దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
గద్వాలన్యూటౌన్: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని ఐసీఈయూ గద్వాల బ్రాంచ్ సెక్రటరీ బంగి రంగారావు అన్నారు. గురువారం స్థానిక ఎల్ఐసీ కార్యాలయ ఆవరణలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర విధానాలను నిరసిస్తూ చేపట్టనున్న సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


