breaking news
Jogulamba
-
లీడర్ల ‘లడాయి’..!
దూకుడు పాలి‘ట్రిక్స్’ కేరాఫ్ నడిగడ్డ శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026–IIలో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంతో పాటు పాలమూరులో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు గద్వాల, అలంపూర్ పెట్టింది పేరు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నది మధ్య నడిగడ్డ (జోగుళాంబ గద్వాల)గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకవైపు ఏపీ, మరోవైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆధిపత్యమే హద్దుగా అసమాన రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఈ జిల్లాలో ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని విపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ చిచ్చు రాజకీయ రగడకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పలువురు లీడర్ల లడాయి, వారి వ్యవహార శైలి హాట్టాపిక్గా మారింది. గద్వాల: పెద్దల వద్దకు ‘వార్డుల’ లొల్లి గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆయా వర్గాల మధ్య పోటాపోటీ నడిచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. తమకు 16 వార్డులు కేటాయించాలని ఓ వర్గం వారు పార్టీ ముఖ్య నేతలకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. లేకుంటే మీ ఇష్టమంటూ మరో వర్గ నేత సమాధానమిచ్చినట్లు సమాచారం. స్వపక్షంలో విపక్షంలా ముదిరిన పంచాయితీ కీలక నేతలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ లొల్లి రాష్ట్ర పెద్దల వద్దకు చేరినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ‘ఆధిపత్య’మే హద్దుగాఅసమాన రాజకీయాలు అటు అధికార, ప్రతిపక్షాలు.. ఇటు స్వపక్షంలోనే విపక్షం నాగర్కర్నూల్ ఎంపీ, అలంపూర్ ఎమ్మెల్యే మధ్య రగడతో మళ్లీ తెరపైకి.. హాట్టాపిక్గా ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల వ్యవహార శైలి -
తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. అలంపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన విజయుడు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అంతా తానై అధికారం చెలాయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ అధికారిక కార్యక్రమాలతో పాటు నిత్యం జరుగుతున్న ఇసుక, మట్టి, మొరం, అసైన్డ్ భూముల దందాల్లో చక్రం తిప్పతున్నారు. ఏ పని అయినా ఆయనకు కమీషన్, వాటా ముట్టనిదే ముందుకు కదలడం లేదనే టాక్ ఉంది. తన మాట వినని అధికారులను బెదిరిస్తున్నట్లు ఇటీవల ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు.. గద్వాలలో సైతం ఖాకీలు, ఇతర అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారని.. తనను లెక్కచేయని ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీ వెనుక ఆయన ‘హస్తమే’ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులో ఈ నెల 20వ తేదీన ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. వివిధ అభివృద్ధి పనులకు టెంకాయ కొడుతున్న సమయంలో ఇరువురితో పాటు వారి వారి అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎంపీ మల్లు రవి తోసివేస్తూ దుర్భాషలాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్గా మారగా.. రాజకీయ రచ్చకు తెరలేసినట్లయింది. దీనిపై ఎమ్మెల్యే విజయుడిని దూషిస్తూ అవమానం చేసిన ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీ వేదికగా మల్లు రవి ‘నేను ఎమ్మెల్యేను తిట్టింది గానీ, కొట్టింది గానీ లేదు. కానీ నేను ఎమ్మెల్యేపై భౌతిక దాడి చేశానని కేటీఆర్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారు నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటా’ అని ప్రతిస్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు గద్వాల జిల్లాలో ఏం జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ప్రతి పల్లెకు బ్యాంకు సేవలు
ఎర్రవల్లి: గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చేందుకే ఎస్బీఐ కీలక అడుగులు వేసి నూతన శాఖను ప్రారంభించిందని ఎంపీ మల్లు రవి అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన ఎస్బీఐ నూతన శాఖను ఎమ్మెల్యే విజయుడు, జీఎం సతీష్కుమార్తో కలిసి ఎంపీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లెకు ఎస్బీఐ సేవలను అందించడమే లక్ష్యంగా ఎర్రవల్లి కూడలిలో బ్యాంకు నూతన శాఖను ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఎస్బీఐలో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు, రైతులు, మహిళలు, చిరు వ్యాపారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బ్యాంకులంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన బ్యాంకు సేవలను అందించి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం.. స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో తమకు ఎలాంటి విబేధాలు లేవని, ఇద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారమని, ఆయనతో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎంపీ మల్లురవి అన్నారు. పార్టీలు వేరైనా అభివృద్ధే ఎజెండాగా కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సంఘటన వివాదాస్పదం కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో గద్వాల ఆర్డీఓ అలివేలు, ఎస్బీఐ ఏజీఎం బిరోజ్ కుమార్, ఆర్ఎం సుజాత, బ్రాంచి మేనేజర్ శివతేజ, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప, తహసీల్దార్ నరేష్, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా అడ్డ‘దారి’
గద్వాల టౌన్: జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో జనాభా పెరుగుతోంది.. రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువైంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించాలి. అయితే.. కొందరు స్వార్థపరులు మాత్రం ఉన్న దారులనే మింగేస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి స్థిరాస్తి వ్యాపారానికి ‘దారి’తీశారు. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో అక్రమార్కుల బరితెగింపు రోజురోజుకూ మితిమీరుతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. కబ్జా చేసి.. ప్లాట్లుగా విక్రయించి జిల్లాకేంద్రంలో అత్యంత ఖరీదైనా ప్రాంతాలలో కొత్తహౌసింగ్ బోర్డుకాలనీ ఒకటి. ఈ కాలనీకి ఆనుకొని సర్వే నంబర్ 789లోని రెండు ఎకరాల స్థలంలో 1988లోనే అధికారికంగా ఎల్పీని ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలారు. అయితే ఈ ఖాళీ స్థలంతోపాటు 40 అడుగుల రోడ్డును కొంతమంది కబ్జాచేసి ప్లాట్లుగా డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ ప్లాట్లను అధికార పార్టీకి చెందిన నేతలు తక్కువ ధరలకు కొనుగోలు చేసి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కబ్జాకు గురైన ఆ స్థలం బహిరంగ మార్కెట్లో రూ.4 కోట్లు ఉంటుంది. కబ్జా చేసిన ప్లాట్లకు దారి లేకపోవడం, వాటిని అభివృద్ధి చేసుకొనేందుకు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎవరు ఏమీ చేయరనే ఉద్దేశంతో ఏకంగా ప్లాట్లకు ఆనుకుని ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రజా అవసరాల ఖాళీ స్థలాన్ని సైతం ఆక్రమించేశారు. అందరూ చూస్తుండగానే అధికార పలుకుబడితో నిబంధనలకు తుంగలో తొక్కి ఖాళీ స్థలంలో మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్రమ ప్లాట్లలో దుకాణాలు సైతం నిర్మిస్తున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలిపి, ఫిర్యాదు చేసినా అధికార బలం ముందు ఫలితం లేకుండా పోయింది. ఎల్పీలోని ఖాళీ స్థలంతోపాటు రహదారిలో ప్లాట్లు ఏర్పాటు చేయటం, హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన ఖాళీ స్థలంలో దౌర్జన్యంగా రోడ్డు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమైనా కబ్జాదారులు అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నేతల బాహాబాహీ.. రాజకీయ ఒత్తిడితో స్థలాల కబ్జా, అక్రమ నిర్మాణాల గుర్తింపు వ్యవహారం పక్కదారి పడుతోంది. కొంతమంది నేతల అండతో సాగుతున్న కబ్జాల పర్వానికి అంతే లేకుండా పోతుంది. దీనిపై రెండేళ్ల క్రితం అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పుడు ఉన్న కలెక్టర్ కబ్జాలపై సీరియస్గా తీసుకుని అక్రమ నిర్మాణాలను నిలిపిచేయించారు. ప్రస్తుతం అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటాన్ని అదునుగా తీసుకుని అక్రమార్కులు మళ్లీ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధమని టౌన్ప్లానింగ్ అధికారులు చెప్పినప్పటికీ అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. పైగా ‘ఆ ప్లాట్లు మనోళ్లవే ఎవరు ఫిర్యాదు చేసినా అక్కడికి వెళ్లొద్దని ముఖ్య నాయకులు అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించడం విశేషం. ఎల్పీలోని రోడ్డు, ఖాళీ స్థలం కబ్జా ప్లాట్లు ఏర్పాటు చేసి.. దుకాణాల నిర్మాణం రూ.4 కోట్ల విలువైన స్థలం పరులపాలు ఫిర్యాదు చేసిన వారిపైనే కబ్జాదారుల బెదిరింపులు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ‘ఇక్కడ కనిపిస్తున్న దుకాణ నిర్మాణాలు, ప్లాట్ల హద్దులు సర్వే నంబర్ 789 అప్రూవుడ్ లే అవుట్ ప్లాన్లోనివి. ఎల్పీలో ఉన్న ప్రజా అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలంతోపాటు 40 అడుగుల రోడ్డు మధ్యలో వీటిని ఏర్పాటు చేశారు. నిబంధలను పట్టించుకోకుండా లే అవుట్లోని ఖాళీస్థలం, రోడ్డును కొంతమంది దౌర్జన్యంగా కబ్జా పెట్టి ప్లాట్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దుకాణాలు సైతం నిర్మిస్తున్నారు. ఈ ప్లాన్కు ఆనుకుని ఉన్న కొత్త హౌసింగ్ బోర్డుకు చెందిన ప్రజా అవసరాల స్థలాన్ని కూడా కబ్జా చేశారు. దీనిపై స్థానికులు ప్రశ్నిస్తే ప్రత్యామ్నాయంగా మరోచోట రోడ్డు వేస్తామని బెదిరిస్తుండటం గమనార్హం. -
జములమ్మ బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు
గద్వాల: జములమ్మ బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతున్న జమ్ములమ్మ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ సక్రమంగా నిర్వహించాలన్నారు. భక్తులకు తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పరిశుభ్రతకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నిర్వహణ, భద్రత పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, ఆలయ ప్రాంగణంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు చెప్పారు. వైన్షాపుల దగ్గర ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఎక్సెజ్ అధికారులకు సూచించారు. నీటి ప్రమాదాలు జరిగితే గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జమ్ములమ్మ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాభాను, తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ప్రజాస్వామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం అధికారులతో స్వీప్ నోడల్ అధికారి రమేష్బాబు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటుహక్కు ప్రాధాన్యత తెలియజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. -
భక్తిశ్రద్ధలతో వసంత పంచమి పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహానైవేద్య నీరాజనాలు, విశేష అలంకరణ తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు కనులపండువగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సరస్వతిదేవిని దర్శించుకొన్నారు. అనంతరం సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్రచారి, దినకరన్, దత్తుస్వామి, భానుమూర్తి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో 280 మంది చిన్నారులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు పాలక మండలి ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ వెంకటాద్రి, జనరల్ సెక్రెటరీ సీతారామిరెడ్డి, మేనేజర్ సురేందర్రాజు, సభ్యులు విజయమోహన్రెడ్డి, నారాయణనాయుడు, నాగబలిమి, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఉండాలి
గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి పురోగతి సాధించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎంపీడీఓలతో మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రస్తుతం జిల్లా రాష్ట్రస్థాయిలో 19వ స్థానంలో ఉందన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 75కోట్లు లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు చెప్పారు. మంజూరు పొందిన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణ పనులు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. 45 రోజులలోపు మార్క్ అవుట్ చేయని లబ్ధిదారులను రద్దుచేసి.. వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించి, ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అలంపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, డీపీఓ శ్రీకాంత్ ఉన్నారు. నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గద్వాల మున్సిపాలిటీలోని వెంకటపేట శివారు సర్వేనం. 20లో లేఅవుట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాప్లను చూసి.. రోడ్డు కనెక్టివిటి, నీటి వనరులు, బఫర్ జోన్ తదితర అంశాలపై ఆరా తీశారు. లేఅవుట్ల అభివృద్ధిలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. దీంతో పాటు సర్వే.నం 494 లేఅవుట్ను కలెక్టర్ పరిశీంచారు. ఇక్కడ నీటి కనెక్షన్, స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేనం. అదే విధంగా సర్వేనం.1028లోని లేఅవుట్లో నీటి వనరులు, విద్యుత్, డ్రెయినేజీలను అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జానకీరామ్, టౌన్ ప్లానింగ్ అధికారి కుర్మన్న, తహసీల్దార్ మల్లిఖార్జున్ ఉన్నారు. -
‘ఉపాధి హామీ’ పేరు మార్పు సరికాదు
కేటీదొడ్డి: అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి చేకూర్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగించడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి అన్నారు. గురువారం కేటీదొడ్డిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ పేరు ఉపాధి హామీ పథకానికి ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి కానీ.. ఉన్న పథకం పేరు రద్దు చేయడం సరికాదన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగానే గాంధీజీ పేరు తొలగించిందని ఆరోపించారు. ఈ నెల 26న ప్రతి గ్రామపంచాయతీలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. తీర్మాన ప్రతులను రాష్ట్రపతికి పంపిస్తామన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సర్పంచ్ నారాయణ, నాయకులు ఉరుకుందు, గోవిందు, కొండన్న, యుగందర్, శేఖర్రెడ్డి ఉన్నారు. -
నో బస్.. నో సర్వీస్
జిల్లాలో మొత్తం 360 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా.. 275 గ్రామాలకు సర్వీసులు నడుస్తుండగా.. మరో 85 పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. సుదూర ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రధానంగా 50 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఈ విద్యాసంవత్సరంలో ఆర్టీసీకి 16 దరఖాస్తులు రాగా.. 12 గ్రామాలకు పునరుద్ధరించారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. మర్రిపల్లి (ఉప్పునుంతల), జమిస్తాపూర్ (నాగర్కర్నూల్), చెన్నంపల్లి, పద్మనపల్లి, కొత్త చెరువు, ఎంసీతండా (లింగాల), మైలారం, లక్ష్మీపల్లి, బాణాల, అంబగిరి, నర్సాయిపల్లి (బల్మూరు), ఖానాపూర్, గుడ్ల నర్వ, నెల్లికొండ (బిజినేపల్లి). జిల్లాలో మొత్తం 261 గ్రామాలు ఉన్నాయి. ఒక డిపో ఉండగా.. 252 పల్లెలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. తొమ్మిది గ్రామాలకు మాత్రం బస్సు సర్వీసులు నడుస్తలేవు. 2025– 26లో బస్సు సౌకర్యం కల్పించాలని ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. తుంకుంట (అయిజ), మల్లెందొడ్డి (మల్దకల్)కి మాత్రమే సర్వీస్లు నడిపిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. రాయపురం (గట్టు), తుమ్మిళ్ల (రాజోళి), కుర్వపల్లి, పరాముల (గద్వాల), మైలగడ్డ (ధరూర్), ఇటిక్యాలపాడు (మానవపాడు). జిల్లాలో మొత్తం 276 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 157 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. 119 పల్లెలకు ఆర్టీసీ సర్వీసులు లేవు. 2025–26 విద్యా సంవత్సరంలో ఉజ్జని (మాగనూర్), సంగంబండ (మక్తల్), రాయికోడ్ (నర్వ) గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉంది. ఏయే గ్రామాలు అంటే.. షేర్నపల్లి, మేకహనుమాన్తండా, వందరగుట్ట తండా, పిల్లిగుండ్లతండా, బోయిన్పల్లి తండా (నారాయణపేట), చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి (ఊట్కూరు), అల్లీపూర్, తిమ్మారెడ్డిపల్లి (కొత్తపల్లి), ఎలిగండ్ల, పసుపుల, మాధవరం (మరికల్). ఈ ఆటోలో కూర్చుని ప్రయాణిస్తున్నది అలంపూర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన విద్యార్థులు. అలంపూర్కు 7 కి.మీ. దూరంలోని గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు నిత్యం ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు ఇలా వాహనం సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పిస్తే ఇబ్బందులు తొలగుతాయని విద్యార్థులు చెబుతున్నారు. గట్టు నుంచి రాయాపురం వెళ్లేందుకు నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత 4:30 గంటల నుంచి రోడ్డుపై నిలబడినా బస్సులు రావు. అటుగా వెళ్లే ప్రైవేటు వాహనాలను లిఫ్ట్ అడుగుతాం. ఒక్కోసారి ఇంటికి చేరుకునేందుకు చీకటి పడుతుంది. మాకు బస్సు సౌకర్యం కల్పించాలి. – అమృత, 10వ తరగతి విద్యార్థి, రాయాపురం గట్టు మండలం నా కూతురు మౌనిక గట్టులో 10వ తరగతి చదువుకుంటుంది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తుంది. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత గట్టు నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో నా కూతురుతో పాటు మిగతా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలి. – తిమ్మప్ప, రాయాపురం, గట్టు మండలం జిల్లావ్యాప్తంగా 252 గ్రామాలకు బస్సులు నడుపుతున్నాం. అదే విధంగా కొత్తగా ఇటిక్యాలపాడు, తూంకుంట, మల్లెందొడ్డిలో రూట్లకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. ఇంకా అవసరమున్న గ్రామాల పరిధిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటాం. – సునీత, ఆర్టీసీ డీఎం, గద్వాల టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్నగర్ రూరల్) జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు. ..ఇదీ భావి భారత పౌరుల దుస్థితి. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక.. ఉన్నప్పటికీ సమయపాలన పాటించకపోవడం.. వచ్చినా ఆపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పడుతున్న అగచాట్లకు ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన కొందరు.. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి వేళ్లాడుతూ మరికొందరు.. బస్సుల్లో ఫుట్బోర్డ్పై ప్రయాణం చేస్తూ ఇంకొందరు నరకయాతన అనుభవిస్తున్నారు. స్థానికంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేకపోవడం.. రవాణా ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టడంలో పాలకుల వైఫల్యం వెరసీ విద్యార్థులు నానా ఫీట్లతో దినదినగండంగా రాకపోకలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరులోని పలు గ్రామాల్లో నిత్య సవాళ్ల మధ్య చదువుల యుద్ధం కొనసాగిస్తున్న విద్యార్థులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 212 గ్రామాలు ఉన్నాయి. ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధిలో 189 గ్రామాలకు మాత్రమే సర్వీస్లు నడిపిస్తున్నారు. 23 పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రవాణా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని 11 గ్రామాల నుంచి అర్జీలు రాగా.. ఆరు పల్లెలకు మాత్రమే నడుపుతున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. దావాసిపల్లి (పాన్గల్), నగరాల (శ్రీరంగాపురం), కంభాళపూర్తండా (ఖిల్లాఘనపురం), చె న్నూర్ (గోపాల్పేట), మిరాస్పల్లి (కొత్తకోట). -
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం
● ఈ నెల 9 నుంచి 20 వరకు రూ.22 కోట్లు ఆర్జన ● 34 లక్షల కి.మీ. ప్రయాణం, 39 లక్షల ప్రయాణికుల వినియోగం ● ఓఆర్లో రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ అగ్రస్థానం స్టేషన్ మహబూబ్నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి పది డిపోలకు 430 బస్సులు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులు నడిపారు. ముఖ్యంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని స్వస్థలాలకు వెళ్లడానికి అధికంగా బస్సులు తిప్పారు. వీటిలో సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అత్యధికంగా 109 శాతం.. మహాలక్ష్మి పథకం కింద ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణంలో జీరో టికెట్ ఉన్నప్పటికీ అందులో వారు తిరిగిన రూట్ ఆధారంగా టికెట్ చార్జీ కూడా పొందుపరిచారు. సాధారణ, మహిళల ఆదాయాన్ని కలుపుకొని సంక్రాంతి పండుగ రోజులకు సంబంధించి ఈ నెల 9 నుంచి 20 వరకు (14, 15, 16 తేదీలు మినహా) మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో అదనపు బస్సు సర్వీసులు నడపగా రూ.22,69,54,338 కోట్ల ఆదాయం వచ్చింది. 9 నుంచి 20 వరకు రీజియన్లోని బస్సులు 34,47,623 కిలోమీటర్లు తిరిగాయి. మహాలక్ష్మి పథకం ప్యాసింజర్లు, టికెట్ చార్జీ ప్రయాణికులతో కలిపి 39,20,918 మంది బస్సుల్లో ప్రయాణించారు. ఆక్యుపెన్షి రేషియాలో మహబూబ్నగర్ రీజియన్ రాష్ట్రంలో అత్యధికంగా 109 శాతం సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం.డిపో కిలోమీటర్లు ఆదాయం ప్రయాణికులు మహబూబ్నగర్ 5,40,780 3,38,01,857 5,14,321 వనపర్తి 4,57,678 3,09,42,056 5,33,909 గద్వాల 4,06,181 2,46,20,151 4,95,360 అచ్చంపేట 3,34,898 2,44,05,169 3,39,395 కల్వకుర్తి 3,65,956 2,38,98,638 4,23,531 నారాయణపేట 3,66,405 2,37,08,913 3,66,638 షాద్నగర్ 3,18,770 2,24,55,052 4,09,820 నాగర్కర్నూల్ 3,17,478 2,09,87,807 4,39,589 కొల్లాపూర్ 2,71,300 1,81,41,848 3,05,620 కోస్గి 68,177 39,92,947 92,735 -
ఎగబడి పోవాలె..!
ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు ● అనేక గ్రామాల్లో కిక్కిరిసిన ఆటోల్లోనే పాఠశాలలకు.. ● కొన్నిప్రాంతాల్లో ఎడ్ల బండ్లు, కాలినడకే శరణ్యం ● నిత్యం కిలోమీటర్ల కొద్దీ ప్రమాదకర ప్రయాణం ● అరకొరగా ఆర్టీసీ సర్వీస్లు.. సమయానికి రాక.. వచ్చినా ఆపక ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఫీట్లు.. పాట్లు -
పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం
గద్వాల: పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 145 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, 300 పడకల ఆస్పత్రి, గురుకుల పాఠశాలలు, ప్రధాన రహదారులు, సీసీరోడ్లు, డ్రయినేజీ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా పేదలకు ఏదైనా సమస్య తలెత్తితే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించి గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు బోయ వెంకట్రాములు, జంబు రామన్గౌడ్, చెన్నయ్య, రమేశ్ నాయుడు, సుభాన్, బండారి భాస్కర్, బాబర్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహోత్సవాలు
అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహోత్సవాలు బుధవారం మూడో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు, త్రిశతి అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించారు. అదేవిధంగా విశేష అర్చనలు, చండీహోమాలు, పవమాన సూక్త పారాయణ, పవమాన సూక్త హోమాలు, అవాహిత దేవతా హోమాలు, మండప ఆరాధన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు పూజలు చేశారు. మరో రెండు రోజుల పాటు వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉత్సవాల చివరి రోజు బ్రహోత్సవాల్లో భక్తులకు అమ్మవారు నిజరూప దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. -
23 నుంచి బాలబ్రహ్మేశ్వర జాతర
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి బ్రహోత్సవాల్లో జాతరను విజయవంతం చేద్దామని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి సేవా సమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని హరిత హోటల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న వసంత పంచమిని పురస్కరించుకొని జోగుళాంబ సేవా సమితి ఆధ్వర్యంలో గంటలేశ్వర ఆలయం నుంచి జోగుళాంబ అమ్మవారి ఆలయం వరకు జాతర ఊరేగింపు ఉంటుందన్నారు. గంటలేశ్వర ఆలయం నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమై టూరిజం హోటల్, గాంధీచౌక్, పోలీస్స్టేషన్ మీదుగా బాల బ్రహ్మేశ్వర ఆలయం సముదాయం నుంచి జోగులాంబ అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారని తెలిపారు. అనంతరం తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో ఉన్న అష్టభుజి గంటలేశ్వర ఆలయం వద్ద అన్నప్రసాదం వితరణ ఉంటుందన్నారు. ఉత్సవాల్లో పలు సేవా సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షుడు సంజీవనాయుడు తెలిపారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, మాజీ ధర్మకర్త సభ్యుడు నరసింహారెడ్డి ఆలయంలో భక్తులు దర్శించుకోవడానికి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాధవి, శివానంద స్వామి, పట్టణ ప్రముఖులు, సుంకన్న, సత్యనారయణ, రమేష్ గుప్తా, ప్రశాంత్, నారయణ, బుజ్జీ, కేకే సత్యం, పోలీస్ చిన్నయ్య, రాజశేఖర్ శర్మ తదితరులు ఉన్నారు. -
సేవలపై ఆరా తీస్తున్నాం..
గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ప్రభుత్వ, ప్రయివేటఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తున్నాం. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై చర్యలు చేపట్టాం. మెడికల్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలపై నిఘా ఉంచాం. జిల్లాలో ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి వైద్య సేవలు అందిస్తే సహించేది లేదు. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడే మెడికల్ దుకాణాల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – సంధ్యాకిరణ్మయి, జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి -
ఐద్వా మహాసభలు జయప్రదం చేయండి
అలంపూర్: హైదరాబాద్లో ఈ నెల 25న నిర్వహించే ఐద్వా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఏమెలమ్మ, జిల్లా కార్యదర్శి నర్మద పిలుపునిచ్చారు. అలంపూర్ పట్టణంలోని సంతోష్నగర్ కాలనీలో బుధవారం ఐద్వా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా 14వ జాతీయ మహాసభల జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఐద్వా పోరాట ఫలితంగా అనేక హక్కులు సాధించుకున్నామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దేవమ్మ, కాంతమ్మ, మదనమ్మ, లక్ష్మి, పార్వతమ్మ, ఏసమ్మ, బుజ్జమ్మ, మరియమ్మ, కవిత తదితరులు ఉన్నారు. నీటి వినియోగంపై లెక్క పక్కా.. గద్వాల క్రైం: జిల్లాలోని జలాశయాలు, భూగర్భ జలాలు, ఎత్తిపోతల పథకాల గణనను బుధవారం జలాశయాల మంత్రిత్వశాఖ, ఆర్థిక గణాంక శాఖ హైదరాబాద్కు చెందిన నిపుణులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా జల నిపుణులు మహేందర్రెడ్డి, విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ.. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో భూగర్భ, జలాశయాలు, ఎత్తిపోతల పథకాల అనుసంధానంగా ఉన్న వాటిని సర్వే చేయడంతో పాటు జియోట్యాగింగ్ చేస్తామన్నారు. ఈ విధానంతో నీటి పంపిణీ విధానం, నీటి పారుదల విస్తీర్ణం, జలాశయాల ద్వారా వ్యవసాయ పంటలకు చేరుతున్న నీటి వాటాలపై ప్రణాళికలు తెలియజేస్తుందన్నారు. జలాశయాల ద్వారా జిల్లాలో మత్స్య సంపద, సాగు పంటల వివరాలను సులువుగా తెలుసుకునేందుకు దోహదపడుతాయని పేర్కొన్నారు. అవసరమైయ్యే నీటి వినియోగంపై పక్కా లెక్కలతో పాటు అవగాహన వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాపయ్య, నాగర్జునగౌడ్ తదితరులు ఉన్నారు. రాజాగారి బంగ్లా మరమ్మతుకు రూ.10 కోట్లు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో శిథిలావస్థకు చేరిన రాజాగారి బంగ్లా మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతిగృహాల పునరుద్ధరణకు రూ.13.15 కోట్లు కేటాయించినట్లు వివరించారు. వచ్చిన నిధులతో రాజాగారి బంగ్లాను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అమరచింత: తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడమేగాకుండా పురపాలికల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పశుసంవర్దకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలోని పది వార్డుల్లో రూ.15 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం స్థానిక పురపాలికకు ఇప్పటి వరకు రూ.35 కోట్లు కేటాయించిందని.. మునుపెన్నడూ లేని విధంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, పార్క్లు, కూడళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని.. అనంతరం ప్రతి ఒక్కరూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, మార్కెట్ డైరెక్టర్లు పోసిరిగారి విష్ణు, శ్యామ్, కమలాకర్గౌడ్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రమాదం.. ఓ కుటుంబం చిన్నాభిన్నం’
గద్వాల: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన ‘చేరుకోండి.. జీవించండి’ నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాస్రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా అధికారులు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు రోడ్డు నియమాలు పాటించి, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అదేవిధంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో నిర్మించే రహదారులను నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. అతి వేగం కారణమే.. తాను హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఎండీగా పనిచేసిన సందర్భంలో అక్కడ జరిగే ప్రమాదాలకు కారణాలను విశ్లేషించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా స్పీడ్ లిమిట్లో వెళ్లే మార్గాల్లో వాహనదారులు అందుకు విరుద్ధంగా అధిక స్పీడ్తో వెళ్తూ ప్రమాదాల బారిన పడేవారన్నారు. అదేవిధంగా సడన్ బ్రేకులు వేయడం, రహదారులపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలపడం వంటివి ప్రమాదాలకు కారణాలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తే ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మద్యం తాగి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి వాటితోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణలో రవాణాశాఖ, ట్రాఫిక్, పోలీసు శాఖల అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధ్యతతోనే ప్రమాదాల నివారణ పౌరులు బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. రోడ్డు భద్రత ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయమని, రోడ్డు ప్రమాదంలో పోయే ఒక ప్రాణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. ఇంటి యజమాని వారి పిల్లలు, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే చాలా వరకు ప్రమాదాలు కట్టడి అవుతాయన్నారు. అదేవిధంగా ప్రతిఉద్యోగి ద్విచక్రవాహనంపై వచ్చే టప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం ‘చేరుకోండి.. జీవించండి’ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలె క్టర్ నర్సింగ్రావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీఓ అలివేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైద్య పరికరాలపై ఆరా
గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైయ్యే మందులు, వైద్యుల వివరాలు, స్కానింగ్ పరికరాల వినియోగం, మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో వైద్యశాఖ అనుమతి లేకుండా శాంతినగర్లో నిర్వహిస్తున్న ఓ ప్రయివేట్ ఆస్పత్రిని ఈ నెల 2న సీజ్ చేయడంతో పాటు ఈసీజీ, ఎక్స్రే మిషన్లు, బయో వ్యర్థాల నిర్వహణ, రికార్డులు సరిగా లేనందుకు మరో రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లఘించిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు. వైద్య సేవల కోసం వస్తున్న రోగులు, ఎంత మంది అత్యవసర సేవలు పొందారు. మెరుగైన వైద్యం, జిల్లా ఆస్పత్రులకు సిఫార్సు చేయాల్సిన రోగుల వివరాలను సిబ్బంది సేకరించారు. అన్ని ఆస్పత్రుల్లో కూడా సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్యులు కృషి చేయాలని, అత్యవసరం అయితే తప్ప శస్త్ర చికిత్స చేయకూడదని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రిలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఫార్మాసిస్టు ద్వారా తెలుసుకున్నారు. ప్రయివేట్ మెడికల్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న మందులపై డ్రగ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదకరమైన వ్యాధులు, శస్త్ర చికిత్సలకు అందజేసిన మందులు, రోగుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అందుబాటులో లేని మందుల గురించి ఆరా తీశారు. గర్భిణుల కడుపులో బిడ్డ ఎదుగుదల గుర్తించేందుకు వినియోగించే స్కానింగ్, ఎక్స్రే, ఈసీజీ తదితర యంత్రాల పనితీరు, అందుబాటులో ఉన్న వైద్యులు, టెక్నీషియన్లు గురించి తెలుసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలు ప్రయివేట్ ఆస్పత్రుల ఆధీనంలో కొనసాగే మెడికల్ దుకాణాలలో ఫార్మసిస్టులు లేకుండానే రోగులకు మందులు విక్రయిస్తున్నారనే విషయం డ్రగ్ అధికారుల తనిఖీలో వెలుగు చూసింది. దీంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్యా అధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంధ్యా కిరణ్మయి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై నిరంతరం ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కొనసాగుతున్న 52 ప్రయవేట్ ఆస్పత్రులు, 20 క్లీనిక్లు, 137 ల్యాబ్లు, 22 డెంటల్ క్లీనిక్లు, 2 ఫిజియోథెరపీ క్లీనిక్లు, 5 కంటి ఆస్పత్రుల అనుమతులు, మౌలిక వసతులు తదితర అంశాలపై నివేదికను అందజేయాల్సిందిగా ఆస్పత్రి నిర్వాహకులకు సూచించారు. రోగుల వివరాలు.. సేవలపై ఆరా మందుల రికార్డులు పరిశీలన రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రి సీజ్ నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై చర్యలు -
ఎత్తిపోతలకు గ్రహణం
కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడటం లేదు. ప్రాజెక్టు ద్వారా నీటి పంపింగ్కు తరచుగా బ్రేకులు పడుతున్నాయి. ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెబుతున్న అధికారులు.. నీటి ఎత్తిపోతలు మాత్రం ఇప్పట్లో జరగవని తేల్చి చెబుతున్నారు. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో నీటి ఎత్తిపోతలపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం అరకొరగా బడ్జెట్ కేటాయిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదనే ప్రచారం కూడా ఉంది. మూడేళ్ల క్రితం మొదటి పంపుతో.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎల్లూరు సమీపంలోని పంప్హౌజ్లో ఒక మోటారు ఆన్చేసి.. నీటి ఎత్తిపోతలు చేపట్టారు. రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. మరుసటి ఏడాది తాగునీటి అవసరాల కోసం నాలుగు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసుకునేందుకు అనుమతులు లభించాయి. కానీ పంప్హౌజ్లో మోటార్ల బిగింపు, సివిల్ వర్క్స్, విద్యుత్ సరఫరా పనులు పెండింగ్లో ఉన్నాయనే కారణాలతో నేటి వరకు రెండో దఫా ఎత్తిపోతలు జరగడం లేదు. నాలుగు మోటార్ల బిగింపు.. ప్రాజెక్టులోని మొదటి లిఫ్ట్ అయిన ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటివరకు నాలుగు మోటార్లు బిగించారు. మూడు మోటార్ల పనులన్నీ పూర్తయ్యాయి. మరో మోటారు ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. లిఫ్టులో మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. సివిల్ వర్క్స్ దాదాపుగా పూర్తిచేశారు. మెకానికల్, సిస్టమ్ వర్క్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. డెలివరీ మెయిన్స్ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు వద్ద నిర్మించిన 400/11 కేవీ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ పనులు ఆలస్యం అవుతుండటమే నీటి ఎత్తిపోతలు జరగకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేఎల్ఐ ద్వారా రిజర్వాయర్లోకి నీరు.. పాలమూరు ప్రాజెక్టులో నార్లాపూర్ రిజర్వాయర్ మొదటిది కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. తర్వాతి కాలంలో పాలమూరు ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు సాగకపోవడంతో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోసే నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి మళ్లిస్తున్నారు. కేఎల్ఐలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటి మళ్లింపునకు వీలుగా ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేశారు. తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడొద్దనే ఉద్దేశంతోనే నీటి మళ్లింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల మేరకు నీటి నిల్వ ఉంది. కొలిక్కిరానినిర్వాసితుల సమస్యలు.. నార్లాపూర్ రిజర్వాయర్లో అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీరిలో కొంతమందికి సరైన పరిహారం అందలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తేనే.. తాము ఇళ్లు ఖాళీ చేస్తామని కొందరు నిర్వాసితులు మొండికేశారు. ఈ సమస్యను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వారికి పరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసేవరకు నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని నింపలేమని.. నీటిని అధికంగా నింపితే నిర్వాసితుల ఇళ్లు ముంపునకు గురవుతాయని అధికారులు చెబుతున్నారు. సీజన్ ముగిసేలోగా ఎత్తిపోస్తాం నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. ఈ రిజర్వాయర్లోకి మరిన్ని నీళ్లను ఎత్తిపోస్తే నిర్వాసితుల ఇళ్లు మునిగిపోతాయి. తమకు పరిహారం సమస్య పరిష్కారమైతేనే ఇళ్లు ఖాళీ చేస్తామంటున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఒకవేళ ఎత్తిపోసే నీళ్లను ఏదుల రిజర్వాయర్కు తరలించాలంటే కాల్వ పనులు పూర్తికావాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఆయా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎత్తిపోతలను వాయిదా వేస్తూ వస్తున్నాం. ఈ ఏడాది సీజన్ ముగిసేలోగా కచ్చితంగా ఎత్తిపోతలు చేపడతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ అసంపూర్తి కాల్వలతో.. నార్లాపూర్ రిజర్వాయర్లో ప్రస్తుతం ఉన్న నీటిని ఏదుల రిజర్వాయర్కు పారించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కుడికిళ్ల, తీర్నంపల్లి శివార్లలో ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నిధుల లేమి కారణంగా కాల్వ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. ఈ క్రమంలో కాల్వ పనులను పూర్తిచేసేందుకు కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100కోట్లకు పైగా నిధులను కేటాయించింది. కానీ పనులు మాత్రం ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఈ కాల్వ పనులు పూర్తయితేనే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించవచ్చు. అప్పటివరకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పాలమూరు ప్రాజెక్టులో వాయిదా పడుతూ వస్తున్న నీటి పంపింగ్ పెండింగ్ పనులతోనే సమస్య కేఎల్ఐ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్కు నీటి మళ్లింపు అక్కడి నుంచి ఏదులకు నీటిని తరలించేందుకు అడ్డంకులు -
ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు
గద్వాల: తెలంగాణ సీఎం కప్ క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల, మున్సిపాలిటీ స్థాయి, వచ్చే నెల 3 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. 9 నుంచి 12వ తేదీవ వరకు జిల్లా స్థాయిలో, 20 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కప్ క్రీడల నిర్వహణతో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెరగడంతో పాటు క్రీడాస్ఫూర్తి కలుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, ఆధార్కార్డు జతపర్చాలన్నారు. పూర్తి వివరాలకు 98854 79896, 94415 90842, 96039 96900 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీవైఎస్ఓ కృష్ణయ్య, ఎంపీడీఓలు, పీడీలు, పీఈటీలు ఉన్నారు. -
శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కీలకం
వనపర్తి: పోలీసు వృత్తిలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అత్యంత కీలకమని.. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా, సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి సమన్వయంతో కూడిన పనితీరును అలవరుస్తాయని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు క్రీడా మైదానంలో జోగుళాంబ జోన్–7 జోనల్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్–2026 ఎంపికలను నారాయణపేట జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్తో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు బలగాల శక్తి కేవలం ఆయుధాల్లోనే కాకుండా క్రీడా మైదానాల్లోనూ ప్రతిఫలిస్తుందని తెలిపారు. జోనల్ సెలక్షన్న్స్ ద్వారా ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని, జోగుళాంబ జోన్–7 పేరు ప్రతిష్టలను మరింత పెంచేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శాసీ్త్రయంగా, నిష్పక్షపాతంగా ఎంపికలు నిర్వహించామని, క్రీడల్లో ప్రతిభ కనబర్చే ప్రతి పోలీసు యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పోటీల్లో వనపర్తి, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. 100, 200, 400, 800, 1600 మీటర్ల పరుగు పందెం, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగు పందెం, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, ఖో–ఖో, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, షటిల్ తదితర 31 క్రీడల్లో మొత్తం 370 మంది పోలీసులు పోటీపడ్డారు. ప్రతిభ కనబర్చిన 90 మంది క్రీడాకారులు ఫిబ్రవరి 2 నుంచి హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, సీఐ కృష్ణయ్య, వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, వెంకటేష్, విజయభాస్కర్, కృషయ్య, నర్సింహ, రాఘవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఐదు జిల్లాల ఎస్ఐలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు
గద్వాల: దివ్యాంగులకు ఉచితంగా అందించే సహాయ ఉపకరణాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఆర్ చప్పల్స్, స్మార్ట్ కేన్స్, వాకింగ్ స్టిక్స్, క్రచెస్, హియరింగ్ ఎయిడ్లు, వీల్ చైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ట్యాబ్ లు, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా httpr.obmm r.cff. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు సదరం సర్టిఫికెట్, ఆధార్, విద్యార్హత పత్రాలు, ఆదాయం, రేషన్కార్డు జిరాక్స్ జతచేసి కలెక్టరేట్లో ని మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో 31వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు. వివరాలకు 77998 66325 నంబర్ను సంప్రదించాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: జిల్లాలోని మహిళా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం కంపెనీలో కాంట్రాక్టు విధానంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్లోని బాలబ్రహ్మేశ్వర ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో సీఈఓ, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఈఓ పోస్టుకు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా మార్కెటింగ్ లేదా ఎంబీఏ మార్కెటింగ్, బీబీఏ ఏదైనా విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ప్రతినెలా జీతం రూ.15వేలు ఉంటుందన్నారు. అదే విధంగా అకౌంటెంట్ పోస్టుకు బీకాం విద్యార్హత ఉండాలని, జీతం రూ. 6వేలు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 87909 90641, 87909 90593 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు కేటీదొడ్డి: మీసేవ కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో పనిచేయాలని.. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూళ్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ–జిల్లా మేనేజర్ (ఈడీఎం) శివ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు నందిన్నెలోని మీసేవ, ఆధార్ నమోదు కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో సిటిజన్ చార్ట్, నోటీస్ బోర్డులను పరిశీలించడంతో పాటు సర్టిఫికెట్ల దరఖాస్తు కోసం వసూళ్లు చేస్తున్న రుసుముపై ఆరా తీశారు. మీసేవ కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈడీఎం మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించడమే మీసేవ కేంద్రాల లక్ష్యమని అన్నారు. కేంద్రాల నిర్వాహకులు ఆన్లైన్ లవాదేవీలను రికార్డు చేయాలని సూచించారు. ఈడీఎం వెంట డీఎం సుధాకర్రెడ్డి, మీసేవ కేంద్రాల నిర్వాహకులు సురేశ్, మౌలాలి, వెంకటేశ్, రవిబాబు ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి గద్వాల క్రైం: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మంగళవారం గద్వాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిరాజు, రాంనాథ్, పరుశరాములు, సూరిబాబు, సురేశ్, శ్రీధర్గౌడ్, గోవిందరాజు, నాగరాజు పాల్గొన్నారు. 23న సామూహిక అక్షరాభ్యాసం ఎర్రవల్లి: వసంత పంచమిని పురస్కరించుకొని ఈ నెల 23న బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞానసరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనే వారు రూ.వెయ్యి చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. -
సామాజిక సేవలు అభినందనీయం
● వనపర్తిలో ఎస్బీఐ రీజనల్ కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయిస్తాం ● నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అలంపూర్: ఎస్బీఐ సామాజిక సేవలు అభినందనీయమని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. మానవపాడు మండలంలో ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులుశెట్టి దత్తత తీసుకున్న పెద్దపోతులపాడు, చిన్నపోతులపాడు, చెన్నిపాడు, బొంకూరు, గోకులపాడు గ్రామాల్లో మంగళవారం ఎస్బీఐ ఫౌండేషన్, భవిష్య భారత్ స్వచ్ఛంధ సంస్థ అధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించగా.. ఎంపీతో పాటు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే విజయుడు, ఎస్బీఐ సీజీఎం రాధాకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ముందుగా పెద్ద పోతులపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో కల్నల్ సంతోష్బాబు యువ శిక్షణ కేంద్రంలో క్రీడలు, ఇతర అంశాలపై శిక్షణ తీసుకుంటున్న యువతతో అతిథులు మాట్లాడారు. అనంతరం సంచార పశువైద్య సేవలు అందించే శాలిహోత్ర ఎక్స్ప్రెస్ వాహనం, వ్యర్థాల సేకరణకు వినియోగించే స్వచ్ఛత సాథీ వాహనాన్ని ప్రారంభించారు. చెన్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించి.. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. పెద్దపోతులపాడు, చిన్నపోతులపాడు, చెన్నిపాడు, బొంకూరు, గోకులపాడు గ్రామాల్లో రూ. 4 కోట్లు వెచ్చించి.. విద్య, వైద్య, ఇతర రంగాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులుశెట్టి స్వగ్రామం పెద్దపోతులపాడుతో పాటు చుట్టుపక్కల మరో నాలుగు గ్రామాల్లోనూ ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ స్వగ్రామంలోనూ ఎస్బీఐ ఫౌండేషన్ సేవలు ప్రారంభించాలని కోరారు. ధరూరు, ఎరవ్రల్లి చౌరస్తాలో కొత్తగా ఎస్బీఐ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వనపర్తిలో ఎస్బీఐ రీజనల్ కేంద్రం ఏర్పాటుకు స్థలం కావాలని చైర్మన్ అడిగితే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు. త్వరలోనే రూ. 25కోట్ల విలువైన స్థలాన్ని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ● కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లా నుంచి ఎస్బీఐ చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పెద్దపోతులపాడులో పాఠశాల అభివృద్ధితో పాటు స్థానిక యువత ఆర్మీ, పోలీస్ ఉద్యోగాల్లో ప్రతిభ చాటేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించేందుకు రూ. 12లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ● ఎస్బీఐ సీజీఎం రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఎస్బీఐ చైర్మన్ స్వగ్రామంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, భవిష్య భారత్ స్వచ్ఛంద సేవాసంస్థ మేనేజింగ్ ట్రస్టి హరిప్రసాద్, ఎస్బీఐ ఫౌండేషన్ సీఈఓ స్వపన్ ధర్, ఫౌండేషన్ అధ్యక్షుడు జగన్నాథ్ సాహో, రీజినల్ మేనేజర్ సునీత, భవిష్య భారత్ డైరెక్టర్ హేమంత్ కుమార్, గ్రామసేవ కోఆర్డినేటర్ సిద్ధ లింగేష్, సర్పంచ్ రజాక్ పాల్గొన్నారు. -
ఎవరిదో పైచేయి..!
కాంగి‘రేసు’లో పురపాలక పీఠాల లొల్లి ఇద్దరు నుంచి ఆరుగురు వరకు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందు లో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మిన హా మిగిలిన 19 పురపాలికల్లో ఎన్నికలు జరగనున్నా యి. కార్పొరేషన్లో 60 డివిజన్లు, మిగతా మున్సిపాలిటీల్లో 310 వార్డులు ఉండగా.. ఒక్క దాంట్లో కనీ సం ఇద్దరు.. అధికంగా ఆరుగురు వరకు ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో పోటాపోటీ నెలకొంది. అదేవిధంగా మేయర్, చైర్మన్ పదవులకూ ప్రధానంగా ఇద్దరు నుంచి నలుగురు వర కు ద్వితీయ శ్రేణి ముఖ్య నాయకులు ఆశలు పెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సి‘పోల్స్శ్రీకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికలకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరులోని నగర, పట్టణాల్లో రాజకీయ సందడి ఊపందుకుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుండడంతో నాలుగైదు రోజుల్లోపే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు డివిజన్లు,వార్డుల పరిధిలో కార్పొరేటర్లు,కౌన్సిలర్ల ఆశావహులు యువతను వెంటేసుకుని విందులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మేయర్, చైర్మన్, చైర్పర్సన్ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్లో పలువురి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి రాగా.. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మేయర్/చైర్మన్ గిరి కోసం ఆశావహుల తీవ్ర ఒత్తిళ్లు కార్పొరేటర్/కౌన్సిలర్ పదవులకు సైతం.. వర్గాల వారీగా చీలిన ఎమ్మెల్యేలు, డీసీసీ, కీలక నేతలు తమ అనుచరులకు దక్కేలా ఎవరికి వారు పావులు రసవత్తరంగా మారిన గ్రూప్ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం లోకసభ స్థానాల వారీగా ఇన్చార్జీలను నియమించిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్కర్నూల్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించింది. వీరు ఆయా మున్సిపాలిటీల పరిధిలో నేతలను సమన్వయం చేసుకుంటూ గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా కసరత్తు చేపట్టాలి. ఆయా మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఆశావహులు అధికంగా ఉండడంతో పాటు గ్రూప్ రాజకీయాలు వారికి గుదిబండగా మారాయి. సరైన వ్యూహంతో ముందుకు సాగకపోతే పంచాయతీ ఎన్నికల మాదిరిగా రెబల్స్ బరిలో నిలిచే అవకాశముందని పార్టీలోని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వంతెన నిర్మాణంతో తగ్గనున్న దూరం
గద్వాల/ఆత్మకూర్: జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్యనున్న కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణంతో ఆయా ప్రాంతాల మధ్య దూరం తగ్గనుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆయన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కార్యకర్తలతో కలిసి కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు, తాత్కాలిక రోడ్డుపై జూరాల పుష్కరఘాట్ నుంచి కొత్తపల్లి శివారు వరకు నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలంలోని పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లావాసి కావడం అదృష్టమని, అడిగిన వెంటనే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని వివరించారు. నిర్మాణం పూర్తయితే వనపర్తి నుంచి మంత్రాలయం, ఎమ్మిగనూరు వెళ్లే ప్రయాణికులకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గునుందని వివరించారు. ఆత్మకూరు నుంచి గద్వాలకు వెళ్లాలంటే 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉందని.. బ్రిడ్జి పూర్తయితే కేవలం 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చన్నారు. త్వరలో నాలుగు వరుసల రహదారి రాబోతుందని వెల్లడించారు. ఏడాదిన్నరలో పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, గద్వాల మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు పటేల్ ప్రభాకర్రెడ్డి, అశోక్, రాజశేఖర్, సుజాత, పరమేష్, తులసీరాజ్, నల్లగొండ శ్రీను పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
ప్రభుత్వ బడులు బలోపేతం
అలంపూర్: స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మి అన్నారు. అలంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం అలై ఎన్జీఓ ప్రతినిధులు, పాప్ సింగర్ స్మిత, సుశీలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అలై ఎన్జీఓ ఆధ్వర్యంలో తొమ్మిది పాఠశాలల్లో రూ. 30లక్షల వ్యయంతో మధ్యాహ్న భోజన వంట గదుల ఆధునికీకరించినట్లు తెలిపారు. వంట గదిలో టైల్స్, ఫ్యాన్లు, కిచెన్ కట్టలు, ఫ్లోర్ రిపేర్, ప్రతి పాఠశాలకు ఒక సిలిండర్, గ్యాస్ స్టవ్, కుర్చీలు, విద్యార్థులకు ప్లేట్లు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సేక్టోరియల్ అధికారి అంపయ్య, ఎంఈఓ అశోక్ కుమార్, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, జీహెచ్ఎం అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి
గద్వాల(మల్దకల్): ప్రజలందరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతిస్వరూపానంద స్వామీజీ అన్నారు. మంగళవారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో విశేష పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా వాసవీ కన్యకా పరమేశ్వరిదేవిని స్వామీజీ దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు వేద ప్రవచనాలు వినిపించారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజలు సన్మార్గంలో పయనించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలు వీడి.. భగవంతుడిని ఆరాధించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, చంద్రశేఖర్రావు, నరేందర్, పద్మారెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, వెంకటేశ్, రాజు, శ్రీనివాస్శెట్టి పాల్గొన్నారు -
విమాన ప్రయాణం హామీని నెరవేర్చిన హ్యాట్రిక్ సర్పంచ్
జోగులాంబ గద్వాల జిల్లా: ముచ్చట గా మూడోసారి సర్పంచ్గా గెలిచిన వ్యక్తి గ్రామంలోని 200 మందిని విమానంలో తిరుపతి తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నా యి.. వికారాబాద్ జిల్లా రాకంచర్ల గ్రామ సర్పంచ్ కమ్లీబాయి, పెంటయ్య దంపతులు తాము ఎన్నికల్లో గెలిస్తే విమానంలో తిరుపతి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సోమవారం సర్పంచ్ భర్త పెంటయ్య పుట్టినరోజు కావడంతో నాలుగు బస్సుల్లో హైదరాబాద్ బయలుదేరారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతి చేరుకోనున్నార -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
గద్వాల: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ.. అనేక పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 147 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆ తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై న తాను అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రధానంగా గద్వాల పట్టణంలోని ప్రతి వార్డులో సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలతో పాటు పార్కులు, సెంట్రల్ లైటింగ్ వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు కాగా.. ఇందులో గద్వాల పట్టణానికి 515 ఇళ్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇళ్లురాని వాళ్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని... ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్య క్రమంలో నాయకులు జంబు రామన్గౌడ్, గడ్డం కృష్ణారెడ్డి, చెన్నయ్య, శ్రీకాంత్, బాబర్ పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి
మానవపాడు: మండల రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆర్డీఓ అలివేల అన్నారు. సోమవారం మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మానవపాడు: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్వయం సహాయక మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోందని అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి మండలాలకు చెందిన మహిళా సంఘాల బాధ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రూ. 40వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం ట్రైనర్ రఘు పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో డీపీఎం రుతమ్మ, ఏపీఎంలు భీమన్న, సునంద, మారుతమ్మ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,500 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 440 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,500, కనిష్టంగా రూ. 4,302, సరాసరి రూ. 7,000 ధరలు వచ్చాయి. అదే విధంగా 9 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,062, కనిష్టంగా రూ. 5,802, సరాసరి రూ.6053 ధరలు లభించాయి. 250 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,949, కనిష్టంగా రూ. 5,039, సరాసరి రూ. 6,939 ధరలు వచ్చాయి. 40 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,389, కనిష్టంగా రూ. 1,710, సరాసరి రూ. 2,389 ధరలు లభించాయి. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకం
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ ఎర్రవల్లి: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్లో జిల్లాలోని సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడుతో పాటు కలెక్టర్ హాజరై మాట్లాడారు. సర్పంచులు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అన్ని నియమాలు, విధులు, బడ్జెట్, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ పథకాల వినియోగం, అధికారుల సంప్రదింపు విధానం వంటి అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. సర్పంచుల సహకారంతో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ప్రాథమిక విద్యకు బలమైన పునాదులుగా మార్చాలన్నారు. నీతి అయోగ్లో గట్టు మండలం వెనుకబడిన ప్రాంతంగా ఉన్నప్పటికీ.. చిత్తశుద్ధితో పనిచేసి రూ.కోటి నగదు బహుమతి సాధించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సర్పంచులదేనని అన్నారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రతి వారం సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ● ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గ్రామాల్లో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను విజయవంతంగా చేపట్టామని.. రాబోయే రోజుల్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సర్పంచులకు సూచించారు. -
సాగునీటి వృథా..!
●అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లకు మూడేళ్ల కిందట మరమ్మతు చేపట్టారు. షట్టర్లు మూసినా లీకేజీల కారణంగా నీటి ప్రవాహం నిలువరించలేని పరిస్థితి నెలకొంది. కాల్వ వెంట వారంలో మూడు రోజుల పాటు సుమారు 60 క్యూసెక్కుల నీరు వృథాగా పారుతోంది. దీంతో ప్రాజెక్టులోని నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయంలో 4.264 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో 20 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని తాగునీటి పథకాలకు నీటిని అందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జలాశయం ప్రధాన గేట్లతో పాటు కుడి, ఎడమ కాల్వల షట్టర్ల లీకేజీలతో నీరు మరింత వృథా అవుతోందని ఆయకట్టు రైతులతో పాటు ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.5 లక్షల వ్యయంతో.. సుమారు రూ.5 లక్షలతో జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ షట్టర్ల మరమ్మతుతో పాటు రబ్బర్ల బిగింపు పనులు మూడేళ్ల కిందట చేపట్టారు. సదరు కాంట్రాక్టర్ రెండేళ్ల పాటు పనులు చేపట్టగా షట్టర్ల మరమ్మతు పూర్తయిందని చేతులు దులుపుకొన్న అధికారులు లీకేజీలు ఎందుకు ఏర్పడ్డాయన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. షట్టర్లకు చిన్నపాటి కప్లింగ్ జాయింట్ బోల్ట్ను బిగిస్తే నీటి వృథాను నిలువరించవచ్చని అధికారులకు తెలిసినా నేటి వరకు ఆ పనులు చేపట్టడం లేదు. చిన్న బోల్ట్ బిగించాలని.. అదికూడా కార్యాలయంలో ఉందని త్వరలోనే బిగిస్తామని చెప్పడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నీటిలీకేజీ నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జూరాల ఎడమకాల్వ షట్టర్లకు లీకేజీలు మూసినా ఆగని ప్రవాహం మూడేళ్ల కిందట మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం జలాశయంలో రోజురోజుకు తగ్గుతున్న నీటిమట్టం వారబందీ విధానంలో.. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టుకు వారబందీ విధానంలో రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున వారంలో 4 రోజుల పాటు సాగునీటిని వదులుతున్నారు. మిగిలిన మూడు రోజులు పూర్తిస్థాయిలో మూసి నీటి సరఫరాను నిలిపివేస్తారు. కాని ఆ సమయంలోనూ లీకేజీలతో రోజుకు 60 క్యూసెక్కుల నుంచి 70 క్యూసెక్కుల వరకు నీరు వృథాగా కాల్వలో పారుతుండటంతో జలాశయంలో నీటిమట్టం తగ్గి వేసవిలో ఆయకట్టుకు సాగునీటి కష్టాలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. -
సిబ్బంది నిర్లక్ష్యం..
జూరాల ఎడమ కాల్వకు సాగునీటి సరఫరాను నిలిపిన రోజుల్లో నీటి వృథాను అధికారులు అరికట్టలేక పోతున్నారు. కళ్ల ముందే రోజు 60 క్యూసెక్కులకు పైగా వృథాగా పారుతున్నా సిబ్బంది చూసీచూడనట్లు మౌనం వహిస్తున్నారు. షట్టర్లకు బోల్టా బిగించడంలో అలసత్వం చూపుతున్నారు. – వెంకటేష్, నందిమళ్ల చర్యలు తీసుకుంటాం.. జూరాల ఎడమ కాల్వ షట్టర్ల లీకేజీలతో నీరు వృథాగా కాల్వలో పారుతోంది. వారబందీ విధానంలో వారంలో 4 రోజుల పాటు 2 వేల క్యూసెక్కుల సాగునీరు ఆయకట్టుకు వదులుతున్నాం. లీకేజీల నియంత్రణకు చర్యలు చేపడతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల జలాశయం ఎడమకాల్వ విభాగం -
వ్యూహాలకు పదును
మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు గద్వాల: మున్సిపల్ వార్డులు, చైర్మన్ స్థానాలు ఏ సామాజిక వర్గాలకు కేటాయించారో తేలిపోయింది. ఇక ప్రత్యేక్ష పోరే మిగలడంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఎన్నికల వేడి పెరిగింది. మున్సిపాలిటీల్లో తమ బలాబలాలను నిరూపించుకునేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వార్డుల్లో గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. రిజర్వేషన్ల ప్రక్రియ రొటేషన్ విధానంలో పూర్తికావడం.. మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించడం వంటి అంశాలతో గతంలో ఉన్న వార్డులు, మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పాతవారికే అనుకూలంగా మారగా.. మరికొన్ని చోట్ల ప్రతికూలంగా మారాయి. దీంతో బల్దియా పీఠాలను కై వసం చేసుకునే దిశగా ప్రధానపార్టీలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బరిలో దిగాలనుకునే ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గద్వాలపైనే నేతల దృష్టి.. జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీపైనే ఆయా పార్టీల ప్రధాన నేతలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎంపీ డీకే అరుణ, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత దృష్టిసారించారు. ఇక్కడ పార్టీల తరఫున కంటే ప్రధాన నేతలే బల్దియా పీఠాన్ని కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతూ.. ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. వార్డుల్లో రిజర్వేషన్ల మేరకు తమ బలాలు, బలహీనతలను లెక్కలు వేసుకుంటున్నారు. బలంగా ఉన్న చోట గెలుపు అభ్యర్థుల పలుకుబడిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ పోల్ మ్యానేజ్మెంట్ ఎలా చేయాలో చర్చలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈసారి పోటీ తీవ్రంగా ఉండటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఓటర్లకు ఏ స్థాయిలో తాయిళాలు వేస్తారో.. లిక్కర్ ఏరులైపారుతుందోనని రాజకీయ వర్గాలు లెక్కలు వేసుకుంటుండటం గమనార్హం. నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు జిల్లాలో మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ గద్వాల మున్సిపాలిటీపై ప్రధాన నేతల దృష్టి -
చదువుతోనే సమాజంలో మార్పు
నాగర్కర్నూల్: చదువుకుంటేనే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన ఎంపీ మల్లు రవి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, అచ్చంపేట, నాగర్కర్నూల్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డితో కలిసితో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే నాగర్కర్నూల్ పట్టణంలోని 245 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.7.80 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. అనంతరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప న, ఉపాధ్యాయుల నియామకం, ఆధునిక సాంకేతికత విద్య తదితరవి అమలు చేస్తున్నామన్నారు. విద్యతోనే భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయగలమని, అదే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహ దం చేస్తుందన్నారు. అలాగే ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నామని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాలు నిర్మించామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు స్థాపించామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థులకు సూచనలు మంత్రి దామోదర రాజనర్సింహ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు.. ఏ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలా సిద్ధం కా వాలన్న అంశాలపై మంత్రి సూచనలు చేశారు. క్ర మశిక్షణ, నిరంతర శ్రమ, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం సాధ్యమని పేర్కొన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే కొనసాగుతుందన్నారు. విద్య, వైద్యానికే మా ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్కర్నూల్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
కొద్దిరోజుల్లో ఏర్పాటు చేస్తాం..
కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం. గద్వాల, అయిజలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. వీలైనంత త్వరగా కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఈసారి కూడా నష్టమే.. గడిచిన రెండేళ్లుగా కంది పంటతో లాభం రాలేదు. ఈసారి నాలుగు ఎకరాల్లో వేశాను. 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. రూ.వేలకు వేలు పెట్టుబడులు అయితే.. క్వింటాల్కు రూ.6,500 మాత్రమే రావడంతో నష్టపోవాల్సి వచ్చింది. – హన్మంతు, కందిరైతు, గద్వాల ధరలు పెద్దగా రాలేవు.. ఎనిమిది ఎకరాల్లో కంది పంట వేశాను. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక విపరీతంగా తెగుళ్లు వచ్చాయి. పురుగు మందులకు చాలా ఖర్చు అయ్యింది. కంది ధరలు కూడా పెద్దగా రాలేదు. క్వింటాల్ రూ.8వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుంది. – చిన్న మద్దిలేటి, రైతు, చెన్నిపాడు, మానవపాడు మండలం ● -
పకడ్బందీగా నిర్వహిస్తాం..
జిల్లాలో సోమవారం నుంచి జంతుగణన పకడ్బందీగా చేపడుతాం. ఇందుకు గాను 214 బీట్లలో తమ సిబ్బందితోపాటు వలంటీర్లను నియమించాం. వీరికి తోడుగా బేస్ క్యాంపు సిబ్బంది, వాచర్లు ఉంటారు. డీఆర్ఓలు, బీట్ అధికారులు, వలంటీర్లు బీట్కు ఇద్దరు చొప్పున లెక్కిస్తారు. మొదటి మూడు రోజులు మాంసాహార, తర్వాత మూడు రోజులు శాకాహార జంతువుల గణన ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు లెక్కించి ఆ తర్వాత యాప్లో నమోదు చేస్తారు. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్● -
ఆశావహులకు చుక్కెదురు
మరికొందరికి అనుకూలం.. తాజా రిజర్వేషన్లు మరికొంత మందికి అనుకూలంగా ఉన్నాయి. జనరల్, బీసీ జనరల్కు రిజర్వు అయిన వార్డులలో మాజీలకు ఇప్పుడు మరోసారి అవకాశం ఉంది. దీంతో వారంతా ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. 3, 7, 13, 17, 19, 20, 21, 26, 28, 35వ వార్డులు కొంతమందికి అనుకూలంగా మారాయి. కొన్ని మినహా మిగిలిన వార్డులు గతంలో మాదిరిగానే మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాంటి వార్డులలో గతంలో బరిలో దిగిన వారే మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. కొన్ని వార్డులలో మాత్రమే నాయకులకు కొంత ఇబ్బందిగా మారింది. 16, 18, 22, 32, 34వ వార్డులలో వారి సతీమణులు, కుటుంబ సభ్యులను పోటీలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. గద్వాల టౌన్: మున్సిపాలిటీలో మారిన రిజర్వేషన్లతో కొంతమంది ఔత్సాహికులు నిరుత్సాహానికి గురయ్యారు. తాజామాజీలకు కూడా భంగపాటు ఎదురైంది. ఎప్పటి నుంచో కౌన్సిలర్ పదవులపై ఆశలు పెంచుకున్న వారి ఆశలపై రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఐదేళ్లపాటు పదవులు అనుభవించిన కొంతమంది మాజీలకు ఇప్పుడు పోటీ చేసేందుకు రిజర్వేషన్లు అడ్డువచ్చాయి. దీంతో తెరచాటు రాజకీయా లకు పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంచనాలు తారుమారు.. గద్వాల మున్సిపాలిటీలో 1, 4, 6, 31 వార్డులు ఎస్సీలకు, 27వ వార్డు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేయాలనుకున్న తాజా మాజీలతోపాటు ఔత్సాహికులకు చుక్కెదురైనట్లు అయ్యింది. ఇది ‘మా తలరాత’ అంటూ కొంతమంది పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంచనాలు మారడంతో మరికొందరు పక్క వార్డులలో పోటీ చేయడానికి సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది. జనరల్ స్థానాలైన 4, 5, 30, 36వ వార్డులలో ఇతరులు పోటీ చేయడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఇతర వార్డులలో పోటీ చేస్తే అక్కడి స్థానిక మాజీలు, ఆశావహులతో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా ఉన్న తమను కాదని ఇతర వార్డులకు చెందిన నాయకులను పోటీకి దించితే తమ సత్తా చాటుతామని ఇప్పటికే సొంత పార్టీల నాయకులే హెచ్చరిస్తుండటం విశేషం. ఒకవేళ సాహసం చేసి ఇతర వార్డులలో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనే లెక్కలు వేసుకుంటూనే భయంతో జంకుతున్నారు. బలమైన నాయకులేరి? ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయిన వార్డులలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన బలమైన నాయకులు కనిపించడం లేదు. దీంతో ఇతర వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు, నాయకులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది మాజీ కౌన్సిలర్లు ఇప్పటికే ఒక దఫా వార్డులలో పర్యటించి.. తామే ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నామని పరిచయం చేసుకున్నారు. అయితే ఓటర్ల నుంచి సరైన స్పందన రాకపోవడంతో వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎస్సీ ఓటర్లు బలంగా ఉన్న వార్డులు జనరల్, బీసీలకు రిజర్వు అయ్యాయి. ఇలా జనరల్ అయిన 5, 14వ వార్డులలో ఎస్సీలే పోటీ చేయడానికి సిద్ధమవుతుండగా.. ఇక్కడ ఇతర వర్గాలు పోటీ చేయడానికి జంకుతున్నారు. రిజర్వేషన్ల తకరారుతో మారిన నాయకుల తలరాతలు -
నారసింహుడి రథోత్సవం
● కనులపండువగా సాగిన లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ● సంప్రదాయబద్ధంగా వేడుకను నిర్వహించిన సురభి రాజవంశీయులు ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ● జనసంద్రంగా మారిన శ్రీవారి సముద్రకట్ట, జాతర ప్రాంగణం ● స్వామివారి నామస్మరణతో పులకించిన సింగోటం – కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్– వివరాలు 8లో.. -
వైభవంగా ఆరాధనోత్సవాలు
మల్దకల్: ఆదిశిలాక్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పురంధరదాసుల ఆరాధనోత్సవాలు వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు దీరేంద్రదాసు, మధుసూదనాచారి, రవిచారి, శ్రావణ్ పురంధరదాసుల విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్వామివారి ఉత్సవమూర్తితో రథోత్సవం నిర్వహించారు. అలాగే వేంకటేశ్వరస్వామి హరికథను ఆంజనేయులు భాగవతార్ వినిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, బాబురావు, దీరేంద్రదాసు, చంద్రశేఖర్రావు, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి, నరేందర్, చంద్రశేఖర్రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలకు తరలిరండి గట్టు: హైదరాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఈ నెల 25 నుంచి 28 వరకు ఐద్వా జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి నర్మద అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐద్వా 14వ జాతీయ మహాసభలకు సంబంధించి వాల్పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కుల సాధనకు నిరంతరం కృషిచేస్తూ దేశవ్యాప్త నిర్మాణం ఉన్న ఐద్వా ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్ వద్ద నిర్వహించే మహాసభలకు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పుణ్యవతి, సుధాసుందర్, మల్లు లక్ష్మి, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ధూప, దీప, నైవేద్య పథకంపై దుష్ప్రచారం మానుకోవాలి స్టేషన్ మహబూబ్నగర్: ధూప, దీప నైవేద్య పథకం, అర్చక సంఘంపై చేస్తున్న దుష్ప్ర చారం మానుకోవాలని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జి.రవికుమార్, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జంగం మహేష్, కుమారస్వామి తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు అర్చకులు పెద్ద మనుషులుగా ప్రచారం చేసుకుంటూ, వారి ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తూ పెత్తనం చేయాలనుకుంటున్నారని అన్నారు. ధూప, దీప నైవేద్య అర్చక సంఘంపై, అధ్యక్ష, కార్యవర్గంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. తెలంగాణ క్షేమం కోసం ధూప, దీప నైవేద్య అర్చకుల సహకారంతో ప్రతి ఏడాది సంఘం ద్వారా యజ్ఞ, యాగాది, క్రతువులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయ వ్యవస్థను కాపాడటం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం డీడీఎన్ అర్చకులకు ఉద్యోగ భద్రత, వేతన పెంపుదల చేస్తుందనే విశ్వాసం ఉందన్నారు. -
చేనేత రుణమాఫీకి బ్రేక్!
అమరచింత యూనియన్ బ్యాంక్లో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. ఏటా వడ్డీ చెల్లిస్తూ రుణాన్ని పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేనేత రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో చెల్లించలేదు. ఇప్పుడు ఏడాది అవుతుందని.. వడ్డీ చెల్లించి పునరుద్ధరించుకోవాలని మేనేజర్ ఒత్తిడి చేస్తున్నారు. డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. – కొంకతి శకుంతలమ్మ, చేనేత కార్మికురాలు, అమరచింత రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీపై ప్రకటన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా.. నేటికీ సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై బ్యాంకు మేనేజర్ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం త్వరగా రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసి నేతన్నలను ఆదుకోవాలి. – వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, చేనేత సహకార సంఘం, అమరచింత అమరచింత: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా గతేడాది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించారు. 16 నెలలు గడుస్తున్నా.. నేటి వరకు సగం నిధులు మాత్రమే విడుదల చేసి వాటిని కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయొద్దని ఆదేశాలిచ్చింది. పూర్తిస్థాయిలో విడుదల చేసిన తర్వాతే కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో చెల్లించాలని చెప్పడంతో చేనేత రుణమాఫీ ప్రక్రియ నిలిచిపోయింది. రుణమాఫీకి అర్హులైన వారి వివరాలను చేనేత జౌళిశాఖ అధికారులు బ్యాంకర్ల నుంచి సేకరించి నివేదికను రాష్ట్ర కమిటీకి అందజేసినా.. నిధులు మాత్రం జమకాలేదు. అప్పుడు.. ఇప్పుడంటూ ఏడాదిన్నరగా కాలం వెళ్లదీస్తున్నారని, బ్యాంకర్లు మాత్రం తీసుకున్న రుణం చెల్లించాలని ఒత్తిడి పెంచడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. చేనేత రుణాలు తీసుకున్న వారి ఖాతాల లావాదేవీలను అమరచింత యూనియన్ బ్యాంక్ మేనేజర్ నిలిపివేయడంతో ఆయన తీరును తప్పుబడుతూ బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రుణమాఫీ నిధులు వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,321 మంది చేనేత కార్మికులు రుణమాఫీకి అర్హులని జిల్లా అధికారులు గుర్తించి రూ.15.36 కోట్లు అవసరమని రాష్ట్ర జౌళిశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం మాత్రం మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలకు మొత్తం నిధులు.. జోగుళాంబ గద్వాల, వనపర్తికి సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావించి అన్ని జిల్లాలకు మొత్తం నిధులు మంజూరయ్యే వరకు రుణమాఫీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లా కార్మికుల మంజూరు సంఖ్య కావాల్సిన నిధులు (రూ.కోట్లలో..) జో. గద్వాల 1,792 11.79 వనపర్తి 338 2.50 నారాయణపేట 122 0.70 మహబూబ్నగర్ 54 0.27 నాగర్కర్నూల్ 15 0.09 ఏడీ ఖాతాలో సగం నిధులు మాత్రమే వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో చేనేత రుణాలు తీసుకున్న కార్మికుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. వీటికి సంబంధించి ప్రభుత్వం సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. పూర్తిస్థాయి నిధులు మంజూరైన వెంటనే నేత కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల పూర్తిస్థాయిలో మంజూరయ్యే వరకు నిలిపివేయాలని ఆదేశాలు ఉమ్మడి జిల్లాలో 2,321 మంది కార్మికులు డబ్బులు చెల్లించాలంటూ బ్యాంకర్ల ఒత్తిడి ఆందోళనలో నేతన్నలు -
కంది కష్టాలు
రైతన్నకు దక్కని మద్దతు ధర గద్వాల వ్యవసాయం: కంది సాగు చేసిన రైతులు ఈ ఏడాది సైతం నిరాశ చెందుతున్నారు. గడిచిన రెండేళ్లు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టపోగా.. ఈసారి కందికి పూత, గింజ దశలో చీడపీడలు ఆశించి పంటపై ప్రభావాన్ని చూపి దిగుబడులు తగ్గాయి. మార్కెట్ యార్డులో క్వింటాల్కు నాణ్యతగా ఉంటే రూ.5 వేల నుంచి రూ.7 వేలకు మించడం లేదు. మరోపక్క ప్రభుత్వ పరంగా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఫలితంగా అటు దిగుబడులు రాక.. ఇటు ధరలు గిట్టుబాటు కాక కంది రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. రాలిన పూత.. తెగుళ్ల బెడద ఈ ఏడాది గంపెడాశతో నడిగడ్డ రైతులు కంది బాట పట్టారు. మొత్తం 23,484 ఎకరాల్లో పంట సాగు చేయగా.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కొంత ప్రభావాన్ని చూపాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో పూత దశలో మోడాలు, వర్షాలకు పూతలు రాలాయి. గుళ్ల, పచ్చపురుగు విపరీతంగా ఆశించాయి. ఇక గింజ దశలో కాయ తొలుచు, పచ్చ పురుగులు వెంటాడి.. దిగుబడిపై ప్రభావం చూపాయి. వర్షాధారంగా సాగు చేసిన చోట ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంట కోతలు పూర్తి కాగా.. కొన్నిచోట్ల మాత్రమే ఇంకా కోతలు అవుతున్నాయి. వర్షాధారం కింద ఎకరాకు 2 క్వింటాళ్లు, నీటి లభ్యత ఉన్నచోట 3– 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గద్వాల మార్కెట్ యార్డులో వచ్చిన ధరల వివరాలు ఇలా.. నెల అ,వచ్చిన కంది గరిష్టం కనిష్టం సరాసరి (క్వింటాళ్లు) (రూ.లలో) డిసెంబర్ 1,476 6,729 2,639 6,613 జనవరి 1,469 7,049 2,400 6,766 (ఇప్పటివరకు) అ,వచ్చిన కంది : అమ్మకానికి వచ్చిన కంది మార్కెట్లో క్వింటాల్ రూ.7 వేలు మించని వైనం ఇంకా ప్రారంభం కానిప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వాతావరణ పరిస్థితులతో తగ్గిన దిగుబడి రెండేళ్లుగా తప్పని నష్టాలు -
శ్రీరామకొండ జనసంద్రం
దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరిన భక్తులు కోయిలకొండలోని శ్రీరామకొండ భక్తజనసంద్రంగా మారింది. ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీరామ పాదదర్శనం కోసం తెల్లవారు జామున 3 గంటల నుంచే ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది భక్తులు క్యూలైన్లో బారులుతీరారు. పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, నైవేద్యం, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నామస్మరణతో కొండమొత్తం మార్మోగింది. కొండపై మహిమాన్వితమైన కోనేరులో స్నానం ఆచరించి కోనేటి నీటితో పాటు కొండపై ఉన్న వనమూలికలను తమ వెంట తీసుకెళ్లారు. 8లో.. గణనకు సిద్ధం -
బాలికలకు టీకా
● క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు ● జిల్లావ్యాప్తంగా సర్వే,వైద్య సేవలపై కసరత్తు ● 8 వేల మందిని గుర్తించిన అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చాం.. జిల్లావ్యాప్తంగా బాలికలకు టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ సైతం అందించాం. మొదటి విడతగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు వేయనున్నాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. సర్వే నివేదికల ఆధారంగా కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే టీకా వేయడం ప్రారంభిస్తాం. ఈ టీకా వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. – సంధ్యకిరణ్మయి, జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి గద్వాల క్రైం: జిల్లాలో తొమ్మిదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు క్యాన్సర్ బారినపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే సాధారణంగా మహిళలు ఎక్కువ శాతం గర్భాశయ, నోటి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఇప్పటికే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఈ వ్యాధి నివారణకు అడ్డుకట్ట వేసేందుకు గద్వాల– అలంపూర్ సెగ్మెంట్లలో ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేపట్టి 8,240 మంది బాలికలను గుర్తించి మొదటి విడతగా 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్వీపీ టీకాలు వేయనున్నారు. హెచ్వీపీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాధి ప్రధానంగా అవగాహన లేమి, పరిశుభ్రత తక్కువగా ఉండడం సమస్యగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా సర్వే.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా సర్వే చేపట్టారు. మొదటి విడతగా 14– 15 సంవత్సరాల బాలికలను గుర్తించారు. ఇందుల్లో 8,240 బాలికలను గుర్తించి 90 రోజులపాటు టీకాలు వేయనున్నారు. ముందస్తుగా టీకాలు ఇచ్చే విధానంపై శిక్షణ అందించారు. గ్రామీణ, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకా వేయనున్నారు. టీకా తీసుకోని వారికి బుధ, శనివారాల్లో ప్రత్యేకంగా టీకా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. నివారణ చర్యలపై దృష్టి.. కిశోర బాలికల విషయంలో హార్మోన్ల మార్పులు జరిగే సమయంలో ఇన్ఫెక్షన్ సోకి క్యాన్సర్కు దారితీస్తుంది. చాలామంది హెచ్వీపీ వైరస్ విషయంలో గుర్తించడం నిర్లక్ష్యంగా ఉంటారు. అండాశయం పొట్టలో ఉండటం వల్ల లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. అందుకే ఈ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్గా పేర్కొంటారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవచ్చు. లక్షణాలు పొత్తి కడుపు ఉబ్బి నొప్పిగా ఉండటం, అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు ఉంటే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి కట్టడి చేయవచ్చు. మహిళలను బాధిస్తున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి. చిన్నారుల భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్వీపీ టీకా ఇవ్వనున్నారు. -
పుర చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 మున్సిపాలిటీలు ఉండగా వీటిలో జడ్చర్ల, అచ్చంపేట మినహా మిగతా 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలు బీసీ వర్గాలకు కేటాయించగా, 9 స్థానాల్లో జనరల్కు కేటాయించారు. భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎస్సీ వర్గాలకు చైర్మన్ స్థానాల్లో రిజర్వేషన్ దక్కలేదు. మున్సిపల్ ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొంది. జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు మరో 4 నెలల పాటు పదవీకాలం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 మున్సిపాలిటీలు ఉండగా, వీటిలో 19 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలను నిర్వహించనున్నారు. జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మే 6 వరకు ఉంది. ఈ రెండు మున్సిపాలిటీలకు ప్రస్తుతానికి ఎన్నికలను నిర్వహించకపోయినప్పటికీ ప్రభుత్వం రిజర్వేషన్లను మాత్రం ఖరారు చేసింది. జడ్చర్ల మున్సిపాలిటీ చైర్మన్ స్థానం జనరల్కు కేటాయించగా, అచ్చంపేటలో బీసీ మహిళకు కేటాయించారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను మాత్రం ఎన్నికల సమయంలోనే చేపట్టనున్నారు. మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ మహబూబ్నగర్ బీసీ మహిళ (కార్పొరేషన్) భూత్పూర్ ఎస్టీ జనరల్ అయిజ బీసీ జనరల్ అలంపూర్ బీసీ జనరల్ దేవరకద్ర బీసీ మహిళ కొల్లాపూర్ బీసీ మహిళ అచ్చంపేట బీసీ మహిళ నాగర్కర్నూల్ బీసీ జనరల్ మద్దూరు బీసీ జనరల్ కొత్తకోట బీసీ మహిళ ఆత్మకూర్ బీసీ మహిళ వడ్డేపల్లి బీసీ జనరల్ గద్వాల జనరల్ మహిళ జడ్చర్ల జనరల్ కల్వకుర్తి జనరల్ మహిళ కోస్గి జనరల్ నారాయణపేట జనరల్ మహిళ మక్తల్ జనరల్ వనపర్తి జనరల్ మహిళ అమరచింత జనరల్ పెబ్బేర్ జనరల్ మహబూబ్నగర్ కార్పొరేషన్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయింపు భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వ్ వార్డుల వారీగా రిజర్వేషన్లనుపూర్తి చేసిన ప్రభుత్వం ముగిసిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ నేడో, రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం పట్టణాల్లో ఎన్నికల సందడి.. మున్సిపల్ ఎన్నికలకు వార్డు స్థానాలతో పాటు చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్ల కసరత్తును ప్రభుత్వం పూర్తిచేయడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పట్టణాల్లో ఎన్నికల వాతావరణం సందడిగా మారింది. ఇప్పటికే రిజర్వేషన్ల అంకం పూర్తికావడంతో నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ సైతం ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఊపందుకున్నాయి. రిజర్వేషన్ల ప్రకటన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
ఇంటివద్దకే మేడారం బంగారం ప్రసాదం
స్టేషన్ మహబూబ్నగర్: ములుగు జిల్లాలో ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడా రం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేయనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ తెలిపారు. ఆర్ఎం కార్యాలయంలో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ మేడా రం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.299 చెల్లిస్తే దేవాదాయశాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుందన్నారు. భక్తులు www. tgsrtclogistics.co.in వెబ్సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు లక్ష్మిధర్మ, కవిత, టీజీఎస్ఆర్టీసీలాజిస్టిక్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
భద్రతతో కూడిన విద్యుత్ ప్రతిఒక్కరి బాధ్యత
ఎర్రవల్లి: విద్యుత్ వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో విద్యుత్ ఏఈ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమానికి ఆయన హాజరై ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, డీఈ రవిప్రసాద్తో కలిసి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పరిసరాలు పరిశీలించి శుభ్రం చేశారు. అనంతరం విద్యుత్ వినియోగదారులకు పలు సూచనలు చేశారు. నాణ్యమైన వైర్లు, స్విచ్లు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ప్రతి ఇంటికి తప్పకుండా ఎర్తింగ్ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఫ్రిజ్లు, కూలర్లు ఉన్నవారు ఎర్తింగ్ చేసుకోవడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ప్రజలు తమ ఇళ్లకు నాణ్యమైన సర్వీస్ వైర్లు, డీపీ మెయిన్ స్విచ్ ఫ్యూజ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ లైన్లకు నేరుగా కొండీలు వేయకూడదని.. భద్రతతో కూడిన విద్యుత్ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజలకు ఏ రకమైన విద్యుత్ సమస్యలు ఉన్నా వెంటనే స్థానిక సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ నవీన్, లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాలమూరు, రాష్ట్ర సరిహద్దు వరకూ దాన్ని తరిమికొట్టాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగట్టాం. 2024లో గుండుసున్నా ఇప్పించినం. కాంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బొందపెట్టినం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 66శాతం సర్పంచ్లను గెలిపించుకున్నం. అంతే నాకు శత్రువులు ఎవరూ లేరు. పేదరికం, మహిళలకు అన్యాయం చేసేవాళ్లు, విద్యార్థులకు నష్టం చేసేవాళ్లు మాకు శత్రువులు. పేదరికాన్ని పాలమూరు నుంచి, రాష్ట్ర సరిహద్దు దాటే వరకూ తరిమి కొట్టాలన్నదే మా లక్ష్యం.’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్ మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రజనుద్దేశించి మాట్లాడారు. ఉచితంగా ఏది ఇచ్చినా శాశ్వతం కాదని.. విద్య ఒక్కటే శాశ్వతం. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత తీరాలను చేరాలని ఆకాంక్షించారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో విద్య, సాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. చదువే మన భవిష్యత్ను మారుస్తుందని.. పాలమూరులో పంటలు పండి రైతుల కళ్లల్లో ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. ఇది వేగంగా సాగేలా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ భూసేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెండింగ్లకు సంబంధించి బాధితులకు నష్ట పరిహారం ఇప్పించాలని సూచించారు. రేవంత్రెడ్డి ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే.. పర్యాటక ప్రాంతాలుగా మార్చి ప్రాజెక్ట్లు చూపించాలి.. గతంలో టోనీబ్లెయర్, బిల్గేట్స్ వంటి వారు దేశంలో పర్యటనలు చేసేవారు. పాలమూరు పేదరికాన్ని చూపెట్టేందుకు ఆనాటి ముఖ్యమంత్రులు వారిని మన ప్రాంతానికి తీసుకొచ్చేవారు. ఇక్కడ ప్రజలు వలసపోతున్నారు.. బట్టలు లేవు.. తిండి లేదంటూ వారికి చూపించి బిచ్చం వేయాలని కోరేవారు. ఇది ఎంత బాధాకరం. అందుకే మన అభివృద్ధిని చూపించేలా మార్పురావాలి. పర్యాటక ప్రాంతాలుగా మార్చి మన ప్రాజెక్ట్లను చూపాలి, ట్రిపుల్ ఐటీ, ఐఐఎంలు చూపించాలి. పాలమూరు నుంచి దేశానికి సేవలు అందించాలి. అదే లక్ష్యంగా కృషి విద్య, సాగునీటికే మా మొదటి ప్రాధాన్యం త్వరలో 35 లక్షల మంది పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి రూ.1,284 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
కేంద్రం నుంచి పూర్తి సహకారం..
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఎలాంటి కృషి చేయలేదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.పాలమూరు అభివృద్ధి దిశగా పయనించేందుకు సీఎం రేవంత్రెడ్డిపై గురుతర బాధ్యత ఉందన్నారు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. కేంద్ర, రాష్ట్ర వాటా నిధులతో వివిధ పథకాల పూర్తికి కృషి చేస్తామన్నారు.విద్యపరంగా పీయూ అభివృద్ధికి రూ.120 కోట్లు ఇచ్చామన్నారు. పాలమూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వెంటనే బాగు చేయించాలని కోరారు. -
జోగుళాంబ వార్షికోత్సవం.. కలెక్టర్కు ఆహ్వానం
అలంపూర్: జోగుళాంబ అమ్మవారి వార్శిక బ్రహ్మోత్సవాలకు కలెక్టన్ సంతోష్ను ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో ఆయనను కలిసి వార్శిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశామన్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ అమ్మవారి వార్శిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. అలాగే బాలబ్రహ్మేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహిస్తామన్నారు. ఆలయాల్లో ముగిసిన శుద్ధి అమ్మవారి వార్శికోత్సవంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని, అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. సాయంత్రం శుద్ధి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. యథాతథంగా దర్శనాలకు అనుమతించారు. -
తెగ తాగేశారు..!
● ఉమ్మడి జిల్లాలో 4 రోజుల్లో రూ.64.9కోట్ల మద్యం విక్రయాలు మహబూబ్నగర్ క్రైం: సాధారణ రోజుల్లోనే మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. దానికి తోడు పండుగలు కలిసి వస్తే ఇంకా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయి. సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 మద్యం దుకాణాల్లో నాలుగు రోజుల్లో భారీ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే మటన్, చికెన్, నాటుకోడి అమ్మకాలు గణనీయంగా జరిగా యి. ప్రధానంగా నగరంలో శుక్రవారం ఉదయం నుంచే రోడ్లపై ప్రత్యేకంగా తాత్కాలికంగా అడా ్డలు ఏర్పాటు చేసుకుని మటన్, చేపల విక్రయా లు అధికంగా చేశారు. తిమ్మాజిపేట డిపో పరిధి లో రూ.39.9కోట్ల మ ద్యం, కొత్తకోట డిపో నుంచి రూ. 25 కోట్ల వరకు లిఫ్ట్ చేసి దుకాణాలకు తరలించారు. -
పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు
గద్వాల: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఆయా వర్గాల జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాల ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ఇతర ప్రక్రియ మొత్తం నిర్ధేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్, ప్రిసైడింగ్, ఇతర ఎన్నికల అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది అదే మున్సిపాలిటీకి సంబంధించిన వారు కాకుండా ఇతర మండలాల వారిని తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డీసీఈఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు జానకీరామ్, ప్రేమ్సాగర్, శంకర్నాయక్, సైదులు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ గద్వాల
సుఖ సంతోషాల సంబురం నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఊర్కొండపేట అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమై ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి.శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026–IIలో uగద్వాలటౌన్/మల్దకల్: మకరజ్యోతి వెలుగులు.. ధాన్యలక్ష్మి సిరిసంపదలు.. రంగవల్లుల గొబ్బెమ్మలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలతో జిల్లావ్యాప్తంగా గురువారం సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందం జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ అన్ని కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఇంటి ముంగిళ్లు రంగవల్లులతో మెరిసి పోయాయి. సంక్రాంతి ప్రాధాన్యతను చాటే ముత్యాల ముగ్గులు ముచ్చటగొలిపాయి. మూడు రోజుల పండగలో భాగంగా బుధవారం భోగితో ప్రారంభమైన వేడుకలు శుక్రవారం కనుమతో ముగిసాయి. సాంప్రదాయం వంటకాలు మొదటిరోజు సజ్జ, నువ్వులరొట్టెలు, తోడుగా రుచికరమైన కలగూరలు, గురువారం మకర సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లం మిశ్రమంతో పరమాన్నం, ప్రత్యేక పిండి వంటలు చేసుకున్నా రు. శుక్రవారం కనుమ పండుగను పురస్కరించుకొ ని కొంతమంది మాంసాహారాలతో రుచికరమైన వంటలు ఆరగించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పిలిగుండ్ల కాలనీ, రాఘవేంద్ర వీవర్స్ కాలనీ, అట్కార్పేట కాలనీలో గద్వాల చేనేత జరీ చీరల ప్రత్యేకతను చాటుతూ పలువురు ఇళ్ల ఆవరణలో ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. పండుగను పురస్కరించుకొని పలువురు ఇళ్లల్లో చిన్నారులపై రేగిపండ్లు వేసి ఆశీర్వదించారు కురువ డోలు పోటీలు మల్దకల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచు చిట్టెమ్మ ఆధ్వర్యంలో బీరప్ప సంఘం నిర్వాహుకులు కురువ డోలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి 16 మంది పోటీదారులు పాల్గొన్నారు. వారిలో ప్రథమ బహుమతిని ఉప్పల గ్రామానికి చెందిన పరశురాములు గెలుపొందగా రూ.5,016, రెండో బహుమతి గుడ్డెందొడ్డికి చెందిన గోపాల్కు రూ.4,016, అదే గ్రామానికి చెందిన వెంకటేష్ మూడో బహుమతి రూ.3,016, సజ్జాపురం గ్రామానికి చెందిన మల్లేష్ నాల్గో బహుమతి రూ.2,016, అదే గ్రామానికి చెందిన భీమన్నలు ఐదో బహుమతిగా రూ.1,016లను అందుకున్నారు. బండలాగుడు పోటీలో బల ప్రదర్శన చూపుతున్న వృషభాలు మల్దకల్లో కురువ డోలు పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులు పండుగను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో వివిధ క్రీడాపోటలు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడల్లో ప్రతిభ చాటిన జట్లకు నగదు బహుమతులతో పాటు షీల్డ్లను అందించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆలయాల ఆవరణలో నిర్వహించిన బండలాగుడు పోటీలు, సందెపు రాళ్ల పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. -
పాలమూరు అస్త్రంగా..
నేడు మహబూబ్నగర్కు సీఎం రేవంత్రెడ్డి రాక అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇలా.. సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్: జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సుమారు రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు పుర పాలక ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి సభలో ఏం మాట్లాడుతారోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి సరఫరా, పైపు లైన్లు తదితర సమస్యల పరిష్కారం కోసం రూ.883 కోట్లు ఇదివరకే మంజూరైన విషయం తెలిసిందే. ఇందులో రూ.603 కోట్లతో మురుగు నీటిని నగరం బయటకు తరలించే సీవర్ లైన్ కాల్వ ఏర్పాటు చేయనున్నారు. ● నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీకి అనుబంధంగా క్యాంపస్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాది మేలో మంజూరు కాగా.. ఈ విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ ఐటీ కోసం సొంత భవనాన్ని నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న దివిటిపల్లి–ఎదిర, జడ్చర్ల మండలం చిట్టబోయిన్పల్లి, మల్లెబోయిన్ పల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో.. అక్కడ పనులు మొదలు పెట్టేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపింది. ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లను అవసరం కాగా.. రూ.200 కోట్ల చొప్పున మొత్తం మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయనుంది. తాజాగా మొదటి విడత కింద రూ.200 కోట్లు మంజూరు చేయగా.. భవన నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. సుమారు రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి భూమిపూజ నగరంలోయూజీడీ, తాగునీటి పనులకు.. ఎంవీఎస్ మైదానంలో బహిరంగ సభ ముఖ్యమంత్రి సభపై సర్వత్రా ఆసక్తి -
యువత చూపు.. మోదీ వైపు
గద్వాలన్యూటౌన్: ప్రపంచంలోనే భారతదేశాన్ని బలమైన శక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీ వైపు యువత చూస్తోందని బీజేపీ జిల్లా అద్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని 8వ వార్డు యువకులు డీకే బంగ్లాలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 37 వార్డుల్లో పోటీచేస్తుందని తెలిపారు. ఎంపీ డీకే అరుణ, స్నిగ్దారెడ్డిల నాయకత్వంలో గద్వాలలో బీజేపీ బలపడుతోందని అన్నారు. మున్సిపాలీటీలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎక్బోటే, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్, రజక నర్సింహులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి అలంపూర్: పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి అన్నారు. అలంపూర్లోని వాసవీ కాన్యకా పరమేశ్వరిదేవి నిత్యన్నదాన సత్రంలో బుధవారం పెన్షనర్స్ యూనియన్, జేఏసీ, ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్యశెట్టి మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన పెన్షనర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. రాష్ట్ర, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల సహకారంతో అలంపూర్లో పెన్షనర్ల భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నిర్మలమ్మ, కృష్ణమూర్తి, మద్దిలేటి, కేశవాచారి, వెంకటస్వామి, సలీం, జమ్మన్న, శ్రీనివాసులు, రమేశ్గుప్తా, కృష్ణమూర్తి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అలంపూర్: జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని బుధవారం నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, ధార్మిక సలహాదారు గోవింద హరిని ఆహ్వానించినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇంటింటా సందడి
● భోగి మంటలతో మొదలైన పండగ ● సప్తవర్ణాలతో శోభిల్లిన లోగిళ్లు ● బంధుమిత్రులతో కళకళ జిల్లా కేంద్రంలో ఓ ఇంటి ముందు తీర్చిదిద్దిన రంగవల్లి గద్వాలటౌన్: ముంగిళ్లలో గొబ్బెమ్మలతో ముచ్చటైన ముగ్గులు.. వెచ్చదనాన్ని అందించే భోగి మంటలు.. గంగిరెద్దుల విన్యాసాల నడుమ బుధవారం సంక్రాంతి సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. జిల్లా అంతటా పిండి వంటల ఘుమఘుమలు.. పతంగుల కోలాహలం నెలకొంది. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, మానవపాడు, మల్దకల్ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సౌరభాలు వెల్లివిరిశాయి. కాలనీల్లో భోగి మంటలు వేసి పండగ జరుపుకొన్నారు. భోగి మంటల చుట్టూ యువత, చిన్నారులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. సూర్యోదయానికి ముందే మహిళలు లేచి ఇంటి ముందు అలుకు చల్లి.. ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీపడ్డారు. హరివిల్లు రంగులను పులుముకున్న గాలిపటాలతో పిల్లలు ఆనందంగా గడిపారు. పెద్దలను సైతం గాలిపటాలు రంజింప చేశాయి. ప్రతి ఇంటి ముంగిళ్లు రంగవల్లులతో మెరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపించింది. భోగి సందర్భంగా సంప్రదాయ వంటకాలైన సజ్జ, నువ్వుల రొట్టెలు, వాటికి తోడుగా రుచికరమైన కూరలు చేసుకొని కుటుంబ సమేతంగా ఆరగించారు. పండగను పురస్కరించుకొని పలుచోట్ల రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. -
డూడూ.. బసవన్న
అయ్య వారికి.. అమ్మవారికి దండంపెట్టు ● గంగిరెద్దులతో సంక్రాంతికి కళ ● పండగకు ముందు నుంచే సందడి ● ఉమ్మడి జిల్లాలో వంద కుటుంబాలపైగా గంగిరెద్దులోళ్లు డూడూ బసవన్న అనగానే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దు గుర్తుకు వస్తుంది. పండగ భోగి మొదలు కనుమ వరకు మూడు రోజుల పాటు గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ యాచిస్తూ గంగిరెద్దుల వాళ్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు నాలుగైదు ఊర్లలో మూడు నాలుగు వందల కుటుంబాలు ఉండే గంగిరెద్దుల వాళ్లు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 105 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గంగిరెద్దులను ఆడించే వారు యాదవ కులంకు చెందిన వారే అయినప్పటికీ వారితో సంబంధాలు అంతంత మాత్రమే. వీరిది అంతా సంచార జీవనమే. యాచక వృత్తి ప్రధానంగా జీవిస్తుంటారు. పండగలు, పర్వదినాలతో పాటు ఎవరైనా మరణిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయానికి గంగిరెద్దులతో వీరు ప్రత్యక్షం అవుతుంటారు. అప్పటి వరకు ఊరూరా సంచరిస్తూ జీవనం గడుపుతుంటారు. -
కమనీయం.. గోదా రంగనాథుడి కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో సుప్రభాత సేవ, పుణ్యహవచనం, పంచామృత అభిషేకం, ప్రభంద పారాయణం, సాత్తుముణై తదితర పూజలు నిర్వహించారు. అనంతరం గోదా రంగనాథస్వామి కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా వల్లూరుకు చెందిన దివంగత నాగేశ్వరెడ్డి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, కల్యాణ మాంగళ్యాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణ వేడుక నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం కమనీయంగా సాగింది. భక్తులు గోదా రంగనాథుడి కల్యాణాన్ని కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
అభివృద్ధి దిశగా పాలమూరు
● ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్వి పచ్చి అబద్ధాలు ● మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండి ● రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దేవరకద్ర/ భూత్పూర్: వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ ప్రాంత బిడ్డ, సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధిగా నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం పాలమూరు ప్రాజెక్టు పనులు 10 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్రెడ్డి పూర్తి చేయడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జిల్లాను దత్తత తీసుకుని వివక్ష చూపించారని విమర్శించారు. దేవరకద్ర నియోజవవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి ఎమ్మెల్యే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేయించుకున్నారని, అలాగే కోయిల్సాగర్ రోడ్డుకు, డ్యాం డెవలప్మెంట్ పనులకు నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలే నాయకులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణమ్మ పాల్గొన్నారు. -
రవాణా రంగంపై అక్కసు వెళ్లగక్కడం అన్యాయం
అలంపూర్: రవాణా రంగంపై సీఎం రేవంత్రెడ్డి అక్కసు వెళ్లగక్కడం అన్యాయమని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఏదేని వాహనం సిగ్నల్ జంప్ చేసినా.. లేదా చలానా వేసిన వెంటనే యజమాని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్టయ్యే పద్ధతి తీసుకొస్తామని సీఎం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం అలంపూర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి రవాణా రంగంపై ఏకపక్ష వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ. 12వేల జీవనభృతి ఇవ్వాలని.. రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని.. సిగ్నల్స్, రోడ్డు క్రాసింగ్ల వద్ద తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. 50 కి.మీ.లకు ఒక విశ్రాంతి గది ఏర్పాటు చేయాల్సి ఉండాలని, వాహనాల రద్దీ నియంత్రణకు పోలీసులను నియమించడంతో పాటు రోడ్డు వెడల్పు, స్పీడ్ బ్రేకర్స్, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం.. రవాణా రంగంపై అక్కసు వెళ్లగక్కడం దారుణమన్నారు. రవాణా రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమవుతామన్నా రు. రవాణారంగ కార్మికులు స్వాములు, రాముడు, రాఘవేంద్ర, పరమేశ్, మౌలాలి, మద్దిలేటి, భాస్కర్, మధు, మహేశ్, రామకృష్ణ పాల్గొన్నారు. -
ఆదరణ తగ్గింది
మా గ్రామం చర్లపల్లి అయినా పెద్దలనుంచి వచ్చిన గంగిరెద్దులను ఆడించటం కోసం సంచార జీవనం గడుపుతున్నా. భార్య ఇద్దరు పిల్లలతో గంగాపూర్లో గుడారాలు వేసుకొని జీవిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇదే వృత్తిలో ఊరూరా తిరుగుతుంటాను. ఏడాదిలో ఈ మూడు రోజులే జడ్చర్లలో తిరిగి యాచకం చేస్తా. ఇంతకుముందు అయితే ధనం, ధాన్యం, గడ్డి అన్ని దానం చేసేవారు. ఇప్పుడు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. – రాములు, గంగిరెద్దులను ఆడించే వ్యక్తి ఎద్దులే సాకుతాయి.. ఎద్దులను మంచిగా చూసుకుంటే అవి మా కుటుంబాలను సాకుతున్నాయి. వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుతున్నాం. ఎద్దులు మంచిగా ఉంటేనే మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మారుతున్న సమాజంతో పొటీ పడేలా మాకు ప్రత్యేకమైన సదుపాయలు కల్పిస్తే మానుగడ సాగిస్తాం. తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించేలా నెట్టుకొస్తున్నాం. – రాములు, నవాబుపేట -
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
గద్వాలన్యూటౌన్: మున్సిల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు.. తుది ఓటరు జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేశారు. ● గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులకు గాను ఎస్టీ జనరల్కు 1, ఎస్సీలకు 4 వార్డులు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రకారం బీసీలకు 13 వార్డులు దక్కనున్నాయి. ఇందులో 7 వార్డులు బీసీ జనరల్కు, 6 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. 19 వార్డులను జనరల్కు కేటాయించగా.. 10 వార్డులు జనరల్ మహిళ, 9 వార్డులు జనరల్కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ● అయిజలో 20 వార్డులు ఉండగా.. ఎస్టీ జనరల్కు 1 రిజర్వు చేశారు. ఎస్సీలకు 5 వార్డులకు గాను ఎస్సీ జనరల్కు 3, ఎస్సీ మహిళకు 2 కేటాయించారు. బీసీలకు 4 వార్డులు రిజర్వు కాగా.. 2 వార్డులు బీసీ జనరల్, 2 వార్డులు బీసీ మహిళలకు దక్కనున్నాయి. 10 వార్డులు జనరల్కు రిజర్వు కాగా.. ఇందులో 6 వార్డులు జనరల్ మహిళ, 4 వార్డులు జనరల్కు కేటాయించచారు. ● అలంపూర్లో 10 వార్డులు ఉండగా.. ఎస్టీ జనరల్కు 1 రిజర్వు చేశారు. 2 వార్డులు ఎస్సీలకు, 2 వార్డులు బీసీలకు కేటాయించారు. 3 జనరల్కు రిజర్వు చేయగా.. 1 మహిళకు, 2 జనరల్కు కేటాయించారు. ● వడ్డేపల్లిలో 10 వార్డులకు గాను 1 ఎస్టీ జనరల్కు కేటాయించారు. ఎస్సీలకు 2, బీసీలకు 2 వార్డులు రిజర్వు చేశారు. 3 వార్డులు జనరల్కు రిజర్వు కాగా.. 1 మహిళకు, 2 జనరల్ స్థానాలుగా ఖరారు చేశారు. -
ఆలయ గ్రంథం ఆవిష్కరణ
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయ చరిత్ర గ్రంథాన్ని తెలుగు అధ్యాపకుడు బోరవెల్లి పవన్కుమార్ రచించగా.. రాజవంశీయుడు లక్ష్మీకేశవరెడ్డి ఆవిష్కరించారు. బుధవారం వేణుగోపాలస్వామి ఆలయంలో గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవంతో పాటు ఆలయ చరిత్ర గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీకేశవరెడ్డి మాట్లాడుతూ.. వేణుగోపాలస్వామి ఆలయ చరిత్ర గ్రంథ రూపంలో రచించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ విశిష్టత, శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని గ్రంథంలో విపులంగా వివరించారని చెప్పారు. కార్యక్రమంలో డా.బాలస్వామి, రామ్మోహన్రావు, వారణాసి నాగేశ్వరాచారి, గోవర్ధన్శెట్టి, నందకిషోర్, లక్ష్మణ్, వగ్గు నాగరాజు, గోసాయి వేణు, భానుప్రకాశ్, మహేందర్, జయన్న, బసవరాజ్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయిలో సత్తాచాటిన దివ్యాంగ విద్యార్థులు
ఆత్మకూర్: గోల్బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ఆత్మకూర్కు చెందిన దివ్యాంగ విద్యార్థులు సత్తాచాటి మొదటి బహుమతి సాధించారు. ఈ నెల 10 నుంచి బిహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 5వ నేషనల్ గోల్బాల్ పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ క్రమంలో ఆత్మకూర్ సమ్మిలిత ఫౌండేషన్కు చెందిన విద్యార్థి పవన్కల్యాణ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించగా ఇక్కడి దివ్యాంగ విద్యార్థులు రాజేష్, వేణు, కిరణ్, మధు, సాయిరాంవర్మ ప్రతిభ కనబర్చి ఫైనల్లో ఏపీ జట్టుపై విజయం సాధించారని కోచ్, సంస్థ డైరెక్టర్ శివకుమార్ తెలిపారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్థిక సహకారంతోనే తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. -
చింతలకుంటవాస.. శ్రీఆంజనేయ
● నేటినుంచి స్వామివారి ఉత్సవాలు ● ఇక్కడ మాంసం, కల్లుతోనే నైవేద్యం ● కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి మొక్కుల చెల్లింపు వనపర్తి రూరల్: ఆంజనేయస్వామికి సింధూరం, తమల పాకులు, టెంకాయలతో పూజలు నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని పాతపల్లి శివారులో వెలసిన చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, కల్లుతో నైవేద్యం సమర్పిస్తారు. ఏకంగా స్వామివారి ఎదుటే పొట్టేళ్లు, కోళ్లు బలిస్తారు. ప్రతిఏటా సంక్రాంతి పండుగ నుంచి మూడురోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు స్థానికులేగాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారికి అపారమైన శక్తి ఉందని.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాగా.. బుధవారం ప్రారంభమయ్యే ఉత్సవాలు శుక్రవారం ముగుస్తాయి. ఉత్సవాలను పురస్కరించుకొని తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు ఇతర ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పెబ్బేరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. -
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
అలంపూర్: ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికే సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ కృష్ణయ్య అన్నారు. మంగళవారం అలంపూర్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహించి.. మండల స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 28 నుంచి 31వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఉంటాయన్నారు. 10 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రస్థాయి క్రీడాకారుల ఎంపిక ఉంటుందన్నారు. కాగా, సీఎం కప్ టార్చ్ ర్యాలీ అలంపూర్ నుంచి అలంపూర్ చౌరస్తా వరకు కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, ఎస్జీఎఫ్ కార్యదర్శి తోట శ్రీనివాసులు, కరాటే శ్రీహరి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసన్న, ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్, స్టేడియం అసిస్టెంట్ బషీర్ అహ్మద్, రిటైర్డ్ టీచర్ వెంకట్రామయ్య శెట్టి, భరత్కుమార్, నాగరాజు, ఈశ్వర్, నాగరాజు పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోండి
అయిజ: రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి సూచించారు. మంగళవారం ఏడీఈ నీలి గోవిందుతో కలిసి మండల కేంద్రంలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున గ్రీటింగ్ కార్డులను అందజేశారు. అనంతరం సబ్స్టేషన్ వద్ద విద్యుత్శాఖ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ, నోట్బుక్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు గాను అయిజ సబ్స్టేషన్లో 33 కేవీ ప్రత్యామ్నాయ పరికరాలను అమర్చుతున్నట్లు తెలిపారు. విద్యుత్శాఖ ప్రజాబాట కార్యక్రమం కొనసాగిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
పిండి వంటల ఘుమఘుమలు..
మహిళలందరూ ఒక చోట చేరి పిండి వంటలు చేసుకోవడం పండగ ప్రత్యేకత. సకినాలు, అరిసెలు, కారపూసలు, జంతికలు, నువ్వుల ఉండలు, గారెలు చేస్తుంటారు. ఇప్పటికే గ్రామాల్లో పిండి వంటలు తయారీ పూర్తయింది. ఉద్యోగాలు, చదువుల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఉన్న వారంతా పండగకు ఇంటికి వచ్చా రు. విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులు పట్నం నుంచి పల్లెబాట పట్టారు. అయితే నడిగడ్డకు చెందిన చాలా మంది యువకులు ఆంధ్రపదేశ్లోని గోదావరి తీరంలో సంక్రాంతి పండగ వేడుకలను ఆస్వాదించడానికి పయనమయ్యారు. -
ఫార్మర్ రిజిస్ట్రీతోనే పథకాలు
ఎర్రవల్లి: ప్రభుత్వ పథకాలను పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపురం, పుటాన్దొడ్డి, కొండేరు, ధర్మవరం గ్రామాల్లో ఏఈఓలు నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ యూనిక్ ఐడీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టిందన్నారు. ఫార్మర్ ఐడీతో వ్యవసాయ ఉత్పత్తులను సరైన ధరలకు విక్రయించడంతో పాటు ప్రభుత్వం అందించే ఎన్నో సేవలను సులభంగా పొందవచ్చన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ కోసం రైతులు ఆధార్, బ్యాంక్ ఖాతా, భూమి పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్తో లింక్ ఉన్న మొబైల్ నంబర్తో స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు. అదే విధంగా అందుబాటులో ఉన్న మీసేవ లేదా సీఎస్సీ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం కోదండాపురంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏఓ సురేశ్గౌడ్, ఏఈఓలు నరేశ్, ప్రవళిక, హిమబిందు, జెన్నిఫర్, సురేశ్, వేదావతి పాల్గొన్నారు. -
సరదాల సంక్రాంతి
వేళ పిండివంటల ఘుమఘుమలు.. పతంగుల కోలాహలం.. ముంగిట్లో ముత్యాల ముగ్గులు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. మహిళలు నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముచ్చటైన తెలుగు పండగ సంక్రాంతిని మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం భోగభాగ్యాల భోగి, గురువారం సంకాంత్రి, శుక్రవారం కనుమను కుటుంబ సమేతంగా నిర్వహించుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దేందుకు యువతులు, మహిళలు సన్నద్ధమవుతున్నారు. మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం.. పంట ఇంటికొచ్చే వేళ ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. – గద్వాలటౌన్ సరదాల సంక్రాంతిసంక్రాంతి అంటేనే సంబురం. ఈ పర్వదినానికి పల్లెల్లో ఎనలేని ప్రాధా న్యం ఉంటుంది. గ్రామాల్లో అన్ని వర్గాలకు వ్యవసాయమే మూలాధారం. ఏటా వానాకాలం పంటలు చేతికొచ్చే సందర్భంలో చేసుకునే వేడుకే ఇది. అందుకే పంటలకు, పండగకూ విడదీయలేని సంబంధం. అయితే ఈ సారి మాత్రం జిల్లాలోని పల్లెల్లో వానాకాలం పంటలు చేతికి రావడంతో పాటు యాసంగి కలిసొచ్చిన సందర్భం తోడవుతూ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. రైతుల నాగళ్ల చప్పుళ్లతో పొలాలన్నీ సందడిగా మారాయి. వరితో పాటు జొన్న, కంది, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు సాగవుతున్నాయి. ఈ తరుణంలో సంకాంత్రి పండగ గ్రామీణులకు ప్రత్యేకంగా నిలిచింది. సంక్రాంతి పర్వదినానికి ముందుగానే ముగ్గుల సందడి మొదలైంది. సూర్యోదయానికి ముందే మహిళలు లేచి ఇంటి ముందు అలుకు చల్లి ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీ పడతారు. సృజనాత్మకతకు రంగవల్లులనే వేదికగా చేసుకుంటారు. ఇందుకు అవసరమైన రంగుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వారం రోజుల నుంచే రంగుల కొనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నాయకులు, పాఠశాలల్లో వేర్వేరుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్సాహపరుస్తున్నారు. ముత్యాల ముగ్గులు ప్రత్యేకం.. జిల్లాలో మొదలైన పండగ సందడి నేడు భోగభాగ్యాల భోగి రేపు సంక్రాంతి.. ఎల్లుడి కనుమ పల్లెల్లో పండగ కోలాహలం -
‘పుర’ పోరుకు సంసిద్ధం
ప్రాథమిక సమాచారం సేకరణ పూర్తి .. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఉద్యోగుల ప్రాథమిక సమాచారాన్ని సేకరించే ప్రక్రియ ముగిసింది. నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్ఓలు, పీఓలు, సహాయ ఎన్నికల సిబ్బందిగా నియమించేందుకు ఎంతమంది ఉద్యోగులు అవసరమనే విషయంపై స్పష్టత తీసుకొచ్చారు. వీరితో పాటు జోనల్ అఽధికారులు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఎంపిక సైతం పూర్తిచేశారు. వారికి గతంలోనే శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం సిబ్బంది తక్కువగా అవసరం కానుండటంతో చాలా మందికి విధుల కేటాయింపు నుంచి ఉపశమనం కలిగించారు. అత్యధికంగా విద్యాశాఖ అధికారులకే ఎన్నికల బాధ్యతలను కట్టబెట్టనున్నారు. గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే వార్డుల వారీగా తుది ఓటరు జాబితా విడుదలచేసిన అధికారులు... ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యదళం కోసం కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల జాబితాను రూపొందించాలన్న ఈసీ ఆదేశాల మేరకు జిల్లా ముఖ్య ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. అత్యవసర విభాగాలైన వైద్యారోగ్యశాఖ మినహా మిగిలిన శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పలు అంశాలతో కూడిన సమాచారాన్ని రాబడుతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బంది వివరాలను టీపోల్ సాఫ్ట్వేర్లో పొందుపరిచారు. ఈ జాబితాలో ఎవరైనా ఉద్యోగులు పదవీ విరమణ పొందారా.. సస్పెన్షన్కు గురయ్యారా అనే సమాచారం సేకరించి.. వారి వివరాలను తొలగిస్తున్నారు. అత్యధికంగా విద్యాశాఖ సిబ్బందిపైనే దృష్టి సారించారు. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు చోట్ల ఎన్నికల నిర్వహణకు ప్రాథమికంగా సుమారు 700 మంది అధికారులు, సిబ్బంది అవసరం ఉన్నట్లు గుర్తించారు. వీరందరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఏదైనా కారణాలతో విధులకు హాజరు కాకుంటే.. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 20 శాతం సిబ్బందిని అదనంగా నియమిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సిబ్బంది వివరాల నమోదు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సమగ్ర సమాచారం.. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాస్థాయి అధికారి నుంచి కిందిస్థాయి ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. జిల్లా, మండల స్థాయిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల వివరాలు ముందుగానే నమోదు కావడంతో గుర్తింపు ప్రక్రియ సులువుగా మారింది. ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించేందుకు స్థానికంగా నివాసం ఉండరాదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. స్థానికత ఆధారంగా విధులు కేటాయించే అవకాశం ఉండటంతో.. ఉద్యోగుల జన్మస్థలం వివరాలు తప్పనిసరి కానున్నాయి. జిల్లాలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఇలా.. శాఖల వారీగా ఉద్యోగుల నియామకానికి కసరత్తు ఎన్నికల విధులు బాధ్యతగానిర్వర్తించేలా చర్యలు అత్యవసర శాఖల సిబ్బందికి మినహాయింపు -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ఉండవెల్లి: ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపరాదని ఏఎస్పీ శంకర్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి పోలీస్స్టేషన్లో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, అజాగ్రత్త కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమా దాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య, సీఐ రవిబాబు, ఎస్ఐ శేఖర్, సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు. పశువులకు టీకాలు తప్పనిసరి కేటీదొడ్డి: పశువులకు తప్పనిసరిగా వ్యాధినిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి శివానందస్వామి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో మంగళవారం గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంపదతో రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. చూడి కట్టని పశువులతో పాటు సకాలంలో ఎదకు రాని పశువులకు సరైన చికిత్స అందేలా చూడాలన్నారు. కాగా, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరంలో 20 ఆవులు, 15 గేదెలకు గర్భకోశ చికిత్సలు అందించారు. మరో 15 పశువులకు సాధారణ చికిత్స చేశారు. డా.వినయ్, రమేశ్, వెంకట్రాజీ, ప్రియాంక, నవీన్ చంద్ర, అర్పిత, యామిని, ఉష, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సుప్రభాత సేవ, పుణ్యహవచనం, పంచామృత అభిషేకం, తీర్థగోష్టి, ప్రభంద పారాయణం వంటి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం భోగి సందర్భంగా గోదా రంగనాథస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ వేడుక కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
కేసీఆర్ వస్తేనే పాలమూరుకు నీళ్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్యర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పల్లె, పట్టణం తేడా లేకుండా అభివృద్ధి.. బీఆర్ఎస్ హయాంలో పల్లె, పట్టణం తేడా లేకుండా అభివృద్ధి చేశామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సమాంతరంగా అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. తాను మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మహబూబ్నగర్తో పాటు వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధిని గమనించాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, ఫైఓవర్ల నిర్మాణం, వీధి వ్యాపారుల దుకాణాలను చూశాక తనకు కడుపు నిండిందని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో పనులన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. మైగ్రేషన్ జిల్లా కాదు.. ఇరిగేషన్కు మారుపేరుగా మార్చాం పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్దే పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర మహబూబ్నగర్లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మైగ్రేషన్ జిల్లాను ఇరిగేషన్ జిల్లాగా మార్చాం.. వలసలకు మారుపేరుగా ఉన్న పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ జిల్లాగా మార్చామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు రిజర్వాయర్లతో సహా 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. పాలమూరులోని ఐటీ హబ్లో ఏర్పాటైన 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయని ప్రశ్నించారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
గద్వాలవ్యవసాయం: పీఎం కిసాన్ సమ్మాన్నిధి లబ్ధిదారులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని నది అగ్రహారంలో ఏర్పాటుచేసిన ఫార్మర్ రిజిస్ట్రీ అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పట్టా భూమి కలిగిన రైతులు తమ ఆధార్కు లింక్ ఉన్న ఫోన్ నంబర్తో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తిచేసుకోవాలని చెప్పారు. ప్రతి రైతుకు 11 నంబర్లు గల రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుందని.. జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో అర్హులైన రైతులందరూ ఈ నెల 15వ తేదీలోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలిపారు. అదే విధంగా పీఎం కిసాన్ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించచారు. కార్యక్రమంలో ఏఈఓ హరీశ్ పాల్గొన్నారు. -
జోగుళాంబ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
అలంపూర్: జోగుళాంబదేవి వార్శిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డితోపాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసినట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో వార్శిక బ్రహ్మోత్సవా లు, అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వర కు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వీరితోపాటు ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, జానకిరామశర్మ తదితరులున్నారు. ఫిర్యాదుల స్వీకరణ గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఏఎస్పీ శంకర్ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదాలు, ఆస్తి తగాదాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఏఎస్పీ తెలిపారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అలంపూర్: రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఐ రవిబాబు అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద పోలీసుశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 44వ జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందజేసి భద్రతను ప్రోత్సహించారు. కార్లు, లారీలు, ఆటోలు వంటి వాహనాలకు రాత్రివేళ స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎన్హెచ్ఏఐలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రిఫ్లేక్టివ్ సేఫ్టీ జాకెట్లు అందజేశారు. వాహనదారులకు గులాబీ పువ్వులు అందించి.. నిదానంగా, జాగ్రత్తగా ప్రయాణించాలని స్నేహపూర్వకంగా సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ ఆర్.శేఖర్, ఏఎంవీఐ పవన్కుమార్, రమేశ్, నేషనల్ హైవే అథారిటీ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. -
మహిళలే కీలకం..!
పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికం పరిష్కారం చూపించలేదంటూ విమర్శలు.. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజయాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని పదవీ కాలం ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని అభ్యంతరాలు? -
వివేకానందుడి స్ఫూర్తితో ఎదగాలి
గద్వాలటౌన్: యుక్త వయసులోనే దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుడని.. ఆయన స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్మార్గ్ రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా.. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత తన క్యాంపు కార్యాలయంలో వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. వీహెచ్పీ నాయకులు కోటలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో బీజేపీ నా యకులు రామాంజనేయులు, జయశ్రీ,, రవికుమా ర్, రమాదేవి, సమత, అనిల్, భారతి పాల్గొన్నారు. -
క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యం
గద్వాలటౌన్: గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సీఎం కప్ టార్చ్ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా టార్చ్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఔత్సాహిక క్రీడాకారులకు సీఎం కప్ గొప్ప అవకాశమని, జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. చీకట్లో ఏదైనా వస్తువును వెతికేందుకు టార్చ్ లైట్లు ఎలా వినియోగిస్తామో.. అలాగే ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసేందుకు ఈ టార్చ్ ర్యాలీ దోహదపడుతుందన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని ఆటలు ఆడేందుకు కేటాయించాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, డీవైఎస్ఓ కృష్ణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 72 ఫిర్యాదులు గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అదనపు కలెక్టర్కు నేరుగా వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై మొత్తం 72 ఫిర్యాదులు అందాయని, వాటిని పెండింగులో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్డీసీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
లక్ష్యం.. గ్రీన్ గంగాపురం
జడ్చర్ల టౌన్: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ (స్వామి వివేకానంద యూత్) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. -
పోలీసులకు సమాచారం అందించండి
గద్వాల క్రైం: సంక్రాంతి పండగ సెలవులను పురస్కరించుకొని ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసు శాఖ సూచనలు పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రటకనలో పేర్కొన్నారు. ఇంట్లో ఒక్కరూ కూడా ఉండకుండా తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఇరుగు పొరుగు వారిని తెలపడంతో పాటు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. విలువైన బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలనీలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే డయల్ 100 లేదా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసుశాఖ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించి దొంగతనాలను కట్టడి చేద్దామన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు తరలిరండి గద్వాల: సీపీఐ శతాబ్ది భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు కోరారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు నేపథ్యంలో పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీకి చెందిన అగ్రనాయకులతో పాటు, 40 దేశాలకు చెందిన కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రంగన్న, ఆశన్న, కృష్ణ, పరమేష్, ప్రవీణ్, రాజు, వెంకట్రాములు, రవి తదితరులు పాల్గొన్నారు. బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థినులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. జీసీడీఓలు అర్షాఖాద్రీ, సంగీత, మాస్టర్ ట్రైనర్లు నాయు డు, పల్లవి, శివలీల, నర్మద పాల్గొన్నారు. -
సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం.. ముందుండి.. రక్తదానం నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో తరిస్తున్న యువతరం రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు.. నేడు జాతీయ యువజన దినోత్సవం -
సంక్షేమ పథకాలతో చేయూత
అలంపూర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదలకు చేయూత అందిస్తామని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. కర్నూలులోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే విజయుడు ఆదివారం అందజేశారు. అలంపూర్ మండలం భీమవరానికి చెందిన జయంద్రకు రూ.10 వేల చెక్కు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసిన నాయకులు: క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడును కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిక పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వసూళ్లలో తగ్గిన దూకుడు
2025–26లో కేటాయించిన లక్ష్యంలో డిసెంబర్ 31 వరకు చేరుకున్నది ఇలా.. (రూ.కోట్లలో..) పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కా ర్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధిక లోడ్.. పత్రాలు.. జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు. మహబూబ్నగర్ జిల్లాలో వసూలు చేసిన పన్నుల వివరాలు పన్ను రకాలు లక్ష్యం వసూలు చేసింది శాతం (రూ.లక్షల్లో..) మూడునెలల పన్ను 1,735.01 1,639.03 94.46 జీవితకాల పన్ను 5,301.00 4,230.19 79.79 ఫీజులు 990.00 798.84 80.69 సర్వీస్ ఫీజు 243.00 295.46 121 డిటెక్షన్ 207.00 338.68 163 గ్రీన్ట్యాక్స్ 117.00 119.28 101 లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం సిబ్బంది కొరతతో నామమాత్రంగా తనిఖీలు మూడు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్, ఆర్టీఓ, మహబూబ్నగర్ -
క్రీడాస్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు
గద్వాలటౌన్: ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురారి సోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని కబీర్దాస్ అనిత నర్సింహులు సహకారంతో డీటీడీసీ యూత్ నిర్వహించిన తెలుగుపేట ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా పెట్టుకొని ఆడాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక దృఢత్వం లభిస్తుందన్నారు. గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమన్నారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అనిత, నాయకులు నర్సింహులు, తాయన్న, కిట్టు, వెంకట్రాములు, దేవన్న, చిన్న తదితరులు పాల్గొన్నారు. -
సేవ చేయడం అదృష్ట్రం..
ఆత్మకూర్లో వివేకానంద సేవాసమితిని నెలకొల్పిన నాటి నుంచి యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాం. రక్తదాన, వైద్యశిబిరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – బాలు, సేవాసమితి అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: పట్టణానికి చెందిన డాన్స్మాస్టర్ బాలు, మ్యాడం శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్ తదితరులు ఎనిమిదేళ్ల క్రితం స్వామి వివేకానంద సేవాసమితిని నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లాత్ సంచులను పంపిణీ చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకు 275 మందితో రక్తదానం చేయించారు. నేత్రం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల్లో కంటి లోపాలను గుర్తించి.. చికిత్స అందేలా చూస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ●తలసేమియా బాధితులకు అండగా.. -
అలంపూర్ ఆలయాల బ్రహోత్సవాలకు ఆహ్వానం
అలంపూర్: దక్షిణకాశీలో జరిగే వార్శిక బ్రహోత్సవాలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించారు. కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడులను అలంపూర్ క్షేత్ర ఆలయాల ఈఓ దీప్తి అర్చకులతోపాటు శనివారం కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలంపూర్ క్షేత్రంలో జరిగే జోగుళాంబ అమ్మవారి వార్శిక బ్రహోత్సవాలకు, బాలబ్రహ్మేశ్వరస్వామి మహా శివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసినట్లు పేర్కొన్నారు. అమ్మవారి వార్శిక బ్రహోత్సవాలు ఈ నెల 19 నుంచి 23 వరకు, స్వామివారి మహాశివరాత్రి మహోత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జరగనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి బ్రహ్మయ్యఆచారి, అర్చకులు జానకిరామశర్మ, త్యాగరాజుస్వామి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈనెల 12వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంబీసీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానిస్తారని పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు, మున్నూరురాజు, ప్రభాకర్, వర్ధభాస్కర్, కిషన్, రమేష్, సత్తి, తదితరులు పాల్గొన్నారు. -
పరవశించే మది
ప్రకృతి ఒడి..● పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం ● ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు ● జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు ● వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ ● రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ – సాక్షి, నాగర్కర్నూల్ -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జోరుగా చర్చ ● టికెట్ల కోసం ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు ● వార్డులకు ఐదారుగురు పేర్లు పరిశీలిస్తున్న పార్టీలు ● జనరల్ స్థానాలపై సీనియర్ నేతల ప్రత్యేక దృష్టి ● జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రాజకీయ సందడి గద్వాల టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే ఓటరు ముసాయిదా జాబితాపై స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించే ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ నెల 12న వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతోపాటు 16న ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డులోని పోలింగ్ కేంద్రాల్లో విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు మున్సిపల్ శాఖ శ్రీకారం చుడుతుంది. ఈ క్రమంలోనే అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. రిజర్వేషన్లు ఖరారుకాక ముందే ఆశావహులు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లిలో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల్లో చాలామంది పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. తాజా మాజీ కౌన్సిలర్లు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, పార్టీలో ఏళ్లుగా కొనసాగుతున్న చోటామోటా నాయకులు పోటీకి సై అంటున్నారు. ఓటర్ల జాబితా, వార్డుల వారిగా కులగణనకు సంబంధించి లెక్కలు అనధికారికంగా విడుదల కావడంతో ఆ దిశగా రిజర్వేషన్లపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. టికెట్ల కోసం ఆయా పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గద్వాల పట్టణ కాంగ్రెస్లో బీఫారం లొల్లి నెలకొంది. ఏడాదిన్నరగా గద్వాల కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో నడుస్తోంది. ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలుగా నాయకులు, కార్యకర్తలు విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం ఎవరికివారు పోటీ చేసి ఇరువురు అభ్యర్థులు సత్తాచాటారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే దూకుడు కనిపిస్తుంది. అయితే పార్టీ పరంగా ఎన్నికలు కావడంతో పార్టీ బీఫాం అభ్యర్థులకు కీలకంగా మారనుంది. రెండు వర్గాలలో ఎవరికి పార్టీ బీఫాంలు దక్కుతాయోననే చర్చ అందరిలో నెలకొంది. ఎమ్మెల్యే వర్గానికే అన్ని బీఫాంలు వస్తాయని అంచనా వేసుకుని ఆ వర్గంలోని నాయకులు అన్ని వార్డులలో పోటీకి సై అంటున్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గానికి సగం వార్డులో పోటీ చేయడానికి పార్టీ బీఫాం ఇస్తారనే చర్చ సైతం జోరుగా సాగుతోంది. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయా వర్గాలలో పార్టీ బీఫాం రాని అభ్యర్థులకు బీఆర్ఎస్ నాయకులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్లో పార్టీ బీఫాం రాని అభ్యర్థులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీ బీఫాం రాకుంటే రెబల్గా పోటీ చేయడమా.. లేదా పార్టీ ఫిరాయించడమా అనే దానిపై అందరి ముఖ్యులతో మంతనాలు చేస్తున్నారు. -
హైలెవల్.. ముందడుగు
జూరాల వద్ద ప్రారంభమైన వంతెన నిర్మాణం ● రూ.123 కోట్ల అంచనా వ్యయంతో.. ● తాత్కాలిక రోడ్డు ఏర్పాటు.. కొనసాగుతున్న రాకపోకలు ● ఆత్మకూర్, గద్వాల మధ్య తగ్గనున్న దూరం ● ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రాంతవాసులు గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల) మండలంలోని జూరాల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు కావాలని అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురిచేసినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. – పరమేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం. – నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్) ఆత్మకూర్: ఈ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. మండలంలోని జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై హై లేవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. రూ.123 కోట్లతో హై లేవల్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న శంకుస్థాపన చేశారు. వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు ప్రారంభించారు. ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లాలంటే 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం అనంతరం గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారపరంగా ఆత్మకూర్, జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించడంతో ఆర్అండ్బీశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. గత నెలలోనే పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరతగతిన నిర్మాణం పూసేందుకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. కృష్ణానదిపై హైలేవల్ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ -
జిల్లాకు ఈ నెల 19న మంత్రుల రాక
● పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ● రెండో విడత డబుల్ ఇళ్ల పంపిణీ ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: జిల్లాలో పలు అభివృద్ధి పనులు, నూతన భవనాలను ప్రారంభించేందుకు ఈ నెల 19 న రాష్ట్ర మంత్రులు జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి నర్సింగ్కాలేజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, మహిళా సమాఖ్య భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు నర్సింగ్ కాలేజీ మంజూరై నాల్గో సంవత్సరం తరగతులు ప్రైవేటు భవనంలో కొనసాగుతున్నాయని, నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా రెండో విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు డబుల్బెడ్ రూమ్ ఇళ్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇదివరకే కేంద్రం నుంచి సంబంధిత అధికారులు గద్వాలకు వచ్చిస్థలాన్ని సైతం పరిశీలించారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ వేణుగోపాల్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ హనుమంతమ్మ పాల్గొన్నారు. -
‘తాగునీటి సమస్య రానివ్వొద్దు’
గద్వాల: జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జలజీవన్ మిషన్, జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్ కమిటీ సమన్వయ సమావేశంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని నివారించే పథకాలు జలజీవన్ మిషన్, హర్ఘర్ జల్ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 3వ వారంలోగా ప్రతి మండలంలో ఎంపిక చేసిన రెండు గ్రామ పంచాయతీల్లో విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన పూర్తి తాగునీటి సమాచారాన్ని ఈ–పంచాయతీ డాష్బోర్డులో జనవరి 26లోగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడ తాగునీటి సమస్యలు లేనప్పట్టికీ సరఫరాలో ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులను అప్పటికప్పుడు పరిష్కరించేలా ముందస్తు ప్రణాళిక తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ కారణాలతో 39 ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సరఫరా నిలిచిందని, వెంటనే సమస్య పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డీసీఈఓ నాగేంద్రం, మిషన్భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈలు శ్రీధర్రెడ్డి, పరమేశ్వరి, డీఈ కృష్ణ, ఆయా మండలాల ఏఈలు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు
అలంపూర్: బాల్య వివాహాలు బాలల భవిష్యత్ అధంకారంలోకి నెడతాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించొద్దని సీడీపీఓ సుజాత, డీసీపీఓ నరసింహ అన్నారు. వడ్డేపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో మహిళాభివృద్ధి, శివు సంక్షేమ శాఖ బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ సుజాత మాట్లాడుతూ.. ఏదైనా పెళ్లి సమాచారం తెలిసినప్పుడు సర్వీస్ ప్రొవైడర్లు, పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్స్, టెంట్ హౌస్, ప్రింటింగ్ ప్రెస్ వారు వధూవరుల వయస్సును ధృవీకరించుకోవాలని సూచించారు. ఒకవేళ వారి వయస్సు ధృవీకరించుకోకపోతే బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిగా శిక్షార్హులవుతారని తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే రూ.లక్ష జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. పిల్లలకు ఏ సమస్య ఉన్నా 100, 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఐసీపీఎస్ మండల ఇన్చార్జులు లక్ష్మీదేవి, ప్రకాష్, సూపర్వైజర్లు పుష్ప, లక్ష్మీదేవి, ఏపీఎం ఎల్లప్ప, ఎంఈఓ నర్సింహులు, హబ్ సిబ్బంది చిట్టెమ్మ, సరోజ, నాగరాజు తదితరులు ఉన్నారు. హుండీ ఆదాయం రూ.29,42,618 మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ.29,42,618 వచ్చినట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ పర్యవేక్షణలో 200 మంది ఎస్వీఎస్ సేవాసంఘం సభ్యులు హుండీ లెక్కింపు నిర్వహించారు. అదే విధంగా చింతలముని నల్లారెడ్డి స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,32,406 వచ్చినట్లు ఆయన తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది ఆలయ హుండీ ఆదాయం పెరిగిందన్నారు. అనంతరం సేవాసమితి సభ్యులను ఆలయ చైర్మన్, ఈఓలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచు చిట్టెమ్మ, ఆలయ నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు, బాబురావు, నాయకులు సీతారామిరెడ్డి, మధుసూదన్రెడ్డి, నరేందర్, నారాయణ, పద్మారెడ్డి, వీరారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో మేథోశక్తిని పెంపొందించాలి గద్వాలటౌన్: ఆంగ్లభాషలో ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు స్పెల్లింగ్పై అవగాహన కల్పించేందుకు ‘ఎల్టా’ నిర్వహించిన ఒలింపియాడ్, ఉపన్యాస పోటీల కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. శుక్రవారం స్థానిక బాలభవన్లో తెలంగాణ రాష్ట్ర ఆంగ్ల భాషోపాధ్యాయ సంఘం (ఎల్టా) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆంగ్లభాషా నైపుణ్యంపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో పాటు ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు ఆయా విభాగాల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓలు శ్రీనివాస్గౌడ్, సురేష్ బహుమతుల ప్రదానం చేశారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎల్టా అధ్యక్షుడు మైఖేల్, ప్రధాన కార్యదర్శి సుమలత, కోశాధికారి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. వివేకానందుడి స్ఫూర్తితో ఎదగాలి గద్వాలటౌన్: యుక్త వయస్సులోనే భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుడని, ఆయన స్ఫూర్తితో యువకులు ముందుకు సాగాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ కలందర్బాషా పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ముందస్తుగా శుక్రవారం స్థానిక కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
అలంపూర్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్–12 నిర్వహిస్తున్నట్లు సహాయ కార్మిక అధికారి వేణుగోపాల్, జిల్లా బాలల సంరక్షణ కౌన్సిలర్ సురేష్ పేర్కొన్నారు. అలంపూర్ పట్టణంలోని కిరాణాలు, పంట పొలాలు, బైక్ మెకానిక్ షాపులు, హోటళ్లలో వారు శుక్రవారం తనిఖీ చేశారు. వివిధ పనుల్లో 18 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు పనిచేస్తున్నట్లు గుర్తించారు. 14 ఏళ్ల లోపు ఇద్దరు కూల్డ్రింక్ షాప్లో పని చేస్తున్నట్లు తెలిపారు. యజమానిపై అలంపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చారు. కార్యక్రమలో కానిస్టేబుల్ భరత్, శిల్ప, చైల్డ్ లైన్ సిబ్బంది లక్ష్మి తదితరులు ఉన్నారు. -
సిబిల్ సప్లయ్..!
ఉమ్మడి పాలమూరు జి ల్లాలో 2020 నుంచి న వంబర్ వరకు 148 మంది మిల్లులను డీఫాల్ట్గా గుర్తించి.. 52 మిల్లులపై కేసులు నమోదు చేశారు. వీటి పరిధిలో రూ.566 కోట్ల విలువైన ధాన్యం ఉంది. ఇందులో రూ.450 కోట్ల విలువైన ధాన్యాన్ని రాబట్టాల్సి ఉండగా..ఈ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. పైగా ఆయా రైస్ మిల్లర్ల చేతిలోని మిల్లులు సహకరించే అధికారులు, నేతలకు అక్షయపాత్రగా మారాయి. దీనిపై విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్ అధికారులు సైతం సందర్భాన్ని బట్టి దాడులు నిర్వహించి.. చేతులు తడుపుకొని పోతారనే విమర్శలూ ఉన్నాయి. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఆ శాఖపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలోనే మిల్లర్ల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గ్రహించిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అవినీతికి కేరాఫ్గా నిలిచిన సివిల్ సప్లయ్ శాఖపై ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు అవినీతి నిరోధకశాఖ దూకుడు పెంచడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా ఇటీవల వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం జగన్మోహన్ రెడ్హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం.. ఆ తర్వాత ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలను సైతం విచారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్ వేదికగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఉమ్మడి పాలమూరులో సంచలనం సృష్టిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలు పైస్థాయి దాకా లంచాల్లో వాటాల పంపకాలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో ‘దోస్తాన్’ దందాతోనే.. మర ఆడిచేందుకు ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యంలో మిల్లర్ల అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పెట్టుబడి పెట్టకుండా అవకతవకలకు పాల్పడుతూ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన సివిల్ సప్లయ్ శాఖ మిన్నకుండిపోయింది. ప్రధానంగా మిల్లర్ల నుంచి ఆ శాఖకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు కుమ్మకై ్క నెల నెలా లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకరించని మిల్లర్లను నానా తిప్పలు పెట్టి దారికి తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇలా మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు దోస్తాన్ దందాకు తెగబడడంతో ప్రధానంగా వనపర్తిలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్.. ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఏ‘సీ’బీ.. చిక్కిన డీఎం వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కొత్తకోట మండలంలోని ఓ రైస్ మిల్లుకు సంబంధించి సీఎమ్మార్ అనుమతి కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేశాడు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్లోని తన కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ కారులో మిల్లు నిర్వాహకులను ఎక్కించుకుని తొలి విడతగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనతో పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పర్వం, అధికారుల ధనదాహం మరోసారి వెలుగుచూసినట్లయింది. ముందుగావిజి‘లెన్స్’.. డీఎస్ఓ, అడిషల్ కలెక్టర్పై విచారణతో.. పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ను వల పన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా శుక్రవారం డీఎస్ఓ కాశీనాథం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యానాయక్ను విచారించడం సంచలనం సృష్టిస్తోంది. ఉదయం కలెక్టరేట్లోని డీఎం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు వారిని పిలిపించుకున్నారు. సుమారు ఏడు నుంచి పది గంటల వరకు ఇద్దరు జిల్లాస్థాయి అధికారులను విచారించడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పౌర సరఫరాల శాఖలో లంచావతారులు కింది స్థాయి నుంచి పైదాకా వాటాల పంపకాలు? రూ.50 వేలతో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన వనపర్తి డీఎం తాజాగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలపై విచారణతో కలకలం ఓ వైపు విజిలెన్స్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ దాడులు ఉమ్మడి పాలమూరులో అధికారులఉక్కిరిబిక్కిరి -
అందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం
గద్వాల: అందరికీ ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా వీబీజీ రామ్ జీ బిల్లును తీసుకొచ్చినట్లు ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీకి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ఎలాంటి బంధం లేదని, కేవలం వారు గాంధీ అని పేరు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. గతంలో మాదిరి నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం పథకంలో మార్పులు తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా వంద రోజుల పని దినాల నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ పనులు జరిగే సమయాల్లో కూలీల కొరత లేకుండా 60 రోజులు హాలీడే వెసులుబాటును కల్పించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరుకు గుండె లాంటి జూరాల ప్రాజెక్టు నిర్వహణను గత, ప్రస్తుత ప్రభుత్వాలు గాలి కొదిలేశాయని, దీంతో ప్రాజెక్టు ఆయుషు తగ్గుతుందన్నారు. ప్రాజెక్టు రక్షణ కోసం నిర్మించాల్సిన బ్రిడ్జిని ఆర్అండ్బీ బ్రిడ్జిగా మార్చడం సరైంది కాదని, దీనివల్ల జూరాల డ్యాం కు ప్రమాదం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, మిర్జాపురం వెంకటేశ్వర్రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసులు తదతరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధం
● రీజియన్ నుంచి అదనపు బస్సులు ● హైదరాబాద్ నుంచి డిపోల వైపు 430 సర్వీసులు ● నేటినుంచి ప్రారంభం కానున్న రాకపోకలు స్టేషన్ మహబూబ్నగర్: పల్లె సంస్కృతి ప్రతిబింబించే సంక్రాంతి పండుగకు ఎక్కడున్న వారి స్వస్థలాలకు రావడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, శ్రామికులు ఈ పండుగకు ఇళ్లకు వచ్చి మూడు రోజులు జరిగే పండుగ సంబరాలను ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 10 డిపోల నుంచి అదనపు బస్సులను నడపనున్నారు. శుక్రవారం నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్లోని పది డిపోలకు 430 బస్సులు నడపనున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్కు అదనపు సర్వీసులు నడపడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఈ రూట్లోనే ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు. తిరగనున్న బస్సు సర్వీసులుడిపో అచ్చంపేట 7 11 11 7 11 గద్వాల 7 11 11 7 11 కల్వకుర్తి 7 11 11 7 11 కొల్లాపూర్ 6 10 10 6 10 కోస్గి 2 3 3 2 3 మహబూబ్నగర్ 8 11 11 8 11 నాగర్కర్నూల్ 7 10 10 7 10 నారాయణపేట 7 11 11 7 11 షాద్నగర్ 7 11 11 7 11 వనపర్తి 7 11 11 7 11 తిరుగు ప్రయాణంలో డిపోల నుంచి హైదరాబాద్ వైపు డిపో 17న 18న 19న 20న 21న అచ్చంపేట 7 11 11 7 5 గద్వాల 7 10 10 7 5 కల్వకుర్తి 7 11 11 7 5 కొల్లాపూర్ 5 8 8 5 4 కోస్గి 2 3 3 2 2 మహబూబ్నగర్ 7 10 10 7 5 నాగర్కర్నూల్ 7 10 10 7 5 నారాయణపేట 7 11 11 7 5 షాద్నగర్ 7 11 11 7 5 వనపర్తి 7 11 11 7 5 -
క్రీడలతో శారీరక దృఢత్వం
● బీచుపల్లి పదో బెటాలియన్ సిబ్బంది సేవలు విలువైనవి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల టౌన్/ఎర్రవల్లి: శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్ పోలీస్ సిబ్బందికి మూడు రోజులపాటు నిర్వహించిన వార్షిక క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వివిధ కంపెనీల బెటాలియన్ సిబ్బంది కవాతును కలెక్టర్ తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసేందుకు శారీరకంగా దృఢంగా ఉండటం ప్రధానమని పేర్కొన్నారు. ఏటా నిర్వహించే క్రీడల పోటీల సందర్బంగా కాకుండా ప్రతినిత్యం ఇక్కడ పోలీస్ సిబ్బంది వ్యాయామం, వివిధ క్రీడల్లో సాధన చేస్తూ ఫిట్గా ఉండాలని సూచించారు. విజేతలుగా ఎవరు నిలిచినప్పటికీ పోటీల్లో పాల్గొనడం, క్రీడాస్పూర్తితో ఆడటం ముఖ్యమని తెలియజేశారు. బెటాలియన్ అతిధి గృహం విస్తరణకు కలెక్టర్ నిధుల నుంచి రూ.10లక్షలు ఇవ్వడం జరిగిందని, భవిష్యత్తులోనూ తన వంతుగా సహకారం అందిస్తామనన్నారు. ఎన్నికల నిర్వహణకు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు, బందోబస్తు సమయంలో బెటాలియన్ పోలీసుల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. మూడు దశాబ్దాలుగా సేవలు : కమాండెంట్ జయరాజు 1995లో ప్రారంభమైన పదో బెటాలియన్ సుమారు మూడు దశాబ్దాల పాటు రాష్ట్రంలో బందోబస్తు, నక్సలిజం నిర్మూలన, పరేడ్స్, తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తుందని కమాండెంట్ జయరాజు అన్నారు. ప్రతి ఏటా సిబ్బందిలో స్నేహభావం పెంచడంతో పాటు శరీర దృఢత్వాన్ని పెంచడం కోసం వార్షిక క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన సిబ్బందికి కలెక్టర్ పతకాలు, ట్రోఫీలు అందజేసి అభినందించారు. కలెక్టర్కు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పాణి, నరేందర్రెడ్డి, ఏఓ తాజుద్దీన్, సంక్షేమ అధికారి నర్సింహరాజు, ఇతర అధికారు పాల్గొన్నారు. అంధులు అత్మస్థైర్యంతో ముందుకు సాగాలి అంధులు తమ లోపాన్ని అధికమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంధుల ఆశ్రమ పాఠశాలలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ అంధత్వాన్ని శాపంగా భావించకుండా, లూయీస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకుని రాణించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంధులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. యుడీఐడీ కార్డుల మంజూరు చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇటీవల మున్సిపల్ వార్డు ఆఫీసర్గా ఉద్యోగం సాధించిన పాఠశాల పూర్వ విద్యార్థి శివకుమార్ను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో ఉన్న లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అఽధికారిణి సునంద, డీఈఓ విజయలక్ష్మి, పాఠశాల కార్యదర్శి రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
పునఃపరిశీలన
పుర పోరు నేపథ్యంలో ఇటీవల ఓటరు ముసాయిదా విడుదల ఓటరు ముసాయిదా జాబితాపై వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి పరిశీలన చేస్తున్నాం. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల సాధ్యాసాధ్యాలను, పొరపాట్లను సవరించి తుది జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నాం. – జానకిరామ్సాగర్, కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచురించిన వార్డుల వారీ ఓటరు ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించారు. జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించారు. అయితే వీటిపై జిలాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. వివిధ వార్డులలో వేర్వేరు కాలనీలకు చెందిన నివాస ఓటర్లను మరో వార్డులోకి పెద్ద సంఖ్యలో కలపడం, ఒకే కాలనీకి చెందిన నివాస ప్రాంతాలను విభజించడంపై వచ్చిన ఫిర్యాదులపై ప్రధానంగా దృష్టి సారించారు. విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న అభ్యంతరాలను సవరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. వివిధ కాలనీలలో నివాస గృహాల ఓటర్ల సరళి, విస్తరించిన తీరు, సమీపంలోని వార్డులలో కలపడం లేదా తొలగించడం వంటి అంశాలతో పాటు ఫిర్యాదులో పేర్కొన్న అభ్యంతరాల తీవ్రత, వాటి ప్రభావం తదితర అంశాలను పరిశీలించారు. వీటన్నింటిని మదింపు చేసి ఈ నెల 12న తుది జాబితాపై తయారీకి సమాయత్తమవుతున్నారు. అనుకూలతలే ప్రామాణికంగా ఫిర్యాదులు గద్వాల మున్సిపాలిటీలో వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాల్లో ఎక్కువగా ఆశావహుల అనుకూలతలే ప్రామాణికంగా ఫిర్యాదులు వచ్చాయి. తమకు సంబంధించిన ఓటర్లు ఇతర వార్డులకు వెళ్లడం, వార్డుల్లో కుల సమీకరణలు మారితే రిజర్వేషన్లపై ప్రభావం చూపడం తదితర అంశాల ప్రాతిపదికన నాయకులు విజ్ఞాపనలు అందజేసినట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమవుతుంది. ఇవి కాక పట్టణంలో ప్రధానంగా 07, 16, 17, 30వ వార్డుల పరిఽధిలో ఓటర్లను గంపగుత్తగా ఇతర వార్డులకు బదలాయించారని ఎక్కువగా అభ్యంతరాలు రావడంతో ప్రతి ఫిర్యాదుపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ఇంటి నంబరు, ఓటర్లు ఉన్నారా లేదా అనే వాటిపై ఆరా తీశారు. వార్డు సమీపంలో ఉన్న ఓటర్లను దూరంగా ఉన్న మరో వార్డులోకి చేర్చడం వంటి వాటిపై కూడా ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని వార్డులలో ఉన్న ఓటర్ల వ్యత్యాసంపై కూడా దృష్టి సారించారు. వార్డు లలో ఓటర్ల వ్యత్యాసం హెచ్చు తగ్గులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్ల సంఖ్యను సమ న్వయం చేయడానికి కొన్ని ప్రాంతాలను వార్డు మ్యా పింగ్ ద్వారా విభజన చేస్తున్నారు. ప్రధానమైన అభ్య ంతరాలను ఇప్పటికే పరిష్కరించామని, ప్రక్రియ తు ది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలు వార్డులు ఫిర్యాదులు గద్వాల 37 36 అయిజ 20 53 అలంపూర్ 10 00 వడ్డేపల్లి 10 56 ఓటరు ముసాయిదాపై వచ్చిన విజ్ఞాపనల్లో పలు ప్రాంతాలను కలపడం, విడగొట్టడంపై అధికారులు ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక వార్డులో పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లను, మరో వార్డులో చేర్చడంపై మరోసారి కసరత్తులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక్కడే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వార్డు ఓటర్లను సరిచేసే ప్రయత్నంలో మరో వార్డుకు చిక్కులు వస్తున్నాయి. ముసాయిదాలో జరిగిన లోపాలు, సవరించే అవకాశాలపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక కొలిక్కి తెచ్చారు. వీటిని మరోసారి సమీక్షించి, వార్డుల వారీ ఓటర్లతో పాటు పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియకు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్పు చేర్పులకు ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు 12న తుది జాబితా తయారీకి సమాయత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులు ముసాయిదా జాబితాలో కొంతమేర మార్పులు, చేర్పులు, జరిగే అవకాశం ఉందనే ఊహగానాలు వస్తుండటంతో ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. సరిహద్దులు, ఓటర్ల మార్పు ఏ విధంగా ఉంటుందనే విషయాలపై కూడికలు, తీసివేతలు చేసుకుంటున్నారు. మొత్తానికి అభ్యంతరాల పరిశీలనలో ఎన్ని తిరస్కరిస్తారు..? ఎన్ని పరిష్కరిస్తారనేది చూడాల్సి ఉంది. -
గతంలో రెండు పంటలకు సాగునీరు..
గతంలో అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందేది. గతేడాది యాసంగిలోనూ నీరు వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుత యాసంగిలో ఎత్తిపోతలకు నీటి సరఫరా నిలిపినట్లు అధికారులు ప్రకటించడంతో వ్యవసాయ పనులు మానుకున్నాం. పంట సాగుకు దూరమై నష్టపోతున్నాం. – కడియాల నర్సింహులు, రైతు, అమరచింత ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాసంగిలో పంటల సాగుకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. సాగునీరు అందించాలని ఏఈలు, ఈఈలకు విన్నవించాం. జూరాలలో నిల్వ నీటిమట్టం తగ్గుతున్నందున వేసవిలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జూరాలలో సమృద్ధిగా నీరు నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరచింత, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాస ంగిలో సాగునీరు ఇవ్వలేమని ముందస్తుగా ప్రకటించాం. ఈ విషయాన్ని సంబంధిత ఎత్తిపోతల నిర్వహణ కమిటీ సభ్యులకు వివరించాం. జూరాలలో ప్రస్తుతం 4 టీఎంసీలు మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా నిలిపివేశాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ విభాగం -
కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
అలంపూర్: బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు అన్నారు. అలంపూర్ పట్టణంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ....కేంద్ర ప్రభుత్వ నిధులతో అలంపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత కార్యర్తలపై ఉందన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుదద్ధ్యం వంటి సమస్యలు ఏళ్ల తరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి గెలిపించుకుందామన్నారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామన్నారు.సమావేశంలో నాయకులు శరత్, మధుసుధన్ గౌడు, సుధాకర్ యాదవ్, రాజగోపాల్, నాగేశ్వర్ రెడ్డి, నరేష్, మహేష్, వినీత్ కుమార్, మద్దిలేటి, హేమంత్, జగన్మోహన్ రెడ్డి, రవి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. -
క్రాప్ హాలిడే
● యాసంగి సాగుకు రైతులు దూరం ● జూరాల జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం ● గతేడాది అతి కష్టం మీద సరఫరా ●అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయంలో నిల్వనీటి మట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో ప్రాజెక్టుతో పాటు దానిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు యాసంగిలో సాగునీరు అందించలేమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమరచింత, చంద్రగఢ్ ఎత్తిపోతల ఆయకట్టులో యాసంగి సాగుకు బ్రేక్ పడింది. గతేడాది యాసంగిలో అతికష్టం మీద సాగునీటిని పొందిన ఆయకట్టు రైతులు ఈసారి ముందస్తుగానే సాగునీటిని ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు ప్రకటించడంతో రైతులు తమ వ్యవసాయ పనులు వదులుకున్నారు. యాసంగి సాగుకు నీరు అందితే వరి వేద్దామనుకున్న ఆయకట్టు రైతుల ఆశలు అడియాశలయ్యాయి. గతంతో రెండు పంటలకు సాగునీరు పొందిన రైతులు ఈసారి వానాకాలం పంటకు మాత్రమే నీరందింది. ప్రాజెక్టుకు వరదలు వచ్చినప్పుడు ఒడిసి పట్టుకునేందుకు వీలైనన్ని రిజర్వాయర్లు లేకపోవడంతో ప్రతి ఏటా యాసంగిలో సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత పాలకులు జూరాలపై మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి వరద నీరు కిందకు వెళ్లకుండా ఇక్కడే అడ్డుకట్ట వేస్తే ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా అమరచింత ఎత్తిపోతల పథకం కొనసాగుతోంది. ఈ లిఫ్ట్ ఆయకట్టు 2,400 ఎకరాలు ఉండగా.. మూలమళ్ల, మస్తీపురం, అమరచింత, సింగంపేట, ఖానాపురం, పాంరెడ్డిపల్లి గ్రామాల్లోని 1,090 మంది రైతుల భాగస్వామ్యంతో 23 ఏళ్లుగా సజావుగా కొనసాగుతోంది. ప్రతి ఏటా లిఫ్ట్ ద్వారా 1,200 ఎకరాలకు నీరు అందుతుండగా.. రైతులు పంటలు సాగు చేస్తున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ● ప్రస్తుత యాసంగిలో రామన్పాడ్ రిజర్వాయర్ వరకు కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో అమరచింత ఎత్తిపోతలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు తమ పంటల సాగుకు విరామం ప్రకటించారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం జూరాల బ్యాక్వాటర్పై ఆధారపడటంతో అధికారులు యాసంగిలో ముందస్తుగా నీటి సరఫరా నిలిపివేశారు. ఈ పథకం ద్వారా 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి పైప్లైన్ పనులు పూర్తి చేశారు. లిఫ్ట్ను చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాలుగా విభజించి ఒక్కో లిఫ్ట్ ద్వారా 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎత్తిపోతల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు యంత్రాలు కాలిపోవడంతో కేవలం 5 వేల ఎకరాలు మాత్రమే సాగవుతుంది. ఈ ఆయకట్టుకు కూడా యాసంగి సాగుకు నీటి సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న కొంతమేర వరిసాగు చేసుకుంటున్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా
గద్వాల: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన అనంతరం అధికారులపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాలుగు మున్సిపాలిటీలలో ఓటర్ల ముసాయిదా జాబితాను వార్డుల వారీగా పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 1, 2025 నాటి ఓటరు జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రతిఓటరును వారి నివాస భౌగోళిక పరిధి ఇంటి నంబర్, వార్డు సరిహద్దుల ఆధారంగా సంబంధిత వార్డులోనే నమోదు చేయాలన్నారు. ఒకవార్డులో నివసిస్తూ మరో వార్డులో నమోదైన ఓట్లను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల నమోదైన ఓట్లకు ప్రత్యేకంగా మ్యాపింగ్ నిర్వహించాలన్నారు. ప్లాట్నంబర్ ఆధారంగా నమోదైన ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేయాలని, పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు సులభంగా చేరుకునేలా ఉండాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో నామినేషన్, పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో వెబ్కాస్టింగ్ నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించారు. మున్సిపాలిటీలో రాజకీ య పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాల ని సూచించారు. ఈవీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ డీసీఈవో నాగేంద్రం, మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు. -
చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తాం
గద్వాల/అలంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేనేత కార్మికులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం చేనేత రంగంలో టెక్నాలజీ అనుకూలంగా ఎన్నో రకాల పరికరాలు వచ్చాయని, వాటికి అనుకూలంగా కార్మికులు చీరలను తయారు చేయాలని సూచించారు. అక్రమ వ్యాపారానికి అలవాటుపడ్డ కొందరు గద్వాల పేరు ప్రతిష్టను గద్వాల పేరుమీదుగా చీరలు తయారు చేసి డబ్బు వెనకేసుకుంటున్నట్లు, దీనివల్ల నిజమైన గద్వాల చేనేత కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన గద్వాల, గట్టు చేనేత కార్మికులకు ఎన్హెచ్డీపీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ క్లస్టర్ అభివృద్ధి పథకం కింద కార్మికులకు పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామలింగేశ్వర్, అక్కల శ్రీనివాసులు, మంత్రి సురేష్, జంబు రామన్గౌడ్, విజయ్, రాజశేఖర్, శ్రీనివాసులు మురళి, నాగిరెడ్డి, శ్రీను, షుకూరు, అన్వర్, భాస్కర్, మొబిన్, సంగాల నర్సింహులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అలంపూర్, రాజోళిలో.. రాజోళి రైతువేదికలో రాజోళి, అలంపూర్ క్లస్టర్లలోని చేనేత కార్మికులకు చేనేత లిఫ్టింగ్ యంత్రాలు ఎమ్మెల్యే విజయుడు అందించారు. మొత్తం 407 మంది చేనేత కార్మికులకు సబ్సిడీపై పరికరాలు అందించారు. చేనేత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, రుణమాఫీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అర్హులందరికీ సబ్సిడీపై పరికరాలు అందజేస్తామని, నియోజకవర్గంలో 800 మంది కార్మికులకు మిషన్లు అందనున్నట్లు చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య అన్నారు. ప్రస్తుతం 407 మంది కార్మికులకు అందిస్తున్నట్లు తెలిపారు. లిఫ్టింగ్ మిషన్తో చేనేత కార్మికులు బరువైన జాక్వార్డులను కాళ్లతో తొక్కాల్సిన పని ఉండదన్నారు. కార్యక్రమంలో ఏడీఓ ఉపేంద్ర, క్లస్టర్ సీడీఈలు శివమణి, సాకేత్, చేనేత సహకార సంఘం ఇన్చార్జి పరన్స్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు సబ్సిడీపై చేనేత యంత్రాలు
అలంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన చేనేత కార్మికులకు చేనేత లిఫ్టింగ్ యంత్రాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. రాజోళి మండల కేంద్రంలోని రైతువేదికలో రాజోళి, అలంపూర్ క్లస్టర్లలోని చేనేత కార్మికులకు చేనేత సబ్సిడీ పనిముట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ చేనేత అభివృద్ధి పథకం ద్వారా అలంపూర్, రాజోలి క్లస్టర్లలో చేనేత కార్మికులకు సబ్సిడీ పనిముట్లను ఎమ్మెల్యే విజయుడు అందజేశారు. క్లస్టర్–1లో 212 మందికి, క్లస్టర్– 2లో 195 మందికి మొత్తం 407 మంది చేనేత కార్మికులకు సబ్సిడీ పనిముట్లను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేనేత కార్మికులు ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్న రుణమాఫీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య మాట్లాడుతూ.. అర్హులందరికీ సబ్సిడీ పనిముట్లు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో 800 మంది కార్మికులకు మిషన్లు అందనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 407 మంది కార్మికులకు సబ్సిడీ మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. లిఫ్టింగ్ మిషన్తో చేనేత కార్మికులు బరువైన జాక్వార్డులను కాళ్లతో తొక్కాల్సిన పని ఉండదన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ నిధులు 50 శాతం వచ్చిట్లు తెలిపారు. చేనేత భరోసా పథకం ఈ నెలలో అమలవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఓ ఉపేంద్ర, క్లస్టర్ సీడీఈలు శివమణి, సాకేత్, చేనేత సహకార సంఘం ఇన్చార్జి పరన్స్ తదితరులు పాల్గొన్నారు. -
డయాలస్ట్రెస్!
పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్లో 963, డిసెంబర్లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బడం. ఇది 50 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జన దారిలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. రసాయన అవశేషాలున్న ఆహార పదార్థాలు తినడం, పొగాకు, ధూమపానం, గుట్కా వినియోగం చేయడం కలుషిత నీటిని తాగడంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి సమస్యగా మారుతుంది. నాటువైద్యంతో సైతం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ పరీక్షలు ప్రతి మూడు నెలలకోసారి చేసుకోవాలి. సిరామ్ పరీక్షతో కిడ్నీ పనితీరు తెలుస్తుంది. ప్రస్తుతం చాలా మంది సరైన సమయంలో పరీక్షలు చేసుకోకపోవడం వల్ల బాధితులు పెరుగుతున్నారు. నాటువైద్యం ఆశ్రయిస్తే భవిష్యత్లో మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం బాధితులకు వారంలో మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నాం. మహబూబ్నగర్లో 15, ఆత్మకూర్ 10, అలంపూర్ 15, బాలానగర్ 20, గద్వాల 10, నాగర్కర్నూల్10, నారాయణపేట 20, కొల్లాపూర్లో 15మందికి డయాలసిస్ చేయడానికి ఖాళీలు ఉన్నాయి. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి. – సిబాతుల్లా, క్లస్టర్ మేనేజర్ ఉమ్మడి జిల్లా వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికం అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స -
పశుసంపదతోనే వ్యవసాయాభివృద్ధి
గద్వాల వ్యవసాయం: పశుసంపద సమృద్ధిగా ఉంటేనే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి జిల్లా పశుగణాభివృధ్ది సంస్థ అధికారి మధుసూదన్గౌడ్ అన్నారు. బుధవారం గద్వాల మండలం బీరెల్లీ గ్రామంలో పశుగణాభివృధి సంస్థ, జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంపద వల్ల రైతుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని, చూడి కట్టని, సకాలంలో ఎదకు రాని పశువులకు సరైన వైద్యం అందించాలని రైతులకు సూచించారు. పశుగణాభివృధ్ది సంస్థ ఆద్వర్యంలో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి శివానంద్ మాట్లాడుతూ.. పాల దిగుబడి పెంపునకు పాడి రైతులు నిత్యం సరైన పోషణ అందించాలని సూచించారు. సరిపడా పచ్చిమేత, ధాన్యపు జాతి జొన్న, మొక్కజొన్న గడ్డి రకాలు, కాయ జాతి అలసందలు, బలమైన దినుసులతో సమీకృత దాణ, లవణ మిశ్రమాన్ని తయారు చేసి పశువులకు అందించాలన్నారు. చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలన్నారు. రాయితీపై గడ్డి విత్తనాలు అందిస్తామని తెలిపారు. శిబిరంలో భాగంగా 12 ఆవులు, 33 గేదెలకు గర్భకోశ పరీక్షలు, 15 పశువులకు సాధారణ చికిత్సలు నిర్వహించి, మందులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత రాధాకృష్ణారెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ రమేష్నాయుడు, యుఆర్ రమేష్, వెంకటేశ్వర్లు, అర్పిత, శంకరయ్య, వెంకట్రాజు, ప్రియాంక, నవీన్చంద్ర పాల్గొన్నారు. -
కదులుతున్న డొంక
రెండు హత్యలపై పూర్తి స్థాయి విచారణ ● పాత కేసులను తిరగతోడుతున్న పోలీసులు ● మిల్లు వీరన్నపై బిగుస్తున్న ఊచ్చు ● ఒక్కొక్కటిగా వెలుగులోకి నేర చరిత్ర –8లో uమాజీ సర్పంచ్ భీమరాయుడును సుపారీ గ్యాంగ్చే హత్య చేయించినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. ఈ కేసులో మిల్లు వీరన్నతో పాటు మరికొందరు ఉన్నారు. కస్టడీలో మరో రెండు హత్యలు చేయించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఈ కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గట్టు, కర్ణాటకలో నమోదైన కేసులపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తాం. నేరం చేసిన నిందితులు ఎవరైన సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు. – శ్రీను, సీఐ గద్వాల గద్వాల క్రైం: కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ భీమ రాయుడు హత్య కేసులో జిల్లా పోలీసుశాఖ విచారణ చేపట్టి సుపారీ గ్యాంగ్ ముఠా సభ్యులను కటాకటాల్లోకి పంపారు. అయితే మాజీ సర్పంచ్ను హత్య చేయించేందుకు మిల్లు వీరన్న రూ.25 లక్షలు సుపారీ ఇవ్వడంతో.. బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారనే విషయం బహిర్గతం అయ్యింది. అయితే, కోర్టు అనుమతితో మిల్లు వీరన్నను మరోసారి కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించగా.. మరో రెండు హత్య చేయించినట్లు వెల్లడించడంతో వాటిపై పోలీసులు అన్వేషణ చేపట్టారు. 2006 గట్టు మండలంలో, 2014లో కర్ణాటక రాష్ట్రం ఈడుపునూర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదడంతో అధికారులు పాత కేసులను తిరగదోస్తున్నారు. ఇన్నాళ్లు వ్యాపారం, రాజకీయం చేస్తున్నట్లు కనిపించిన ఇతను.. ఎవరికీ తెలియనీయకుండా నేరచరిత్రను కొనసాగిస్తున్నట్లు తాజా హత్యలతో బయటపడింది. పాత కేసులపై ఆరా.. 2006లో ఎర్రప్ప, 2014లో తాయప్పను హత్య చేసి తప్పించుకున్నాడు. ఇదే క్రమంలో మాజీ సర్పంచ్ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఎట్టకేలకు దొరికాడు. ఈ క్రమంలో పైరెండు పాత కేసులపై ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. 2006లో నమోదైన కేసు ఇక్కడి జిల్లాలోని గట్టు పోలీసు స్టేషన్ కావడంతో అప్పటి ఎఫ్ఐఆర్, కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్, కేసులోని నిందితులు, సాక్షుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు అప్పటి విచారణ అధికారులు అనుసరించిన అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడి జిల్లాలో కేసు నమోదైన క్రమంలో మిల్లు వీరన్న ప్రమేయాన్ని గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారా.. లేక రాజకీయ ఒత్తిళ్లతో వదిలేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. మరోవైపు 2014లో తాయప్పను కారులోనే హత్య చేసి మృతదేహాన్ని కర్ణాటక రాష్ట్రం ఈడుపునూర్ పోలీసు స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదంగా చీత్రికరించి అక్కడి పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఈ కేసు కర్ణాటకలో నమోదు కావడంతో అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈడుపునూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్, రోడ్డు ప్రమాదం చేసిన క్రమంలో ఏ వాహనం ఇలా అనేక ప్రశ్నలతో పోలీసులు ఆరా తీస్తున్నారు. మాజీ సర్పంచ్ హత్య కేసులో మిల్లు వీరన్న ఏ–1గా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. హత్య చేయించిన విధానం, సీసీ ఫుటెజీలు, కాల్ డేటా, సుపారీ గ్యాంగ్కు ఇచ్చిన నగదు, తప్పించుకునేందుకు వినియోగించిన వాహనాలు, ఇద్దరి మధ్య వైర్యం, రాజకీయ మనస్పర్థాలు తదితర నివేదికలు సేకరించారు. తాజాగా రెండు హత్యల విషయం తెలియడంతో దానికి సంబంధించి ఆధా రాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తంగా కేసులో వీరన్న చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. హ త్యకు సహకరించిన నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. -
సమాజంలో భాగస్వాములు కావాలి
గద్వాల(ధరూరు): ఉపాధ్యాయులు సమాజంలో భాగస్వాములు కావాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిధిలోని జాంపల్లి గ్రామంలో పాఠశాల కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అఽథితిగా హాజరై మాట్లాడారు. సొంత నిధులతో ప్రహరీ నిర్మించిన పాఠశాల హెచ్ఎం రేవతిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ధరూరులో పనిచేసిన సందర్భంలోనూ ఎస్సీ కమ్యూనిటీ హాల్కు మరమ్మతు చేయించడంతో పాటు ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. అందరూ ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. చేతనైనంత సహాయం చేస్తే ఎందరికో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ ప్రతాప్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం డబ్బులు చెల్లించాలి గద్వాల: ఖరీఫ్ 2025–26 ధాన్యానికి సంబంధించిన నగదు వెంటనే రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని పౌరసరఫరాల కమిషనర్ సీఫ్టెన్ రవీంద్ర ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,500 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 391 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8500, కనిష్టం రూ.5080, సరాసరి రూ.6810 ధరలు లభించాయి. అలాగే, 3 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ.5630 ధర పలికింది. 187 క్వింటాళ్ల కంది రాగా, గరిష్టం రూ.6879, కనిష్టం రూ.1859, సరాసరి రూ.6 869 ధరలు వచ్చాయి. 12 క్వింటాళ్ల వరి (సోన ) రాగా గరిష్టం రూ. 2187, కనిష్టం రూ. 206 1, సరాసరి రూ. 2187 ధరలు లభించాయి. -
పాలమూరును ఎడారి చేసేందుకు కుట్ర
● 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుపై నిందలా ● జూరాల నుంచి కొడంగల్కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది ● సీఎం, మంత్రులకు ‘పాలమూరుశ్రీపై కనీస అవగాహన లేదు ● ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం అమరచింత/ కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ముందుగా జూరాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. -
క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలి
ఎర్రవల్లి: క్రీడలతో పోలీస్ సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని ఎస్పీ తోట శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్లో కమాండెంట్ జయరాజు ఆధ్వర్యంలో వార్షిక స్పోర్ట్స్ మీట్– 2026 నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ కమాండెంట్తో కలిసి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, క్రీడలు వేర్వేరు కాదని, మన జీవితంలో భాగమన్నారు. క్రీడల వల్ల కలిగే శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పోలీస్ జీవితానికి అత్యంత అవసరమని తెలిపారు. క్రీడల వల్ల సిబ్బందిలో క్రమశిక్షణ, సమన్వయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సిబ్బందిలో స్నేహాభావం పెరుగుతుంది.. స్పోర్ట్స్ మీట్ ద్వారా సిబ్బందిలో స్నేహాభావం పెరుగుతుందని కమాండెంట్ జయరాజు అన్నారు. పోటీలో మొత్తం 250 మంది సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఇందులో 100 మీటర్లు, 400 మీటర్లు, 4.400 రిలే, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్, జావలిన్త్రో, 5 కే రన్, క్రికెట్ వంటి క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పటాలం సిబ్బంది ఆయా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణి, సీఐ రవిబాబు, అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి
అలంపూర్: ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హృదయరాజు అన్నారు. మంగళవారం అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బోటనీ ల్యాబ్ను పరిశీలించారు. ల్యాబ్ సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత అధ్యాపకుడికి ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు మనిషి జీవితంలో విలువ పెంచుతుందన్నారు. విద్యార్థులు కొత్త సంవత్సరంలో పాత అలవాట్లకు స్వస్తి పలికి.. భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును అశ్రద్ధ చేయొద్దన్నారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. స్వీపర్ల వేతనాలు విడుదల చేయాలి గద్వాల: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్లో ఉన్న మూడు నెలలు వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉప్పేరు నర్సింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీపర్ల వేతనాలకు సంబంధించిన నిధులు మంజూరైనప్పటికీ.. వారి ఖాతాల్లో జమ చేయడం లేదని తెలిపారు. ఇప్పటికై నా స్వీపర్లకు పెండింగ్ వేతనాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రఘు, మురళి, మల్లమ్మ పాల్గొన్నారు. వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి ఎర్రవల్లి: పశువులకు సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.శివానందస్వామి అన్నారు. మంగళవారం మండలంలోని రాజశ్రీ గార్లపాడులో పశువైద్య శిబిరం ఏర్పాటుచేసి.. ఎదకు రాని పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భకోశ వ్యాధుల నివారణ కోసం టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే సకాలంలో ఎదకు వచ్చి చూడి కడతాయన్నారు. దీనివల్ల పాడి రైతులు ప్రతి ఏటా ఒక దూడను పొంది ఆర్థికంగా లాభం పొందుతారని సూచించారు. అనంతరం చికిత్స అందించిన 11 గేదెలు, 6 ఆవుల పెంపకందారులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశువైద్యులు భువనేశ్వరి, వినయ్, సర్పంచ్ తిమ్మారెడ్డి పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యం దిశగా..
సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం గద్వాలవ్యవసాయం: సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు పడేలా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) ద్వారా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఏమాత్రం వినియోగించకుండా ప్రకృతి సిద్ధమైన బీజామృతం, జీవామృతం, ఆచ్చాదన తదితర పద్ధతులతో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు గాను జిల్లాలో 40 మంది కృషి సఖిలను వ్యవసాయశాఖ నియమించింది. వీరికి ప్రకృతి వ్యవసాయంపై పూర్తి శిక్షణ అందించి.. ఎంపిక చేసిన క్లస్టర్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2,500 ఎకరాల్లో పంటలు పండించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యంగా ఉండటంతో పాటు భూ సారం పెరుగుతుంది. పెట్టుబడులు సైతం తక్కువ అవుతాయి. పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉండి.. ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పండించిన పంట ఉత్పత్తులతో రైతులకు మంచి ధరలు లభిస్తాయి. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా పర్యావరణం పరిరక్షించబడుతుంది. మండలం క్లస్టర్లు ఎకరాలు అలంపూర్ 2 250 ధరూర్ 2 250 గద్వాల 2 250 గట్టు 1 125 అయిజ 2 250 కేటీదొడ్డి 1 125 ఇటిక్యాల 1 125 ఎర్రవల్లి 2 250 మల్దకల్ 2 250 మానవపాడు 2 250 రాజోళి 1 125 ఉండవెల్లి 1 125 వడ్డేపల్లి 1 125 జిల్లాలో మండలాల వారీగా ప్రకృతి సేద్యం ఇలా.. జిల్లాలో మొదటి విడతగా 2,500 ఎకరాల్లో సాగు లక్ష్యం ఎన్ఎంఎన్ఎఫ్ ద్వారా 40 మంది కృషి సఖిల నియామకం పూర్తి శిక్షణ అందిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు -
యూరియా కొరత రానివ్వొద్దు
గద్వాల(ధరూరు): రబీలో రైతులకు ఎలాంటి యూరియా కొరత రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ అన్నారు. మంగళవారం ఆయన ధరూరు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద విధిగా స్టాక్బోర్డుతో పాటు ధరల పట్టికను ఏర్పాటు చే యాలన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. అంతకు ముందు రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతు జయరామాచారిని సన్మానించారు. ప్రతి రైతు సేంద్రీయ సాగువైపు మొగ్గు చూపాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, ఏఈఓ పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పన
గద్వాల: మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా.. తమ అభ్యంతరాలు, ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో 2025 డిసెంబర్ 1 నాటి ఓటరు జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి.. పూర్తి పారదర్శకతతో తుది జాబితాను రూపొందిస్తామన్నారు. ఒటరు జాబితా సమరణలో భాగంగా ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలి కేటీదొడ్డి: భూ సమస్యలపై అందిన దరఖాస్తులపై క్షేత్రస్ధాయిలో సమగ్రంగా విచారించి పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. కేటీదొడ్డి మండలం పాగుంట శివారులోని 103 సర్వే నంబర్లో భూ భారతి కింద పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని.. సమస్య పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్న స్ధానిక రైతులను కలెక్టర్ స్వయంగా కలుసుకొని సమస్యలను తెలుసుకున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి సరిగ్గా లేకపోయినా బైక్పై వెళ్లి క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంబంధిత భూముల పూర్వ రికార్డులు, సర్వే వివరాలు, డాక్యుమెంట్లను సమగ్రంగా కలెక్టర్కు వివరించారు. అనంతరం కేటీదొడ్డిలోని 67 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తులో ఉన్న మిస్సింగ్ సర్వే నంబర్లను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశారు. అదే విధంగా పాగుంట ప్రాధమికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి.. విద్యార్థుల హాజరు, బోధనా విధానం, సౌకర్యాలు తదితర వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూ చించారు. అనంతరం పింఛన్ల పంపిణీని పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, తహసీల్దార్ హరికృష్ణ, హెచ్ఎం రవి ఉన్నారు. -
గ్రామాల్లో క్రీడల సందడి
● సీఎం కప్ కోసం సన్నాహాలు ● గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు ● 17 నుంచి వచ్చేనెల 26 వరకు సీఎం కప్ క్రీడలు ఔత్సాహికులకు మంచి అవకాశం సీఎం కప్ క్రీడలు ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశం. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో జిల్లాలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తిగల క్రీడాకారులు htt ps://sats. telangana.govi.in/cmcup వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు. గతేడాది 90 పతకాలు.. సీఎం కప్ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2వ తేదీ వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించడం విశేషం. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు 9 బంగారు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణపేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగారు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్కర్నూల్ జిల్లా ఒక బంగారు, 2 రజతం, 10 కాంస్యంతో 13 పతకాలు సాధించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎంకప్ నెట్బాల్ పోటీలు (ఫైల్) -
వ్యూహరచన..!
● ప్రధాన పార్టీలసన్నాహకాలు షురూ ● అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ● ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ ● బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగంలోకి.. ● ఎత్తులకు పైఎత్తులతో ముందుకు.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామంశ్రీలో బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. వెలిసిన ఫ్లెక్సీలు.. విందులు పురపాలిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన క్రమంలో ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఆశావహ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. యువతను ఆకట్టుకునేందుకు విందులకు తెర లేపారు. తాము బరిలో నిలుస్తామనే సంకేతాలను వార్డు ప్రజలకు తెలిసేలా ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తమకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయాలతో పాటు వార్డుల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు పార్టీల నాయకుల మధ్య కూడా పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్: పట్టు నిలుపుకునేలా.. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల క్రమంలో పట్టు నిలుపుకునేలా తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇప్పటివరకు ఎలాంటి సన్నాహక సమావేశాలు నిర్వహించకున్నా.. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు తమ తమ అనుచరుల ద్వారా గెలుపు గుర్రాలపై జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వార్డుల్లో ఆశావహులను ప్రోత్సహిస్తూ రంగం సిద్ధం చేసుకోవాలని.. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నిర్ణయం మేరకు నడుచుకునేలా వారిని సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలను పరిశీలిస్తూ.. పై ఎత్తులతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. -
పకడ్బందీగా ధనధాన్య కృషి నమోదు
గద్వాల: ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. పీఎండీడీకేవై అమలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, నమోదు చేసే సమాచారం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి స్పష్టంగా ఉండాలన్నారు. అదేవిధంగా కేంద్రం నిర్వహించే అన్ని వీడియో కాన్ఫరెన్స్లలో సంబంఽధిత శాఖలు తప్పక పాల్గొలన్నారు. లక్ష్యాలను సాధించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పీడీఎండీడీకేవై అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఏవో సక్రియనాయక్, ఏడీఏ సంగీతలక్ష్మీ, మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ, ఉద్యావనశాఖ అధికారి అక్బర్, పరిశ్రమల అధికారి రామలింగేశ్వర్గౌడ్, ఎల్డీఎం శ్రీనివాస్రావు, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాసులు ఉపాధికల్పన జిల్లా అఽధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు ట్రాన్స్జెండర్లకు సమాజంలో సమానహక్కులు గౌరవం భద్రత కల్పించడమే ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు ప్రధాన ఉద్ధేశమని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో తన ఛాంబర్లో దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈకార్డు ద్వారా ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యాసహాయం, ఉపాధి అవకాశాలు ఆరోగ్యసేవలు వంటి అనేక సేవలను సులభంగా పొందవచ్చన్నారు. అర్హులైన ట్రాన్స్జెండర్లు సంబంధిత ప్రభుత్వ పోర్టల్ జ్ట్టి ఞ.్టట్చ ుఽటజ్ఛ ుఽఛ్ఛీట.ఛీౌట్జ్ఛ.జౌఠి.జీ ుఽ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ జిల్లా అధికారి సునంద, ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. -
వైద్య విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అలంపూర్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీహెచ్ఎస్ రమేష్ చంద్ర అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆస్పత్రిని ఆయనతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్బాష సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ రమేష్ చంద్ర మాట్లాడుతూ.. ఆస్పత్రికి వైద్యులు సకాలంలో హాజరు కావాలని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి రోజు మొబైల్ యాప్లో హాజరు నమోదు తప్పనిసరిగా ఉండాలని, ముందస్తు సమాచారంతోనే విధులకు సెలవులో వెళ్లాలన్నారు. సమాచారం లేకుండా విధుల్లో గైర్హాజరైతే శాఖపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఆస్పత్రికి త్వరలోనే వామర్లు, ఫోటోథెరపీ సామగ్రి వస్తాయని తెలిపారు. ఆర్ఓ ప్లాంట్ సైతం అబదుబాటులోకి రానున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్యులు రూపాలి, అమీర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,900 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 368 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8900, కనిష్టం రూ.4590, సరాసరి రూ.8590 ధరలు లభించాయి. 8 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.6060, కనిష్టం రూ.5355, సరాసరి రూ.6060 ధరలు పలికాయి. 234 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టం రూ.7049, కనిష్టం రూ. 2323, సరాసరి రూ. 7029... 15 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2562, కనిష్టం రూ. 2326, సరాసరి రూ. 2326 ధరలు లభించాయి. 616 ఫిర్యాదులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్కర్నూల్లో 121, కొల్లాపూర్లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6చ అమరచింత 4, ఆమ్మకూర్లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మన్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. -
అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాం : కమిషనర్
● గెజిట్ ప్రకారమే జాబితా విడుదల చేశామని కమిషనర్ స్పష్టం ● కలెక్టర్ను ఆశ్రయించిన నాయకులు గద్వాలటౌన్: మున్సిపాలిటీలకి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయ దుమారం చెలరేగుతోంది. గద్వాల మున్సిపాలిటీలలో చేసిన వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులతో పాటు ప్రతి పక్ష పార్టీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు, నాయకులు దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అధికారుల ఊదాసీనత, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లోపాలపై నాయకుల ఆగ్రహం గద్వాల మున్సిపాలిటీలో ఓటరు ముసాయిదా జాబితాలో లోపాలు ఉన్నాయని వివిధ పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ హాల్లో వివిధ రాజకీయ పక్షాలతో కమిషనర్ జానకీరామ్ సాగర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారుల తీరును అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఎండగట్టారు. ముసాయిదా జాబితా అస్తవ్యస్తంగా ఉందని, కొన్ని వార్డులలో ఓటర్లను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. పక్కనున్న ఇళ్లను అదే వార్డులో కాకుండా దూరంగా ఉన్న మరో వార్డులో కలపడం పట్ల ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు కమిషనర్ దృష్టికి తెచ్చారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్కు ఫిర్యాదు వార్డుల వారీ ఓటరు ముసాయిదా జాబితా మొత్తం అశాసీ్త్రయంగా, అసంబద్ధంగా ఉందని వివిధ రాజకీయ పక్షాల నాయకులు మిర్శించారు. మున్సిపాలిటీలో జరిగిన సమావేశం అనంతరం ఆయా రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా కలెక్టర్ సంతోష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఓటర్ ముసాయిదాపై అభ్యంతరాలను బీజేపీ నాయకులు వివరించారు. అధికార కాంగ్రెస్లోని ఓ వర్గం నాయకులు ముసాయిదా జాబితాపై తమకూ కొన్ని అభ్యంతాలున్నాయని చెబుతుండడం విశేషం. పార్టీల ఆరోపణల మాటలు ఎలా ఉన్నా.. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో స్పష్టత కనిపించడం లేదు. గెజిట్ ప్రకారమే జాబితా విడుదల చేశామని చెప్పి చేతులు దులిపేసుకున్నారే తప్ప.. ఆ జాబితా లోపల ఉన్న ఇళ్ల నంబర్లు, కనీసం కాలనీల వివరాలు గానీ స్పష్టంగా చెప్పలేదు. రెండు, మూడు నెలల పాటు శాసీ్త్రయంగా చేయాల్సిన ఓటర్ల ప్రక్రియను కేవలం రెండు రోజుల్లో పూర్తి చేశారనే విమర్శలు ఉన్నాయి. చాలా వార్డులలో భౌగోళిక స్వరూపం కొరవడిందని మండిపడుతున్నారు. 7, 16, 17, 30వ వార్డుల పరిధిలో చేరిన ఇతర వార్డు ఓట్లను చేర్చడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ.. ఆయా వార్డుల నాయకులు ఫిర్యాదు చేశారు. ఇది ఓటరు ముసాయిదా జాబితా మాత్రమే అని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ గెజిట్ ప్రకారం ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ముసాయిదా జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 17 ఫిర్యాదులు అందయని చెప్పారు. వాటి సాధ్యసాధ్యాలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆయా రాజకీయల పార్టీల నాయకులు రాజీవ్రెడ్డి, భీంసేన్రావు, రామాంజనేయులు, సుభాన్, ఆంజనేయులు, ఉప్పేర్ నర్సింహా, త్యాగరాజు, మోహన్రావు, కోటేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణం పూర్తి చేయాలి
అయిజ: కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఆదివారం అంతరాష్ట్ర రహదారిపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. పట్టణ సమీపంలోని తుపత్రాల రోడ్డుకు సంబంధించిన పోలోనివాగుపై నిర్మించతలపెట్టిన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం వద్ద వంట చేసుకొని, రోడ్డుపైనే కూర్చొని సహపంక్తి భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరులకు సంబంధించిన అంతరాష్ట్ర రహదారి వెంట సుమారు 15 గ్రామాలు ఉన్నాయని, అదేవిధంగా మంత్రాలయ పుణ్యక్షేత్రానికి ఇదే దారిలో వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఈ రోడ్డుపై ప్రతిరోజు వేలాదిమంది ప్రజలు ప్రయాణిస్తున్నారని, వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 2 సంవత్సరాలవుతున్నా ఇంకా పూర్తికాలేదని, ఈరోడ్డు నిర్మాణం దశాబ్దకాలంగా పూర్తికాలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంపత్కుమార్ ఆరు మాసాల్లో నిర్మాణం పూర్తిచేస్తానని ప్రజలను నమ్మించి మోసంచేశారని ఆరోపించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం తొంగి చూడడంలేదని ఆరోపించారు. వెంటనే నిర్మాణ పనులు పూర్తిచేయకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భగత్ రెడ్డి, శివారెడ్డి, ఆంజనేయులు, చక్రవర్తి, అశోక్, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్; అంజి తదితరులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర రహదారిపై వంటావార్పుతో నిరసన -
పంచాయతీలకు ఊరట
● నూతన సర్పంచ్లకు ఉపశమనం ● రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేక ఖజానా ఖాళీ చిన్న, మేజర్ జీపీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటన సొంత నిధులతోనే.. సర్పంచ్గా గెలిచిన అనంతరం గ్రామంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సొంతంగానే నిధులు ఖర్చు చేస్తున్నాను. సీఎం ప్రకటనతో నిధులు వస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. – సరోజినమ్మ, సర్పంచు సోంపురం కేటి.దొడ్డి మండలం త్వరగా విడుదల చేయాలి గ్రామంలో పారిశుద్ధ్య పనులు, వీధిలైట్లు వంటివి మొదలుకుని మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరం. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా. – వీరన్న, సర్పంచు కొండేరు ఎర్రవల్లి మండలం గద్వాల: రెండేళ్లుగా ప్రత్యేక పాలనలో నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు ఎన్నికల క్రతువు పూర్తికావడం, నూతన సర్పంచులు కొలువుతీరడం జరిగిపోయింది. గెలుపొందిన సర్పంచులు ఆనందంతో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనందం కాస్త ఆవిరైపోయింది. గ్రామా పంచాయతీ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడం, నిత్యఅవసరాల నిమిత్తం కూడా నిధులు లేకపోవడం వంటి స్వాగతం పలకడంతో సర్పంచులు కొంత ఆందోళనకు గురయ్యారు. రోజు వారి పారిశుద్ధ్య పనులకు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేందుకు సైతం డబ్బులు లేనిదుస్థితి. ఈనేపథ్యంలో చాలా చోట్ల నూతన సర్పంచులు సొంతడబ్బులతోనే చిన్నాచితక పనులు చేయిస్తున్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్రెడ్డి గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం, మైనర్ జీపీలకు రూ.5లక్షలు, మేజర్ జీపీలకు రూ.10లక్షల చొప్పున కేటాయిస్తామని చెప్పడంతో సర్పంచులు కొంతవరకు ఊరట చెందారు. -
అంతటా అంతేగా..!
తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా ● మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇతర జిల్లాల ఓటర్లు ● ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం ● ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 98 ● అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ మున్సిపాలిటీ వారు్ుడ్ల ఫిర్యాదులు మ.నగర్ (కా) 60 98 భూత్పూర్ 10 20 దేవరకద్ర 12 03 నాగర్కర్నూల్ 24 51 కొల్లాపూర్ 19 05 కల్వకుర్తి 22 32 నారాయణపేట 24 – మక్తల్ 16 07 కోస్గి 16 03 మద్దూర్ 16 03 గద్వాల 37 06 అలంపూర్ 10 – అయిజ 20 06 వడ్డేపల్లి 10 01 వనపర్తి 33 18 కొత్తకోట 15 01 అమరచింత 10 – ఆత్మకూర్ 10 06 పెబ్బేరు 12 31 మొత్తం 376 291 మొత్తం 291 ఫిర్యాదులు ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా మారడం.. సర్దుబాటు చేయడంతో.. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఆన్లైన్ నమోదులో.. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల విగ్రహాలను అపురూపంగా ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ కల్యాణ తంతు నిర్వహించారు. ఇదిలాఉండగా, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తులకు గోపల్దిన్నెకు చెందిన రంగస్వామి, జానకి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఒకేరోజు ఆరు సాధారణ కాన్పులు
ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే జంకే వారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. అధునాతన వసతులతో మెరుగైన వైద్యం అందిస్తూ ప్రైవేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోవడంలేదు. తాజా ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ధరూరు పీహెచ్సీలో ఆదివారం ఒక్కరోజే ఆరుగురు గర్భిణులకు సాధారణ కాన్పులు చేశారు. ఆరుగురు శిశువులు, తల్లులు క్షేమంగా ఉన్నారని వైద్యురాలు అయేషాబేగం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందిని వైద్యాధికారులు అభినందించారు. – ధరూరు -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మానవపాడు: సీఎం రేవంత్రెడ్డి సహకారంతో అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పల్లెపాడులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 124 మందిలో 77మంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే సర్పంచ్లుగా గెలిచారని, 17మంది స్వతంత్య్ర అభ్యర్థుల్లో 12మంది కాంగ్రెస్ పార్టీలోనే చేరారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, ఉచిత బస్సు, సన్నబియ్యం, రేషన్కార్డులు ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, మహ్మద్ సిరాజ్, జగన్మోహన్నాయుడు, వెంకటేశ్వర్లు, బీసీరెడ్డి, మాస్తన్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి
గద్వాల క్రైం: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏఎంవీఐ జానకిరాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు రోడ్డు భద్రత మాసోత్సవాలు ఎంతో దోహదపడతాయన్నారు. కారు, బైక్ నడిపే క్రమంలో సీటు బెల్టు, హెల్మెట్ ధరించాలని, వాహనానికి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి, ఫోన్లో మాట్లాడుతూ, నిద్రలేమి కారణాలతో డ్రైవింగ్ చేయడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, క్షేమంగా ప్రయాణం చేయాలన్నారు. అనంతరం ప్రతిజ్ఙ చేయించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, సిబ్బంది రుషి, గోవిందు పాల్గొన్నారు. -
శిథిలం నుంచి సుందరీకరణ
మక్తల్: మక్తల్లో ప్రసిద్ధిగాంచిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో శిథిలాస్థకు చేరిన కోనేరు సుందరీకరణ దిశగా పయనిస్తోంది. గతంలో ఇదే కోనేరు నుంచి తీసుకెళ్లి ఆంజనేయస్వామికి పుష్కర స్నానం చేయించి పూజలు చేసేవారు. కాలక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి.. చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ క్రమంలో కోనేరు దుస్థితిని గమనించిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి.. మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం కోనేరు పూర్వవైభవం సంతరించుకోగా.. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సౌకర్యాలు కల్పించారు. మక్తల్లో పూర్వవైభవం సంతరించుకున్న కోనేరు -
సామాజిక రుగ్మతలు రూపుమాపాలి
గద్వాల: సమాజాన్ని పట్టిపీడిస్తున్న బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు వంటి రుగ్మతలు తొలగిపోయేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం దేశతొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఐడీవోసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉత్తమ మహిళా ఉపాధ్యాయుల పురస్కారాలు అందించారు. అంతకు ముందు ఆయన సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నేటికి మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 19వ శతాబ్దంలో మన దేశంలో మహిళలకు చదువు నేర్పించేందుకు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మహాత్మా జ్యోతిరావుపూలే విశేష కృషి చేయగా ఆయన సహకారంతో సావిత్రి బాయిపూలే 1848లో పూణేలో మహిళలకు మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి విద్యాబోధన చేశారన్నారని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో మహిళా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా విద్యార్థులకు సామాజిక అంశాల పట్ల కూడా అవగాహన కల్పించాలన్నారు. మన జిల్లాలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో నేటికి బాల్యవివాహాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని పూర్తిగా రూపుమాపేందుకు ఉపాధ్యాయులు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. బాలికలు పదో తరగతి, ఇంటర్తోనే చదువును మధ్యలో ఆపేస్తున్నారని అలా కాకుండా ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించేలా ప్రోత్సహించాలన్నారు. దేశంలో 50శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయురాలు ఉండడం మనకెంతో గర్వకారణమన్నారు. భవిష్యత్లో దేశాభివృద్ధికి కృషి చేసే భావి భారత పౌరులైన నేటిబాలలను ఉత్తములుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
మిరపలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఇటిక్యాల: మిరప సాగులో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి అక్బర్ బాషా అన్నారు. శనివారం మండలంలోని మునగాలో రైతు నరసింహారెడ్డి సాగు చేసిన మిరప పంటను ఆయన సందర్శించి మిరప పంటపై రక్షణపై స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. మిరప పంటలో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగి ఆకులు ముడుచుకోవడం, పంట ఎదుగుల తగ్గడం మరియు జెమినీ వైరస్ వ్యాప్తి సమస్యలపై అప్రమత్తంగా ఉండి సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మిరపపంట పొలాల చుట్టూ 2–3 వరుసలుగా జొన్న లేదా మొక్కజొన్న, సజ్జను పంటగా వేసుకోవడం ద్వారా పురుగుల దాడిని తగ్గించవచ్చని, పొలం గట్ల మీద వైరస్ సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే పీకి నాశనం చేయాలని పేర్కొన్నారు. తామర పురుగులు నీలి రంగుకు, తెల్లదోమలు పసుపు రంగుకు ఎక్కువగా ఆకర్షితమవుతాయని, అందువల్ల రైతులు ఒక పొలానికి తగిన సంఖ్యలో నీలి, మరియు జిగురు రంగు అట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పంటలో పురుగుల నియంత్రణకు వేపనూనెను సూచించిన మోతాదులో కలిపి పిచికారీ చేయాలన్నారు. పురుగుల నివారణ ఇలా.. పంటలో పురుగుల నివారణకు ఫిఫ్రోనీల్ 80 శాతం విజి 0.20 గ్రా. లేదా అసిటామిప్రిడ్ 20 శాతం, ఎస్పి 0.20 గ్రాములు లేదా, ఇమిడాక్లోఫ్రిడ్ 40 శాతం మరియు ఫిప్రోనీల్ 40 శాతం లేదా స్పినోటోరమ్ 1 మీ.లీ లీటరుకు కలిపి 7– 10 రోజుల వ్యవధిలో మందులను ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలన్నారు. మిరపపంటలో క్రింది ముడత నల్లీ ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఏర్పడుతుందని, నల్లీ ఆశించిన ఆకులు తీరగేశిన పడవ ఆకారంలో కనిపిస్తాయని తెలిపారు. ఈ సమస్య నివారణకు స్పైరోమెసాఫెన్ 1 మీ.లీ లేదా ప్రోపెర్గిట్ 2.50 మి.లీ లేదా ఫెనాజూక్విన్ 2 మి.లీ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలని సూచించారు. ఆకులపై మచ్చలు లేదా కాయకుళ్లు కనిపించిన వెంటనే ప్రొపికోనజోల్ 1 మి.లీ, అజాక్జీస్ట్రోబిన్ 1గ్రా, లేదా థయెఫినేట్ బిత్తెల్ 1 మి,లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి పంటలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇమ్రాన్, రైతులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అలంపూర్/ఎర్రవల్లి/మానవపాడు: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అనధికార ఔషధాలను విక్రయించినా, ప్రిస్కిప్సన్ లేకుండా హైగర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ను విక్రయించినా చర్యలు తప్పవని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫి అన్నారు. శనివారం డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారిణి అంజుమ్ అబిదా ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవల్లి మండలంలోని మెడికల్ దుకాణాల్లో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు వినయ్, మొహమ్మద్. రఫీ, రష్మి, విశ్వంత్రెడ్డి తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. షాపు లైసెన్స్లు, స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు, విక్రయ వివరాలను పరిశీలించారు. ఆర్ఎంపీలు రోగులకు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించి మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని తెలపారు. ప్రభుత్వ నిభందనలను పాటించకుండా రోగులకు తెలిసీ తెలియని చికిత్సలు చేసి వారికి నిషేదిత ఔషదాలను విక్రయించినా లేదా చికిత్సకు వాటిని వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మొత్తం 9 మెడికల్ దుకాణాల్లో విక్రయాల్లో ఉల్లంఘనలు గుర్తించినట్లు పేర్కొన్నారు. సేల్బిల్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా హైగర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ విక్రయించినట్లు తెలిపారు. ఒక మెడికల్ షాప్లో ఫిజీషియన్ శాంపిల్స్ తనిఖీ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ దుకాణాల్లో సంబంధిత రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, క్రయవిక్రయాలను, లైసెనన్స్ నిబంధనలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిపారు. -
400 ఏళ్ల చరిత్ర
జడ్చర్ల టౌన్: పాలవాది వంశస్థులు కావేరమ్మపేట ఈదమ్మ ఆలయం ఎదురుగా 400 ఏళ్ల క్రితం గచ్చుబావి నిర్మించారు. కాలక్రమేణా గచ్చుబావి చెత్తాచెదారంతో నిండిపోగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జయపాల్ అనే యూట్యూబర్, వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్ స్పందించి పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అలాగే జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కన దాదాపు 10వ శతాబ్దంలో నిర్మించిన కోనేరు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ కోనేరు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోనేరుకు ఎంతో విశిష్టత ఉంది. కోనేరుకు ఒకవైపు శివాలయం, మరోవైపు ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. కోనేరులోంచి నేరుగా పైఆలయాలకు వెళ్లేలా సొరంగ మెట్ల మార్గాలు నిర్మించారు. ఒకవైపు మాత్రమే మెట్లు ఉండగా.. రెండు వైపులా గోడలున్నాయి. ప్రస్తుతం కోనేరు పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కావేరమ్మపేటలోని గచ్చుబావి -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
ఆదిశిలావాసుడి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులకు వేదపండితులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, శశాంక్ ప్రత్యేక పూజలు నిర్వహించి భాజాభజంత్రీలు, మేళతాళాలతో కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం మహాహోమం నిర్వహించి స్వామి వారి కల్యాళణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా, శనివారం కావడంతో ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఇన్స్ట్రాగాంలో వచ్చి.. వాట్సప్లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్నగర్లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
వేరుశనగ క్వింటా రూ.7,602
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 439 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7602, కనిష్టం రూ.4276, సరాసరి రూ.6399 ధరలు లభించాయి. అలాగే, 16 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 2309 ధర పలికింది. 28 క్వింటాళ్ల కంది రాగా, గరిష్టం రూ. 6630, కనిష్టం రూ. 2209, సరాసరి రూ. 6489 ధరలు వచ్చాయి. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల శిక్షణకు క్రీడాకారులు గద్వాలటౌన్: ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో జరిగే జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల శిక్షణ క్యాంపునకు గద్వాలకు చెందిన క్రీడాకారులు అజిత్, మహేష్ ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. ఈ నెల 5వ తేది నుంచి 7వ తేదీ వరకు మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరపున అజిత్, మహేష్ పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలలో మన జిల్లా క్రీడాకారులు అజిత్, మహేష్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి సెలక్టర్లు జాతీయ స్థాయి పోటీల శిక్షణా శిబిరాన్నికి ఎంపిక చేశారు. వీరు రెండు వారాల పాటు హైదరాబాద్లో జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. వీరు ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి మానవపాడు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం మండలంలోని కేజీబీవీ, మండల పరిషత్ పాఠశాలలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, కేజీబీవీ భవన నిర్మాణం నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పాఠశాలలో రికార్డులను పరిశీలించి విద్యార్థుల సమర్థ్యాలను మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ శివప్రసాదు, ఎస్ఓచ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. రేపు బీచుపల్లిలో సీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించాలని ఆయన కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీ స్తంభాల తరలింపు రాజోళి: మండలంలోని పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీపై జరిగిన రగడ తెలిసిందే. ఫ్యాక్టరీ నిర్మించవద్దని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కొద్ది రోజుల ఫ్యాక్టరీ విషయం తెరపైకి రాకపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఫ్యాక్టరీ యాజమాన్యం తమ నిర్ణయం మార్చుకుందని, ఏపీకి తరలి వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తున్నట్లుగా శుక్రవారం ఫ్యాక్టరీకి సంబందించిన విద్యుత్ స్తంభాలను అక్కడి నుండి తరలించారు. క్రేన్ల సహాయంతో ట్రాక్టర్లపైకి ఎత్తి అక్క డి నుండి తరలించడంతో చుట్టు పక్కల గ్రా మాల వారు కూడా ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించడం లేదని భావిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
యాసంగికి సరిపడా యూరియా నిల్వలు
అలంపూర్: యాసంగి సీజన్కు సంబంధించి పంట సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ తెలిపారు. అలంపూర్ మున్సిపాలిటిలోని ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం కేంద్రంలోని యూరియాను, రికార్డులను పరిశీలించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ మండలంలోని రైతులకు యాసంగి పంట సాగుకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆగ్రోస్ సేవా కేంద్రంలో ప్రస్తుతం 660 బ్యాగుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులు పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డులతో ఎరువుల దుకాణాలకు రావాలని సూచించారు. వాటిని పరిశీలించి యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. యూరియా కోసం రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం ఉన్న రైతులు అందుబాటులో ఉన్న యూరియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల్లో రికార్డులను పరిశీలించడం జరిగింది. వీరితోపాటు మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
తాలు పేరిట.. నిలువు దోపిడీ
ఖరీఫ్లో రైస్ మిల్లర్ల అక్రమార్జన రూ.45 కోట్లు ●నాలుగు క్వింటాళ్ల ధాన్యం ఏమైందని డ్రైవర్ను నిలదీస్తే నాకేమీ తెలియదంటూ రైస్ మిల్లు యజమాని ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేయగా.. వేబ్రిడ్జి తూకం అంతే వచ్చిందని చెప్పి.. దురుసుగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేశాడు. కొనుగోలు కేంద్రంలో బస్తాకు కిలోన్నర పైన అదనంగా తూకం వేశారు. ఇప్పుడు మళ్లీ పది బస్తాల కోత పెట్టారు. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. – ఆంజనేయరెడ్డి, శివాజీ, అప్పంపల్లి గ్రామం, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది. రైతులకు ఫోన్లు చేసి మరీ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్కు 4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒప్పుకోకుంటే.. అన్లోడ్ చేయకుండా ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా క్వింటాల్ ధాన్యంలో సుమారు 4 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తూ దందాకు తెగబడ్డారు. రైతులు ఒప్పుకుంటేనే ట్రక్షీట్లు తిరిగి ఇస్తున్నారు. ట్రక్ షీట్లు తిరిగి ఇస్తేనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసే అవకాశం ఉండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని కోతకు అంగీకరించని రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా తిరిగి సెంటర్లకు పంపిస్తున్నారు. ఇలా ఇబ్బందులకు గురిచేయడం ద్వారా వారికి విధి లేని పరిస్థితులు కల్పిస్తూ.. దారిలోకి తెచ్చుకుంటున్నారు. కిలోకు రూ.24 చొప్పున నష్టం.. వానాకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా కేంద్రాలు కొనుగోళ్ల లక్ష్యం కొన్నది మహబూబ్నగర్ 195 2,00,000 1,25,219 నాగర్కర్నూల్ 236 2,57,145 71,779 జోగుళాంబ గద్వాల 87 1,25,000 83,933 నారాయణపేట 117 3,12,000 1,29,467 వనపర్తి 414 4,30,000 2,06,000 తాలు పేరిట దోపిడీకి సంబంధించి ఇటు సెంటర్లు, అటు మిల్లుల నిర్వాహకులు కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. లేకుంటే తమకేం మిగులుతుందని పలు సెంటర్ల నిర్వాహకులు రైతులతో బాహాటంగానే మాట్లాడుతున్నారు. మరోవైపు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ కోత పెట్టడంపై పలువురు మార్కెటింగ్ అధికారులను ప్రశ్నిస్తే.. తాలు ఉంటే ఏంచేస్తారని మిల్లర్లను వెనుకేసుకురావడం అనుమానాలకు తావిస్తోంది. రైతుల కష్టాన్ని దోచుకుంటుంటే.. అధికారులు చూస్తూ మిన్నంకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్వింటాల్కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో.. అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే.. మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు ట్రక్షీట్ చూపిస్తూ ఆందోళన చేస్తున్న ఈ రైతులు నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందినవారు. గతేడాది నవంబర్ 25న ఈ గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో తూకం చేశారు. మొత్తం 796 ధాన్యం బస్తాలకు 318.40 క్వింటాళ్లుగా లెక్క తేలింది. ధన్వాడ సొసైటీ నుంచి లారీ రాగా లోడ్ చేశారు. సొసైటీ కార్యదర్శి వెంకట్రాములు లోడ్ చేసిన లారీని నారాయణపేట మండలం కొల్లంపల్లి మిల్లుకు తీసుకెళ్లాలని డ్రైవర్కు ట్రక్షీట్ రాసిచ్చాడు. లారీ డ్రైవర్ ఒప్పుకోకుండా కోస్గి మహాలక్ష్మి రైస్ మిల్లుకు రాయించుకుని తీసుకెళ్లాడు. అక్కడ అన్లోడ్ అయిన తర్వాత లారీ డ్రైవర్ 29న తిరిగి వచ్చి ట్రక్షీట్ రైతులకు ఇచ్చాడు. దాన్ని చూసి వారు కంగుతిన్నారు. 796 బస్తాలకు 786 బస్తాలు వచ్చినట్లు ఉంది. పది బస్తాలు.. సుమారు 4 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపడంతో రైతులు ఆందోళనకు దిగారు. -
అందరి సహకారంతో జిల్లాకు గుర్తింపు
గద్వాలటౌన్: అందరి సహకారంతో జిల్లాకు గుర్తింపు వచ్చిందని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025లో అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అదే స్ఫూర్తితో 2026లో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా యూనియన్ల నాయకులు వీరభద్రప్ప, కరుణాకర్, అజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ... యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లను ఆవిష్కరించారు. అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని, విద్యా అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంకితభావంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని, పదిలో మంచి ఫలితాలు తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు కుమార్నాయుడు, వెంకటరమణ, బీసన్న, తిమ్మప్ప, రాజశేఖర్, చంద్రకాంత్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
గద్వాల క్రైం: పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, సమస్యాత్మక కేసులను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పెండింగ్ కేసులపై నిర్లక్ష్యం వహించొద్దని, నిందితులకు శిక్ష పడేలా చార్జిషీట్ దాఖలు చేయాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిఘా, గస్తీ ముమ్మరం చేయాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, భూ సంబంధ కేసులపై జోక్యం వద్దన్నారు. అనంతరం ఎస్పీకి పలువురు సిబ్బంది నూతన సంవత్సర శుభకాంక్షలు తెలయజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, నరేందర్రావు, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు, ఎస్ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు 2013 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ (జూనియర్ జిల్లా అడ్మిని స్ట్రేటివ్ గ్రేడ్) సెలక్షన్ గ్రేడ్కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులులు జారీ చేసింది. నేటి నుంచి ఎస్పీ సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీని జిల్లా పోలీసుశాఖ సిబ్బంది ప్రత్యేకంగా ఆభినందించారు. -
తెగ తాగేశారు..!
● న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ప్రియుల జోష్ ● 24 గంటల్లో రూ.కోటిన్నర మద్యం అమ్మకాలు గద్వాలటౌన్: పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి యువత బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. మద్యం కొనుగోళ్లు మాత్రం రికార్డు స్థాయిలో సాగాయి. న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులు పండుగ చేసుకున్నారు. తాగడం మానేద్దాం అని అనుకునే వారు.. బీరు లేని సంబరమేముందని భావించే వారు.. మద్యం ప్రియులు అంతా కలిసి జిల్లా పరిధిలో రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఒక్కరోజులోనే రూ. కోటిన్నర వరకు మద్యం అమ్మకాలు జరిగాయంటే ఎంత తాగేశారో తెలుసుకోవచ్చు. బుధవారం రాత్రి గద్వాల పట్టణంతో పాటు మండల కేంద్రాల్లోని అనేక ప్రాంతాలు మందుబాబులతో కిటకిటలాడాయి. నిబంధనలన్ని తుంగలోకి తొక్కి కొంత మంది అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రహస్య కేంద్రాల్లో విక్రయాలు చేశారు. ఎకై ్సజ్ శాఖ రాబడులకు ఢోకా లేకుండా జోరుగా వ్యాపారం జరిగింది. మద్యం మత్తులో యువత రోడ్లపైకి చేరి చిందులేస్తూ, ఇతరులకు ఇబ్బందులను సృష్టించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పట్టణంలో ముమ్మరంగా గస్తీ నిర్వహించారు. -
5 నుంచి పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
గద్వాలటౌన్: వరంగల్ జల్లా కేంద్రంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష కోరారు. గురువారం రాష్ట్ర మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యారంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. గురుకులాలు, వసతి గృహాలలో నిత్యం ఫుడ్పాయిజన్ జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ఈశ్వర్, బుడ్డన్న, శ్రావ్య, దివ్య, శిరీషా, విజయ్, కల్పన, నర్సింహా పాల్గొన్నారు. -
60 డివిజన్లు, 316 వార్డులు.. 798 పీఎస్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పుర పాలికల ఎన్నికలకు సంబంధించి తొలి కసరత్తు పూర్తయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ సెంటర్లు ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ముసాయిదా ఓటరు లిస్ట్ను విడుదల చేశారు. ఈ మేరకు ఆయా బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో జాబితా ప్రతులను అతికించారు. ఈ నెల నాలుగు వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా పురపాలికల్లో స్థానిక, ఆరున జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ నెల పదిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, మిగతా 18 మున్సిపాలిటీల్లో 316 వార్డులు ఉండగా.. మొత్తంగా 798 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 18 మున్సిపాలిటీల పరిధిలో మొత్తంగా 6,19,423 మంది ఓటర్లు ఉన్నట్లు పురపాలికల అధికారులు ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఇందులో పురుషులు 3,04,294, మహిళలు 3,15,094 కాగా.. ఇతరులు 35 మంది ఉన్నారు. అన్ని పురపాలికల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ● మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 82 డివిజన్లు/వార్డులు ఉన్నాయి. ఈ మేరకు 223 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. మొత్తంగా 2,19,989 మంది ఓటర్లలో మహిళలు 1,11,416, పురుషులు 1,08,559 మంది కాగా.. ఇతరులు 14 మంది ఉన్నారు. ● వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 80 వార్డులు ఉండగా.. 162 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. వీటి పరిధిలో మొత్తంగా 1,18,074 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 57,828, మహిళలు 60,238, ఇతరులు ఎనిమిది మంది ఉన్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 77 వార్డులు ఉండగా.. 145 పోలింగ్ సెంటర్లు కేటాయించారు. అదేవిధంగా మొత్తంగా 1,08,619 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 52,894, మహిళలు 55,713 మంది కాగా.. ఇతరులు 12 మంది ఉన్నారు. ● నారాయణపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 72 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు 138 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. మొత్తంగా 91,859 మంది ఓటర్లలో 44,909 మంది పురుషులు, 46,949 మంది మహిళలు.. ఇతరులు ఒకరు ఉన్నారు. ● నాగర్కర్నూల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులు ఉండగా.. 130 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. అదేవిధంగా 80,882 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 40,104 మంది కాగా.. మహిళలు 40,778 మంది ఉన్నారు. మొత్తం 60 డివిజన్లు.. 316 వార్డుల వారీగా వెల్లడి 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లే ప్రామాణికంగా రూపకల్పన బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన 10న ఫైనల్ లిస్ట్.. ఆ తర్వాత ఎప్పడైనా ఎన్నికల షెడ్యూల్ -
ఆనందోత్సాహాలతో స్వాగతం
● కేక్లు కట్ చేసి సంబరాలు ● అర్ధరాత్రి వీధుల్లో యువత నృత్యాలు గద్వాలటౌన్: కొత్త ఆశలు.. ఆశయాలు, ఆలోచనలు.. కొత్త లక్ష్యాలు.. గమ్యాలు.. కోటి కాంతులతో నూతన సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. జిల్లా ప్రజలు బుధవారం రాత్రి నుంచి గురువారం అంతా సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. కేరింతలతో ‘విష్యు హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్ల ముంగిట రంగుల హరివిల్లులుగా రంగవళ్లికలను అలంకరించారు. ఇళ్లు, యువజన సంఘాలు, ప్రైవేటు కార్యాలయాల్లో కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని పట్టణ శివారు ప్రాంతాల్లో యువకులు మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయా ఏర్పాట్లులో యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి చిందులేస్తూ నృత్యాలు చేశారు. కిక్కిరిసిన ఆలయాలు నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ భక్తులు వేడుకున్నారు. గురువారం పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. నూతన సంవత్సర వేడుకలతో తెల్లవారుజామునుంచే పట్టణంలోని ఆలయాలు కిటకిటలాడాయి. విశేషపూజలు, ఆరాధనలు, అభిషేకాలు, పారాయణాలు జరిపారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి, రాఘవేంద్రస్వామిమఠం, కృష్ణమందిరం, సాయిబాబ ఆలయం, కన్యకాపరమేశ్వరి, సంతాన వేణుగోపాలస్వామి, అయ్యప్పస్వామి, నల్లకుంట శివాలయం తదితర ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. అయ్యప్ప పడిపూజలు, పల్లకి సేవలతో భక్తులు పరవశించిపోయ్యారు. కొత్త సంవత్సరంలో విజయం చేకూర్చాలని కోరుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివార్లను దర్శించుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు కోటి ఆశలతో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రైస్తవులు ప్రభువును ప్రార్థించారు. గురువారం ఉదయం పట్టణంలోని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎంబీ మిస్పా చర్చిలో సండే స్కూల్ విద్యార్థులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చర్చిలలో పాస్టర్లు శాంతి సందేశాలను బోధించారు. -
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
గద్వాల: ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల వసతులను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ బాలుర వసతిగృహం, ఆనందనిలయాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకొన్నారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. మీరు చాలా దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులను వదిలి ఒక్కడికి వచ్చి చదువుకుంటున్నారని, మీఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని రకాల వసతి, నాణ్యమైన భోజనం, విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రతిఒక్కరు కూడాసద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చి ఐఏఎస్ సాధించి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారని విద్యార్థులకు వివరించారు. ఏదైన సాధించాలంటే గొప్ప కలలు కనాలని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో నిరంతరం కష్టపడి చదువుకోవాలని తద్వారా నిర్ధేశించుకున్న గొప్ప కలలు సాకారమవుతాయని సూచించారు. అదేవిధంగా విద్యతో పాటు ప్రతిఒక్కరు శారీరక ఆరోగ్యం కూడ ముఖ్యమని ఇందుకోసం ప్రతిరోజూ విద్యార్థులందరూ వ్యాయమం చేయాలని సూచించారు. సాల్కర్షిప్ నమోదులో రాష్ట్రంలో మన జిల్లా 5వ స్థానంలో నిలిచిందన్నారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి అక్బర్పాషా, వార్డెన్లు శ్రీను, మధు, రామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి
అయిజ: పట్టణంలోని పీహెచ్సీలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 47 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వారందరూ గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. దీర్థకాలిక రోగులపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెంటనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయని పక్షంలో ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భగత్రెడ్డి, లక్ష్మణాచారి, ఖుషి, డయాలసిస్ బాధితులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,779 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 81 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7779, కనిష్టం రూ.3419, సరాసరి రూ.7799 ధరలు లభించాయి. అలాగే, 15 క్వింటాళ్ల వరి (సోన) రాగా, గరిష్టం రూ. 2409, కనిష్టం రూ. 2309, సరాసరి ధరలు రూ. 2409 వచ్చాయి. 28 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6509, కనిష్టం రూ. 5259, సరాసరి రూ. 6509 ధరలు లభించాయి. మన్యంకొండకు పాదయాత్ర స్టేషన్ మహబూబ్నగర్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం మన్యంకొండకు మహాపాదయాత్ర చేపట్టారు. జిల్లాకేంద్రం బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బండమీదిపల్లి, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవస్థానం వరకు నిర్వహించారు. వందలాది మంది భక్తులు గోవిందనామ, హరినామ సంకీర్తనలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం భక్తులు మన్యంకొండ శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు గొండ్యాల రాఘవేంద్రశర్మ మాట్లాడుతూ ఇలాంటి యాత్రలు చేయడం వల్ల హిందువుల్లో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. భక్తిమార్గం దిశగా యువతను నడిపించడానికి ఇలాంటి పాదయాత్రలు చాలా ఉపయోగపడుతాయన్నారు. ధనుర్మాసంలో విష్ణు క్షేత్రాన్ని దర్శించుకోవడం మోక్షదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండ వెంకటేశ్వర్లు, తల్లం నాగరాజు, సూది రాము, రాఘవ, రాఘవేందర్శర్మ పాల్గొన్నారు. -
నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
గద్వాలటౌన్: జాబ్ క్యాలెండర్ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వపల్లయ్య విమర్శించారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరుద్యోగ జేఏసీ నిరసన వ్యక్తం చేశారు. సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరానికి కొత్త క్యాలెండర్లు మారుతున్నాయని, జాబ్ క్యాలెండర్ మాత్రం అమలు కావడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ పాలన రెండేళ్లు పూర్తయిన ఇప్పటి వరరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో మెగా డీఎస్పీ ద్వారా 25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి సీఎం మోసం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవటం సిగ్గు చేటన్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు మహేష్, చక్రవర్తి, మాధవ్, గోపాల్, కాశీం, పటేల్, నర్సింహా, రాము, కిరణ్, అభిషేక్, గోవిందు, చక్రి, జహంగీర్, శీనునాయక్ పాల్గొన్నారు. -
కొలువే లక్ష్యంగా..
● ప్రభుత్వ ఉద్యోగం, సమాజసేవ, ఉన్నత స్థానాల వైపు అడుగులు ● జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల కల నెరవేరుస్తాం.. ● జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి డిగ్రీ, పీజీ (ఆర్ట్స్ అండ్ సైన్స్) కళాశాల విద్యార్థులతో ‘సాక్షి’ టాక్షో నూతన సంవత్సరంలో యువత ప్రణాళికలు గద్వాల: ఉపాధ్యాయుడు.. లెక్చరర్.. డాక్టర్.. ఇంజినీర్.. సైంటిస్ట్.. ఇలా కొలువే లక్ష్యంగా.. జీవితంలో స్థిరపడేలా యువత అడుగులు వేస్తున్నారు. లక్ష్యాలు చేరుకోవాలంటే చదువే మార్గమని.. ప్రతి ఒక్కరి జీవితంలో కళాశాల విద్యార్థి దశ ఎంతో ముఖ్యమని.. కష్టపడి చదివితే లక్ష్యాలు చేరుకోవడం సులువని కళాశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని తమ కుటుంబాలకు అండగా నిలబడడమే కాకుండా ఉత్తమ సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరంలో జీవితానికి సంబంధించి స్థిరపడేలా పలు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునే ప్రణాళికలతో సిద్ధమయ్యారు. గద్వాల పట్టణంలోని శ్రీసత్యసాయి డిగ్రీ, పీజీ కాలేజీ (ఆర్ట్స్అండ్ సైన్స్) విద్యార్థులతో బుధవారం ‘సాక్షి’ టాక్షోను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ లక్ష్యాలు, వాటిని సాధించుకునేందుకు వేసుకున్న ప్రఽణాళికలను పంచుకున్నారు. శ్రీసత్యసాయి డిగ్రీ, అండ్ పీజీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పీజీ పూర్తి చేసిన తర్వాత లెక్చరర్ కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నాను. దాని కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీలో గురువుల సహకారంతో నేను అనుకున్న లక్ష్యం సాధిస్తాననే నమ్మకం పెరిగింది. పీజీ సాధించేందుకు అవసరమైన మెటీరియల్ను ఇప్పటి నుంచే సేకరిస్తున్నాను. పీజీ సాధించి ఖచ్చితంగా లెక్చరర్ను అవుతాను. – రాజేశ్వరి, బీఎస్సీ(బీజెడ్సీ) ఫైనల్ ఇయర్ చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెబుతూ మా నాన్న, అమ్మలు నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో నాకు చదువు పట్ల ఇష్టం పెరిగింది. బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన కోరిక ఏర్పడింది. డిగ్రీ తరువాత బీఈడీ, పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా ఇప్పటి నుంచే లక్ష్యం పెట్టుకున్నాను. – శృతి, బీఎస్సీ(ఎంపీసీఎస్) ఫస్టియర్ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని బలమైన సంకల్పం ఉంది. ముఖ్యంగా పేదలకు వైద్యం అందించి తనవంతుగా సమాజసేవలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నా. ఇందుకోసం మా తల్లిదండ్రులు, కాలేజీలో లెక్చరర్లు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. – శృతి, ఇంటర్మీడియట్ నేను బీకాం చదువుతున్నాను. అనంతరం చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నదే లక్ష్యం. ఇందుకోసం తనకు ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారంతో పాటు మాకా లేజీ లెక్చరర్లు అన్ని విధాలా సలహాలు, సూచనలు ఇస్తూ సహకారం అందిస్తున్నారు. నూతన సంవత్సరంలో సీఏ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. – అమీజ్, బీకాం చదువు పూర్తి చేసుకుని ఎవరిమీద ఆధారపడకుండా సొంతంగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. వచ్చిన డబ్బుతో తనవంతుగా సమాజం కోసం ఏదైన మంచి పనులు చేయాలని ఉంది. – బుడ్డన్న, ఎంఎల్టీ ల్యాబ్టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ పరంగా కాని, ప్రైవేటులో ఉద్యోగం సాధించాలని నూతన సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్నాను. – శివకుమార్, ఎంఎల్టీ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే నా తల్లిదండ్రుల కల. చిన్నతనం నుంచి చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తా. – కె.కావ్య బీఎస్సీ (బీజెడ్సీ) జీవితంలో త్వరగా స్థిరపడాలని నా తల్లిదండ్రులు నన్ను ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేర్పించారు. ల్యాబ్టెక్నీషియన్ కోర్సు పూర్తి త్వరగా ఉద్యోగంలో స్థిరపడి తమ కుటుంబ సభ్యులకు అండగా ఉంటాను. ఈ నూతన సంవత్సరంలో ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాను. – నరేష్, ఎంఎల్టీ చదువు పూర్తి చేసి త్వరగా ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా నిలబడతాను. వారి బాగోగులు చూసుకుంటూ ముందుకు సాగాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. – ఈశ్వర్, ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే లక్ష్యం. ఉద్యోగం అనంతరం అమ్మ, నాన్నలను బాగా చూసుకుంటాను. – ఇమ్రాన్, ఎంఎల్టీ -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
గద్వాల: మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే సంబంధిత అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల పరిఽధిలోని వార్డుల వారిగా ఓటర్ల లిస్టు ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసేందుకు అవసరమైన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు, మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించాలన్నారు. ఒక్కో వార్డులో 850 పైగా ఓటర్లు ఉంటే రెండు పోలింగ్ స్టేషన్లు, ఏర్పాటు చేయాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది స్థానికులు కాకుండా ఇతర మండలాల వారిని నియమించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వందశాతం పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి జనవరి 6వ తేదీలోపు అన్ని అనుమతులు పూర్తిచేసి మార్కౌట్ చేసి పునాదులు వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలలో వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరీ అయినట్లు వీటిని సైతం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హౌసింగ్పీడీ శ్రీనివాస్రావు, జడ్పీడి.సీఈవో నాగేంద్రం, మున్సిపల్ కమీషనర్లు డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
పురపోరు.. కసరత్తు జోరు
● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు ● అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం ● మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి ● ఓటర్ల జాబితా సైతం.. నేడు ముసాయిదా విడుదల ● రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. తొలిసారిగా కార్పొరేషన్లో.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు. కొత్తగా దేవరకద్ర.. మద్దూరు మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించిన రోజే మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమయంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామాలను కలుపుకుని 16 వార్డులుగా విభజించారు. అదేవిధంగా దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకుని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
గద్వాల క్రైం: బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు శ్రమించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సీడబ్యూలసీ, సీడీపీఓ, డీసీపీఓ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. జనవరి 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించాలని, ఎవరైన 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో చేర్చుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చిన్నారుల భవిష్యత్తు పరిరక్షణ దిశగా ఆపరేషన్ స్మైల్ పని చేస్తుందన్నారు. 12వ ఆపరేషన్ స్మైల్లో రెండు బృందాలు విధిగా విధులు నిర్వహిస్తాయన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైన బాలలను పనిలో చేర్చుకున్నట్లు తెలిస్తే పోలీసుశాఖకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సహాదేవుడు, శైలజ, దీప్తి, వెంకటస్వామి సిబ్బంది తదితరులు ఉన్నారు. -
వైకుంఠ వైభవం
మహా విష్ణువును ముక్కోటి దేవతలు నేరుగా దర్శించి ఆశీస్సులు పొందిన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని కోటలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామిని, కృష్ణానది తీరంలోని శ్రీకల్యాణ లక్ష్మీవేంకటేశ్వర స్వామి, భీంనగర్లోని సంతాన వేణుగోపాలస్వామి, గంజిపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామిని వైకుంఠ నాథుడిగా భక్తులు దర్శించి దివ్యానుభూతి పొందారు. ఐదో శక్తిపీఠమైన అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం, మల్దకల్ స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి, అయిజ మండలం ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, బీచుపల్లిలోని కోదండరామస్వామి, కేటీదొడ్డి మండలం పాగుంట శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి, రాజోళిలోని వైకుంఠ నారాయణస్వామి తదితర ఆలయాల్లో భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారు దర్శనమిచ్చారు. కోటలోని ఆలయంలో సీనియర్ సివిల్జడ్జి లక్ష్మి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. – గద్వాలటౌన్


