కాలరెగరేస్తూ బయట తిరుగుతున్నారు. దీంతో చట్టాన్ని అమలు చేసే పోలీసు శాఖ, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. గద్వాల జిల్లాకేంద్రంలో ఇటీవలి వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరణాలు, కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య వంటి కొన్ని ఘటనలలో చోటుచేసుకున్న సెటిల్మెంట్ల పర్వం ఇలాంటి ఆందోళననే రేకెత్తిస్తున్నాయి. నేరం చేసి సెటిల్మెంట్లతో తప్పించుకుంటున్న నిందితులు నడిగడ్డలో చక్రం తిప్పుతున్న రాజకీయ నేతలు, మధ్యవర్తులు విద్యార్థి ఆత్మహత్య.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి ఇదే పద్ధతి ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని తుంగలో తొక్కుతున్న అధికారులు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న వరుస పరిణామాలు -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
ధరూరు: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని మన్నాపురం గ్రామ శివారులో రైతు వెంకటేశ్వరరెడ్డి పొలంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పామాయిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటిన తర్వాత మూడేళ్లలో పంట దిగుబడి ప్రారంభమవుతుందని, 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అనేక రకాల రాయితీలు అందిస్తోందని రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రైతులు ఆయిల్పాం పంటలను జిల్లావ్యాప్తంగా రూ.13 కోట్ల విలువ చేసే పంటను విక్రయించారని డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కరుణ తెలిపారు. ఈ ఏడాది కూడా లక్ష్యం మేరకు రైతులతో పంట సాగు చేయిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రైతు శివరాజ్, మండల ఉద్యానవన శాఖ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు. పల్లి @ రూ.7,290 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 109 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,290, కనిష్టంగా రూ.5,169, సరాసరిగా రూ.7,290 ధరలు పలికాయి. -
ఆర్అండ్ఆర్ సమస్యలు పరిష్కరించాలి
గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని, ఆర్అండ్ఆర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతూ భూములు కోల్పోయిన నిర్వాసితులకు నిర్దేశిత సమయంలోగా పరిహారం చెల్లించాలన్నారు. పెండింగ్ చెల్లింపులు, పెండింగ్ పనులకు ఆర్థిక అనుమతులు, టోకెన్లు ఇతర ఆర్థిక పరమైన కారణాలతో ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్డీసీ కృష్ణ, ట్రెయినీ డీసీలు మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి కృషి జిల్లాలోని అలంపూర్, నిజాంకొండ, గద్వాలకోట తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధికి చేసేందుకు కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న ఆయన జిల్లాలో పర్యాటక ప్రాంతాల వివరాలు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, శిక్షణ డీసీలు రాజ్కుమార్, మనోజ్కుమార్రెడ్డి పర్యాటక శాఖ జిల్లా అధికారి రామలింగేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. -
బలవంతుడికి చట్టం చుట్టమేనా..?
ఓ కుటుంబంలో సంపాదించే పెద్ద మరణిస్తే కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలి రోడ్డున పడుతుంది. కుటుంబ పోషణ, పిల్లల చదువు, భవిష్యత్కు భరోసా వంటివి ఆ కుటుంబాన్ని వెంటాడుతుంటాయి. ఇలాంటి బలహీన సమయంలో నేరానికి పాల్పడిన వారు తమకున్న ధన బలం, రాజకీయ ప్రాబల్యంతో డబ్బులు వెదజల్లుతూ చట్టానికి దొరకకుండా సులువుగా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో బలహీనుడి పట్ల కఠినంగా వ్యవహరించే చట్టం కాస్త బలవంతుడి ముందు మోకరిల్లుతుందనే ఆందోళన న్యాయనిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ● నేరాలు జరిగినప్పుడు చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన సదరు అధికారులు వారిపై వచ్చే వివిధ రకాల ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాలను సరిగా అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఘటనలలో ఏకంగా సదరు అధికారులే మధ్యవర్తిత్వం నెరిపి.. రాజీ వ్యవహారం చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో నేరం చేసిన బలవంతుడు డబ్బు ఇచ్చాం.. కేసు లేదు అనే అహంకార ధోరణితో వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. -
ఉత్సాహంగా నేత్రదాన పక్షోత్సవాలు
గద్వాల క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 41వ నేత్రదాన పక్షోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వైద్యాధికారి సంధ్యాకిరణ్మయి మాట్లాడుతూ ప్రతి దృశ్యాన్ని చూడాలంటే నేత్రాలు ఎంతో దోహదం పడుతాయన్నారు. మరణించిన తర్వాత కళ్లను మరొకరికి దానం చేయడం ద్వారా వారికి చూపును అందించిన వారమవుతామన్నారు. ప్రతిఒక్కరు తన మరణానంతరం నేత్రదానం చేస్తే చూపులేని వారికి జీవం అందించిన వ్యక్తులుగా చిరస్థాయిలో నిలిచిపోతారన్నారు. నేత్రదాన పక్షోత్సవాలను వచ్చే నెల 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కళ్ల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకువచ్చేందుకు ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రసూనారాణి, రాజు, అస్గర్అలీ, రామచంద్రరావు, ప్రవీణ్కుమార్, తిరుమల్రెడ్డి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పూర్తి పరిహారం అందాకే నిర్ణయం..
మాకు చెప్పినట్లుగా పూర్తి పరిహారం ఇవ్వా లి. బాచారం దగ్గర స్థలం చూపించారు. ఇళ్లు, భూమి, పునరావాస కేంద్రంలో అన్ని వసతులు, ఉపాధి కల్పించిన తర్వాతే బయటకు వెళ్తాం. కొంతమందికి పరిహార చెక్కులు అందాయి. అందరికీ అందిన వెంటనే నిర్ణ యం తీసుకుంటాం. – కంపల్లి అంజనేయులు, గిరిజనేతరుడు, సార్లపల్లి కొందరు ఇబ్బంది పెడుతున్నారు సార్లపల్లి నుంచి 5 చెంచు కుటుంబాలే వెళ్తున్నాయి. 80 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. అందరు వెళ్తే మీరెలా ఉంటారని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. దశాబ్దాలుగా వేదన అనుభవిస్తూ పోరాడుతున్నాం. గిరిజనుల పేరిట చెంచులను ఇబ్బంది పెడితే ఊరుకోం. – జల్లా గురవమ్మ, అటవీ హక్కుల కమిటీ అధ్యక్షురాలు, సార్లపల్లి చెంచుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అమ్రాబాద్ ఫారెస్ట్లో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భవిష్యత్లో మానవ, వన్యప్రాణుల మధ్య ఘర్షణ పెరిగే అవకాశముంటుంది. పెంటలు, గ్రామాల తరలింపు స్వచ్ఛంద పునరావాస కార్యక్రమం. అంగీకరించే కుటుంబాలకు మెరుగైన వసతులు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తాం. – రేవంత్ చంద్ర, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ ● -
ఏం జరుగుతుందో..?!
వనపర్తి: జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల పార్టీ, తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫార్సు చేయడం కలకలం సృష్టించింది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్కు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికను పార్టీ అధిష్టానానికి సమర్పించినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ.. చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో వనపర్తి కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాల వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చిన్నారెడ్డి గతంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసిన నేపథ్యంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మల్లురవి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విభేదాలను పార్టీ వేదికలపైకి తీసుకురావొద్దని హితవు పలికారు. మరి చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని.. కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతుందోనని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ● చిన్నారెడ్డిపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు ● అంతర్గత విభేదాలపై అధికార పార్టీలో ఉత్కంఠ -
పంటల వైవిద్ధీకరణపై ప్రత్యేక దృష్టి
గద్వాల: ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలులో జిల్లా 27వ స్థానంలో ఉందని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి విషయంలో ప్రస్తుతం ఉన్న మౌళిక వసతులు సృష్టించిన సాగునీటి సామర్థ్యం వినియోగం పెండింగ్ పనులు మైక్రో ఇరిగేషన్ డ్రిప్, స్ప్రింక్లర్ అవసరాలు, అదనపు నిధుల ఆవశ్యకతను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పీఎండీడీకేవై అమలులో సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో శిక్షణ డీసీ రాజ్కుమార్, డీఏఓ వీరప్ప తదితరులు పాల్గొన్నారు. ఉచిత కంటి పరీక్షలు గద్వాల: పేదలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన కంటిఅద్దాలు, ఆపరేషన్లు చేయించనన్నట్లు లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు. సోమవారం రామిరెడ్డి కంటి ఆస్పత్రి, జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని సంగాలలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 30 మందికి కంటిఅద్దాలు పంపిణీ చేశారు. అలాగే కంటి సమస్య అధికంగా ఉన్న 25 మందిని ఆపరేషన్ల కోసం ఏనుగొండలో రామిరెడ్డి కంటి ఆస్పత్రిలో మంగళవారం ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నళిని, శ్రీహరి, తాయన్న, అయ్యపురెడ్డి, మోహన్రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యాప్లో వివరాలు నమోదు తప్పనిసరి గద్వాల: జిల్లాలో ఏడు సన్నరకాల వరి విత్తనాలను కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత విత్తన డీలర్లు తప్పనిసరిగా విత్తన సేల్స్ యాప్లో నమోదు చేయాలని డీఏఓ వీరప్ప సోమవారం ప్రకటనలో తెలిపారు. రైతులు బాధ్యతగా వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. యాప్లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ అందుతుందన్నారు. సెప్టెంబర్ 10లోగా రైతులందరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. నేటినుంచి పవిత్రోత్సవాలు ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విశ్వక్సేన ఆరాదన, పుణ్యాహవచనం, అంకురార్పణ, తీర్థగోష్టి, బుధవారం మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షిణ, వేద ప్రబంధ పారాయణం, యాగశాల ఆరాదన, హోమం, తీర్థ గోష్టి, గురువారం వేద పారాయణం, యాగశాల ఆరాదన, పవిత్ర సమర్పనం, లఘు పూర్ణాహుతి, శుక్రవారం వేద పారాయణం, యాగశాల ఆరాదన, మూలమంత్ర హోమాలు, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, మహానైవేద్యం, నీరాజనం, తీర్థగోష్టి, శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి తిరుకల్యాణం, ఉత్సవ పరిసమాప్తి, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. -
పైసల పంచాయితీ!
గట్టు: గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల పంచాయితీ నెలకొంది. కొత్త సర్పంచులు, తాజా మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల నడుమ మూడు ముక్కలాటలా ‘పంచాయతీ’ కొనసాగుతోంది. ఇద్దరు కొట్లాడితే.. మూడో వ్యక్తి బాగుపడతాడన్నట్లుగా పాత, కొత్త సర్పంచులు బిల్లుల కోసం పీకులాడుతుండగా.. మధ్యలో పంచాయతీ కార్యదర్శులు (సర్పంచులు) లేని సమయంలో ఊరి కోసం తాము ఎంతో చేశామని.. వాటి బిల్లులు రాబట్టుకున్న తర్వాతే మిగతావనే విధంగా వ్యవహరిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు జమయ్యాయి. జిల్లాలోని 255 పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.14.32 కోట్లు విడుదలయ్యాయి. ఆ నిధులను ఎందుకోసం డ్రా చేసుకుంటున్నారనే విషయాలు తెలియక కొత్త సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త సర్పంచులను కొందరు కార్యదర్శులు ఖాతరు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఖాతాల్లో జమ చేసిన నిధులను గుట్టుగా తమ హయాం (ప్రత్యేకాధికారుల పాలన)లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు పొందేందుకు కార్యదర్శులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామ సభలో చర్చించకుండానే పాత బిల్లులు అంటూ డ్రా చేసుకోవడం వివాదాలకు కారణమైంది. పాత సర్పంచుల విలవిల.. గ్రామ పంచాయతీల్లో పాత సర్పంచులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొందరు అప్పులు చేసి మరీ పనులు చేయగా.. బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేక విలవిలలాడుతున్నారు. పాత బకాయిల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2024 ఫిబ్రవరి నుంచి 2025 డిసెంబర్ వరకు రెండేళ్లపాటు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించారు. 2026 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. అయితే పాత సర్పంచుల బకాయిల సంగతిని పక్కన పెట్టిన కొందరు పంచాయతీ కార్యదర్శులు.. ప్రత్యేక పనుల పేరిట 15వ ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసుకుంటున్నారు. గట్టు మండలంలోని ఓ పంచాయతీలో మాజీ సర్పంచ్ ఏ పనులు చేయకుండా, ఎలాంటి ఎంబీ రికార్డు లేకుండానే పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకొచ్చి రూ.2 లక్షల చెక్కు రాయించుకున్నట్లు తెలిసింది. కొత్త సర్పంచులు వచ్చే నాటికే పంచాయతీలో ఆ పనులు చేయించాం.. ఈ పనులు చేయించామంటూ పంచాయతీ కార్యదర్శులు సుమారు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల బిల్లులు డ్రా చేసినట్లు సమాచారం. వివాదాలు సృష్టిస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధుల డ్రా సర్పంచులు లేని సమయంలో చేసిన పనులకు బిల్లులు అయోమయంలో కొత్త సర్పంచులు బకాయి బిల్లుల కోసం పాత సర్పంచుల పాట్లు నేడు గట్టు పంచాయతీలో జిల్లా అధికారులు విచారణ -
సాగునీటి సమస్యలు పరిష్కరించండి
అలంపూర్: నియోజకవర్గంలో సాగునీటి సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరా బాద్లో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీయర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలంపూర్ మండలంలోని ఉట్కూర్–1, 2, క్యాతూర్–1, 2 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 8 ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలు, ఆయిల్ను దుండగులు ఎత్తుకెళ్లడంతో ఆయా పథకాలు పని చేయడం లేదన్నారు. ఫలితంగా కృష్ణానదిలో నీరు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎత్తిపోతలు ప్రారంభించడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులకు సాగునీటిని అందించడానికి కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని, అలాగే నెట్టెంపాడు పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు. -
శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం
అచ్చంపేట/ ఆత్మకూర్: ఎగువనున్న జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయానికి 7,134 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జలాశయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 875.70 అడుగుల వద్ద 166.7052 టీఎంసీల నీటిమట్టం ఉంది. అయితే ఆదివారం 168.2670 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటి అవసరాలకు వదులుతుండటంతో 2 టీఎంసీల మేర తగ్గింది. కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు ఐదురోజుల నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేయగా.. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్కు వదులుతున్నారు. అలాగే శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కులు ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ ప్రబుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. తగ్గిన విద్యుదుత్పత్తి... ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం కేవలం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువలో ఒక్కొక్క యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతూ 7,134 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. -
సారుసారుకో కొత్త కారు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో విద్యార్థుల భవిష్యత్ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దశాబ్దాలు గడిచినా నిధుల లేమితో అల్లాడుతున్న ఈ విశ్వవిద్యాలయం.. ఇప్పుడిప్పుడే వనరులు సమకూర్చుకుంటూ ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అయితే నిధులు లేవనే సాకుతో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతోపాటు కనీస వసతులు కల్పించకుండా పక్కనబెడుతున్న యూనివర్సిటీ పాలకులు.. తమ సొంత లగ్జరీ సౌకర్యాలకు మాత్రం నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. యూనివర్సిటీలో పలు కోర్సుల్లో సీటు వచ్చినా.. వసతి గృహాలు, మౌలిక సదుపాయాలు లేక వందలాది మంది విద్యార్థులు రద్దు చేసుకుని వెళ్లిపోతుంటే.. ఇవేమీ పట్టని పాలనా యంత్రాంగం రూ.లక్షలు వెచ్చించి కొత్త లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. వీసీ మారినప్పుడల్లా.. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వైస్ చాన్స్లర్ మూడేళ్లు, రిజిస్ట్రార్లు రెండేళ్ల పదవీ కాలానికి నియమితులవుతారు. పాలమూరు యూనివర్సిటీలో వీసీలు మారిన ప్రతిసారి కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. 2019కి ముందు వీసీ భాగ్యనారాయణ కాలంలో ఇన్నోవా వాహనం ఉండేది. ఆ తర్వాత వీసీగా వచ్చిన రాజారత్నం ఈ వాహనాన్ని రిజిస్ట్రార్కు కేటాయించి.. రూ.30 లక్షల వ్యయంతో ఇన్నోవా హై 2.5జెడ్ కొనుగోలు చేశారు. ఈ కారు ఉండగానే.. 2023లో వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ రూ.20 లక్షల వ్యయంతో కొత్తగా మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీ వాహనం కొనుగోలు చేశారు. ఈ రెండు వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా.. తాజాగా వీసీ శ్రీనివాస్ ఇటీవల సుమారు రూ.32 లక్షల వ్యయంతో మహీంద్రా ఈవీ (లేటెస్ట్ మోడల్) కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ఉన్నతాధికారులు వినియోగించుకునేందుకు వర్సిటీలో ఏకంగా నాలుగు కార్లు అందుబాటులో ఉండడం గమనార్హం. ఒకటి రోడ్డెక్కితే.. మరొకటి షెడ్డుకే పరిమితం ప్రస్తుతం వీసీ శ్రీనివాస్ ఇన్నోవా హై 2.5జెడ్, మహీంద్రా ఈవీ కారును వాడుతుండగా, రిజిస్ట్రార్ రమేష్బాబు పాత ఇన్నోవాను పక్కనబెట్టి లక్ష్మీకాంత్ రాథోడ్ కొనుగోలు చేసిన మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీని వినియోగిస్తున్నారు. కేవలం ఇద్దరు అధికారులు తిరిగేందుకు నాలుగు వాహనాలు ఉండగా.. ఒకటి రోడ్డెక్కితే ఇంకోటి షెడ్డుకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. మూడేళ్లు, ఆరేళ్లకే మరమ్మతులట..! విద్యార్థులకు వసతులు కల్పించకుండా, అవసరానికి మించి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడంపై పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘గతంలో కొనుగోలు చేసిన పాత కార్లు తరచుగా మరమ్మతుకు రావడంతో కొత్త కారు కొన్నాం. ప్రతి నెలా పెట్రోల్ కార్లు వినియోగించడం వల్ల ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేశాం. వీటి వల్ల ఇంధన ఖర్చులు తగ్గి దీర్ఘకాలంలో యూనివర్సిటీకి నిధులు ఆదా అవుతాయి.’ అని సమాధానం ఇచ్చారు. మూడేళ్లకు, ఆరేళ్ల్లకే మరమ్మతులు రావడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం కరువైంది. విద్యార్థి సంఘాల ఆగ్రహం.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు యూనివర్సిటీలో సరిపడా హాస్టల్ గదులు లేవని.. తాగడానికి మంచి నీరు, చదువుకోవడానికి లైబ్రరీలో ఆధునిక పుస్తకాలు, ల్యాబ్ సౌకర్యాలు లేవని.. విద్యార్థుల కష్టాలు పట్టని అధికారులకు ఈ లగ్జరీ కార్ల మోజు ఎందుకని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగమేనని.. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీలో లగ్జరీ పాలన వీసీలు మారిన ప్రతీసారి నూతన వాహనం కొనుగోలు సరిపోను వసతి లేక సీట్లు రద్దు చేసుకుని వెళ్తున్న విద్యార్థులు ఇవేమీ పట్టకుండా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం -
‘సోలార్’తో ఆర్టీసీకి ఆదా
వాస్తవానికి ట్రాన్స్కో ద్వారా విద్యుత్ చార్జీలు యూనిట్కు రూ.8.50 పడుతుండగా.. సోలార్కు మాత్రం రూ.5.50 చొప్పున బిల్లులు చెల్లిస్తున్నారు. ఇలా ఒక్కో యూనిట్కు రూ.3 ఆదా అవుతోంది. ప్రతినెలా సరాసరి నాగర్కర్నూల్లో రూ.24 వేల పైచిలుకు, షాద్నగర్ లో రూ.21 వేలు, కొల్లాపూర్లో రూ.14 వేలు, మహబూబ్నగర్, గద్వాల లో రూ.11 వేల చొప్పున, నారాయణపేటలో రూ.7 వేలు, కల్వకుర్తిలో రూ.4 వేలు, వనపర్తిలో రూ.3 వేల పైచిలుకు చొప్పున ఆర్టీసీకి ఆదా అవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా గత ఆరు నెలల క్రితం నిర్వహణ బాధ్యతల నుంచి కార్వీ తప్పుకొంది. దీని స్థానంలో మరో సంస్థకు బాధ్యతలు అప్పగించినా ఇంతవరకు బిల్లుల చెల్లింపులకు సంబంధించి లెక్కలు తేల్చకపోవడం గమనార్హం. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సోలార్ పవర్ ప్లాంట్లతో టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్ ఏడేళ్లుగా ఎంతో ఆదా పొందుతోంది. ట్రాన్స్కో కంటే సోలార్ విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతినెలా సంస్థకు భారం తగ్గింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్ రెడ్కో) ఆధ్వరంలో ఎనిమిది చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గద్వాల డిపో, బస్టాండులో 44 కిలోవాట్లు, నారాయణపేటలో 40 (25+15) కిలోవాట్లు, కొల్లాపూర్లో 30 (20+10), మహబూబ్నగర్లో 30 (20+10), వనపర్తిలో 25 (15+10) కిలోవాట్లు, నాగర్కర్నూల్లో 20 , షాద్నగర్లో 20 (10+10), కల్వకుర్తిలో 15 కిలోవాట్లు సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఎక్కడికక్కడ సూర్యరశ్మి బాగానే పడేందుకు వీలుగా ఆయా బస్టాండ్లు, అలాగే డిపో గ్యారేజీలపైన పలకలను ఏర్పాటు చేశారు. అనంతరం ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మెయిన్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఏ రోజుకారోజు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందో.. ఎంత వాడుకుంటున్నారనేది తెలియడానికి టు వే మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ ప్లాంట్లు 25 ఏళ్ల పాటు కొనసాగేందుకు అప్పట్లోనే ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మహబూబ్నగర్ బస్టాండు పైన ఉన్న సోలార్ పవర్ ప్లాంటు ద్వారా ప్రతి రోజూ 50 నుంచి 80 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. అలాగే డిపో గ్యారేజీపైన ఉన్న ప్లాంటు ద్వారా 80 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. రీజియన్ పరిధిలో ఒకప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చేది. దీనిని అధిగమించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఏడేళ్ల క్రితమే ఆయా బస్టాండ్లు, డిపోలలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ట్రాన్స్కో కంటే సోలార్కు తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటమే గాక నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆర్టీసీ సంస్థకు బాగానే కలిసొచ్చింది. – సంతోష్కుమార్, ఆర్ఎం, టీజీఎస్ఆర్టీసీ, మహబూబ్నగర్ 10 నుంచి 44 కిలోవాట్ల వరకు సామర్థ్యం 2019లోనే కేంద్ర ప్రభుత్వం, రెడ్కో సౌజన్యంతో ఏర్పాటు అప్పట్లోనే విద్యుదుత్పత్తి గ్రిడ్కు అనుసంధానం ప్రతినెలా సంస్థకు విద్యుత్ బిల్లులలో రాయితీ వస్తున్న వైనం -
విజ్ఞాన, విహార యాత్ర విజయవంతం
గద్వాల: విద్యార్థుల మేధో వికాసానికి నిర్వహించిన విజ్ఞాన, విహార యాత్రలు విజయవంతం అయ్యాయని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి పీఎంశ్రీ పాఠశాలలతోపాటు భవిత కేంద్రాలలో ఉండే 65 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 30 మంది ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు వరంగల్, హైదరాబాద్ విహార యాత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని జూపార్కు, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్కు, వరంగల్లో వెయ్యిస్తంభాల గుడి, వరంగల్ కోట, వంటివి సందర్శించినట్లు చెప్పారు. -
జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద
గద్వాల/ఆత్మకూర్ / అచ్చంపేట: ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో హైడల్ విద్యుత్ కేంద్రానికి 23,531 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్టు–1కు 1,300, లిఫ్టు–2 872, కోయిల్సాగర్కు 930, ప్రధాన ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 550, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 54,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.30 మీటర్ల వద్ద 9.214 టీఎంసీల నీరు ఉంది. 153.052 మి.యూ. విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఎగువన 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 86.912 మి.యూ., దిగువన 4 యూనిట్ల నుంచి 160 మెగావాట్లు, 66.140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 153.052 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యుదుత్పత్తికి 24 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. శ్రీశైలంలో స్పల్పంగా పెరిగిన నీటిమట్టం శ్రీశైలం జలాశయంలోకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. జూరాల జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలానికి 23,531 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి విద్యుదుత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు 7,063 క్యూసెక్కులు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 876 అడుగుల వద్ద 168.2670 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
అలంపూర్ సమగ్ర అభివృద్ధే లక్ష్యం
అలంపూర్ రూరల్: ప్రాంతీయ అభివృద్ధి, మౌళిక వసతుల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అలంపూర్ అభివృద్ధి కమిటీ పోరాటం చేస్తుందని అధ్యక్షుడు కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం అలంపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలంపూర్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పురోగతి, కరువు మండలంగా ప్రకటించాలని, డిగ్రీ కళాశాల ఏర్పాటు, వచ్చేనెలలో రానున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి జోగుళాంబ రైల్వేస్టేషన్లో రైలు ఆపేలా వినతిపత్రం అందజేత, క్రీడా మైదానం ఏర్పాటు, మహిళల ఉపాధి కోసం నిరంతర శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కోసం చేయాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్టీలు, కులమతాలకు అతీతంగా నిరంతరం శ్రమిస్తున్న అభివృద్ధి కమిటీ అలంపూర్ పురోగతికి సంబంధించి కీలక అంశాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. సమావేశంలో గౌరవ సలహాదారు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు మహ్మద్ ఇస్మాయిల్, కార్యదర్శి రజనీబాబు, కోశాధికారి ముస్తఫా, మాజీ కౌన్సిలర్ సుష్మ, సభ్యులు హరిబాబు, నాగమల్లయ్య, వెంకట్నారాయణ, సంజీవనాయుడు, శంకర్, పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో ఎంపీ పూజలు
గద్వాల: జిల్లాకేంద్రంలోని నల్లకుంటలో దాతల సహకారంతో భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమని, భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె నల్లకుంటలో ఆలయ పునర్నిర్మాణ, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, కలిసికట్టుగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు. పెద్దచింతరేవుల అంజన్న సన్నిధిలో.. ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామిని ఎంపీ డీకే అరుణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 48వ చాతుర్మాస మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహిస్తున్న పూజలకు ఆమె హాజరవగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు విద్యారాజేశ్వర శ్రీపాదుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కేశవాచార్యులు, మద్వాచార్యులు, కిష్టాచార్యులు, ధర్మకర్త గిరిరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయాలి గద్వాల: నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎంపీ మల్లురవి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత లోపాలు, కేడర్ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి, రాజీవ్రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు. మన్యంకొండలో అఖండ పారాయణం మహబూబ్నగర్ రూరల్: శ్రావణ మాస ఏకాదశిని పురస్కరించుకుని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం అఖండ విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభమైంది. పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా 24 గంటల పాటు నిరంతరంగా పారాయణం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పారాయణంలో భాగస్వాములవుతున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
మల్దకల్/ గట్టు: పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలంలోని తాటికుంట, గట్టు మండలంలోని ఆలూరు గ్రామాల్లో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు కాగా.. వీటిలో 2 వేల ఇళ్ల పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే వాటి పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులైన పేదలకు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అపోహలు నమ్మవద్దని, ఇళ్లు నిర్మించుకున్న అందరికీ బిల్లులు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు ప్రభాకర్రెడ్డి, తిమ్మారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, విజయ్, రమేష్రెడ్డి, భానుప్రకాష్రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, నాయకులు తిమ్మప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
పెంచితే బాగుంటుంది..
ప్రస్తుతం వర్షాలు సరిగా కురువడం లేదు. నెట్టెంపాడు ప్రాజెక్ట్ ద్వారా నీరు వస్తేనే పంటలు సాగవుతాయి. ఈ రిజర్వాయర్ 15 టీఎంసీలకు పెరిగితే రెండు పంటలు సాగు చేసుకోగలం. వచ్చే ఏడాదికై నా గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. – మల్దకల్, ఎక్లాస్పురం పరిహారం చెల్లించాలి ప్రాజెక్టు సామర్థ్యం పెంపు బాగుంది కానీ, ముంపు ప్రాంతంలో పంట పొలాలు, ఇళ్లు మునిగిపోతాయి. కాబట్టి ప్రతి ఎకరాకు సరైన పరిహారం లేదా ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి. గత ప్రాజ్టెల్లో జాప్యాలు జరిగాయి. ఇప్పుడు పారదర్శకంగా వేగంగా, చేస్తేనే రైతులు నమ్మకం పెంచుకుంటారు. – యువతేజేశ్వర్రెడ్డి, గుడ్డెందొడ్డి సర్వే పూర్తవుతోంది.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంచే సర్వే పనులు పూర్తి కాకొచ్చాయి. సుమారు 600 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అలాగే జల విద్యుత్ చేసేందుకు కూడా ప్రణాళిక చేశారు. ఈ పనులు పూర్తయితే ఒకసారి రిజర్వాయర్ నిండితే రెండేళ్ల వరకు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. – సూర్య, డీఈఈ ● -
వడివడిగా గుడ్డెందొడ్డి
అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ధరూరు మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలో నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగంగా ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలకు ఇటీవల కేబినెట్ ఆమోదం లభించింది. ఇది కేవలం సామర్థ్యం పెంపు మాత్రమే కాకుండా.. జిల్లా వ్యవసాయ భవిష్యత్ను మార్చగల మహాత్తర కార్యక్రమం అని నడిగడ్డవాసులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వాయర్ విస్తీర్ణం... గుడ్డెందొడ్డి రిజర్వాయర్ దాదాపు 1,400 ఎకరాల్లో నిర్మించారు. దీని కింద సుమారు 64 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కానీ, సామర్థ్యం తక్కువగా ఉండటంతో వానాకాలంలో వచ్చే వరద నీటిని పూర్తిగా నిల్వ చేసుకోలేకపోతున్నారు. జూరాల ప్రాజెక్టుకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద ప్రవాహం ఉంటుంది. గుడ్డెందొడ్డి నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తే కేవలం 30 రోజుల్లోనే 15 టీఎంసీల సామర్థ్యం నింపుకోవచ్చు. దీంతో కర్ణాటక నుంచి వచ్చే నీటి విడుదలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది. గద్వాల, సంగాలమల్దకల్, తాటికుంట మల్దకల్, నాగర్దొడ్డి గట్టు, చిన్నోనిపల్లి1.5 జిల్లాలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు.. టీఎంసీలు 1.5 1.59 0.6 రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంపునకు కేబినెట్ ఆమోదం జల విద్యుత్ నిర్మాణానికి ప్రణాళిక రూపకల్పన ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే పనులు పూర్తయితే తొలగనున్న సాగునీటి కష్టాలు జిల్లా వ్యవసాయ భవిష్యత్ సమూల మార్పునకు అవకాశం -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు
రాజోళి: పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ పి.అర్చన సూచించారు. శనివారం ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం శ్రీరామ్, మమతలతో కలిసి ఆమె రాజోళిలో పర్యటించి.. వరి, పత్తి, మిరప, కంది తదితర పంటలను పరిశీలించారు. వరి పొలంలో తగినంత నీటిని మాత్రమే నిల్వ ఉంచాలని, 15 నుంచి 20 రోజుల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. పత్తి పంటలో జాసిడ్స్, తామర పురుగులు, తెల్లదోమ, గులాబీ రంగు ఉధృతిని గమనించాలని.. ప్రధానంగా గులాబీ రంగు పురుగు నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని తెలిపారు. మిరప పంటలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండొద్దన్నారు. కంది పంటలో కలుపు లేకుండా ఉంచుకోవాలని, సమతుల్య ఎరువుల వినియోగం ఉండాలన్నారు. చెరుకు పంటలో తేమను కొనసాగిస్తూ, కాండం తొలుచు పురుగులు, ఎర్ర కుళ్లు సోకిన మొక్కలను తొలగించాలని తెలిపారు. వారి వెంట ఏఓ సురేఖ, బిందు ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మల్దకల్: ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువుల విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. శనివారం మల్దకల్లోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎరువులను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. యాప్లో బుకింగ్ చేసిన తర్వాతే ఎరువులు అందించాలని డీలర్లకు సూచించారు. అలాగే ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని.. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఓ రాజశేఖర్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా పరిశీలన రాజోళి: క్షేత్రస్థాయిలో బీజేపీ బీఎల్ఏలు ఓటరు జాబితా పరిశీలన చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తపాలా రామాంజనేయులు అన్నారు. శనివారం వడ్డేపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన పార్టీ బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితా అందుబాటులో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో అర్హుల పేర్లు జాబితాలో గల్లంతు కాకుండా చూడాలన్నారు. ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారని.. అలాంటి వారికి సహకారం అందించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేకే రెడ్డి, అశోక్, వెంకటేశ్వర్లు, నాగేశ్వర్రెడ్డి, నాగమల్లయ్య ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాలన్యూటౌన్: స్థానిక ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏఈడీపీ – బీఎఫ్ఎస్ఐ కోర్సు బోధనకు సంబంధిత అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మీనాక్షి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కామర్స్ విభాగంలో ఎంకాం పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంకాంతో పాటు ఎన్ఈటీ, ఎస్ఈటీ, పీహెచ్డీ అర్హత కల్గిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన వివరాలతో ఈ నెల 24వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. -
బీచుపల్లి క్షేత్రంలో అలంపూర్ సివిల్జడ్జి
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శనివారం అలంపూర్ సివిల్ కోర్టు జడ్జి నితిన్ తేజ సందర్శించి.. అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను అర్చకుడు సందీప్ చారి వివరించారు. న్యాయమూర్తి వెంట కోర్టు సిబ్బంది ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,519 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 256 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,519, కనిష్టంగా రూ. 4,169, సరాసరి రూ. 6,399 ధరలు లభించాయి. 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,219, కనిష్టంగా రూ. 4,579 ధర పలికింది.


