breaking news
Jogulamba
-
నీటి మునిగిన ముచ్చోనిపల్లె రోడ్డు
● రిజర్వాయర్ అలుగు వద్ద నిలిచిన నీరు ● రాకపోకలకు ఇబ్బందులు గట్టు: ముచ్చోనిపల్లె రోడ్డు నీట మునిగింది. గొర్లఖాన్దొడ్డి–అయిజ రోడ్డు నుంచి కర్నూలు–రాయచూర్ రోడ్డుకు లింకు కలుపుతూ కొత్తగా ముచ్చోనిపల్లె రిజర్వాయర్ కట్ట కింద భాగంలో కొత్తగా తారురోడ్డును వేశారు. ప్రస్తుతం రిజర్వాయర్ అలుగు పారే చోట వర్షపు నీరు వచ్చి చేరింది. వాహనాలు పూర్తిగా నీట మునిగేటంత నీరు వచ్చి చేరడంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగా వేసిన తారు రోడ్డు అంతా బాగానే ఉన్నా, ముచ్చోనిపల్లె రిజర్వాయర్ అలుగు పారే చోట భూమి లెవల్ కంటే కాస్త లోతుగా మట్టిని తీసి, బ్రిడ్జి నిర్మించారు. అలుగు ద్వారా పారే నీరు బ్రిడ్జి కింద నుంచి బయటకు వెళ్లడానికి పెద్ద పెద్ద పైపులు ఏర్పాటు చేశారు. అయితే రిజర్వాయర్ నిండిన తర్వాత అలుగు ద్వారా పారే నీరు బయటకు వెళ్లడానికి కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, భూ సేకరణ సమస్య కారణంగా కాల్వ నిర్మాణ పనులు అగిపోయాయి. అయితే వర్షాకాలంలో కురిసిన వర్షాల కారణంగా అలుగు కోసం మట్టిని తీసి, బ్రిడ్జి నిర్మించిన చోట భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో అలుగు నీరు పారే చోట ఏర్పాటు చేసిన బ్రిడ్జి నీట మునిగింది. ఎంతలా అంటే వాహనాలు తారు రోడ్డు వెంట నేరుగా వెళితే నీట మునిగిపోయే విధంగా నీరు వచ్చి చేరాయి. తారు రోడ్డు ఉంది కదాని నేరుగా తెలియక ఈ దారి గుండా వెళ్లేవారు నీటిని చూసి భయపడుతున్నారు. నీరు నిల్వ ఉన్న చోటపై భాగంలో పొలం గట్టు వెంట ఉన్న మట్టిదారి గుండా అటు వైపునకు అతి కష్టం మీద వెళుతున్నారు. అధికారులు స్పందించి ముచ్చోనిపల్లె కొత్తరోడ్డుపై రాకపోకలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
బీసీ బంద్ సంపూర్ణం
గద్వాలటౌన్: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ చేపట్టిన బంద్ జిల్లాలో సంపూర్ణమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు వేరువేరుగా మోటార్బైక్లపై తిరుగుతూ షాపులను బంద్ చేయించారు. వాణిజ్య దుకాణాలు, సినిమాహాళ్లు, విద్యా సంస్థలు, పెట్రోలు బంకులు స్వచ్ఛంద బంద్ను పాటించాయి. అన్ని వర్గాల ప్రజలు బంద్ పాటించి బీసీ రిజర్వేషన్ల ఆకాంక్షను చాటి చెప్పారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను నడపాలని పోలీసులు చేసిన ప్రయత్నాలను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్టాండ్ ప్రాంగణంతో పాటు ప్రధాన చౌరస్తాలలో నిరసన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. అయిజ, శాంతినగర్, ఎర్రవల్లి చౌరస్తా, అలంపూర్ చౌరస్తాలతో పాటు మండల కేంద్రాలలో బంద్ సంపూర్ణంగా ముగిసింది. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా ప్రాంతాల జేఏసీ నాయకులు బంద్లో భాగస్వాములు అయ్యారు. గద్వాలలో బీజేపీ నాయకులు బంద్కు దూరంగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే వరకు బీసీలు చేసే పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపిస్తే.. చట్టబద్ధత కల్పించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. జేఏసీ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూధన్బాబులు మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు బీసీల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకుడు హనుమంతునాయుడు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్రంలో మద్దతు ఇస్తూ.. కేంద్రంలో అడ్డుకుంటూ దోబూచులాట ఆడుతోందని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గద్వాలలో బస్సులు నడపాలని పోలీసుల యత్నం అడ్డుకున్న జేఏసీ నాయకులు.. ఇరువురి మధ్య వాగ్వాదం వాణిజ్య దుకాణాలు, విద్యా సంస్థలు, పెట్రోలు బంకులు స్వచ్ఛంద బంద్ -
ప్రజా కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్లకు శిక్ష తప్పదు
నాగర్కర్నూల్: బీసీ రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్లకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి.. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ధర్నానుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంత బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి బీసీ బిల్లుకు చట్టబద్దత కల్పించేలా కృషి చేయకుండా.. ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 120 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని న్యాయపరమైన బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. బీజేపీ అనుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం గంటలో తేలిపోతుందని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కు బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కులగణన చేసి ఉంటే ఈ పాటికి చట్టబద్ధత వచ్చేదని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ అడుగడుగునా మద్దతు ఇచ్చిందని.. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం మద్దతిచ్చిన బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఎప్పుడో చట్టబద్ధత వచ్చేదన్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాయని విమర్శించారు. -
ఓపెన్ టెన్త్, ఇంటర్లో అడ్మిషన్లు
గద్వాల: ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్లో 2025–26వి ద్యాసంవత్సరంలో చదివేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ విధానం ద్వారా విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ గొప్ప అవకాశం అని తెలిపారు. జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను 1780మంది అభ్యర్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఇప్పటి వరకు 1065 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన సీట్లకు సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17సెంటర్లు ఉన్నాయని ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, www .telanganoapenrchoo.orf వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రూ.2.23 కోట్ల ధాన్యం స్వాహా గద్వాల: గద్వాల పట్టణ సమీపంలోని డ్యాంరోడ్డులో ఉన్న శ్రీరామ రైస్మిల్లులో రూ.2.23 కోట్ల ధాన్యం స్వాహా అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఈ రైస్మిల్లుకు ప్రభుత్వం 2022–23లో 1423 మెట్రిక్టన్నుల ధాన్యం కేటాయించింది. ఇందులో 912 మెట్రిక్ టన్నులు స్వాహా చేసినట్లు, అదేవిధంగా 2024–25 ఖరీఫ్ సీజన్లో 1570 మెట్రిక్టన్నుల కేటాయించగా ఇందులో 12మెట్రిక్ టన్నులు, రబీ సీజన్లో 1074 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 125మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా అయినట్లు విజిలెన్స్అండ్ఎన్పోర్స్మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీలో వెలుగు చూసినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ, తహసీల్దార్, డీసీటీవోలతో కూడిన బృందం సభ్యులు, సివిల్సప్లైశాఖ డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల పాల్గొన్నట్లు తెలిపారు. ఆదిశిలా క్షేత్రంలోప్రత్యేక పూజలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు, వాల్మీకి పూ జారులు తిమ్మప్ప, నర్సింహులు, ఆలయ సి బ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి తదితరులు పాల్గొన్నారు. శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు బిజినేపల్లి: నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శని నివారణ కోసం జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు, అర్చనలు చేశారు. ము ందుగా అర్చక బృందం శనేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమా లు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. -
పంటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు
అలంపూర్ రూరల్: అలంపూర్ మండలం క్యాతూర్ శివారులోని మొక్కజొన్న పంటను శనివారం పాలెం శాస్త్రవేత్తలు శశిభూషణ్, శంకర్, ఈశ్వర్రెడ్డి పరిశీలించారు. మొక్కజొన్న పంటలో ఎక్కువ కంకులు రావడం గురించి రైతులు ఫిర్యాదు చేయడంతో శాస్త్రవేత్తల బృందం ఇక్కడికి వచ్చినట్లు ఏఓ నాగార్జున్రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అక్కడి రైతులు అందించిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా, మండలంలోని బుక్కాపూరంలోని ఉల్లి, వరి, శనగ, మినుము పంటలను పరిశీలించారు. వరిలో కాండం తొలిచే పురుగు, పొట్టకుల్లు తెగులు నివారణ చర్యల్లో భాగంగా కారటప్ హైడ్రోక్లోరైడ్ 500 గ్రాములు ప్రొపికనోజోల్ 250 మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. -
227 దుకాణాలు.. 5,179 టెండర్లు
మహబూబ్నగర్ క్రైం: సాధారణంగా మద్యం వ్యాపారం చేయాలన్నా కోరిక చాలా మందిలో ఉంటుంది.. దీంతో వైన్స్ దుకాణాలకు టెండర్లు వేయడంలో విపరీతమైన పోటీ నెలకొంటుంది. వేసిన టెండర్లలో వారి అదృష్టం పరీక్షించుకొని దుకాణాలు దక్కించుకోవాలనుకుంటారు. కానీ, ఈసారి జరిగిన టెండర్ల ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని వచ్చిన లెక్కలు చెబుతున్నాయి. ప్రతి జిల్లాలో ఊహించని విధంగా టెండర్లు తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి 23 రోజుల వ్యవధి ఇచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కొందరు దూరంగా ఉండటం ఒక కారణమైతే.. టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడం కూడా ప్రభావం చూపింది. అర్ధరాత్రి 12 గంటల వరకు.. ఉమ్మడి జిల్లాలోని 227 దుకాణాలకు గాను మొత్తం 5,179 టెండర్లు దాఖలు అయ్యాయి. ఇందులో శనివారం ఒక్కరోజే 2,428 దరఖాస్తులు రావడం విశేషం. చివరిరోజు కావడంతో దరఖాస్తులు తీసుకోవడానికి అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఇవ్వడం వల్ల ఎకై ్సజ్ అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.155.37 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం వచ్చిన టెండర్లలో మహబూబ్నగర్ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. ● జాతీయ రహదారిపై ఉన్న దుకాణాలతోపాటు ఆంధ్ర, రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవాటికి సైతం ఈసారి టెండర్లు భారీగా తగ్గాయి. గతంలో జాతీయ రహదారి వెంట ఉన్న దుకాణాలకు చాలా వరకు డిమాండ్ ఉండేది. ఒక్కో దుకాణానికి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేవి. కానీ, ఈసారి పరిస్థితి చాలా వరకు తారుమారైంది. దీంతో గతంలో బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు సైతం టెండర్లు తగ్గాయి. జిల్లా చివరిరోజు 2025 2023 టెండర్లు టెండర్లు టెండర్లు మహబూబ్నగర్ 671 1,554 2,540 నాగర్కర్నూల్ 750 1,423 2,524 నారాయణపేట 372 806 1,035 జోగుళాంబ గద్వాల 256 723 1,179 వనపర్తి 379 673 1,341 మొత్తం 2,428 5,179 8,619 మహబూబ్నగర్ 46.62 నాగర్కర్నూల్ 42.69 నారాయణపేట 24.18 జోగుళాంబ గద్వాల 21.69 వనపర్తి 20.19 మద్యం లైసెన్స్ల కోసం వ్యాపారుల్లో కనిపించని జోష్ ఉమ్మడి జిల్లాలో గతంలోకంటే భారీగా తగ్గిన టెండర్లు అత్యధికంగా కోయిలకొండలో 50, కృష్ణాలో 42 దాఖలు జాతీయ రహదారి, సరిహద్దు ప్రాంతాల్లోనూ అంతంతే.. చివరి రోజు 2,428 దరఖాస్తుల స్వీకరణ టెండర్ల ద్వారా రూ.155.37 కోట్ల ఆదాయం -
చేపలు పడుతూ లోయలో పడ్డాడు.. ఎలా బయటకొచ్చాడంటే..!
జోగుళాంబ గద్వాల్: చేపల వేటకు వెళ్లి కెనాల్లో పడ్డ జెయింట్ వీల్ నిర్వాహకుడిని ఎస్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, పోలీస్ బృందాలు సాహాసోపేతంగా కాపాడాయి. గూడెందొడ్డి కెనాల్లో చేపలు పట్టేందుకు రమేష్, తనాజీలు వెళ్లారు. తనాజీ దాదాపు 25 అడుగుల ఎత్తునుండి జారిపడగా.. వారిని కెనాల్లో పడ్డ వ్యక్తిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు.కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన తనాజీ జాతర్లలో జెయింట్ వీల్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం ధరూర్ మండల పరిధిలోని పాగుంట గ్రామ జాతరలో జెయింట్ వీల్ నిర్వహించడానికి వచ్చాడు. తనాజీ ఇవాళ మధ్యాహ్నం సమయంలో తన సహచరుడు రమేష్తో కలిసి చేపలు పట్టేందుకు గుడెం దొడ్డి కెనాల్ వద్దకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో రమేష్ పూర్తిగా కెనాల్లోకి దిగగా, తనాజీ కూడా దిగేందుకు ప్రయత్నిస్తుండగా సుమారు 25 అడుగుల ఎత్తు నుండి జారి కెనాల్లో పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన రమేష్ తక్షణమే “100 డయల్”కి కాల్ చేసి ధరూర్ పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న వెంటనే ధరూర్ పోలీస్ సిబ్బంది రామిరెడ్డి, వినోద్ కుమార్లు సంఘటన స్థలానికి బయలుదేరుతూ, వివరాలను ధరూర్ ఎస్ఐకి తెలియజేశారు. ఎస్ఐ వెంటనే ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్రావు దృష్టికి తీసుకెళ్ళి, వారి అనుమతితో ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని, సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి తనాజీని కెనాల్లో నుంచి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. రక్షించిన తరువాత తనాజీకి కాలు, చేయి, విరిగినట్లు గుర్తించి,108 అంబులెన్స్ ద్వారా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందిన వెంటనే, స్పందించిన పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు అభినందించారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి
అలంపూర్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని తహసీల్దార్ మంజుల అన్నారు. అలంపూర్ పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ పద్మావతి, ఎంఈఓ అశోక్ కుమార్ హాజరయ్యారు. అండర్–14 విభాగంగలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని 13 మండలాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక మానసిక వికాసం వృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు పోటీపడ్డాయి. ఖోఖో ఫైనల్స్లో బాలికల విభాగంలో ఎర్రవల్లి–వడ్డేపల్లి మండలాల జట్లు తలపడగా ఎర్రవల్లి జట్టు విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ఇటిక్యాల–అయిజ జట్లు పోటీ పడగా.. అయిజ జట్టు విజేతగా నిలవగా ఇటిక్యాల జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో యువజన క్రీడా జిల్లా అధికారి కృష్ణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఖోఖో జిల్లా కన్వీనర్ భరత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు మాధవి, అమరేందర్ రెడ్డి, బాలజీ కృష్ణకుమార్ పీఈటీలు పార్వతమ్మ, అరుణతార, శైలజ, శ్రీనివాసులు, దేవేందర్ నాయుడు, రాజు, నాగరాజు, తిరుపతి, నరస్మింహ రాజు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
గద్వాల న్యూటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బహుజన రాజ్య సమితి, ప్రజా సంఘాల నాయకులు కోరారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్బాబు, వెంకటస్వామి, ఆంజనేయులు, ప్రభాకర్, పల్లయ్య, వాల్మీకీలు మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రేస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పారు. రిజర్వేషన్ గ్యారెంటీగా అమలు చేయడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. 50శాతం ఉన్న బీసీల సమస్యపై గవర్నర్ తగిన చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే బీసీజనాభా లెక్కలను ప్రభుత్వం చేపట్టి, వారి శాతాన్ని తేల్చిందన్నారు. పార్లమెంట్లో చట్ట సవరణ చేసి రిజర్వేషన్ల శాతాన్ని ఆయా వర్గాల జనాభా మేరకు పెంచడానికి బీజేపీ చొరవ తీసుకొని, చిత్తశుద్ది నిరూపించుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు హన్మిరెడ్డి, కిరణ్కుమార్, సుభాన్, దామోదర్, గంజిపేట రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఉపాధి కూలీకి పని కల్పించాలి
మానవపాడు: ప్రతి ఉపాధి కూలీకి తప్పక పని కల్పించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సూచించారు. గురువారం మండలంలోని కలుకుంట్ల, చెన్నిపాడు, మానవపాడు గ్రామాలలో గ్రామ పంచాయతీ ఉపాధికూలీల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సక్రమంగా రికార్డులను నిర్వహించాలని, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రసహాయకులు, కొలతలు తీసి ఎంబీలు సరిగా చేయని సాంకేతిక సహాయకులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ఇంకుడుగుంతలను, నర్సరీలలలోని మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, పంచాయతీ కార్యదర్శి సంధ్యరాణి సిబ్బంది పాల్గొన్నారు. అలంపూర్ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని, ఈమేరకు ప్రొసీడింగ్ వచ్చినట్లు కమిషనర్ శంకర్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గురువారం విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీలోని 10 వార్డులలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు, ఆర్చీగేట్, రోడ్డు విస్తరణ, మరమ్మతుల కోసం ఈ నిధులు వచ్చినట్లు తెలిపారు.అక్బర్ పేటలో కాలనీలో సమస్య పరిష్కారానికి రూ.4.50 లక్షలతో కలెక్టర్కు నివేదికలు పంపినట్లు తెలిపారు. పందులను శివార్లకు తరలించాలి ఇదిలాఉండగా, కార్యాలయంలో పందుల పెంపకందార్లతో కమిషనర్ సమావేశమయ్యారు. పందులను ఊరికి బయట ఉంచుకోవాలని సూచించినట్లు తెలిపారు. పందులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పందుల పోషణకు స్థలాలు కేటాయించారని కానీ అక్కడ విద్యుత్ సదుపాయం లేదని పందుల పెంపకందార్లు కమిషనర్కు తెలిపారు. విద్యుత్ సరఫరా తీసుకోవడానికి సరైన పత్రాలు లేవని తెలిపారు. స్థలానికి సంబందించిన పత్రాలు ఇచ్చి విద్యుత్ సదుపాయం కల్పిస్తే ఊరి బయట వాటి పోషణకు ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.4,950 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 207 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4950, కనిష్టం రూ.2670, సరాసరి రూ.4386 ధరలు లభించాయి. అలాగే, 113 క్వింటాళ్ళ ఆముదాలు రాగా గరిష్టం రూ. 5940 కనిష్టం రూ. 5710, సరాసరి రూ. 5932 ధరలు పలికాయి. మొక్కజొన్న క్వింటా రూ.2,075 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వివిధ ప్రాంతాల నుంచి 2,812 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.2,075, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.5,709, కనిష్టంగా రూ.5,629గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.1,789గా ఒకే ధర పలికింది. 19న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలో వచ్చేనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్కార్డుతో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం సీనియర్ క్రీడాకారుడు రాజు (9985022847) నంబర్ను సంప్రదించాలని సూచించారు. యోగాసన క్రీడాజట్ల ఎంపికలు ఉమ్మడి జిల్లా యోగాసన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల బాల, బాలికల జట్ల ఎంపికలను ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8–10, 10–12, 12–14, 14–16, 16–18 ఏళ్లలోపు క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఒరిజనల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440292044 నంబర్కు సంప్రదించాలని వారు సూచించారు. -
సంక్షేమ హాస్టళ్లలో నూతన మెనూ
గద్వాల: 2025–26 విద్యా సంత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో కొత్త మెనూ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కొత్త మెనూ పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో 2025–26 విద్యా సంవత్సరానికి కొత్త, పోషకాహార మెనూ అమలులోకి వచ్చిందన్నారు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి విద్య ఈ మూడు ఒకదానికొకటి విడదీయరాని అంశాలని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య లక్ష్యమని ఆయన అన్నారు. ప్రతివిద్యార్థి శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రతినిత్యం ఆహారంలో పోషక పదార్థాలు ఉండేలా కొత్త మెనూను రూపొందించమని తెలిపారు. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని వంటశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో వండేప్రతి భోజనం తాజా పదార్థాలతో సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు భోజనం సమయానికి అందించాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వంటగదులు పరిశుభ్రంగా ఉండేలా పర్యావేక్షించాలన్నారు. నీటివనరులు, నిల్వ ప్రదేశాలు శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యావేక్షణ కొనసాగించాలని ఇక్కడ నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈకార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్పాష, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ నుషిత, హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లలో కొత్త విధానం
ఉండవెల్లి: పత్తి కొనుగోలు, అమ్మకాల్లో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్ కపాస్ కిసాన్ను తీసుకొచ్చిందని, దీని ద్వారానే సీసీఐ కొనుగోళ్లు చేపట్టనుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఉండవెల్లి రైతువేదికలో వీసీ నిర్వహించారు. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు వీసీ నిర్వహించగా.. అలంపూర్ డివిజన్ స్థాయి అధికారులు, ఉండవెల్లి, మానవపాడు, రాజోళి, అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు. పత్తి కొనుగోలుకు ప్రత్యేక యాప్ ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకుని అమ్మకాలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నారని, పంట నమోదును త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
గట్టు: మండలంలోని ఆలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు తాగు నీటి సమస్యపై రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. గట్టు–గద్వాల రోడ్డుపై ఆలూరు బస్టాండ్ దగ్గర విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని తాగు నీటి సమస్యను తీర్చాలని ఆందోళన నిర్వహించారు. నీటి సరఫరా సక్రమంగా లేదని, మధ్యాహ్న భోజన సమయంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అనేక పర్యాయాలు ఉపాధ్యాయులు, గ్రామ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చెన్నయ్య, ఇన్చార్జ్ ఎంఈఓ వెంకటేశ్వర్లు మిషన్ భగీరథ అధికారులతో కలిసి ఆలూరు ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో తాగునీటి సమస్యపై ఆరా తీశారు. అయితే కేవలం స్కావెంజర్ నిర్లక్ష్యంగా కారణంగానే నీటి సమస్య నెలకొందని, పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ ద్వారా, బోరు ద్వారా నీటి సరఫరా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. -
బకాయిలు విడుదల చేయాలి
అలంపూర్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు రూ.180 కోట్ల బకాయి పెండింగ్లో ఉందని, దీంతో ఈ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న దాదాపు 30 వేల మంది దళిత గిరిజన విద్యార్థులు రోడ్డున పడ్డారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, ప్రధాన కార్యదర్శి రాజులు ఎమ్మెల్యే విజయుడును కోరారు. కర్నూల్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడును బుధవారం కలిసి పెండింగ్ నిధులు తక్షణమే చెల్లించాలని, విద్యార్థులు రోడ్డున పడుతున్నారనివినతి పత్రం అందజేశారు. ప్రభుత్వంతో, ఇంచార్జీ మంత్రితో మాట్లాడి బకాయి నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని విజయ్, వెంకటస్వామి, ప్రభాకర్ కోరారు. -
మీ త్యాగం మరువలేనిది
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి విలువైన భూములు, ఇండ్లను త్యాగం చేసిన ర్యాలంపాడు గ్రామస్తుల త్యాగం మరువలేనిదని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం వారు ర్యాలంపాడు పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్ర లే అవుట్, మ్యాప్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పునరావస కేంద్రంలో అన్ని వసతులతో కూడిన వసతులు కల్పించేందకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాలంపాడు గ్రామస్తులందరూ ఇక్కడే ఇళ్లు నిర్మంచుకొని జీవనం కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధిలో కీలక పాత్ర పోశించిన ర్యాలంపాడు గ్రామస్తుల త్యాగం ఎనలేనిదన్నారు. అతి తక్కువ ధరకే భూములు, ఇండ్లు ఇచ్చారన్నారు. అదే ప్రాంతంలోనే ప్రాజెక్టు రిజర్వాయర్, పంప్హౌస్, కాల్వలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుంది కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో లక్షా 80వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పూర్తి బాధ్యతతో అండగా ఉంటుందన్నారు. ర్యాలంపాడులో 4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించడం జరిగిందన్నారు. ఈ జలాలతోనే జిల్లా సస్య శ్యామలం అయ్యిందన్నారు. అన్ని వసతులతో కూడిన పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి గాను పునరావాస సెంటర్లో రోడ్లు, మురుగు కాల్వలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనం, దేవాలయాలు, చర్చిలు వంటి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బాధితులకు అందాల్సిన ఫిట్టింగ్ చార్జెస్ను కూడా త్వరలోనే అందే విధంగా చూస్తామన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా 250 ఇళ్లను ఇక్కడ మంజూరయ్యాయని, లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే, కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మిరాయణ, ఆర్డీఓ అలివేలు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాసులు, నాయకులు రాజశేఖర్, విజయ్ కుమార్, పురుషోత్తంరెడ్డి, దైలన్న, హంపన్న పాల్గొన్నారు. గద్వాలటౌన్: విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం స్థానిక బుర్దపేట ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల చేత ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. బాగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిని, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్ను పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. పాఠశాలలోని వంటగది, త్రాగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలోని సరుకులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. ఆహార పదార్థాలు, కూరగాయాలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. వంట పాత్రలతోపాటు వంటగది ఎల్లప్పుడు శుభ్రంగా ఉండాలన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ర్యాలంపాడు పునరావాస కేంద్రం సందర్శన వసతుల కల్పన.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ -
తేలని ఇసుక పంచాయితీ
కాంట్రాక్టర్ తో ‘అధికార’ సన్నిహితుల బేరసారాలు ఎవరి పట్టు వారిదే.. తుమ్మిళ్ల నుంచి ఇసుక బయటకు రావాలంటే ఒక్కో ట్రిప్పర్కు రూ. 6 వేల చొప్పున ఎట్టిపరిస్థితుల్లోనైనా చెల్లించాల్సిందేనని అధికార నేత పట్టుబట్టినట్టు సమాచారం. దీనిపై మంగళవారం సైతం అధికార నేతకు చెందిన సన్నిహితులు.. కాంట్రాక్టర్తో చర్చలు జరిపినట్లు సమాచారం. బేరసారాలు జరిగినా సఫలం కానట్లు తెలిసింది. సదరు నేతకు కప్పం చెల్లించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ ఒప్పుకోనట్టు తెలుస్తోంది. ఒక్క రూపాయి ఇచ్చేది లేదంటూ ఆయన భీష్మించుకొని కూర్చున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇసుక రవాణాకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల మౌనంపై విమర్శలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం తుంగభద్ర నుంచి ఇసుక తవ్వకాలను ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా.. ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనం వీడకపోవడం.. సకాలంలో ఇసుక అందేలా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా కోసం ‘మన ఇసుక వాహనం’ ద్వారా చేపట్టిన కార్యక్రమానికి అడ్డంకులు తొలగడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మిళల్లో తుంగభద్ర నది నుంచి ఇసుకను సేకరించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవల తవ్వకాలను ప్రారంభించారు. అయితే అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోగా.. దుమారం చెలరేగింది. ఇసుక రవాణా కొనసాగాలంటే సంబంధిత కాంట్రాక్టర్ ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున కప్పం చెల్లించాలని హుకుం జారీ చేయగా.. కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇసుక రవాణా నిలిచిపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు అధికార పార్టీకి చెందిన సన్నిహితులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. కప్పం కట్టేందుకు అంగీకరించని కాంట్రాక్టర్ మౌనం వీడని అధికారులు ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అసహనం -
ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం
వంగూరు: మితిమీరిన అవినీతికి పాల్పడుతూ రైతులను, విద్యుత్ వినియోగదారులను పీల్చి పిప్పి చేస్తున్న విద్యుత్ శాఖ లైన్మన్ నాగేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ కావాలని నాలుగు నెలల క్రితం నాలుగు డీడీలకు డబ్బులు చెల్లించాడు. అయితే ట్రాన్స్ఫార్మర్ బిగించడంలో లైన్మన్ నాగేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నిత్యం ట్రాన్స్ఫార్మర్ కోసం లైన్మన్ను కలవగా నాలుగు డీడీలకు రూ.20 వేలు అయినప్పటికీ అదనంగా రూ.10 వేలు తీసుకున్న లైన్మన్ సకాలంలో ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకుండా మరో రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వంగూరు గ్రామ శివారులోని మద్యం దుకాణం ఎదుట రైతు రూ.15 వేల నగదునాగేందర్కు ఇస్తుండగా సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి తరలించారు. నాగేందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, జిలానీ తదితరులు పాల్గొన్నారు. చదువుతోపాటు క్రీడలు ముఖ్యం గద్వాలటౌన్: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని ఇన్చార్జి డీవైఎస్ఓ కృష్ణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని అన్నారు. క్రీడలతో పట్టుదల, శ్రద్ధ అలవడుతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జోనల్, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయా మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ● ఏసీబీకి చిక్కిన లైన్మన్ నాగేందర్ ● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత -
ఆటలకు అందలం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీడల్లో మక్కువ ఉండి పీయూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇక్కడ ఉండే క్రీడా వసతులతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతి సంవత్సరం సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్తో స్పోర్ట్స్ కోటా సైతం లభించనుంది. దీంతో చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరంగా వసతులు.. హైదరాబాద్ తర్వాత సింథటిక్ ట్రాక్ ఉన్న ఏకై క జిల్లాగా పాలమూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్తో పాటు 100 నుంచి 1500 మీటర్ల వరకు వివిధ స్థాయి క్రీడలు నిర్వహించవచ్చు. ఫీల్డ్ ఈవెంట్స్లో హైజంప్, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షార్ట్పుట్, డిస్కస్త్రో, పోల్వాల్ట్తో పాటు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నిర్మించారు. సుమారు 2 వేల మంది జనాలు కూర్చొని క్రీడలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్తోపాటు జిమ్ కూడా అందులో అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థుల ఫిట్నెస్ కోసం ఎంతో ఉపయోగపడనుంది. పీయూలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న అధికారులు సింథటిక్ నిర్మాణంతో అథ్లెటిక్స్కు అనేక అవకాశాలు ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోట్ నిర్మాణంతో ప్రయోజనం ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికలు సౌత్జోన్లో 1,050, ఆలిండియా పోటీల్లో పాల్గొన్న 350 మంది విద్యార్థులు జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం.. పీయూ నుంచి ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయి పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. హారికాదేవి 2018లో ఆలిండియా స్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్లలో మూడో స్థానంలో నిలిచింది. 2019లో మహేశ్వరి స్టెపుల్ చేజ్తో ఆలిండియా రెండో స్థానం సాధించింది. 2020లో హారికాదేవి ఆలిండియా అథ్లెటిక్స్ 200 మీటర్లలో 2వ స్థానం, ఆలిండియా 100 మీటర్లలో 2వ స్థానంలో నిలిచింది. 2020లో మహేశ్వరి ఖేలో ఇండియాలో 3000 మీటర్ల స్టెపుల్ చేజ్లో 2వ స్థానం, 2020లో హారికాదేవి ఖేలో ఇండియాలో 100 మీటర్ల అథ్లెటిక్స్లో 4వ స్థానంలో నిలిచారు. విష్ణువర్ధన్ గత నాలుగు సంవత్సరాలు జాతీయ స్థాయి ఆర్చరీలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. డేవిడ్ కృపాల్రే గత నాలుగేళ్లు ఎస్జీఎఫ్ఐ క్రికెట్లో జాతీయ స్థాయిలో ప్రతిభచాటారు. 2024లో భరత్ ఆర్చరీలో ఆలిండియా స్థాయిలో సత్తాచాటారు. మొత్తంగా ఇప్పటి వరకు పీయూ తరపున సౌత్జోన్ పోటీల్లో 1,050, ఆలిండియా పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. పీయూలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం వంటివి ఉండటం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి ఎంతో ప్రయోజనకరం. పోటీల్లో పాల్గొనే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతిభచాటిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. పీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు సౌత్జోన్, ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఎంపికయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో రిజర్వేషన్ సైతం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్, పీయూ -
మద్దతు ధరకు పత్తి కొనుగోలు
● తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ను రూపొందిస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పాల్గొనాలని సూచించారు. గద్వాల: రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో కనీస మద్దతు ధరల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పత్తిని విక్రయించే ముందు కాపస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 2025–26 సీజన్లో బీబీ మోడ్ పత్తి రకానికి రూ. 8,110, బీబీ ఎస్పీఎల్ రకానికి రూ. 8,060, మెక్ రకానికి రూ. 8,010 మద్దతు ధరలు కల్పిస్తున్నట్లు వివరించారు. కాపస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ సందర్భంగా వచ్చే ఓటీపీ కోసం ఆధార్ లింక్ ఉన్న మొబైల్ వినియోగించాలని తెలిపారు. బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయించుకోవాలన్నారు. అదే విధంగా పత్తిలో తేమ 8–12శాతం మించరాదన్నారు. జిల్లాలో పత్తి సేకరణ కోసం హరిత కాటన్ మిల్లు, బాలాజీ కాటన్ జిన్నింగ్ మిల్లు, శ్రీవరసిద్ది వినాయక కాటన్ మిల్లులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. పూర్తి సమాచారం కోసం టోల్ఫ్రీ నంబర్ 18005995779 లేదా 88972 81111 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, కార్యదర్శి నర్సింహ, ఎల్లస్వామి పాల్గొన్నారు. ● బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు ఉన్నారు. -
కేసుల నమోదులో జాప్యం వద్దు : ఎస్పీ
గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం డీఎస్పీ మొగిలయ్యతో కలిసి ఆయన పట్టణ పోలీస్స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదులపై వేగంగా విచారణ చేపట్టి.. పోలీసుశాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. కేసుల నమోదులో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయొద్దన్నారు. చోరీలను అరికట్టేందుకు నిత్యం కాలనీల్లో గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సైబర్ క్రైం, మహిళల వేధింపులు, లైంగిక దాడులు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం వాహనాల తనిఖీతో పాటు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. భక్తులు సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించి తన్మయం పొందారు. అనంతరం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు. -
భవిష్యత్కు భరోసా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మొదలుకొని.. డిగ్రీ తర్వాత పీజీ స్థాయి కోర్సులు చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో చేరి జీవితంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సాధారణంగా యూనివర్సిటీలో స్టడీ సర్కిల్ ద్వారా తరగతులు బోధించేందుకు అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కేవలం యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధం.. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, అవసరమైన పుస్తకాలు ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అధికారులు ప్రత్యేక స్టడీ సర్కిల్ సైతం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల తరగతులు లేని సమయంలో స్టడీ సర్కిల్ కొనసాగించారు. దీంతో గతేడాది వెలువడిన పలు పోటీ పరీక్షల ఫలితాల్లో చాలామంది పీయూ విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించారు. 2018– 19 విద్యా సంవత్సరంలో 160 మంది స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందితే 35 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2019– 20లో 143 మంది శిక్షణ పొందగా... 21 మంది ఉద్యోగాలు పొందారు. 2020– 21లో కోవిడ్ కారణంగా శిక్షణ జరగలేదు. ఇక 2021– 22లో 135 మంది శిక్షణ తీసుకుంటే 25 మంది, 2022– 23లో 197 మంది శిక్షణ తీసుకుంటే 107 మంది విద్యార్థులు కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్–4 వంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం. అలాగే పలు ప్రైవేట్ సంస్థలు, విదేశాల్లోనూ కొందరు ఉద్యోగాలు పొందారు. మరో 3 రోజులు. పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు ప్రైవేట్తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
మల్దకల్: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్య నేరమని డీఈఓ విజయలక్ష్మీ, డీడబ్ల్యూఓ సునంద అన్నారు. సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్దకల్ కస్తూర్బా పాఠశాలలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహాలు చేయాలని, బాల్యవివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలను వివరించారు. అలాగే బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస వంటి అంశాలను వివరించారు. బాలికలు చదువుకున్నప్పుడే పురుషులతో సమానంగా రాణించగలుగుతారని సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ హేమలత, డీసీపీఓ నరసింహ, జీసీడీఓ హంపయ్య, ఎంఈఓ సురేష్, ఎస్ఓ విజయలక్ష్మీ, ఏఎస్ఐ ఈశ్వరయ్య ,సురేష్, ప్రకాష్, శివ, పద్మమ్మ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.4,859 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 280 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4859, కనిష్టం రూ.2905, సరాసరి రూ. 4091 ధరలు లభించాయి. అలాగే, 156 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5901 కనిష్టం రూ. 5429, సరాసరి రూ. 5901 ధరలు పలికాయి. -
జోగుళాంబ గద్వాల
‘మాటల’ మంటలు.. ..రైతులకు వరం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరం అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025–10లో uఅన్నీ మహబూబ్నగర్ వాళ్లకేనంటూ.. మహబూబ్నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల కీలక నేతల మధ్య తొలి నుంచీ అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ చైర్మన్, ముడా చైర్మన్ పదవులు మహబూబ్నగర్ నియోజకవర్గానికి దక్కాయి. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ పదవి సైతం ఈ సెగ్మెంట్కు చెందిన ఒబేదుల్లా కొత్వాల్కు కేటాయించారు. ఈ క్రమంలో అన్ని పదవులు మహబూబ్నగర్ నియోజకవర్గ నేతలే తన్నుకుపోతున్నారనే అభిప్రాయం జడ్చర్ల నాయకుల్లో ఉంది. దేవరకద్రకు చెందిన సీతాదయాకర్రెడ్డి తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా నియామకమైనప్పటికీ.. మహబూబ్నగర్కే పెద్దపీట వేస్తున్నారనే అభ్రిపాయం ఈ సెగ్మెంట్ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. మా సెగ్మెంట్లోనూ పెత్తనం చెలాయిస్తున్నారని.. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి జిల్లాకేంద్రంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఇక్కడి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గంలోనూ ఆయన పెత్తనం సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అనుచరుల్లో నెలకొంది. దీనిపై యెన్నం ఎక్కడా స్పందించకున్నా.. డీసీసీ అధ్యక్షుడు జీఎమ్మార్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరుకాకపోవడం, అంటీముట్టనట్లుగా వ్యవహరించడంపై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. అధికార వార్..! ‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, సర్పంచ్ పోస్టుల్లో నిలబడాలని అనుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. వివిధ హోదాల్లో ఉన్న కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. తాము ఇంట్లో కూర్చుని ఉన్నా.. బీఫాంలు వస్తాయని పగటి కలలు కంటున్నారు. మేం చెబితే బీఫాంలు వస్తాయని ఎవరైతే చెబుతున్నారో.. వారి ఆటలు కొనసాగనివ్వం. డీసీసీ అధ్యక్షుడిగా నేనే బీఫాంలు ఇచ్చేదని గ్రహించాలి.’’ – జి.మధుసూదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే (ఓట్ చోరీ కార్యక్రమంలో) ‘‘ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్నూ చంపొచ్చు. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నాలు చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ ఒప్పుకోరు. – అనిరుధ్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే (విలేకరుల సమావేశంలో) ..మహబూబ్నగర్ జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్లో మాటలు మంటలు రేపుతున్నాయనే దానికి ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. బీసీల్లో బలమైన సామాజిక వర్గ నాయకుడు కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇటీవల తెరపైకి రావడం.. డీసీసీ అధ్యక్ష పదవికి ఏఐసీసీ పరిశీలకులు కసరత్తు చేపట్టిన క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో లుకలుకలు వెలుగుచూస్తున్నాయి. కీలకనేతల మధ్య అంతర్గత విభేదాలతో పోరు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో సైతం ‘హస్తం’ నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుండగా.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కాంగ్రెస్లో అంతర్గత పోరు డీసీసీ అధ్యక్ష పదవికి చేపట్టిన కసరత్తులో అనిరుధ్రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్రెడ్డి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బీసీల నుంచి సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వినోద్కుమార్, మైనార్టీల నుంచి సిరాజ్ఖాద్రీ, జహీర్ అక్తర్ పోటీపడుతున్నారు. అయితే డీసీసీ పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏదైనా సామాజిక వర్గానికి చెందిన సమర్థవంతమైన నాయకుడితో భర్తీ చేస్తే బాగుంటుందని అనిరుధ్రెడ్డి కోరడం చర్చనీయాంశమైంది. ఒకవేళ రెడ్డి వర్గానికి కేటాయించిన పక్షంలో తన సోదరుడు దుష్యంత్రెడ్డి కూడా పోటీలో ఉంటారని ఆయన చెప్పకనే చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీసీసీ పదవికి దుష్యంత్రెడ్డి దరఖాస్తు చేసుకోలేదని ఆయన చెబుతున్నా.. కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం భిన్నవాదనలు విన్పిస్తున్నాయి. దీంతో పాటు బీసీల్లో బలమైన సామాజిక వర్గ నాయకుడు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెరపైకి వచ్చిన క్రమంలో అనిరుధ్రెడ్డి సోమవారం జడ్చర్లలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అలాగే ఇటీవల డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఓట్ చోరీ సంతకాల సేకరణలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకాని వారికి ఇదో హెచ్చరిక అంటూ బీఫాంలపై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. గద్వాల, వనపర్తిలోనూ లుకలుకలు వనపర్తి జిల్లాలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అనుచరుడు లక్కాకుల సతీష్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గానికి చెందిన కిరణ్కుమార్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు శాట్ చైర్మన్ శివసేనారెడ్డి సైతం డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయా నేతల వర్గాల మధ్య వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. ఆయా వర్గాలకు చెందిన నేతలు డీసీసీ పదవికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏఐసీసీ నాయకుడు సంపత్కుమార్ మద్దతు కీలకం కాగా.. చివరి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. మహబూబ్నగర్ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు తమ మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని.. పార్టీ విధానాల ప్రకారం సమష్టి నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. కానీ వారివారి ముఖ్య అనుచరులతో పాటు పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ‘ఢీ’ సీసీ.. అటు ‘చేరిక’పంచాయితీ మాటల తూటాలను పేలుస్తున్న నేతలు మహబూబ్నగర్లో తారాస్థాయికి విభేదాలు ? గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ కుతకుత -
ప్రజా సమస్యలపై పాలకులను ప్రశ్నించాలి
అలంపూర్: ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులను ప్రశ్నిద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. అలంపూర్ మున్సిపాలిటీలోని సమస్యలపై కేవీపీఎస్ అధ్వర్యంలో సోమవారం సర్వే నిర్వహించారు. అక్బర్పేట, సంతమార్కెట్, పెద్ద దర్గా కాలనీల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేవీపీఎస్ నాయకులు ఆరా తీశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంత మార్కెట్ పక్కన కందకం పూడ్చాలన్నారు. కందకంలో కంపచెట్లు, మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని, ముళ్లపొదలతో విష సర్పాలు సంచరిస్తున్నాయన్నారు. మున్సిపల్ అధికారులు కందకంలోని నీటిని మోటర్ల ద్వార తొలగించాలన్నారు. మురుగు నిల్వ ఉండకుండా కల్వర్టుల ఎత్తు పెంచాలని, సంత మార్కెట్ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన కూరగాయల షెడ్డు వినియోగంలోకి తేవాలన్నారు. అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. అక్బర్ పేటలో వర్షం నీరు ప్రధాన రోడ్లపైనే నిలుస్తుందని, ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించాలన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 16వ తేదీన మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు వెంకటస్వామి, విశ్వం, నరసింహ్మా, అయ్యప్ప, జయన్న, రఫీ, సుకుమార్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల/అయిజ:: మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ పార్టీ కార్యాలయంలో మహాసభల పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 14,15వ తేదీలలో రంగారెడ్డి జిల్లా తుర్కియాంజిల్లో రెండురోజుల పాటు రాష్ట్ర మహాసభలు జరుగనున్నట్లు తెలిపారు. జిల్లా మహాసభలను.. అదేవిధంగా, ఈనెల 17న అలంపూర్ చౌరస్తాలో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని వెంకటస్వామి కోరారు. సోమవారం అయిజలో తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 2019 మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, ఆటోల అడ్డాలకు స్థలాలు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.12వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వివి నరసింహ, కార్మికులు మురళి, మల్దకల్, రవి, బీసన్న, శివ, కర్రెప్ప, నాగరాజు, చిన్న, శ్రీను, దావీదు, ఆనందం, సులోమన్ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఆర్పై అవగాహన కలిగి ఉండాలి
ప్రజావాణికి 72 ఫిర్యాదులు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుకు ప్రాధాన్యతినిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఐడీవోసీ కార్యాలయంలో ప్రజలు 72 ఫిర్యాదులు ఇచ్చారని వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులు పంపి పరిష్కరించాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. పరిష్కారం కాని యెడల అందుకు సంబంధించి కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. గద్వాల: ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ అందిస్తే వారి ప్రాణాలు రక్షించవచ్చని, సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒత్తిడితో కూడిన ప్రజాజీవితంలో ఆకస్మాత్తుగా గుండెపోటు సంభవించడం పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు గుండెపోటుకు గురైన వ్యక్తికి పూర్తిస్థాయి వైద్యసాయం అందేలోపు చాతిని 30సార్లు నొక్కి రెండు శ్వాసలు ఇవ్వడం ద్వారా గుండె తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. కార్డియక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలోనూ ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వారంరోజుల పాటు సీపీఆర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈవిధానంపై గ్రామాల నుంచి పట్టణాల వరకు అందరిలోనూ అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాని వైద్యధికారులను ఆదేశించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ డాక్టర్ రాజు, డాక్టర్ మధు ప్రయోగకపూర్వంగా సీపీఆర్ను ఎలా చేయాలో క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, వైద్యధికారి డాక్టర్ సిద్దప్ప, డాక్టర్లు సంధ్య, కిరణ్మయి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
అందరి ప్రోత్సాహంతో..
ఫిజిక్స్ విభాగంలో వాటర్సాలబుల్ రీఏజెంట్స్ పై పరిశోధన పూర్తి చేశాం. దానికి పేటెంట్ కూడా వచ్చింది. పరిశోధన పూర్తి చేయడానికి మా గైడ్ చంద్రకిరణ్తో పాటు అధికారులు అందరు ఎంతో సహకరించారు. పరిశోధన పూర్తి అయిన వెంటనే కాన్వకేషన్ నిర్వహించి డాక్టరేట్లు అందించడం చాలా సంతోషంగా ఉంది. – స్వాతి, పీహెచ్డీ గ్రహీత సంతోషంగా ఉంది పండ్ల తొక్కలు డీగ్రేషన్ చేయడం, పొల్యూషన్ ఉండకుండా ఉండే విధంగా, ఫ్రూట్జ్యూస్ కు సంబందించి క్లాసిఫికేషన్ పై పరిశోధన చేశాం. అందుకోసం గైడ్ టీచర్ మధుసూదన్రెడ్డి ఇతర అధికారులు ఎంతో సహకరించారు. అందుకు ప్రతి ఫలంగా కాన్వకేషన్లో డాక్టరేట్ అందుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తు పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తాం. – ఏ.చేతన, పీహెచ్డీ గ్రహీత పరిశోధనలకు పేటెంట్ వచ్చింది ప్రస్తుతం కాన్వకేషన్లో ఇద్దరు మా స్కాలర్స్ డాక్టరేట్ తీసుకుంటున్నారు. సమాజ హితం కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి వచ్చే అంశాలపై పరిశోధనలు చేశాం. అందుకోసం పేటెంట్లు సైతం వచ్చాయి. భవిష్యత్ ప్రయోగాలు కూడా ప్రజలకు ఉపయోగ పడే విధంగా నిర్వహిస్తాం. – ఎన్.చంద్రకిరణ్, అధ్యాపకుడు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సమాజహితం కోసమే.. పీయూలో ఇటీవల వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఎక్కువ సంఖ్యలో రీసెర్చి స్కాలర్స్ రావడం గొప్ప విషయం. ఇద్దరు స్కాలర్స్ మా ఆధ్వర్యంలో రీసెర్చి పూర్తి చేశారు. వారి పరిశోధనలు పూర్తిగా సమాజం, ప్రజల అవసరాలను తీర్చే విధంగా జరిగాయి. వారికి కాన్వకేషన్లో డాక్టరేట్లను ప్రదానం చేయడం గొప్ప విషయం. – మధుసూదన్రెడ్డి, అధ్యాపకుడు మైక్రోబయాలజీ -
బంతి సోయగం..!
మల్దకల్లో సాగు చేసిన బంతిపూల తోట మల్దకల్ సమీపంలో బంతి పూల సోయగాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్డుకు ఇరువైపులా పూల అందాలు ఆకర్శిస్తున్నాయి. దీపావళి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బంతిపూలకు ఏటా డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా రైతులు సైతం ఈ సీజన్లో బంతిపూల సాగు చేపడతారు. మల్దకల్ పెట్రోల్ బంకు సమీపంలో రైతు లక్ష్మన్న తన రెండెకరాల వ్యవసాయ పొలంలో బంతిపూలను సాగు చేయగా.. పసుపు కాంతులీనుతున్న పూల మొక్కలు అటుగా వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాలను ఆదివారం ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – మల్దకల్ -
ధర్మరక్షణకు కంకణ బద్ధులు కావాలి
మల్దకల్: దేశం, ధర్మం కోసం కంకణ బద్దులై పనిచేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలనే భావనను అందరిలో కలిగించాలని ఆర్ఎస్ఎస్ వక్త, విభాగ్ శారీరక ప్రముఖ్ భోగరాజు రాము అన్నారు. మల్దకల్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఆదివారం కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. ఈమేరకు పదా సంచలన్ కార్యక్రమం, మార్చ్ నిర్వహించారు. భోగరాజు రాము మాట్లాడుతూ.. శతాబ్ది పంచ పరివర్తన విషయాలైన సామాజిక సామరస్యత, ప్రమోదం, పర్యావరణ స్వదేశ స్వాభిమానం, పౌరవిధుల ఆధారంగా సేవకులు సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సంయోజక్ జగదీశ్వర్రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగోవిందు, మల్దకల్, రెడ్డప్ప, తిరుపతిరెడ్డి, తిమ్మన్న, దామ నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు
గట్టు: సంఘ విద్రోహులు, శాంతిభద్రతలకు భంగం కల్గించే వారిపై కఠినంగా వ్యవహరించాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య సిబ్బందికి సూచించారు. మండలంలోని గొర్లఖాన్దొడ్డి గ్రామంలో గతంలో నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసుకు సంబందించి ఆదివారం గొర్లఖాన్దొడ్డి గ్రామంలో ఆయన విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులతోపాటు చుట్టు పక్కల వారి నుంచి కేసుకు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గట్టు పోలీస్ స్టేషన్కు చేరుకొని పలు కేసులకు సంబందించిన వివరాలపై ఎస్ఐ మల్లేష్తో ఆరా తీశారు. గ్రామాల్లో గస్తీని పెంచాలని, ప్రజలతో మంచి సంబంధాలను కల్గి ఉండాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వెంట ఎస్ఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: స్నాతకోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనంలో వివిధ కమిటీల చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిథులు, అధికారులు వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని, భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మెడల్స్ స్పాన్సర్ కోసం అన్ని వసతులు కల్పించాలన్నారు. మీడియా వారికి అనుగుణంగా కార్యక్రమం నిర్వహించే హాల్తోపాటు పలు ప్రదేశాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, హాస్పిటాలిటీ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, మీడియా కమిటీ చైర్మన్ కుమారస్వామి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, అధ్యాపకులు మాలవి, అర్జున్కుమార్, భూమయ్య, శ్రీధర్రెడ్డి, జిమ్మీకార్టన్, రవికుమార్ పాల్గొన్నారు. -
పరిశోధనలకు పట్టం
●పీయూ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో యూజీ, పీజీ విద్యార్థులతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్కు కూడా డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా మైక్రోబయోలజీ విభాగంలో 5, కెమిస్ట్రీ విభాగంలో 5, కామర్స్ విభాగంలో 1, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఒకరు ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎక్కువ మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో ఎక్కువ రీసెర్చి పేపర్లు వెలువడ్డాయి. దీంతో స్కాలర్స్కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ‘మన్నెశ్రీకు గౌరవ డాక్టరేట్.. పీయూలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు స్నాతకోత్సవం నిర్వహించగా.. నాలుగోసారి జరిగే కార్యక్రమంలో మొట్టమొదటిసారి గౌవర డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓ రంగంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఈ డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డికి మొదటిసారి గౌవర డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన పాలమూరు జిల్లా వాసి కావడం, రాష్ట్రంలో పలు ఫార్మతోపాటు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్ డాక్టరేట్.. మన్నె సత్యనారాయణరెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. పీహెచ్డీ పట్టా పొందనున్న వారి వివరాలిలా.. పలు అంశాలపై పరిశోధనలు చేసిన పీయూ రీసెర్చ్ స్కాలర్స్ స్నాతకోత్సవంలో 12 మందికి డాక్టరేట్లు పీయూ చరిత్రలో మొట్టమొదటిసారి మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ గవర్నర్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు స్కాలర్: రాజశ్రీనాథ్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: స్టడీ ఆన్ మైక్రోబియాల్ లిపస్ అండ్ ప్రొటెస్ కల్టివబుల్ అండ్ మెటాజినీవబుల్ అప్రొచ్ స్కాలర్: శ్రీనివాసరావు మేకల (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: అల్లివేషన్ ఆఫ్ డ్రోట్ స్ట్రెస్ ఇన్ క్యాప్సియం అనం ఎల్.అండ్ సౌఫోసిస్ టెట్రాగోనాలోబా బై యూసింగ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా స్కాలర్: విజయ్కుమార్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం : బయోరిమేడేషన్ స్టడీస్ ఆన్ ఫిజికో–కెమికల్ ఆన్ మైక్రోబయాలాజికల్ అలాలసిస్ ఆఫ్ వాటర్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ పెద్ద చెరువు, మహబూబ్నగర్ స్కాలర్: చేతన (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: ప్రొడెక్షన్ ఆఫ్ పెక్టెనసిస్ ఫ్రం ఆస్పర్ గిల్లాస్ నిజర్ ఫర్ ప్రూట్ జ్యూస్ క్లారిఫికేషన్ రైపింగ్ అండ్ పీలింగ్ డీగ్రేడేషన్ స్కాలర్: సంజీవ్కుమార్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం : ఫార్మలేషన్ ఆండ్ ఎలివేషన్ ఆఫ్ పాలీబయోన్యూక్లోప్లాంట్ అన్ సెలెక్టెడ్ క్రాప్ ప్లాంట్స్ స్కాలర్: కె.సంధ్య (కెమిస్ట్రీ) పరిశోధన అంశం : ఎన్విరార్మెంటల్లీ బిగిన్స్ బయోసింథసిస్ ఆన్ పెల్లాడియం నానోపార్టికల్స్ ఆన్ ఇట్స్ యూస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ రెమిడేషన్ ఆన్ బయోమెడికల్ అప్లికేషన్ స్కాలర్: డి.వెంకటేష్ (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ిసంధసిస్ క్యారెక్టరైజేషన్ ఫొటో క్యాటలిటిక్ ఆరండ్ ఫోరోమెటిక్ సెన్సింగ్ స్టడీస్ ఆప్ జి–సీ3ఎన్4 సపోర్టెడ్ మెటల్ ఆకై ్సడ్ నానోపార్టికల్స్ స్కాలర్: రుకియాభాను (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: గ్రీన్ సింధసిస్ ఆఫ్ గోల్డ్ పెల్లాడియం ఆన్ సిల్వర్ నానోపార్టికల్స్ యూజింగ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ క్యారెక్టరైజేషన్ అండ్ అప్లికేషన్ స్కాలర్: టి.స్వాతి (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ప్రిపరేషన్ స్ట్రక్చరల్ క్యారెక్టరైజేషన్ అండ్ అప్లికేషన్ ఆప్ ట్రాన్సినిట్ స్పీసెస్ ఆఫ్ డీమ్యాప్ ఆండ్ సింధసిస్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ స్కాఫోల్డ్స్ బై ఎంప్లయింగ్ ఆక్వోయిస్ ఫేస్ క్నొవేంగిల్ కండేంషేషన్ అండ్ మాల్టీకాంపోనెంట్ రియాక్షన్ స్కాలర్: జి.విజయలక్ష్మీ (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ఆక్వియాస్ ఫేస్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంప్లయింగ్ లివేస్ బేస్ అడెక్ట్ ఆప్ డీమ్యాప్ యాజ్ న్యూగ్రీన్ రీఏజెంట్స్ ఆన్ స్టీరియో స్పెసిఫిక్ సింధసిస్ ఆఫ్ మెడిసినల్లీ యాక్టిక్ 1,8–న్యాప్తిరిడైన్ డిప్రివేటివ్ స్కాలర్: ఎంఆర్.సంధ్యారాణి (బిజినెస్ మేనేజ్మెంట్) పరిశోధన అంశం: ఏ స్టడీ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ మోటివేషన్ ఆన్ ఎంప్లయిస్ రీటెన్షన్ విత్ రిఫరెన్స్ టూ సెలెక్ట్ ఇట్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ స్కాలర్: రితిక బజాజ్ (కామర్స్) పరిశోధన అంశం: పర్ఫామెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఏ స్టడీ ఆఫ్ సెలెక్ట్ బస్ డిపోట్స్ ఇన్ హైదరాబాద్ -
అసలు వస్తదో.. రాదో..
మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే.. రావడానికి నెల రోజులు పట్టింది. దీంతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. తుమ్మిళ్ల రీచ్ పక్కనే ఉన్నా.. చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏవేవో సాకులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో దశలో ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అసలు వస్తదో.. రాదో, వస్తే.. ఎప్పుడొస్తదో.. తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. – సోమేష్, రాజోళి -
‘చేయి’ తడపాల్సిందే..!
ఇసుక కాంట్రాక్టర్కు ‘అధికార’ పార్టీ నేత హుకుం ● ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున డిమాండ్ ● పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ అడ్డంకులు ● తుమ్మిళ్లలో 2 రోజులుగా నిలిచిన ఇసుక రవాణా ● ఆందోళనలో లబ్ధిదారులు..సీఎం పేషీకి చేరిన ‘పంచాయితీ’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక కొరత గుదిబండగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన సర్కారు తొలుత జోగుళాంబ గద్వాల, ఆ తర్వాత ఉమ్మడి పాలమూరులోని మిగతా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లకు తుమ్మిళ్ల నుంచి ఉచితంగా ఇసుక అందజేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫలితం కానరావడం లేదు. నదిలో నీటి ప్రవాహం బాగా ఉంది.. అందుకే అధికారిక రీచ్లోనూ ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోతున్నారని అనుకుంటే పొరపాటే. తొలుత వర్షాలతో.. తాజాగా ‘చేయి’ తడపాల్సిందేనంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హుకుంతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా అడ్డంకులు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని రాజోళి మండలం తుమ్మిళ్లలో తుంగభద్ర నది నుంచి ఫ్లెడ్జింగ్ పద్ధతిన ఇసుక తోడి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నదిలో నీరు ఉన్న సమయంలోనూ కార్గో శాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిన ఇసుక తవ్వేలా ఈ ఏడాది జూన్లో టెండర్లు నిర్వహించింది. మూడు పాయింట్ల ద్వారా వచ్చే ఏడాది జూన్ 21 వరకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకొని జూలై 3న తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు.. అధికారులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం తుమ్మిళ్ల నుంచే టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే తొలి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు 7 వేల ఇళ్లకు ఇసుక అందించాల్సి ఉంది. 45 రోజుల క్రితం సరఫరా మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు 650 ఇళ్లకు మాత్రమే అందజేశారు. వర్షాలతో సరఫరాకు అడ్డంకులు ఏర్పడగా.. దాన్ని అధిగమించేలోపు మరోసారి బ్రేక్ పడింది. డ్రైవర్ల ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు.. నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత డిమాండ్కు అంగీకరించని సదరు కాంట్రాక్టర్ నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం పేషీకి పంచాయితీ చేరగా.. సీఎంఓ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు జిల్లా అధికారులతో ఫోన్లో సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనిపై జిల్లా అధికారులెవరూ నోరు విప్పడం లేదు. ఇసుక లోడ్తో వాహనాలు నిలిచిపోగా టైర్లు దెబ్బతింటున్నాయని.. రెండు రోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ డ్రైవర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు రీచ్ వద్దకు చేరుకుని గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇసుకను కొల్లగొట్టారని ఉదహరించారు. అప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారని.. అప్పుడు దెబ్బతిన్న రోడ్లు ఇప్పటిదాకా వేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందిస్తే మంచిదేనని.. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. అనుమతులు ఉన్నా.. అధికార పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం అడ్డుకుంటూ గ్రామం పేరు చెడగొడుతున్నారంటూ వాహనాలను పంపించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్గా మారగా.. ‘అధికార’ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. -
అన్నను కాపాడబోయి తమ్ముడు..
● చెక్డ్యాంలో మునిగి ఇద్దరు సోదరుల మృతి ● చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ● తల్లి ఏడాది దినకర్మ చేయడానికి వచ్చి మృత్యువాత ● వనపర్తి జిల్లా బలీదుపల్లిలో విషాదం అడ్డాకుల: తల్లి చనిపోయి ఏడాది కావడంతో దినకర్మ చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు పట్నం నుంచి ఊరికి వచ్చారు.. కార్యం పూర్తిచేసిన మరుసటి రోజు సరదాగా చేపలు పట్టేందుకు చెక్డ్యాం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నీటి సుడిలో మునిగిపోతున్న అన్నను కాపాడబోయి తమ్ముడు కూడా మృతిచెందిన విషాదకర సంఘటన వనపర్తి జిల్లా బలీదుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. బలీదుపల్లి గ్రామానికి చెందిన మంద యాదయ్య, మణెమ్మ దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. అందరూ హైదరాబాద్లో ఉంటూ ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే గతేడాది మణెమ్మ చనిపోవడంతో ఏడాది దినకర్మ చేయడానికి నలుగురు కుమారులు కుటుంబాలతో కలిసి రెండు రోజుల కిందట బలీదుపల్లికి వచ్చారు. శుక్రవారం మణెమ్మ ఏడాది దినకర్మ పూర్తి చేశారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పెద్ద కుమారుడు మంద సుధాకర్ (32), చిన్న కుమారుడు మంద సాయి(25) మరో తమ్ముడు మంద కుమార్తో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి రెండు ఆటోల్లో గ్రామానికి సమీపంలో ఉన్న పెద్దవాగు చెక్డ్యాం వద్దకు వెళ్లారు. దుస్తులు శుభ్రం చేసుకుని కొద్దిసేపు సరదాగా గడిపొద్దామని అక్కడికి చేరుకున్నారు. అయితే చెక్డ్యాం దిగువన చేపలు కనిపించడంతో వెంటనే సుధాకర్ చేపలు పడతానంటూ నీళ్లలోకి దిగాడు. చెక్డ్యాం దిగువన నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీటి సుడి వద్దకు వెళ్లిన సుధాకర్ అందులో చిక్కుకుని మునిపోతూ కనిపించాడు. వెంటనే గుర్తించిన తమ్ముడు మంద సాయి నీళ్లలోకి దిగి అన్నను కాపాడే ప్రయత్నం చేయగా.. ఇద్దరూ నీటి సుడిలో చిక్కుకున్నాడు. ఇద్దరు అందులో కొట్టుమిట్టాడుతుండగా.. కొద్దిదూరంలో ఉన్న మరో తమ్ముడు మంద కుమార్ నీటిలోకి దిగి ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. ప్రాణాలకు తెగించి కుటుంబసభ్యుల సాయంతో ఇద్దరిని ఒడ్డుకు చేర్చగా.. పెద్ద కుమారుడు మంద సుధాకర్ అప్పటికే మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న చిన్న కుమారుడు సాయిని అంబులెన్స్లో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు. సుధాకర్కు భార్య మమత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయికి ఇంకా పెళ్లి కాలేదు. కాగా ఇద్దరు సోదరులు ఒకేరోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తుల చేత కంటతడి పెట్టించాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను జనరల్ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లి దినకర్మకు వచ్చిన కుమారులను మృత్యువు కబలించడంతో బంధువులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు. మంద సుధాకర్ (ఫైల్) మంద సాయి (ఫైల్) -
ఆధునిక హంగులు
పీయూలో కొత్త పుంతలు తొక్కుతున్న పరిపాలన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఆటుపోట్లను దాటుకుంటూ.. ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పీయూలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమర్థ్ స్కీం పోర్టల్ ద్వారా సిబ్బందికి ఆన్లైన్ అటెండెన్స్, వర్క్లోడ్, పే స్లిప్ల వంటివి అందిస్తున్నారు. వీటితోపాటు పీయూలో వినియోగిస్తున్న నీటి పునర్వినియోగం కోసం నూతనంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ను ఆదా చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యం అవుతున్నారు. సమర్థ్ పోర్టల్తో సేవలు.. పీయూలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి సెలవుల మంజూరు, వేతనాల పే స్లిప్లు, విద్యార్థి అడ్మిషన్, అటెండెన్స్, స్కిల్స్ తదితర అంశాలను పొందుపర్చుకోవడం, వివిధ కార్యక్రమాలు, హాస్పిటల్స్ తదితర అంశాలను మ్యానువల్ పద్ధతిలో జరిగేవి. దీనిని ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చి సమగ్రంగా యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పీఎం ఉషా స్కీం నిధులను అందిస్తున్న ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థకు కేంద్రం సమర్థ్ పోర్టల్ను ఉచితంగా అందిస్తుంది. ఈ స్కీంలో భాగంగా యూనివర్సిటీ సిబ్బందికి ప్రత్యేకంగా సమర్థ్ యాప్ ద్వారా ప్రత్యేక సేవలను అందించేందుకు అధికారులు ఇటీవల ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో రెగ్యులర్ అధ్యాపకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగా.. కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలను ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థులనూ ఇందులో చేర్చనున్నారు. తద్వారా పీయూకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఈ–పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫైలింగ్ నిర్వహించి.. ఫైల్ స్టేటస్ ఎక్కడ.. ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. టాప్లో నిలబెడతాం.. పీయూనూ తెలంగాణలో టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. ఫైల్స్, సిబ్బంది అటెండెన్స్, విద్యార్థుల తదితర వివరాలు అన్ని సమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోకి తీసుకొస్తున్నాం. డ్రెయినేజీ నీరు వృథా పోకుండా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి.. నీటి పుర్వినియోగం, బయో ఫర్టిలైజర్స్ వినియోగంలోకి తీసుకువస్తాం. సోలార్ ప్యా నెల్స్ ద్వారా కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. – జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ పేపర్ లెస్ సేవలు.. యూనివర్సిటీలో పేపర్ లెస్ సేవలు నిర్వహించేందుకు సమర్థ్ పోర్టల్ను వినియోగిస్తున్నాం. దీని ద్వారా టీచింగ్, నాన్టీచింగ్, స్టూడెంట్స్ అందరికీ కూడా సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. వీలైనంత త్వరగా దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తాం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో యూనివర్సిటీలో నీటి కొరత తీరడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ ఆన్లైన్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల వివరాలు విద్యుదుత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ బిగింపు రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు నీటి పునర్వినియోగం, వ్యర్థాలతో బయో ఫర్టిలైజర్స్ తయారీ -
రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి
గద్వాల: ప్రధానమంత్రి ధన కృషి యోజన ద్వారా అన్నదాతలు ఆర్ధికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి ధాన్య కృషి యోజనలో జిల్లా ఎంపికకవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి జిల్లా కేంద్రంలోని అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్సరెన్స్ తిలకించి మాట్లాడారు. నేల సారవంతతను బట్టి రైతులు విభిన్న పంటలు వేసేలా ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచడం అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకర్లు ముందుండాలని వ్యవసాయ రంగంలో జిల్లా ప్రగతి సాధించేందుకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇన్చార్జ్ డిఏఓ జగ్గు నాయక్, ఏడీఓ సంగీత లక్ష్మీ, తదితరులు ఉన్నారు. -
డీసీసీ అధ్యక్షులపై కసరత్తు
● వనపర్తి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. లక్కాకుల సతీష్, రాజేంద్రప్రసాద్, డి.కిరణ్ కుమార్ డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దుతో ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇదే క్రమంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం.. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న డీసీసీ అధ్యక్ష పీఠాల భర్తీకి కసరత్తు ప్రారంభించడంతో పార్టీలో మళ్లీ సందడి మొదలైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులైన వారు జిల్లాల బాట పట్టారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి శనివారం పాలమూరుకు చేరుకున్నారు. ముందుగా నారాయణపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మహబూబ్నగర్కు చేరుకుని స్థానిక నేతలతో ముచ్చటించారు. ఆదివారం నుంచి ఈ రెండు జిల్లాల్లో అభిప్రాయాల సేకరణతో పాటు డీసీసీ అధ్యక్షుల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా మరో పరిశీలకుడు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆదివారం నాగర్కర్నూల్, 14న వనపర్తి, 16న జోగుళాంబ గద్వాలలో పర్యటించనున్నారు. ● నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరికల్ మండలం తీలేరుకు చెందిన ఆయనతో పాటు మక్తల్ మండలానికి చెందిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ధన్వాడ మండలంలోని గోటూరు నాగేశ్వర్రెడ్డి పోటీలో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలానికి చెందిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, కోస్గి మండలం పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి సైతం డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా పోటాపోటీ ఇలా.. ● మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి డీసీసీ చీఫ్గా ఉన్నారు. ఆయనతో పాటు ఈ పదవి కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకుడు ఎన్పీ వెంకటేష్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ ప్రధానకార్యదర్శి సిరాజ్ఖాద్రి పోటీపడుతున్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు వర్గాల మధ్య డీసీసీ పదవికి పోటీ నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గంలోని గద్వాలకు చెందిన గడ్డం కృష్ణారెడ్డి, మల్దకల్ మండలానికి చెందిన పటేల్ ప్రభాకర్రెడ్డి.. జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత భర్త తిరుపతయ్య, మల్దకల్కు చెందిన నల్లారెడ్డి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ నాయకుడు సంపత్కుమార్.. సరిత వర్గంలోని నల్లారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ● నాగర్కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు హబీబ్, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్కుమార్ రెడ్డి, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. నవంబర్లో ఖరారయ్యే అవకాశాలు ఏఐసీసీ పరిశీలకులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. అదేవిధంగా అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతల నుంచి ఈ నెల 18వ తేదీ దాకా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వడబోత తర్వాత ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ఈ నెల 22వ తేదీ నాటికి అటు ఏఐసీసీ, ఇటు పీసీసీకి అందజేయనున్నారు. అనంతరం సీఎం ఇతర ముఖ్య నేతలు జిల్లా ఇన్చార్జిలు, ఇన్చార్జి మంత్రులు, ఆయా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో సంప్రదింపులు జరిపి సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్, మహిళ) వారీగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కేటాయించనున్నారు. మొత్తానికి వచ్చే నెల తొలివారంలో డీసీసీ అధ్యక్షులు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆశావహులు తాము చేసిన దరఖాస్తుల్లో పార్టీకి అందించిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొంటూ బయోడేటా ఇవ్వాలని పరిశీలకులు సూచిస్తున్నారు. జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకులు పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 18 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ప్రతిపాదన 5 జిల్లాల్లోనూ పలువురి మధ్య పోటాపోటీ -
చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూర్: చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కృష్ణవేణి చెరుకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం స్థానిక మార్కెట్యార్డులో ఉమ్మడి జిల్లా చెరుకు రైతుల సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.8,150 నిర్ణయించిందని.. అలాగే చెరుకు పంటకు టన్నుకు రూ.6 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతుకు టన్నుకు రూ.వెయ్యి బోనస్ చెల్లించాలని, నిర్ణయించిన ధరకే కోతలు చేపట్టాలని, రవాణా విషయంలో ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రాయితీలు కొనసాగించాలని, పంట విక్రయించిన 14 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, సీడీసీ నిధులతో గ్రామాల్లో రహదారుల మరమ్మతు చేపట్టాలన్నారు. కోతల సమయంలో కార్మికుల కొరత లేకుండా చూడాలని, అధిక దిగుబడుల కోసం రైతులకు అవగాహన కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయాలని, పంటను నష్టపరుస్తున్న తెగుళ్లు, వేరుపురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు మాసూం, వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, సంజీవరెడ్డి, రవి, నారాయణ, రాజశేఖర్రెడ్డి, శివుడు, చంద్రసేనారెడ్డి, తిరుపతయ్య, లింగన్న, రంగారెడ్డి, రాజు, నాగేంద్రం, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
గట్టు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఎం నిరంతరం పోరాటం చేస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ.. మండలంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతవుతున్నారన్నారు. అక్షరాస్యతలో అత్యంత వెనుకడిన ప్రాంతమని, ఈ ప్రాంత విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయులు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీర్చాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సరైన రవాణా సౌకర్యం లేక గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి బీడు భూములకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిని సారించాలని పేర్కొన్నారు. వీవీ నర్సింహ, నర్మద, మండల కార్యదర్శి గట్టు తిమ్మప్ప, నాయకులు ఆంజనేయులు, రెడ్డెప్ప, నర్సింహులు, శాంతిరాజు, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
స.హ.చట్టంతో పారదర్శకత
గద్వాల: సమాచార హక్కు చట్టం.. ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని ఈచట్టంపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ నెల 5వతేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్టీఐ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌరులకు సమాచారహక్కు చట్టం–2005 ప్రకారం అడిగిన సమాచారాన్ని నిబంధనల మేరకు దరఖాస్తుదారునికి సమాధానం ఇవ్వడం అధికారుల బాధ్యత అన్నారు. ప్రభుత్వంలో అన్ని శాఖల నుంచి తమకు కావాల్సిన సమాచారాన్ని పొందడం పౌరుల హక్కుగా చెప్పారు. ఈచట్టం ప్రకారం ప్రజలు అడిగిన సమాచారాన్ని నిర్ధేశిత సమయంలో ఇవ్వకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వారోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతీలు, మండలాలు, డివిజన్, జిల్లా స్థాయిలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా స.హ.చట్టం ద్వారా ఎలాంటి సమాచారాన్ని కోరవద్దో విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజలు అడిగిన దానిప్రకారం ఆయా శాఖలలో ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం అధికారుల బాధ్యతగా పేర్కొన్నారు. అనంతరం ఆయన స.హ.చట్టంపై ప్రతిజ్ణ చేయించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సిం గ్ రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గొర్రెల మేతగా ఉల్లి పంట..
ఉండవెల్లి శివారులో గొర్రెలు మేస్తున్న ఉల్లి పంట వరుణుడి రూపంలో రైతును కష్టాలు వెంటాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంట ఎన్నో చోట్ల నీటిపాలైంది. ఉండవెల్లిలోని జాతీయ రహదారి సమీపంలో రైతు రాజు తన 4 ఎకరాల్లో ఉల్లి పంట వేశాడు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టాడు. వానాకాలం ప్రారంభంలో విస్తారంగా వర్షాలు కురవడంతో దిగుబడి బాగా వస్తుందని, చేసిన అప్పులు తీరతాయని ఆశపడ్డాడు. కానీ, పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలతో ఉల్లి పంట మొత్తం భూమిలోనే మురిగిపోయింది. దాదాపు రూ.4 లక్షల వరకు నష్టం వాటిళ్లడంతో దిక్కుతోచని పడ్డాడు. చేసేది లేక శుక్రవారం 4 ఎకరాల్లోని ఉల్లి పంటను ఇలా గొర్రెలకు మేతగా వదిలాడు. – ఉండవెల్లి -
సమాలోచనలు..!
గద్వాల క్రైం: మద్యం దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చి దాదాపు రెండు వారాలు కావస్తున్నా.. జిల్లాలో తూతూ మంత్రంగా టెండర్లు దాఖలు కావడం గమనార్హం. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు డిపాజిట్ ధర పెంచడం.. షాపు లైసెన్స్ ఫీజు సైతం 50 శాతం పెంపు.. చివరగా లక్కీ డ్రాలో అదృష్టం వరిస్తుందో లేదోనన్న బెంగ.. దీంతో కొందరు వ్యాపారులు సమాలోచనలు చేస్తున్నారు. జిల్లాలోని గద్వాల– అలంపూర్ సెగ్మెంట్లోని 34 వైన్ షాపుల కోసం వ్యాపారుల నుంచి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టింది. ఇందులో జనరల్ 23, గౌడ కులస్తులకు 5, ఎస్సీ కులస్తులకు 6 షాపులు కేటాయించింది. దరఖాస్తు ఫీజును పెంచిన నేపథ్యంలో వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా గడ్డు పరిస్థితిలో ఉంది. దీంతో సదరు వ్యాపారులు మద్యం వ్యాపారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు మద్యం వ్యాపారం చేసేందుకు వెసులుబాటు ఉండడంతో అందరం కలిసి సిండికేట్గా వ్యాపారం చేద్దామని వ్యాపారులు సన్నద్ధమయ్యారని సమాచారం. ఇదిలాఉండగా 2023లో 36 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 1,171 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.23.42 కోట్ల ఆదాయం సమకూకురింది. ప్రస్తుతానికి వచ్చేసరికి 34 మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. ఇక టెండర్ల విషయానికి వస్తే.. ఈ నెల 8వ తేదీన ఒక టెండర్, 9న 11, 10వ తేదీన 5 టెండర్లు దాఖలయ్యాయి. జిల్లాలోని మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఒక్క టెండర్ దాఖలు కాలేదు. అయితే ఇక్కడి వ్యాపారులు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని సమాచారం. ఫలానా తేదీన టెండర్ వేస్తే ఖచ్చితంగా లక్కీ డ్రాలో అదృష్టం తమనే వరిస్తుందని జ్యోతిష్యులు చెప్పడంతో ఆ దిశగా ఆలోచిస్తున్నారని తెలిసింది. ఎలాగూ స్థానిక ఎన్నికల నేపథ్యంలో మద్యం వ్యాపారం భారీ స్థాయిలో ఉంటుంది. దీంతో జనరల్, వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలో ఆయా కేటగిరిలోని వారికి మద్యం వ్యాపారంపై ఆసక్తి, ఆర్థిక స్థోమత లేకపోవడంతో లిక్కర్ సామ్రాజ్యంలో చక్రం తిప్పే కొందరు వ్యాపారులు బినామీలుగా మరికొందరితో టెండర్లు వేయించే పనిలో పడ్డారు. గతంలో నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్లలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఈసారి కూడా మద్యం దుకాణాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం టెండర్లు లేకపోవడం, ధరలు అధికంగా ఉండడంతో ఊహించని విధంగా అలంపూర్ సెగ్మెంట్లో మద్యం వ్యాపారం కొనసాగింది. ఈసారి అక్కడి రాష్ట్రంలో మద్యం టెండర్లు నిర్వహించింది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం లేకపోవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. పెరిగిన డిపాజిట్ నేపథ్యంలో సిండికేట్పైనే వ్యాపారుల ఆసక్తి మొత్తం 17 టెండర్లు దాఖలు -
సాగులో నూతన పద్ధతులు అవలంబించాలి
గద్వాల వ్యవసాయం: నూతన పద్ధతులతో వ్యవసాయం చేయాలని పాలెం వ్యవసాయ శాస్త్రవేత్తలు శశిభూషణ్, శంకర్, ఈశ్వర్రెడ్డి శ్రీరామ్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లి, అనంతాపురం గ్రామాల్లో సాగు చేసిన వరి, మినుము పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో నూతన పద్ధతులను వివరించారు. వీటిని అవలంభించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చునని చెప్పారు. వరి పంటలో చీడపీడల నివారణకు సమగ్ర సస్య రక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతుల గురించి, వాతావరణ పరిస్థితులను బట్టి పంటలో వచ్చు తెగుళ్ల గురించి రైతులకు వివరించారు. వరిలో వచ్చే సుడిదోమ, దోమపోటు నివారణకు లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 2.2మి.లీ. లేదా ఇథోఫెన్ఫ్రాక్స్ 2మి.లీ పిచికారి చేయాలన్నారు. ఉల్లకోడు, దుపరోగం నివారణకు నారుమడిలో మొలకెత్తిన 10 నుంచి 15రోజుల లోపు ఒక సెంటుకు 160గ్రా. కార్బోప్యూరన్ 3కేజీల గుళికలు లేదా 50గ్రా. ఫోరెట్ గుళికలను చల్లాలని చెప్పారు. అలాగే కంరినల్లి నివారణకు ఫ్రోఫిన్ఫాస్ 2 మి.లీ. లేదా డైకోఫాట్ 5.మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్ 1మి.లీ. ఫ్రోఫికోనజోల్ కలిపి ఒకసారి ఆ తర్వాత 15రోజులకు మరోసారి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ హరీష్, రైతులు లక్ష్మీభూపాల్రెడ్డి, క్రిష్ణ, వెంకట్రాములు తదితరులు ఉన్నారు. -
‘స్థానిక’ ఆశలపై నీళ్లు
హైకోర్టు తీర్పుతో ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసిన ఈసీ ● గ్రామాల్లో ఆశావాహుల్లో తీవ్ర నిరాశ ● ఉదయం సందడి.. సాయంత్రం నిశ్శబ్ద వాతావరణం ● ఆరు వారాల తరువాతే ‘స్థానిక’ ఎన్నికలపై స్పష్టత ● ఉమ్మడి జిల్లాలో ఒక జెడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు దాఖలు రిజర్వేషన్లు తేలే వరకు.. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల కేడర్, ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలకవర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ఎన్నికలకు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీ వర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్ల కేటాయింపుతో ఆయా స్థానాల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుండటం ఆశావహులు, ప్రధాన పార్టీల కేడర్లో నైరాశ్యం నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలే వరకు వేచి చూస్తారా.. లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా.. అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ కొనసాగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు తీర్పుతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పోటీకి సిద్ధమైన ఆశావహుల్లో అయోమయం, నైరాశ్యం నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఆశావహులు ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎన్నికలకు ఈసీ గత నెల 29న షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే గురువారం నుంచి తొలివిడత ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం సైతం మొదలైంది. అయితే బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై కోర్టులో పెండింగ్లో ఉండటంతో మొదటిరోజు నామినేషన్లకు అభ్యర్థు లు ఆసక్తి చూపలేదు. తొలిరోజున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 13 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ తరపున చందులాల్ నామినేషన్ వేశారు. ఈ ఒక్క నామినేషన్ మినహా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ రాలేదు. అలాగే నాగర్కర్నూల్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు రాగా, ఇందులో కాంగ్రెస్ తరఫున ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరొకరు నామినేషన్ సమర్పించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో కాంగ్రెస్ తరపున రెండు నామినేషన్లు, గోపాల్పేట మండలంలో ఇండిపెండెంట్గా ఒకరు నామినేషన్ వేశారు. నారాయణపేట జిల్లాలో ఐదు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ ఎంపీటీసీ స్థానానికి బీజేపీ తరపున ఒక నామినేషన్ దాఖలైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండలం తాటికుంట ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరపున ఒక నామినేషన్ దాఖలైంది. ఉదయం సందడిగా కనిపించిన గ్రామాలు కోర్టు స్టే రావడంతో సాయంత్రానికి చతికిలపడ్డాయి.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాఖలైన నామినేషన్లు ఇలా.. కరువైన స్పందన.. -
పరిశోధనలకు పునాది
కీలక మైలురాయి.. పీయూలో రూ.11 కోట్లతో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం నిర్మిస్తున్నాం. దీనిలో ఎక్విప్మెంట్ కోసం రూ.13 కోట్లు పీఎం ఉషా స్కీం ద్వారా కేటాయించాం. ఈ భవన నిర్మాణం చివరిదశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రీసెర్చి స్కాలర్స్, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేటు ఫార్మ కంపెనీలు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంక్యూబేషన్ సెంటర్లో స్టార్టప్ల ఎంటర్ ప్రెన్యూరర్స్ ప్రొటోటైప్ ప్రయోగాల ద్వారా కొత్త అంశాలపై దృష్టి సారించవచ్చు. – జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ ఎంతో ఉపయోగం.. రీసెర్చి ఫెసిలిటీ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. అందులో రీసెర్చి చేసే వారికి అన్ని రకాల వసతులు కల్పించనున్నాం. దీంతో ఇక్కడ ప్రయోగాలు చేసుకునే ప్రైవేటు వారు కొద్ది మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంక్యూబేషన్ సెంటర్ ద్వారా కొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం లభిస్తుంది. ఉమ్మడి పాలమూరుతోపాటు చుట్టు పక్కల జిల్లాల వారికి ఇది ఎంతో ఉపకరించనుంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ త్వరలో పరిశోధనలకు అడ్డాగా నిలవనుంది. విద్యార్థులు, రీసెర్చి స్కాలర్స్, అధ్యాపకులను పరిశోధనల పరంగా ప్రోత్సహించేందుకు పీయూలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2008లో ప్రారంభం అయినప్పుడు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితమైన పీయూ.. ప్రస్తుతం రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణంతో ప్రయోగాలకు నిలయంగా మారనుంది. తెలంగాణలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితం భవనం పనులు ప్రారంభమవగా.. దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ భవన నిర్మాణం, వసతుల కల్పన కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సైతం విడుదల చేయడంతో దీని నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ. 25 కోట్ల వ్యయం... రీసెర్చి ఫెసిలిటీ భవనాన్ని నిర్మించేందుకు రూ.11 కోట్లను గతంలో కేటాయించి నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 5 ల్యాబ్లు, రెండు సెమినార్ హాళ్లు, కంప్యూటర్ ల్యాబ్, ఇంక్యూబేషన్ సెంటర్ వంటివి నిర్మించనున్నారు. ఈ భవనం మరో రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో ఇందులో ఏర్పాటు చేసే వసతుల కోసం నిధులను సైతం ప్రభుత్వం సమకూర్చడం గమనార్హం. ఇందులో పీఎం ఉషా స్కీం ద్వారా గత విద్యా సంవత్సరం రూ.100 కోట్లను కేటాయించగా.. ఈ నిధుల్లోంచి రూ.14 కోట్లు కేవలం రీసెర్చి ఫెసిలిటీ సెంటర్ కోసం మాత్రమే కేటాయించింది. ప్రభుత్వం ఒక్కో మైక్రోస్కోప్, ఇతర ఎక్విప్మెంట్ రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు వెచ్చించనుంది. ఫిజిక్స్, మైక్రోబయోలజీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి వారికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడనుంది. పీయూలో నిర్మితమవుతున్న రీసెర్చ్ ఫెసిలిటీ భవనం రూ.11 కోట్లతో భవనం, ఉమ్మడి జిల్లాలో రీసెర్చి ఊతం రూ.14 కోట్లతో పరికరాల కొనుగోలుకు అనుమతి ఇతరత్రా వసతుల కల్పనకు సైతం నిధులు విడుదల ఇంక్యూబేషన్ సెంటర్తో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం -
శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు
గట్టు: శాంతిభద్రతలకు భంగం కల్గించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ మొగిలయ్య హెచ్చరించారు. గురువారం ఆలూరు, గట్టు గ్రామాల్లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయనతోపాటు గట్టు ఎస్ఐ మల్లేష్ సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాలకు జనాలు 100 మీటర్ల దూరం ఉండాలని, అభ్యర్థితో పాటుగా ఇద్దరికి మాత్రమే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని, మోబైల్పోన్లు, వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. -
అర్హతకు మించి వైద్యం చేస్తే చర్యలు
అలంపూర్: అర్హత లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వైద్యం చేస్తే తగిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సిద్ధప్ప అన్నారు. అలంపూర్లో క్లీనిక్ల పేరుతో ఆర్ఎంపీలు నడుపుతున్న ఆస్పత్రులు, ల్యాబ్లను తనిఖీలు చేశారు. అక్కడి వసతులు, పరికరాలు, మందులను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కొంత మంది ఆర్ఎంపీలు ప్రైవేటు ఆస్పత్రులను నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని, అందుకే ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశామన్నారు. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం అందిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. తొలిసారి కావడంతో అందరికి హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. వ్యవహర శైలిలో మార్పు లేకుండా ప్రజలకు స్థాయికి మించి వైద్యం అందిస్తే చర్యలు చేపడతామన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ అలంపూర్ మండలంలోని క్యాతూర్ పీహెచ్సీని, అక్కడి రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీకి వచ్చిన మందులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు వీరితోపాటు పీఓ ప్రసూనరాణి, మండల వైద్య అధికారి భరత్, ఎంపీహెచ్ఈఓ సత్యనారయణ, హెచ్ఎస్ ఉలిగమ్మ, ఫార్మాసిస్టు రవికుమార్, హెచ్ఏ బాలిశ్వరయ్య శేట్టి, నాగశేషయ్య, ఈఓ మధుసుధన్ రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ లక్కీ డ్రాకు విశేష స్పందన
● రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ లక్కీడ్రాకు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన లభించిందని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. గత నెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) ప్రయాణించే వారికి లక్కీడ్రా నిర్వహించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీఓ రఘుకుమార్ చేతుల మీదుగా లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. ప్రథమ శివశంకర్, ద్వితీయ బిందు, తృతీయ మోక్షజ్ఞలు నిలవగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్గా నిలుస్తున్నదన్నారు. దసరా పండుగ రోజుల్లో ఉమ్మడి జిల్లా ప్రయాణికులు ఆర్టీసీని ఎంతో ఆదరించారని తెలిపారు. మహబూబ్నగర్ రీజియన్లోని ప్రధాన బస్టాండ్లలో ఏర్పాటు చేసిన 17 బాక్సుల్లో లక్కీడ్రా తీసినట్లు చెప్పారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) లక్ష్మిధర్మ, డిపో మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం..
నెట్టెంపాడు ఎత్తిపోతల నుంచి పంట పొలాలకు సాగునీరు వస్తుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. పంటపొలాల్లో కాల్వలు తవ్వి అసంపూర్తిగా వదిలేశారు. ముచ్చోనిపల్లి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా లాభం లేకుండా పోయింది. కాల్వలు తవ్వకుండా ఉన్నా ఆ స్థలంలో పంటలు పండించుకునే వాళ్లం. – బజారి, రైతు, తూంకుంట పంట పొలాల్లో కాల్వలు పోయిన రైతులతో పాటు చుట్టుపక్కల పంట పొలాలు ఉన్న రైతులు డీజిల్ ఇంజిన్లతో పైరుకు నీరు కడుతున్నారు. కాల్వలకు దూరంగా పంట పొలాలు ఉన్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికై నా కాల్వల పనులు పూర్తిచేసి సాగునీటిని విడుదల చేయాలి. – దేవేంద్ర, రైతు, ఎక్లాస్పురం కాల్వ పనులు పూర్తిచేసేందుకు కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. భూ సేకరణకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. చిన్న కాల్వలు తవ్వేందుకు కొందరు రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. కొంతమంది రైతుల నుంచి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఆయా సమస్యలను పరిష్కరించి కాల్వల పనులు పూర్తిచేసేందుకు కృషిచేస్తాం. – నవీన, నెట్టెంపాడు లిఫ్ట్ 109వ ప్యాకేజీ డీఈఈ ● -
మూడు రోజులే గడువు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీనిపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా తీర్పు గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రానికి రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో గురువారం ఉదయం 10.30 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న అయోమయం ఆశావహుల్లో నెలకొంది. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే పార్టీలు అభ్యర్థిత్వాలను పెండింగ్లో ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో గురువారం నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలవుతున్నా ప్రధాన రాజకీయ పార్టీల తరపున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. మొత్తం రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించనుండగా.. గురువారం నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలుకానుంది. శనివారం తుది గడువు ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహణ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగానే గురువారం నుంచి తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలు కానుండగా ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ అధికారిగా జిల్లాస్థాయి అధికారి, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరించనున్నారు. నామినేషన్నామినేషన్తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 11 వరకే తుది గడువు ఉంది. గురువారం నుంచే నామినేషన్లను అధికారులు స్వీకరించనుండగా ఆయా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు మంచిరోజు, ముహూర్తాలను బట్టి నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు గురువారమే బీసీ రిజర్వేష్లన్ల అంశంపై హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో శుక్ర, శనివారాల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది. -
జోగుళాంబ గద్వాల
వీడని సందిగ్ధం.. గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ ఈ నెల 11 వరకు తుది గడువు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 39 జెడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ -
నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ మేరకు ఈ నెల 9నుంచి 11వ తేదీ వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసినట్లు వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ తదితర అంశాలను తెలియజేశారు. వీసీలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారా యణ, నర్సింగ్రావు, డీపీఓ నాగేంద్రం, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్కుమార్రెడ్డి, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ
అయిజ: నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం ద్వారా రైతులకు వందశాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందకపోవడంపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఊరించి.. ఉసూరుమనిపించారు’ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. రైతులకు సత్వరమే వందశాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక వ్యవసాయశాఖ అధికారులు అయిజలోని రైతు సంఘం గోదాం వద్ద రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుమారు 400 మంది రైతులకు 60 కిలోల చొప్పున విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఓ జనార్దన్, రైతు ఉత్పత్తిదారుల సంఘం మండల అధ్యక్షుడు సుధాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే..
అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు సమష్టి కృషి అంకితభావంతో పనిచేయడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోలో 104 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. దసరా పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీ పట్ల ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్ ● -
ఆర్టీసీకి ‘పండుగే’!
దసరా నేపథ్యంలో మహబూబ్నగర్ రీజియన్కు రూ.33.64 కోట్ల ఆదాయం ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లిన వేలాది కుటుంబాలు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకొని తిరిగి వెళ్లిపోయారు.ఈక్రమంలో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక అదనపు సర్వీసులు నడిపింది. ఉత్తమ సర్వీసులతో ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు.. రూ.కోట్లలో ఆదాయం ఆర్జించింది మహబూబ్నగర్ రీజియన్. ఆక్యుపెన్సీ రేషియోలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. – స్టేషన్ మహబూబ్నగర్ దసరా పండుగ రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రూ.33కోట్ల 64లక్షల 90వేల ఆదాయం సమకూరింది. 53,07,651 కిలోమీటర్లు బస్సులు తిరగగా 63,19,755 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గతేడాది కంటే ఈ ఏడాది బస్సులు 8 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరిగి రూ.4 కోట్ల అధిక ఆదాయాన్ని పొందింది. ఆయా రోజుల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 104 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల రాఖీ పండుగ రోజుల్లో కూడా మహబూబ్నగర్ రీజియన్లో ఓఆర్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్రంలోనే మొదటిస్థానం పండుగ రోజుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక అదనపు సర్వీసులు 63 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన వైనం -
భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
గద్వాల: భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి అమలుతీరుపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అలివేలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తిపై దాడి దురదృష్టకరం అలంపూర్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం దురదృష్టకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు అన్నారు. అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బీఆర్ గవాయ్పై ఈ నెల 6వ తేదీన దాడి ప్రయత్నానికి నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఈ దాడిని న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాల్సి వస్తోందన్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. దాడి ప్రయత్నానికి నిరసనగా రెండు రోజులపాటు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ్మా, సీనియర్ న్యాయవాదులు నారయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఈదుర్ బాష, గజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
అలా.. అయితే ఇలా!
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయా?.. నిబంధనలకు విరుద్ధమంటూ రద్దు చేస్తారా?..ఒకవేళ రద్దు చేసిన పక్షంలో పాతవే కొనసాగుతాయా?.. అవే కొనసాగితే గత రిజర్వేషన్ల స్థానాలు మారుతాయా?.. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పరంగా అమలు చేస్తుందా?.. మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయి? ..ఇలా స్థానిక ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా.. ఆశావహులు ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగిపోయారు. ఎన్నికలకు కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన పక్షంలో అనుకూల రిజర్వేషన్లు వచ్చిన వారు పోరు సన్నాహాలు మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతుండగా.. అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వారు మారుతాయనే ఆశతో ఉన్నారు. ఏదేమైనా ఆయా వర్గాలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు పరిస్థితులకు అనుగుణంగా రెండు రకాల ప్రణాళికలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం హాట్టాపిక్గా మారింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్పార్టీల పరంగానైనా 40శాతం అవకాశం..మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ప్రధానంగా కారు, కాంగ్రెస్ మధ్యనే పోరు కొనసాగగా.. బీజేపీ అంతంత మాత్రంగానే ప్రభావం చూపించింది. అయితే ఈసారి మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని పార్టీలు బీసీ నినాదామే ఎజెండాగా ముందుకెళ్తున్న క్రమంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన పక్షంలో 42 శాతం బీసీలకు టికెట్లు దక్కనున్నాయి. లేనిపక్షంలో పార్టీల పరంగా అమలు చేస్తే వెనుకబడిన వర్గాలకు 40 శాతమైనా ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉన్నట్లు బీసీ మేధావులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలిచారని.. మొత్తంగా సర్పంచ్ ఎన్నికల్లో 38 శాతం, ఎంపీటీసీ ఎన్నికల్లో 43 శాతం వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారని ఉదహరిస్తున్నారు. అయితే ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు తగిన అవకాశం దక్కలేదని వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 71 జెడ్పీటీసీ స్థానాల్లో 20 బీసీలకు రిజర్వ్ కాగా.. మరో ఆరు జనరల్ స్థానాల్లోనూ గెలుపొందారని చెబుతున్నారు. ఈ లెక్కన 26 మంది బీసీలు జెడ్పీటీసీలుగా ఎన్నిక కాగా.. 42 శాతం రిజర్వేషన్లు అమలైతే 32 స్థానాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి
● గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వచ్చే వరిధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్హాలులో ధాన్యం సేకరణకు సంబంధించి నిర్వాహకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంటకు సంబంధించి నవంబర్ మొదటి వారం నుంచి రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈక్రమంలో ఈనెల 8వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 84 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తూకాలు, తేమను నిర్ధారించే యంత్రాలు, గన్నీబ్యాగుల కొరతలేకుండా చూడాలన్నారు. గత సీజన్లో కొన్ని చోట్ల గన్నీసంచుల కొరత ఇతర ఇబ్బందులు వలన చాలా మంది రైతులు 15రోజులకు పైగా తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చిన రైతులు వేచిఉన్నారని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాలలో ధాన్యం సేకరణ అనంతరం వెంటనే వాటిని మిల్లులకు తరలించేలా వాహనాలు, హమాలీ వంటివి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రప్రభుత్వం ఈసారి క్వింటాల్కు రూ.69లు పెంచిన నేపథ్యంలో సన్నరకానికి క్వింటాల్కు రూ.2389లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈసీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.97లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని, ఇందుకనుగుణంగా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, సివిల్సప్లై డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఆర్డీఏపీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన గద్వాల మున్సిపాలిటీలోని 14వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణ పనుల ఫొటోలు ఎప్పటికప్పుడు తీసి అందుకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జానకిరామ్, సిబ్బంది పాల్గొన్నారు. వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం రామాయణ గ్రంథాన్ని లోకానికి పరిచయం చేసిన గొప్ప మహనీయుడు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్కుమార్రెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
శిక్షకులు లేక.. క్రీడలు దూరం
గద్వాలటౌన్: క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నాం.. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నాం.. అంటూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అవి అమలుకాకపోవడంతో కళాశాలల విద్యార్థులు క్రీడా నైపుణ్యాలకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను దేశం గర్వించే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలంటే ప్రాథమిక స్థాయి నుంచే పునాది పడాలి. విద్యార్థులను ఆటగాళ్లుగా తీర్చిదిద్దే బాధ్యతను విద్యాసంస్థలు స్వీకరించాలి. పాఠశాల మొదలుకొని కళాశాల వరకు క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. కానీ, వాస్తవానికి వచ్చే సరికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో క్రీడా ప్రమాణాలు అడుగంటి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నా.. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మాత్రం వ్యాయామ అధ్యాపకుల నియామకాలపై దృష్టి సారించడం లేదు.ఒక్క వ్యాయామ అధ్యాపకుడూ లేడు..ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల నియామక ప్రక్రియ ఆగిపోవడంతో పీడీలు లేని కళాశాలల సంఖ్య రోజు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మల్దకల్, మానవపాడు, అలంపూర్, ధరూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మాత్రమే వ్యాయామ అధ్యాపకుల పోస్టులు మంజూరయ్యాయి. గతంలో ఆయా కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు ఉన్నా.. క్రమంగా బదిలీలు, ఉద్యోగ విరమణతో ప్రస్తుతం ఒక్కరూ కూడా లేరు. ప్రభుత్వం ఖాళీలను సైతం భర్తీ చేయలేదు. తరువాత క్రమంలో గద్వాలలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల, అయిజ, గట్టు ప్రభుత్వ కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు పోస్టులు మంజూరయ్యాయి. పోస్టులు మంజూరైనప్పటి నుంచి ఈ కళాశాలలో పీడీల నియామకం జరగలేదు. ప్రస్తుతం జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకుండానే బోధన జరుగుతోంది. ప్రతిసారి కళాశాల స్థాయిలో పోటీల నిర్వహణపై జరగుతున్న సమావేశాలలో మన జిల్లా తరపున ఒక్కరూ కూడా పాల్గొనడం లేదు. దీంతో జిల్లాలో నిర్వహించే కళాశాలల స్థాయి పోటీలు నిర్వహణ కలగా మారుతోందని, పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు.డిగ్రీ కళాశాలల్లోనూ అంతే..ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ వ్యాయామ అధ్యాపక ఖాళీలు కొన్నేళ్ల నుంచి భర్తీ కావడం లేదు. జిల్లాలో ప్రభుత్వ పీజీ కళాశాలతో పాటు 3 ప్రభుత్వ డిగ్రీ, కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎంఏఎల్డీ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో మాత్రమే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ పోస్టు మంజూరైంది. కానీ, పదేళ్లుగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. వందల సంఖ్యలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికి తర్ఫీదు ఇచ్చే పీడీ లేకుండా పోయారు. గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల, శాంతినగర్లోని ప్రభుత్వ డిగ్రీ కలశాలలో వ్యాయామ అధ్యాపకుల కొరత ఉంది. డిగ్రీ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులను నియమించి క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తప్పక వ్యాయామ అధ్యాపకులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. లేనిపక్షంలో కళాశాల ప్రారంభానికి అనుమతి ఇవ్వొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినప్పటికి ప్రైవేటు కళాశాలల వారు వ్యాయామ అధ్యాపకులను నియమించలేదు.మరుగున పడుతున్న నైపుణ్యంక్రీడల ప్రోత్సాహానికి పాఠశాల స్థాయిలోనే పునాది పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులను తరుచూ భర్తీ చేస్తున్నా రు. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోంది. ఏటా రాష్ట్ర, జాతీయ స్థాయలో క్రీడోత్సవాలను నిర్వహిస్తుండటంతో చాలామంది క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. అండర్–14, అండర్–17 విభాగంలో ఏటా పాఠశాలల్లో క్రీడలు జరుగుతాయి. మన జిల్లా నుంచి యేటా ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఈ విద్యార్థులు అండర్–19 వి భాగంలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నా, వారికి శిక్షణ ఇవ్వడానికి వ్యాయా మ అధ్యాపకులు లేరు. దీంతో పాఠశాల స్థాయి పోటీలతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలల నుంచి జూనియర్ కళాశాలల్లో చేరిన వారికి అక్కడ శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో నిరాశే ఎదురవుతోంది. -
ప్రారంభం ఘనం.. సేవలు శూన్యం
రూ.17 కోట్లతో జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ● రెండేళ్లు కావస్తున్నా అందుబాటులోకి రాని వైనం ● షాపులకు డిపాజిట్లు సరిగ్గా లేకపోవడంతో ఆగిన ప్రక్రియ అందుబాటులోకి ఎప్పుడో? నిర్మాణం పూర్తి అయి, ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ ఈమార్కెట్ దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అప్పటి అడిషనల్ కలెక్టర్ అధికారులతో కలిసి మార్కెట్ను సందర్శించారు. అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు కూరగాయల, ఫ్రూట్ ,మటన్, చికెన్, ఫిష్ వ్యాపారుల అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. మార్కెట్లో ఉన్న సౌకర్యాలను చూపించారు. వ్యాపారులు, వీధి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. తరువాత షాపులకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేశారు. అయితే షాపుల కేటాయింపులో అవలంభించిన రిజర్వేషన్లు, అదేవిధంగా షాపులకు సంబంధించి వచ్చిన డిపాజిట్లు కూడా అనుకున్నంతమేర రాలేదు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి తీసుకరావడానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కూరగాయలు, నిత్యవసర సరుకులు, మటన్, ఫిష్, చికెన్ ఇలా అన్ని ఒకే చోట వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ మార్కెట్ అందుబాటులోకి వస్తేనే సాధ్యపడతాయి. ఇప్పటికై నా అధికారులు త్వరతితగిన నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి రూ.కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాల్సి ఆవశ్యకత ఉంది. గద్వాల: రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా.. నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లా కేంద్రం గద్వాల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ (సమీకృత) మార్కెట్ ఇక్కడి ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. ఈమార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యవసాయ మార్కెట్యార్డు ఖాళీ స్థలంలో 2.30 ఎకరాల్లో అధునాతనంగా దాదాపు రూ.17 కోట్లతో మార్కెట్ నిర్మించారు కానీ, అందుబాటులోకి తీసుకరావడంలో ఇక్కడి అధికారులు విఫలమవుతున్నారు. అన్ని ఒకేచోట గద్వాల పట్టణం జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల కోసం చాలా మంది పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. పట్టణం నలువైపులా విస్తరిస్తోంది. ఈక్రమంలో ప్రజలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై పాలకులు, అధికారులు దృష్టి సారించారు. పట్టణంలో ఉన్న మటన్, ఫిష్ మార్కెట్లు చిన్నవిగా ఉన్నాయి. కూరగాయల మార్కెట్ పెద్దదిగా ఉన్న అది కూడా ఒక్కటే ఉన్నది. అన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మార్కెట్యార్డు ఆవరణలో 2.30 ఎకరాల స్థలంలో స్టేట్ డెవలెప్మెంట్ ఫండ్ దాదాపు రూ.17 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు. 2021 సెప్టెంబర్ 14న శంకుస్థాపన అయిన మార్కెట్ను గడిచిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ప్రారంభించారు. -
సుప్రీంకోర్టు సీజేఐపై దాడి హేయమైన చర్య
గద్వాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై సోమవారం కోర్టుహాలులో జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రజాసంఘాలు, దళిత, ఉపాధ్యాయ, బహుజన సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కేసు విచారణలో జరుగుతున్న వాదనల క్రమంలో ఓ మతాన్ని వంటపట్టించుకున్న ఓ మతోన్మాది అయిన న్యాయవాది దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం క్షమించరానిదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, హనుమంతు, ప్రభాకర్, నాగర్దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. దాడి చేసిన వారిని శిక్షించాలి సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్పై సోమవారం కోర్టుహాలులో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, దాడిచేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, దేశఅత్యున్నత ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేదంటే అణగారిన వర్గాలపై వివక్ష, దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయో అర్థమవుతుందన్నారు. బీజేపీ పాలిత పాలిత రాష్ట్రాలలో మతోన్మాదులు దళితులపై అనేక రకాలుగా అఘాయిత్యాలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్రం స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తిని న్యాయవాద వృత్తి నుంచి శాశ్వతంగా తొలగించాలన్నారు. -
తప్పుల తడక..
● మృతిచెందిన, ఉద్యోగ విరమణ చేసిన వారికి డ్యూటీలు ● ఎన్నికల విధుల్లో బయటపడిన అధికార యంత్రాంగ డొల్లతనం గద్వాలటౌన్: ఎన్నికల నిర్వహణకు ముందే అధికార యంత్రాంగం డొల్లతనం బయటపడుతోంది. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ తయారు చేసిన జాబితాలు తప్పుల తడకగా మారాయి. చనిపోయిన వారికి, ఉద్యోగ విరమణ పొందిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి, నెల రోజుల వ్యవధిలో పదవీ విరమణ పొందుతున్న వారికి చోటు కల్పించారు. ఇలా ఇష్టారాజ్యంగా, నిర్లక్ష్యంగా జాబితాలు రూపొందంచడంపై విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఆర్ఓలు, పీఆర్ఓలుగా ఉపాధ్యాయులను నియమించిన అధికారులు వారికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు హాజరు కావాలని జాబితా విడుదల చేశారు. సోమవారం ప్రిసైడింగ్ అధికారులకు ఆయా మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణకు హాజరైన క్రమంలో ఉపాధ్యాయులు జాబితాలో ఉన్న తప్పులను గుర్తించారు. జాబితాలో తప్పులు దొర్లడం, సీనియర్లకు బదులు జూనియర్లకు పైస్థాయి హోదా కలిగిన బాధ్యతలు అప్పగించడం మరింత చర్చనీయాంశంగా మారుతోంది. జాబితాలో దొర్లిన తప్పులపై పలువురు ఉపాధ్యాయులు ఎంపీడీఓలతో వాదనకు దిగడంతో సరిచేస్తామని హామీఇచ్చారు. మచ్చుకు కొన్ని... ● కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న హుస్సేని రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు కేటీదొడ్డి మండలంలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఉత్తర్వులు జారీ కావడంపై ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● గద్వాల మండలం గోనుపాడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం శేషయ్య గత నెల పదవీ విరమణ పొందారు. ఆయనకు పీఓగా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా పదవీ విరమణ చెందిన మరికొందరికి ఎన్నికల విధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● కేటీదొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అలాగే, గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల జీహెచ్ఎం వెంకటనర్సయ్య డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆరు నెలల లోపు పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయినా వారికి ఎన్నికల విధులు కేటాయించారు. జిల్లాలో చాలా చోట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎంకు పీఓగా నియమిస్తే.. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఆయన కంటే పైస్థాయి ఆర్ఓ బాధ్యతలు అప్పగించారు. ఇలా జాబితాలో చోటు చేసుకున్న తప్పులపై ఉపాధ్యాయులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. తప్పులను సరిదిద్దే పనిలో ఎంపీడీఓలు ఉన్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించారు!
● వేరుశనగ విత్తనాలు ఉచితంగా ఇస్తామని హామీ ● జిల్లాలో ప్రారంభంకాని సబ్సిడీ విత్తనాల పంపిణీ ● సాంకేతిక సమస్యలతో అడ్డంకులు ● సాగుకు ఆలస్యం అవుతుందని రైతుల ఆందోళన అయిజ: దేశ వ్యాప్తంగా ‘నేషనల్ మిషన్ ఎన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్ఎంఈఓ– ఓఎస్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో వేరుశనగ విత్తనాలపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లాలోని అయిజ, ఇటిక్యాల, గట్టు మండలాల రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీఓ), వ్యవసాయ అధికారులు కలిసి ఉచితంగా వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తామని ప్రకటించినా సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఏఈఓలకు శిక్షణ ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. సాగుకు ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎదురుచూపులు.. అయిజలో సెప్టెంబర్ 27న ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా వేరుశనుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. సెప్టెంబర్ 30న రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 29న రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఎఫ్పీఓ) కార్యాలయం వద్ద టోకెన్లు తీసుకునేందుకు రైతులు వెళ్లగా ఇవ్వలేదు. సెప్టెంబర్ 30న టోకెన్లు, విత్తనాలు ఒకేసారి ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆ మరుసటి రోజు ఎఫ్పీఓ కార్యాలయంవద్ద టోకెన్లు రాయించుకొని, రైతు వేదిక భవనం వద్దకు వెళ్లారు. అయితే ఏఈఓలకు యాప్ డౌన్లోడ్ కావడం లేదని, ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వలేదని తెలిపారు. వారంరోజుల అనంతరం విత్తనాలు ఇస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందారు. ఇటీవల సరైన వర్షాలు కురిసాయని, ఆలస్యం అయితే పదును ఆరిపోతుందని, పొలంలో గడ్డి మెలుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన వేరుశనగ విత్తనాల వివరాలిలా.. మండలం రకం క్వింటాళ్లు అయిజ జీజేజీ–32 587.20 ’’ ’’ గిరినార్ – 5 150 ఇటిక్యాల జీజేజీ –32 582 ’’ ’’ గిరినార్ – 5 150 గట్టు జీజేజీ – 32 587 ’’ ’’ గిరినార్ – 5 150 సాంకేతిక సమస్యలతోనే.. విత్తనాలు ఇవ్వలేకపోవడానికి సాంకేతిక కారణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏఈఓల ఫోన్లలో యాప్లు డౌన్లోడ్ కావడంలేదు. శిక్షణ ఇవ్వనిదే ఏఈఓలు ప్రక్రియను పూర్తి చేయలేమంటున్నారు. పూర్తి స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకొని విత్తనాలు పంపిణీ చేస్తాం. – జనార్ధన్, ఏఓ త్వరలో పంపిణీ చేస్తాం జిల్లాలోని మూడు మండలాల్లో రైతులకు ఉచితంగా వేరుశనుగ విత్తనాల పంపిణీ చేయాల్సి ఉంది. త్వరగా పంపిణీ చేయాలని ఏఓలకు ఇంతవరకే సూచించాను. పంపిణీ చేయలేదనే విషయం నాకు తెలియదు. త్వరగా పంపిణీ చేసేలా ఆదేశిస్తా. – సక్రియానాయక్, డీఏఓ -
అధునాతన హంగులతో..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అధునాతనంగా నిర్మించారు. విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు బ్లాక్ వైస్గా వెజ్, నాన్వెజ్, సూపర్మార్కెట్, కమర్షియల్ దుకాణాలను వేరువేరుగా నిర్మాణం చేశారు. అడ్మిన్ కార్యాలయం సైతం ఏర్పాటు చేశారు. వెజ్ బ్లాక్లోని దుకాణాల్లో కూరగాయల గంపలు పెట్టడానికి స్టెప్ వైజ్గా కట్టారు. ఇక నాన్వెజ్కు సంబందించి మటన్, ఫిష్, చికెన్ దుకాణాల్లో ప్రతి దుకాణంలో నాన్వెజ్ను శుభ్రం చేసేందుకు నీటి సౌకర్యంతో సింక్ను, తగిలించేందుకు ప్రత్యేకంగా స్టీల్ రాడ్లను ఏర్పాటు చేశారు. నాన్వెజ్ బ్లాక్లో దుకాణాలు -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
గద్వాల క్రైం: ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా నుంచి వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.5,009 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 238 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5009, కనిష్టం రూ. 2729, సరాసరి రూ. 4809 ధరలు లభించాయి. అలాగే, 377 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5802, కనిష్టం రూ. 5661, సరాసరి రూ. 5720 ధరలు పలికాయి. టన్ను చెరుకుకు రూ.6 వేల ధర ఇవ్వాలి అమరచింత: కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7వేల మద్దతు ధర ఇచ్చినట్లుగానే టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర ప్రకటించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ సంవత్సరం చెరుకు రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ ఇస్తున్న సబ్సిడీలను వచ్చే ఏడాది కూడా వర్తింపచేయాలని కోరారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతులతో కలిసి ఫ్యాక్టరీ జీఎం వీపీ రామరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం వినతి మేరకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు పంటలపై సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను 2026–2027 సీజన్లో కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేల మద్దతు ధరను ఇవ్వాలన్నారు. చెరుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను ముందస్తుగా రప్పించి, పంట కోతలు పూర్తి చేసి వెంటనే డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, సబ్సిడీలను వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ జీఎం హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
అలంపూర్: పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలోని ఆయా వార్డులో చెత్తను తొలగించే పనులను మున్సిపల్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆయా వార్డుల్లో ఉన్న చెత్తాచెదారం తొలగించే పనులు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నివాస గృహాలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని సూచించారు. అయితే మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో చెత్త తరలించే బండ్లు రావడం లేదని, ఒకవేళ వచ్చినా ఉదయం అందరూ పనులకు వెళ్లిన తర్వాత వస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
ఇప్పటికే ఆలస్యమైంది..
విత్తనాలు విత్తేందుకు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. సబ్సిడీపై విత్తనాలు ఇస్తారనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే అధికారులు కాలయాపన చేస్తున్నారు. వెంటనే విత్తనాలు ఇస్తే విత్తుకుంటాం. – గోవిందు, రైతు, రాజాపురం పదును పోతుంది ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంట సాగు కోసం పొలాన్ని సిద్ధం చేసుకున్నాం. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా విత్తనాలు ఇవ్వలేదు. వెంటనే విత్తనాలు పంపిణీ చేయాలి. – కాశిమన్న, రైతు, ఎక్లాస్పురం ● -
అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం
అలంపూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. అలంపూర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కై వలం చేసుకుంటుందన్నారు. బీజేపీ నుంచి పోటీదారులు అధికంగా ఉన్నారని, ఒక్కో స్థానానికి కనీసం ఐదుగురు పోటీదారులు ఉండటం సంతోషమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని, వారి పథకాలను చూసి ప్రస్తుతం ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కుటుంబ అవినీతి తప్ప ప్రజలకు మేలు చేయలేదన్నారు. అందుకే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులకే ఓటు వేస్తారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు కావాల్సిన వస్తు సేవలు దసరా కానుకగా పూర్తిగా తగ్గించిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చినవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగమల్లయ్య, నాగేశ్వర్ రెడ్డి, రాజగోపాల్, వినీత్ కుమార్, రంగస్వామి, సుధాకర్, రవికుమార్, లక్ష్మన్ నాయుడు, సాయిబాబ, దానారెడ్డి, రాఘవేంద్ర, జగన్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతధికారుల సూచనలను ప్రజలు గుర్తించాలి. సులువుగా డబ్బు లు వస్తున్నాయంటేనే మోసం చేయడానికి అవతలి వారు వేస్తున్న వల అని నమ్మాలి. ఇప్పటి వరకు నమోదైన సైబర్ కేసుల విషయంలో విచారణ జరుగుతుంది. సైబర్ మోసాలపై ప్రజలకు అవగహన సదస్సులు నిర్వహించి వారిని చైతన్యం దిశగా తీసుకువస్తున్నాం. అనధికారిక యాప్లు, ప్లాట్ఫాంలలో పెట్టుబడి పెట్టొద్దు. టెలిగ్రామ్, వాట్సాప్ ఇతర సామాజిక మాద్యమాల్లో వచ్చే సందేశాలు లేదా లింక్లను ఓపెన్ చేయరాదు. – శ్రీనివాసరావు, ఎస్పీ -
పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలు
వనపర్తి రూరల్: కమ్యూనిస్టు ఉద్యమాలను నిర్మించడంలో, వాటిని కొనసాగించడంలో, భావితరాలకు ఉద్యమాల బాట వేయడంలో పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలుగా తయారయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాలలో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అధ్యక్షతన పుట్టా వరలక్ష్మి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పలువురు రాష్ట్ర ,కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ వరలక్ష్మి విద్యార్థి దశ నుంచే ఉద్యమ బాటపట్టి విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న పుట్టా ఆంజనేయులుకు తోడునీడగా ఉండేందుకు నిర్ణయించుకొని జీవిత సహచరి కావడం గొప్ప విషయమన్నారు. వందలాది మంది మహిళలు లక్ష్మీదేవమ్మ, వరలక్ష్మిలుగా తయారు కావాలని ఆకాంక్షించారు. -
సేవా దృక్పథం అలవర్చుకోవాలి
గద్వాలటౌన్ : విద్యార్థులకు చదువుతో పాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరన్న పేర్కొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1, 2 ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని గుంటిపల్లి, కొత్తపల్లి గ్రామాలలో స్పెషల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండే సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలను పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలపై చైతన్యం కలిగించాలన్నారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు పవన్కుమార్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.యువతి మృతికి కారకుడిని అరెస్టు చేయాలిగద్వాల: ప్రేమపేరుతో మోసం చేసి యువతి మృతికి కారకులైన చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్గౌడ్ను వెంటనే అరెస్టు చేయాలని దళిత, ప్రజాల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్మృతివనంలో విలేకరులతో మాట్లాడారు. గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్గౌడ్, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంకను ప్రేమిస్తున్నా అని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరువాత మోసం చేశాడని, దీనిపై గతంలోనే ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఈమేరకు చీటింగ్ కేసు నమోదు కాగా రఘునాథ్గౌడ్ జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రియాంక రఘునాథ్గౌడ్ ఇంట్లోనే నివసిస్తుందన్నారు. ఇదిలా ఉండగా పెళ్లికి నిరాకరిచండంతో రెండు రోజుల కిందట పురుగు మందు తాగి ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. ఈకేసులో నిందితుడిని గతంలోనే కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంక ఆత్మహత్య చేసుకుని ఉండేది కాదన్నారు. ఇప్పటికై న పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, రాజు, సునందం, ప్రవీణ్, వేమన్న సాదతుల్లా పాల్గొన్నారు.కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిరాజోళి: కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే హవా అని బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాజోళిలో మండల అధ్యక్షుడు శశికుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెజార్టీ స్థానాల్లో బీజేపి గెలుపు తథ్యమని, మిగతా రెండు పార్టీలు కలిసినా బీజేపి మెజార్టీకి దరిదాపులకు రాలేవని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కారు చేత కాని పాలనలో ప్రజలు, గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలకు చరమ గీతం పాడిన ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే దైర్యం కూడా చేయలేదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలలను మోసం చేసిన గత పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని, వీటిని ప్రజలకు వివరించాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ రెడ్డి,నర్సింహులు,ఈసీ అంజనేయులు,రాజేష్, కొంకతి రాము,దస్తగిరి, బీమన్న,మధు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టంమదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. అలాగే జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 757 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. -
మరో కొత్త రహదారి
అచ్చంపేట: హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ గ్రీన్ఫీల్డ్ రహదారితోపాటు శ్రీశైలం జాతీయ రహదారిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్– శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత నెల 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ నుంచి ఆమనగల్, కొట్ర, డిండి, హాజీపూర్ (బ్రాహ్మణపల్లి) వరకు నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు సర్వే నిర్వహించి.. హద్దులు కూడా నిర్ణయించారు. ఈ రహదారి విస్తరణకు మూడేళ్ల క్రితమే కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ నిధులు మాత్రం మంజూరు కాలేదు. ఇప్పుడు కొత్త గ్రీన్ ఫీల్డ్ రహదారితో ఇబ్బందులు తొలగనున్నాయి. ఆకుతోటపల్లి– మన్ననూర్.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఫ్యూచర్ (ఫోర్త్) సిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రెండు జాతీయ రహదారుల మధ్య నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఎంతో కీలకం కానుంది. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు.. అక్కడి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ఆమనగల్ (ఆకుతోటపల్లి) వరకు ప్రతిపాదించిన 330 అడుగుల రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు రూ.1,665 కోట్లతో చేపట్టనున్న 19.20 కి.మీ., రోడ్డును రిత్విక్ సంస్థ, రెండో దశలో మీర్ఖాన్పేట్ నుంచి ఆమనగల్ వరకు చేపట్టనున్న 22.3 కి.మీ. రోడ్డును ఎల్అండ్టీ సంస్థ రూ.2,365 కోట్లకు దక్కించుకున్నాయి. భూ సేకరణ, టెండర్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఇటు నుంచి మన్ననూర్ వరకు కొత్త రోడ్డును విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి), ఆర్ఆర్ఆర్ గ్రీన్ఫీల్డ్ రహదారి నుంచి అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి (మన్ననూర్) వరకు కొత్త రోడ్డు ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్ను సంబంధిత అధికారులు సిద్ధం చేస్తున్నారు. జూపల్లి– చారకొండ మధ్య నుంచి భైరాపూర్, డిండి తూర్పుభాగం మీదుగా గువ్వలోనిపల్లి, రాయిచేడ్, బుడ్డతండా, బ్రాహ్మణపల్లి వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ సుమారు 50 కి.మీ., దూరం అవుతుంది. ప్రతిపాదిత రోడ్డు ఏర్పాటైతే హైదరాబాద్– శ్రీశైలం మధ్య 40 కి.మీ., దూరం తగ్గడంతోపాటు రెండు గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్, కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్, నంద్యాల వరకు తిరుపతి మార్గంగా, రావిర్యాల నుంచి మన్ననూర్ వరకు శ్రీశైలం రహదారులు వేరు కానున్నాయి. కొత్త రహదారితో ట్రాఫిక్ సమస్య తీరనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్కు సుముఖత.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. రూ.7,700 కోట్ల అంచనాలతో చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో ఏపీలోని కృష్ణపట్నం రేవుతోపాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరు, తిరుపతికి రాకపోకలు సులువు అవుతాయి. ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొందించగా.. 62.5 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్లో 56.2 కి.మీ., అటవీ మార్గం, 6.3 కి.మీ., అటవీయేతర ప్రాంతం. స్వల్ప మార్పులతో ఎన్హెచ్ఏఐ అధికారులు మన్ననూర్, వటువర్లపల్లి వద్ద ఎక్కి, దిగేందుకు ర్యాంపుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు వరకు నాలుగు వరుసలతో 30 అడుగల ఎత్తులో ఈ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈగలపెంట (కృష్ణగిరి)– సున్నిపెంట మధ్య ఉన్న డ్యాంపై ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీంతో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య గంట ప్రయాణ సమయం, 9 కి.మీ.. దూరం తగ్గే అవకాశం ఉంది. అయితే కేంద్ర అటవీశాఖ అనుమతుల కోసం ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి మన్ననూర్ వరకు అనుసంధానం రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు ప్రతిపాదనలు మన్ననూర్– శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో 40 కి.మీ., తగ్గనున్న దూరం -
న్యాయఫలాలు అందరికీ అందాలి
● వనపర్తిలో రూ.81 కోట్లతో న్యాయస్థానాల సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన ● వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్కుమార్సింగ్ వనపర్తి టౌన్: న్యాయసేవలు సామాన్యుల దరి చేరేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్సింగ్ అన్నారు. ఆదివారం వనపర్తిలోని వైద్యకళాశాల సమీపంలో రూ.81 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో కోర్టు సముదాయం నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి, జస్టిస్ అనిల్ జూకంటి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయవాదులు కక్షిదారులకు న్యాయ ఫలాలు చేరువ చేసేందుకు తగిన చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై బలమైన విశ్వాసం ఉందని.. దానిని పదిలపర్చడంలో న్యాయవాదులు ముందుండాలన్నారు. మెరుగైన వసతులతో కూడిన న్యాయస్థానాల ద్వారా అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ అనిల్కుమార్ జూకంటిి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడానికి మౌలిక వసతుల ఏర్పాటు అవసరమన్నారు. జస్టిస్ మాధవి మాట్లాడుతూ తాను ఉమ్మడి పాలమూరు జిల్లా ఆడబిడ్డనే అని చెబుతూ, వనపర్తిలో సంస్థానాధీశుల కాలం నుంచే న్యాయస్థానాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలు అందించే వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. అంతకు ముందు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు ఆర్అండ్బీ అతిథిగృహంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ పూలమొక్కలు అందజేసి సాధారంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి, తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున, వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీపీ కిరణ్కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఆకుతోటపల్లి వరకు ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆకుతోటపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం జరిగితే హైదరాబాద్– శ్రీశైలం మధ్య సుమారు 40 కి.మీ., దూరం తగ్గుతుంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
ఆరుగాలం ఆశలు.. నీటిపాలు
నదికి నీరు వచ్చిందని విస్తారంగా పంటల సాగు ● అధిక వర్షాలు, ముంచెత్తిన వాగులతో నీట మునిగిన పంటలు ● పత్తి, కంది పంటలకు భారీ నష్టం పత్తి పంట మొత్తం పోయింది వాగుల్లో నీటరు రావడంతో ఆదిలోనే మంచి జరుగుతుందని ఆశించి పత్తి పంటను సాగు చేశాం. కానీ తర్వాత వచ్చిన వర్షాలు, వాగు ల్లో వచ్చిన అధిక ప్రవాహం కారణంగా సాగు చేసిన పంటలు మొత్తం నీట మునిగాయి. దీంతో పంట ఏ మాత్రం చేతికి రాకుండా పోయింది. పత్తి కాయలు పూర్తిగా మాడిపో యి, ఎందుకు పనికి రాకుండా పోయాయి.ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. – పురుషోత్తం, రైతు, ముండ్లదిన్నె ఆశలన్నీ జలమయం వాగులో ఉన్న నీటితోనే ప్రతి ఏడాది సుభిక్షమైన పంటలను పండించుకునే వాళ్లం. ఈ ఏడాది కూడా అలాగే సాగు చేద్దామని విత్తనాలు వేశాం. ఆరంభంలో బాగానే ఉన్నప్పటికీ నదులకు అధిక వరద రావడం, ఆ నీరు వాగులకు చేరడం, కుండపోత వర్షాలు కారణంగా పంటలు కనీసం కాపాడుకునే స్థితిలో కూడా లేకుండా పోయాయి. పత్తి, కంది పంటలు చాలా దెబ్బతిన్నాయి. రైతులు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. – ఉప్పరి మహేష్, ముండ్లదిన్నె, రాజోళి మండలం రాజోళి: కోటి ఆశలతో వాగుల కింద సేద్యం చేసిన రైతులకు సాగు సమయం పూర్తికాక ముందే నష్టం వాటిల్లింది. నీరు పుష్కలంగా వచ్చి పంటలకు ప్రాణం పోస్తుందనుకుంటే, నారు పెంచాల్సిన నీరు ఉసురు తీసిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి ఏడాది రైతులు వాగుల కింద వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆరంభంలో ఆశలకు జీవం పోసేలా వచ్చిన వాగులను నమ్ముకుని పంటలు సాగు చేస్తే, అధికంగా కురిసిన వర్షాలు, ముంచెత్తిన వాగులు, వంకలతో పంటలు రోజుల తరబడి నీటిలో మునిగిపోయి కోలుకోని నష్టాన్ని మిగిల్చాయి. వాగుల కింద జోరుగా సాగు అలంపూర్ నియోజకవర్గంలో వాగుల పరిదిలో వానాకాలం సీజన్ ప్రారంభంలో వేల ఎకరాల్లో సాగును మొదలు పెట్టారు. రైతులు ఎక్కువగా పత్తి, కంది,వరి, అక్కడక్కడా మిరప పంటలు సాగు చేయగా.. సింహభాగం పత్తి పంటను సాగు చేశారు. సీజన్ ఆరంభంలో అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తనాలు వేసినప్పటికీ, అనంతరం ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి తుంగభద్ర, కృష్ణా నదులకు వచ్చిన వరద నీటితో వాగులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సాగు జోరు మరింతగా పెరిగింది. కానీ ఒక్కసారిగా కురిసిన అధిక వర్షాలతో వాగుల్లో కూడా ప్రవాహం పెరిగి, వాగుల పరిదిలో ఉన్న పంటలు నీట ముగినిపోయాయి. దీనికి తోడు రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఆ పంటలు మరింత దెబ్బతిన్నాయి. సాధారణ ప్రదేశాల్లో సాగు అవుతున్న పంటలకు కేవలం వర్షాభావ పరిస్థితులే ఇబ్బందిగా మారగా..వాగుల కింద సాగవుతున్న పంటలకు వర్షాలతో పాటు, వాగుల నుండి వచ్చిన వరద నీరు కూడా ప్రభావం చూపింది. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున పరిహారం అందిస్తే రానున్న సీజన్లోనైనా సాగును చేసుకుని నష్టాన్ని పూడ్చుకుంటామని రైతులు అంటున్నారు. ఆగం చేసిన వాగులు రాజోళి, మాన్దొడ్డి, ముండ్లదిన్నె వాగులతో పాటు, మానవపాడు మండలంలోని కలుకుంట్ల,ఉండవెళ్లి మండలం బొంకూరు గ్రా వాగు శివారులోని ఆయా గ్రామాల పరిదిలో ప్రవహించే లింకు వాగులు, వంకల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో ఎన్నో ఆశలతో సాగు మొదలుపెట్టిన రైతులను అధికంగా ప్రవహించిన వాగులు ఆగం చేశాయి. -
బీసీ జోష్..!
42 శాతం రిజర్వేషన్లతో వెనుకబడిన వర్గాల్లో ఉత్సాహం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఆ వర్గంలో జోష్ నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే 20 శాతం మేర ప్రాతినిధ్యం పెరగనుండడంతో వారిలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2019 స్థానిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 22 శాతం రిజర్వేషన్ కల్పించగా.. ఆ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటడంతోపాటు జనరల్ స్థానాల్లోనూ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల పెంపుతో రాజకీయ పార్టీల్లో కుల సంఘాలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. జనరల్ స్థానాల్లోనూ హవా.. గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 1,690 సర్పంచ్ స్థానాలు ఉండగా.. 406 బీసీ రిజర్వ్ అయ్యాయి. వీటితోపాటు మరో 238 జనరల్ స్థానాల్లోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు విజయం సాధించారు. అంటే మొత్తంగా 644 మంది బీసీలు సర్పంచ్లుగా గెలుపొందారు. ● 2019 స్థానిక ఎన్నికల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 788 ఎంపీటీసీ స్థానాలు కాగా.. ఇందులో 217 స్థానాలను బీసీలకు కేటాయించారు. వీటితోపాటు మరో 125 జనరల్ స్థానాల్లోనూ బీసీలు సత్తా చాటారు. మొత్తంగా 342 మంది బీసీలు ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. ● గత ఎన్నికల్లో మొత్తం 71 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ అయ్యాయి. వీటితోపాటు మరో ఆరు జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలుపొందారు. మొత్తంగా 26 మంది బీసీ నాయకులు జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే.. 2019 స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన బీసీలు, ప్రస్తుత ఎన్నికల్లో ఆ వర్గానికి రిజర్వేషన్లను పరిశీలిస్తే సర్పంచ్, ఎంపీటీసీల మధ్య పెద్దగా తేడా లేదు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 644 మంది బీసీలు సర్పంచ్లుగా ఎన్నిక కాగా.. ప్రస్తుత ఎన్ని కల్లో 621 స్థానాలు మాత్రమే ఆ వర్గానికి రిజర్వ్ అయ్యాయి. గత ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 342 మంది బీసీలు విజయం సాధించగా.. ఈసారి ఆ వర్గానికి 341 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం రిజర్వేషన్లు బీసీలకు కలిసివచ్చాయి. గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వాటితోపాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన బీసీల లెక్క (మొత్తం 26 స్థానాలు)తో పోలిస్తే.. ఈసారి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం మరో ఏడు స్థానాల్లోనూ ఆ వర్గాల ప్రాతినిధ్యం పెరగనుంది. మొత్తంగా గత జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 20 స్థానాలు రిజర్వ్ కాగా.. ఈసారి 33 స్థానాలను కేటాయించారు. ఈ లెక్కన 13 స్థానాలు పెరిగాయి. కుల సంఘాలకు బాధ్యతలు.. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందనే అంశంపై ఉత్కంఠతోపాటు సందిగ్ధం నెలకొన్నా.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉండడం.. తగ్గిన అన్ రిజర్వ్డ్ (జనరల్) స్థానాల్లో అభ్యర్థిత్వాల కోసం ఆయా వర్గాలకు చెందిన వారు పోటీ పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామాలు, మండలాల వారీగా ఆశావహులు ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కుల సంఘాలకు ప్రాధాన్యం పెరిగినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం పార్టీదే అయినప్పటికీ.. రిజర్వేషన్లకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో గెలుపొందే అభ్యర్థుల వడపోత బాధ్యతలను పలు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు తమకు అనుకూలంగా ఉన్న కుల సంఘాల నాయకులకు అప్పగించినట్లు సమాచారం. గత స్థానిక ఎన్నికలతో పోలిస్తే 20 శాతం అధికం 2019లో జనరల్ స్థానాల్లోనూ వారిదే హవా జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఆశాజనకం రాజకీయ పార్టీల్లో కుల సంఘాలకు పెరిగిన ప్రాధాన్యం -
కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యం
● స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కీలకంగా వ్యవహరించాలి ● ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్ణికారెడ్డి, రాజేశ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు. -
విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
గద్వాల: విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన మాక్ ఎక్సర్సైజులను నిర్వహించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం, టేబుల్టాప్ వ్యాయమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన అలంపూర్లోని తుంగభద్రనది వద్ద ఉదయం 10గంటల నుంచి 1గంట వరకు ప్రధాన మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నాకె. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ దామోదర్సింగ్,అసిస్టెంట్ కమాండెంట్ ఫాణి, పదవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ -
భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు, వాల్మీకి పూజారులు తిమ్మప్ప, నర్సింహులు, ఆలయ సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి పాల్గొన్నారు. -
దుర్గామాత నిమజ్జనోత్సవం
లోకాలను కాపాడే లోకపావనీ.. నీకు వీడ్కోలు అంటూ దుర్గామాతాను కొలిచారు. దేవీ శరన్నవరాత్రుల్లో విశేష పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనోత్సవం జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి కనులపండువగా. స్థానిక బాలాజీ వీధిలో ఆరెకటిక సంఘం, రాంనగర్ రామాలయం, తెలుగుపేట శివాలయం, ఆర్యవైశ్య సంఘం, శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాతల విగ్రహాలను రాత్రి ఊరేగించారు. ఈ సందర్భంగా డప్పుమేళాలతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని తరలించారు. ఆయా ఆలయాల నిర్వాహకులు చేపట్టిన అమ్మవారి శోభయాత్రలో వాయిద్యకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతిమల రథాలకు మహిళలు ఎదురుగా వచ్చి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అమ్మవారి నిమజ్జనోత్సవం ప్రతిమ ముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అనంతరం కృష్ణానదిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. నవధాన్యాల మొలకల నిమజ్జనం గట్టు: విజయ దశమి వేడుకల్లో భాగంగా గట్టులోని భవాని ఆలయం పక్కనే ఉన్న శేషంబావిలో నవధాన్యాల మొలకలను నిమజ్జనం చేశారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా గట్టులోని ఎప్ఎస్కే సమాజ్ తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో నవ ధాన్యాల మొలకలను పెంచి, విజయ దశమి పండుగ రోజున గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. భవాని ఆలయం పక్కనే ఉన్న పూరాతన కాలం నాటి శేషంబావిలొ నవధాన్యాల మొలకలను నిమజ్జనం చేశారు. -
గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శం
గద్వాలటౌన్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత గాంధీజీకి మాత్రమే సాధ్యమైందని.. సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలు, విలువలను నిబద్ధతతో ఆచరించడంతో గాంధీజీ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం గద్వాలలో ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్లోని గాంధీజీ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, పలు సంఘాల నాయకులు వేరువేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన నాయకులు వేర్వేరుగా గాంధీ జయంతిని నిర్వహించారు. స్థానిక చింతలపేటలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో సాంఘిక, ఆర్థిక విషయాలను జోడించి పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. సరిత వర్గానికి చెందిన పలువురు నాయకులు సైతం గాంఽధీచౌక్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంఽధీ చౌరస్తాలో ఉన్న గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, హనుమంతునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బీజేపీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. ● గద్వాల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఆవోపా నేతలు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ సేవలు కొనియాడారు. వీరితో పాటు పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
ప్రముఖుల ప్రత్యేక పూజలు
దసరా వేడుకలలో గద్వాల సంస్థానాధీశుల వారసుడు కృష్ణరాంభూపాల్, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ నాయకులు వేర్వేరుగా పాల్గొన్నారు. గురువారం రాత్రి స్థానిక గుంటి చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు శమీ వృక్షానికి సామూహికంగా హారతులు సమర్పించారు. అనంతరం శమీవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. స్థానిక పెద్ద ఆగ్రహారంలోని శ్రీలక్ష్మినర్సింహాస్వామి ఉత్సవమూర్తుల మహా రథోత్సవం వైభవంగా సాగింది. -
ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం
● వినూత్న సేవా కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పదలు, అనాథలు పుణ్యక్షేత్రాల దర్శనానికి అవకాశం ● దాతలు ముందుకు వస్తే బస్సుల కేటాయింపు ● విభిన్న మార్గాల్లో సంస్థకూసమకూరనున్న ఆదాయం నారాయణపేట రూరల్: ప్రతి మనిషికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేది ఓ కల.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతోమంది పరితపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఇష్టదైవాలను దర్శించుకుని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అయితే పేదరికం ఎంతోమందికి ఈ కల నెరవేరకుండా అడ్డుపడుతుంది. ఫలితంగా జీవితకాలంలో సైతం తమ ఇష్టదైవాలను దర్శించుకోలేక ఎంతోమంది నిరుపేదలు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో యాత్ర దానం పేరిట దాతల సహకారంతో అనాథలు, పేదలు పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీసీకి సైతం ఇది ఒక ఆదాయ వనరుగా మారనుంది. పథకం అమలు ఇలా.. ఎంతోమంది తమ పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనే వారు డబ్బులను వృథా చేయకుండా పేదలకు యాత్ర దానం కల్పించి ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా ఆర్టీసీకి విరాళాలు అందిస్తే అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రకు తీసుకువెళ్తారు. ● దాతలు ప్రత్యేకంగా ఏ పుణ్యక్షేత్రానికి, పర్యాటక ప్రాంతానికి యాత్ర దానం చేయాలనుకున్నారో ముందుగా సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదించాలి. అధికారులు యాత్రకు సంబంధించిన దూరాన్ని లెక్కించి కిలోమీటర్ల ఆధారంగా డబ్బులు, ఇతర వివరాలు తెలియజేస్తారు. ● యాత్రకు సంబంధించిన ప్యాకేజీ డబ్బులను దాతలు ఒక్కరే భరించవచ్చు. లేదా మిత్రుల భాగస్వామ్యంతోనైనా చెల్లించవచ్చు. అందించిన డబ్బుల ఆధారంగా అధికారులు అవసరమైన బస్సు ఏర్పాటు చేస్తారు. దాత వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోనూ నమోదు చేయాలి. దాతలు యాత్రకు వెళ్లే వారి పేర్లను సైతం సూచించవచ్చు. లేదా ఆర్టీసీనే నిరుపేదలు, వృద్ధులు, విద్యార్థులను ఎంపిక చేసి తీసుకువెళ్తుంది. డిపో డీఎం సెల్ నంబర్ మహబూబ్నగర్ సుజాత 99592 26286 షాద్నగర్ ఉష 99592 26287 నాగర్కర్నూల్ యాదయ్య 99592 26288 వనపర్తి దేవేందర్గౌడ్ 99592 26289 గద్వాల సునీత 99592 26290 అచ్చంపేట ప్రసాద్ 99592 26291 కల్వకుర్తి సుహాసిని 99592 26292 నారాయణపేట లావణ్య 99592 26293 కొల్లాపూర్ ఉమాశంకర్గౌడ్ 90004 05878 బస్సుల స్థాయికి చార్జీలు ఇలా.. కి.మీ., ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ (రూపాయలలో..) 201– 300 38,782 32,587 29,752 301– 400 38,782 38,782 35,002 401– 500 44,977 44,977 40,252 బస్సులో సీట్లు 50 40 34 దాతలు ముందుకు రావాలి.. తెలంగాణ ఆర్టీసీ నూతనంగా శ్రీకారం చుట్టిన యాత్ర దానం నిరుపేదలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. సేవాభావంతో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యక్తులు ఎవరైనా సహకరించి విరాళాలు ఇస్తే అనాథలు, వికలాంగులు, వృద్ధులు, నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇళ్లలో జరుపుకొనే వేడుకలకు సమాంతరంగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు దానం ఇవ్వడానికి ముందుకు రావాలి. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ -
పులకించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రచార రథంపై వెళ్తుండగా బతుకమ్మ, కోలాటాలతో గ్రామస్తులు అభివాదం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సోదరులు తిరుపతిరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, కొండల్రెడ్డి, కృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కోటమైసమ్మను దర్శించుకొని, భాజాభజంత్రీలతో భారీ ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన కొడంగల్కు బయలుదేరి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ బదావత్ సంతోష్తోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించలేదు. ఏర్పాట్లను మొత్తం గ్రామస్తులే చూసుకున్నారు. కేవలం భద్రతా ఏర్పాట్లను మాత్రమే పోలీసు అధికారులు పర్యవేక్షించారు. స్వగ్రామంలో సీఎం రేవంత్రెడ్డి దసరా వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి వేడుకలకు హాజరు ఘన స్వాగతం పలికిన ప్రజలు భారీగా తరలివచ్చిన అభిమానులు -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
గట్టు: త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గట్టులో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామాల రిజర్వేషన్ల ఆధారంగా ప్రతి ఒక్కరికి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గవిభేదాలను వీడి కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు వెంకటేష్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, మాజీ సర్పంచు మోహన్గౌడు, నాయకులు రామన్గౌడు, రామకృష్ణారెడ్డి, గద్వాలతిమ్మప్ప,మాచర్ల అలి,రాయాపురం రాముడు తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా..!
జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు● అలంపూర్ జోగుళాంబ ఆలయ సన్నిధి, జములమ్మ ఆలయంలో ఉట్టిపడిన దసరా శోభ ● భక్తిశ్రద్ధలతో శమీ పూజలు గద్వాలటౌన్: చెడుపై మంచికి విజయం.. దుష్టశిక్షణ శిష్టరక్షణ..కోటి ఆశలతో కొంగొత్త జీవితాలకు శ్రీకారం.. శమీపూజల సందడి.. సరదా సరదాగా దసరా సంబరం.. ఆశ్వీయుజ మాసం దశమిని పురస్కరించుకొని గురువారం గద్వాలలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతంలో అర్జునుడు చేసిన శమీ పూజలు గుర్తు చేసుకుంటూ పూజలు చేశారు. శమీ ఆకులను(బంగారం) ఇచ్చి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్ జోగుళాంబ సన్నిధిలో దసరా శోభ ఉట్టిపడింది. మల్దకల్ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వరస్వామి అలయం, పాగుంట శ్రీవెంకటేశ్వర ఆలయం, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయాలలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టారు. ఆయా ఆలయాల దగ్గర శమీపూజ, పల్లకి సేవ నిర్వహించారు. ఉదయం ఇంటిల్లి పాదీ కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు, అర్చనలు నిర్వహించారు. దుర్గా మాత మండపాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరి పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న శమీవృక్షం (జమ్మిచెట్టు) చుట్టూ ప్రదక్షణలు నిర్వహించి పూజలు చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో 9 రోజుల పాటు పూజలందుకున్న స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. కోట నుంచి గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వరకు ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. గద్వాల సంస్థానాఽధీశుల వారసుడు కృష్ణరామభూపాల్కు స్వాగతం పలుకుతూ.. కనులపండువగా తెప్పోత్సవం ఉత్సవాలను పురస్కరించుకొని నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసిన అమ్మవారి తెప్పోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్త జన సందోహంతో గద్వాల పులకించింది. గురువారం రాత్రి 7గంటల ప్రాంతంలో పండితులు పూజలు నిర్వహించి వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి ఊరేగింపునకు ముందు భజన మండలి సభ్యులు భక్తి గీతాలు పాడుతూ సాగారు. విద్యుద్దీపాకాంతులతో సుందరంగా అలంకరించిన పుష్కర ఘాట్లో నిర్వహించిన అమ్మవారి తెప్పోత్సవం వేడుకల్లో పాల్గొని భక్తులు తరించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి దంపతులు తెప్పోత్సవ వేడుకల్లో పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
గద్వాల: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎన్నికల అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు నిబద్ధతో పనిచేయాలని, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నేతల విగ్రహాలకు మాస్కులు వేయించాలని, పోస్టర్లు, బ్యానర్ల తొలగింపు పనులు జిల్లా నోడల్ అధికారులతో పాటు మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, గ్రామ కార్యదర్శులు, జీపీఓలు పర్యవేక్షించాలన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం, ప్రచార సమయం, అభ్యర్థుల ఖర్చు వివరాలు నమోదు చేయడం వంటి విషయాలపై సమగ్రంగా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, భూ సేకరణ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ మొగులయ్య, డీపీఓ నాగేంద్రం తదితరులు ఉన్నారు. నాయకులు సహకరించాలి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియామావళిపై ప్రతి గ్రామంలో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కనీసం ఒక్క కార్యకర్తకై నా అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్తులపై రాజకీయ ప్రచారాలకు సంబంధించి రాతలు, పోస్టర్లు అతికిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు భవనాలపై సైతం ఏమైనా పోస్టర్లు అతికిస్తే సంబంధిత యజమానుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా సంబందిత అధికారులకు సంప్రదించాలని సూచించారు. -
అయ్యో.. అయ్యయ్యో!
‘స్థానిక’ రిజర్వేషన్లలో పంచాయితీ ● ఎస్టీలు లేని చోట ఎస్టీకి.. ఎస్సీలు లేని చోట ఎస్సీకి.. ● పలు గ్రామాల్లో కిరికిరి.. కొన్ని చోట్ల అనివార్యంగా పదవులు ● నాగర్కర్నూల్ జిల్లాలో ఆ 4 గ్రామాల్లో ‘ప్రత్యేక’ పరిస్థితి ● ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానాలు ఆ వర్గానికే రిజర్వ్డ్ ● 2019లో జరగని ఎన్నికలు.. ఈ సారీ స్వయం పాలనకు దూరమేనా..? ఎస్సీలు లేని చోట ఎస్సీలకు.. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు.. ఇలా ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని పల్లెల్లో ఒకరు, ఒకట్రెండు కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు అనివార్యంగా పదవులు దక్కనున్నాయి. ఇదేక్రమంలో ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల్లోని ముఖ్య నేతల అనుచరులకు భంగపాటే ఎదురైంది. తారుమారైన రిజర్వేషన్లు దేవరకద్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నాయకుల ఆశలపై నీళ్లు చల్లగా.. వారిలో నైరాశ్యం అలుముకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ
గద్వాల క్రైం: విజయదశమిని పురస్కరించుకొని జిల్లా సాయుధ దళ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆయుధ పూజ సతీసమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సమాజంలో చెడును నిలువరించేందుకు పోలీసుశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకముందు జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు, సిబ్బందికి ఎస్పీ ముందుస్తు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్రావు, సీఐలు శ్రీను, రవిబాబు, టాటబాబు, ఆర్ఐలు సిబ్బంది తదితరులు ఉన్నారు. 1,259 ఎకరాల్లో వరిపంట నష్టం కృష్ణా: కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లో వరదల కారణంగా మండలంలో 1,259 ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్ తెలిపారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంటలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో వరి, పత్తి పంట కూడా దెబ్బతిందని.. రెండు పంటల నష్టం వివరాల పూర్తి నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. -
గడువు తక్కువ..లక్ష్యం ఎక్కువ
జిల్లాలో గద్వాల, అయిజ మున్సిపాలిటీలు పా తవి కాగా.. అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీ లు కొత్తగా ఏర్పడ్డాయి. అధికారులకు, సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడం వలన ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అధికారులు పన్నుల వసూళ్లపై అంతగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా జిల్లాలోని మున్సిపాలిటీల్లో పావు వంతు పన్నులు కూడా వసూలు కాలేదు. గతేడాది ప్రభుత్వం ప్రకటించిన ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పాటు ఈ ఏడాది ఏప్రిల్లో ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీని కూడా కొంతమంది మాత్రమే వినియోగించుకున్నారు. ఈ పథకంపై అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇంతకాలం మిన్నకుండిన అధికారు లు గడువు సమీపిస్తుండటం, మరోవైపు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు పన్ను వసూళ్లలో వేగం పెంచే పనిలో ఉన్నారు. సకాలంలో చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా నోటీసులు అందజేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపడతాం ఆస్తిపన్నుతో పాటు బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఆ దిశగా చర్యలు చేపడుతున్నాం. పన్ను బకాయిదారులకు అవగాహన కల్పించాం. సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి అనుకున్న పన్ను వసూళ్లను రాబడతాం. బకాయిదారులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. – జానకీరామ్, కమిషనర్,ఽ గద్వాల● -
ఆడపడుచుల జీవితాల్లో వెలుగులు నిండాలి
గద్వాల న్యూటౌన్: స్థానిక సఖీ కేంద్రం ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వివిధ విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా సంక్షేమ అధికారి సునంద ముఖ్య అతిథిగా హాజరై రంగురంగుల పుష్పాలతో చూడముచ్చటగా రూపొందించచిన బతుకమ్మకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆడపిల్లల పండుగ అన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఆడపడుచు ఇంట్లో వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సహదేవుడు, శైలజ, డీసీపీఓ నరసింహ, ఐసీపీఎస్, చైల్డ్లైన్, సఖీ, భరోసా, బాలసదనం విభాగాల సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో బతకమ్మ సంబురాలు అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో తొలిసారి వైద్య అధికారులు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వైద్య విధాన పరిషత్ సంచాలకులు రమేష్చంద్ర ఆధ్వర్యంలో వైద్య అధికారులు, వైద్యులు, సిబ్బంది రంగు రంగు పూలతో బతకమ్మలను సిద్ధం చేశారు. అదేవిధంగా దుర్గాష్టమి సందర్భంగా వైద్య పరికరాలకు ఆయుధ పూజలు చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ అమీర్, వైద్యులు దివ్య, వృషాలి, ప్రవీణ్, మహేష్, వైద్య సిబ్బంది, పారమెడికల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పాలనలో నిస్తేజం..!
జిల్లాలోని మున్సిపాలిటీల్లో 50 శాతం దాటని పన్ను వసూళ్లు ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ● అభివృద్ధి పనులపై ప్రభావం ● సిబ్బందిలో సమన్వయ లోపం గద్వాల టౌన్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలన నిస్తేజంగా మారింది. అధికారులకు కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ లేకుండా పోయింది. చివరకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిర్దేశించిన లక్ష్యంలో రెవెన్యూ సిబ్బంది కనీసం సగటును కూడా సాధించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా 50 శాతం రెవెన్యూ వసూళ్ల లక్ష్యాన్ని దాటలేదు. ఈ విషయాలను చక్కదిద్దే ప్రయత్నం చేయని అధికారులు.. అభివృద్ధిపై, నిధుల మంజూరుపై ఊకదంపుడు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. అధికారుల హడావుడి ప్రజలంతా సకాలంలో పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ గడువులోగా పన్నులు చెల్లించాలంటూ పేదవారిపైనే ఒత్తిడి చేస్తున్న అధికారులు.. పలుకుబడి కలిగిన వారిపై మెతక వైఖరి అవలంభిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025–26వ ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. మిగతా కాలంలోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అధికారులు హడాహుడి చేస్తున్నారు. పట్టింపు కరువు మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి అవసరమైన నిధులు లేవని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ పన్నుల వసూళ్లలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో ఉన్న కమిషనర్ల బకాయిదారులపై కొరడా ఝులింపించి పన్ను వసూళ్లు చేయగలిగారు. ప్రస్తుతం అధికారుల ఉదాసీనత వల్ల ఏటా రూ.కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. గద్వాల మున్సిపాలిటీలో రెగ్యులర్ ఆస్తిపన్ను కాకుండా, రూ.5.10 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయి. అయిజ మున్సిపాలిటీలో రూ.30.26 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. రెవెన్యూ విభాగంలో సిబ్బంది కొరతతో పాటు, కొత్తగా నియామకం అయిన వార్డు ఆఫీసర్లకు ఇతర విభాగాల బాధ్యతలను అప్పగించడం.. ఆరు నెలల్లోనే మిగిలిన 70 శాతం మేర పన్నులను వసూలు చేయాల్సి ఉంది. -
పశు సంపదతోనేవ్యవసాయాభివృద్ధి
గద్వాల న్యూటౌన్: పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని అనంతాపురంలో కేఆర్ఐబీహెచ్సీఓ సంస్థ సహకారంతో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పశు సంపదతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా, మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడుగా ఉంటాయని తెలిపారు. చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు చేయించాలన్నారు. శిబిరంలో భాగంగా 21 పశువులకు గర్భకోశ పరీక్షలు, చికిత్సలు నిర్వహించారు. అవసరమైన పశువులకు మందులు అందించడంతో పాటు, రాయితీ గడ్డి విత్తనాలు రైతులకు అందజేశారు. కార్యక్రమంలో కేఆర్ఐబీహెచ్సీఓ సంస్థ ప్రతినిధి రవికుమార్, గద్వాల మండల పశువైద్యాధికారి డాక్టర్ అర్పిత, డాక్టర్ పుష్పలత, డాక్టర్ మల్లేష్, డాక్టర్ హరిప్రియ, వెటర్నరీ అసిస్టెంట్ ప్రభాకర్, గోపాలమిత్రలు రామాంజనేయులు, ప్రభాకర్, పాడి రైతులు పాల్గొన్నారు. మద్యం టెండర్ల ‘ఖాతా’ ప్రారంభం ● నాగర్కర్నూల్ జిల్లాలో మూడు టెండర్లు దాఖలు ● మిగిలిన జిల్లాల్లో నమోదు కాని టెండర్లు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా మంగళవారం నాగర్కర్నూల్ ఈఎస్ పరిధిలో మూడు టెండర్లు దాఖలయ్యాయి. నాగర్కర్నూల్లో సర్కిల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాలకు, కల్వకుర్తిలో ఒక దుకాణానికి టెండర్లు వచ్చాయి. అయితే ఈనెల 26 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు మూడు మాత్రమే వచ్చాయి. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఇంకా ఖాతా ఒపెన్ కాలేదు. ఈనెల 18 వరకు టెండర్ల స్వీకరణకు గడువు ఉన్న క్రమంలో మద్యం వ్యాపారులు ఆలస్యం చేస్తున్నారు. చివరి వారం రోజుల్లో టెండర్ల వేగం పుంజుకుంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో వచ్చే మద్యం వ్యాపారులకు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నాయి. దీంతో గతం కంటే ఈసారి టెండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నది పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటాం ● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కృష్ణా: వరదల కారణంగా కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లిందని.. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని వాసూనగర్, తంగిడి, కుసుమర్తి, సూకూర్ లింగంపల్లిలో పర్యటించి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందొద్దని, నష్టపోయిన రైతులను తాము అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి రైతులకు నష్టం వాటిల్లిందని, ఇప్పుడు వరదలతో వరి పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. రెవెన్యూ అధికారులు పంటనష్టంతో పాటు ఇతరాత్ర నష్టం వివరాలను పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. తంగిడి, కుసుమర్తిలో తాగునీటి అవసరాలకు చేతిపంపులు మంజూరు చేశారు. కృష్ణాలో రోడ్డు నిర్మాణ పనులను త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. ఆయన వెనుక స్థానిక కాంగ్రెస్ నాయకులు సంతోష్ పాటిల్, సర్ఫరాజ్ఖాన్, విజప్పగౌడ, వీరేంద్రపాటిల్, నాగప్ప, మహదేవ్, మారెప్ప తదితరులు పాల్గొన్నారు. -
అడిగిన సమాచారం ఇవ్వడం బాధ్యత
గద్వాల: సమాచార హక్కు చట్టం–2025 ప్రకారం పౌరులు ఆయా శాఖల నిర్ధేశిత సమాచారం నిబంధనల ప్రకారం అడిగినప్పుడు నిర్ణీత సమయంలో ఇవ్వడం అధికారుల బాధ్యత అని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. సమాచార హక్కుచట్టం కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా స్థాయి అప్పిలేట్ అథారిటీ, పబ్లీక్ ఇన్ర్మేషన్ అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీఐ దరఖాస్తులపై ప్రతిమూడు నెలలకోసారి సమీక్షించేవాళ్లమని, ఇప్పుడు నెలకోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతినెలా వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలను వాటికి ఇచ్చిన సమాచారం వివరాలను ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా సమాచారహక్కు బోర్డులో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల వివరాలు డిస్ప్లే చేయాలన్నారు. ఈసమావేశంలో కలెక్టరేట్ ఏవో భూపాల్రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మల్దకల్: వర్షాకాలంలో సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సిద్దప్ప వైద్యసిబ్బందికి సూచించారు. సోమవారం మల్దకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసిబ్బంది, రోగుల నమోదు రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన స్వస్థి నారీ స్వశక్తి పరీవార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం నుంచి వివిధ విభాగాలకు సంబంధించిన 8మంది వైద్యులు మల్దకల్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో 302మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అవసరమైన వారికి జిల్లా కేంద్రానికి రెఫర్ చేసినట్లు డాక్టర్ స్వరూపరాణి తెలిపారు. మహిళల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకుని వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ కుటుంబం అన్ని విధాలా బాగుంటుందన్నారు.డాక్టర్లు సంధ్య కిరణ్మయి, రిజ్వానా, ప్రసూన పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 12 అర్జీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు మొత్తం 12 మంది అర్జీలు అందాయి. సోమవారం ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం చేకూరుస్తామని బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనం వంటి పూజా కార్యక్రమాలను చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో అర్చకులు భువనచంద్ర, దినకరన్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ 65 మంది చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. -
మూడు దశల్లో ‘పంచాయతీ’
గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. -
రహదారులే గోదారులు..
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో చిరు జల్లులు పడితే చాలు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం కురిసిన ఓ మోస్తరు వర్షానికి పట్టణంలోని అనేక ప్రాంతాలు నీటితో నిలిచి గోదారిని తలపించాయి. కూరగాయల మార్కెట్, రథశాల, రాజీవ్మార్గ్, సోమనాద్రి స్టేడియం తదితర ప్రాంతాలలో నీరు నిలవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. వాహనదారులు, పాదచారులు వర్షం ధాటికి ఇబ్బందులు పడ్డారు. చెత్త మురుగుతో కలిసి వర్షపునీరు రోడ్లపై పారింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీళ్లతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై పేరుకుపోయిన వర్షపు నీటిని, మురుగును సకాలంలో తొలగించి చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. అలాగే, సంతలో చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బురద నీటిలోనే కూర్చొని వ్యాపారాలను నిర్వహించుకున్నారు. దుస్తుల వ్యాపారులు తమ గుడారాలను తొలగించుకున్నారు. ముఖ్యంగా కూరగాయల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. సంత జరుగుతున్న తేరుమైదానం వర్షం నీటితో బురదమయంగా మారింది. బురద నీటిలోనే కూరగాయలను విక్రయించారు. కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం సంత వ్యాపారులకు నష్టాన్ని, కష్టాన్ని మిగిల్చింది. -
బీచుపల్లిలో నీట మునిగిన గుడిసెలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతుండడంతో జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.70లక్షల క్యూసెక్కులకుపైగా వరద దిగువన ఉన్న శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో బీచుపల్లి వద్ద కృష్ణనది ఉగ్రరూపం దాల్చుతోంది. పుష్కరఘాట్లు పూర్తిగా వరద నీటిలో మునగడంతో పాటు శివాలయం, పిండప్రదాన గదులు సైతం వరద నీరు చుట్టుముట్టాయి. శివాలయం సమీపంలో పలు హోటల్లు, గుడిసెలు వరద నీటిలో మునగడంతో అధికారులు వారిని అక్కచి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచుపల్లిలోని కోదండ రామస్వామి ఆలయ సమీపంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదండాపురం ఎస్ఐ మురళి తెలిపారు. ప్రస్తుతం కృష్ణానదికి వరద ప్రవాహం అధికంగా ఉందని, నది పరివాహక ప్రాంతంలో నివసించే గొర్లు, బర్రెల కాపరులు మేత కోసం, మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్లరాదని తెలిపారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పాడుబడ్డ ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వాగులు, వంకలను దాటేటప్పుడు వాహనదారులు, ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
వాడవాడలా బతుకమ్మ సంబరాలు
గద్వాలటౌన్: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బతుకమ్మను మహిళలు కీర్తించారు. సాంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జామాయే సందమామ.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పడుతూ ఆటలు ఆడారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అధ్యాపకులు, విద్యార్థినులు కళాశాల ఆవరణలో బతుకమ్మలను ఒకచోట చేర్చి పాటలకు అనుగుణంగా లయబద్దంగా చప్పట్లు చరుస్తూ ఆడారు. ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. అధ్యాపకుల, విద్యార్థినులతో కలిసి బొడ్డెమ్మలు వేశారు. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి, సోమవారం సాయంత్రం రెండు రోజుల పాటు బతుకమ్మ పాటలు హోరెత్తించాయి. పట్టణంలోని సగ భాగం కాలనీలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రెండవ వార్డులోని తాయమ్మ ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆటపాటలతో ఉత్సహంగా గడిపారు. పాత హౌసింగ్ బోర్డు కాలనీలో బతుకమ్మ సందడి కనిపించింది. బొడ్డెమ్మలు, కోలాటాలతో సందడి చేశారు. 03, 06, 12, 27, 28 33, 34 తదితర వార్డులలో మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం అందుబాటులో ఉన్న జలశయాలలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి జ్యోతి మాట్లాడారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. బతుకమ్మ మహిళలకు ప్రత్యేకమైన పండగ అని వివరించారు. బతుకమ్మ పండగ వారసత్వ సంపదగా మిగిలి ఉందని చెప్పారు. -
విద్యాప్రదాయిని సరస్వతీదేవి
గద్వాలటౌన్/ఎర్రవల్లి: అజ్ఞానులకు జ్ఞానం ప్రసాదించే జ్ఞానప్రదాయినిగా... సకల జగత్తుకు ఆధారమైన వేదాలను ప్రసాదించిన వరదాయినిగా... చదువుల నొసగే అభయ ప్రదాయినిగా.. సరస్వతీదేవిగా అమ్మవారు జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దేవిశరన్నవరాత్రుల ఉత్సవాలు గద్వాలలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజు సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలకు భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవి రూపంలో, కన్యకాపరమేశ్వరి, రెండవవార్డులోని శక్తిస్వరూణి తాయమ్మ ఆలయంలో, పిలిగుండ్లలోని శివకామేశ్వరి దేవి ఆలయంలో, మార్కెండేయస్వామి ఆలయంలో, బాలాజీవీధిలోని శివాలయంలో, కాళికామాత, కుమ్మరివీధిలలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆయా ఆలయాలలో మహిళలు కుంకుమార్చనలు చేశారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ● బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో దుర్గామాత సరస్వతీదేవి అవతారంలో, కోదండరామస్వామి ఆలయంలో జ్ఞానసరస్వతీదేవి నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. -
ఒకేసారి 3 గ్రూప్స్ ఉద్యోగాలు
జోగులాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన ఎం.జ్యోత్స్న ఒకేసారి గ్రూప్–2, 3, 4 ఉద్యోగాలు సాధించింది. జ్యోత్స్న ఇంటర్ చదువుతున్న సమయంలో 2017లో తల్లి, తండ్రి ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు. అమ్మమ్మ గ్రామమైన మల్దకల్ మండలం ఎల్కూరులో 9వ తరగతి వరకు, 10వ తరగతి ఉలిందకొండలో, డోన్లో ఇంటర్ చదివింది. ఇంటర్లో 970 మార్కులు సాధించిన జ్యోత్స్న ఢిల్లీలో అంబేడ్కర్ యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరిలో సీటు రావడంతో 2021 వరకు అక్కడ చదివింది. చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన రవితో వివాహమైంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్స్కు ప్రిపేరయ్యింది. ముందుగా గ్రూప్–4లో బీసీ వెల్ఫేర్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ వచి్చంది. అనంతరం గ్రూప్–3లో, గ్రూప్–2లో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో మండల పంచాయతీ ఆఫీసర్ (ఎక్స్టెన్షన్ ఆఫీసర్)గా ఉద్యోగం సాధించింది. కుటుంబ సభ్యుల సహకారంతోనే.. నేను ఈ స్థాయిలో ఉండేందుకు మా కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. ఏడాది వయస్సున్న బాబును ఇంటి వద్ద వదిలి హైదరాబాద్కు వెళ్లి చదువుకున్నాను. దీని వెనక నా కృషి, పట్టుదల ఎంతో ఉంది. ముఖ్యంగా భర్త రవి సహకారంతోపాటు అత్త, మామ, బావ, తోటికోడలు సహకరించారు. ఎం.జ్యోత్స్న, చిన్నతాండ్రపాడు -
దుర్గమ్మ తల్లి
కరుణించవమ్మా..● వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గద్వాలటౌన్: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. ఆది పరాశక్తి.. అందరినీ చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారిని కొలిచారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వరోజు ఆదివారం అమ్మవారు వివిధ ఆలయాలలో ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఆలయాలలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో, శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ ఆలయంలో అమ్మవారు శ్యామలదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. జములమ్మ ఆలయంలో అమ్మవారు గాయత్రీదేవి, పిల్లిగుండ్లలోని శ్రీశివ కామేశ్వరి దేవి అమ్మవారు చంద్రవాహిని, మార్కండేయస్వామి ఆలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు. -
కాంగ్రెస్ బకాయి కార్డు ఉద్యమం
కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని కేటీఆర్ అన్నారు. స్థానిక ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూలైన్లు ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ చెల్లించకుండా రేవంత్రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్– బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మాట తప్పిన రేవంత్రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సర్కార్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ● అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీమంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు మనోహర్, శ్రీకాంత్భీమ, నర్సింహగౌడ్, రమేష్రావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
ఎర్రవల్లి: కృష్ణానది పరివాహక ప్రాంతంలో, గ్రామాల్లో నివసించే ప్రజలు వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. ఆదివారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్ల వద్దకు, నీటిలోకి భక్తులు ఎవరూ వెళ్లవద్దని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అన్నారు. గొర్రెలు, పశువుల కాపరులు మేత కోసం నది సమీపంలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వెళ్లవద్దని, ముసురు వర్షాల వల్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు ఏమైనా అత్యవసరమైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని ఆయన సూచించారు. ఆయన వెంట సిఐ రవిబాబు, ఎస్సై రవినాయక్ ఉన్నారు. ఎర్రవల్లి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.20 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదిలారు. దీంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద తీవ్రత పెరగడం పుష్కరఘాట్లు నీట మునిగాయి. శివాలయం అతిసమీపంలో వరద ప్రవహిస్తుంది. బీచుపల్లి వద్ద ఉధృతంగా వస్తున్న కృష్ణమ్మ బీచుపల్లి వద్ద వరద ఉధృతిని పరిశీలిస్తున్న డీఎస్పీ మొగిలియ్య -
రిజర్వాయర్ గండికి మట్టి తరలింపు
● నిలిచిన వర్షం.. ఊపిరి పీల్చుకున్న మూడు గ్రామాల రైతులు గట్టు: వర్షాలు నిలిచినప్పటికి చిన్నోనిపల్లె రిజర్వాయర్లోకి వాగులు, వంకల్లో నుంచి నీటి ఉధృతి కొనసాగుతోంది. శని, ఆదివారం రెండు రోజుల పాటు రిజర్వాయర్ గండిని పూడ్చిన చోట మట్టిని తరలించి ఎత్తును పెంచారు. భారీ వర్షాలకు చిన్నోనిపల్లె రిజర్వాయర్ గండి దగ్గర పూడ్చిన మట్టికి సమాంతరంగా రిజర్వాయర్ నీరు వచ్చి చేరారు. వర్షాలు ఇలాగే కొనసాగి ఉంటే గండిని పూడ్చిన చోట రిజర్వాయర్ కట్ట కోతకు గురై నీరంతా బయటకు వెళ్లేది. చిన్నోనిపల్లె, లింగాపురం, బోయలగూడెం గ్రామాలకు చెందిన రైతులు చిన్నోనిపల్లె రిజర్వాయర్ వద్దకు చేరుకుని మట్టి కట్ట తెగిపోకుండా మట్టిని తరలించే విధంగా అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు రెండు రోజులపాటు చిన్నోనిపల్లె రిజర్వాయర్ గండి పూడ్చిన చోట మరికొంత మట్టిని తరలించి, కట్ట ఎత్తు పెంచారు. వరుణుడు శాంతించడంతో రిజర్వాయర్లో నీటి మట్టం పెరగకుండా సమాంతర కాల్వ ద్వారా రిజర్వాయర్ నీరు బయటకు వెళ్లిపోతుండడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా పెరగడంతో చిన్నోనిపల్లె గ్రామంలోని ఇళ్ల మధ్యకు బ్యాక్ వాటర్ వచ్చి చేరాయి. గ్రామ శివారుల్లో రైతులు సాగు చేసుకున్న పంట పొలాల్లోకి రిజర్వాయర్ నీరు వచ్చి చేరి, పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముంపునకు గురైన చిన్నోనిపల్లె గ్రామస్తులు పునరావాస కేంద్రంలో ఇప్పుడిప్పుడే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కొందరు తాత్కాలికంగా రేకుల గుడిసెలను వేసుకుని తలదాచుకుంటుండగా, మరికొంత మంది పాత గ్రామంలోని పాత ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. పాత ఊరిని పూర్తి స్థాయిలో ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మారితే, రిజర్వాయర్ మిగిలిన పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు అవకాశం ఉంటుంది. -
చేతులెత్తేశారు..!
సంక్షోభంలో సీడ్ పత్తి సాగు ● పెట్టుబడుల కోసం రైతుల వెంపర్లాట ● అప్పు చేసి మరీ కూలీలు చెల్లిస్తున్న వైనం ● జిల్లా వ్యాప్తంగా 31,469 ఎకరాల్లో సాగు ● గతేడాది చెల్లింపుల లెక్కలు చేయడంలో ఆర్గనైజర్ల తాత్సారం ● అధిక వర్షాలతో పంటపై మరింత దెబ్బ ●ఎకరా విస్తర్ణంలో సీడు పత్తి సాగు చేశా. మొదట్లో కొంత మేర పెట్టుబడికి ఆర్గనైజర్లు డబ్బులిచ్చారు. క్రాసింగ్ పనుల సమయంలో డబ్బులు ఇవ్వలేక పోవడంతో మధ్యలోనే క్రాసింగ్ పనులను నిలిపి వేయాల్సి వచ్చింది. కూలీలకు డబ్బులు ఇవ్వలేక ఎక్కువ రోజులు క్రాసింగ్ పనులు చేయకుండా మధ్యలోనే ఆపేశాను. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదు. ఇప్పటి దాకా సీడ్ పత్తి సాగుకు 80 వేల వరకు ఖర్చు చేశారు. దీనికితోడు ముసురు వర్షాలు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. – గోపాల్, సీడ్పత్తి రైతు, రాయాపురం సీడ్ పత్తి సాగును మధ్యలోనే వదులు కోవాల్సి వచ్చింది. ఎకరా విస్తర్ణంలో సీడ్ పత్తిని సాగు చేశా. ఇప్పటి దాకా రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టాను. క్రాసింగ్ పనుల కోసం కూలీలను రప్పించుకున్నా. తీరా ఆర్గనైజర్ డబ్బులు ఇవ్వకపోవడంతో క్రాసింగ్ పనులను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కూలీలకు మరో చోట అప్పులు చేసి చెల్లించాల్సి వచ్చింది. దీనికితోడు ఎడతెరపి లేని వర్షాలు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. – వార్ల రాజు, రైతు గట్టు గట్టు: నడిగడ్డలో పత్తివిత్తనోత్పత్తిని సాగు చేసే రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు ప్రకృతి.. మరో వైపు మధ్యవర్తులు (ఆర్గనైజరు) పత్తివిత్తనోత్పత్తి రైతులకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు సీడ్ పత్తి సాగు చేసే రైతులు పంట నిమిత్తం అప్పు కోసం వెళ్తే.. ఆర్గనైజర్లు ఇట్టే డబ్బులిచ్చేవారు. ఇప్పుడు ఎదురుపడితే ఎక్కడ డబ్బులు అడుగుతాడోనని కొందరు తప్పించుకు తిరిగే పరిస్థితి నెలకొంది. నేరుగా కలిసినా డబ్బులు ఇవ్వలేమంటూ చేతులెత్తుస్తున్నారు. దీంతో పత్తి రైతులు పత్తివిత్తనోత్పత్తి సాగును చివరివరకు కొనసాగిద్దామా లేక మధ్యలోనే వదిలేద్దామా అనే సందిగ్ధంలో పడ్డారు. పెట్టుబడులకు డబ్బులు లేక కొంత మంది సీడ్ పత్తి సాగును మధ్యలోనే వదిలేస్తుండగా మరి కొంత మంది రైతులు మరో చోట అప్పులు తెచ్చుకుని సాగు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 31,469 ఎకరాల్లో సీడ్ పత్తిని సాగు చేస్తున్నట్లు అంచనా. రైతులకు సుమారుగా రూ.550 కోట్ల నుంచి రూ.650 కోట్ల వరకు మధ్యవర్తుల ద్వారా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే కంపెనీలు మధ్యవర్తుల ద్వారా రైతులకు రూ.350 కోట్లను వరకు మాత్రమే చెల్లించి, మిగతా రూ.300 కోట్ల చెల్లింపుల గురించి మాట్లాడకుండడంతో రైతులు ఏం దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. కూలీలకు డబ్బులు కరువు ఈ ఏడాది సీడ్ పత్తిని సాగు చేసిన రైతులు పెట్టుబడికి చాలా ఇబ్బంది పడుతున్నారు. క్రాసింగ్ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకున్న కూలీలకు డబ్బులు చెల్లించాలని, డబ్బులు ఇవ్వమని ప్రాదేయపడుతున్నా..అబ్బే మా దగ్గర డబ్బుల్లేవంటూ ఆర్గనైజర్లు తప్పించుకుని తిరిగే పరిస్థితి నడిగడ్డలో దాపురించింది. దీంతో 60 రోజుల పాటుగా క్రాసింగ్ పనులను సాగించాల్సిన రైతులు 30 నుంచి 40 రోజుల వరకు పనులు చేసి, కూలీలను వెనక్కి పంపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకున్న కూలీలకు భోజనం, వసతితో పాటుగా ఒక్కోక్కరికి రూ.18 వేల నుంచి 21 వేలను 30 రోజులకు చెల్లిస్తుంటారు. కూలీలకు డబ్బులు ఇవ్వలేక రైతులు నానా తంటాలు పడుతున్నారు. సీడ్ పత్తిని సాగు చేసిన రైతులు తాము పండించిన పత్తిని నవంబర్, డిసెంబర్ నెలల్లో మిల్లులో జిన్నింగ్ ఆడిస్తారు, పత్తి నుంచి గింజలను బయటకు తీసిన తర్వాత, వాటిని రైతుల సమక్షంలో శ్యాంపిల్స్ తీసి కంపెనీకి పంపుతారు. సంక్రాంతి నాటికి ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే రైతులకు చెల్లించాల్సిన డబ్బులను మాత్రం జూలైలో లెక్కలు చేస్తారు. పంట సాగు కోసం తీసుకున్న అప్పు, దానికి వడ్డీ కలిపి లెక్కకడతారు. తాము పండించిన పంటకు చెల్లించాల్సిన డబ్బులను లెక్క చేసి, మిగులుబాటు ఉంటే రైతులకు చెల్లింపులు చేస్తారు. లేకపోతే కొంత మేరకు పెట్టుబడికి ఇచ్చి, పంట పండించాలని రైతులకు చెబుతారు. అయితే 2024–25 సంవత్సరానికి సంబందించి సీడ్ ఆర్గనైజర్లు కొంత మంది రైతుల లెక్కలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది సీడ్ పత్తి రైతుపై ప్రకృతి పగ పట్టిందని రైతులు వాపోతున్నారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. క్రాసింగ్ కొనసాగుతున్న తరుణం (ఆగస్టు/సెప్టెంబర్) లో వర్షాలు విరామం లేకుండా కురువడంతో క్రాసింగ్ నిలవడం లేదని పేర్కొంటురు. ప్రస్తుతం ముందస్తు చేసిన క్రాసింగ్ పనుల కారణంగా సీడ్ పత్తి కాయలు పగిలి పత్తి తీసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో వర్షాల కారణంగా పత్తి తడిచి దెబ్బతింటున్నట్లు రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలు ఎక్కువ కావడంతో పత్తి చేను ఎర్రబారి దిగుబడిపై ప్రబావం చూపుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
గద్వాలటౌన్: తన జీవితాన్ని చివరి వరకు ప్రజా పోరాటాలకు అంకితం ఇచ్చిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పలువురు వక్తలు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వేరువేరుగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి తన జీవితాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానీయుడు బాపూజీని కొనియాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర సమరం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు మాట్లాడుతూ.. చేనేతతో పాటు వివిధ చేతివృత్తుల వారికి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహించారన్నారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాత అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలాక్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు, వాల్మీకి పూజారులు తిమ్మప్ప, నర్సింహులు, ఆలయ సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్ములు పాల్గొన్నారు. -
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ
గద్వాలటౌన్: అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను పట్టణంలోని పలు ఆలయాల్లో శనివారం వైభంగా నిర్వహించారు. ఆరో రోజు స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బాలరాముడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గద్వాల ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి దేవిగా, తాయమ్మ ఆలయం, కుమ్మరివీధి, అంబాభవాని ఆలయం, వీరభద్రస్వామి ఆలయంలో, మార్కండేయస్వామి ఆలయంలో అమ్మవారు వివిధ రూపాల అలంకరణలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. బాలాజీ వీధుల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు. -
ఏటీసీల్లో కార్పొరేట్ స్థాయి నైపుణ్య శిక్షణ
గద్వాల టౌన్: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం పట్టణ శివారులోని నూతన ఏటీసీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. యువత అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొంది, ఆధునిక నైపుణ్యాలను అభ్యసించి, భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అందించేందుకు టాటా సంస్థ సహాకారంతో వివిధ కోర్సులు నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఏటీసీలో 172 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.45 కోట్ల వ్యయం చేసిందని, ప్రతి విద్యార్థికి వచ్చే ఏడాది నుంచి రూ.2 వేల స్టైఫండ్ అందిస్తామన్నారు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసి ఏటీసీలో చదివిన ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సహాయ లేబర్ కమిషనర్ మహేష్కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి ప్రియాంక, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉధృతంగా పారుతున్న వాగులు
సాతర్ల సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు చెన్నిపాడులో మిరప పంటలో నిలిచిన వర్షం నీరు నీలహళ్లి, పాతపాలెం మధ్య పారుతున్న వాగు ఉండవెల్లి మండలంలోని మెన్నిపాడు వాగు ఉధృతంగా ప్రవహించింది. పంటలు నీట మునగడంతో నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. బొంకూరులో వర్షానికి షాకినాబీ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మానవపాడు మండలంలో భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరి పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవపాడు–అమరవాయి, మానవపాడు–గోకులపాడు వాగులు పొంగిపోర్లాయి. సాక్షి, నెట్వర్క్: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసి వర్షాలతో జిల్లావ్యాప్తంగా పలు కుంటలు, చెరువులు అలుగులు పారుతున్నాయి. శనివారం లోలెవల్ బ్రిడ్జిల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉండడంతో కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. పంటలు నీట మునిగి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. గట్టు పెద్ద చెరువు నిండి అలుగు పారింది. మాజీ ఎంపీటీసీ కృష్ణ చెరువు అలుగు వద్ద గంగమ్మకు పూజలు చేశారు. మండలంలో అత్యధికంగా 118.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధరూరు మండలంలోని నీలహళ్లి, పాతపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిచడంతో 6 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత వరద తగ్గడంతో రాకపోకలు కొనసాగించారు. రోడ్డు కం బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని షేకుపల్లి, సాసనూలు, గార్లపాడు, ఉదండాపురం, సాతర్ల, శనిగపల్లి, చాగాపురం, ఇటిక్యాల తదితర గ్రామాల సమీపంలోని పలు వాగులు శనివారం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు గ్రామాల్లో పత్తి, మిరప, బెండ, పొగాకు, వరి పంటల్లో వర్షపు నీరు చేరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
చిన్నోనిపల్లి రిజర్వాయర్లో పెరిగిన నీటిమట్టం
గట్టు : చిన్నోనిపల్లె రిజర్వాయర్ను శనివారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల్లోని వరద రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నాయి. రిజర్వాయర్లో నీటి మట్టం పెరుగుతున్న తరుణంలో గతంలో గండిని పూడ్చిన చోటుకు సమీపంలో నీరు వచ్చి చేరాయి. రిజర్వాయర్లో ఎక్కువైన నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన సమాంతర కాల్వ ఉన్నప్పటికీ నీటికి బయటకు వెళ్లట్లేదు. రిజర్వాయర్లోకి వచ్చే నీరు ఎక్కువగా వస్తుండడంతో కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ విజయ్కుమార్, తహసీల్దార్ విజయ్కుమార్, గిర్ధావర్ రాజు, ఇరిగేషన్ అధికారులు చిన్నోనిపల్లె రిజర్వాయర్ను పరిశీలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వర్షాలు తగ్గిన నేపథ్యంలో మట్టి కట్టను మరి కొంత మేరకు పెంచితే రిజర్వాయర్లోని నీరు కాల్వ ద్వారా బయటకు వెళ్లిపోతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. -
సబ్సిడీ విత్తనాలు వినియోగించుకోవాలి
అయిజ: నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం (ఎన్ఎంఈఓ ఓఎస్)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ద్వారా రైతులకు ఉచితంగా అందజేస్తున్న వేరుశనగ విత్తనాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వంద శాతం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, టెక్నికల్ ఏడీఏ మహాలక్ష్మి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
గద్వాలన్యూటౌన్: విద్యార్థులు తమతమ లక్ష్యాలను అందుకోవడంలో భాగంగా తల్లిదండ్రులు అవసరమైన ప్రోత్సాహన్ని అందించాలని ఇంటర్బోర్డు జాయింట్ డైరెక్టర్ విశ్వేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు అధ్యాపకులతో పాటు, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదివేలా తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు ప్రతి రోజు కళాశాలకు వస్తున్నారా.. లేదా.. అని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. తరుచూ కళాశాలకు వస్తూ తమ పిల్లల ప్రతిభ ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇక నుంచి తరుచూ పేరేంట్స్ మీటింగ్స్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాల్ వీరన్న, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
గద్వాల: తెలంగాణ సాయుధపోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ విశిష్టమైన పాత్రపోషించి మహిళా చైతన్యం, దైర్యసాహసాలు, బహుజన ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలిచారని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాయలంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్.. చాకలిఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ కేవలం ఒక మహిళగానే కాకుండా సమాజంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారన్నారు. భూస్వాముల అన్యాయాలు, దో పిడీదారులకు వ్యతిరేకంగా తన ౖధైర్యసాహసాల తో పోరాటం చేసిన వీరనారి అన్నారు. తనకు ఎ దురైన కష్టాలకు, అవమానాలకు వెనక్కి తగ్గకుండా ప్రజల హక్కుల కోసం ముందుకు సాగారన్నా రు. చాకలి ఐలమ్మ జీవితం ధైర్యం, పట్టుదల, త్యాగస్ఫూర్తికి మారుపేరుగా నిలుస్తుందన్నా రు.అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీపీవో నాగేంద్రం, ఏవో భూపాల్, బీసీసంక్షేమశాఖ అధికారి అక్బర్పాషాపాల్గొన్నారు. ఆదర్శప్రాయురాలు.. గద్వాల క్రైం: పేదల తరుపున పెత్తందార్లతో పోరాడిన వీర నారి చాకలి ఐలమ్మ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఐలమ్మ 130 జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిరుపేదల సమస్యలపై నిరంరం పోరాటం చేసిన మహిళా యోధురాలని, ఆదిపత్యవాదంపై ఎర్ర జెండాతో ఎదురునిలిచి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పోరాటం చేసిందన్నారు. ఆమె ఆశయలను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు సిబ్బంది పాల్గొన్నారు. వీరవనిత ఐలమ్మ శాంతినగర్: భూమికోసం, భుక్తికోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ అని, ఆమె జీవితం మహిళాలోకానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. వడ్డేపల్లి పుర పరిధిలోని శాంతినగర్ రామాపురం చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయనతోపాటు ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథులుగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
చెక్డ్యాంలకు గ్రహణం
● రూ.లక్షలు వెచ్చించి నిర్మాణం ● సైడ్వాల్స్ కొట్టుకుపోయి నీటి వృథా ● మరమ్మతుకు నోచుకోని వైనం అయిజ: వర్షంనీరు ఒడిసి పట్టుకొని వాగులు, వంకల్లో నీరు నిలువ చేసి.. భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా చెక్డ్యాంలను నిర్మించారు. ఏళ్లు గడుస్తున్న కొద్ది సైడ్వాల్స్ కొట్టుకుపోవడం.. మరమ్మతుకు నోచుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. దీనికితోడు అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఈ నీటిపై ఆధారపడే రైతులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 2001లో కేంద్ర ప్రభుత్వం నాబర్డ్ పథకం ద్వారా జిల్లాలోని వాగులు, వంకల వద్ద చెక్డ్యాంలను నిర్మించింది. ఒక్కో చెక్డ్యాంకు రూ.5 లక్షలు ఖర్చుచేసింది. జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లా పరిధిలోకి మొత్తం 20 చెక్ డ్యాంలు వచ్చాయి. వాటిలో 7 చెక్డ్యాంలు శిథిలమయ్యాయి. 2009లో వచ్చిన వరదల్లో చెక్డ్యాంల సైడ్వాల్స్ కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు వాటిని పునర్నిర్మించపోవడంతోపాటు మరమ్మతుకు కూడా నోచుకోవడంలేదు. చెక్డ్యాంలు నిర్మించిన అనంతరం కొన్నేళ్లు వాగుల్లో వర్షాకాలం సమృద్ధిగా నీరునిలవడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయి. బోరుబావుల్లో తాగునీరు, సాగునీరు సమృద్ధిగా లభించింది. మూగజీవాల దాహం తీర్చేందుకు ఈచెక్డ్యాంలు ఉపయోగపడ్డాయి. అయితే 2009, మరికొన్ని సార్లు కురిసిన భారి వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో చెక్డ్యాంల సైడ్వాల్స్ తెగిపోయాయి. కట్టడాలు శిథిలమయ్యాయి. వాటికి మరమత్తులు చేపట్టకపోవడంతో అప్పటినుంచి ఇప్పటివరకు వాగుల్లో నీరు నిలువని పరిస్థితి ఏర్పడింది. కనీసం పశువులు దాహంతీర్చెకోవడానికి కూడా నీరు నిలువక పోవడం దూరదృష్టకరం. వర్షాకాలంలో వాగులు ఎడారిని తలపిస్తాయి. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చెక్డాంలన్నింటికి మరమత్తులు చేయించాల్సిన అవసరం ఎంతైనాఉంది. ఉన్నా.. నిరుపయోగం అయిజ శివారులో మొత్తం 4 చెక్డ్యాంలు ఉండగా వాటిలో రెండు శిథిలమయ్యాయి. మానవపాడు మండలంలోని కలుకుంట్ల, మానవపాడు, కొరివిపాడు, జల్లాపూర్, పల్లెపాడు, చందూర్, చిన్న పోతులపాడు, గోకులపాడు, బొరవెల్లి, పెద్ద పోతులపాడు గ్రామ శివార్లలో మొత్తం 13 చెక్ డ్యాంలు ఉండగా వాటిలో 2 చెక్డ్యాంలు శిథిలమయ్యాయి. ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం– సాతర్ల గ్రామాల మధ్య ఒక్క చెక్డ్యాం ఉండగా అది కూడా శిథిలావస్థలో ఉంది. వడ్డేపల్లి మండలంలోని బుడమర్సులో 2 చెక్డ్యాంలు మరమ్మతుకు గురయ్యాయి. ఇదిలాఉండగా, రెండేళ్ల క్రితం ప్రభుత్వం జిల్లాలో 7 నూతన చెక్ డ్యాం నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. నందిన్నె శివారులో రూ.1.77 కోట్లు, గుంటిపల్లి శివారులో రూ. 2.06, దయ్యాలవాగు వద్ద రూ.1.96, చందూరులో రూ.1.2, గువ్వలదిన్నెలో రూ.3.7, ఇర్కిచేడులో రూ. 3.85, ఉప్పలలో రూ.2.82 కోట్లతో నూతన చెక్ డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ, మరమ్మతుకు గురైన చెక్డ్యాంలు శిథిలమైనాసరే వాటికి మరమ్మతు చేపట్టడంలేదు. -
ఎడతెరిపి లేకుండా..
గురువారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం గద్వాల: జిల్లా వ్యాప్తంగా గురువారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి జనజీవనం అతాకుతలం అయ్యింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారిగా కృష్ణానది పొంగి ప్రవహిస్తుండడంతో గుర్రంగడ్డలోని జములమ్మ అమ్మవారి ఆలయంలోకి నీరువచ్చి చేరింది. అదేవిధంగా చెరువులు, కుంటలు వాననీరు చేరి నిండుకుండలుగా మారాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ టి.శ్రీనివాస్రావు.. రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటాయో వాటిని ముందుస్తుగానే గుర్తించి ఆయాప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశించారు. జిల్లాలో గద్వాల మండలంలో గరిష్టంగా 23.2 మి.మీ, మానవపాడులో కనిష్టంగా 7.2 మి.మీ.ల వర్షం కురిసింది. పంటలకు తీరని నష్టం కేటీదొడ్డి మండలంలో చేతికొచ్చే దశలో ఉన్న పత్తి పంటను వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆవేదన చెందారు. అలాగే,మానవపాడులో కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో వర్షం నీరు చేరడంతోతీవ్ర నష్టం వాటిలింది. మండలంలోని మిరప, పత్తి, కంది, పొగాకు పంటలకు ఎడతెరిపి లేని వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధరూరు మండలంలో ముసురు వర్షానికి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పాత ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారు భయం భయంగా కాలం గడిపారు. వ్యవసాయ పనులకు, ముఖ్యంగా సీడ్ పత్తి పనులకు ఆటంకం కలిగింది. మల్దకల్ మండలంలో భారీ వర్షానికి అమరవాయి గ్రామంలో దౌలత్బేగ్ ఇల్లు నేలకూలింది. అలాగే బిజ్వారం, మేకలసోంపల్లి, మల్దకల్, తాటికుంట, చర్లగార్లపాడు గ్రామాలలో వర్షానికి పాడుబడిన ఇళ్లు కూలినట్లు గ్రామస్తులు తెలిపారు. అయిజ మండలంలోని అయిజ, ఉత్తనూరు, సింధనూరు, దేవబండ వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పట్టణంలోని లోతట్టు కాలనీల రోడ్లు వర్షంనీటిలో మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాజోళి మండలంలో వర్షం దంచి కొట్టింది. కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ జలమయమై, కనీసం నడవడానికి కూడా రాని విధంగా తయారయ్యాయి. రాజోళి–శాంతిగనర్ ప్రధాన రోడ్డుపై మోకాలి లోతు గుంతలు ఏర్పడి నారు చేరడంతో స్థానికులు, బీజేపి నాయకులతో కలిసి తమ ఇబ్బందిని కలెక్టర్కు వాట్సాప్ ద్వారా తెలియచేశారు. జిల్లా వ్యాప్తంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ గద్వాలలో గరిష్టంగా 23.2 మి.మీ, మానవపాడులో 7.2 మి.మీ వర్షం -
నేత్ర పర్వం... అమ్మవారి అలంకారం
గద్వాలటౌన్: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదో రోజు అన్ని ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మి, మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం నుంచే మంగళవాయిద్యాల మధ్య ఆలయాల్లో సుప్రభాత సేవ, అభిషేకాలు, విశేష పూజలు చేశారు. లలిత సహస్రనామ పారాయణములను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమార్చనలు చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయం, మార్కండేయస్వా మి ఆలయం, అంబాభవాని, కుమ్మరివీధి, బాలాజీవీధి, పిల్లిగుండ్ల ముడుపు ఆంజనేయస్వామి ఆలయాల్లో అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో అమ్మవారు అశ్వవాహనంపై ఊరేగారు. ఇదిలాఉండగా వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ.5.55 కోట్ల కరెన్సీతో, 2వ వార్డులోని శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ దేవస్థానంలో రూ.51లక్షల కరెన్సీతో అమ్మవారిని అ లకరించారు. మహిళలు అమ్మవారి ఎ దుట దీపాలు వెలిగించి మొక్కులు తీ ర్చుకున్నారు. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆ తల్లిని వేడుకున్నారు. -
నదీపరివాహక ప్రాంతాల్లో రక్షణ
కృష్ణానది, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టారు. గద్వాల పట్టణంలోని నదీఅగ్రహారం, జూరాల, బీచుపల్లి కృష్ణానది వద్ద, తుంగభద్రనది ప్రాంతాల్లో రాజోలి, అలంపూరు ప్రాంతాల్లో పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ప్రధానంగా గద్వాల, కెటి.దొడ్డి, గట్టు, ధరూరు, మానవపాడు ఇటిక్యాల మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో చాలాగ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మానవపాడు నుంచి అమరవాయికి వెళ్లే పెద్దవాగు ప్రవాహం పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపురం అండర్రైల్వే బ్రిడ్జి దగ్గర భారీవర్షానికి నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: నవరాత్రి, బతుకమ్మ వేడుకల్లో భక్తులకు ఎలాంటి సమస్య లేకుండా శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని నవరాత్రి వేడుకల సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, బతుకమ్మ సంబరాల నేపథ్యంలో మహిళలకు ఇబ్బందులు కలగకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. దాంతోపాటు అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట వంటిని కట్టడి చేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్టమైన నిఘా ఉంచాలన్నారు. కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖాలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు, కళ్యాణ్కుమార్, శేఖర్, రాజునాయక్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ తదితరులు ఉన్నారు. -
వైభవంగా జోగుళాంబ నవరాత్రి ఉత్సవాలు
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం జోగుళాంబ అమ్మవారు కుష్మాండదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ప్రత్యేక మండపంలో కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన, అష్టోత్తర శతనామ అర్చన, దేవి ఖడ్గమాల అర్చన జరిగాయి. కుష్మాండదేవికి కొలువు పూజ, కుమారి పూజ, సువాసిని పూజ, దర్బారు సేవ మంత్ర పుష్ప నీరాజన పూజలు, దశవిధ హారతులిచ్చారు. కుష్మాండం అంటే బ్రహ్మాండానికి సంకేతమని.. జగన్మాత బ్రహ్మాండమంతా తానై భక్తులను రక్షిస్తుందని అర్చకులు భక్తులకు వివరించారు. అలాగే అమ్మవారి ఆలయంలో రథోత్సవం కనులపండవగా జరగగా.. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టువస్త్రాలు సమర్పించిన ఎస్పీ.. అలంపూర్ ఆలయాలను గురువారం ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో వారిని సత్కరించగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం పలికారు. నాలుగో రోజు కుష్మాండదేవిగా భక్తులకు దర్శనం అమ్మవారి ఆలయంలో కనులపండువగా రథోత్సవం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు.. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం సికింద్రాబాద్కు చెందిన కీర్తి ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. -
ఇక టెండర్ల జాతర
● నేటి నుంచి వచ్చేనెల 18 వరకుదరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు టెండర్లు ఆహ్వానం ● ఏర్పాట్లు చేస్తున్నాం.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో మద్యం వ్యాపారుల నుంచి టెండర్లు తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. గురువారం కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఒక్కో వ్యాపారి ఎన్ని టెండర్లు అయినా దాఖలు చేయవచ్చు. ఈసారి టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాం. – విజయ్భాస్కర్రెడ్డి, డీసీ ఎకై ్సజ్ శాఖ మహబూబ్నగర్ క్రైం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు చేసింది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత ఎకై ్సజ్ మద్యం పాలసీ ముగియనున్న క్రమంలో డిసెంబర్ 1నుంచి కొత్త మద్యం దుకాణాలు అమల్లోకి రానున్నాయి. కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి కులాల వారీగా దుకాణాల కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు కొనసాగుతుండే ఈసారి అలంపూర్, రాజోళి, చెన్నారం దగ్గర ఉన్న మద్యం దుకాణాలు తొలగించి.. ఈసారి 227 దుకాణాలకు టెండర్లు స్వీకరించనున్నారు. మూడు దుకాణాల్లో సరైన మద్యం అమ్మకాలు లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి ఈసారి రూ.3 లక్షలకు పెంచారు. ఒక్కో వ్యాపారి ఎన్ని మద్యం దుకాణాలకు అయినా టెండర్ వేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాకేంద్రాల్లో ఉండే కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు టెండర్లు స్వీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2021లో మొత్తం 230 దుకాణాలకు 4,713 టెండర్లు వస్తే 2023లో 230 దుకాణాలకు 8,595 టెండర్లు వచ్చాయి. ఈ సారి పదివేలకు పైగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ● వచ్చే నవంబర్ 30తో ప్రస్తుత మద్యం దుకాణాల గడువు ముగిస్తున్న నేపథ్యంలో కొత్త దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం టెండర్ల స్వీకరణకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి మళ్లీ కొత్త దుకాణాలు ప్రారంభం కానుంది. ఈ నెల 26 నుంచి (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో దుకాణానికి టెండర్ ఫీజు రూ.3 లక్షలు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు నాలుగు స్లాబ్ల కిందట ఉన్నాయి. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షల కింద దుకాణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో గత మూడుసార్లు జరిగిన టెండర్ ప్రక్రియలో వచ్చిన దరఖాస్తుల వివరాలు జిల్లా 2019 2021 2023 మహబూబ్నగర్ 1,384 1,525 3,571 /నారాయణపేట నాగర్కర్నూల్ 1,064 1,507 2,524 జోగుళాంబ గద్వాల 418 987 1,171 వనపర్తి 516 694 1,329 దుకాణాల కేటాయింపు ఇలా.. -
ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ
● కలెక్టర్ బీఎం సంతోష్ ● జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన సంబరాలు గద్వాల/గద్వాలటౌన్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం.. మన వారసత్వాన్ని కాపాడే.. ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని కలెక్టర్ బీఎం సంతో అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో, కలెక్టరేట్లో అట్టహాసంగా బతుకమ్మ వేడులకు నిర్వహించారు. హోదా పక్కన బెట్టి స్వయం సహాయక సంఘాల మహిళలతో జిల్లా అధికారులు.. వారికి జతగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు... కళాకారుల ఆట పాట.. వెరసి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సంతోష్ బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. వివిధ శాఖల సిబ్బంది పూలతో బతుకమ్మలను పేర్చగా, జిల్లా అధికారులు బతుకమ్మ ఆడారు. జానపద పాటలతో హోరెత్తించారు. కలెక్టర్ సతీమణి డాక్టర్ కెచేరి బతుకమ్మను నెత్తిపై పెట్టుకొని తన నివాసం నుంచి వచ్చారు. దాండియా ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి నుషితతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీరొక్క పూలు.. ఆనందాల జోరు.. జిల్లా కేంద్రంలోని తేరుమైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి పాల్గొన్నారు. వివిధ కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను తలపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించి, తేరువైదానానికి చేరుకున్నారు. పగటి వెలుతురు తలపించేలా సంబురాల వేదిక పరిసరాలను విద్యుత్ వెలుగుతో నింపేశారు. స్థానిక తేరుమైదానం మొత్తం బతుకమ్మ ఆట, పాటలతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలతో కలిసి కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా అధికారులు బోడ్డెమ్మలు వేశారు. వారితో కలిసి కోలాటం ఆడారు. సమాజంతో స్నేహబంధాన్ని పెంచుకోవడానికి, సుఖాన్ని కలిసి ఆనందించడానికి తెలంగాణలో బతుకమ్మ ఆడుతారనే సందేశాన్ని ఇచ్చారు. అనంతరం తేరుమైదానం నుంచి తెచ్చిన బతుకమ్మలను స్థానిక లింగం బావిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి ఆట పాటలతో అలరిచిన మహిళలకు ప్రోత్సాహ బహుమతులను కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అందజేశారు. -
100 టీఎంసీల చొప్పున 3 చోట్ల రిజర్వాయర్లు నిర్మించాలి..
ప్రతి ఏటా వానాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు సుమారు 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంచితే అక్కడ అదనంగా మరో 100 టీఎంసీల నీళ్లు నింపుకుంటారు. మిగిలిన 2,900 టీఎంసీల నీళ్లయితే మనకు వస్తాయి కదా. ఇక్కడ ఎత్తు తగ్గించడం అనే డిమాండ్ కంటే.. పాలమూరు జిల్లాలో భారీ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి జిల్లాలో జూరాల మినహా మిగతావన్నీ ఎత్తిపోతలే. జూరాల కూడా అంతంతమాత్రమే. ఇప్పటికై నా భీమా, కృష్ణా నదులు కలిసే ప్రాంతంలో, జూరాలకు కుడివైపున ర్యాలంపాడ్తో పాటు ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అక్కడ, కేఎల్ఐ వద్ద, లక్ష్మీదేవిపల్లి వద్ద.. ఈ మూడు చోట్ల 100 టీఎంసీల చొప్పున నీరు నిల్వ చేసేలా భారీస్థాయిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలి. అప్పుడే ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయి. – రాఘవాచారి, ఉమ్మడి జిల్లా కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక ● -
వర్షాభావ, విపత్కర పరిస్థితుల్లో..
ఆల్మట్టి ఎత్తు పెంచిన పక్షంలో తెలంగాణతోపాటు ఏపీ రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో ప్రధానంగా కృష్ణా పరివాహకంలోని ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. వర్షాభావ, విపత్కర పరిస్థితుల్లో ఆల్మట్టి గేట్లు తెరవకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు నెట్టెంపాడు, భీమా–1, 2, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్కు కృష్ణా నీరు చేరని పరిస్థితి ఉంటుంది. ఫలితంగా వీటి పరిధిలో సుమారు 20 లక్షల ఎకరాల సాగుపై సందిగ్ధత నెలకొనే అవకాశం ఉంటుందని.. తాగునీటికీ కటకట ఏర్పడుతుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. -
పాలమూరు చుట్టే రాజకీయం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సెగ రాజేసింది.. తెలంగాణ మలి దశ పోరులో రణనినాదమై నిలిచింది పాలమూరే. తలాపున కృష్ణమ్మ ఉన్నా.. సాగు, తాగునీరు లేక వలసలతో తండ్లాడిన ఇక్కడి ప్రజల దీనగాధ, వెనుకబాటుతనమే ప్రతి ఒక్కరి గళమైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ‘పాలమూరు’దే కీలక భూమిక. అలాంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో ఈ ఎత్తిపోతలకు అడుగులు పడగా.. అప్పుడు, ఇప్పుడూ దీని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలకు పాలమూరు ప్రచారాస్త్రంగా మారగా.. రైతాంగానికి మాత్రం సాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పీఆర్ఎల్ఐ కేంద్రంగా పాలి‘ట్రిక్స్’ పాలక, ప్రతిపక్షాల పోటాపోటీ విమర్శలు 90% పనుల పూర్తి.. మిగిలిన 10% పూర్తి చేయాలి.. ఇదే డిమాండ్తో పోరుబాటకు బీఆర్ఎస్ సన్నాహాలు దీటుగా స్పందించేలా కాంగ్రెస్ కార్యాచరణ ‘స్థానిక’ ఎన్నికల వేళ రాజుకున్న వేడి -
వర్షం వస్తే మొత్తం ఆగాల్సిందే
వర్షం కురిసిందంటే మా మగ్గం మొత్తం తడిసిపోతుంది. దీంతో చీరలు నేయడం కదరదు. ఇప్పుడు మగ్గం గుంతల్లో నీరు నిలిచింది. ఆ నీటిని తోడుకునేందుకు సమయం సరిపోదు. ఎంత తోడినా ఊట గుంతలో మాదిరి నీరు వస్తూనే ఉంటాయి. అందులో వర్షం కురుస్తుండటంతో నీరు ఇంకా ఎక్కువగా చేరుతుంది. పది రోజులుగా పైసా పని లేకుండా కార్మికులం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాం. – హేమలత, చేనేత కార్మికురాలు, రాజోళి పండుగ ముందు కార్మికులకు నష్టమే ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కావడంతో కార్మికులకు చేతి నిండా పనుటుంది. కానీ వర్షాలు కురవడంతో మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. దీంతో పనులు నిలిచిపోయాయి. వర్షం నీరు చేరితే నీరు బయటకు వెళ్లి, మెటీరియల్ సెట్ అయ్యేందుకు రెండు రోజులు పడుతుంది. ఇలా వారంలో ఒక్కసారి వర్షం కురిసినా..పనులు నిలస్తున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కార్మికుల ఇబ్బందులను తొలగించాలి. – స్వాతి, చేనేత కార్మికురాలు రాజోళి ● -
సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
కేటీదొడ్డి: సరిహద్దు చెక్పోస్టులో అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండకూడదని ఎస్సీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను డీఎస్పీ మొగులయ్యతో కలిసి ఎస్పీ సందర్శించారు.పోలీసులకు పలు సూచనలు, సలహాలు చేశారు. శాంతిభద్రలలకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ రికార్డులను, యూనిఫాం టర్న్ ఔట్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ముఖ్యంగా రౌడీ షీటర్స్, అనుమానితులపై నిఘా ఉంచడంతో పాటు గ్రామాల్లోని ఎలాంటి సమాచారం అయినా తెలుసుకుని ఉండాలని సూచించారు. స్టేషన్ ఆవరణలో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూడడంతో పాటు ఎప్పటి కప్పుడు గ్రామాల్లో గస్తీ నిర్వహించి క్రైం రేటును తగ్గించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేయాలని, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా ఒకే చోటు పని చేసే ఉద్యోగులు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ టంగుటూరి శ్రీను, ఎస్సై శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ
● వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ● వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం గద్వాలటౌన్: ఆది పరాశక్తి... అశ్రిత పక్షపాతి అమ్మవారిని కొలిచేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను పట్టణంలోని పలు ఆలయాలలో అత్యంత వైభంగా చేపట్టారు. మూలప్రతిమలు, ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు, అభిషేకాలు చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. నీ చల్లని చూపులు మాపై ఉండాలంటూ భక్తులు ప్రణమిల్లారు. సాయంత్రం పలు చోట్ల భక్తిగీతాలపన, నృత్య ప్రదర్శనలు, కచేరీలు, అధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణ.. గద్వాల ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అమ్మవారు గజలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమిచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే, స్థానిక తాయమ్మ ఆలయంలో, కుమ్మరివీధిలో, అంబాభవాని దేవాలయంలో, వీరభద్రస్వామి ఆలయంలో, మార్కెండేయస్వామి ఆలయంలో అమ్మవారు వివిధ రూపాల అలంకరణలో దర్శనమిచ్చారు. బాలాజీవీధులలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేపట్టారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. విశేష పూజలు అందుకుంటున్న దుర్గామాత జములమ్మ ఆలయంలో గజలక్ష్మిదేవి అలంకరణలో అమ్మవారు -
పండ్ల తోటలను సంరక్షించుకోవాలి
అయిజ: పండ్ల తోటలను అనేక చీడపీడలు ఆశిస్తాయని, రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ పండ్లతోటలను సంరక్షించుకోవాలని హార్టికల్చర్ జిల్లా అధికారి ఎండీ అక్బర్ అన్నారు. బుధవారం మండలంలోని తుపత్రాల, బి.తిమ్మాపూర్, దేవబడ శివార్లలో బత్తాయి, దానిమ్మ, ఆయిల్ పాం తోటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్ల తోటలను జిల్లాలో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేశరని, మొక్కలు నాటిన సంవత్సరం వరకు అనేక రకాల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుందని అన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు పురుగుమందులను పిచికారీ చేయాలని సూచించారు. సూక్ష్మదాతువు పోషకాల లోపాలు మొక్కల్లో కనిపిస్తే ఆకులు రంగుమారుతాయన, గిడుసబారిపోతాయని, మెక్కల ఎదుగుదల లోపిస్తుందని వివరించారు. వాటిలోపాన్ని భర్తి చేసేందుకు ఫార్ముల4 లేక ఫార్ముల 6ను ఎంపిక చేసుకొని మొక్కలపై పిచిచారి చేయాలని, లేదా ఎరువుతోపాటు కలిపి మొక్కల వేర్లకు అందేలా చేయాలని రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి మహేష్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ఆలయాల నిర్మాణానికి విరాళం
గద్వాలటౌన్/అలంపూర్: జిల్లా కేంద్రంలోని నల్లకుంట శివాలయ పునర్నిర్మాణం రూ.2కోట్ల వ్యయంతో చేపట్టగా.. కాలనీ ప్రజలతో పాటు సమీప కాలనీల భక్తుల నుంచి ఆలయ కమిటీ సభ్యులు విరాళాలను సేకరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, రెడ్క్రాస్ సోసైటీ జిల్లా అధ్యక్షుడు అయ్యపురెడ్డి రూ.2,51,116ను విరాళంగా అందజేశారు. వీరితో పాటు మరికొందరు అలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వహకులు పులిపాటి వెంకటేష్, వెంకట్రాములు, గోపాల్, నల్లారెడ్డి, నాగరాజు శెట్టి, రాజు, బాలాజీ, బుచ్చన్న పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయానికి.. అలంపూర్ జోగుళాంబ ఆలయాలకు హైదరాబాద్కు చెందిన మహేష్కుమార్ రెడ్డి – రాధికా రెడ్డి దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. అర్చక స్వాములు వారికి తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ అధికారులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.4,321 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 79 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4321, కనిష్టం రూ.2720, సరాసరి రూ. 3821 ధరలు లభించాయి. అలాగే, 107 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టం రూ. 5930, కనిష్టం రూ. 5792, సరాసరి రూ. 5930 ధరలు పలికాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించేస్థాయికి ఎదగాలి వనపర్తిటౌన్: ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగం కోసం వెదుక్కోకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని స్థానిక జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వీఎస్ రాజు ఆకాంక్షించారు. బుధవారం కళాశాలలో డీసీ–ఎంఎస్ఎంఈ, న్యూఢిల్లీ సహకారంతో ఎంట్రప్రెన్యూర్షిప్పై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆలోచన ఉంటే సరిపోదని.. కృషి, పట్టుదల, నమ్మకం ఉండాలని, అన్ని ఉంటేనే జీవితంలో, సమాజంలో రాణించగలమన్నారు. ఎస్ఐసీ –టీఎస్సీ డిప్యూటీ మేనేజర్ అబ్దుల్ ఖాదర్ ఎంట్రప్రెన్యూర్షిప్, స్టార్టప్లపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ బీవీ రాంనరేష్ పాల్గొన్నారు. 26న ఉద్యోగమేళా కందనూలు: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో 26న ఉద్యోగమేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధి కారి రాఘవేందర్సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 50 ఉద్యోగాల భర్తీకి మేళా కొనసాగుతుందన్నారు. పదో తరగతి ఆర్హత కలిగి 25 నుంచి 32 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 95051 86201, 96669 74704 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఆగిన మగ్గం చప్పుడు!
చేనేత రంగంపై భారీ వర్షాల ప్రభావం వాతావరణం అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అడపాదడపా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.రాజోళి: నిత్యం చేతిలో పనితో హడావుడిగా ఉండే నేతన్నలు గత నెల రోజుల పైబడి పైసా పని లేక ఉ సూరుమంటున్నారు. ఉదయం లేచింది మొదలు, నిత్యం దారాల అల్లికతో రంగుల కూర్పులతో, మగ్గం చప్పుళ్లతో సాగే చేనేత కార్మిక జీవనం వర్షపు చినుకుల మధ్య ముందుకు సాగలేక స్తంభిస్తుంది. చేనేత మగ్గాలు కావడంతో గుంతల్లో నీరు చేరి పను లు చేసేందుకు వీలులేక దినదినగండంగా గడుపుతున్నారు. గత నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు చేనేత కార్మికులు మరింతగా ఇబ్బందిపడుతున్నారు. వర్షాకాలంలో సమస్య నిత్యకృత్యం.. గత నెలలో కురిసిన వర్షాల నుంచి బయటపడుతున్నామనుకులోగా మళ్లీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చేనేత కార్మికులు జీవనం నిలిచింది. జిల్లాలోని గద్వాల, అయిజ, గట్టు, రాజోళిలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వారంతా ఎక్కువగా చేతి మగ్గాలనే వాడుతున్నారు. దీని కోసం గుంతల ద్వారా మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ సమస్య నిత్యకృత్యమైంది. ప్రతి ఏడాది ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతున్నా అధికారులు, నాయకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో కార్మికులు వర్షాకాలం వస్తే బిక్కుబిక్కుమంటూ తమ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. జిల్లాలో చేనేత కార్మికులకు వర్షాకాలంలో ఇబ్బందులున్నప్పటికీ కొందరు కార్మికులు మరింత దుర్బర జీవితం గడుపుతున్నారు. గత నెలలో వర్షాలు జోరుగా కురవడంతో మగ్గాలు తడిసి పనులు నిలిచాయి. వాటి నుంచి బయట పడి పనులు చేసుకునేలోగా గత పది రోజలుగా వర్షాలు మళ్లీ కురుస్తుండటంతో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. ఊట గుంతల్లా.. మగ్గం గుంతలు రాజోళిలో చేనేత కార్మికుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. కొత్త రాజోళిలో నివసిస్తున్న చేనేత కార్మికులు ఉదయం నుంచి రాత్రి దాకా నీరు ఎత్తిపోయడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది. కొత్త రాజోళిలో మొత్తం పునరావాస గృహాలే ఉన్నాయి. కాగా ఆ గృహాలు మొత్తం నల్లభూమిలోనే నిర్మించారు. రెండు గదులతో నిర్మించిన ఈ గృహాల్లోనే కార్మికులు ఒక గదిలో మగ్గం గుంతను ఏర్పాటు చేసుకున్నారు. నల్లభూమి కావడంతో నీరంతా గుంతల్లోకి చేరి నిల్వ ఉంటుంది. దీంతో నేసిన చీరలు, నేసేందుకు సిద్ధంగా ఉన్న మెటీరియల్ మొత్తం తడిసిపోయి రెండు రకాలుగా కార్మికులు నష్టపోతున్నారు. దీనికితోడు సరైన డ్రైనేజీలు కూడా లేకపోవడం, వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వృథా నీరంతా ఊట రూపంలో మగ్గం గుంతల్లోకి చేరుతుంది. గుంతల నిండా నీరు చేరడంతో చీరలు నేసేందుకు వీలు కావడం లేదు. మగ్గం కూడా మొత్తం తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టేందుకు సమయం కావాలని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అది కూడా వీలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇళ్ల మధ్య సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో నీరు రోడ్లపైన, ఇళ్ల చుట్టుముట్టూ నీరు చేరి కార్మికులకు ఇబ్బందికరంగా మారుతుంది. దెబ్బ మీద దెబ్బ చేనేత కార్మికుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది. అసలే కరెంట్ మగ్గాల ద్వారా నేసిన చీరలకు గిరాకీ పెరిగి, చేనేత చీరల అమ్మకాలు తగ్గడంతో నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కావడంతో కార్మికులకు చేతి నిండా పనుంటుంది. ఆర్డర్లు ఎక్కువగానే తీసుకుంటారు. కానీ మగ్గం గుంతల్లో నీరు చేరడంతో పనులు నిలిచాయి. తడిచిన మగ్గం మెటీరియల్ ఆరి మళ్లీ పనులు మొదలుపెట్టాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంతలోగా వర్షం కురవకుంటే పర్లేదు కాని మళ్లీ వర్షం కురిస్తే పనులకు రోజుల తరబడి అంతరాయం కలుగుతుందని కార్మికులు అంటున్నారు. ఈ కారణంగా పండుగ సీజన్లో చీరల ఆర్డర్లు కోల్పోవడంతోపాటు.. ఇటు మెటీరియల్ పాడైపోయి.. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కరెంట్ మగ్గాలు అందించడంతోపాటు.. షెడ్లు నిర్మించేందుకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని కోరుతున్నారు. పాలమూరుకు క్రీడాకళ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం నుంచి రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్బాల్ పోటీలు నిర్వహించనున్నారు. –IVలో u మగ్గం గుంతల్లో రోజుల తరబడి నీరు చేరి పనులకు తీవ్ర ఆటంకం దసరా పండుగ ముందు కార్మికులకు దెబ్బ వర్షాల కారణంగా స్తంభించిన చేనేత కార్మికుల జీవనం -
ఆదిపరాశక్తికి విశేష పూజలు
గద్వాలటౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు లతితాదేవిగా, శ్రీశక్తిస్వరూపిణి తాయమ్మ ఆలయంలో అమ్మవారు శ్రీరాజ రాజేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు. జములమ్మ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో పూజలందుకున్నారు. పిల్లిగుండ్లలోని శ్రీశివకామేశ్వరి అమ్మవారు చంద్రవాహిని రూపంలో, మార్కెండేయస్వామి ఆలయంలో అమ్మవారు గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. అయ్యప్పస్వామి ఆలయంలో అమ్మవారిని మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లాభాలు
శాంతినగర్: డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులు లాభాల బాట పట్టవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. వడ్డేపల్లి మండలం కొంకల రైతువేదికలో మంగళవారం డ్రాగన్ ఫ్రూట్ సాగుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ సాగులో పాటించాల్సిన మెళకువలు, పంటకు ఆశించే చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను ఏఓ రాధతో కలిసి డీఏఓ పరిశీలించారు. వానాకాలం సాగు వివరాల నమోదుపై ఆరా తీశారు. అదే విధంగా శాంతినగర్లోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. గోదాంలో ఎరువుల బస్తాలు, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. డీఏఓ వెంట ఏఈఓలు విమల, వినోద్కుమార్ ఉన్నారు. -
ఇష్టారాజ్యం!
గద్వాలలో అనుమతులు లేకుండా వెలుస్తున్న ఆకాశహార్మ్యాలు ● ఇష్టానుసారంగా నిర్మాణాలు ● చోద్యం చూస్తున్న అధికారులు ● నోటీసులతోనే సరిపెడుతున్న వైనం ● మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్బోర్డు కాలనీలో నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనం ఇది. ఈ భవనానికి సరైన అనుమతులు లేవు. పైగా 20 ఫీట్ల సర్వీస్ రోడ్డుకు సమీపంలో నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ ఎలాంటి సెట్బ్యాక్ లేకుండా ఏకంగా సెల్లార్ నిర్మాణంతో కూడిన బహుళ అంతస్తు భవంతిని నిర్మిస్తున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గద్వాల: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీ శరవేగంగా విస్తరిస్తోంది. నగరాల్లో కనిపించే ఇంద్ర భవనాలు, ఆకాశహార్మ్యాలు ఇక్కడ కూడా వెలుస్తున్నాయి. అయితే ఈ నిర్మాణాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉంటుంది. ఇందుకు ఇటీవల వెలసిన బహుళ అంతస్తుల భవనాలే సాక్ష్యాలు. అదే విధంగా జిల్లా ఏర్పాటు అనంతరం జమ్మిచేడు, దౌదర్పల్లి గ్రామాలను గద్వాల మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో పట్టణ విస్తీర్ణం మరింత పెరిగింది. ప్రభుత్వ భూములు, 10 శాతం స్థలాలు రూ.కోట్లల్లో ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిపై కన్నేసి చెరపట్టారు. వీరికి కొందరు అవినీతి అధికారులు తోడు కావడంతో గద్వాల మున్సిపాలిటీ అక్రమ కట్టడాలకు నిలయంగా మారింది. 20 ఫీట్ల సర్వీస్ రోడ్డు కబ్జా.. ఆర్ఓబీ నుంచి జములమ్మ ఆలయం వరకు ప్రధాన రహదారి పక్కన భవిష్యత్ అవసరాలను దృిష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 20 ఫీట్ల సర్వీస్రోడ్డు నిర్మించింది. అయితే ఈ రోడ్డును ఆక్రమిస్తూ పలు నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం సర్వీస్ రోడ్డు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సెట్బ్యాక్ స్థలం వదిలేసి.. మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాని ఇవేవి అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం.. మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. గతంలో కొన్ని కులాలకు ఇష్టానుసారంగా 10శాతం స్థలాలను అప్పనంగా కట్టబెట్టారు. ఈ క్రమంలోనే జ్ఞానప్రభ కళాశాల యాజమాని రవీందర్రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. స్పందించిన హైకోర్టు.. 10శాతం స్థలాల్లో వాటికి నిర్దేశించిన నిర్మాణాలు మాత్రమే చేపట్టాలని, అందుకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో సదరు వ్యక్తి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
పకడ్బందీగా వానాకాలం ధాన్యం సేకరణ
గద్వాల: వానాకాలంలో రైతులు పండించిన వరిధాన్యం సేకరణకు అవసరమైన ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన వానాకాలం ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోళ్లను వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు ధాన్యం క్లీనర్, కాంటాలు, తేమ యంత్రాలు, అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా రైతుల వద్ద సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్లో నమోదు చేయాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్పోస్టులు ఏర్పాటుచేసి.. నిఘా ఉంచాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని.. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
నిధులు విడుదల చేశాం
2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాంపుల నిర్వహణ ప్రారంభమైంది. మొత్తం పీయూ పరిధిలో 100 యూనిట్లు ఉండగా వాటిలో మొదటి దశలో ఎంపిక చేసి 51 యూనిట్లకు రూ.17.75 లక్షలను విడుదల చేశాం. మరో 49 యూనిట్లకు వచ్చే నెల నిధులు కేటాయిస్తాం. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరడంతో పాటు ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ప్రవీణ, పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అవగాహన పెంపు విద్యార్థులకు యూజీ, పీజీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహిచడం వల్ల వారికి సామాజిక అంశాలపట్ల అవగాహన పెరుగుతుంది. క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు అక్కడే ఉండి ఉదయం వేలల్లో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు, రాత్రి వేళల్లో పలు అంశాలపై నాటికలు, కథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. – గాలెన్న, ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారి ● -
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
శాంతినగర్: జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మొగిలయ్యతో కలిసి సీఐ, ఎస్ఐ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అధికంగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్స్గా గుర్తించాలన్నారు. ప్రతి కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని.. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమో దు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. విలేజ్ పోలీసు అధికారులకు కేటాయించిన గ్రామాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి.. స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్ రికార్డులు పార్ట్–1, 5 పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సి బ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని ఎస్హెచ్ఓకు సూచించారు. ఎస్పీ వెంట సీఐ టాటాబాబు, ఎస్ఐ నాగశేఖర్రెడ్డి ఉన్నారు. -
సేవాస్ఫూర్తి.. చైతన్యదీప్తి
‘ఎన్ఎస్ఎస్’తో విద్యార్థి దశ నుంచే సమాజసేవ వారం రోజులు సామాజిక కార్యక్రమాలు క్యాంపులో వారం రోజుల పటు ఎంపిక చేసుకున్న గ్రామం, ప్రాంతంలో విద్యార్థులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. వారికి అధికారులు భోజనం, వసతి కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధులు శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం, చెత్తా చెదారాన్ని ఊడ్చడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం, ఉదయం వేళల్లో స్థానిక ప్రజలకు మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పిస్తారు. చివరి రెండు రోజులు గ్రామంలో ఉండే ప్రజల వివరాలు, వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాలు, తాగునీరు, అందుతున్న వైద్య సేవలు, అధికంగా ప్రబలుతున్న రోగాలు తదితర అంశాలపై సర్వే నిర్వహించి సంబంధిత నివేదికను గ్రామ, పీయూ అధికారులకు అందిస్తారు. నివేదికలో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ఆస్కారం ఉంది. పలు చోట్ల ప్రజలకు అవసరమైన మెడికల్ క్యాంపులను సైతం నిర్వహించి ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2025–26 విద్యాసంవత్సరానికిగాను ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఇటీవల నిధులు విడుదల చేశారు. ఈమేరకు ఇప్పటికే పలు చోట్ల క్యాంపులు ప్రారంభమయ్యాయి. పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు ఉండగా.. 45 మంది విద్యార్థులు (వలంటీర్ల)తో ఒక్కో యూనిట్ను ఏర్పాటు చేశారు. క్యాంపునకు అయ్యే ఖర్చుల కోసం ఒక్కో క్యాంపునకు రూ.35 వేల చొప్పున మంజూరు చేశారు. మొత్తం పీయూ పరిధిలో 100 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో మొదటి విడతగా 51 యూనిట్లకు అధికారులు రూ. 17.75 లక్షలను విడుదల చేశారు. ఇక్కడ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు అధికారులు ఎన్ఎన్ఎస్ ద్వారా సర్టిఫికెట్లను అందిస్తారు. వాటితో అడ్మిషన్లు తదితర విషయాల్లో ఎన్ఎన్ఎస్ సర్టిఫికెట్ కీలకంగా మారనుంది. 2025–26 క్యాంపుల నిర్వహణకు నిధులు విడుదల స్వచ్ఛత, పరిశుభ్రత, మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన జనాభా సంఖ్య, పిల్లలు, వ్యాధులు తదితర అంశాలపై సర్వే పీయూ పరిధిలో మొత్తం 100 యూనిట్లు -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
గద్వాల వ్యవసాయం: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతికి అనుగుణంగా పంటలు పండించడం ద్వార దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చునని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం గద్వాలలోని బ్రహ్మకుమారీస్ అమృత కుంజు భవనంలో ప్రపంచ సేంద్రియ వ్యవసాయ సాగు దినోత్సవాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల నేల, నీరు, పర్యావరణం కలుషితమవుతాయన్నారు. రసాయనిక మందుల వాడకం తగ్గించడం వల్ల జీవ వైవిధ్యాన్ని పెంచవచ్చునన్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండిన ఆహారంలో పోషక విలువలు అధికంగా ఉంటాయన్నారు. వ్యవసాయంలో పాడి పంటలను కలిపి నిర్వహించడం ద్వార ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చునని చెప్పారు. రైతులు దేశీయ ఆవులను పెంచాలని సూచించారు. వీటి పాలద్వార చేసే ఉత్పత్తులు మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. వర్మీ కంపోస్ట్ సులభంగా తయారు చేసుకోవచ్చునని వివరాలు ఆయన తెలియజేశారు. పంటల మార్పిడి విధానాలు పాటించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో సాగు మేలు కూరగాయలు, మిల్లెట్స్, పంటలు సేంద్రియ పద్ధతుల్లో పండించే విధంగా రైతులు సిద్ధం కావాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్పూర్తిగా నిలిచిన పలువరు రైతులను ఆయన ఈసందర్భంగా సన్మానించారు. వనపర్తి జడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు రాజవర్ధన్, జ్ఞానేశ్వర్రెడ్డి, నాగరాజు, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ అయ్యపురెడ్డి, బ్రహ్మకుమారీస్ సంస్థ వ్యవసాయ సాగు వ్యవస్థ తెలంగాణ ఇంచార్జి అరుంధతి, జిల్లా ఇంచార్జి మంజుల, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
శరన్నవరాత్రి వైభవం
● శైలపుత్రి, పార్వతీదేవిగా జోగుళాంబ, జములమ్మ అమ్మవార్ల దర్శనం ● కనులపండువగా ఉత్సవాలు ప్రారంభం ● ఆలయాల్లో మహిళల ప్రత్యేక పూజలు గద్వాలటౌన్/ఎర్రవల్లి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిచ్చారు. జోగుళాంబ అమ్మవారు శైలపుత్రిగా.. నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ అమ్మవారు పార్వతీదేవిగా.. బీచుపల్లిలోని దుర్గామాత బాలాత్రిపుర సుందరీదేవిగా.. గద్వాల కన్యకాపరమేశ్వరి అమ్మవారు వారాహిదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ధ్వజారోహణతో కార్యక్రమాలు వైభవంగా చేపట్టారు. మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. గద్వాల కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారిని పూల పల్లకిపై ఊరేగించారు. ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో కాళికాదేవి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ● బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో దుర్గామాత బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో, కోదండరామస్వామి ఆలయంలో జ్ఞాన సరస్వతీదేవి ఆదిలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మొదటిరోజు అర్చకులు సుప్రభాతసేవ, క్షీరామృతాభిషేకం, ఆరాధన, కుంకుమార్చన వంటి పూజలను నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అలాగే, శివాలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. -
ప్రత్యేక శిబిరాలు ప్రారంభం
మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు వ్యాధి నిర్ధారణ చేసి అన్ని మందులను ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా ఆస్పత్రిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సమస్యలపై సదస్సులు నిర్వహించి సూచనలు, అభిప్రాయాలను తెలియజేస్తారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 618 మంది మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ గుర్తించి మందులు సైతం అందజేస్తారు. మహిళలు సైతం శిబిరాలకు స్వచ్ఛందంగా వచ్చి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. -
అతివలకు ఆరోగ్య భరోసా
ఇటీవల స్వస్త్ నారీ సశక్త్, పరివార్ అభియాన్ ప్రారంభం ● గుండెజబ్బు, క్యాన్సర్, బీపీ, షుగర్ తదితర వాటిపై అవగాహన ● అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు ● ఉచితంగా మందుల అందజేత గద్వాల క్రైం: ఓ కుటుంబం శక్తివంతంగా ఉండాలంటే.. ఆ ఇంటి వెలుగు అయిన మహిళ ఆరోగ్యంగా ఉండాలి. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు చేపట్టిన ఏ రంగమైనా అభివృద్ధి పథంలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో మహిళలు, యువతులు, బాలికలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో వారి ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్త్ నారీ సశక్త్, పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళ – శక్తివంతమైన కుటుంబం) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆరోగ్య పరీక్షలు.. అవగాహన సాధారణంగా మహిళలు ఆరోగ్య సమస్యలపై ఇబ్బందులు పడుతుంటారు. అధిక రక్తపోటు, మధుమేహం, చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, దంత, రక్తహీనత, సీ్త్ర వ్యాధి సమస్యలు, క్యాన్సర్, కిశోరబాలికలు కౌమరదశలో వచ్చే సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో గైనకాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ ఫిజీషియన్, దంత, సంబంధిత తదితర ప్రత్యేక వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న మహిళలకు వైద్య సేవలను అందిస్తారు. పోషకాహార ఆవశ్యకతను వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లలు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. క్షయ వ్యాధి పరీక్షలు, క్షయ వ్యాధి రోగులకు సహకరించేందుకు నిక్షయ్ మిత్ర, సికిల్ సెల్ పరీక్షలతో పాటు కార్డులను అందజేస్తారు. గతంలో నమోదు కాని వారికి ఏబీహెచ్ కార్డు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారు. 10 శాతం చక్కెర, వంట నూనెలు తగ్గింపుతో ఊబకాయానికి చెక్ పెట్టడం వంటి అంశాలను వైద్యులు తెలియజేస్తారు. -
సద్వినియోగం చేసుకోవాలి
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రామాన్ని ప్రతి మహిళ, యువతి, బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు, కిశోర బాలికలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయినవారికి మందులు ఉచితంగా అందజేస్తాం. కంటి, చెవి, ముక్కు, చర్మ, సీ్త్ర వ్యాధి సమస్యలు, షుగుర్ తదితర పరీక్షలు చేపడతారు. ఈ కార్యక్రమం వచ్చే నెల 2వ తేది వరకు ఉంటుంది. – సిద్దప్ప, ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి ● -
స్థానిక పోరుకు సన్నద్ధం
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియపై కీలకమైన బాధ్యతలను కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులకు అప్పగించింది. రిజర్వేషన్ల ప్రక్రియపై మార్గదర్శకాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 77 జెడ్పీటీసీ, 802 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 1,705 గ్రామ పంచాయతీలు, 15,322 వార్డు స్థానాలు ఉన్నాయి. బీసీ కులగణన ఆధారంగా.. ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఫలితంగా గత ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలతోపాటు అదనంగా మరికొన్ని స్థానాలు పెరగనున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ క్రమంలో జనరల్ కేటగిరి స్థానాలు తగ్గే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే రిజర్వేషన్ స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. షెడ్యూల్డ్, ఏజెన్సీ ఏరియాలో ఎంపీటీసీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎస్టీ జనాభాలో 50 శాతం తగ్గకుండా చూస్తారు. అలాగే ఎస్టీ నోటిఫైడ్ గ్రామాల్లో సర్పంచులు, వార్డుమెంబర్ పదవులను పూర్తిగా వారికే కేటాయించనున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల నిర్వహణపై ఆశలు నెలకొన్నాయి. గ్రా.పంచా: గ్రామ పంచాయతీలుజిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ నాగర్కర్నూల్ 20 214 మహబూబ్నగర్ 16 175 వనపర్తి 15 136 జోగుళాంబ గద్వాల 13 141 నారాయణపేట 13 136 రెండు రోజుల్లోనే ప్రక్రియ.. గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లను కేటాయించే బాధ్యతలను ప్రభుత్వం సంబంధిత అధికారులకు అప్పగించింది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కేవలం రెండు రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, జెడ్పీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఖరారు చేయనున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్ కేటాయించనున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను ఆర్డీఓ ఖరారు చేయనుండగా.. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా మండలాల ఎంపీడీఓలు కేటాయించనున్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా పూర్తయ్యింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. ఓటరు జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ పూర్తి కాగా.. బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్ ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో పంచాయతీలు, వార్డుల వివరాలు ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల కీలకంగా మారనున్న కేటాయింపు ప్రక్రియ కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓలకు బాధ్యతల అప్పగింత -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
పోలీస్ గ్రీవెన్స్కు 16 అర్జీలు పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 16 అర్జీలు అందాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా ఫిర్యాదులు అందాయన్నారు. గద్వాల/గద్వాల క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుకు ప్రాధాన్యతినిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి 41 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. వాటిని ఆయా శాఖలకు పంపి పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. పరిష్కారం కాని యెడల అందుకు సంబంధించి కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలని చెప్పారు. న్యాయం చేయరూ.. ఇజ్రాయిల్ దేశంలో తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ధరూరు మండల కేంద్రం పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు చిట్టిబాబు మరో తొమ్మిదిమంది కోరారు. ఈమేరకు వారు సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్బంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇజ్రాయిల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందిన పి.చిట్టిబాబు రూ.5.50లక్షలు, బి.రత్నకుమార్ రూ.7లక్షలు, కె.బేబికిషోర్ రూ.7.50లక్షలు, జె.భారతి రూ.7.50లక్షలు, కె.ప్రభుదాసు రూ.7.50లక్షలు, మేరీ రూ.2.50లక్షలు, ప్రసాద్ రూ.7.50లక్షలు, సునిల్ రూ.7.50లక్షలు, సూజాత రూ.7.50లక్షలు, మేరికుమారి రూ.7.50లక్షలను పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్ తమతో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు మీడియా ముందు వాపోయారు. తీసుకున్న డబ్బులు ఇస్తానని చెప్పి అందుకు సంబంధించి చెక్కులు ఇచ్చినట్లు, అయితే ఆ చెక్కులు బ్యాంకులో డ్రా చేసుకోవటానికి వెళితే అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో వెనుదిరిగినట్లు తెలిపారు. దీనిపై పాస్టర్ అబ్రహాం అలియాస్ సుదర్శన్ను అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తీసుకున్న డబ్బును తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
బీచుపల్లి పుణ్యక్షేత్రంలో అమావాస్య పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆలయాల్లో భక్తులు ఆదివారం మహాలయ అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే పెద్ద ఎత్తున ప్రజలు బీచుపల్లికి చేరుకొని అభయాంజనేయస్వామిని, శివాలయం, కోదండరామస్వామి, సరస్వతీదేవి ఆలయాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంతో పాటుగా కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవోలు రామన్గౌడ్, సురేంద్ర రాజు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పది రోజుల పాటు వైభవంగా జరిగే ఇ ట్టి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకోవాలని కోరారు. -
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
● మహాలయ అమావాస్యతో ప్రత్యేక పూజలు ● చండీహోమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న వైనంఅలంపూర్: దసరా సెలవులు ప్రారంభం కావడం.. అందులోనూ మహాలయ అమావాస్య రావడంతో జోగుళాంబ క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. ఆదివారం క్షేత్రంలోని అన్ని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వారిని దర్శించుకొని అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు. భక్తిశ్రద్ధలతో చండీహోమాలు.. అమావాస్య కావడంతో జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో చండీ హోమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రాకపోకలు కొనసాగగా.. క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తుల రాకతో ప్రధాన రహదారి రద్దీగా మారింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టారు. గద్వాల ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుటుంబసమేతంగా జోగుళాంబ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలబ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకస్వాములు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేసి అశీర్వచనం పలికారు.