breaking news
Jogulamba District Latest News
-
జనజాగరణ యాత్రను విజయవంతం చేయాలి
గద్వాల న్యూటౌన్: సీపీఎస్ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి జరిగే జనజాగరణ యాత్రను విజయవంతం చేయాలని సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సింహ కోరారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఆవరణలో యాత్ర వాల్పోస్టర్లు విడుదల చేసి మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఐదేళ్ల కోసం ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు జీవితాంతం పెన్షన్ ఉంటుంది.. కానీ, 30 ఏళ్లపాటు సేవలందించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జనజాగరణ యాత్రకు రాష్ట్ర నాయకులు వస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం విష్ణు, నాయకులు ఆంజనేయులు, మురళీధర్రెడ్డి, రాఘవేంద్ర, షేక్షావళి, కృష్ణ, గజేంద్రనాథ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం సభలో ఫ్లెక్సీల రగడ
మల్దకల్: మండలంలోని కుర్తిరావులచెర్వు గ్రామంలో మంగళవారం విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కూడిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గం ఏర్పాటు చేసింది. అయితే టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత వర్గం వారు బహిరంగ సభ ప్రాంతంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా ఎమ్మెల్యే వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐలు ఇరువర్గాల వారితో మాట్లాడి అదుపుచేయడంతో గొడవ సద్దుమణిగింది. -
అవస్థల ప్రయాణం
అయిజ: దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే.. రోడ్డు, రవాణా సౌకర్యం బాగుండాలి. కానీ, జోగుళాంబ గద్వాల జిల్లాలో రహదారుల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పల్లె దారులు పక్కనపెడితే.. అంతర్రాష్ట్ర రహదారులు సైతం అధ్వానంగా మారడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక్కడి అంతర్రాష్ట్ర రహదారులపై చాలా చోట్ల హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు వర్షం కురిసిన సందర్భాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయి.. అవాంతరాలు సృష్టిస్తున్నాయి. అలాగే అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం రాని పరిస్థితి నెలకొనడంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తున్న సంఘటనలు లేకపోలేదు. ప్రమాదకర కాజ్వేపైనే.. ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో అనుసంధానం చేసే వాటిలో కీలకమైనవి అంతర్రాష్ట్ర రహదారులు. అయితే అయిజ సమీపంలోని పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడంపై శిథిలావస్థకు చేరి రంద్రాలు పడిన కాజ్వేపైనే ప్రజలు ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే మేడికొండ రోడ్డు సమీపంలోని వాగుపై హైలెవల్ బ్రిడ్జి పనులు సగంలోనే నిలిచిపోయాయి. ఈ రెండు హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతోపాటు రవాణా, ఆర్థిక, సామాజిక, భద్రతా కోణాలలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
నేడు ఉమ్మడి పాలమూరుకు సీఎం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. మొదట పాలమూరు సమీపంలోని దివిటిపల్లిలో ఉన్న అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను, అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను మహబూబ్నగర్, వనపర్తి కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్ సురభి వేర్వేరుగా వెల్లడించారు. సీఎం పర్యటించనున్న ప్రదేశాలను మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో వేదిక (డయాస్), సీటింగ్, రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలపై మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులతో సమీక్షించారు.ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్, వైద్య బృందాల ఏర్పాటు, అగ్నిమాపక సిబ్బంది మొహరింపుపై పోలీస్, రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, అతిథుల స్వాగతం నుంచి వీడ్కోలు వరకు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, చిన్న లోటు కూడా ఉండకూడదు అని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్పీ డి.జానకి, ఆర్డీఓ నవీన్, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు. కొత్తకోటలో సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ పాఠశాలను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో పాటు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునితారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, సీఎం సెక్యూరిటీ ఇన్చార్జ్ శ్రీధర్ తదితరులు పరిశీలించి.. అన్నిఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటన షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 1.15 గంటలకు దివిటిపల్లికి చేరుకుంటారు. 1.20 నుంచి 2.20 గంటల వరకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవం, ప్లాంట్ పర్యటన, ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి 2.45 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
జోగుళాంబ గద్వాల
అధ్వాన దారుల్లో.. వంతెన నిర్మాణానికినోచుకోని కర్నూలు రోడ్డు ● పులికల్ రోడ్డుపై నిలిచిపోయిన హైలెవల్ బ్రిడ్జి ● మూడు రాష్ట్రాల ప్రజలకు తప్పని రాకపోకల తిప్పలు ● వర్షాకాలంలో మరింత జటిలమవుతున్న సమస్య ● ఏళ్లతరబడిగా పట్టించుకోని పాలకులు, అధికారులు బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026 -
అంబులెన్స్లకు ఆటంకమే..
హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ట్రాఫిక్జాం కారణంగా ఇంధన వినియోగం పెరుగుతోంది. వాహనాలు ఎక్కువ సమయం రోడ్డుపై గడపడంతో వాటి నిర్వహణ ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. వ్యాపారులకు సరుకుల రవాణా ఆలస్యం కావడంతో ఆర్థిక నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా అంబులెన్స్ వాహనాలకు ఆటంకం కలుగుతుంది. – నజీర్, అయిజ సామాజిక ప్రభావం.. అంతర్రాష్ట్ర రహదారులపై హైలెవల్ బ్రిడ్జిలు లేకపోవడంతో స్థానిక సమాజాల మధ్య అనుసంధానం తగ్గిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు ప్రయాణం కష్టతరమవుతుంది. విద్య, ఉపాధి, వైద్య సౌకర్యాలకు ఆటంకం ఏర్పడుతోంది. ముఖ్యంగా అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు రాలేకపోవడంతో ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. – రవీంద్రనాథరెడ్డి, అయిజకాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే.. హైలెవల్ బ్రిడ్జి నిర్మా ణం సగభాగం పూర్తిచేసినా సరే వాటికి సంబంధించిన బిల్లు లు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు పనులు మధ్యలో నిలిపివేస్తున్నారు. అయిజ సమీపంలోని కాజ్వే నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పను లు ప్రారంభిస్తాం. – అల్తాఫ్, ఆర్అండ్బీ ఏఈ, అయిజ ● -
ప్రజా రంజక పాలనే ధ్యేయం
రాజోళి/ మల్దకల్: రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన వడ్డేపల్లి మండలం జూలకల్లో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పచ్చర్ల, మేడికొండ గ్రామాల్లో నెలకొల్పిన 33/ 11కేవీ సబ్స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. మల్దకల్ మండలంలోని కుర్తిరావులచెర్వు గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతోపాటు, గట్టు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకు ముందు శాంతిగనర్లో ఏర్పాటు చేసన హెలీప్యాడ్ వద్ద డిప్యూటీ సీఎంకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం డీడీలు చెల్లించిన రైతులందరికీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసి అందజేస్తున్నామన్నారు. అలాగే పేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, 1.6 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం ఎంపీ మల్లు రవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి కేకు కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు సరిత, గట్టు తిమ్మప్ప, విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్లు మధన్మోహన్, నర్సింగరావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, ఎస్ఈ నాగరాజు, ఏడీఈ గోవిందు, డీఎస్పీ మొగులయ్య, నాయకులు పటేల్ ప్రభాకర్రెడ్డి, సత్యారెడ్డి, విక్రమసింహారెడ్డి, రమేష్రెడ్డి పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వర్చువల్ పద్ధతిలో విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి -
పీజీఐ–డీలో సత్తా
ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన నాగర్కర్నూల్ కల్వకుర్తి టౌన్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ ) 2025–26 నివేదికలో ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్ జిల్లా మరోసారి ప్రత్యేకత చాటుకుంది. పాఠశాల విద్యా ప్రమాణాలను 6 కీలక అంశాలపై విశ్లేషించి రూపొందించిన నివేదికలో మొత్తం 600 మార్కులకు గాను 333 మార్కులు సాధించి.. ప్రచేష్ట–1 గ్రేడ్ దక్కించుకుంది. అలాగే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు బార్డర్ మార్కులతో ప్రచేష్ట–1లో నిలవగా.. మహబూబ్నగర్ మాత్రం ప్రచేష్ట–2కే పరిమితమైంది. ఒకే విధమైన ప్రమాణాలతో.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఒకే విధమైన ప్రమాణాలతో అంచనా వేయడానికి కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ)ను ప్రవేశపెట్టింది. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దేందుకు ఈ సూచికను రూపొందించారు. ప్రతి జిల్లాకు 600 మార్కుల స్కోరు కేటాయించి వివిధ ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఆరు అంశాలే కీలకం.. జిల్లాల పనితీరులో అభ్యసన ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక వసతులు– విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత– విద్యార్థుల సంక్షేమం, డిజిటల్ లెర్నింగ్, పాలన– నిర్వహణ అనే ఆరు ప్రధాన విభాగాల్లో పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి నిర్దిష్ట సూచికలు ఉండగా.. వాటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అధికారిక గణాంకాలే.. పాఠశాల విద్యకు సంబంధించిన సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయిల్లోని యూడైస్ ప్లస్, ఎన్ఏఎస్, పీఎం పోషణ్, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తదితర అధికారిక డేటాబేస్ల నుంచి సేకరిస్తారు. రాష్ట్రాలు నివేదించిన అధికారిక సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ పరిశీలించి తుది స్కోర్లు ప్రకటిస్తుంది. అందువల్ల ఈ గ్రేడింగ్ పూర్తిగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ఆధారంగానే ఉంటుంది. ప్రమాణాల మెరుగుకు.. ఈ సూచిక ద్వారా ఏ జిల్లా ఏ రంగంలో వెనకబడి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లాకు అభ్యసన ఫలితాల్లో మంచి మార్కులు వచ్చినా, డిజిటల్ లెర్నింగ్ లేదా మౌలిక వసతుల్లో తక్కువ స్కోరు వస్తే.. ఆయా రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాల మధ్య పోటీ పెరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదికలో నాగర్కర్నూల్ ఉమ్మడి పాలమూరులో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ.. డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, మౌలిక వసతుల విభాగాల్లో స్కోరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తే ‘ప్రచేష్ట–1’ నుంచి ‘ఉత్తమ్’ గ్రేడ్ సాధించే అవకాశం ఉంది. బార్డర్ మార్కులతో ‘ప్రచేష్ట–1’ గ్రేడ్ సాధించిన పేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు ‘ప్రచేష్ట–2’కే పరిమితమైన మహబూబ్నగర్ బోధన, అభ్యసన ఫలితాలు, పాలనలో మెరుగైన పనితీరు మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్లో మెరుగుదల అవసరం -
ఎడతెగని కష్టాలు..
మూడు విడతల్లో యూరియా బుకింగ్ ● ప్రతి విడతకు 20 రోజుల వ్యవధి ● నిబంధనల్లో మార్పులు, చేర్పులతో ఇక్కట్లు ● యాప్ వాడలేని గ్రామీణ రైతుల అవస్థలు ● కౌలుదారుల పరిస్థితి మరింత దయనీయం 20 రోజులు ఆగాలంటే ఎలా ప్రభుత్వం తెచ్చిన కొత్త యూరియా బుకింగ్ విధానంపై గ్రామీణ రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా వద్దనేమో స్మార్ట్ ఫోన్ లేదు. యాప్ అంటే ఏంటో తెలియదు. దీనికితోడు ఒకసారి యూరియా తీసుకుంటే తర్వాత 20 రోజులు ఆగాలంటే ఎలా. పాత పద్ధతిలోనే డీలరు దగ్గర నేరుగా అమ్మకాలు చేయాలి. – బీచుపల్లి, రైతు, గోకులపాడు గందరగోళంగా ఉంది.. మా ఊరిలో సిగ్నల్స్ సమస్య. నా కొడుకు ఊరిలో లేకపోతే బుకింగ్ చేసుకోలేం. మూడు విడతల్లో అంటే గందరగోళంగా ఉంది. డీలర్ల ద్వారా త్వరగా యూరియా తీసుకునేవాళ్లం. 20 ఎకరాలకు పైగా భూమి ఉంది. కౌలుకు పొలం తీసుకున్నా యూరియా యాప్ ద్వారా బుక్ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నాం. – గొల్ల వెంకట్రాములు, రైతు, మానవపాడు ఆఫ్లైన్లో ఇవ్వాలి యూరియా పంపిణీలో పారదర్శకత కోసం తెచ్చిన యాప్ విధానం రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతుకు యాప్ వాడడం రాదు. ప్రతి సొసైటీలో ఒక సహాయ కేంద్రం పెట్టి ఆఫ్లైన్ బుకింగ్ ఇవ్వాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. – పుల్లన్న, రైతు, బైరాపురం మానవపాడు: అన్నదాతలకు సాగు పనులు మొదలుకొని.. విత్తనాల సేకరణ, యూరియా కొనుగోళ్లు, పంటలకు సాగునీరు, ధాన్యం అమ్మకాల వరకు ఇలా అడుగడుగునా కష్టాలు ఎడతెగడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీ విధానంలో తీసుకువచ్చిన కొత్త నిబంధనలు గ్రామీణ రైతులకు మరింత ఇబ్బందికరంగా మారాయి. యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ ఆధారిత బుకింగ్ విధానం రైతులకు శాపంగా మారింది. కొత్త నిబంధనలు ఒకవైపు.. మరోవైపు గ్రామీణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల మూడు విడతల్లో యూరియా బుకింగ్ విధానాన్ని అమలు చేసింది. భూమి విస్తీర్ణం ఆధారంగా బుకింగ్ చేయాల్సి ఉండగా.. 2 ఎకరాల వరకు ఉన్న రైతులు ఒకేసారి పూర్తి యూరియా బుక్ చేసుకోవచ్చు. 2–5 ఎకరాల రైతులు 50– 50 శాతం చొప్పున రెండు విడతల్లో, 5 ఎకరాల పైబడిన వారు 40– 30– 30 శాతం చొప్పున మూడు విడతల్లో బుక్ చేసుకోవాలి. అత్యంత కీలకమైన నిబంధన ఏమిటంటే ప్రతి విడతకు 20 రోజుల వ్యవధి తప్పనిసరి. ఈ గ్యాప్తో పంటకు సరైన సమయంలో యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరత లేకుండా అందరికీ సమానంగా అందించే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసినా అవి క్షేత్రస్థాయి ఆచరణలో కష్టంగా మారాయి. 13 వేల టన్నుల నిల్వలు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాకు 24 వేల టన్నుల యూరియా అవసరమవుతందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం జిల్లాలో 13 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప తెలిపారు. ప్రస్తుతం వానాకాలంలో యూరియా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని పేర్కొన్నారు. అలాగే ఎల్నినో దృష్ట్యా పంటల సాగు విస్తీర్ణం తగ్గితే యూరియా అమ్మకాలు తగ్గుతాయని భావిస్తున్నారు. -
హైవే కష్టాలు.. ఇంకెన్నాళ్లు?
ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఎన్హెచ్–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలం శేర్పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్, రాజాపూర్, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట ప నులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జ రిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరి గే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పా టించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏ ర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్ర మంలో ఢీకొంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాలానగర్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల నిలిచిన వాహనాలు (ఫైల్) దుమ్ముతో తంటాలు బ్రిడ్జి పనులు మొదలైనప్పటి నుంచి విపరీతమైన దుమ్ము షాపులోకి వస్తుంది. దీంతో నిత్యం దుమ్మును క్లీన్ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ సమస్యలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – అనూష, బాలానగర్ ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాం.. బాలానగర్లో ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. వారంలో రెండుమూడు రోజులు మా సొంత గ్రామం ఎన్మన్గండ్లకు వచ్చి వెళ్తుంటాను. బాలానగర్ వచ్చిందంటే చాలు ట్రాఫిక్లో చిక్కుకొని సమయం అంతా వృథా అవుతోంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి. – శేఖర్రెడ్డి, వాహనదారు ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై అండర్ బ్రిడ్జి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం బాలానగర్, రాజాపూర్ వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా సాగుతున్న పనులు హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం గంటల తరబడి ట్రాఫిక్లోచిక్కుకొని వాహనదారుల అవస్థలు ఎక్కడెక్కడ ఎలా.. బాలానగర్, రాజాపూర్ వద్ద ప్రతిరోజు అరగంట, గంటపాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ అండర్ బ్రిడ్జిల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూసాపేట మండలం వేముల స్టేజీ వద్ద ఏడాదిన్నర కిందట పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికితోడు ఇక్కడ సర్వీస్ రోడ్లను అరకొరగా చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ వైపు ఒక సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తే దుమ్ముతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అలాగే హనుమాన్ విగ్రహం వద్ద కూడా సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. పోల్కంపల్లి స్టేజీ, వెల్టూరు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్ల పనులే చేయిస్తున్నారు. ఇక్కడ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే వెళ్తున్నాయి. కనిమెట్ట వద్ద సర్వీస్ రోడ్లు పూర్తి కాగా అండర్ బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వాహనాలు సర్వీస్ రోడ్లపైనే వెళ్తున్నాయి. భూత్పూర్ మండలం శేర్పల్లి(బీ) వద్ద కర్నూ లు వైపు సర్వీస్ రోడ్డు పూర్తికాగా.. వాహనాలు దానిపైనే వెళ్తున్నాయి. హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదు. అండర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
బాలబ్రహ్మేశ్వరుడికి ఆరుద్రోత్సవం
అలంపూర్ రూరల్: నవబ్రహ్మ ఆలయాల దివ్యధామం అలంపూర్ క్షేత్రంలోని బాలబ్రహ్మేశ్వరస్వామికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం ఆరుద్రోత్సవం వైభవంగా నిర్వహించారు. అలాగే రథంలో ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ఆలయం చుట్టు ప్రదక్షిణలు గావించారు. అనంతరం ఉమామహేశ్వరస్వామి దేవస్థానం వారిచే జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారని అలంపూర్ ఆలయ ఈఓ దీప్తిరెడ్డి తెలిపారు. -
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన
● రహదారుల నిర్మాణానికి పెద్దఎత్తున నిధుల విడుదల ● రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ● రూ.339.39 కోట్లతో హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన ధరూరు: రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా చేపట్టే రోడ్ల మరమ్మతు, విస్తరణకు సంబంధించి రూ.339.39 కోట్లతో చేపట్టే హ్యామ్ రోడ్ల పనులకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధరూరులో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడంతోపాటు 3.18 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. గృహజ్యోతి పథకంతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. కోటి మంది మహిళలకుకోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్రోలు బంకుల ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల కేటాయింపు వంటివి కల్పిస్తున్నామన్నారు. ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడంతో మహిళా సంఘాలకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచడం ద్వారా కరువును పారద్రోలి తాగు, సాగునీటిని అందించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తయితే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగు నీరందించవచ్చని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఆడపిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలన్నారు. మహిళా, రైతు, యువజన సంఘాల అభివృద్ధిలో ప్రతిఒక్కరు భాగస్వామలు కావాలన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. గతంలోనూ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, నాయకులు సుదర్శన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
వెట్రన్కు అడుగులు
● ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని వైనం ● నిధుల కొరత సాకుతో చేతులు దులుపుకొంటున్న అధికారులు ● ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు సీఎం రేవంత్రెడ్డి ఆదేశానుసారం పాలమూరు ప్రాజెక్టు పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఈ నెలలోనే కచ్చితంగా ఎల్లూరు పంపుహౌజ్లోని నాలుగు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు చేపట్టాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. సోమవారం చేపట్టే వెట్రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితే మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతలు జరుగుతాయి. మిగతా మూడు మోటార్లకు వెంటనే డ్రైరన్ పూర్తిచేసేలా అధికారులు కృషిచేస్తున్నారు. ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టి నార్లాపూర్ రిజర్వాయర్ను నింపుతామని, కాల్వల తవ్వకాలు పూర్తయిన వెంటనే నీటిని ఏదులకు.. అక్కడి నుంచి వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు తరలిస్తామని అధికారులు తెలిపారు. కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్హౌజ్లో నీటి ఎత్తిపోతలకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆదివారం రాత్రి మొదటి పంప్హౌజ్ను పరిశీలించి సోమవారం వెట్రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2023 సెప్టెంబర్ 3న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ అధికారులు మొదటి పంపు డ్రైరన్ చేపట్టగా.. పంపు మోటార్ పరీక్ష విజయవంతం కావడంతో అదే నెల 16న అధికారికంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలపాటు మొదటి పంపు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. కొన్నిరోజుల తర్వాత మరోసారి ఎత్తిపోతలు చేపట్టి, మొత్తం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తర్వాత వేర్వేరు కారణాలతో నీటి ఎత్తిపోతలు ఆగిపోగా.. మళ్లీ ఇన్నాళ్లకు నీటి పంపింగ్కు చర్యలు మొదలయ్యాయి. ప్రాజెక్టులో మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్లో మొదట 145 మెగావాట్ల సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత దాన్ని 8కి కుదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు మోటార్లు బిగించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2 మోటార్లను బిగించింది. తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు, పాలమూరు ప్రాజెక్టు ద్వారా సాగునీటి ఎత్తిపోతలకు కేఆర్ఎంబీ అనుమతి ఇవ్వకపోవడం వంటి కారణాలతో మిగిలిన మోటార్ల ఏర్పాటు పెండింగ్లో పడింది. దీంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లతోనే ప్రాజెక్టును రన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ అసంపూర్తి పనుల కారణంగా నీటి ఎత్తిపోతలు జరగలేదు. ఎల్లూరు పంప్హౌజ్ అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా పనులు సుదీర్ఘకాలం కొనసాగి.. ఇటీవలే పూర్తయ్యాయి. అలాగే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాల్వ తవ్వకాలు 2 కి.మీ., మేర కుడికిళ్ల, తిర్నాంపల్లి గ్రామాల సమీపంలో ఆగిపోయాయి. ఈ కాల్వ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినా.. పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా నార్లాపూర్ రిజర్వాయర్ను నింపినా ఏదులకు తరలించేందుకు మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. గత మే, జూన్ నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పనుల గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ పార్టీకి చెందిన మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రాజెక్టును సందర్శించి.. బీఆర్ఎస్ వల్లే ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయిందని ప్రత్యారోపణలు చేశారు. బీఆర్ఎస్కు రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఏకంగా సీఎం రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గత జూన్ 4, 5 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలోనే వచ్చే డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి.. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేలా అనుమతులు తీసుకువస్తామని ప్రకటించారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పంప్హౌజ్ ఒక్కో మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు పాలమూరు పంప్హౌజ్లో ఏర్పాటు చేయాల్సిన మోటార్లు 8నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు ఒక మోటార్ ద్వారా రోజూ ఎత్తిపోసే నీళ్లు 3,000 క్యూసెక్కులు నేడు ఎల్లూరు పంపుహౌజ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు సీఎం ఆదేశాలతో వేగం పుంజుకున్న పనులు మరోవైపు.. ఇంకా అసంపూర్తిగానే కాల్వలు -
పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం
మల్దకల్/కేటీదొడ్డి/గట్టు: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలం దాసర్పల్లి, కేటీదొడ్డి మండలం మైలగడ్డ, గట్టు మండలం తుమ్మలచెరువు, ఆలూరు గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను మంజూరు చేయగా.. 2వేలకు పైగా నిర్మాణాలను పూర్తిచేసుకొని లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. విడతల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచులు రాజు, వెంకటేశ్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, ఉరుకుందు, చంద్రశేఖర్, ప్రభాకర్రెడ్డి, రాజారెడ్డి, రమేశ్రెడ్డి, భరత్రెడ్డి, చంద్రశేఖర్, జగదీశ్వర్రెడ్డి, మేసీ్త్ర తిమ్మప్ప పాల్గొన్నారు. -
వరుస హత్యల కలకలం
నడిగడ్డలో ఏడు రోజుల వ్యవధిలోనే నలుగురి హత్య ● రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందం ● నిందితుల కోసం గాలింపు చర్యలు ● జిల్లాలో హాట్టాపిక్గా మారిన ఘటనలు సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026–8లో uనేడు మంత్రుల పర్యటన జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/ధరూరు: ఉమ్మ డి జిల్లాలో సోమవారం ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.1,775.51 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ఫేజ్–1 కింద చేపట్టనున్న నాలుగు ప్యాకేజీల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్లో రూ.573 కోట్లతో మహబూబ్నగర్–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని గద్వాల– రాయచూర్ రహదారిపై రూ.339.39 కోట్లతో మహబూబ్నగర్–2 ప్యాకేజీ పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం వనపర్తిలోని జడ్చర్ల రోడ్డులో రూ.359.09 కోట్లతో వనపర్తి–2 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎల్లూరు వద్ద కొల్లాపూర్– మొలచింతలపల్లి మార్గంలో రూ.504.03 కోట్లతో వనపర్తి–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రేపు సీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజ ర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. సీతారాముల కల్యాణ వేడుకను కనులారా తిలకించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. జనజాగరణ యాత్రకు సంపూర్ణ మద్దతు గద్వాలన్యూటౌన్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 17న చేపట్టనున్న జనజాగరణ యాత్రకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్ ఎస్టీయూ, టీఎన్జీఓ, తపస్, టీటీయూ, పీఆర్టీయూ, ఎస్జీటీయూ, టీపీఎస్ఏ, టీపీఆర్టీయూ, జీటీఏ, యూటీఎఫ్, బీసీటీఏ, టీపీఎస్ఏ, టీఎస్టీయూ, పీఎస్ హెచ్ఎం, గిరిజన ఉపాధ్యాయ సంఘం, డీటీఎఫ్ తదితర సంఘాల నాయకులను కలిసి.. 17న స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద నిర్వహించనున్న జనజాగరణ యాత్రకు మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. ఇందుకు అన్ని సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయని చెప్పారు. అనంతరం జనజాగరణ యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ నాయకులు బుచ్చన్న, నర్సింహులు, ఎల్లస్వామి, ప్రతాప్, మస్తాన్ వలీ, చంద్రశేఖర్, రాజు పాల్గొన్నారు. గద్వాల క్రైం: నడిగడ్డలో ప్రతీకార దాడులు, వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కేవలం ఏడు రో జుల వ్యవధిలోనే నలుగురు హత్యకు గురికావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఏళ్ల తరబ డి మనసులో మొలకెత్తిన విషభీజం.. ప్రత్యర్థి చేసిన గుండెగాయానికి బదులు తీర్చుకునే క్రమంలో దారుణాలు చోటు చేసుకోవడం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. వరుస హత్యలన్నీ ప్రతీకారంతోనే జరగడంతో జిల్లా పోలీసుశాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాలతో గాలింపు.. హత్యలకు పాల్పడిన నేరస్తులను పట్టుకునేందుకు పోలీసుశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. హత్యకు గల కారణాలను బాధితుల ద్వారా తెలుసుకుని ఆ దిశగా విచారణ చేపడుతోంది. క్లూస్ టీం, సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, ఫ్రింగర్ ప్రింట్స్ విభాగాలతో నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. హత్య ఘటనలో ఎవరి ప్రమేయం ఉంది.. ఎంతమంది కలిసి హత్య చేశారు.. లేక సుఫారీ గ్యాంగ్లతో హత్యలు చేయించారనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కేసుల ఛేదనలో విచారణ అధికారులకు సైతం కంటిమీద కునుకు లేకుండా పోతోందని తెలుస్తోంది. ● గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు శంకరమ్మ (65), అదే కాలనీకి చెందిన సమీప బంధువు (వరుసకు కుమారుడు) మధ్య ఏడాది క్రితం వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తిపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై ధ్వేషం పెంచుకు న్న సదరు వ్యక్తి.. ఈ నెల 11న మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న శంకరమ్మపై పదునైన ఆయుధంతో దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. రేపు అప్రెంటిస్షిప్ మేళా కందనూలు: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఈ నెల 14న వృత్తివిద్య కోర్సుల అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94929 92047 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు. -
రాజకీయాల్లో హుందాతనం కరువైంది
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వనపర్తి రూరల్: నేటి రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన హుందాతనం కనబడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మూడురోజులుగా జరిగిన ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ ముఖఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్ష పార్టీ లు తమకున్న హోదాను మరిచి ఇష్టానుసారంగా తిట్టుకోవడం, అసభ్యంగా విమర్శించుకోవడంతో రాజకీయ విలువలు పూర్తిగా దిగజారే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని జల విధానంపై రాజకీయ విధానాలు కాదని.. జల నిపుణుల విధానం కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటి స్థలం కేటాయించాలని కొన్నిరోజులుగా సీపీఐ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని గుర్తు చేశారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ తదితర పట్టణాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి కూలుస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా అవసరాలు, వారి సమస్యలపై దృష్టి సారించకుండా మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాముడి పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు ఆ దేవుడి సొమ్మును చోరీ చేసిన దొంగలను పట్టుకునే విషయంలో ప్రధాని నోరు విప్పడం లేదని విమర్శించారు. ఒక్కరోజు కూడా అధికారంలో లేకున్నా వందేళ్లు ఒక రాజకీయ పార్టీ సజీవంగా ఉండటం అద్భుతమని.. ఏనాటికై నా దేశంలో అంతిమ విజయం కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. సమానత్వంతో కూడిన సమాజాన్ని సృష్టించే ప్రయాణంలో కూ డా చివరి విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశా రు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలని అన్ని జిల్లాల సమితి సభ్యులు, మండల కార్యదర్శులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు ఎన్ఎండీ ఫయాజ్, ఆంజనేయులు, విజయరాములు, బాలకిషన్, నర్సింహ, నాయకులు కేశవులుగౌడ్, వార్ల వెంకటయ్య, నర్సింహ, పట్టణ కార్యదర్శి రమేష్, గోపాలకృష్ణ, శ్రీరాములు ,మహేష్, మోషా, ఎండీ కుతుబ్, సీఎస్ శెట్టి, లక్ష్మీనారాయణ, గోపాల్, ఈర్ల చంద్రమౌళి పాల్గొన్నారు. -
దాహం.. దాహం!
మిషన్ భగీరథతో అరకొరగా తాగునీటి సరఫరా ● పైప్లైన్ లీకేజీలతో సమస్య జటిలం ● పలు గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా ● శాశ్వత పరిష్కారంపై దృష్టిసారించని అధికారులు మానవపాడు: ఇంటింటా శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన మిషన్ భగీరథ పథకం ప్రజలకు తలనొప్పిగా మారింది. తరచుగా పైపులైన్లు పగిలిపోవడం.. జాయింట్ల వద్ద లీకేజీలతో సరిపడా తాగునీరు అందక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మిషన్ భగీరథ కుళాయిల నుంచి ఒకటి, రెండు బిందెల నీరు మాత్రమే వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది. పట్టని అధికారులు.. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. తరచుగా పైప్లైన్ల లీకేజీలతో సరిపడా నీరు అందడం లేదని.. సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన పథకంతో ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. -
చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యం
గద్వాల న్యూటౌన్: చదువుతోనే సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంగాల మహేశ్వర్రెడ్డి పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేత ప్రిన్సిపల్కు ఆయన రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇక్కడ చదువుకున్న వారిలో చాలామంది వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. పూర్వ విద్యార్థి, సీఏ చార్టెడ్ అకౌంటెంట్ మహేశ్వర్రెడ్డి పాఠశాల అభివృద్ధికి తనవంతుగా రూ.5 లక్షలు అందించడం అభినందనీయమన్నారు. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో ప్రావీణ్యం, కంప్యూటర్ విద్యలో నైపుణ్యం కల్పిస్తున్నారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని రాణించాలన్నారు. అనంతరం మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తాను ఇక్కడ 7వ తరగతి వరకు చదువుకున్నానని, 8 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చదివానని చెప్పారు. చదువుకున్న పాఠశాలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రూ.5 లక్షలు అందించానని పేర్కొన్నారు. పాఠశాలలో టాయిలెట్స్ సమస్య ఉన్నట్లు తెలుసుకొని.. తోటి మిత్రులతో కలిసి వాటి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, కౌన్సిలర్లు ప్రియాంక, రామలింగేశ్వర్ కాంమ్లే, చంద్రశేఖర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు కృష్ణ, నరహరి, శ్రీనివాసులు, గోవిందు, ధర్మనాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పట్టుదలతో చేరా..
మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రామంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్లో స్థానం దక్కించుకున్నాను. – మొహిలా అలీ, కొన్నూరు గ్రామం, మదనాపురం శిక్షణ ఉపయోగపడింది.. గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసు కుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అగ్నివీర్లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. – రాఘవేంద్ర, ద్వారకానగర్, మదనాపురం ● -
క్రీడలకు కేరాఫ్ పాలమూరు స్టేడియం
మహబూబ్నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియం ఉమ్మడి జిల్లాలోనే క్రీడలకు కేరాఫ్గా మారుతోంది. మొదటి నుంచి ఈ స్టేడియానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు వేదికై ంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న మైదానంలో క్రమంగా క్రీడాకారుల కోసం ఎన్నో వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.ఇ ప్పటికే స్టేడియంలో అన్ని వసతులతో కూడిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండగా.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్, కబడ్డీ టోర్నమెంట్లతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే మెయిన్ స్టేడియం ఆవరణలోనే రెండు క్రీడా అకాడమీలు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల క్రితం స్టేడియంలో బాలబాలికల వాలీబాల్ అకాడమీ ఏర్పటైంది. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, రాష్ట్రస్థాయి టోర్నీల్లో సత్తాచాటారు. ఇటీవలే బాలుర కబడ్డీ అకాడమీ మంజూరైంది. త్వరలో కబడ్డీ అకాడమీలో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంపికలు జరగనున్నాయి. ఎంపికల్లో ప్రతిభ కనబరిచే 20 మంది బాలురు ఇక్కడ శిక్షణ ఇస్తారు. రూ.10.70 కోట్లతో సింథటిక్ ట్రాక్.. మెయిన్ స్టేడియంలో ఎప్పుడుప్పుడా అని జిల్లా అథ్లెట్లు ఎదురుచూస్తున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాన్ని రూ.10.70 కోట్లతో అధునాతన హంగులతో ఏర్పాటు చేయనున్నారు. 400 మీటర్లు మేర 8 లైన్ల సింథటిక్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ పనులకు గత నెల 22న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే జిల్లాకు చెందిన అథ్లెట్లు నిత్యం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇటీవల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన వాలీబాల్, కబడ్డీ అకాడమీలతోపాటు అధునాతన ఇండోర్ స్టేడియం భవిష్యత్లో మరిన్ని వసతులు -
లంపీస్కిన్పై నజర్
తెల్లజాతి పశువుల్లోనే అధికంగా వ్యాధి లక్షణాలు ● ముందస్తుగా గోట్ పాక్స్ టీకాలు వేస్తున్న పశువైద్యులు ● వంద మంది సిబ్బందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు ● మండలం యూనిట్గా తీసుకొని స్పెషల్ డ్రైవ్ ● జిల్లాలో మొత్తం 67,891 తెల్లజాతి పశువులు గద్వాల వ్యవసాయం: లంపీస్కిన్ (ముద్దచర్మ వ్యాధి)పై పశుసంవర్ధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వ్యాధి ప్రబలకుండా ఏటా ముందస్తుగా టీకాలు వేస్తున్నప్పటికీ ప్రధానంగా దూడలు, కోడెదూడల్లో అక్కడక్కడ లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ వ్యాది ప్రబలకుండా గత కొద్దిరోజుల నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ నివారణగా గోట్పాక్స్ టీకాలు వేస్తోంది. జిల్లాలో మొత్తం తెల్లజాతి పశువులు 67,891 ఉండగా.. వీటిలో ఇప్పటి వరకు 30,778 పశువులకు గోట్పాక్స్ వ్యాక్సిన్ వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2022లో మొదటిసారి.. లంపీస్కిన్ వ్యాధి క్యాట్రీ ప్యాక్స్ అనే వైరస్ నుంచి వస్తుంది. ఆవులు, ఎద్దులు, లేగదూడల్లో ఈ వ్యాధి సోకుతుంది. బాహ్యపరాన్న జీవులు, వ్యాధి ఉన్న పశువు తాగిన నీరు, తిన్న గడ్డి వల్ల ఇతర పశువులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం, మేత తినడం మందగించడం, చర్మంపై బొబ్బలు రావడం వ్యాధి ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. ముందుగా దేశంలో గుజరాత్, మహారాష్ట్రలో ఈ వ్యాధిని గుర్తించారు. సంతల్లో, మార్కెట్లలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఒక రాష్ట్రం రైతులు మరో రాష్ట్రానికి వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రంలోనూ 2022లో మొదటిసారిగా పలు ప్రాంతాల్లో పశువులకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. జూన్ 24 నుంచి.. తెల్లజాతి పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు అక్కడక్కడ అగుపిస్తున్నాయి. జిల్లాలో కూడా కొన్నిచోట్ల వ్యాధి లక్షణాలు ఇక్కడి అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధకశాఖను అప్రమత్తం చేసింది. వ్యాధి ప్రబలకుండా పశువైద్యాధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మండలాన్ని యూనిట్గా తీసుకొని గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలను నియమించారు. జూన్ 24 నుంచి తెల్లజాతి పశువులు లంపీస్కిన్ బారిన పడకుండా ముందస్తుగా గోట్పాక్స్ టీకాలు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ముందుగానే పాడి రైతులకు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు 45 శాతం తెల్లజాతి పశువులకు టీకాలు వేశారు. ఈ నెల 20 వరకు ఉచిత ముందస్తు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వందమంది సిబ్బందితో.. 2022 సంవత్సరం ఆగస్టులో జిల్లాలో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు పలు ప్రాంతాల్లో పశువుల్లో కనిపించాయి. దీంతో రైతులు ఆందోళన చెంది పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ ఆయా పశువులను పరిశీలించి, ముందస్తు టీకాలు వేశారు. అయితే ఆ తర్వాత 2023 జూలై నెలలోనూ పలు ప్రాంతాల్లో పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు అగుపించాయి. దీంతో పశుసంవర్ధకశాఖ వందమంది సిబ్బందితో మండలానికి మూడు బృందాలుగా ఏర్పాటు చేసి.. గోట్ పాక్స్ వ్యాక్సిన్ను పశువులకు వేశారు. కాగా 2024 జులైలో, 2025 మే నెలలో వ్యాధి రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేశారు. అయితే 2025 ఆగస్టు చివరి వారంలో జిల్లాలో మళ్లీ వ్యాధి ప్రబలింది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, పశువుల్లో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండటంతో ఈ వ్యాధి మళ్లీ ఆరంభం అయినట్లు అప్పట్లో పశుసంవర్ధకశాఖ అధికా రులు గుర్తించారు. 2025 ఆగస్టులో ఎక్కువగా లేగ దూడెల్లో వ్యాధి లక్షణాలు బయటపడగా.. సుమారు 20 లేగదూడలు వ్యాధి బారినపడి మృతిచెందాయి. దీంతో అప్పుడు ముందస్తు నివారణ టీకాలు వేశారు. -
ఆయిల్పాం తోటల సాగుకు ప్రోత్సాహం
గద్వాల: జిల్లాలో ఆయిల్పాం తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వేల ఎకరాల్లో ఆయల్పాం తోటల సాగును లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద తెలంగాణ రాష్ట్ర నూనె ఉత్పత్తి సహకార సంఘం ద్వారా రైతులకు అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచామన్నారు. ఎకరాకు 57 మొక్కలను నాటుకోవచ్చని, ఒక మొక్క ధర రూ.193 కాగా ఇందులో రైతులు కేవలం రూ.20 చొప్పున చెల్లిస్తే సరిపోతుందన్నారు. తోటల్లో ఐదు హెక్టార్ల వరకు ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందుసేద్య పరికరాలు ఏర్పాటు చేసుకోవడానికి 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 1,777 మంది రైతులు 7,164.72 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగుచేశారన్నారు. కాగా ఇందులో 2014.53 ఎకరాల్లో 349 మంది రైతులకు 4,619.64 పంట టన్నుల దిగుబడి రాగా రూ.10,02,67,169 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆయిల్పాం తోటల సాగుకు దరఖాస్తు చేసుకునే రైతుల సాగు భూమి, విద్యుత్ సదుపాయం, నీటి లభ్యతను ముందుగా క్షేత్రస్థాయిలో ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలిస్తారన్నారు. బిందు సేద్య సౌకర్యం ఏర్పాటు చేసుకోవడానికి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు రాజ్కుమార్ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సెల్ నం.89777 14301, గద్వాల, ధరూరు, మల్దకల్ మండలాల రైతులు ఉద్యాన అధికారి రాజశేఖర్ సెల్ నం.89777 14295, అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి రైతులు ఉద్యాన అధికారి ఇమ్రాన్ సెల్ నం.89777 14396, అయిజ, గట్టు, కేటీదొడ్డి, రాజోళి మండలాల రైతులు ఉద్యాన అధికారి మహేష్ సెల్ నం.89777 14297లను సంప్రదించాలని కోరారు. -
ఆదిశిలాక్షేత్రంలో ప్రత్యేక పూజలు
మల్దకల్: స్వయంభూ ఆదిశిలా క్షేత్రమైన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి చంద్రశేఖర్రావు, సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు. -
అగ్నివీరులు..!
దేశ రక్షణకు యువత ముందడుగు ● 2025– 26లో వనపర్తి జిల్లా నుంచి 17 మంది ఎంపిక ● యువతలో ఆసక్తిరేపుతున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ల ఉచిత శిక్షణ ● 2027 నోటిఫికేషన్ కోసం మరో 15 మందికి తర్ఫీదు ● ఆర్మీలో ఏఐపీటీగా పనిచేసిన అనుభవంతో మెరుగైన శిక్షణకు అవకాశం సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్.. జై కిసాన్.. ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్’ సెంటర్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్ ఆదర్శ్ సురభితో యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్ ఎడ్యుకేషన్పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్నెస్ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్ ఎడ్యుకేషన్పై శిక్షణ ఇస్తున్నారు. నాటి కలెక్టర్ స్ఫూర్తితో.. 2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్ను సిద్ధం చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ కొనసాగిస్తాం. – మహేష్, మాజీ సైనికుడు, జై జవాన్, జై కిసాన్ ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వాహకులు, వనపర్తి సంస్థను ఏర్పాటు చేసి.. -
పునరావాస కేంద్రంలో అన్ని సదుపాయాలు
ధరూరు: మండలంలోని నాగర్దొడ్డి పునరావాస కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్దొడ్డి పునరావాస కేంద్రంలో 90వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ట్యాంక్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందించేందుకు కొత్తగా వాటర్ట్యాంకు నిర్మించినట్లు తెలిపారు. కొత్త గ్రామాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇంటింటికీ నీటి సరఫరాను ప్రారంభించారు. అదే విధంగా పునరావాస కేంద్రంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించి.. లబ్ధిదారు చాకలి తిప్పన్న దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, రాజశేఖర్, భీంరెడ్డి, శేఖర్, బషీర్ పాల్గొన్నారు. -
గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
గద్వాల: గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక మేరకు జీపీ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం కింద జిల్లాలో ఇప్పటి వరకు 1,600 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. సుమారు 660మందికి పైగా రూ. 20వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయడం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని.. సకాలంలో పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీపీ భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలని తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. సమావేశంలో పీఆర్ డిప్యూటీ కమిషనర్ అనిల్కుమార్, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఆర్డీఓ ముసాయిదాబేగం, డీపీఓ శ్రీకాంత్, డీఎల్పీఓ ప్రవీణ్కమార్రెడ్డి ఉన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతంచేసి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని 30వ వార్డు రాతిబురుజులో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్స్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిని సమీక్షించారు. ఫారాలు పంపిణీ చేయడమే కాకుండా.. పూర్తిగా పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించడంపై ప్రత్యేక దృష్టిసారించాలని బీఎల్ఓలకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ హరికృష్ణ, డీటీ వరప్రసాద్, ఉదయ్కిరణ్, ఆర్ఐ వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ
ఎర్రవల్లి: ఫిర్యాదుదారుల సానుకూల స్పందనే పోలీస్ పనితీరును తెలియజేస్తుందని.. ఆ దిశగా మరింత బాధ్యతగా ప్రతి పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఎస్పీ తోట శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల పోలీస్స్టేషన్లో ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యాకర్స్, కిట్ ఆర్టికల్స్, స్టేషన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. పీఎస్ పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపట్టి.. నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అధికంగా నేరాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్గా గుర్తించి.. పోలీసు నిఘాను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి.. స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బంది స్టేషన్కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని.. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని తెలిపారు. రౌడీ షీటర్స్, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని అన్నారు. స్టేషన్ రికార్డులైన పార్ట్–1, 5 పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సిబ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని ఎస్హెచ్ఓకు సూచించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పీఎస్ పరిధిలోని 11 కి.మీ. ఎన్హెచ్–44పై ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ రవి రాథోడ్ ఉన్నారు. -
జూరాల.. వెలవెల
–8లో u●నెట్టెంపాడు కాల్వ పరిధిలో నాకు రెండెకరాల పొలం ఉంది. ఈసారి వరిసాగు కోసం నారుమళ్లు వేసుకున్నా. వర్షాలు లేక డ్యాంకు నీరు రాలేదని అధికారులు ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు. మా పొలాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా ఉండవు. ఏం చేయాలో తోచడం లేదు. – సాయన్న, రైతు, ధరూరు ప్రియర్శిని జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ తప్పింది. గతేడాది ఇదే సమయానికి కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడిన జూరాల.. నేడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని వెలవెలబోతోంది. వర్షాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే జూరాల జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గి.. డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నా రు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన ఆయా ప్రాజెక్టుల పరిధి లోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. 10లక్షల ఎకరాల ఆయకట్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. మొత్తం 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రతి ఏటా వానాకాలంలో సుమారు 7లక్షల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. గడ్డు పరిస్థితి.. జూరాల ప్రాజెక్టుకు గతేడాది మే చివరినాటికే వరద వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలో ప్రాజెక్టు 40 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా ఎగువ, దిగువ విద్యుత్ హైడల్ ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి నిరాటకంగా కొనసాగింది. కానీ నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎగువనున్న కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు సైతం పూర్తిగా నిండలేదు. ఫలితంగా జూరాలకు వరద ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో.. లేదో కూడా తెలియని గడ్డు పరిస్థితి నెలకొంది. జలాశయంలో 5.52 టీఎంసీలు.. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.290 మీటర్ల మేర ఉంది. 9.567 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం కేవలం 5.523 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా కేవలం 1.916 టీఎంసీల వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. పైగా 30 ఏళ్లుగా జలాశయం పూడిక తీయకపోవడంతో సుమారు రెండున్నర టీఎంసీల బురద పేరుకుపోయింది. ఈ లెక్కన జలాశయంలో ఉన్న నీరు దాదాపుగా డెడ్ స్టోరేజీకి చేరిందని చెప్పవచ్చు. ఆందోళనలో ఆయకట్టుదారులు.. జూరాల ఎడమ, కుడి కాల్వల పరిధిలో మొత్తం 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.56 లక్షలు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ పరిధిలో సుమారు 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద వచ్చి చేరకపోవడంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఈ సమయానికి దాదాపు 50శాతం మేర వరినాట్లు పూర్తయ్యేవి. కాని ఇప్పుడు నారుమళ్లు ముదిరిపోతున్నాయి. కరిగెట్లు చేసుకుని సిద్ధం చేసుకున్న పొలాలు సైతం నీరులేక నెర్రలుబారుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని డీఏఓ వీరప్ప, ఇరిగేషన్శాఖ డీఈ సంజీవ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో వారు విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ప్రధాన నీటి వనరు జూరాలతో పాటు, నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో వరివంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా పెసర, మినుము, కంది, జొన్న, సజ్జ, రాగులు, చిరుధాన్యాలు వంటి తక్కువ నీరు అసవరమయ్యే ఆరుతడి పంటలు సాగుచేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్దతులు పాటించాలని తెలిపారు. భూమిలో తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకునేందుకు మల్చింగ్ చేయడంతో పాటు సేంద్రియ ఎరువులను వినియోగించాలన్నారు. కాగా, జూరాల ప్రాజెక్టులో ప్రసుత్తమున్న 5.7 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకే సరిపోతాయని తెలిపారు. జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 3,89,700 ఎకరాల ఆయకట్టు సాగువుతుండగా.. నీటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు. జలకళ తప్పిన జలాశయం వర్షాకాలం మొదలైనా కనిపించని వరద గతేడాది మే చివరినాటికే జూరాలలో జలకళ గడ్డు పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులు -
ప్రజావాణి రద్దు
గద్వాల: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యటనతో పాటు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల 13న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వర్షపునీటిని ఒడిసిపట్టాలి రాజోళి: వర్షపు నీరు వృథా కాకుండా, ఒడిసిపడితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్ అశోక్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో వర్షపునీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. సాధారణంగా ఇళ్లలో వినియోగించే నీటిని కూడా పొదుపుగా వాడుకోవాలని.. అనవసరంగా నీటిని వృథా చేయడం ద్వారా భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. పీజీ సెంటర్లో సమస్యలు పరిష్కరిస్తాం కొల్లాపూర్ రూరల్: పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొల్లాపూర్ పీజీ సెంటర్లో నెలకొన్న సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రిజిస్ట్రార్ రమేష్బాబుతో కలిసి ఆయన కొల్లాపూర్ పీజీ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సెంటర్లో నెలకొన్న సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం బాలికల, బాలుర వసతి గృహలను, వసతులు, భోజనం పరిశీలించారు. ప్రొఫెసర్లతో కొంతసేపు సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుడూ విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాసులకు రావాలని, హాజరు శాతం తక్కువైతే చర్యలు ఉంటాయన్నారు. ఇటీవల సెంటర్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి కొల్లాపూర్ రూరల్: మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో పర్యటించిన ఆయన మత్స్యకారులు ఆరాధ్యదైవం గంగమ్మ తల్లి గుడి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. శ్రీవారి సముద్రం చెరువు పరిసరాల్లో గుడి నిర్మించేందుకు స్థలాన్ని చూశారు. త్వరలో గంగమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని, సింగోటం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమిడిశెట్టి వెంకటస్వామి, నాయకులు రామచంద్రారెడ్డి, రామస్వామి తదితర నాయకులు పాల్గోన్నారు. అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం వనపర్తి రూరల్: అంతరాలు లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకు ప్రజలను చైతన్యం చేసి పోరాడాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుల మూడు రోజుల శిక్షణ తరగతుల ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు యుద్ధకాంక్షతో నరమేధాన్ని సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. -
ప్రశాంతంగా ‘చేనేత’ ఎన్నికలు
గద్వాలన్యూటౌన్: జిల్లాలో చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. జిల్లాలో మొత్తం 16 చేనేత సంఘాలు ఉండగా.. 10 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు గద్వాల, మాచర్ల, అయిజ, ఎక్లాస్పూర్, రాజోళి, ఆరగిద్ద చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాష్ట్ర సహకార ఎన్నికల ప్రాధికార సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల విషయంలో ఓటర్లు అయోమయానికి గురికాకుండా పురుష అభ్యర్థులకు తెలుపు బ్యాలెట్, మహిళా అభ్యర్థులకు పింక్ కలర్ బ్యాలెట్ ఇచ్చారు. ఓటర్లు తెలుపు బ్యాలెట్లో ఏడు గుర్తులపై, పింక్ బ్యాలెట్లో రెండు గుర్తులపై ఓటు వేసేలా ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. అన్నిచోట్ల పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు చేనేత, జౌళీశాఖ అధికారులు తెలిపారు. కాగా గెలుపొందిన డైరెక్టర్లు మూడు రోజుల తర్వాత ఆయా చేనేత సహకార సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. -
రీ సర్వే పనులు వేగవంతం చేయాలి
గద్వాల: జిల్లాలో మొదటి దశలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో రీసర్వే పనలు వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ కార్యదర్శి లోకేష్కుమార్, సర్వే కమిషనర్ రాజీవ్గాంధీ హనుమంతు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ నోటిఫై చేసిన ప్రతి గ్రామంలో ఆలస్యం లేకుండా గ్రామసభలు నిర్వహించి రీసర్వే ప్రారంభించాలన్నారు. నవంబర్ నాటికి మొదటి దశ గ్రామాల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన గ్రామాల్లో సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు పనిని పర్యవేక్షించాలని, రెవెన్యూ సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే సర్వేయర్లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రాజోళి, ఎర్రవల్లి, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు గద్వాల, అలంపూర్ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, సర్వే ఏడీ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. చదువులో రాణించాలి అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని కలెక్టర్ అన్నారు. ఉన్నత చదువులు అభ్యసించి రాణించాలని కోరారు. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామానికి చెందిన విద్యార్థి లెనిన్కుమార్కు గురువారం కలెక్టర్ ల్యాప్టాప్ను అందజేశారు. అలాగే అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన రమేష్– సురేఖ కులాంతర వివాహం చేసుకోవడంతో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహకంగా రూ.2.50 లక్షల విలువైన పిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత తదితరులున్నారు. -
పాలమూరు వెంకన్నస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శ్రీకంచికామకోటి పీఠం పాలమూరుశాఖ 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, గోపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరుణ పూజ, గోపూజ, కంకణధారణ, యాగశాల ప్రవేశం, గరుడ ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వేదపారాయణం, పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి వారికి శేషవాహన సేవ నిర్వహించారు. శివాలయంలో నంది వాహన సేవ, నీరాజనం, మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తీ పూజలు చేశారు. ప్రతి రోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ తెలిపారు. -
రహదారుల ‘ప్రగతి’ పరుగులు
● అలంపూర్– అయిజ, ఎరిగేర 57 కి.మీ, గద్వాల– ఎర్రవల్లి 9 కి.మీ., బలిగెర– మాచర్ల 5 కి.మీ., గద్వాల– రాయచూర్ 22 కి.మీ., గట్టు– మాచర్ల 5 కి.మీ., 6 ప్రధాన రహదారుల విస్తరణ ● వనపర్తి– ఆత్మకూర్ రహదారిలో పరిధిలో 0 నుంచి 31కి.మీ., వరకు బీటీ రోడ్డు, ఆత్మకూర్– మరికల్ రోడ్డు 13.40 కి.మీ. విస్తరణ అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రహదారులను విస్తరించడంతోపాటు మరమ్మతు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హ్యామ్ విధానం ద్వారా రహదారులను అభివృద్ధి చేయనుంది. దీంతో జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్ల ముఖచిత్రం మారబోతోంది. ఇందులో భాగంగా మొదటి దశలో మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి 2 ప్యాకేజీల్లో మొత్తం 378.04 కి.మీ., మేర రోడ్లను నిర్మించనున్నారు. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో మొదటి దశలో 18 రహదారులను 2 ప్యాకేజీల కింద ఎంపిక చేసిన మొత్తం 319.4 కి.మీ., మేర నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా చివరి దశలో ఉంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు ద్వారా రుణం పొంది రోడ్లను నిర్మిస్తారు.కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానం ప్రకారం కాంట్రాక్టర్ నిర్మించిన రహదారులను 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఆర్అండ్బీ సర్కిళ్ల వారీగా నిర్మించే హ్యామ్ రోడ్లు.. జిల్లా ప్యాకేజీలు రోడ్ల కి.మీ., వ్యయం సంఖ్య (రూ.కోట్లలో) మహబూబ్నగర్ 2 26 378.04 912.67 వనపర్తి 2 18 319.4 697.77 హ్యామ్ రోడ్లలో ఉమ్మడి పాలమూరుకు పెద్దపీట నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ రూ.1,610.44 కోట్లతో 44 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రణాళిక ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం మారనున్న గ్రామీణ ప్రాంత రహదారుల ముఖచిత్రం ఎంపిక చేసిన రోడ్లు ఇవే.. బుద్దారం నుంచి మరికల్ వరకు 33 కి.మీ., రోడ్డును 10 మీటర్లుగా విస్తరించి ఆధునికీకరించనున్నారు. వనపర్తి– బుద్దారం 11.60 కి.మీ., రోడ్డు స్టెతన్ చేయనున్నారు. మంగనూర్ నుంచి తెలకపల్లి వరకు 45.50 కి.మీ రోడ్డును ఆధునికీకరణ. బల్మూర్– నాగర్కర్నూల్ (పీడబ్ల్యూడీ) 13 కి.మీ., రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ. ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ వరకు 28.40 కి.మీ. మేర రెండు వరుసలు. పదర, వంకేశ్వరం, చిట్లంకుంట, ఉడిమిళ్ల, ఇప్పలపల్లి వరకు 34.20 కి.మీ., సింగిల్ రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ. పెంట్లవెల్లి ఎక్స్రోడ్డు నుంచి కొండూరు, తూంకుంట మీదుగా శ్రీరంగాపూర్ వరకు 0 నుంచి 3 కి.మీ., మేర రెండు వరుసలుగా విస్తరణ, 3 నుంచి 28.16 కి.మీ వరకు డబుల్ లైన్ తారు పునరుద్ధరణ పనులు. చిన్నంబావి– చెల్లెపాడు 14.20 కి.మీ., రోడ్డును ఆధునికీకరణ. కొల్లాపూర్– వనపర్తి మధ్య కేతేపల్లి నుంచి వీపనగండ్ల వరకు 11.10 కి.మీ., సింగిల్ రోడ్డును డబుల్గా విస్తరణ మహబూబ్నగర్– నవాబ్పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్– మినాస్పూర్ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్– నారాయణపేట (ఊట్కూర్ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్– తిర్మలాపూర్ 10 కి.మీ., మహబూబ్నగర్– మంగనూర్, వేపూర్ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్పల్లి, కురుమూర్తి టెంపుల్ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ (మల్కాపూర్, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. -
నేడు చేనేత ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. శుక్రవారం ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు వెల్లడించారు. అమరచింత సహకార సంఘంలో 760 ఓట్లు ఉండగా.. మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు 14 మంది సిబ్బందిని కేటాయించారు. అదేవిధంగా కొత్తకోట చేనేత సహకార సంఘంలో 78 మంది ఓట్లు ఉండగా.. ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు నలుగురు సిబ్బందిని నియమించారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల దూరం వరకు దుకాణాలు తెరవకుండా ముందస్తు సమాచారం ఇచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కోరినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. సాయంత్రం ఫలితాలు వెల్లడించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుందని రిటర్నింగ్ అధికారి వివరించారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
నీలి విప్లవం..!
అన్నిరకాలుగా చేయూత.. చేపల వృత్తిపై ఆధారపడిన మత్స్యకారులకు అన్ని రకాల చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ఎన్ఎఫ్డీపీని తీసుకొచ్చింది. ఈ పోర్టల్లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకునే మత్స్యకారులకు ప్రభుత్వం పలు పథకాలు, ప్రోత్సహకాలు అందించనుంది. ప్రధానంగా పీఎంఎంఎస్వై, ఇతర మత్స్య పథకాల్లో సబ్సిడీలు పొందవచ్చు. ప్రమాద బీమా, సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుంది. రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. చేపల వేట పరికరాలు, వాహనాలు ఇతర మత్స్య పరికరాలపై సబ్సిడీలు పొందవచ్చు. ప్రభుత్వ నిర్వహించే శిక్షణ శిబిరాలు, అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొనవచ్చు. విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రభుత్వ సహాయం పొందవచ్చు. ప్రత్యేకంగా గుర్తింపు కార్డు కూడా వస్తుంది. ఇలా ఎన్ఎఫ్డీపీలో వివరాలు నమోదు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు ప్రయోజనాలు ఉన్నాయి. కాగా సొసైటీలో సభ్యత్వం ఉన్న మత్స్యకారులతోపాటు చేపల వృత్తిలో ఉన్న మత్స్యకారులందరూ ఎన్ఎఫ్డీపీ రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో ప్రచారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్ఎఫ్డీపీపై జిల్లా మత్స్యశాఖ విస్తృత ప్రచారం కల్పిస్తోంది. సొసైటీలో ఉన్న మత్స్యకారులతోపాటు చేపల వృత్తిపై ఆధారపడిన మత్స్యకారుల వివరాలను ఎన్ఎఫ్డీపీ పోర్టల్ మత్స్యశాఖ సిబ్బంది నమోదు చేస్తున్నారు. చా లామంది మత్స్యకారులు కామన్ సర్వీస్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటుండగా.. అలా చేయించుకోలేని వారి రిజిస్ట్రేషన్లను జిల్లా కార్యాలయంలో సిబ్బంది చేస్తున్నారు. మత్స్యకారులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పిస్తున్న ఎన్ఎఫ్డీపీ గద్వాల వ్యవసాయం: చేపల వృత్తి జీవనాధారంగా ఉన్న మత్స్యకారులకు ఎన్ఎఫ్డీపీ (నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫాం) రిజిస్ట్రేషన్ సామాజిక, ఆర్థిక భరోసా ఇస్తోంది. పలు పథకాలు, ప్రోత్సకాలు అందించే ఈ పథకాన్ని కేంద్రం రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టినప్పటికీ చాలామంది మత్స్యకారులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. దీంతో ప్రభుత్వం ఇటీవల దీనిపై ప్రత్యేక దృష్టిసారించింది. చేపల వృత్తిలో ఉన్న ప్రతి మత్స్యకారుడు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. జిల్లాలో నీటి వనరులు.. నడిగడ్డ ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్వాటర్, ఆరు రిజర్వాయర్లు, 35 నోటిఫైడ్ చెరువులతోపాటు 396 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్ను వదిలి పెంచుతున్నారు. చేపల పెంపకం, విక్రయంపైనే జీవనం సాగుతోంది. ఇది కాక కొంతమంది మత్స్యకారులు సొంతంగా కూడా చేపల చెరువులను నిర్వహిస్తున్నారు. 2018– 19లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతో మత్స్యకారులకు రూ.2 కోట్లు విలువ చేసే ద్విచక్రవాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు, ట్రేలు, ఐస్బాక్స్లు, వలలు, ఎలక్ట్రానిక్ కాంటాలు తదితరమైనవి సమకూరాయి. వీటితో మత్స్యకారులకు కొంత ప్రయోజనం చేకూరిందని చెప్పవచ్చు. పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అన్నివిధాల ప్రోత్సాహం రెండేళ్ల క్రితమే పథకం ప్రారంభమైనా అవగాహన కరువు ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారుల చర్యలు గత ప్రభుత్వం అమలు చేసిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతోనూ మేలు -
నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
గద్వాల క్రైం: నేరస్తుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతల విషయాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్ నిర్వహించి అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టాలన్నారు. చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచి ప్రతి గూడ్స్ వాహనాలు, కంటైనర్లను తనిఖీ చేయాలన్నారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని సూచించారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి రవాణాను నివారించాలని, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా చేపట్టాలని ఆదేశించారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల విషయంలోనూ నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో జోనల్ లెవల్ డ్యూటీ మీట్లో కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ తదితర విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనబర్చి స్టేట్ లెవల్ డ్యూటీకి ఎంపికై న గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు శ్రీకాంత్, శ్రీహరి, తరుణ్కుమార్రెడ్డి, సిబ్బంది ప్రహ్లాద్, రాఘవేంద్ర, నవీన్కుమార్లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు కల్యాణ్ కుమార్, నాగశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పరిధిలో ఇలా..
ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న మత్స్యకారులు 5,800 మత్స్యపారిశ్రమిక సహకార సంఘాలు 96 సొసైటీల్లో సభ్యత్వం లేకుండా మత్స్య వృత్తిపై ఆధారపడిన వారు సుమారు 1,300- 1,500 మొత్తం సభ్యుల సంఖ్య 7,300 ఈ రిజిస్ట్రేషన్తోనే పథకాలు ఎన్ఎఫ్డీపీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మత్స్యకారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టే పథకాలు ఈ రిజిస్ట్రేషన్ ద్వారానే వర్తిస్తాయి. ప్రధానంగా ప్రమాద బీమా, బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. సామాజిక భద్రత, ఆర్థిక చేయూత లభిస్తుంది. – వెంకట్రాములు, చెన్నకేశవస్వామి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రోత్సాహకాలు బాగు.. మత్స్యకారులు అందరూ ఎన్ఎఫ్డీపీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సొసైటీలో సభ్యత్వం లేని వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. వివిధ రూపాల్లో వీరంతా చేపల వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అందిస్తున్న పథకాలు, ప్రోత్సహకాలు బాగున్నాయి. – వెంకటేష్, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు, బీరెల్లి అవగాహన కల్పిస్తున్నాం.. సొసైటీలో సభ్యత్వం ఉన్న మత్స్యకారులతోపాటు సభ్యత్వం లేకపోయినా.. చేపల పెంపకం, విక్రయం, వలల తయారీ, అమ్మకం, ఐస్బాక్స్లు తయారు చేసేవారు కూడా ఎన్ఎఫ్డీపీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనిపై వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే విస్తృత ప్రచారం కల్పించాం. ఇంకా ఎవరైనా చేసుకోలేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లలో లేదా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సిబ్బంది ద్వారా చేయించుకోవాలి. – షకీలాభానో, జిల్లా మత్స్యశాఖాధికారి ● -
ఆయన దారెటు..?
గద్వాల: నడిగడ్డలో ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు అన్న చందంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నవారు సహజంగా అధికారంలో ఉన్నవారిని నిలదీస్తూ.. ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ, అలంపూర్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే విజయుడు మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలిలా.. బుధవారం అధికార పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి జిల్లాలోని ధరూరు మండలం ర్యాలంపాడు ముంపు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయుడు ఇద్దరు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ కార్యక్రమం అనుకుందామంటే గద్వాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే హాజరవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ఇదేరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులతోపాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సైతం కర్ణాటకలోని ఆర్డీఎస్ను సందర్శించారు. ఆర్డీఎస్కు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తుండగా.. మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయుడు అధికార పార్టీ మంత్రులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకు ఎమ్మెల్యే విజయుడు దారెటు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మంత్రులను కలిసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మరోవైపు ఆర్డీఎస్ను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే.. ఎమ్మెల్యే మంత్రులకు స్వాగతం పలకడంపై చర్చ -
రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కందనూలు: నాగర్కర్నూల్ నూతన బస్టాండ్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో పర్యటించిన ఆయన పట్టణంలోని బస్ డిపో సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసేలా రూపుదిద్దుకోనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రజలు సైతం ఆర్టీసీని తమ సొంత సంస్థగా భావించి ఆదరించాలని, ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయి ్డలో కురవకపోవడంతో రైతులు నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో అధిక లాభాలు ఇచ్చే పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. లాభాల బాటలో ఆర్టీసీ.. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. నేడు రవాణా శాఖను సమర్థవంతంగా నడిపిస్తూ ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపించే ప్రయత్నాలు జరిగాయని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం సంస్థను మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఉయ్యాలవాడలో రూ.200 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రితోపాటు రూ.12 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. నాగర్కర్నూల్కు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాగర్కర్నూల్ నుంచి వయా తూడుకుర్తి మీదుగా వనపర్తికి ప్రయాణించే బస్సును వారు జెండా ఊపి ప్రారంభించారు. 365వ బస్టాండ్గా నాగర్కర్నూల్కు ప్రత్యేక గుర్తింపు 4 ఎకరాల స్థలంలో అత్యాధునిక హంగులతో నిర్మాణం రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
పేదలను విస్మరించిన బీఆర్ఎస్
ధరూరు: రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు ఇస్తే కమీషన్లు రావని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు రూ.లక్షల కోట్లు ఇస్తే కమీషన్లు వస్తాయనే ఆలోచన తప్ప పల్లెల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ఘనత కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరితతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇంటికి అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి.. అంటూ కళ్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ ఆ తర్వాత కమీషన్ల పేరుతో రూ.లక్షల కోట్లు దండుకున్నారని దుయ్యబట్టారు. యుజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కులం, మతం తేడా లేకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, నేడు రేవంతరెడ్డి ఆ పాలనను గుర్తు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ పాక్రజెక్టుల నిర్మాణ కోసం తమ బంగారం లాంటి భూములు, ఇళ్లు సర్వస్వం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తి విఫలమవుతున్నాయన్నారు. ఆర్అండ్ఆర్ సెంటర్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. తన హయాంలోనే ఈ గ్రామానికి 236 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇందులో సుమారు 50 ఇళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ గద్వాల జిల్లా అన్ని విధాలుగా వెనుకబడిందని, అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని మంత్రులను కోరారు. ఈ క్రమంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజీవ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రాజశేఖరరెడ్డి, సుదర్శన్రెడ్డి, శ్రీధర్, రఘువర్ధన్రెడ్డి, విజయ్కుమార్, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్సే సొంతింటి కలను సాకారం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం -
విద్యుత్ శాఖలో బదిలీలు రద్దు
గద్వాల: జిల్లా విద్యుత్ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన బదిలీలను రద్దు చేస్తూ సీఈ భిక్షపతి పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ శాఖలో నలుగురు ఉద్యోగుల అక్రమ బదిలీల వ్యవహారంపై బుధవారం ‘సాక్షి’లో ‘పవర్’ పాలి‘ట్రిక్స్’ శీర్షి కన కథనం ప్రచురిత మైంది. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఉన్న తాధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేసిన నలుగురు ఉద్యోగుల బదిలీలను రద్దు చేస్తూ సీఈ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ కేటీదొడ్డి: మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకోలేని రైతులు మీసేవ కేంద్రాల్లో బుకింగ్ చేసుకోవాలని ఈడీఎం శివకుమార్ తెలిపారు. పాసుబుక్ నంబర్, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేశాక రైతు ఫోనుకు ఓటీపీ వస్తుందని, వెరిఫై చేశాక బుకింగ్ ఐడీ జారీ అవుతుందన్నారు. ఈ ఐడీకి బుకింగ్ తేదీ మినహాయించి.. 48 గంటలు వ్యాలిడిటీ ఉంటుందన్నారు. ఈ సదుపాయాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పల్లీ @ రూ.7,465 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 888 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,465, కనిష్టంగా రూ.3,396, సరాసరిగా రూ.5,769 ధరలు లభించాయి. హస్తకళలకు ప్రోత్సాహం కోస్గి రూరల్: ప్రకృతి సిద్ధంగా లభించే వనరులతో వస్తువులను తయారుచేసే చేతివృత్తిదారులను ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుంద ని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ అధికారి అరవింద్ అన్నారు. బుధవారం కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో చేతివృత్తిదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాలు, గృహ నిర్మాణాల్లో చేతివృత్తిదారులు ముఖ్యభూ మిక పోషిస్తున్నట్లు తెలిపారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గు ర్తించి.. మరింత నైపుణ్యం పెంపొందిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గుర్తింపుకార్డుల కోసం పలు కుల సంఘాల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. -
గందరగోళంగా ఉంటది..
గట్టులోని బీసీకాలనీ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో అన్ని తరగతుల పిల్లలను ఒకేచోట కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. అన్ని తరగతుల సబ్జెక్టులను అందరూ వినడం వల్ల గందరగోళం నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి.. అదనపు గదులు నిర్మించాలి. – ఆంజనేయులు, గట్టు సెలవు కోసం తిప్పలు.. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు అత్యవసర పరిస్థితుల్లో సెలవు కోసం పై అధికారిని బతిమిలాడుకోవాల్సి వస్తుంది. ఆ స్థానంలో పక్క పాఠశాల నుంచి ఉపాధ్యాయుడిని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుని వెళ్లమని చెబుతున్నారు. ఇది ఇబ్బందికర పరిస్థితి. సింగిల్ స్కూళ్లకు ఇద్దరు టీచర్లను కేటాయించాలి. కనీసం విద్యావలంటీర్లను ఏర్పాటు చేస్తే సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుంది. – చంద్రకాంత్ వదన్, టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలంటీర్ల నియమిస్తాం.. ఇప్పటికే విద్యాశాఖపై అధికారులతో సమీక్షను నిర్వహించాం. ఉపాధ్యాయుల కొరతపై మండలాల వారీగా ఎంఈఓలతో వివరాలు సేకరిస్తున్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావలంటీర్లను నియమించేలా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – నర్సింగ్రావు, అదనపు కలెక్టర్ ● -
కర్ణాటకలో అక్రమ ప్రాజెక్ట్లతో పాలమూరు ఎడారే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘తుంగభద్ర నదిపై ఎగువన కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్న చిక్కలమర్రి, కురిడి, గుండ్రేవుల ప్రాజెక్ట్లతో నడిగడ్డ మాత్రమే కాదు.. పాలమూరు శాశ్వతంగా ఏడారిగా మారే ప్రమాదం ఉంది. ఆర్డీఎస్, కల్వకుర్తి, పీఆర్ఎల్ఐ ఇలా అన్నింటికీ నీటి కష్టాలు తప్పవు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. పార్టీలకతీతంగా పాలమూరు ప్రజలను ఏకం చేస్తాం. పాలమూరును ఎడారిగా మార్చే కుట్రలను తిప్పికొడతాం.’ అని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి హెచ్చరించారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలుకాలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆనకట్టను సందర్శించారు. తెలంగాణకు నీరు వచ్చే ఆర్డీఎస్ ఎడమ కాల్వ షెటర్లు, పేరుకుపోయిన పూడికతోపాటు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి డ్రింకింగ్ వాటర్ స్కీంను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు తుంగభద్ర, కృష్ణా నదులపై అనేక అక్రమ ప్రాజెక్ట్లు, బ్యారేజీలు నిర్మిస్తున్నాయని.. దీనివల్ల కృష్ణా నదిపై ఆధారపడి ఉన్న ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం శోచనీయం.. కర్ణాటకలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్లకు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అనుమతులు లేవని.. ఇంత జరుగుతున్నా పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు స్పందించకపోడం శోచనీయమన్నారు. ఏపీ ఓ పక్క అడ్డగోలుగా నీరు తరలించుకుపోవడంతోపాటు కుడి కాల్వ పేరుతో ప్రాజెక్ట్ నిర్మిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితేనే స్వరాష్ట్ర ఉద్యమం జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. కాగా, కురుడి ఎత్తిపోతల సందర్శన క్రమంలో అక్కడికి కర్ణాటక ఇరిగేషన్ అధికారులు రాగా.. ఏ అనుమతులతో ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని వారు సమాధానమివ్వగా.. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు ఉండాలని.. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులు నిలిపివేయాలని సూచించారు. ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు ఆంజనేయులు గౌడ్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘కురిడి’తో కొద్ది నీరు కూడా రాదు.. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ను నిజాం కాలంలో తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించారని మాజీ మంత్రులు గుర్తు చేశారు. అయితే రాయచూర్ ప్రాంతం కర్ణాటకలో కలిసిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణకు ట్రిబ్యూనల్ కేటాయించిన 15.9 టీఎంసీల వాటా దక్కడం లేదని.. కేవలం 1.2 టీఎంసీల వాటా ఉన్న కర్ణాటకనే ఎక్కువ ప్రయోజనం పొందుతోందన్నారు. ఇప్పటివరకు భారీగా భారీగా దోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక.. తెలంగాణకు వచ్చే కొద్ది నీరు సైతం రాకుండా అడ్డుకునేందుకు కురిడి ఎత్తిపోతలను నిర్మిస్తోందని దుయ్యబట్టారు. తాగునీటి పేరుతో 2 టీఎంసీల సామర్థ్యంతో 100 మీటర్ల దూరంలోనే లిఫ్ట్ను నిర్మిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్డీఎస్ పరిరక్షణ కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టామని.. తాజాగా కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతలతో ఆ కొద్ది నీరు కూడా నడిగడ్డకు అందే పరిస్థితి ఉండదన్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి కర్ణాటకలోని ఆర్డీఎస్ను సందర్శించిన బీఆర్ఎస్ బృందం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్లనుపరిశీలించిన నేతలు -
స.హ. చట్టం దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు
గద్వాల: సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని.. పౌరులు అడిగే సమాచారాన్ని అధికారులు విధిగా అందించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో స.హ. చట్టంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకోసారి ఆయా శాఖల వారీగా వచ్చిన స.హ. చట్టం దరఖాస్తులు, వాటి పరిష్కారం ఏ స్థాయిలో పెండింగ్లో ఉందో పూర్తి వివరాలను రాష్ట్ర కమిషనర్కు నివేదిక పంపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స.హ. చట్టం దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేసే పౌరులు వివిధ శాఖల సమాచారాన్ని పొందుతుంటారని.. అధికారులు సంబంధిత సమాచారాన్ని నిర్ధేశిత గడువులోగా ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఏఓ భూపాల్రెడ్డి, ఆర్టీఐ సెక్షన్ అధికారి సరితారాణి ఉన్నారు. -
బాలల పరిరక్షణలో కమిటీల పాత్ర కీలకం
ఎర్రవల్లి: బాలల హక్కుల పరిరక్షణలో బాలల పరిరక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారిణి సునంధ అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండల మహి ళా సమాఖ్య భవనంలో నిర్వహించిన మండలస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి బాలబాలిక సంతోషంగా, ఆరో గ్యంగా విద్యలో రాణించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం అందరి బాధ్యత అని అన్నారు. సమాజంలో కుటుంబం, పాఠశాల, పని ప్రదేశం, గ్రామ పరిసరాలు వంటి అనేక స్థాయిల్లో బాలలపై పలు ఘటనలు ఉత్పన్నమవుతున్నాయ ని తెలిపారు. వాటి నివారణకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు బలమైన సమన్వయ వ్యవస్థ అవసరమన్నారు. బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, పాఠశాల మానివేత, బాలలపై హింస, బాలల నిర్లక్ష్యం, బాలల అక్రమ రవాణా, లైంగిక దాడులు, వీధి బాలల సమస్యలు, అనాథ పిల్లల సంరక్షణ వంటి అంశాలు తక్షణ స్పందనకు అవసరమయ్యే అంశాలని పేర్కొన్నారు. అనంతరం వివి ధ శాఖల అధికారులతో కలిసి ఆమె బాలల పరిరక్షణ కమిటీ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ హేమలత, జిల్లా బాలల ప రిరక్షణ అధికారి నర్సింహులు, తహసీల్దార్ సాయికిరణ్రెడ్డి, ఎంపీడీఓ రమాదేవి పాల్గొన్నారు. -
ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు!
ఆత్మకూర్: వానాకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు పడిన దాఖలాలు లేవు. ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతోంది. భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు ఏకంగా 2 టీఎంసీలకు పడిపోగా.. రామన్పాడు రిజర్వాయర్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. వర్షాలు పడకపోతే తాగునీటి ముప్పు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రానీయకుండా మిషన్ భగీరథ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత, గాలుల వేగానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మంది అవసరాలు తీర్చేందుకు నిత్యం మిషన్ భగీరథ పథకం ద్వార 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలకు 27.6 ఎంఎల్డీ (మిలియన్ లీటర్లు ఫర్ డే), గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్పైనే తాగునీటి పథకాలు కొనసాగుతున్నాయి. జూలైలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యమ్నాయంగా మార్గాలను చూసుకుంటూ బోర్లు, చేతిపంపులు, ట్యాంకర్లను సిద్ధం చేశామని అధికారులు పేర్కొంటున్నారు. తాగునీటి పథకాలకు సరఫరా ఇలా.. 2 టీఎంసీలకు పడిపోయినజూరాల నిల్వలు రామన్పాడులోనూ అదే పరిస్థితి చెరువులు, కుంటల్లో తగ్గిన నీటిమట్టం నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటి సరఫరా -
తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు
రాజోళి: రేషన్ డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా తూనికల, కొలతలశాఖ అధికారి రవీంద్ర హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని రేషన్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 17వ నంబర్ రేషన్ షాప్లో కాంటాపై ఖాళీ గన్నీబ్యాగు ఉంచి బియ్యం కాంటా చేస్తున్నట్లు గుర్తించి.. డీలర్కు రూ.5వేల జరిమానా విధించారు. ప్రజలను మోసం చేయడం సరికాదని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, తమకు స్టాక్ పాయింట్ నుంచి తక్కువ తూకంతో బియ్యం సరఫరా చేస్తున్నారని డీలర్లు అధికారి దృష్టికి తీసుకొచ్చారు. మాంసం విక్రయానికి లైసెన్స్ తప్పనిసరి అలంపూర్ రూరల్: అలంపూర్ మున్నిపాలిటీలో మాంసం, చేపల విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని పుర కమిషనర్ రాజేశ్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మాంసం విక్రయదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాంసం దుకాణాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం 5వ వార్డులో నెలకొన్న సమస్యను పరిష్కరించారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వంట గది, టాయిలెట్లను పరిశీలించారు. కమిషనర్ వెంట మున్సిపల్ చైర్మన్ జయరాముడు, కౌన్సిలర్లు మోహన్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు కృష్ణమూర్తి ఉన్నారు. అందుబాటులో ఎరువులు మల్దకల్: రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని విఠలాపురంలో హాకా రైతు సేవాకేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి.. సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. భూ సారం పెంపునకు సేంద్రియ ఎరువులు ఎంతో దోహదపడతాయన్నారు. మాజీ ఎంపీపీ రాజారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రమేశ్నాయుడు, పురుషోత్తంరెడ్డి, గోపాల్రెడ్డి, సత్యారెడ్డి, సుధాకర్గౌడ్, బాబురెడ్డి పాల్గొన్నారు. కార్మికులకు రూ.26వేల వేతనం ఇవ్వాలి గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు రూ. 26వేల వేతనం ఇవ్వాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక జీజీహెచ్ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించడంతో పాటు నాలుగు పండుగలు, నాలుగు జాతీయ సెలవులు, 15 ఆర్జిత సెలవులను అమలు చేయాన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయాలని, చట్టప్రకారం సంవత్సరానికి ఒక నెల జీతం బోనస్గా ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికుడికి గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటరామిరెడ్డి, పరుశరామ్, బాషా, నాగరాజు, అంజనమ్మ, చిట్టెమ్మ, మహేశ్వరి, నాగేంద్రమ్మ, వెంకటేశ్వరి, కిష్టమ్మ, వెంకటేశ్, మునరీషాబేగం, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
గద్వాల/ధరూరు: మండలంలోని ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో బుధవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. ఆర్అండ్ఆర్ సెంటర్లో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో మొత్తం 256 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 50 నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో 200 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి ర్యాలంపాడుకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మాజీ వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, ఎంపీడీఓ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలి ధరూరు: విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. మంగళవారం ధరూరు మండలంలోని చింతరేవుల, ఎములోనిపల్లి, నర్సన్దొడ్డి తదితర గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అందరికీ నోట్, పాఠ్యపుస్తకాలు అందాయా అని ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు బేస్లైన్ టెస్టు నిర్వహించి.. వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి ఫలితాలు మెరుగుపడేలా చూడాలని తెలిపారు. డీఈఓ వెంట ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఉన్నారు. -
మెడికల్ కళాశాల సీట్ల పెంపు
● మరో 25 సీట్లకు అనుమతి ఇచ్చిన ఎన్ఎంసీ ● మొత్తం 200లకు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు పాలమూరు: పాలమూరు మెడికల్ కళాశాలకు మరో 25 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఎన్ఎంసీ మంగళవారం అనుమతులు ఇచ్చింది. 2016– 17 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల ప్రారంభమైంది. ఆ తర్వాత ఎదిర శివారులో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో మెడికల్ కళాశాల శాశ్వత భవనం నిర్మించారు. 2019లో 150 సీట్ల నుంచి 175 సీట్లకు పెంచగా ప్రస్తుతం కళాశాలలో 825 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. తాజాగా ప్రస్తుత విద్యా సంవత్సరం 2026– 27 నుంచే పెరిగిన సీట్లు ఏర్పాటుకు అనుమతి కల్పించారు. దీంతో పాలమూరు మెడికల్ కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి. ● 2016 నుంచి 2026 వరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆరు బ్యాచ్లు బయటకు వెళ్లాయి. అదేవిధంగా 34 పీజీ సీట్లు మంజూరు కాగా 34 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే బీఎస్సీ సైన్స్లో 70 సీట్లు, డీఎంఎల్టీలో 30 సీట్లు, డయాలసిస్లో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటి కళాశాల.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదట ఏర్పాటైన పాలమూరు మెడికల్ కళాశాలలో ఒక్కో విభాగం అభివృద్ధి చెందుతూ వస్తోంది. మొదట జనరల్ ఆస్పత్రిలో వెనుక భాగంలో ఉన్న భవనంలో తాత్కాలికంగా కళాశాల నిర్వహణ సాగింది. గత 11 ఏళ్ల కాలంలో మెడికల్ కళాశాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా ఉస్మానియా, గాంధీ తర్వాత పాలమూరు కళాశాల మూడో స్థానంలో ఉండటం విశేషం. మెడికల్ కళాశాలకు అనుబంధంగా టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటుతో మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. పాత కలెక్టరేట్ స్థానంలో గత ప్రభుత్వం వెయ్యి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2022 డిసెంబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి భవన నిర్మాణాలతోపాటు వసతుల కల్పన కోసం మొత్తం రూ.270 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు నాలుగు బ్లాక్లు పూర్తి కాగా.. ఈ–బ్లాక్ పనులు కొనసాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
నందిమళ్లలో టెన్షన్.. టెన్షన్
మహబూబ్నగర్ క్రైం/ అమరచింత: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి జైలు నుంచి పరారై.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్వగ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. అమరచింత మండలంలోని నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించి.. గత నెల 2న పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అమరచింత పోలీస్స్టేషన్లో జూన్ 7న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. జూన్ 10న పోలీసులు ఇద్దరిని ఆత్మకూర్ స్టేషన్కు తీసుకువచ్చారు. అమ్మాయి మైనర్ (మేజర్ కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది) కావడంతో కిశోర్కుమార్రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి జూన్ 12న రిమాండ్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. సదరు బాలికను వనపర్తి సఖి సెంటర్లో ఉంచారు. దాదాపు 25 రోజులపాటు జైలు జీవితం గడిపిన కిశోర్కుమార్రెడ్డి సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి తప్పించుకొని స్వగ్రామానికి చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటీ ఖైదీలతో చెస్ ఆడి.. జైలు నుంచి పరారైన కిశోర్కుమార్రెడ్డి అర్ధరాత్రి వరకు జైలులో తోటీ ఖైదీలతో చెస్ ఆడినట్లు తెలుస్తోంది. జైలు నుంచి తప్పించుకోవాలని ముందే ప్రణాళిక వేసుకున్నాడా..? లేక అప్పటికప్పుడు ఆలోచించి తప్పించుకున్నాడా.. అనేది స్పష్టత లేదు. జనరల్ బ్యారక్లో అందరి మధ్య ఉన్న అతను ఒంటరిగా వెనక భాగం వైపు వెళ్లినప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. జైలులో సాధారణంగా అధికారులు, సిబ్బంది 24గంటలపాటు అప్రమత్తంగా ఉంటారు. కానీ, ఒక రిమాండ్ ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడంటే జైలులో భద్రతా లోపంపై విమర్శలు వస్తున్నాయి. సుదీర్ఘంగా విచారణ జిల్లా జైలు నుంచి ఖైదీ పరారైన విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జైలుకు చేరుకున్నాడు. ఖైదీ పరారైన ఘటనపై సుదీర్ఘంగా విచారణ సాగించారు. స్వగ్రామంలో కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న కిశోర్కుమార్రెడ్డి నేరుగా స్వగ్రామానికి వచ్చాడన్న సమాచారంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కిశోర్ తమ ప్రేమ పెళ్లిని కాదని విడదీసిన పంచాయతీ పెద్దలను దూషిస్తూ.. నానో యూరియా తాగడంతో సర్వత్రా కలకలం రేగింది. తాను పేదవాడినని, ఖాళీగా తిరుగుతున్నాననే సాకుతో తమను విడదీశారని, అమ్మాయిని కలవకుండా మైనర్ అని సఖి కేంద్రానికి పంపారనే కారణాలతో కిశోర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిశోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. జైలు నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకొని రావడంతో కలకలం తాను ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవ.. ఆత్మహత్యాయత్నం జిల్లా జైలులో బయటపడిన భద్రతడొల్లతనం.. జైళ్ల శాఖ డీఐజీ విచారణ -
బడి మానేస్తున్నారు..
పునరావాస కేంద్రంలో పాఠశాల భవనం అసంపూర్తిగా ఉంది. బడిలో కనీసం కూ ర్చునేందుకు గదులు కూడా లేవు. స్లాబ్ వేసి వదిలేశారు. అసంపూర్తి భవనంలో బడిని కొనసాగిస్తుండటంతో పిల్లలు వెళ్లడం లేదు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. – కుర్వ నర్సింహులు, చిన్నోనిపల్లె రోడ్డును పూర్తిచేయాలి.. పునరావాస కేంద్రం నుంచి ఉన్న లింకు రోడ్లను పూర్తిచేయాలి. రోడ్డు నిర్మాణం పూర్తయితే మారుమూల ఉన్న లింగాపురం, అంతంపల్లి, చిన్నోనిపల్లె నుంచి బోయలగూడెంతో పాటు కర్ణాటక ప్రాంతానికి రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. బోయలగూడెం గ్రామస్తులు బల్గెర మీదుగా కాకుండా చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం మీదుగా అయిజకు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. – రామచంద్రగౌడ్, చిన్నోనిపల్లె పరిష్కారానికి చర్యలు.. చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. పాఠశాల భవనం, రోడ్డు పనులు పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతాం. అన్ని శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రంలోని సమస్యలను పరిష్కరిస్తాం. – శ్రీనివాసరావు, ఆర్డీఓ, గద్వాల -
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
ధరూరు: ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 8న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవా రం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ర్యాలంపాడు పునరావాస కేంద్రాన్ని సందర్శించి.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. మొత్తం 256 ఇళ్లు మంజూరు కాగా.. 50 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పునరావాస కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, రామన్గౌడ్, శేఖర్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. -
పొలానికి దారిలేదు..
మాకు విఠలాపురం గ్రామశివారులోని సర్వేనం.180లో రెండున్నర ఎకరాల పొలం ఉంది. అ యితే నెట్టెంపాడు కాల్వ కోసం భూమిని తీసుకున్న అధికారులు.. పనులు చేయకుండా బాటను పూర్తిగా బంద్ పెట్టారు. దీంతో మాపొలానికి వెళ్లాలంటే చాలా కష్టాలు పడుతున్నాం. పొలంలో పంట వేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. దీనిపై అధికారులను అడిగే బాట వేయడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదంటూ సమాధానం ఇస్తున్నారు. మా ఇబ్బందిని తొలగించండి. – లక్ష్మి, గోవిందమ్మ, పార్శచర్ల, ధరూరు మండలం -
చిన్నోనిపల్లె గోస పట్టదా?
● పునరావాస కేంద్రంలో కనీస వసతులు కరువు ● అసంపూర్తిగానే పాఠశాల భవనం ● రోడ్ల నిర్మాణాలకు లభించని మోక్షం గట్టు: చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలతో నిర్వాసితులు సతమతమవుతున్నారు. తమ గోస ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. చిన్నోనిపల్లె రిజర్వాయర్లో ముంపునకు గురైన గ్రామాన్ని అంతంపల్లి సమీపంలోని ఎర్రగట్టు వద్ద ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలు మాత్రం సంవత్సరాల తరబడి తీరడం లేదు. ప్రధానంగా ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన తడకల షెడ్లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ భవనం కూడా కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉంది. పాఠశాల, అంగన్వాడీ భవనాలను పూర్తిచేయాలని అనేక పర్యాయాలు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ఏడేళ్లుగా అసంపూర్తిగానే.. చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం నుంచి రిజర్వాయర్, బోయలగూడెం వరకు బీటీరోడ్డు నిర్మాణానికి 2017లో రూ. 1.85కోట్లు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారు.. 2018లో పనులను ప్రారంభించి, కేవలం మట్టి, కంకర వేసి వదిలేశారు. ఏడేళ్లుగా బీటీరోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే బోయలగూడెం, లింగాపురం, అంతంపల్లి, చిన్నోనిపల్లె గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. మరోవైపు చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం నుంచి భూంపురం వరకు కొత్తగా మంజూరైన బీటీరోడ్డు నిర్మాణ పనులు సైతం ప్రారంభానికి నోచుకోవడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. పునరావాస కేంద్రంలో అసంపూర్తి భవనాలు, లింకు రోడ్లను పూర్తిచేయాలని మాజీ ఎంపీపీ విజయ్కుమార్ మంత్రికి విన్నవించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు తీర్చాలని చిన్నోనిపల్లె నిర్వాసితులు కోరుతున్నారు. -
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి
నా భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నాం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే, నా పేరిట ఇదివరకే ఇల్లు మంజూరైనట్లు చూపెడుతుందని అధికారులు రిజెక్ట్ చేశారు. వాస్తవానికి నాపేరిట ఇల్లు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు. దీనిపై కలెక్టర్కు విచారణ జరిపి, మాకు న్యాయం చేయాలి. – అమీన, క్యాతూరు, అలంపూర్ మండలం రక్షణ కల్పించాలి.. నా తల్లిదండ్రులు చనిపోయారు. మేము నలుగురం పిల్లలం. నేను దివ్యాంగురాలిని కావడంతో నా కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక బయటకొచ్చి బతుకున్నా. అక్కడికి వచ్చి నన్ను హింసకు గురిచేస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాను. ఒంటరిగా ఉన్న నాకు రక్షణ కల్పించాలి. – లక్ష్మి, దివ్యాంగురాలు, గద్వాల పింఛన్ ఆపేశారు.. నాకు రెండు చెవులు పూర్తిగా వినిపించవు. ఇందుకు సంబంధించి సదరం సర్టిఫికెట్ కూడా తీసుకున్నా. కొంతకాలం పాటు పింఛన్ వచ్చింది. అయితే ఇటీవలి నాకు తెలియకుండా పింఛన్ ఆపేశారు. ఎందుకు ఆపేశారో తెలియదు. నాకు మళ్లీ పింఛన్ వచ్చేట్లు చేయండి. – లక్ష్మీదేవమ్మ, విఠలాపురం, మల్దకల్ మండలం ప్రభుత్వ స్థలం ఆక్రమణ.. జింకలపల్లి శివారులో ప్రభుత్వానికి సంబంధించిన 10శాతం స్థలాన్ని కొందరు ఆక్రమించి, నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడి, ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. – పెద్ద మద్దిలేటి, సర్పంచ్, జింకలపల్లి, ఎర్రవల్లి మండలం -
నా పొలాన్ని బ్లాక్లిస్టులో పెటారు
నాకు 4ఎకరాల పొలం ఉంది. సుమారు 30ఏళ్ల క్రితం మా పెద్దలు కొనుగోలు చేశారు. బోరుబావి సాయంతో పంటలు పండించుకుంటూ జీవనం చేస్తున్నాం. అయితే మాపై ఇతరులు అక్రమంగా కేసు పెట్టి వేధింపులకు గురిచేశారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా.. గతేడాది మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే నాలుగు రోజుల క్రితం నా పొలాన్ని అధికారులు బ్లాక్లిస్టులో పెట్టారు. దీనిపై అధికారులను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలి. – గోపాల్నాయక్, ఆలూరు, గట్టు మండలం -
గతేడాది మంజూరు కాలేదు..
నాకున్న మూడు ఎకరా ల్లో క్యాలిఫ్లవర్, కాకర, క్యాప్సికం తదితర కూరగాయలు పండిస్తాను. అ యితే గతేడాది సబ్సిడీపై పందిళ్ల ఏర్పాటుకోసం ప్రయత్నించా. యూనిట్లు తక్కువగా ఉండటంతో మంజూరు కాలేదు. ఈ ఏడాది ఎక్కు వ యూనిట్లు రావడం సంతోషంగా ఉంది. – సుదర్శన్రెడ్డి, ఉద్యాన రైతు, గద్వాల పందిళ్ల పద్ధతిన తీగజాతి కూరగాయలు పండించడం ద్వారా అధిక దిగుబడులు వస్తాయి. చీడపీడల బెడద ఎక్కువగా ఉండదు. ఆర్కేవీవై పథ కం కింద సబ్సిడీపై పందిళ్లు ఏర్పాటు చేసుకునేందుకు చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. – మనోహర్, ఉద్యాన రైతు, షాబాద్, ఇటిక్యాల మండలం తీగజాతి కూరగాయలను ఆధునిక విధానంలో పండించేందుకు పందిళ్ల పద్ధతి చాలా మంచింది. ఈ పద్ధతిన నాణ్యమైన ఉత్పత్తులతో పాటు అధిక దిగుబడులు వస్తాయి. ఆసక్తి గల రైతులు దరఖాస్తులు చేసుకో వాలని ఇప్పటికే సూచించాం. దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన రైతులకు 50శాతం సబ్సిడీపై పందిళ్లు ఏర్పాటుచేస్తాం. – రాజ్కుమార్, జిల్లా ఉద్యానశాఖాధికారి ● -
పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలి
గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ఆలూరు ప్రకాశ్గౌడ్, మధుసూదన్బాబు, ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాగునీటి ప్రాజెక్ట్లపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నదుల్లో నీరు ఉండి, వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆర్డీఎస్, జూరాల, పాలమూరు–రంగారెడ్డి, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వార నిర్ణయించిన మేరకు సాగునీరు అందించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వరద జలాల పేరుతో 2005లో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయడంతో పాటు వీటికి నికరజలాలు సాధించాలన్నారు. జస్టిస్ బచావత్, రాజారావు కమిటీలతో నికర జలాల కేటాయింపులున్న ఆర్డీఎస్, జూరాల, భీమా–1, 2, కోయిల్సాగర్ పథకాలకు నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపోతల, వెల్టూరు, గొందిమల్ల బ్యారేజ్, జూరాల–గట్టు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వినోద్కుమార్, సుభాన్, వాల్మీకి, డా.ప్రేమ్కుమార్, నాగన్న, కృష్ణ ఉన్నారు. -
రక్షణ చర్యలు చేపట్టాలి..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో చారిత్రక శిలాశాసనాలు, పురాతన విగ్రహాలు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు స్థానికులపై ఉంది. పురావస్తు అధికారులు వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. జటప్రోల్ మధనగోపాలస్వామి ఆలయం వంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషిచేయాలి. – శివకృష్ణ యాదవ్, కొల్లాపూర్ మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన కాలభైరవ విగ్రహం, 11వ శతాబ్దానికి చెందిన శేషశయన విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోనే టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలోని పురాతన విగ్రహాల రక్షణ, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి. – అశోక్నంద, మల్లేశ్వరం ● -
‘ప్రైవేటు’కు గడ్డుకాలమే
దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రి య ఇప్పటికే మూడు దశ ల్లో పూర్తి అయ్యింది. అ యినా ఆశించిన స్థాయి లో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే ఎప్పుడూ లేనంతగా అడ్మిషన్లు చాలా తక్కువ కావడం ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో సీట్లను ప్రభుత్వ, అటానమస్ డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో చాలా ప్రైవేట్ కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కళాశాలలు.. ఇప్పుడు సీట్ల భర్తీ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యింది. అయినా ప్రైవేటు కళాశాలల్లో గతం కంటే చాలా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహిస్తుందా.. లేదా.. అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. యూజీలో మొత్తం 65 కళాశాలలు ఉండగా వీటిలో 28,860 సీట్లు భర్తీకి ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తే 8,561 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 38 ప్రైవేటు కళాశాలల్లో.. పీయూ పరిధిలో మొత్తం ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలు 38 ఉంటే వాటిలో 13,580 సీట్ల సామర్థ్యంలో వివిధ కోర్సులను యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా వీటిలో కేవలం భర్తీ అయ్యింది 2,394 సీట్లు (17.64 శాతం) మాత్రమే. నాలుగు అటానమస్ కళాశాలలో 5,040 సీట్లు ఉండగా రిపోర్టు చేసిన విద్యార్థులు 3,049 (60.50 శాతం) మంది. వీటితోపాటు 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 10,200 సీట్లు ఉండగా 3,090 మంది (30.29 శాతం) రిపోర్టు చేశారు. ఇలా తక్కువ ఉన్న అటానమస్ కళాశాలల్లో కూడా 3 వేలకు పైగా సీట్లు భర్తీ అయితే.. ఏకంగా 38 కళాశాలలు ఉన్న ప్రైవేటులో మాత్రం తక్కువ సీట్లు కావడంతో చాలా కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో పూర్తయిన చేరికలు ఇప్పటి వరకు సగమైనా పూర్తికాని సీట్ల భర్తీ పీయూ పరిధిలో మొత్తం 28,860 సీట్లకు 8,561 మాత్రమే.. కళాశాలలు మూతబడితే యూనివర్సిటీ ఆదాయానికి గండి యూనివర్సిటీకి పీజీతోపాటు యూజీ విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కళాశాలల్లో సీట్లు పొందితేనే ఆదాయం సమకూరుతుంది. ఉన్న సీట్లలో ప్రతిఏటా తగ్గుదల రావడంతో యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ కళాశాలలు మూతబడుతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అప్లియేషన్, ఇతర పరీక్షలు, సప్లిమెంటరీ ఇలా అనేక రకాల ఫీజులు సమకూరుతాయి. ఒకవేళ ప్రైవేట్ కళాశాలలు మూతబడితే యూనివర్సిటీకి సమకూరే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ పరిధిలో 4 అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. ఇప్పటికే 3,049 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరినా ఆయా ఫీజులు మొత్తం వాటికి మాత్రమే చెందగా.. యూనివర్సిటీకి అరకొర ఆదాయం వస్తుంది. మొత్తంగా అటానమస్ కళాశాలలు పెరగడం, ప్రైవేటు కళాశాలలు తగ్గడంతో యూనివర్సిటీ ప్రతిఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పీయూ పరిధిలోని ప్రభు త్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్, డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్, ఆడిట్సెల్ -
ఉద్యాన రైతుకు ఊరట
–8లో uగద్వాల వ్యవసాయం: జిల్లాలో ఉద్యాన రైతులకు కా సింత ఊరట లభించింది. తీగజాతి కూరగాయల సాగులో భాగంగా ఏర్పాటు చేసుకునే పందిళ్లకు 2026–27 ఆర్థిక సంవత్సరం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై ) కింద రూ. 90లక్షలు (180 యూనిట్లు) మంజూరయ్యాయి. అదే విధంగా క్షేత్రస్థాయిలో రైతుల విజ్ఞాన యాత్రలు, నూతన పద్ధతులపై శిక్షణకు రూ. 50వేలు కేటాయించారు. గతేడా దితో పోల్చితే ఈ ఏడాది కూరగాయల పందిళ్లకు అధికంగా నిధులు విడుదలయ్యాయి. నాణ్యమైన దిగుబడులు.. తీగజాతి కూరగాయలైన సోర, బీరకాయ, కాకర, పొట్లకాయలను పందిళ్ల పద్ధతిలో పండించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు వస్తాయి. కాయలు నేలను తాకకుండా ఉండటం వల్ల వాటికి మంచి ఆకారం, ఆకర్షణీయమైన రంగు వచ్చి.. మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. పందిరి విధానంలో గాలి, వెలుతురు తగలడం వల్ల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం తక్కువే. తీగలు పైకి ఎగబాకడం ద్వా రా ఎక్కువ పూత, పిందెలు వచ్చి.. సాధారణ దిగుబడి కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువ దిగుబడి వస్తుంది. పందరిపై కాయలు స్పష్టంగా కన్పించడం ద్వారా నాణ్యత దెబ్బతినకుండా కోయవచ్చు. పందిరి కింద ఉన్న ఖాళీ స్థలంలో ఆకుకూరలను అంతర్ పంటగా వేయవచ్చు. ఇలా పందిళ్లతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. తగ్గనున్న ఆర్థికభారం.. ఉద్యాన పంటల సాగుపై ఇక్కడి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.ప్రధానంగా కూరగాయల సా గులో నూతన పద్ధతులు తెలిసినప్పటికీ ఆర్థిక పరమైన కారణాల వల్ల అనుసరించడం లేదు. చాలా మంది రైతులు తీగజాతి కూరగాయలను సైతం నేలపైనే పండిస్తున్నారు. పందిళ్లు వేయాలంటే అరెకరాకు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉండటంతో ఆ మేరకు పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. ఆర్కేవీవై పథకం కింద పందిళ్ల ఏర్పాటు కోసం నిధులు మంజూరు కావడం ఉద్యాన రైతులకు కాసింత ఊరటనిస్తుందని చెప్పవచ్చు. రాయితీపై కూరగాయల పందిళ్లు జిల్లాకు 180 యూనిట్లు మంజూరు దరఖాస్తులు ఆహ్వానించిన ఉద్యానశాఖ సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం -
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
మల్దకల్/కేటీదొడ్డి: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలంలోని ఎల్కూరు, తాటికుంట, సద్దలోనిపల్లి, కేటీదొడ్డి మండలంలోని చింతకుంట, ఇర్కిచేడు, మైలగడ్డ గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల సీఎం రేవంత్రెడ్డి సారధ్యంలోని ప్రజాపాలనలో సాకారమవుతోందన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత 3,500 ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో 2వేల ఇళ్లకు పైగా నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మిగతా లబ్ధిదారులు త్వరగా ఇళ్లను నిర్మించుకోవాలని.. బిల్లులు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, నాయకులు రాజారెడ్డి, చక్రధర్రెడ్డి, గోపాల్రెడ్డి, కృష్ణారెడ్డి, విజయ్, ఉరుకుందు, చంద్రశేఖర్, తాయప్ప, విశ్వనాథ్రెడ్డి పాల్గొన్నారు. -
జోగుళాంబదేవికి బంగారుపూత చీర
అలంపూర్ రూరల్: హైదరాబాద్ నగరానికి చెందిన తీగల క్రాంతికుమార్రెడ్డి జోగుళాంబ అమ్మవారికి బంగారు పూత చీర విరాళంగా సమర్పించినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి దీప్తిరెడ్డి తెలిపారు. జోగుళాంబ అమ్మవారికి రాగిలోహంపై బంగారు పూతతో కూడిన 13 భాగాలు గల చీర (కవచం)ను విరాళంగా ఇచ్చారని, దీని విలువ సుమారు రూ.9,27,000 ఉంటుందని పేర్కొన్నారు. దాత కోరిన రోజు ఈ చీరను అమ్మవారికి అలంకరిస్తామని చెప్పారు. అలాగే శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామి జోగుళాంబ అమ్మవారికి శ్రీ చక్ర అభిషేకం నిమిత్తం 817 గ్రాముల బరువు గల వెండి కమండలం, అభిషేక పాత్రలను బహూకరించారని ఈఓ వెల్లడించారు. -
గట్టు ఎత్తిపోతల కాల్వల పనులు వేగవంతం
కేటీదొడ్డి: నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం పరిధిలోని ప్రధాన కుడి కాల్వ, ఎడమ కాల్వల నిర్మాణం కోసం భూ సేకరణ సర్వే శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో మండలంలోని మల్లాపురం, కేటీదొడ్డి గ్రామాల పరిధిలో జరుగుతున్న సర్వే పనులను శనివారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాల్వల అలైన్మెంట్, రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సర్వే ప్రక్రియలో ఎక్కడా ఆలస్యం జరగకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ గద్వాల న్యూటౌన్: తీగజాతి కూరగాయల సాగులో భాగంగా పందిళ్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యానవన అధికారి రాజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర ఎకరా యూనిట్గా పరిగణిస్తారని, ఒక యూనిట్ విలువ రూ.లక్ష కాగా.. 50 శాతం సబ్సిడీపై రూ.50 వేలకు అందిస్తారన్నారు. దరఖాస్తు ఫారాలు ఆయా ఉద్యానవన శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తుకు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ జిరాక్స్ పత్రాలను జతపరిచి పాస్పోర్ట్ సైజు ఫొటోతో ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలకు గద్వాల డివిజన్ ఉద్యాన అధికారి రాజశేఖర్ సెల్ నం.89777 14295, అలంపూర్ డివిజన్ అధికారి ఇమ్రానా సెల్ నం. 89777 14296, అయిజ డివిజన్ అధికారి మహేష్ సెల్ నం. 89777 14297లను సంప్రదించాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యం హన్వాడ: పాలమూరు జిల్లా జలవనరుల పరిరక్షణకు దశాబ్దాలుగా నలుగుతున్నా.. పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 19న రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్నును జేఏసీ నాయకులు హన్వాడలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోరాటం రాజకీయాలకతీతంగా జిల్లా ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత విస్తారమైన కృష్ణానది పరివాహక ప్రాంతం దాదాపు 300 కి.మీ. మహబూబ్నగర్లోనే ఉన్నప్పటికీ.. సాగు, తాగునీటి కష్టాలు తప్పకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశా రు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ప్రాజెక్టులు పూర్తి చేసి రిజర్వాయర్లలో నీటిని నింపితే వలసలు ఆగిపోతాయన్నారు. -
సమయానికి.. పూర్తయ్యేనా సర్!
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చదువుకోని నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బుందులు ఎదురవుతున్నాయి. తిరిగి ఇవ్వడంలో జాప్యం బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి.. వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో బీఎల్ఓలు ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్గా మారింది. 97.68 శాతం పంపిణీ పూర్తి ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ -
పకడ్బందీగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
గద్వాల: ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా వందశాతం పూర్తిచేయాలని డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి చెన్నయ్య అధికారులను ఆదేశించారు. సర్–2026లో భాగంగా శనివారం డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి చెన్నయ్య గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిచేడు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఓటరుని గుర్తించి జాబితాలో నమోదు చేయడం అధికారుల ప్రధాన బాధ్యత అన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ను కూడా వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. డాటా నమోదు సమయంలో అత్యంత జాగ్రత్తతో నమోదు చేయాలని సూచించారు. ఇంటింటి సర్వేను పూర్తిస్థాయిలో నిర్వహించి ఏఎస్డీ(ఆబ్సెంట్ షిఫ్టెడ్, డెత్) జాబితాను క్షేత్రస్థాయి ధ్రువీకరణ ఆధారంగా సిద్ధం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న డిజిటలైజేషన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయడంతోపాటు డాటా ఎంట్రీలో డూప్లికేట్ నమోదు, అసంపూర్తి వివరాలు లేదా ఇతర లోపాలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ హరికృష్ణ, ఎన్నికల విభాగం అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు. -
365 సంచులు కొన్నా..
మొక్కజొన్న అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వెళ్తే.. గన్నీ బ్యాగులు లేవని చెప్పారు. అప్పుడేమో అధికారులు బ్యాగులు తెచ్చుకున్న రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పారు. సరే అనుకొని కొంటే రూ.30 పడిన బ్యాగుకు ఇప్పుడు కేవలం రూ.15 ఇస్తున్నారు. ఎటు తిరిగి రైతులకే నష్టం వస్తుంది. – రాముడు, రైతు, వడ్డేపల్లి రూ.31 తీసుకున్నారు.. ధాన్యం అమ్ముకునేందుకు కేంద్రాల దగ్గర పడిగాపులు కాశాను. నా ధాన్యం అమ్మే సమయానికి సంచులు లేవని చెప్పి, మళ్లీ వారం ఆలస్యం చేశారు. దీంతో మార్కెట్లో ఒక్కో సంచి రూ.31 చొప్పున 717 సంచులు కొన్నాను. ఇప్పుడేమో అధికారులు రూ.15 ఇస్తున్నారు. కొనుగోలు సమయంలో ఆన్లైన్ చేద్దామంటే.. రెండు వారాల దాక ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించలేదు. – మహేంద్ర, రైతు, శాంతినగర్ ● -
బ్యాగుల కొరత.. బిల్లులు అరకొర
రాజోళి: అష్టకష్టాలు పడి మొక్కజొన్న అమ్ముకున్న రైతులకు రావాల్సిన బిల్లులు ఇంకా పూర్తిస్థాయిలో అందకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. గత మే నెల వరకు కొనసాగిన మొక్కజొన్న కొనుగోలులో.. తమ పంటను అమ్ముకునేందుకు రైతులు చేసిన ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. దీనికి తోడు వ్యాపారులు, దళారులు చేతివాటంతో కొనుగోలు ప్రక్రియలో ఎన్నెన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆరుబయట స్థలాల్లో ఆరబోసుకుని తమవంతు వచ్చే వరకు ఎదురుచూసిన రైతులను లారీలు సక్రమంగా రాకపోకవడంతోపాటు గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా వేధించింది. అసలు సమస్య బ్యాగులదే.. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా రైతులకు లక్షలాది గన్నీ బ్యాగులు అవసరమయ్యాయి. జిల్లాలోని 11 పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టగా.. బ్యాగులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ, పంట దిగుబడులు కొనుగోలు కేంద్రాలకు చేరాక కూడా గోనె సంచులు అందుబాటులోకి రాలేదు. బ్యాగులు పంపాల్సిన కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. చివరికి రైతులే బ్యాగులు ఏర్పాటు చేసుకోవాలని, దానికి ప్రభుత్వం నుంచి డబ్బులు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీంతో బహిరంగ మార్కెట్లో ఒక గన్నీ బ్యాగుకు రూ.30 చొప్పున వెచ్చించి రైతులు కొనుగోలు చేశారు. 11 కొనుగోలు కేంద్రాల దగ్గర 12 లక్షల బ్యాగుల్లో లోడ్ చేశారు. అప్పటికే ప్రభుత్వం నుంచి కేవలం 3 లక్షల బ్యాగులు మాత్రమే రైతులకు అందగా.. మిగతా 9 లక్షల బ్యాగులు రైతులే తెచ్చుకున్నారు. కాగా ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాక రెండు వారాలకు పైబడి గన్నీ బ్యాగుల నమోదు లేకపోవడంతో చాలామంది రైతులు నమోదు చేసుకోలేకపోయినట్లు తెలుస్తుంది. మొత్తం రూ.1,80,10,500 ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1,35,10,500 గన్నీ బ్యాగులు కొనుగోలు చేసిన రైతులకు అందజేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా రూ.45 లక్షల వరకు రైతులకు ఇవ్వాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రైతులు వెచ్చించిన డబ్బులకు, అధికారులు చెల్లించిన డబ్బులకు సగానికి కోత ఉందని రైతులు వాపోతున్నారు. వడ్డేపల్లి పీఏసీఎస్లో గన్నీ బ్యాగుల బిల్లులు అందజేస్తున్న అధికారులు మొక్కజొన్న కొనుగోలుకు గన్నీ సంచులు సమకూర్చని ప్రభుత్వం అధికారుల సూచనతో స్వయంగా తెచ్చుకున్న రైతులు అప్పటి డిమాండ్నుబట్టి రూ.30 చొప్పున వెచ్చింపు తాజాగా ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.15–22 మాత్రమే.. బిల్లులు త్వరగానే ఇచ్చినా నష్టపోయిన అన్నదాతలు ఎవరికి లాభమో.. గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు. మీరే తెచ్చుకోండి.. మీకు బిల్లు వస్తుందని అధికారులు చెబితే రైతులంతా ఒకేసారి బ్యాగుల కోసం ఎగబడ్డారు. ఇదే అదునుగా ఒక్కో సంచి రూ.30 చొప్పున అమ్మారు. అయితే ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు ఒక్కో సంచికి రూ.22, నేరుగా లెక్క రాయించిన వారికి కేవలం రూ.15 చొప్పున వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచి కొనుగోలు చేసిన దాంట్లో సగం ధరనే ఇచ్చే బదులు, కొనుగోలు సమయంలోనే ఆ ధరలకు బ్యాగులు తెప్పించి ఇచ్చి ఉంటే ఈ నష్టం మాకు కలిగేది కాదని, ఒక్కో సంచికి రూ.15 అయినా లక్షల సంచుల మీద ఎంత మేర.. ఎవరికి లాభం చేకూరుతుందోనని రైతులు విమర్శిస్తున్నారు. వారం రోజుల్లో చెల్లిస్తాం.. ధాన్యం కొనుగోలు సమయంలో బ్యాగుల కొరత ఉన్న మాట వాస్తవమే. అప్పుడు రైతులు కొన్నారు. ఆన్లైన్లో నమోదు ఉన్న వారికి రూ.22, నేరుగా రాయించిన వారికి రూ.15 చొప్పున ఇప్పటికే రూ.కోటికిపైగా అందజేశాం. పెండింగ్లో ఉన్న డబ్బులను మరో వారంలో రైతులకు అందజేస్తాం. – రాణి, ఇన్చార్జి డీసీఓ -
మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకోలేనిది..
● ఈ మండలాన్ని డిప్యూటీ సీఎం భట్టి దత్తత తీసుకోవాలి ● అభివృద్ధి చెందిన ప్రాంతంగా ప్రభుత్వ లెక్కల్లో చూపెట్టాలి.. ● ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి సహకారం అందించాలి.. ● కృతజ్ఞతసభలో సీఎం రేవంత్రెడ్డి ● రూ.47.08 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘2006 జూలై 4.. నేను గెలిచిన గెలుపు నాది కాదు. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. ఆ రోజు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క.. ఈనాడు మహా వృక్షమైంది. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రస్థానం మొదలు పెట్టి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నిలిపింది. ఈ స్థాయికి ఎదిగానంటే మీరే కారణం. నిధులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. మీకు ప్రాణమిచ్చినా తక్కువే.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలకేంద్రంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయత కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం ముందుగా అప్పటి ఉమ్మడి మిడ్జిల్ పరిధి, ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆనాటి మిడ్జిల్ మండల పెద్దలు, నాయకులు, ఆత్మీయులు సుమారు 150 మందిని ఆత్మీయంగా పలకరించి.. ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిడ్జిల్ సమీపంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పెద్దఎత్తున సభ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మిడ్జిల్ మండల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారనేది ఆయన మాటల్లోనే.. -
దుమ్ము లేపుతున్నారు!
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026–8లో uధరూరు: అంతర్రాష్ట్ర రహదారి రాయిచూరు రోడ్డు గుంతలమయంగా తయారైంది. అడుగడుగునా గుంతలు ఏర్పడి వాహనదారులకు పట్టపగలే చుక్క లు చూపిస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. మోకాలి లోతు గుంతలతో వా హనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడిగా సమస్య ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ మార్గంలో వెళ్లడమంటేనే వాహనదారులు, డ్రైవర్లు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వేసిన రోడ్డు కావడంతో అక్కడక్కడ గుంతలు ఏర్పడి వాహనాల రాక పోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. అయితే సంబంధిత ఆర్అండ్బీ అధికారులు అప్పడుప్పుడు గుంతల్లో మట్టిపోసి కాలం వెల్లదీస్తున్నారు తప్ప శాశ్వత ప్రా తిపది కన పనులు చేపట్టడం లేదు. కనీసం ప్యాచ్ వర్క్లైనా చేయడం లేదని వాహనదారులు కోరుతున్నారు. పెరిగిన వాహనాల రద్దీ.. ఇటీవల కాలంలో అంతర్రాష్ట్ర రాయిచూరు రహదారిలో రద్దీ విపరీతంగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్, జమ్ములమ్మ జాతర నేపథ్యంలో జన సంచారంతో రద్దీ పెరిగింది. మరోపక్క రోజురోజుకు వాహనాల రాకపోకలు సైతం విపరీతంగా పెరిగాయి. ఆర్అండ్బీ శాఖ అధికారులు అక్కడక్కడ ప్యాచ్ వర్క్ పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారని వాహనదారులు విమర్శిస్తున్నారు. మరికొన్ని చోట్ల బీటీ రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మట్టి పోసి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే మట్టి పోయడం వల్ల వాహన రాకపోకల సమయంలో దుమ్ము ఎగసిపడుతోంది. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లలో దుమ్ము పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వానంగా గద్వాల– రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి ఎక్కడికక్కడే ఏర్పడిన గుంతలతో ఇక్కట్లు తరచూ ప్రమాదాల బారినపడుతున్న వాహనదారులు పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు -
హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం
కేటీదొడ్డి: ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కేంద్రాలుగా నిలవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం ధరూర్ మండలంలోని ర్యాలంపాడులో నిర్వహిస్తున్న కేటీదొడ్డి మహాత్మ జ్యోతిబాపులే తెలంగాణ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్య, వసతి, భోజన సౌకర్యాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అన్నారు. పోషకాహారం అందించాలని, హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు విద్యా ప్రగతి, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. -
వేతనాల సంబురం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు ఎట్టకేలకు పెరిగాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి వేతనాల పెంపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025 నవంబర్లో తీసుకువచ్చిన జీఓకు అనుగుణంగా వేతనాలను సిబ్బంది ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సూచించిన విధంగా క్యాడర్ ఆధారంగా వేతనాలు ఇచ్చారు. అయితే ఇక నుంచి పీయూలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కిందకి వెళ్లారు. ఈ కారణంగా పలువురు సిబ్బంది అభద్రతా భావానికి లోనవుతున్నారు. మొత్తం 280 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు ఏజెన్సీల కింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే 7 నెలల క్రితమే నాన్టీచింగ్ సిబ్బందితో పీయూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఔట్సోర్సింగ్లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎస్ఎంఎఫ్ పోర్టల్లో సిబ్బంది పేర్లు నమోదు చేసి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు. పీయూలో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్సోర్సింగ్లో కలపాలని రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరిపి 2025 నవంబర్ 11న జీఓ 1626 తీసుకువచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదు. కానీ శుక్రవారం సాయంత్రం సిబ్బందికి పెరిగిన వేతనాలతో ఖాతాలో జమయ్యాయి. దీంతో 2014 తర్వాత విధుల్లో చేరిన పలువురు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెరిగినట్లు తెలిసింది. అయితే వేతనాల జీఓ వచ్చిన నెల నుంచి ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు కనీసం రూ.20–30 వేల వరకు నష్టపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2010 కంటే ముందు విధుల్లో చేరిన సిబ్బందికి వేతనాలు పెరగకపోగా కొంత మందికి కోత విధించినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు సీనియర్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన వేతనాలతో పీయూతోపాటు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పనిచేస్తున్న సుమారు 280 మంది సిబ్బందికి మేలు జరగనుంది. ఈ నెల నుంచే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగింత 2010 కంటే ముందు విధుల్లో చేరిన వారి అసంతృప్తి పెరిగిన జీతాలతో సుమారు 280 మందికి మేలు -
మరమ్మతు చేపట్టాలి..
గద్వాల– రాయిచూరు రోడ్డుకు మరమ్మతు చేపట్టాలి. నడి రోడ్డుపై ఏర్పడిన గుంతలను మట్టితో కాకుండా ప్యాచ్ వర్క్స్తో పనులు చేపట్టాలి. మట్టిపోయడం వల్ల వాహన రాకపోకల సమయంలో దుమ్ము ఎగసిపడుతోంది. కళ్లల్లో దుమ్ము పడడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలి. – దావీదు, వాహనదారుడు, ధరూరు గద్వాల– రాయిచూరు రోడ్డుకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. గుంతలలో మట్టి పోసి వాహనదారులకు కొంత ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – ప్రగతి, ఆర్అండ్బీ ఈఈ ● -
హాకా రైతు సేవా కేంద్రంతో రైతులకు మేలు
కేటీదొడ్డి/ ఎర్రవల్లి/ అలంపూర్ రూరల్: రైతాంగానికి అవసరమైన అన్ని రకాల సేవలు, సదుపాయాలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సేవా కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని కోండాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు సాగుకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ అందుబాటులో ఉండే హాకా రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెంకటరాములు, జిల్లా కోశాధికారి రామచంద్రరెడ్డి, కిసార్ మోర్చా అద్యక్షుడు కిష్టన్న, మండలాధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, హన్మిరెడ్డి, భీంరెడ్డి, వీరేష్, సూర్యకాంత్రెడ్డి, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఎంపీ డీకే అరుణ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆమెకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అధికారులు శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనం పలికారు. అలాగే జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎంపీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శక్తి స్వరూపిణి జోగుళాంబతల్లి దీవెనలు దేశ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: క్రైస్తవ మైనారిటీ ఆర్థిక సంస్థ ద్వారా అర్హులైన క్రైస్తవుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ మహిళాశక్తి పథకం (కుట్టు మిషన్), ఆర్థిక సహాయం పథకం(చిన్న వ్యా పారాన్ని ప్రారంభించడానికి రూ.50 వేలు), డ్రైవర్ సాధికారత (ఈ–బైక్, ఈ–స్కూటీ, పెట్రోల్ బైక్, స్కూటీలు ఒక్కొక్కటి రూ.1.50 లక్షలు) కోసం ఆన్లైన్ http.tso bmms.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్.. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మైనారిటీ స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అక్బర్పాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 18 వరకు tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుట్టుమిషన్ చిరు వ్యాపారులు 21–55 ఏళ్లలోపు వారు, ఈ–బైక్, ఈ–స్కూటీ, మోటార్ బైక్ కోసం వయసు 21–50 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు ఉండాలని చెప్పారు. గడువు పొడిగింపు గద్వాల: జిల్లాలోని విద్యార్థులకు 2026–27, 28 సంవత్సరాలకు గాను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐ ఎన్సీవీటీ ప్యాట్రన్ కింద ఇంజినీరింగ్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తు తేదీని ఈ నెల 10 వరకు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపల్ జిల్లా కన్వీనర్ విశ్వపాలకరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1.5.2026 నాటికి 14 ఏళ్లు నిండి 8 లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు కొన్ని కోర్సులకు మాత్రమే అర్హులన్నారు. అడ్మిషన్ కోసం విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యేక మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్కార్డు కలిగి ఉండాలన్నారు. ట్రైనింగ్ వెరిఫికేషన్ కోసం ట్రెయినీలు రిజిస్టర్ మొబైల్ నంబర్ మాత్రమే వినియోగించాలన్నారు. ఆసక్తి గలవారు http.iti.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.85004 64782లను సంప్రదించాలని సూచించారు. హుండీ ఆదాయం రూ.20.29 లక్షలు గద్వాల న్యూటౌన్: నడిగడ్డ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ అమ్మవారి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు.దేవాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరి, ఆల య ఈ ఓ పురంధర్కుమార్ పర్యవేక్షణలో యూనియ న్ బ్యాంకు సిబ్బంది,ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో మూడు నెలల హుండీని లెక్కించగా.. రూ.20.29 లక్షల ఆదాయం సమకూరింది.హుండీ లెక్కింపులో నగదు మాత్రమే ఉందని, వెండి, బంగారు రాలేదని ఈఓ తెలిపారు. -
వందనాలు ‘మిడ్జిల్’..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 2006లో ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రి హోదాలో వందన సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు చెందిన ఆనాటి ఆత్మీయులతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలలో రేవంత్రెడ్డి పర్యటన అటు రాజకీయంగా, ఇటు భావోద్వేగ పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన ప్రయాణంలో మిడ్జిల్ ప్రజల ఆశీర్వాదం కీలకమని రేవంత్రెడ్డి భావిస్తున్నారు. ‘పాలమూరులోని నల్లమలలో పుట్టిన ఈ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిని అయ్యానంటే మీ ఆశీర్వాద ఫలితమే. మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం దక్కింది. ఈ నేల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అంటూ ఉమ్మడి పాలమూరులో పలుమార్లు పర్యటించిన సందర్భంగా ఆయన వెల్లడించారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు పడిన మిడ్జిల్లో జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న సమయంలో తనతో కలిసి తిరిగిన ఆనాటి పెద్దలు, నాయకులు, అనుచరులతో ఊర్కొండ ఆలయ ఆవరణలో మమేకం కానున్నారు. ఈ మేరకు మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లోని 150 మందికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఒక్కో టేబుల్ దగ్గర ఐదుగురు కుర్చునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం ఒక్కో టేబుల్ వద్దకు వెళ్లి వారిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకోనున్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మండలానికి వస్తుండడంతో స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండలకేంద్రంలోని కాలనీలకు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తండాలు, గ్రామాలకు బీటీ రోడ్లతో పాటు ఊర్కొండ ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. నేడు సీఎం రేవంత్రెడ్డి కృతజ్ఞత సభ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని పర్యటన ఊర్కొండలోని హనుమాన్ ఆలయంలో పూజలు ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేసిన నేలలో ఆత్మీయులతో భేటీ -
పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు
గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంత్సరానికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), కంప్యూటర్ ప్రోగ్రామింగ్ (సీపీఎస్), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) బ్రాంచ్ల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసి.. కౌన్సెలింగ్లో సీటు పొందని అభ్యర్థులతో పాటు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. గోన్పాడులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని.. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, పాలిసెట్ ర్యాంక్ కార్డు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువపత్రం, ఇతర సంబంధిత పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. -
మట్టి నమూనా సేకరణ..
గత మే 26న జలాశయం మట్టి నమూనా సేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందుకోసం జలాశయంలో మొత్తం ఎనిమిది చోట్ల బోరుడ్రిల్లింగ్ చేయించి, మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చోట్ల సేకరించిన మట్టి నమూనాలను హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్కు పంపారు. మిగిలిన నాలుగు చోట్ల సేకరించే మట్టిని కూడా టీఎస్ఈఆర్ఎల్కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక, మట్టి నమూనాలను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు పంపించి.. ఆనకట్టలోని రాక్టోల్, తూముల అడుగు భాగంలో ఎలాంటి మట్టి ఎన్ని లేయర్లతో నిర్మాణం చేపట్టాలనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు మరమ్మతు చేపట్టనున్నారు. -
పలుమార్లు ఇంజినీర్ల బృందం సందర్శన..
● సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు.. ఆనకట్ట రిపేరుకు రూ.3.66 కోట్లు మంజూరు ● ప్రారంభమైన మట్టి నమూనాల సేకరణ ● పుణె సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికతో మరమ్మతు పనులు ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు సంబఽంధించి ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం మట్టి నమూనా సేకరణ పనులు కొనసాగుతున్నాయి. అనంతరం పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందం ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపడుతాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ గద్వాల: నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుండెకాయగా పిలువబడే ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నాలుగేళ్ల క్రితం ఆనకట్టకు లీకేజీలు ఏర్పడటంతో 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా జలాయశం ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్లో రెండవ పంటకు సాగునీరు లభించక క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట మరమ్మతు కోసం ఆయకట్టు రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. లోపభూయిష్ట నిర్మాణంతో.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శ్రీకారం చుట్టారు. 2009 వరకు ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టింది. వైఎస్సార్ అకాల మరణంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయ్యాయి. అయితే ప్రాజెక్టులో మొత్తం ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ఇందులో ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ఇందులో 4 టీఎంసీలు ర్యాలంపాడు రిజర్వాయరే కావడం ప్రాధాన్యత తెలియజేస్తుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ పనులను దక్కించుకున్న గుత్తేదారు.. లోపభూయిష్టంగా నిర్మించడం, అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో అందుబాటులోకి వచ్చిన రెండేళ్లకే ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా సుమారు 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఒక పంటకే సాగునీటిని అందించాల్సిన దుస్థితి నెలకొంది. ర్యాలంపాడు రిజర్వాయర్కు మరమ్మతు చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా రూ.60 లక్షలతో హైదరాబాద్కు చెందిన ఓ ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరు నెలలపాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. వారు రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించి.. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు రిజర్వాయర్ మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. -
మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
● కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసి ఆస్తులు కూడబెట్టుకుంది.. ● నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన – ప్రగతి నివేదిక, మహనీయుల జాతర ముగింపు సమావేశం నిర్వహించగా.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ప్రధానంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, సన్నరకం వరిధాన్యానికి రూ. 500 బోనస్తో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి.. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజీఎస్డీజీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుడ్డెందొడ్డికి ఇబ్బంది లేకుండా చర్యలు
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన లిఫ్ట్–1 గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనులకు ఇంజినీర్లు శ్రీకారం చుట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుడ్డెందొడ్డిని సందర్శించిన విషయం తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఇంజినీర్ల బృందం గుడ్డెందొడ్డి రిజర్వాయర్ వద్ద డీపీఆర్ సర్వే పనులను ప్రారంభించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అక్కడికి చేరుకొని ఇంజినీర్లతో మాట్లాడారు. 15 టీఎంసీల సామర్థ్యానికి రిజర్వాయర్ను పెంచుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అదే సమయంలో గుడ్డెందొడ్డి గ్రామస్తులు అక్కడికి చేరుకొని తమ గ్రామానికి ముంపు ముప్పు లేకుండా చూడాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే.. గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గుడ్డెందొడ్డికి ఎలాంటి ముంపు ముప్పు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట గుడ్డెందొడ్డి రఘువర్ధన్రెడ్డి, కురుమన్న ఉన్నారు. -
రంగనాథుడి సన్నిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాన్ని గురువారం తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆమెకు పూలమొక్క అందజేయగా.. అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయకస్వామిని కమిషనర్ కుటుంబం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేషవస్త్రాలు అందించి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని తంజాపూర్ చిత్రాలు, స్వామివారి వెండి వాహనాలను తిలకించారు. రంగసముద్రం జలాశయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ వరలక్ష్మి, సర్పంచ్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
90శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
గద్వాల: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ కోరారు. గురువారం కలెక్టరేట్లో తన చాంబర్లో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు జిల్లాలో సర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 90.99శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు పూర్తి సరైన వివరాలతో నింపి.. సంబంధిత బీఎల్ఓలకు తిరిగి అందించేలా చైతన్యపర్చాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి.. ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందిందుకు తమవంతు సహకారం అందించాలన్నారు. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి.. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. వాటి పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారి ముంజుల, తహసీల్దార్ హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మల్దకల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సూచించారు. గురువారం మల్దకల్ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం ఆవశ్యతకపై అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా అర్హులైన పేదలు ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. సీజనల్గా ప్రబలే వ్యాధుల నివారణకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి.. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ జాకీర్ ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,542 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు గురువారం 984 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,542, కనిష్టంగా రూ. 3,110, సరాసరి రూ. 6,050 ధరలు పలికాయి. అదే విధంగా 13 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాకు రూ. 1,809 ధర వచ్చింది. క్వింటా కందులు రాగా.. రూ. 6,389 ధర పలికింది. ఉత్సాహంగా వాలీబాల్ అకాడమీ ఎంపికలుమహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న వాలీబాల్ అకాడమీ ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రస్థాయి బాలబాలికల సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 71 మంది బాలురు, 24 మంది బాలికలు హాజరయ్యారు. ఈ సెలక్షన్ ట్రయల్స్ను జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, వసతి, భోజనంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలను కల్పిస్తూ క్రీడారంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. ట్రయల్స్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎత్తు, శారీరక దారుఢ్యం, ఆట నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ ఆధారంగా ఎంపిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిష్ణాతులైన కోచ్ల ద్వారా ఉన్నతస్థాయి శిక్షణతో పాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మొదటిరోజు నామినేషన్లు నిల్ అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు తెలిపారు. 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని.. నామినేషన్ ఫారాలు తీసుకున్న వారు ఎన్నికల ఫీజు బీసీ కుల ధ్రువీకరణ పత్రం జత చేస్తే రూ.750, లేకుంటే రూ.1000 చెల్లించాలన్నారు. వీటితోపాటు ఎన్నికల వ్యయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు అదనంగా రూ.2 వేలు ముందస్తుగా చెల్లించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10వ తేదీన చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
బాల్యానికి భరోసా!
●ఏడేళ్లలో వెట్టి నుంచి విముక్తి పొందిన బాలలు ఇలా.. గద్వాల క్రైం: పుస్తకాలతో బడులకు పరుగులు తీయాల్సిన బాలలు ఎంతో మంది వెట్టిచాకిరీ అనే బరువును భుజస్కాందాలపై వేసుకుని తమ ఆశయాలను బాల్యంలోనే బందీ చేసుకుంటున్నారు. పంట పొలాలు, హోటళ్లు, వస్త్ర, కిరాణ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ధనవంతుల ఇళ్లలో పనులు చేస్తూ కొందరు.. రైల్వేస్టేషన్, బస్టాండ్ కూడళ్లలో భిక్షాటన చేస్తూ మరికొందరు బాలలు మగ్గిపోతున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫాలితాన్నిస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. వెట్టిలో మగ్గిపోతున్న ఎంతో మంది బాలలకు విముక్తి కల్పిస్తున్నారు. జిల్లాలో గతేడాది 72మంది బాలకార్మికులను గుర్తించగా.. ప్రస్తుతం ఆపరేషన్ ముస్కాన్–14 కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా బాలకార్మికులను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా గుర్తించినప్పటికీ మళ్లీ యథాస్థితికే చేరుతున్నారు. హోటళ్లు, ఇతర దుకాణ సముదాయాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి బడులకు పంపుతున్నా.. మళ్లీ కొంతకాలానికి తిరిగి పనుల్లోనే దర్శనమిస్తుండటం గమనార్హం. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంటుంది. మరోవైపు ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి తప్పిపోయి వచ్చి ఎక్కడో ఒక చోట యాచకులుగా మారి జీవనం సాగిస్తున్నారు. అయితే నెలల తరబడి పనులు చేస్తున్న చిన్నారులను పట్టించుకోని ఆయా శాఖల అధికారులు.. ఈ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మాత్రమే దృష్టి సారించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన కార్మికశాఖ, ఐసీపీఎస్, విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపడితేనే అనుకున్న లక్ష్యం సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెట్టిచాకిరీ నుంచి విముక్తి దిశగా కార్యాచరణ జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు గతేడాది 72 మంది బాలకార్మికుల గుర్తింపు నడిగడ్డలో బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించడంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తోంది. పోలీసు, కార్మికశాఖ అధికారులతో పాటు బాలల సంరక్షణ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బాలలతో పనులు చేయించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వెట్టి నుంచి విముక్తి పొందిన పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. సమీప పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. -
ఫీజు తగ్గించాలి..
గత ఐదేళ్ల నుంచి అయిజలో పశువుల సంత నిర్వహిస్తున్నారు. పశువులను కొనుగోలు చేసిన వారి నుంచి మార్కెట్ అధికారులు మొదట్లో ఫీజుగా గొర్రెలు, మేకలకు ఒక్కొక్క దానికి రూ.10, ఆవులు, గేదెలకు ఒక్కొక్క దానికి రూ.50 వసూలు చేశారు. కానీ, 2024 నుంచి నూటికి రూ.1 చొప్పున వసూలు చేస్తుండడంతో రైతులకు భారంగా మారింది. మార్కెట్ ఫీజును తగ్గిస్తే బాగుంటుంది. – తిక్కన్న, రైతు, తొత్తినోనిదొడ్డి వసతులు కల్పించాలి పశువుల సంతలో అధికారులు మౌలిక వసతులు కల్పించలేదు. కనీసం పశువులకు తాగునీరు, నీడ కూడా లేదు. వర్షం కురిస్తే చెట్ల కిందకు పరుగెత్తాల్సి వస్తుంది. క్రయవిక్రయాల ద్వారా వస్తున్న ఆదాయంను మౌలిక వసతులు కల్పించేందుకు వినియోగిస్తే అభివృద్ధి జరుగుతుంది. – లింగన్న, రైతు, అయిజ ● -
వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
అలంపూర్ రూరల్: వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ చట్టాన్ని అమలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా మూడు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరిగిందన్నారు. వీబీజీ రాంజీ చట్టం అమలుతో దేశంలో 30 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతారని, పని అడిగే హక్కును సైతం కోల్పోతారని, వ్యవసాయ కూలీలు మళ్లీ వలస పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం తర్వాత పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడంతో కార్మికుల ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు, పని పరిస్థితులు, సంక్షేమ ప్రయోజనాలు ఒక దెబ్బతో నిర్వీర్యం చేసేందుకే ఈ కోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, సంక్షేమ చర్యలను కూడా ప్రమాదంలోకి నెట్టి వేస్తుందని, విద్యుత్ ప్రైవేటీకరణ పేరుతో ప్రజలపై మరో కొత్త భారాన్ని మోపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బుధవారం నుంచి అమలవుతున్న వీబీజీ రాంజీ, విద్యుత్ రంగ విభజన, ప్రైవేటీకరణ చట్టాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏమెలమ్మ, వెంకటస్వామి, ఏలియా తదితరులు పాల్గొన్నారు. -
నిందితులకు శిక్ష పడాలి
గద్వాల క్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తిని బుధవారం ఎస్పీ శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని నమోదైన పలు కేసులపై మాట్లాడారు. కేసుల నమోదుతోపాటు నిందితులకు శిక్ష పడేలా అ ధికారులు వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేలా చూడాలని న్యాయమూర్తి ఎస్పీకి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ జాప్యం కనబర్చకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు కృషి ధరూరు: మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద అన్నారు. బుధవారం ధరూరులోని ప్రభుత్వ జూనియర్ కళా శాలలో ‘నిషా ముక్త్ భారత్ అభియాన్– వికసిత్ భారత్కి పెహచాన్’ వారోత్సవాల సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్ర మ రవాణా నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి ఒక పెద్ద శాపమని, ముఖ్యంగా పిల్లలు, యువత భవిష్యత్ను తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. మత్తు పదార్థాల వ్యసనం వల్ల కుటుంబాలు ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం, ఐక రాజ్య సమితి మాదక ద్రవ్యాలు, నేరాల కార్యాలయం (యూఎన్ఓడీసీ) ప్రకటించిన బ్రేక్ ది సైకిల్– స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైం అనే థీమ్తో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. అనంతరం ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపనకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు. సర్వీస్ పెన్షన్ సాధించడమే లక్ష్యం గద్వాల న్యూటౌన్: సర్వీస్ పెన్షన్ సాధించడమే తమ అంతిమ లక్ష్యంగా పోరాటం చేస్తామని టీఎస్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ హక్కుల సాధన కోసం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సీపీఎస్ రద్దే ధ్యేయంగా వచ్చే నెలలో జిల్లావ్యాప్తంగా జనజాగరణ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఈ యాత్ర విజయవంతం చేసేందుకు ‘సామాజిక భద్రత– మన జన్మ హక్కు’ నినాదంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో చైతన్యం తేవాలన్నారు. ప్రతి మండలంలో యూనియన్ సభ్యత్వ నమోదు పెంచాలన్నారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతర కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు బుచ్చన్న, రాష్ట్ర సహధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షులు ప్రతాప్రెడ్డి, ఎల్లస్వామి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, పరశురాముడు, పుట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కొత్తకోట రూరల్: మోజర్ల ఉద్యాన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రా డ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ వీణ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. బైపీ సీ విద్యార్థుల కోసం నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశా లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని.. ఈ నెల 29లోగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని.. దరఖాస్తుల సమర్పణకు 30 వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తులోని వివరాల సవరణకు ఆగస్టు 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత గల విద్యార్థులు విశ్వవిద్యాలయ వెబ్సైట్ skltghu.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. పూర్తి వివరాలకు 89771 29027, 76830 53157 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి పూజలు
అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారికి ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన జోగుళాంబ సన్నిధిలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో పూజలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. అలాగే యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం మూడోరోజు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పీఠాధిపతి రాక తెలిసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పల్లీ క్వింటా రూ.7,342 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 1,067 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,342, కనిష్టంగా రూ.3,129, సరాసరిగా రూ.5,899 ధరలు లభించాయి. -
అభివృద్ధికి అందలం
అయిజ: జిల్లాలోని అయిజ మార్కెట్ సబ్ యార్డు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2018 నుంచి కొనసాగుతున్న అయిజ మార్కెట్ సబ్ యార్డులో పశువుల సంత ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచింది. పశువులు, గొర్రెలు విక్రయించడం ద్వారా గత కొన్నేళ్లుగా ఏటా సుమారు రూ.లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత గల యార్డులో ఎక్కడా సరైన వసతులు కనిపించవు. దీనికితోడు సంత నిర్వహించే మైదానంలో మోకాళ్ల లోతు గుంతలు పడ్డాయి. వర్షాకాలంలో మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతుంది. పశువుల క్రయవిక్రయాలు మైదానంలో జరిగినా.. గొర్రెల విక్రయాలు మాత్రం మార్కెట్ సబ్ యార్డు పక్కనున్న అయిజ– ఎక్లాస్పురం రోడ్డుపై నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.45 లక్షలు మంజూరు చేయడంతో త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నడిగడ్డ ప్రాంతంలో.. నడిగడ్డలో వ్యవసాయ ఆధారంగా జీవించేవారు ఎక్కువగా ఉండడం, రైతులు పంటలు పండించేందుకు సంప్రదాయపరంగా ఎద్దులను ఉపయోగించడం, వ్యవసాయ అనుబంధంగా పాడితోపాటు సేంద్రియ ఎరువుల కోసం పశువులను పెంచడంతో ఈ ప్రాంతంలో పశువుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాటి క్రయవిక్రయాలకు అయిజ మార్కెట్ సబ్ యార్డులో 2018 అక్టోబర్ 18న పశువుల సంత ఏర్పాటు చేశారు. సంతను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్లపాటు గొర్రెలు, మేకలు ఒక్కొక్క దానికి రూ.10, ఆవులు, గేదెలు, ఎద్దులకు రూ.50 చొప్పున విక్రయ రుసుం వసూలు చేశారు. ఆ తర్వాత 2023 సంవత్సరం నుంచి పశువులను విక్రయించిన ధరలో నూటికి రూ.1 చొప్పున కొనుగోలుదారుతో వసూలు చేస్తున్నారు. మార్కెట్ సబ్ యార్డుకు నిధులు మంజూరు వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.45 లక్షలు కేటాయింపు త్వరలోనే టెండర్ల ప్రక్రియకు చర్యలు సబ్ యార్డు ఆవరణలోనే పశువుల సంత నిర్వహణ ఆధునిక వసతులు కల్పించాలంటున్న రైతులు -
ఎగువన కొత్త పథకాలు..
తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్పై అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్ హెడ్వర్క్ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది. -
ప్రతిసారి నిరాశే..
ఆర్డీఎస్ కెనాల్లో సాగునీటిపై ఆశలు పెట్టుకున్న ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. ఏ ఈడాది నీరు వస్తాయనుకునే సరికి ఏదో రకంగా నీటి విడుదలకు బ్రేక్ పడుతుంది. మేము ఉన్న సమయంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముగ్గురు సీఎంలు కలిసి కూడా ఏదీ స్పష్టత రాలేదు. – నాగార్జున, రైతు, ఉండవెల్లి ప్రాజెక్టులను నిలిపేయాలి కర్ణాటకలో తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపేయాలి. ఆర్డీఎస్ రైతుల కోసం నిర్మించిన తుమ్మిళ్ల లిఫ్టు పూర్తి కాలేదు. అప్పుడే వారు నీటిని దిగువకు రానివ్వకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి పూర్తిచేసే స్థాయికి వచ్చినా మన ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు. వెంటనే మల్లమ్మకుంట నిర్మించడంతో పాటు, కర్ణాటకలోని కురిడిలో నిర్మిస్తున్న ప్రాజెక్టును నిలిపేయాలి. – మధుసూదన్గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు -
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షకుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ (ఎంఎల్)మాస్లైన్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంచందర్ అన్నారు. అమరచింతలోని మార్క్స్ భవనంలో బుధవారం నిర్వహించిన మాస్లైన్ ఉమ్మడి జిల్లా శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశంలో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నా పాలకులు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాల అమలుపై వెనక్కి తగ్గిన కేంద్రం.. మళ్లీ నల్ల చట్టాలను అమలు చేయాలని చూడటం సరికాదన్నారు. కార్మికులు జీతాల పెంపు కోసం, పనిగంటల కోసం పోరాటాలు చేస్తుంటే.. లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పనిగంటలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో జంజీ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు మాస్లైన్ కార్యకర్తలు, నాయకులు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమంతు, వెంకటేశ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మొదట నష్టపోయేది పాలమూరే
● మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు జడ్చర్ల: సాగునీరుకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చర్యల వల్ల మొదటగా పాలమూరు జిల్లానే నష్టపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఒట్టుకు నిజంగా ప్రాణం ఉండి ఉంటే సీఎం రేవంత్ దేవుళ్ల మీద వేసిన ఒట్లకు.. ఒట్లే ఉరి వేసుకునే పరిస్థితి ఉండేదని విమర్శించారు. జడ్చర్లలో సర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఒట్ల మీద ఒట్లు వేసి మంచి పాల వంటి మనసు ఉన్న పాలమూరు ప్రజల గౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దిగజారుస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్ట్లను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లుగా మార్చి 10 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.30 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చామని, నెట్టెంపాడుకు 1.60 లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్ట్ ద్వారా 1.75 లక్షల ఎకరాలకు నీరు అందించామని, కోయిల్సాగర్ పూర్తి చేసి సాగు నీరు ఇచ్చామని గుర్తిచేశారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరులో ఒక్క ఎకరానికై నా నీరిచ్చావా అని నిలదీశారు. ఇటీవల జిల్లాకు వచ్చి సీఎం మాట్లాడుతూ తమకు అర్థం కావడానికే రెండేళ్ల సమయం పట్టిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి ఆయా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పలు శా ఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యాపార సముదాయాలు, పంట పొలాలు, హోట ళ్లు, మెకానిక్ షాపులు తదితర వాటిలో పనిచేస్తున్న బాలలను గుర్తించి.. పాఠశాలల్లో చేర్పించాలన్నా రు. ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆపరేషన్ ముస్కాన్–14 ద్వారా బాలకార్మికులతో పాటు నిరాశ్రయులైన పిల్లలు, భిక్షాటనలో బంధిలైన వారిని రక్షించి.. పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతామన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, వివిధ శాఖల అధికారులు సహదేవుడు, నర్సింహానాయుడు, రాజు, శివలీల ఉన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యాన్ని సహించం
అయిజ: ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో వందశాతం పూర్తిచేయడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించమని డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి అన్నారు. మంగళవారం అయిజ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వైద్యసేవలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక బుడుగజంగాల కాలనీలో పల్స్పోలియో నిర్వహణపై ఆరా తీశారు. పీహెచ్సీ సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన విధానాన్ని కాలనీవాసులతో తెలుసుకున్నారు. పోలియో చుక్కలు వేయించుకోకుండా ఎవరైనా మిగిలి ఉంటే, వారికి వెంటనే చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. వేరుశనగ @ రూ.7,400 గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 507 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,400, కనిష్టంగా రూ. 4,256, సరాసరి రూ. 5,866 ధరలు లభించాయి. క్వింటా ఆముదాలు రాగా.. రూ. 1,819 ధర వచ్చింది. క్వింటా వరి (సోన) రాగా.. రూ. 2,356 ధర లభించింది. గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి : సీపీఎం వనపర్తి రూరల్: గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. పెబ్బేరులో నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను సందర్శించి సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, డి.బాల్రెడ్డి, రాజు, జీఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎన్ రమేష్, మేకల ఆంజనేయులు, ఎస్.రాజు, మహబూబ్పాషా, గోపాల్దిన్నె, తెల్లరాళ్లపల్లి సర్పంచులు దొడ్ల కవిత, జంబులయ్య, అమరచింత మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు అజయ్, సీపీఎం మండల నాయకులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం
● పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాలన్యూటౌన్: ఇందిరమ్మ రాజ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు సేవకులుగా పనిచేస్తేనే ప్రజాపాలనకు సార్థకత ఉంటుందన్నారు. ముఖ్యంగా భూ భారతి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా.. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన వరి వంగడాలనే రైతులు సాగుచేసేలా ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. క్లస్టర్ల వారీగా ఏఈఓలు తమ పరిధిలోని రైతులకు వ్యవసాయశాఖ సమాచారాన్ని చేరవేసేందుకు రైతుల ఫోన్ నంబర్లతో వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆర్డీఎస్ పరిధిలోని మల్లమ్మకుంట రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4 – 5 టీఎంసీలకు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకుముందు 9 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను మంత్రి పంపిణీ చేశారు. ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, సిబ్బంది మెరుగైన పనితీరు కనబరిచేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. పలు చోట్ల విత్తన మేళాలను నిర్వహించి.. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించామని తెలిపారు. ● ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రూ.10కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఆడిటోరియానికి అదనపు నిధులు మంజూరు చేయించి, త్వరలోనే ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. అమృత్ పథకంలో చేపట్టిన పనుల్లో మొదట పంప్హౌజ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ.. మండలాల్లో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు హనుమంతు, దొడ్డప్ప, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు. -
రిజిస్ట్రేషన్లు ఢమాల్!
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు వందల సంఖ్యలో జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్లు.. మంగళవారం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే జరిగాయి. మక్తల్, అలంపూర్, ఆత్మకూర్, కొల్లాపూర్, అచ్చంపేట రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం అందించే కార్యాలయాల్లో లావాదేవీలు జరగక వెలవెలబోయాయి. ఒక్కసారిగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త స్లాట్ బుకింగ్లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ వంటి కీలక ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజూ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 550 నుంచి 650 మధ్య రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మంగళవారం 74 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. స్పష్టత కరువు.. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న క్రయ, విక్రయదారులకు పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరింపబడతాయనే అంశంపై ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. జూన్ 26 నుంచి 28 వరకు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ సోమవారం సైతం కార్యాలయాల్లో తిరిగి మళ్లీ అదే సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం అందించే కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో క్రయ, విక్రయదారులు విస్తుపోతున్నారు. గద్వాల 9 మహబూబ్నగర్ 8 జడ్చర్ల 8 వనపర్తి 3 కల్వకుర్తి 18 నారాయణపేట 11 నాగర్కర్నూల్ 17 మక్తల్, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, ఆత్మకూర్ – 0 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపు పదుల సంఖ్యల్లో మాత్రమే దస్తావేజులు క్రయ, విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమే. కానీ సర్వర్లలో నెలకొన్న సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మరింత సులువుగా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండటంతోనే కొంత అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. – డి.ఫణిందర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్లు ఇలా.. -
‘నీరు’గారుతున్న లక్ష్యం
జూరాల సమాంతర కాల్వ షట్టర్లకు లీకేజీలు ● నిత్యం 150 క్యూసెక్కుల నీరు వృథా ● ఏడాది పొడవుగా పారుతున్న వైనం ● జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం ● నిధులున్నా.. మరమ్మతులు కరువు అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల లీకేజీలతో సాగునీరు నిత్యం వృథాగా పారుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా జలాశయం వెనుక జలాలు కాల్వ వెంట వృథాగా పారుతుండటంతో ఆయకట్టు రైతులు, ప్రాజెక్టుపై ఆధారపడిన గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వానాకాలం వచ్చినా.. ఎగువన వర్షాలు కురవకపోవడంతో జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందుతుందో లేదోన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీటినైనా సంరక్షించుకునే ప్రయత్నాలు అధికారులు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా చుక్కనీరు కూడా ముందుకు పారకుండా అడ్డుకట్ట వేసిన ప్రాజెక్టు అధికారులు సమాంతర కాల్వ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జలాశయానికి ఎగువ నుంచి వెయ్యి, 1,500 క్యూసెక్కుల వరద వస్తుండటంతో సమాంతర కాల్వ నుంచి భీమా ఫేజ్–2కు నీటిని తరలిస్తున్నా.. జూరాల ప్రాజెక్టు అధికారులు మాత్రం కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదలలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరమ్మతులు కరువు.. సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల లీకేజీ కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథాగా పారుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. 5 ఏళ్లుగా ఇదేతంతు కొనసాగుతున్నా.. మరమ్మతులు చేపట్టి నియంత్రణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి వేసవిలో వరదలు లేకపోయినా షట్టర్ల లీకేజీతో పాటు అధికారుల అత్యుత్సాహం కారణంగా 15 రోజులకోసారి మూడురోజుల పాటు షట్టర్లు తెరిచి ఉన్న నీటిని తరలించుకుంటున్నారని.. జూరాల అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 17 కిలోమీటర్ల పొడవు.. జూరాల జలాశయం ఎడమ కాల్వకు సమీపంలో సమాంతర కాల్వ నిర్మించారు. ప్రాజెక్టు నుంచి రామన్పాడు రిజర్వాయర్ వరకు 17 కిలోమీటర్ల పొడవునా కాల్వ నిర్మించారు. అమరచింత, ఆత్మకూర్ మండలాల మీదుగా కాల్వ రామన్పాడు రిజర్వాయర్కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి భీమా ఫేజ్–2, కొల్లాపూర్ వరకు పారుతూ అక్కడక్కడ నిర్మించిన రిజర్వాయర్లు, చెరువులు, నీటికుంటలు నింపి మళ్లించుకుంటారు. -
పట్టించుకోవడం లేదు..
జూరాల ప్రధాన ఎడమకాల్వకు వారాబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్న అధికారులు.. సమాంతర కాల్వలో ఏడాది పొడవునా నీరు వృథాగా పారుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు ముందుభాగంలో ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సైతం సాగునీరు అందడం లేదు. కేవలం వరదలు వచ్చినప్పుడే నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన కాల్వ ద్వారా ఏడాది పొడవునా నీరు పారుతోంది. – భాస్కర్రెడ్డి, రైతు, నందిమళ్ల మరమ్మతులు పూర్తి చేస్తాం.. సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల మర్మతులకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. ఈ వేసవిలో మరమ్మతులు పూర్తి చేయడానికి నీటిని నిలిపేందుకు రింగ్బండ్ వేశాం. అది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. త్వరగా మరమ్మతులు పూర్తిచేసి నీటివృథాకు అడ్డుకట్ట వేస్తాం. – కేశవరావు, ఈఈ, భీమా ఫేజ్–2 ● -
గుడిసెలో నివాసముంటున్నాం..
నేను గుడిసెలో నివాసముంటున్నా. వానాకాలంలో వ ర్షానికి గుడిసె మొత్తం తడిసిపోతుంది. ఇదివరకే పెద్ద గాలివానాలకు రెండుసార్లు గుడిసె కప్పు కొట్టుకుపోయింది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాలేదు. – బి.నర్సన్న, బస్వాపురం, ఉండవెల్లి మండలం లేని కారు ఉన్నట్టు చూపారు.. నాకు ఎలాంటి కారు కానీ నాలుగు చక్రాల వాహనం కాని లేదు. నేను ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. అయితే నాకు కారు ఉందనే కారణం చూపెడుతూ నన్ను లిస్ట్–3లో అనర్హత జాబితాలో చేర్చారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసి విన్నవించా. కానీ సమస్య పరిష్కారం కాలేదు. లేని కారు ఉన్నట్టు చూపెట్టడంతో నాకు అన్యాయం జరిగింది. దీనిపై విచారణ జరిపి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – జకరయ్య, పైపాడు, వడ్డేపల్లి మున్సిపాలిటీ -
మాతృదేవోభవ..
● గర్భిణుల నమోదు నుంచే వైద్యుల పర్యవేక్షణ ● అత్యవసర సమయాల్లో జిల్లా ఆస్పత్రికి రెఫర్ ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగుపడిన వైద్య సదుపాయాలు జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గుముఖం గద్వాల క్రైం: జిల్లాలో మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. గర్భిణుల నమోదు నుంచి మొదలుకొని కాన్పు అయ్యే వరకు ప్రత్యేక దృష్టిసారిస్తోంది. అందులో భాగంగా గర్భిణులకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు సకాలంలో వైద్యం అందకపోవడం.. వైద్యుల కొరత కారణంగా మాతాశిశు మరణాల రేటు అధికంగా ఉండేది. 2024లో 8మంది బాలింతలు, 89 శిశువుల మరణాలు చోటు చేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 9మంది శిశువుల మరణాలు సంభవించాయి. జిల్లాలో మాతాశివు మరణాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి.. మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా క్రమేణా మాతాశిశు మరణాల రేటు తగ్గుతోంది. మరోవైపు జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటుచేసి.. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, గైనకాలజిస్టులు, స్టాఫ్ నర్సులతో సేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య పరీక్షల కోసం అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన ఐసీయూ, కేఎంసీతో పాటు అన్ని విభాగాలను ఏర్పాటుచేసి, వైద్యసేవలను మెరుగుపర్చింది. గద్వాల, ధరూరు, గట్టు, అలంపూర్, అయిజ, మానవపాడు తదితర ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వైద్యసేవల్లో జాప్యం లేకుండా.. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, అత్యవసర చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఆ వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్కు వాట్సప్ గ్రూప్లో గర్భిణుల వివరాలు, వారు పడుతున్న ఇబ్బందులు, అందించాల్సిన వైద్యం వివరాలను తెలియజేస్తున్నారు. తద్వారా గైనిక్ హెచ్ఓడీ, చిన్నపిల్లల విభాగం సిబ్బంది వెంటనే అప్రమత్తమవుతున్నారు. గర్భిణి రాగానే సకాలంలో వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో కూడా వైద్యం అందించలేని పరిస్థితి ఉంటే, మహబూబ్నగర్, హైదరాబాద్, కర్నూలు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి విపత్తు సమయంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ సూచించారు. –8లో uనమోదు నుంచే.. మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చే వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్నారు. వారిని ఆస్పత్రులకు ప్రతినెలా తీసుకొచ్చి టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయించి.. రక్తహీనత అధిగమించేందుకు అవసరమైన మందులను ఇప్పించడంతో పాటు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నెలలు నిండగానే ప్రభుత్వం ఏర్పాటుచేసిన 102 వాహనంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. కాన్పు జరిగిన అనంతరం తల్లీబిడ్డను ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి చేరవేస్తున్నారు. నిత్య పర్యవేక్షణతో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గుతుందని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. -
ఆర్థిక చేయూత.. అందని ద్రాక్షేనా?
● ఈఆర్ఎస్కు దివ్యాంగుల ఎదురుచూపులు ● అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ● నెలలు గడిచినా ఫలితం శూన్యం ● ఉమ్మడి జిల్లాలో 120 మంది లబ్ధిదారులు వనపర్తి: దివ్యాంగుల ఆర్థిక బలోపేతానికిగాను ప్రభుత్వం అమలు చేస్తున్న ఈఆర్ఎస్ (ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం) ఏడాది కాలంగా డోలాయమానంలో పడినట్లయింది. క్షేత్రస్థాయిలో ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నా.. వందశాతం రాయితీతో వచ్చే ఆర్థిక చేయూతకు రాష్ట్ర ఖజానా గేట్లు మూసివేసింది. గతేడాది ఆగష్టులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి మండల, జిల్లాస్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 2026, ఫిబ్రవరిలో నిధుల మంజూరుకు ట్రెజరీకి టోకెన్లు పంపించారు. 2026 ఏడాదికిగాను దరఖాస్తు చేసుకునే సమయం వచ్చినా.. లబ్ధిదారుల చేతికి మాత్రం నేటికీ డబ్బులు అందలేదు. అసలు ఏమైంది.. లోపం ఎక్కడుందనే విషయం తెలియక అమాయకులైన దివ్యాంగులు ప్రతి సోమవారం ప్రజావాణికి, ఇతర రోజుల్లో డీడబ్ల్యూఓ కార్యాలయాలకు ప్రదక్షిణలు చేయడం తప్పా నెలలు గడుస్తున్నా చేకూరిన ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య ప్రకారం లబ్ధిదారుల సంఖ్య 120కి పైగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. పథకం ముఖ్య ఉద్దేశం.. 40 శాతం కంటే ఎక్కువ వికలత్వం.. 21 ఏళ్ల నుంచి 55 మధ్య వయసు వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్ఎస్ అమలు చేస్తోంది. మున్సిపాలిటీ, మండలానికి ఒకరు చొప్పున వారి కుటుంబ పరిస్థితుల ఆధారంగా మండల, జిల్లా కమిటీల నిర్ణయం మేరకు వందశాతం రాయితీపై గరిష్టంగా రూ.50వేల రుణం మంజూరు చేస్తారు. ఈ రుణంతో ఆ కుటుంబం టైలరింగ్, మొబైల్ రిపేరు, డెయిరీ, కంప్యూటర్ సెంటర్, ఇతర చిన్న తరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలి. -
పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు పోరాడి సాధించుకున్న 72 జీఓ ప్రకారం జూరాల ఎగువ నుంచి పీఆర్ఎల్ఐకు లిఫ్ట్ పనులు చేపట్టాలన్నారు. డిండి లిఫ్ట్ పేరుతో చేస్తున్న అక్రమ పనులు నిలిపివేసి.. పీఆర్ఎల్ఐ నీటిని తరలించే విధానం ఆపాలన్నారు. నల్లగొండ జిల్లా భూములకు అవసరమైన నీటిని కృష్ణానది మీద అత్యంత పెద్దదైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి గొట్టిముక్కల లిఫ్ట్ చేపట్టి తీసుకోవాలన్నారు. అదే విధంగా గోకారం, గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదన ఆపాలన్నారు. వరద జలాల పేరుతో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్లను సత్వరం పూర్తి చేయడంతో పాటు వీటికి నికర జలాలు సాధించాలన్నారు. జస్టిస్ బచావత్, రాజారావు కమిటీలతో నికర జలాల కేటాయింపులున్న ఆర్డీఎస్, జురాల, భీమా–1, 2, కోయిల్సాగర్ పథకాలకు నీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించే విధంగా పూర్తి చేయాలని కోరారు. చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపోతల, వెల్టూరు, గొందిమల్ల బ్యారేజ్, జూరాల–గట్టు ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తిచేయాలన్నారు. తుంగభద్ర ఎడమ కాల్వను తెలంగాణలోకి పొడగించి.. కృష్ణా–తుంగభద్ర నదుల నడుమ నడిగడ్డకు గ్రావిటీతో నీరివ్వాలన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి, ఆర్డీఎస్ ఆనకట్టను సుంకుసుల ప్రాజెక్ట్లా ఆధునికీకరించాలని అన్నారు. కార్యక్రమంలో యూఎంపీపీఎస్ జేఏసీ చైర్మన్ వీరభద్రప్ప, కన్వీనర్ ఆలూరు ప్రకాశ్గౌడ్, రామ్మోహన్, వినోద్కుమార్, విజయభాస్కర్రెడ్డి, సుభాన్, ప్రభాకర్, నాగన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు ప్రజావాణికి 15 ఫిర్యాదులు
గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ గ్రామాలకు చెందిన 15మంది పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా.. సానుకూలంగా స్పందించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలు వెలికితీయాలి: డీఈఓ మానవపాడు: విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని బోరవెల్లి, పల్లెపాడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో సోమవారం ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం పరిశీలించడంతో పాటు తరగతుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలను రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ వెంట ఎంఈఓ శివప్రసాద్ ఉన్నారు. ఆర్థికాభివృద్ధి సాధించాలి అలంపూర్ రూరల్: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మున్సిపల్ కమిషనర్ రాజేశ్ అన్నారు. అలంపూర్లోని మెప్మా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పట్టణ మహిళా సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలతో చిన్నచిన్న వ్యాపారులను ప్రారంభించేలా మెప్మా సిబ్బంది ప్రోత్సహించాలని సూచించారు. వ్యక్తిగత వ్యాపారాలతో పాటు సంఘం సభ్యులంతా కలిసి పెద్ద వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. మున్సిపాలిటీలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో టీఎంసీ శ్రీకర్ ఉన్నారు. కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలో సోమవారం పౌర్ణమిని పురస్కరించుకొని ఆదిశిలావాసుడి కల్యాణోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు మధుసూదనాచారి, రవిచారి, శశాంక స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు చేశారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఈఓ సత్యచంద్రారెడ్డి, చంద్రశేఖర్రావు, రాముడు, సిబ్బంది రంగనాథ్, శ్రీను, ఉరుకుందు, చక్రి, కృష్ణ, శివమ్మ తదితరులు పాల్గొన్నారు. పీయూలో కొనసాగుతున్న పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో బీపెడ్ మొదటి సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 8వ సెమిస్టర్, బీఫార్మసీ 6 సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈమేరకు పరీక్షలను కంట్రోలర్ ప్రవీణ, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి తనిఖీ చేశారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. -
కొడుకులు మోసం చేశారు..
నాకు బోయలగూడెం శివారులోని సర్వేనంబర్ 533/1లో 1.20 ఎకరాల భూమిని నా భర్త వీరేష్గౌడ్ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే నాకు తెలియకుండా నా కొడుకులు అక్రమంగా వారి పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్లీ వారి బావమరదుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై అడిగితే నాపై దాడిచేశారు. దీనిపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. – వెంకటేశ్వర్మ, బోయలగూడెం, గట్టు మండలం ప్రభుత్వం ఆదుకోవాలి.. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల అనారోగ్యంతో నా భర్త మరణించారు. దీంతో నా ఇద్దరు పిల్లల పోషణ భారంగా మారింది. నేను ఎంఏ, బీఈడీ చేశాను. ప్రభుత్వం స్పందించి ఆదుకుంటే కుటుంబాన్ని పోషించుకుంటాను. – సుజాత, గద్వాల -
హిందూ సమాజం ఏకం కావాలి
గద్వాలన్యూటౌన్: హిందూ సమాజం ఏకమై సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించాలని తెలంగాణ సాదు పరిషత్ అద్యక్షుడు శంకర్ స్వామీజీ సూచించారు. ఆదివారం స్థానిక జములమ్మ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మహాజన శక్తి కార్యక్రమం నిర్వహించగా.. పలువురు సాధువులు, హిందూ సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధార్మిక విలువలు, సామాజిక ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందన్నారు. హిందూ దేవాలయాల్లో దర్శ నం చేసుకునే హక్కు భక్తులందరికీ ఉందన్నారు. ఇటీవల మల్దకల్ మండలం మద్దెలబండలో పోలీసులు త నను నిర్బంధించిన ఘటనపై అధికారులు చట్టబద్ధంగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్నారు. జముల మ్మ అమ్మవారిపై భక్తుల కు ఉన్న విశ్వాసాలను గౌరవించాలన్నారు. ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించాలని సూచించారు. అంతకుమందు శంకర్ స్వామీజీ, ఇతర సాధువులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురందర్ కుమార్, వేదయోగి మహారాజ్, ఆత్మ రామస్వామి, సీవీఆర్ ప్రసాద్, డా.పురుషోత్తం, కీర లింగేశ్వరస్వామి, ప్రియా చౌదరి, స్థానిక వీహెచ్పీ, బజరంగ్దళ్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతి చిన్నారికీ చుక్కల మందు వేయించాలి
అలంపూర్ రూరల్: రెండు చుక్కల పోలియో మందు చిన్నారుల నిండు జీవితాన్ని నిలుపుతుందని.. ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. జాతీయ పల్స్పోలియో సందర్భంగా ఆదివారం అలంపూర్లో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసూనరాణి, మండల వైద్యాధికారిణి రాధిక ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యసిబ్బంది గుర్తించిన ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. కాగా, అలంపూర్ మున్సిపాలిటీ, మండలంలో 95శాతం చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. -
ప్రతిపాదనలు పంపాం..
ప్రభుత్వం జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించిన ప్రకారం జిల్లాలో అనువైన స్థలాలు ఎంపిక చేశాం. జానంపేటలో పాత పీహెచ్సీ భవనం తొలగించి దాని స్థానంలో 30 పడకలతో ట్రామా కేర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. బాలానగర్ వద్ద హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో మొదటి రెండు ట్రామా కేర్ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అలంపూర్ చౌరస్తా వరకు మరో నాలుగు ట్రామా కేర్ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ -
చే‘నేత’ ఎన్నిక
జూలై 10న నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూలై 10 నాటికి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. ఈ నెల 12న 50 మంది సభ్యులున్న సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన సంఘాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు ఓటరు జాబితాను చేనేత జౌళిశాఖ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులకు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహు లు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించి ఓటు హక్కును కాపాడుకున్నారు. 50 మంది సభ్యులున్న చేనేత సంఘాల్లో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకొని అందులో నుంచే అధ్యక్షు డు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తయింది. వందమంది కంటే అధికంగా సభ్యులున్న సంఘాలకు జూలై 10న ఓటింగ్ విధానంలో ఎన్నిక ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2013లో చివరిసారి.. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరిగాయి. 2018లోనే ఆయా సంఘాల కాల పరిమితి ముగియగా.. తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు 16 పర్యాయాలు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి గతేడాది మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. రెండురకాల బ్యాలెట్ పత్రాలు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 చేనేత సహకార సంఘాలు ఉండగా.. తుది జాబితా ప్రకారం 8,727 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలోని వెంకటాయపల్లి, రాజాపూర్, పెద్ద ఆదిరాల, ఎదిర సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 40 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. జూలై 2 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 10న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పత్రాలను రెండురంగుల్లో ముద్రించనున్నారు. మహిళా రిజర్వ్ స్థానాలకు లేత గులాబీ, ఓపెన్ కేటగిరీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా సంఘాలు ఓటర్లు జోగుళాబ గద్వాల 16 4,116 నారాయణపేట 12 739 వనపర్తి 8 2,014 నాగర్కర్నూల్ 3 96 మహబూబ్నగర్ 1 146 జూన్ 29న నోటిఫికేషన్ జారీ జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ జూలై 5న పరిశీలన జూలై 6న ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు జూలై 10న ఉదయం పోలింగ్.. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జిల్లాల వారీగా ఇలా నేడు వెలువడనున్న ప్రకటన పూర్తయిన ఓటరు జాబితా 50 మంది సభ్యులున్న సంఘాలకు ముగిసిన ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 44 చేనేత సహకార సంఘాలు చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ సజావు గా సాగేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాం. సోమవారం ఎన్నికల షె డ్యుల్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రిటర్నింగ్ అధికారులను నియమించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపడతాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల -
బోరుబావుల కింద మాత్రమే..
బోరుబావులు తదితర నీటి వనరులు ఉన్నచోట మాత్రమే సాగు కొంత ప్రారంభమైంది. అయితే బోరుబావుల కింద సాగుచేసిన రైతులు సైతం కొంత ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం.. వర్షాలు లేకపోవడంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లాలో కురిసిన ఒకటి, రెండు మోస్తరు వర్షాలకు మెట్ట పొలాల్లో పంటలు వేసిన రైతులు మరింత ఆందోళనలో ఉన్నారు. వర్షాలు లేక కొన్నిచోట్ల విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల విత్తనం నుంచి మొక్క ఆశించిన స్థాయిలో రాలేదు. ఇంకొన్ని చోట్ల మొక్క వచ్చినప్పటికీ వర్షాలు లేక, నీటిని అందివ్వలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది సాగుపై రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో జూన్ చివరి వారం నాటికి వానాకాలం సాగు అంచనాలో కనీసం 40 నుంచి 50శాతం సాగయ్యేది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఈ వానాకాలంలో 4,35,252 ఎకరాల్లో పంటసాగు అంచనా ఉండగా.. ఇప్పటి వరకు అన్నిరకాల పంటలు కలిపి 82,302 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. -
జూలై 4న మిడ్జిల్కు సీఎం రేవంత్రెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ స్థలంలో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ద్యాప గోపాల్రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై దృష్టి సారించండి అయిజ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టిసారించాలని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి సూచించారు. ఆదివారం అయిజలో పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఓటు హక్కు పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే విధంగా 18ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని తెలిపారు. సమావేశంలో నాగర్ర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి సిద్ధేశ్వర, అలంపూర్ ఇన్చార్జి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కోటిలింగేశ్వరస్వామికి లక్ష పుష్పార్చన కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం లక్ష పుష్పార్చన, బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రెండోరోజు జరిగిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పుష్పాలు, బిల్వ దళాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. -
పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
గద్వాల క్రైం: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలి యో చుక్కలు వేయించి.. జోగుళాంబ గద్వా లను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామ ని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి.. పిల్లలకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ఐదేళ్లలోపు వయసు కలిగిన 69,383 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందన్నారు. పల్స్పోలియోను విజయవంతంగా నిర్వహించేందుకు 1,884 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు చుక్కల మందు వేస్తారని.. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ఏరు రాకపాయే!
ఏరువాక వచ్చే..గద్వాల వ్యవసాయం: ఏరు ముందా.. ఏరువాక ముందా.. అని ప్రతి ఏడాది నడిగడ్డ రైతులు ఎదు రుచూడటంతో పాటు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఏరువాక పౌర్ణమి నాటికి వర్షాలు కురిసి.. ఇక్కడి కృష్ణానది జలకళ సంతరించుకునేది. వర్షాల కు చాలా చోట్ల విత్తనాలు వేసేవారు. అయితే ఈసా రి జూన్ ముగుస్తున్నా.. ఇంతవరకు ఆశించిన స్థాయి లో ఒక్క వాన రాలేదు. కృష్ణానది నీరు లేక వెలవెలబోతోంది. రైతులు దుక్కులు దున్ని వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఏరువాక వ చ్చే.. ఏరు రాకపాయే అని ఆవేదన చెందుతున్నారు. గతేడాది నిరాశే.. గతేడాది వానాకాలం రైతులకు కన్నీరు తెప్పించింది. ప్రారంభంలో వర్షాలు కురవకపోగా.. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల నీరు నిలిచి మొక్కల ఎదుగదలపై ప్రభావం పడింది. సెప్టెంబర్లోనూ కురిసిన వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్లు, రకరకాల పురుగులు ఆశించాయి. ఎక్కువగా సాగుచేసిన పత్తిపంట దిగుబడులు సగానికి పడిపోయా యి. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా వానాకాలంలో సాగుచేసిన అన్ని పంటల దిగుబడులు తగ్గి.. రైతులు ఆర్థికంగా నష్టాలపాలయ్యారు. కూరగాయ ల సాగుపై సైతం తీవ్ర ప్రభావం పడింది. ఆయా కూరగాయల తోటలకు కాయలు కాసే దశలో వర్షాలు రావడంతో మొక్కపైనే మురిగిపోయాయి. ఈసారి సాగని సాగు.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ ముందే చెప్పింది. తద్వారా రుతుపవనాలు ఆలస్యం కావడంతో పాటు ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవని హెచ్చరించింది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఒకటి, రెండు మోస్తరు వర్షాలు కురిశాయి. జూరాల ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల జలాశయానికి వరద చేరుతుంది. ఆ తర్వాతే జూరాల ఆయకట్టుతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల కింద సాగు ప్రారంభమవుతుంది. అయితే ఈఏడాది ఇప్పటివరకు ఎగువన వర్షాలు రాకపోవడంతో జూరాలకు వరద రాలేదు. ఓవైపు వర్షాలు లేపోవడం.. మరోవైపు జూరాలకు నీరు రాకపోవడంతో జిల్లాలో సాగు ముందుకు సాగడం లేదు. ఆందోళనలో నడిగడ్డ రైతులు ఈసారి ఒకటి, రెండు వర్షాలు మాత్రమే.. వరద రాక వెలవెలబోతున్న కృష్ణానది ముందుకుసాగని వానాకాలం సాగు విత్తనాలు వేసిన చోట తప్పని అగచాట్లు జూన్లో సాధారణ వర్షపాతం: 71.2 మి.మీ. నమోదైన వర్షపాతం: 50.9 మి.మీ. -
పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియ
గద్వాల: ప్రతి ఇంటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందించి.. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని 22, 23 వార్డుల్లో బీఎల్ఓలు చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా పూరించాలో ఓటర్లకు స్పష్టంగా వివరించాలని సూచించారు. అదే విధంగా ఫారాలు ఇచ్చేటప్పుడు ఓటర్ల అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని తప్పులు లేని సమగ్ర ఓటరు జాబితాను రూపొందించాలని ఆదేశించారు. అదే విధంగా 18ఏళ్లు నిండిన అర్హులైన వారిని ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేయించాలన్నారు. మరణించిన వారి పేర్లు, డబుల్ నమోదులు, ఇతర సవరణల కోసం ఫారం–7 వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వాములు కావాలని తెలిపారు. -
పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న జిల్లా జడ్జి
అలంపూర్(అలంపూర్ రూరల్)/ఎర్రవల్లి: జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి, బీచుపల్లి అభయాంజనేయస్వామి క్షేత్రాలను శనివారం జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వాదం పలికారు. జిల్లా జడ్జి వెంట జూనియర్ సివిల్జడ్జి వెంకటేశ్ ధ్రువ, అలంపూర్ కోర్టు జూనియర్ సివిల్జడ్జి మిథున్ తేజ, ఎస్ఐ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ చిన్నరాజు, అర్చకుడు అనిల్శర్మ ఉన్నారు. అందుబాటులో యూరియా అలంపూర్(అలంపూర్ రూరల్): జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్లు డీఏఓ వీరప్ప అన్నారు. శనివారం అలంపూర్ పట్టణంతో పాటు భీమవరం, కోనేరు గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ మండలంలో ప్రస్తుతం 1,350 బస్తాల యూరియా అందుబాటులో ఉందన్నారు. యాప్లో బుక్ చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫర్టిలైజర్ డీలర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఏఓ వెంట ఇన్చార్జి ఏడీఏ సుబ్బారెడ్డి, ఏఓ నాగార్జున్రెడ్డి ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,841 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శనివారం 1,339 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 6,841, కనిష్టంగా రూ. 3,556, సరాసరి రూ. 5,600 ధరలు పలికాయి. అదే విధంగా 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. రూ. 4,811 ధర వచ్చింది. -
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
గద్వాల/గద్వాలవ్యవసాయం: రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ.. అనేక పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల డివిజన్కు సంబంధించి యూరియా బుకింగ్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చన్నారు. ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రతి రైతు తమ మొబైల్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. యాప్ ద్వారా యూరియా, ఇతర ఎరువుల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ మార్కెట్ను నివారించవచ్చన్నారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని గంజిపేటలో కొలువుదీరిన పీర్లను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డీఏఓ వీరప్ప, ఏఓ ప్రతాప్, నాయకులు చంద్రశేఖర్, సత్యం, తుమ్మల నర్సింహులు, రాజేంద్ర, బంగి సుదర్శన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
అజిత్రెడ్డికి మరో కీలక పదవి
కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన బి.అజిత్రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్రెడ్డి ఫేసీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా(ఎఫ్ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్రెడ్డి 2012 సివిల్ సర్వీస్కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. -
బతుకు.. భారం!
వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా టీసీసీఓ(టైపీస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్)ల తొలగింపుతో వందలాది కుటుంబాల్లో జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని సైతం తొలగించడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే సుమారు 73 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ.. ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2006 నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లుగా వీరు సేవలందిస్తుండేవారు. ధరణి ప్రవేశపెట్టి భూ రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయాల్లో చేయడం ప్రారంభించాగా కొత్తగా రిజిస్ట్రేషన్ విభాగంలో పని చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకున్నారు. ఇటీవల గ్రూప్– 3 ,4 ఉద్యోగుల భర్తీలో భాగంగా ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి నలుగురుకంటే ఎక్కువ మంది టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు వచ్చారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వారిని వేర్వేరు శాఖలకు పంపించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారిని జీపీఓలుగా తిరిగి తహసీల్దార్ కార్యాలయాలకు పంపించింది. దీంతో తహసీల్దార్ కార్యాలయాల్లో కుల, ఆదాయ, స్థానిక, ఇతర ధ్రువపత్రాలు, రిపోర్టులు తయారు చేసేందుకు సరిపడా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న వారి ఆవశ్యత అవసరం లేదని భావించిన ప్రభుత్వం వారిని మార్చి 31 తర్వాత పునరుద్ధరించవద్దని ఆదేశాలిచ్చింది. పాత తేదీల్లో ఉత్తర్వులు.. సీసీఎల్ఏ ఉత్తర్వుల మేరకు టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న 73 మంది టీసీసీఓలను మార్చి 31 తర్వాత రెన్యువర్ నిలిపివేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2026, మార్చి 31న జారీ చేసినట్లు వెలువరించడం శోచనీయం. పెండింగ్లో ఏడు నెలల వేతనాలు.. ఉమ్మడి జిల్లాలో టీసీసీఓల విధుల పునరుద్ధరణను నిలిపివేసిన ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన ఏడునెలల వేతనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి కోసమో తమను బలి చేశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట 13 గద్వాల 11ఉమ్మడి జిల్లాలో 73 మంది టీసీసీఓలకు ఉద్వాసన తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో పనిచేసే వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు గ్రూప్–3, 4 ఉద్యోగుల చేరికలు, జీపీఓల నియామకంతోనే.. నడి వయస్సులో ఉద్యోగ వెతలు ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖలో పని చేస్తున్న టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్లు కొందరి వార్షిక రెన్యూవల్స్ను నిలిపివేశాం. ఇప్పటికే.. ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో రెగ్యూలర్ టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లను నియమించినందుకు వీరి అవసరం లేదని ప్రభుత్వం తొలగించినట్లుంది. – భానుప్రకాష్, ఏఓ, వనపర్తి కలెక్టరేట్ -
పులుల ఖిల్లా.. నల్లమల
2,611.39 చ.కి.మీ. విస్తీర్ణంలో అభయారణ్యం.. నల్లమల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ. అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ. బఫర్ జోన్గా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వుగా ఏటీఆర్ నిలిచింది. ఈ అడవిలో జీవ వైవిధ్యానికి పెద్దపులులు, చిరుతలే కీలకం. పులుల రక్షణకు చేపట్టిన చర్యలతో అమ్రాబాద్ అభయారణ్యంలో ఏటేటా వాటి సంఖ్య పెరుగుతోంది. దాదాపు 200 పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉంది. సాధారణంగా పులులు రెండున్నరేళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఏటీఆర్లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడపులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటీఆర్లో పరహా, భౌరమ్మ, తారా, ఎఫ్–53, ఎం–19, ఎఫ్–6, ఎఫ్–7, ఎఫ్–26 పేర్లతో ఆడ పులులకు నామకరణం చేశారు. ఒక్కో ఆడపులి సంవత్సరంలో నాలుగు పిల్లలను కంటుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పులులు ఏకాంతాన్ని కోరుకుంటాయని.. ఇదే సమయంలో ప్రసవిస్తాయని.. మూడు నెలలపాటు పర్యాటకుల రాకపోకలను నిలిపివేస్తుంటారు. అచ్చంపేట: నల్లమలలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అఖిలభారత పులుల అంచనా–2026 ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్)లో వాటి సంఖ్య 36 నుంచి 42కు చేరిందని అటవీశాఖ వార్షిక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఇక్కడ 36 పులులు ఉండగా.. ఏడాది కాలంలో ఆరు పెరిగాయి. మొత్తం 18 ఆడ పులులు, 14 మగ, 2 ఉప–వయోజన, 8 పులి పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. తల్లి పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పునరుత్పత్తి వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది. 2017లో జాతీయ పులుల గణాంక అథారిటీ అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ ఆరు పులులుండగా.. ప్రస్తుతం 42కు చేరడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది అటవీ ప్రాంతంలో మనుషుల సంచారం, ప్రవేశం తగ్గుతుందనేందుకు సూచన అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పెరుగుతున్న పులుల సంతతిలో ఆడ పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండటంతో మరో నాలుగు, ఐదేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గణన ఇలా.. ఏటీఆర్ పరిధిలో గత నవంబర్ నుంచి జూన్ వరకు చేపట్టిన సర్వేకు 10 రేంజ్లను నాలుగు బ్లాక్లుగా విభజించారు. ప్రతి బ్లాక్లో 30 రోజుల పాటు కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరాల ట్రాప్తో 8 నెలల పాటు సర్వే నిర్వహించారు. ఇందుకోసం రిజర్వ్ను 2 చ.కి.మీ. గ్రిడ్లుగా విభజించారు. పులుల కాళ్ల ముద్రలు, మల విసర్జన, స్క్రాప్, రేక్ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జీవశాస్త్ర నిపుణులు, హైటికోస్ సాంకేతిక, పరిశోధనా బృందం సహకారంతో ఈ కెమెరా ట్రాప్ సర్వే జాతీయ పులుల అంచనాలో కీలక భాగంగా నిలిచింది. పులుల సంఖ్య, వాటి వ్యాప్తి, ఆహార జంతువుల సమృద్ధి, నివాస ప్రాంతాల పరిస్థితులపై శాసీ్త్రయ సమాచారాన్ని సేకరించింది. కెమెరాలతో నిఘా.. నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్లు, 30 బేస్ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్, 350 కెమెరా ట్రాప్ లతో పులుల కదలి కలను పర్యవేక్షిస్తున్నారు. 300 ఎకరాల్లో గడ్డి క్షేత్రాలు.. ఏటీఆర్లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పులులకు ఆహారంగా శాకాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు గాను అటవీ ప్రాంతంలో 300 ఎకరాల్లో గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సోలార్ పంపుసెట్లతో నీటి కుంటలను ఏర్పాటు చేశారు. అక్రమ చొరబాట్లను నియంత్రించడం, వన్యప్రాణుల కదలికలపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టారు. దీంతో చుక్కల దుప్పులు, సాంబర్, నీల్గాయి, జింకల సంఖ్య పెరిగింది. అడవిలో శాఖాహార జంతువులు పెరగడం.. పులులకు సరిపడా ఆహారం లభిస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 180 చిరుతలు, 42 పెద్ద పులులు, 300 ఎలుగుబండ్లు, 12 వేలకు పైగా ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. పులి పిల్లలు 8 మొత్తం మగ పులులు 14 ఉపయోజన పులులు : 2 అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 42కు చేరిన పెద్ద పులులు 2024–25తో పోల్చితే ఆరు అధికం గణనీయంగా పెరిగిన ఆడ పులుల సంతతి సత్ఫలితాన్నిస్తున్న అటవీశాఖ చర్యలు గుర్తింపు ఇలా.. పెద్దపులులను ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫొటోగ్రాఫ్ల డేటాటేస్తో పాటు పులుల చారల ఆధారంగా మ్యాచ్ చేస్తారు. మగ, ఆడ పులులను వాటి శరీర భాగాలను బట్టి గుర్తిస్తారు. పులులను గుర్తించాక, వాటికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు. ఏ రెండు పులుల చారలు ఒకే విధంగా ఉండవు. మనుషుల వేలిముద్రల మాదిరిగానే వాటి స్ట్రైప్ ప్యాటర్న్ ప్రతి పులికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆడపులులు 18 సంతానోత్పత్తి పెరిగింది.. అఖిల భారత పులుల అంచనా–2026 విజయవంతంగా ముగిసింది. ఏటీఆర్లో మొత్తం 42 పులులు నమోదయ్యాయి. ఇక్కడ పులుల సంతానోత్పత్తి ఏటేటా పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పులుల జనాభా ఉందని ఇది సూచిస్తోంది. అటవీ అధికారులు, ఫ్రంట్లైన్ సిబ్బంది, పరిశోధకులు, సంరక్షణ భాగస్వాముల సమష్టి కృషితోనే సాధ్యమైంది. ఏటీఆర్లో పులుల సంరక్షణ, శాసీ్త్రయ వన్యప్రాణి పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి -
పోలియోను నిర్మూలిద్దాం
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి రెండు చుక్కలు ● నేటి నుంచి పల్స్పోలియో ● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్యారోగ్యశాఖ ● జిల్లాలో 69,383 మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని లక్ష్యం గద్వాల క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోలియో వ్యాక్సిన్ను పీహెచ్సీలు, ఉప కేంద్రాలకు చేరవేసింది. జిల్లాలో ఐదేళ్లలోపు వయసు కలిగిన 69,383 మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మొదటి రోజు పల్స్పోలియో కేంద్రాల వద్ద చుక్కల మందు వేయనున్నారు. సోమ, మంగళవారాల్లో 1,38,219 గృహాలను సందర్శించి, మిగిలిపోయిన పిల్లలకు చుక్కల మందు వేసేలా ప్రణాళికలు రూపొందించారు. 471 కేంద్రాల ఏర్పాటు.. జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 91 సబ్ సెంటర్స్, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా ఆస్పత్రి, 3 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో మొత్తం 471 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 4,085 వ్యాక్సిన్ వాయిల్స్ రాగా.. జిల్లాను 53 రూట్లుగా విభజించి, 45మంది పర్యవేక్షకులను నియమించారు. 15 మొబైల్ బృందాలు, 1,884 మంది వ్యాక్సినేటర్లు, 471 మంది ఏఎన్ఎంలు, 300 మంది ఆశలు, మరో 400 మంది వలంటీర్లు పోలియో చుక్కల మందు పంపిణీలో పాల్గొననున్నారు. ప్రతి సెంటర్లో ఉదయం 7గంటల నుంచి చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆశావర్కర్లే ఇంటికి వచ్చి చుక్కల మందు వేస్తారని చాలా మంది తల్లులు నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి చిన్నారిని పోలియో బూత్ వద్దకు తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చిన్నారులకు భవిష్యత్లో ఎలాంటి శారీరక వికలత్వం రాకుండా ఉండేందుకు పల్స్పోలియో వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిర్లక్ష్యం వద్దు.. పోలియో రహిత జిల్లాగా.. జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కల మందు పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రతి పట్టణ, గ్రామంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయించాలి. పోలియో రహిత జిల్లాగా మార్చడమే జిల్లా వైద్యారోగ్యశాఖ లక్ష్యం. – సంధ్యా కిరణ్మయి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ -
3 మోటార్లతోనే అద్భుతం
●రోజువారీగా ఎత్తిపోస్తున్నాం.. వర్షాకాలంలో మినహాయిస్తే.. మిగతా కాలంలో ఎల్లూరు పంప్హౌజ్లోని మూడు మోటార్ల ద్వారా రోజువారీగా నీటిని పంపింగ్ చేస్తున్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారానే నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గుతుంది. 2024–25లో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. 2025–26 సీజన్లో 43.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్నాయక్, డీఈఈ కొల్లాపూర్: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈసారి కూడా నీటి పంపింగ్ పెద్దమొత్తంలో జరిగింది. గత సీజన్లో 50.72 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రికార్డు సృష్టించగా.. ఈసారి మాత్రం వేర్వేరు కారణాలతో 43.5 టీఎంసీలను ఎత్తిపోశారు. కానీ ఇది కూడా ప్రాజెక్టు స్థాయికి మించిన ఎత్తిపోతలే. సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా ఎంజీకేఎల్ఐ మీదనే ఆధారపడటం.. ప్రాజెక్టులోని మూడు మోటార్లతోనే ఈస్థాయి ఎత్తిపోతలు జరగడం అద్భుతమని నీటిపారుదలశాఖ నిపుణులు చెబుతున్నారు. ఒక్కో మోటారుతో 800 క్యూసెక్కులు.. ప్రాజెక్టు పరిధిలో ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటు చేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం కాగా.. 1 మోటార్ స్పేర్లో ఉంచుతారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. మిషన్ భగీరథకు సైతం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ స్కీంకు కూడా కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారానే నీటి పంపింగ్ చేస్తున్నారు. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. మరమ్మతుకు గురైనా.. ఎల్లూరు పంప్హౌజ్లో 5 మోటార్లకు గాను ప్రస్తుతం 3 మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయి. 2011లో ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభమైన సమయంలో 5 మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి ఏడాది 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి. 2016 నుంచి నీటి పంపింగ్ భారీగా పెరుగుతూ వచ్చింది. మూడు మోటార్లతోనే రికార్డు స్థాయిలో పంపింగ్ జరుగుతోంది. 2024–25లో అత్యధికంగా 50 టీఎంసీల మేరకు నీటి ఎత్తిపోతలు జరగగా.. 2019–20లో 49.99 టీఎంసీలు, 2025–26లో 43.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. సాగు, తాగు నీటికి కేఎల్ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డు స్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరోవైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు భారం పడుతున్నా తగ్గేదేలే.. రికార్డు స్థాయిలో కేఎల్ఐ నీటి పంపింగ్ గత సీజన్లో 50.72 టీఎంసీలు.. ఈసారి 43.5 టీఎంసీల నీటి ఎత్తిపోత 2016 నుంచి భారీగా పెరిగిన పంపింగ్ -
పల్స్పోలియోను విజయవంతం చేయాలి
గద్వాల క్రైం: జిల్లాలో ఈ నెల 28 నుంచి పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 69,383 మంది చిన్నారులను గుర్తించామని.. వారికి చుక్కల మందు వేసేందుకు 471 పోలియో బూత్లను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వర కు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించి, పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. గచ్చిబౌలికి బస్సు సర్వీసు గద్వాల క్రైం: జిల్లాకేంద్రం నుంచి గచ్చిబౌలికి ప్రత్యేకంగా బస్సు సర్వీసు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజు ఉదయం 4గంటలకు బస్సు ప్రారంభమై కర్నూలుకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 5:30 గంటలకు బయలుదేరి.. అలంపూర్ క్రాస్రోడ్డు, ఎర్రవల్లి, పెబ్బేరు, వనపర్తి మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పీసీసీ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ల నియామకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పార్టీపరంగా పర్యవేక్షించేందుకు గాను పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కంట్రోల్ రూం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్నగర్కు టి.రేవతిగౌడ్ నియమితులయ్యారు. ఓబీసీ, ఎస్పీ మోర్చా అధ్యక్షుల నియామకం పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా అధ్యక్షులను నియమి స్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఉత్తర్వు లు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పి.యాదయ్య, వనపర్తి కొమ్ము శ్రీను, నాగర్కర్నూల్ జెట్టి వెంకటేష్ను నియమించారు. అలాగే మహబూబ్నగర్ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మిట్టమీది నాగరాజు, వనపర్తి జిల్లాకు ప్రవీణ్, నాగర్కర్నూల్ జిల్లాకు భూషయ్య, గద్వాల జిల్లా ఆంజనేయులును నియమించారు. దీర్ఘకాలిక ఉద్యాన సాగుపై పరిశోధనలు చేయాలి కొత్తకోట రూరల్: ఉద్యాన కళాశాల విద్యా ర్థులు ఉసిరి, చింత, నేరేడు వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. వనపర్తి జిల్లాలోని మోజర్లలో ఉన్న ఉద్యాన కళాశాల 19వ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన సాగు కు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల మార్పిడీ విధానాన్ని అనుసరిస్తూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన విభాగం డీన్ డా. జె.చీనానాయక్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఉన్నత ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఎస్సీ చదివే లక్ష్యంతో విశ్వవిద్యాలయ పరిధిలో జేఆర్ఎఫ్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ వీణాజ్యోషి పాల్గొన్నారు. రెండ్రోజులకే నిలిచిన నీటి పంపింగ్ మరికల్: జూరాల నుంచి కోయిల్సాగర్కు నీటి పంపింగ్ రెండురోజులకే నిలిచిపోయింది. గత వారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి చిన్నచింతకుంట మండలం ఉంద్యాల స్టేజీ–1 దగ్గర జూరాల నీటి పంపింగ్ను ప్రారంభించి రెండురోజుల పాటు పర్ధీపూర్ చెరువుకు చేపట్టారు. పర్ధీపూర్ చెరువు నిండి కోయిల్సాగర్కు నీళ్లు రావాలి. ఆ చెరువు నిండటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. కొన్ని రోజులుగా వర్షాలు కురువకపోవడంతో జూరాలకు వరద రావడం లేదు. దీంతో జూరాలలో నీరు అందకపోవడంతో రెండురోజులు మాత్రమే నీటిపంపింగ్ చేసి నిలిపివేశారు. ప్రస్తుతం కోయిల్సాగర్లో పది అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. గతేడాది ఇదివరకే నీటిపంపింగ్ ప్రారంభించారు. -
గిరిజనులకు అండగా కాంగ్రెస్
● 50 ఏళ్ల క్రితమే రిజర్వేషన్ ఫలాలు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: మొదటి నుంచి ఆదివాసీ గిరిజనులకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర శుక్రవారం కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రాంచందర్నాయక్, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, మాజీ ఎంపీ రవీందర్నాయక్లతో కలిసి మంత్రి మాట్లాడారు. 50 ఏళ్ల క్రితమే ఆదివాసీ, గిరిజనులందరికీ రిజర్వేషన్ ఫలాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. రిజర్వేషన్ల ఫలితంగా సమాజంలో ఆదివాసీ గిరిజనులు అసమానతలకు లోనుకాకుండా ఉన్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీతో పాటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ గిరిజనుల సంక్షేమానికి ఎలాంటి కృషిచేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. -
విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు
అమరచింత: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కొరవడి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటగదితో పాటు తరగతి గదులు, డైనింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు అదేవిధంగా జూనియర్ కళాశాలలో మొత్తం 400 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందీ ఉపాధ్యాయురాలు లేరని, తాగునీరు, స్నానాలకు నీటివసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. శుద్ధజల యంత్రం మరమ్మతుకు గురికావడంతో బోరునీటినే తాగుతున్నారని.. మంచాలు లేకపోవడంతో కిందనే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని.. అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. బడులతో పాటు గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కస్తూర్బాల్లో మౌలిక వసతులు సైతం కల్పించలేని దీన స్థితిలో రాష్ట్ర సర్కార్ ఉండటం శోచనీయమన్నారు. సరిపడా తరగతి గదులతో పాటు ఉపాధ్యాయులను నియమించలేని దుస్థితి ఉందని తెలిపారు. సీఆర్టీలకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు చెల్లించకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్లను నియమించకపోవడంతో బాలికలే తమ తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ల్యాబ్లను ఏర్పాటు చేయడం లేదని, క్రీడాసామగ్రి సమకూర్చి పీఈటీలను నియమించి విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా, గురుకులాలను సందర్శించే కార్యక్రమం చేపట్టామని.. సమస్యలు తెలుసుకొని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విన్నవిస్తామని చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్, మహిమూద్, జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రాఘవేంద్ర, కౌన్సిలర్ డీసీ మాధవి, పాంరెడ్డిపల్లి ఉపసర్పంచ్ వెన్నెల, చంటి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
విత్తనం.. భారం!
కూరగాయల రైతుకు లభించని రాయితీలు ● ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులు ● ఎకరా విత్తనాల కోసమే రూ.7వేల వరకు వ్యయం ● అటకెక్కిన ఆర్కేవీవై పథకం గద్వాల వ్యవసాయం: కూరగాయల రైతుకు తిప్పలు తప్పడం లేదు. పెరుగుతున్న పెట్టుబడులతో సతమతమవుతున్న రైతులకు విత్తనాల ధరలు మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకం కింద ఈ ఏడాదైనా రాయితీపై కూరగాయల విత్తనాలు, ట్రేలు లభిస్తాయన్న ఆఽశ ఉండేది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 10వేల ఎకరాల్లో.. జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణం సైతం సాధారణంగానే ఉంటుంది. దీంతో ఇక్కడ రైతులు సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్లతో కలిపి దాదాపు 10వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ.. ధరూర్ మండలంలో బెండ, టమాటా.. మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాటా, బీర, సోరకాయ, బెండ, కాకర.. అయిజలో బెండ, చిక్కుడు.. వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి.. అలంపూర్లో ఉల్లి.. రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా.. గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటాతో పాటు ఆకుకూరలు సైతం పండిస్తున్నారు. రాయితీపై నారా అందిస్తున్నాం.. ఆర్కేవీవై ద్వారా రాయితీపై కూరగాయల విత్తనాలు, ట్రేలు రావడం లేదు. అయితే హైదరాబాద్లోని జీడిమెట్ల ప్రాంతంలోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంలో రాయితీపై టమాటా, వంకాయ తదితర కూరగాయల నారు అందిస్తున్నాం. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
3.4లక్షల ఎకరాలకు సాగునీరందించేలా..
ఎంజీకేఎల్ఐ ద్వారా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట డిజైన్లు రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్హౌజ్లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లకు నీటిని తరలించేలా డిజైన్లు చేశారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు. -
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
గద్వాల: యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోదక దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్కు పునాది అని, యువత డ్రగ్స్కు అలవాటు పడితే వారి వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా భవిష్యత్, కుటుంబం మొత్తం నాశనమవుతుందన్నారు. అంతేకాకుండా సమాజానికి సైతం నష్టం కలిగిస్తుందన్నారు. విద్యార్థులు చెడు స్నేహాలు, ఆకర్షణలకు లోనుకాకుండా విద్యపై దృష్టి కేంద్రీకరించాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వంటివి చేస్తే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, లక్ష్మణస్వామి, అధ్యాపక బృందం పాల్గొన్నారు. -
సమగ్ర అభివృద్ధికే ప్రజాపాలన
గద్వాల: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ దక్కేలా, అన్నిరకాల అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రత్యేకాధికారి శృతిఓజా అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం 10 థీములతో షెడ్యూల్ ప్రకారం ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు. వివిధ శాఖల్లో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా మరుగుదొడ్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతు, గట్టు మండలం ఆస్పిరేషనల్ బ్లాక్కు ఎంపిక కావడం, నిర్దేశిత పారామీటర్స్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడం జరిగిందన్నారు. బాల్యవివాహాలు అరికట్టేలా కృషి చేశామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్, అలైవ్ వారోత్సవాలు నిర్వహించి రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా గుడ్డెందొడ్డి
తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ రిజర్వాయర్ పెంపు సర్వే పనులు చేస్తున్న అధికారులు (ఫైల్) 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక -
యువత భవిష్యత్కు ఏటీసీ బలమైన పునాది
రాజాపూర్: ఆధునిక, సాంకేతిక శిక్షణతో యువత భవిష్యత్కు రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మించబోతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) బలమైన పునాది అవుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్స్వామి అన్నారు. గురువారం రాజాపూర్ మండల రంగారెడ్డిగూడలో రూ.42 కోట్ల నిధులతో ఏటీసీ సెంటర్కు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ యువతకు విద్యా, ఉద్యోగవకాశాలను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పరని. అందులో భాగంగా తొలివిడతలో రూ.2 వేల కోట్లతో 55 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. నేడు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేస్తలేరని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. 730 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవ సాయ యార్డుకు గురువారం 730 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.7,399, కనిష్టంగా రూ.4,341, సరాసరిగా రూ.6,520 ధరలు లభించాయి. రీ–టెండర్ నిర్వహించాలి గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ షాపులకు నిర్వహించిన టెండర్ ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని తిరిగి రీ–టెండర్ నిర్వహించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నర్సింగ్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 38 షాపులకు టెండర్ నిర్వహించగా, ఇందులో 15 షాపులను ఎస్సీ, ఎస్టీలకు, మరో 23 షాపులకు జనరల్కు కేటాయించారన్నారు. ఇందుకు సంబంధించి 118 దరఖాస్తులు రాగా.. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి వివిధ కారణాలు చూపెడుతూ మొత్తం 59 దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపించారు. ఫలితంగా ఎలాంటి పోటీ లేకుండానే వేలం జరిగి మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడిందని, అలాగే షాపు నంబర్లు 1, 30లకు వేలం నిర్వహించలేదని విమర్శించారు. ఈ షాపులకు ఎప్పుడు వేలం నిర్వహిస్తారో స్పష్టం చేయలేదని, వేలం నిర్వహించి ఆరు రోజులు గడిచినా ఏయే షాపులు ఎంతెంత వేలం పోయాయి.. ఎవరికి కేటాయించారు.. అనే వివరాలు చెప్పలేదన్నారు. ఇంకా ఎన్నో సందేహాలు, అక్రమాలు చోటుచేసుకున్నప్పుడు తిరిగి షాపులకు రీటెండర్ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కిరణ్, హన్మంతు, వెంకటేష్, రాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ ప్రాజెక్టులు ఆపాలి గద్వాల: తుంగభద్ర నదిపై ఆర్డీఎస్కు తూట్లు పొడుస్తూ కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి లి్ఫ్ట్ ఇరిగేషన్ను తక్షణమే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని ఎన్నడూ వినియోగించుకోలేదన్నారు. కేవలం 25 వేల ఎకరాలకు మించి సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి ప్రాజెక్టును తక్షణమే ఆపాలని, ఆర్డీఎస్ రావాల్సిన నీటి వాటాను పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎకై ్సజ్ డీసీగా విజయ్భాస్కర్రెడ్డి మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కా రీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ ఇన్చార్జి డీసీగా ఉన్న విజయ్భాస్కర్రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్గా డిప్యూటీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్ నుంచి జి.శ్రీనివాస్ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చారు. నాగర్కర్నూల్ ఈఎస్గా పని చేస్తున్న గాయత్రి మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నాగర్కర్నూల్ ఈఎస్గా వి.వేణుగోపాల్రెడ్డి ఖమ్మం నుంచి పదోన్నతిపై వచ్చా రు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్గా ఉన్న పి.కరమ్చంద్ పదోన్నతిపై గద్వాల ఈఎస్గా వచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో ఏఈఎస్గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్ ఈఎస్గా వెళ్లారు. -
వీధివ్యాపారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
గద్వాల న్యూటౌన్: వీధి వ్యాపారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి అన్నారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో స్వానిధి మహోత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వీధి వ్యాపారాలు కనీస పెట్టుబడికి ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందిస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గద్వాల పట్టణంలో వీధి వ్యాపారులు తమ వ్యాపారాలు నిర్వహించుకోవడంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జానకిరాం సాగర్ మాట్లాడుతూ 2019లో కరోనా వ్యాధి సమయంలో చిరు, వీధి వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడ్డారని, వారికి ఆర్థికపరమైన చేయూతను అందించేందుకు అప్పుడు ప్రభుత్వం భారత్ ఆత్మ నిర్భర్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా మూడు విడతలుగా రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేలు రుణాలు అందించామని గుర్తుచేశారు. ఈ రుణ మొత్తాలను ఇటీవల కొంత పెంచారని, వీధి వ్యాపారులు అధిక వడ్డీలకు ప్రైవేట్గా అప్పులు తీసుకోకుండా, వీధి వ్యాపారిగా నమోదై బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఉత్తమ వీధి వ్యాపారులుగా ఎంపికై న వారిని చైర్పర్సన్, కమిషనర్ శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. అంతకు ముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుడ్, వస్తువుల స్టాల్స్ను సందర్శించారు. కార్యక్రమంలో మెప్మా ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, సీఓలు నిజాముద్దీన్, మహాలక్ష్మి, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో..
కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది. రబీలోనే కష్టాలు.. వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. -
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి
గద్వాల (మల్దకల్): పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జగ్గునాయక్ అన్నారు. గురువారం మండలంలోని పెద్దపల్లి గ్రామంలో ఏఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు కంపెనీ గుర్తింపు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, నానో యూరియా, నానోడీ డీఏపీల వాడకం పెంచాలని వివరించారు. ముఖ్యంగా జీవ ఎరువుల ప్రాముఖ్యత, జీవామృతం, వర్మీ కంపోస్టు, బయో ఫర్టిలైజర్ల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి.. పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితేనే మంచి దిగుబడులు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు శిరీష, ఏఈఓ సుధారాణి, రైతులు పాల్గొన్నారు. -
సమగ్ర ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
విజయవంతం చేయాలి.. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలో 217, 218 పోలింగ్ వద్ద సర్లో భాగంగా ఇంటింటికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న బీఎల్ఓల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించారు. ప్రజల సహకారంతోనే సమగ్ర విశ్వసనీయ ఓటరు జాబితా రూపకల్పన సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలందరూ ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. గద్వాల: ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియతో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ అన్నారు. సర్పై ఓటర్లకు కల్పించేందుకు గురువారం కలెక్టరేట్ నుంచి కృష్ణవేణిచౌరస్తా వరకు నిర్వహించిన 2కే రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అధికారులు, విద్యార్థులు, ఓటర్లు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని ఓటరు చైతన్యానికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఓటరు చైతన్య నినాదాలు చేస్తూ ఉత్సాహంతో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. మరణించిన వారు, అనర్హుల ఓట్లు తొలగించి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రయ దోహదపడుతుందన్నారు. ఈనెల 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సం పురస్కరించుకుని వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రావు, ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఓ భూపాల్రెడ్డి, శిక్షణ డీసీలు మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్.. వ్యక్తికే కాదు కుటుంబానికి ముప్పు
గద్వాల క్రైం: మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులకు కౌన్సెలింగ్ ద్వారా పునరావాస కార్యాక్రమాలను అందజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ‘మన డ్రగ్స్ డీ అడిక్షన్ – రిహాబిటేషన్ సెంటర్’ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తులను మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్నా రు. వ్యసనాలకు బానిసైలన వారికి సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్, యోగా, ధ్యానం వంటి శిక్షణ ఇవ్వాలన్నారు. సెంటర్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, సదుపాయాలను సొసైటీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈగల్ ఫోర్స్ ద్వారా జిల్లాకు వచ్చిన క్యారమ్, చెస్, పెయింటింగ్ బోర్డు, సృజనాత్మక కార్యకాలపాలకు ఉపయోగపడే సామగ్రిని అందజేశారు. కార్యక్రమాంలో సీఐ శ్రీను, ఎస్ఐ కల్యాణ్కుమార్, సెంటర్ నిర్వాహకులు కృష్ణయ్య తదితరులు ఉన్నారు. పనులు నాణ్యతగా చేపట్టాలి ఉండవెల్లి: మండలంలోని 11 పంచాయతీల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనుల్లో భాగంగా జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా 31 పనుల్లో 28 పనులను కేంద్ర నోడల్ అధికారి సత్యమూర్తి, జిల్లా టెక్నికల్ కోఆర్డినేటర్ విద్యాధర్, ఏపీడీ శ్రీనివాసులు పరిశీలించారు. గ్రామ పంచాయతీల్లో ఇంకుడు గుంతలు, చెక్డ్యాములు, బోరు బావులు, రూప్టాప్ హర్వెస్టింగ్ పనులను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత లోపిస్తే వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుపతన్న, ఏపీఓ సౌజన్య, టీఏలు రామచంద్రుడు, విజయ్ పాల్గొన్నారు. లంపిస్కిన్ నివారణ టీకాలు వేయించండి గద్వాల వ్యవసాయం: గోజాతి పశువులైన ఎద్దు లు, ఆవులు, కోడెలు లంపిస్కిన్ (ముద్ద చర్మం) వ్యాధి బారిన పడకుండా ముందుస్తుగా నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ వెంకటనారాయణ ఒక ప్రకటనలో పాడి రైతులకు సూ చించారు. బుధవారం నుంచి ఈ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైందన్నారు. జూలై 8 వరకు ఆయా గ్రామాల్లో పశువైద్య సిబ్బంది పశువులకు టీకాలు వేస్తారని పేర్కొన్నారు. 2 నుంచి 3 నెలల దూడలు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దోమలు, ఈగ లు, రక్తం పీల్చే కీటకాల ద్వార, వ్యాధి సోకిన పశువుల నీరు, మేత ద్వారా కూడా వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. అధిక జ్వరం, కళ్లు, ముక్కు నుంచి నీరుకారడం ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. -
త్వరలో పనులు పూర్తి చేస్తాం
అనేక కారణాల వల్ల ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ట్యాంక్ బండ్పై రోడ్డు నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్, బెంచీలు ఏర్పాటు చేయాలి. అలుగును కాంక్రీట్ చేయాలి. ఫీడర్ చానల్ను అభివృద్ధి చేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు కృషిచేస్తాం. – నాగరాజు, ఇరిగేషన్ డీఈ సగం కూడా పూర్తికాలే.. ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు ప్రారంభించి సుమారు ఏడేళ్లవుతోంది. ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారులు చొరువ తీసుకొని పనుల్లో వేగం పెంచాలి. – జగన్నాథరెడ్డి, అయిజ ఆధునిక హంగులతో నిర్మించాలి మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడడంతో పాటు ఆధునిక హంగులు ఏర్పాటు చేయాలి. దీంతోపాటు వాకింగ్ ట్రాక్, ఒపెన్ జిమ్ వంటివి సమకూర్చితే ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయమం చేసుకునే అవకాశం ఉంటుంది. – గోవిందు, అయిజ ● -
పోటీల్లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ధరూరు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు పునాది రాయి లాంటిదని తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ సరిత అన్నారు. మండలంలోని గార్లపాడులో పోలమ్మ అవ్వ పండుగను పురస్కరించుకొని మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. సరిత పోలమ్మ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. విజేతగా నిలిచిన మూలమళ్ల జట్టుకు ప్రథమ బహుమతి రూ.30,116 నగదును మాజీ జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వరరెడ్డి దంపతులు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన హైదరాబద్ జట్టుకు సర్పంచు పరిమళ శివరాజ్ రూ.20,016 నగదు అందజేశారు. మూడో విజేతగా నిలిచిన ప్రకాశం జిల్లా జట్టుకు రూ.15,016 నగదును శివకుమార్రెడ్డి అందజేశారు. అలాగే నాల్గోవ స్థానంలో నిలిచిన గార్లపాడు జట్టుకు రంగస్వామి నగదు ఆందజేశారు. ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు.. గార్లపాడులో నిర్వహించిన సందెరాళ్ల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులతో పాటు షీల్డులను సర్పంచు పరిమళ శివరాజ్ అందజేశారు. -
శుభ్రం చేయిస్తున్నాం..
ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. – అశోక్కుమార్, డీఎం, మహబూబ్నగర్ అపరిశుభ్ర వాతావరణమే.. నేను ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, పాతపాలమూరు, మహబూబ్నగర్ ● -
సర్.. వస్తున్నారు!
అచ్చంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్ఓఎస్), బూత్లెవల్ అధికారులు (బీఎల్ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివశిస్తున్న అర్హుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయనున్నారు. బీఎల్ఓల పాత్ర కీలకం.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత ముఖ్యమైంది. దీనిలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకం కానుంది. జూలై 24 నాటికి పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, 31న ఓటర్ల ముసాయిదా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై నోటీసుల జారీ, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుంది. చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లినవారు, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించి.. అర్హులతో మాత్రమే తుది జాబితా రూపొందిస్తారు. ఉమ్మడి జిల్లాలో 80.15 శాతమే.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 21,95,269 (80.15 శాతం) ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సర్–2002తో భాగంగా మ్యాపింగ్ చేయగా ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓను నియమించారు. వీరంతా నెల రోజుల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ తక్కువగా నమోదు కావడానికి మెజార్టీ ఓటర్లు సొంత గ్రామంలో నమోదు చేయించుకుంటామని చెప్పడమే ప్రధాన కారణం. 2002, 2025 ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉంటే.. ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవచ్చు.. ఓటర్లకు ముందుగా ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ఓలు వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు మూడుసార్లు సందర్శిస్తారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31న డ్రాఫ్ట్ ఎస్ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో.. లేదో.. పరిశీలించి, అభ్యంతరాలు లేదా కొత్త క్లెయింలు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలి. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తాం. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ ఇప్పటికే బూత్లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి ఉమ్మడి జిల్లాలో 80.15 శాతం పూర్తయిన మ్యాపింగ్ జూలై 24 వరకు ప్రక్రియ ముగించేలా కసరత్తు 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ -
‘చెత్త’స్టాండ్..!
‘మొత్తం 18 ప్లాట్ఫాంలు కలిగి.. ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర డిపోలతో కలిపి కనీసం 250 బస్సులు.. సుమారు 60 వేల మంది నిత్యం రాకపోకలు సాగించే మహబూబ్నగర్ కొత్త బస్టాండ్ చెత్త ప్రాంగణంగా మారింది. పెద్ద నాలా నుంచి వచ్చే దుర్వాసన, ఆరుబయటే మూత్రవిసర్జన, ఆవరణలో పందుల సంచారం, హోటల్ నుంచి వచ్చే వ్యర్థజలాలతో కూడిన కాల్వ, ఎక్కడికక్కడే పేరుకున్న చెత్తాచెదారంతో బస్టాండులోకి వెళ్లే వారు ముక్కు మూసుకోవాల్సి వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోచవచ్చు. ఫలితంగా బస్సులు వచ్చే వరకు ప్రాంగణంలో కూర్చోవాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. దుర్గంద భరితమైన వాసన మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ – మహబూబ్నగర్ మున్సిపాలిటీ కొత్త బస్టాండు ప్రాంగణం, డిపో మధ్యలో నుంచి పెద్దనాలా (మురుగు కాల్వ) వెళ్తోంది. ఈ కాల్వ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు, సీసాలతో ఎప్పుడూ నిండిపోయి కనిపిస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చుట్టపు చూపులా వచ్చి అప్పుడప్పుడు చెత్తాచెదారం తొలగిస్తుంటారు. అందులోనే జీవనం సాగించే పందులు.. అప్పుడప్పుడు ప్రాంగణంలో సంచరిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బస్టాండు ఎన్హెచ్–167కు 5 అడుగుల కిందికి ఉండటంతో వర్షాకాలంలో ప్రాంగణమంతా వరదతోపాటు మురుగు ఏరులై పారుతుంది. భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పెద్దనాలా పొంగి పొర్లుతుండటంతో డిపోలోకి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముందుకు కదలని మురుగు.. వాస్తవానికి బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో ఆవరణ, గ్యారేజీ పరిసరాలను నిత్యం శుభ్రం చేయడానికి ఆర్టీసీకి చెందిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారని అధికారులు చెబుతున్నా.. చాలా వరకు పరిసరాలన్నీ అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదిన్నర క్రితం నిర్మించిన కొత్త షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. మరోవైపు ఇక్కడి హోటల్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు మురుగు కాల్వలో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధభరితంగా మారడంతో ప్రయాణికులు ముక్కు మూసుకుని లోపలికి వస్తూ పోవాల్సి వస్తుంది. అలాగే బహిరంగ మూత్రశాలలు రెండుచోట్ల ఉన్నా కొందరు పెద్ద నాలా వద్దే మూత్రవిసర్జన చేస్తుండటం గమనార్హం. రోజూ సేకరించే చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఆర్టీసీ కాంట్రాక్ట్ సిబ్బంది ఇక్కడ ఓ మూలన ఉన్న పెద్ద డస్ట్బిన్లో వేసేస్తున్నారు. అది నిండిపోయి ఆరుబయట పడినా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాలమూరు బస్టాండులోకి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.. ప్రాంగణంలో ఎక్కడబడితే అక్కడే చెత్తాచెదారం దర్శనం కంపుకొడుతున్న బహిరంగ మూత్రశాలలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పెద్దనాలా పట్టించుకోని ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు -
వేల సంఖ్యలో సంచారం..
జిల్లాకేంద్రంలోని కాలనీలు, రోడ్డు మార్గంలో వెళ్తున్న వాహనదారులు, మనుషులపై వీధికుక్కలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు వీధికుక్కలను నిలువరించేందుకు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శివారు ప్రాంతాలు, కాలనీలు, ప్రధాన రహదారుల వెంట తిరుగుతున్న 60 వీధికుక్కలను గుర్తించి వాటిని పశు సంవర్ధకశాఖ అధికారులకు అప్పగించారు. అయితే జిల్లాకేంద్రంలో వేల సంఖ్యలో కుక్కలు ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వేల సంఖ్యలో కుక్కలు ఉండగా.. నామమాత్రంగా చర్యలు తీసుకుంటుండటంతో పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. -
128వ రోజుకు చేరిన నిరసన దీక్షలు
గట్టు: మండల పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న భారత్మాల రోడ్డుకు మండలానికి కనెక్టివిటీ కల్పించే అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ డబుల్ రోడ్డును మూసివేయకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని గట్టు, రాయాపురం, ఆలూరు, తుమ్మలచెరువు గ్రామస్తులు నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం నాటికి 128వ రోజుకు చేరుకుంది. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న గట్టు మండలంలో భారత్మాల రోడ్డు నిర్మాణం ఈ ప్రాంతవాసులకు కొత్త ఆశలను చిగురింపజేసినట్లు తెలిపారు. అయితే రోడ్డుకు ఇరువైపులా ప్రహరీ నిర్మిస్తుండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. దీంతో మండల ప్రజలు నిరసన దీక్షలకు పూనుకున్నారని చెప్పారు. భారత్మాల రోడ్డుకు గట్టు మండలానికి కనెక్టివిటీ ఇచ్చే అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రాయాపురం స్టేజీ దగ్గరున్న డబుల్ రోడ్డును మూసివేసి.. రాకపోకలు లేని పాత ఆలూరు రోడ్డు మార్గంలో వంతెనను తక్కువ ఎత్తులో నిర్మించడం ద్వారా భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. దీనికి తోడు రోడ్డు మలుపు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ, కాంట్రాక్టర్, కేంద్ర ప్రభుత్వం స్పందించి గట్టు మండలానికి కనెక్టివిటీ ఇవ్వడంతోపాటు నూతనంగా వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, తిమ్మప్ప, కృష్ణయ్య, సాలెకర్రెప్ప, జనార్దన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలి
ఎర్రవల్లి: ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. ఎర్రవల్లిలోని పదవ బెటాలియన్ పోలీస్ సెమినార్ హాల్లో మంగళవారం జ్ఞానదీప్తి పేరుతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు నిర్వహించిన పాఠశాలల ప్రారంభ మార్గదర్శక శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన 32 పారా మీటర్స్లో మన జిల్లా మంచి ర్యాంకింగ్ సాధించేలా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలన్నారు. యూడైస్ అప్డేట్ పక్కాగా ఉండాలని, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇటీవలే విద్యా శాఖాధికారులతో కలిసి ఆయన ఫిన్లాండ్ దేశంలో పర్యటించి, అక్కడి విద్యా వ్యవస్థను అద్యయనం చేయడం జరిగిందని, కొన్ని అంశాలను మన వద్ద కూడా అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలను ప్రతినెలా 15లోగా సందర్శించి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు లీవ్ లెటర్ ఇవ్వకుండా పాఠశాలలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. పోషణ్ యాప్లో ఎప్పటికప్పుడు వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. ప్రత్యేక పునశ్చరణ తరగతుల ద్వారా చదువులో వెనకబడిన విద్యార్థులు మెరుగుపడేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పీపీటీ ద్వారా మాస్టర్ ట్రైనర్ అగస్టీన్ వివిధ అంశాలపై ఎంఈఓలు, హెచ్ఎంలకు సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్కుమార్రెడ్డి, రాజ్కుమార్, డీఈఓ విజయలక్ష్మి, కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ పాణి,సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
‘మిగులు’తో సర్దుబాటు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సబ్జెక్ట్లకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతను అధిగమించేలా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఆయా స్కూళ్లలో మిగులు (సర్ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న చోట్ల సర్దుబాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది 20 నాటికి ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య.. 2021లో జారీ చేసిన జీఓ నంబర్ 25 ఆధారంగా సర్దుబాటు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవలం ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల (చైర్మన్లు) అనుమతితో మాత్రమే డిప్యూటేషన్ల తంతు చేపట్టనున్నారు. సుమారు 650 మందికి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1.90 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతపడిన సర్కారు పాఠశాలలు 135 ఉన్నాయి. సర్దుబాటులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 650 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్లను సర్దుబాటుపై బదిలీ చేయాలని.. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పలు సబ్జెక్ట్ టీచర్ల కొరతే అసలు సమస్య.. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, బదిలీలు, పదోన్నతుల మూలంగా చాలా హైస్కూళ్లలో పలు సబ్జెక్ట్లను బోధించే ఉపాధ్యాయుల కొరత వేధిస్త్తోంది. ప్రాథమిక (ప్రైమరీ) పాఠశాలల్లో అన్ని సబ్జెక్ట్లను ఒకే ఉపాధ్యాయుడు బోధించే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఉన్నత (హైస్కూల్) పాఠశాలల స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 130 పాథమిక పాఠశాలలు మూతపడగా.. ఆయా ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోట హైస్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇంగ్లిష్, హిందీ, తెలుగు వంటి లాంగ్వేజెస్ బోధించే ఉపాధ్యాయుల కొరత పీడిస్తోంది. దీంతో చాలా పాఠశాలల్లో అనివార్యంగా ఆయా సబ్జెక్ట్లను బోధిస్తున్న టీచర్లతోపాటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడగా.. హైస్కూళ్లలో సమస్యగా మారింది. శాశ్వత పరిష్కారం చూపించాలి.. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం.. కొన్నింటిలో తగ్గడం వంటి కారణాల చేత సర్దుబాటు చేయడం తప్పని సరిగా మారింది. అయితే ప్రతి సంవత్సరం సర్దుబాటు చేస్తున్న పలు పాఠశాలలు మూతబడుతున్నాయని, హైస్కూల్ స్థాయిలో సబ్జెక్ట్లు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని.. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. జోగుళాంబ గద్వాల 10 నాగర్కర్నూల్ 0 ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లకు డిప్యూటేషన్లు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకే అవకాశం.. జిల్లా పరిధిలో కలెక్టర్ల అనుమతితో మాత్రమే తాత్కాలిక బదిలీ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఈ సారి ఒక్కటీ తెరుచుకోనట్లే.. ఉమ్మడి జిల్లాలో ప్రశ్నార్థకంగా 135 స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా 135 స్కూళ్లు.. ఉమ్మడి జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం డిప్యూటేషన్పై వేరే పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఈ విద్యాసంవత్సరంలో తిరిగి ఆయా స్కూళ్లకు రాలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా.. ఆయా ఉపాధ్యాయులు, ఎంఈఓలు దృష్టి పెట్టకపోవడంతో 135 పాఠశాలల్లో ఒక్కటి కూడా తిరిగి తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
వరుసబెట్టి.. కరిచేస్తున్నాయి
● జిల్లాలో పెరుగుతున్న కుక్కకాటు కేసులు ● గడిచిన మూడు నెలల్లో 429 మందిపై దాడి ● తాజాగా జమ్మిచేడ్లో 10 మందిపై దాడి ● ఆరుబయటకు రావాలంటేనే జంకుతున్న జనం ● పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్న అధికారుల కట్టడి చర్యలు గద్వాల క్రైం: జిల్లాలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. ఆరుబయట కనబడిన వారిపైనల్లా అమాంతం ఎగబడి దాడులు చేస్తున్నాయి. ఇంటి ఆవరణ.. రోడ్డు మార్గంలో.. వీధుల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద తప్పడం లేదు. జిల్లాలో గత కొన్ని రోజులుగా కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. విచక్షణారహితంగా కరిచే కుక్క కాటుతో వచ్చే (రేబిస్ వ్యాధితో మరణం) ప్రమాదాన్ని గుర్తెరిగి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం జమ్మిచేడ్ కాలనీలో ఓ పిచ్చి కుక్క కనిపించిన వారిపైనల్లా విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో 10 మందికిపైగా తీవ్ర రక్తగాయాల పాలైన సంఘటన తీవ్ర కలకలం రేపింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో 429 మందికిపైగా కుక్కలు దాడులు చేశాయి. మరోవైపు గద్వాల మున్సిపల్ అధికారులు వీధికుక్కలను నిలువరించేందుకు 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి 60 కుక్కలను కట్టడి చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
భయం వేసింది..
ఉదయం ఆరుబయట నిలబడి ఉన్నాను. అయితే ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి ఒక్కసారిగా ఎగబడి దాడి చేసింది. ఈ ఘటనలో మెడ, చేయి, కాలు ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. తప్పించునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యుల వచ్చి కుక్కను తరిమేయడంతో బటయ పడ్డాను. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా చనిపోతానేమోననే భయం వేసింది. వీధికుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి. – ఈశ్వర్, కుక్కకాటు బాధితుడు, జమ్మిచేడ్కాలనీ, గద్వాల ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి.. నల్లకుంట, రాజీవ్మా ర్గ్ కాలనీల్లోని రహదారులపై వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా యి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమయ్యా యి. రహదారుల వెంట పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కుక్కలు దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. బైక్లపై వెళ్లే వారిని వెంబడించి కరుస్తున్నాయి. కుక్కలు పట్టేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన ఫలితం లేదు. కాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాటి బెడద నుంచి కాపాడాలి. – నందకిషోర్, నల్లకుంట కాలనీ, గద్వాల మూడు శాఖల ఆధ్వర్యంలో.. పట్టణంలో వీధికుక్కల నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. వివి ధ వార్డులలో తిరుగుతున్న 60 కుక్కలను పట్టుకుని పశు సంవర్ధక శాఖ అధికారులకు అప్పగించాం. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకునేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా వాటిని కట్టడి చేస్తాం. గాయపడిన వారికి యాంటీ రేబిస్ టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య, పశు సంవర్ధక, మున్సిపల్ శాఖల సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాం. – జానకిరాంసాగర్, మున్సిపల్ కమిషనర్, గద్వాల -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎస్పీ
గద్వాల క్రైం: నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గద్వాల మండలంలోని అనంపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. యువత, చిన్నారులు, పెద్దలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. ఈ అలవాటు కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ నిత్య, సీఐ శ్రీను, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. గద్వాల జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా పని చేసిన కల్యాణ్ చక్రవర్తి జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పని చేసి గద్వాలకు బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత హాజరై సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి నర్సింహారెడ్డి, వెంకటయ్య, చంద్ర మౌలి, అనంతరెడ్డి, అనిల్కుమార్, ఎన్పీ వెంకటేష్, స్వదేష్, న్యాయవాదులు పాల్గొన్నారు. రంగారెడ్డిగూడలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రాజాపూర్: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామంలో రూ.12 కోట్లతో నాలుగు ఎకరాల స్థలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఈనెల 25న మంత్రి వివేక్ వెంకట్స్వామి ప్రారంభించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలోయువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను రంగారెడ్డిగూడలో ప్రారంభించుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. గ్రామశివారులో ఎస్సీ కాలనీ పక్కన టాటా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం కార్యరూపం దాల్చబోతోందని పేర్కొన్నారు. ఇప్పటికే బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్తో పాటు నవోదయ పాఠశాలను మంజూరు చేయించామని, జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 612 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 612 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,819, కని ష్టంగా రూ.3,549, సరాసరిగా రూ.5,700 ధరలు లభించాయి. అలాగే 5 క్వింటాళ్ల వరి (సోన) క్వింటాల్ రూ.2,567ధర పలికింది. జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,626, కనిష్టంగా రూ.2,001 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,222, కనిష్టంగా రూ.2,177 ధరలు పలికాయి. -
కసరత్తు చేపట్టాం..
జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభా, నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ వినూత్న చర్యలు తీసుకుంది. పట్టణ పోలీసు స్టేషన్లో ముగ్గురు ఎస్ఐలు విధులు నిర్వహిస్తుండగా.. వారికి ఒక్కో సెక్టార్ను కేటాయించాం. వారు నిరంతరం ఆయా సెక్టార్లపై నిఘా ఉంచి, బాధితులకు సత్వర న్యాయం చేసేలా కృషి చేస్తారు. వీరిని ఎస్హెచ్ఓ మానిటరింగ్ చేస్తూ.. అవసరమైన సలహాలు ఇస్తుంటారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల -
వాటాదారులకు మెరుగైన సేవలు
స్టేషన్ మహబూబ్నగర్: ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వాటాదారులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ కండె కుమారస్వామి అన్నారు. ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 28వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రూ.1,29,68,995 లాభాలు ఆర్జించిందని చెప్పా రు. ఇందులో వాటాదారులకు 25 శాతం డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించామని సీనియర్ వైస్ చైర్మన్ గుండ్ల కృష్ణయ్య ప్రకటించారు. తెలంగాణలో 25 శాతం డివిడెండ్ ఇస్తున్న ఏకై క కోఆపరేటివ్ బ్యాంక్ మనదేనని పేర్కొన్నారు. సీఓఈ రాచూరి రాజేంద్రకుమార్ 2025–26 సంవత్సరానికిగాను జమ అయిన ఖర్చుల వివరాలను సమా వేశంలో వివరించగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు. 28 ఏళ్ల తర్వాత బ్యాంక్ సొంత భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు చేయనున్నామని, అలాగే 2026– 27 ఆర్థిక సంవత్సరంలో మరో నూతన శాఖను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్లు వెల్లడించారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ కలకొండ సూర్యనారాయణ, డైరెక్టర్లు పుల్లా శ్రీనివాసులు, గుండా వెంకటేశ్వర్లు, రాగిరి తిరుపతయ్య, ఎదిర తమ్మయ్య, కల్వ కన్నయ్యశెట్టి, నీల సంగమేశ్వర్, హకీమ్ విశ్వప్రసాద్, దామరగిద్ద జ్యోతి, బ్యాంక్ మేనేజర్ జనుంపల్లి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.


