Jogulamba District Latest News
-
అకాల కష్టాలు
● జిల్లాలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు, అకాల వర్షం ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు ● అలంపూర్ యార్డులో తడిసిన మొక్కజొన్న ● ఎన్హెచ్–44పై విరిగిపడిన సిగ్నల్ లైట్స్, చెట్లు ● లారీ బోల్తా, ట్రాఫిక్కు అంతరాయం వల్లూరులో కూలిన గుడిసె పైభాగంఉండవెల్లిలో పొలంలో విరిగిపడిన విద్యుత్ స్తంభంఅలంపూర్ చౌరస్తాలోని యార్డులో తడిసిన మొక్కజొన్న ధాన్యం చూపుతున్న రైతులుఎర్రవల్లి మండలం నారాయణపురం స్టేజీలో జాతీయ రహదారిపై బోల్తాపడిన లారీ -
కనీస వేతనాలు సవరించాలి
గద్వాల న్యూటౌన్: ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాలను సవరించి, ప్రతి కార్మికుడి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నర్సింహ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం ప్రకటించిన వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవన్నారు. కార్మికులు, సంఘాలు చేసిన డిమాండ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. కనీస వేతనాలను కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలుగా విభజించి వేర్వేరుగా ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వేతనాలను అన్స్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైస్కిల్డ్ అని నాలుగు కేటగిరీలుగా విభజించి, అన్ని రంగాల్లో ఒకే రకంగా వేతనం పెంచడం వల్ల కార్మికవర్గం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపులో కరువు భత్యానికి సంబంధించిన అంశాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. కార్మిక సంఘాలు, కనీస వేతనాల మండలి సిఫార్సులను పరిగణలోకి తీసుకోకుండా.. మంత్రివర్గ ఉపసంఘం పేరిట ఏకపక్షంగా కనీస వేతనాలు నిర్ణయించడం అన్యాయం అన్నారు. 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. సమావేశంలో నాయకులు నర్సింహులు, గోవిందు, మోష, రాముడు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమాభివృద్ధి పథకాలు
గద్వాల: జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయడమే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాపాల న– ప్రగతి ప్రణాళిక కార్యక్ర మం దోహదపడుతుందని అదనపు కలెక్టర్ మధుమోహన్ అ న్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావుతోపాటు అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్రా వు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు ప్రభు త్వం అమలు చేసిన త్వరలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రణాళికతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించిందని చెప్పారు. ఆయా శాఖల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, పరిశుభ్రత పనులు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు నెలలు నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలోనూ అరైవ్– అలైవ్లో ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించామన్నారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది మరణించడమే కాకుండా గాయపడిన సురక్షితంగా ఇళ్లకు చేర్చుతున్నామన్నారు. డ్రగ్స్కు బానిసైన యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ● అదనపు కలెక్టర్ నర్సింగ్రావు మాట్లాడుతూ ప్రభుత్వం గృహజ్యోతి, రేషన్కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో అల్పాహా రం, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం గురించి వివరించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. బాలభవ న్ విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ శంకర్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతమ్మ పాల్గొన్నారు. -
జడ్చర్లలో స్వైన్ఫ్లూ కలకలం
జడ్చర్ల: పట్టణంలో స్వైన్ఫ్లూ కేసు నమోదైంది. వారం రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో జడ్చర్లకు చెందిన ఓ వ్యక్తి (42) జడ్చర్లలో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాడు. జ్వరం, నిమోనియాకు సంబంధించి వైద్యచికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో అనుమానంతో స్వైన్ఫ్లూ పరీక్షలు చేయించడంతో పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా స్వైన్ ఫ్లూ వచ్చిన వ్యక్తి స్విమ్మింగ్ఫూల్లో ఈతకు వెళ్లిన వెంటనే జలుబు, జ్వరంతో అనారోగ్యానికి గురయినట్లుగా సమాచారం. మొదట జ్వరం కోసం చికిత్స తీసుకున్నా.. తగ్గకపోవడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో పరీక్షలు చేయడంతో స్వైన్ ప్లూ నిర్ధారణ అయింది. ప్రజలు మాస్కులు ధరించడం, చేతులు శుభ్ర పరుచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. -
ధరలు పెరగడం వల్లే..
సిమెంట్తోపాటు ఇతర వస్తువుల ధరలు తగ్గించాలి. ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఇళ్ల ప్రారంభానికి ముహూర్తాలు చేసుకొని ఆర్థిక పరిస్థితి లేక పనులు మొదలు పెట్టడం లేదు. ముడి సరుకులకు ధరలు పెంచడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. – మహాలక్ష్మి, లబ్ధిదారురాలు, మానవపాడు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పరిస్థితి పెరుగుతుంది. సామగ్రితోపాటు రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇసుక, సిమెంట్ ధరలు సైతం పెరిగిపోయాయి. మరోవైపు కూలీలకు డిమాండ్ చాలా ఉంది. ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి. – గాయత్రి, లబ్ధిదారురాలు, చెన్నిపాడు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ప్రోత్సహించేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చాం. ఇక ధరల పెరుగుదల అనేది మా చేతుల్లో లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి. – శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ ● -
తపాలశాఖలో కలవరం!
వివరాలు 8లో...సీబీఐ ఎఫ్ఐఆర్లో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పేరు ● బదిలీ వేటు వేసి పోస్టింగ్ ఇవ్వని ఉన్నతాధికారులు ● పూర్తి వివరాలు సేకరిస్తున్న సీబీఐ అధికారులు ● బిల్లుల చెల్లింపులపై సృష్టత కరువు నీటికోసం వెళ్తే.. నిండుప్రాణం బలి ● పనిప్రదేశంలో కరువైన కనీస వసతులు ● పాడుబడ్డ బావిలోకి దిగి ఉపాధి కూలీ మృతి ● ‘ఉపాధి’ అధికారుల బాధ్యతారాహిత్యమే శాపం.. – మదనాపురం వనపర్తిటౌన్: బీపీఎంలు,ఏబీపీఎంలు, డాక్ సేవక్ల అదనపు బిల్లుల చెల్లింపు కోసం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ లంచం ఆశిస్తూ ఈ నెల 8న సీబీఐకి పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ వ్యవ హా రంలో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని భూమ న్న ఖండించినప్పటికీ.. అనూహ్యంగా సీబీఐ ఎఫ్ఐఆర్లో అతడి పేరు నమోదు కావడంతో తపాలశాఖలో కలవరం మొదలైంది. భూమన్నను వనపర్తి నుంచి బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్క డా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండ్రోజుల కిందట సీబీఐ అధికారులు భూమన్న,పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వనపర్తి ప్రధా న పోస్టల్ కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో పోస్టల్ సూపరింటెండెంట్ పేరు నమోదు కావడంతో సీబీఐ విచారణ ఎవరెవరికి తలనొప్పి తెచ్చిపెడుతుందోనని సిబ్బందిలో కలవరం మొదలైంది. భూమన్న ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారు.. ఆయన వ్యవహారం శైలిపై సీబీఐ దృష్టి సారించినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. అసలు సమస్య ఇక్కడే.. వనపర్తి తపాల ప్రధాన కార్యాలయంలో అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగుల బిల్లుల చెల్లింపుల జాప్యం సీబీఐ వరకు చేరింది. 2023 నుంచి 2026 వరకు బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్సేవక్లు లేని శాఖల్లో ఉన్న సిబ్బంది అదనపు బాధ్యతలు నిర్వర్తించేలా తపాలాశాఖ చర్యలు చేపట్టింది. వీరికి రెగ్యులర్ వేతనంతో పాటు అదనపు విధులకు సంబంధించిన బిల్లులను తపాలాశాఖ చెల్లిస్తుంది. అదనపు విధులు నిర్వర్తించిన సుమారు 192 మంది ఉద్యోగుల బిల్లులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో గతేడాది చివరిలో బిల్లులు చెల్లింపునకుగాను పోస్టల్ సూపరింటెండెంట్ ఉన్నతాధికారులకు దస్త్రం సమర్పించారు. ఇందుకు అనుమతిస్తున్నట్లు ప్రతి దస్త్రం అందజేసిన నాలుగు నెలల తర్వాత నిలిపివేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ దశలోనే అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగులు లంచం ఇస్తే ఎలాగైనా బిల్లులు జారీ చేస్తామని పోస్టల్ ఇన్స్పెక్టర్ పట్టుబట్టడంతో ఓ బీపీఎం సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఈ నెల 8న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోస్టల్ సూపరింటెండెంట్ పేరు కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో నమోదు కావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. బిల్లుల చెల్లింపుతో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వచ్చే ఉద్యోగులు ఉన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి ఆమోదం తెలిపారా? లేక తిరస్కరించారా అనేది బయటడటం లేదు. కొందరు అధికారులు మాత్రం బిల్లుల చెల్లింపు ప్రక్రియ చేపట్టినట్లు చెబుతున్నా అధికారికంగా ధ్రువీకరించేందుకు ఇష్టపడటం లేదు. ఇక్కడ విధులు నిర్వర్తించే పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న బదిలీ కావడంతో ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల కిందటే బాధ్యతలు తీసుకోవడంతో అదనపు విధుల బిల్లుల చెల్లింపు సమాచారం తీసుకోలేదు. పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతాం. – ఎన్.వెంకటేశ్వర్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్, వనపర్తి -
నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు
● పెరిగిన సామగ్రి ధరలతో సాగుతున్న నిర్మాణాలు ● కూలీలకూ డిమాండ్తో లబ్ధిదారుల బెంబేలు మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలతోపాటు కార్మికులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పెరగడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసినప్పటికీ ఆర్థిక కష్టాలతో ఇళ్లను నిర్మించుకోలేని వారు చాలా మంది ఉన్నారు. వీరికి మొదటి దశలో ఇళ్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించలేక మధ్యలోనే ఆపేశారు. మరికొందరు లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన వారు అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పెరిగిన ధరలు ఇలా.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఇసుక, సిమెంట్, స్టీల్ సెంట్రింగ్, కంకర, బైండింగ్ వైర్, బోర్వెల్ లాంటి సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి లబ్ధిదారుల ఎంపిక జరగడంతో ఈ సామగ్రికి డిమాండ్ పెరిగింది. దీంతో లబ్ధిదారుల ఇబ్బందులు పడుతూ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. 2025 సంవత్సరానికి ముందు సిమెంట్ ఒక బస్తాకు రూ.265 ఉండగా ప్రసుత్తం రూ.320కి చేరింది. అలాగే 2025 డిసెంబర్లో స్టీల్ ధర క్వింటా 10 ఎంఎం బార్లు 20కి రూ.2,300 ఉండగా.. ప్రస్తుతం రూ.3800కు చేరుకుంది. ఇసుక ట్రాక్టరు రూ.2 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.3,500కు ఇస్తున్నారు. ఇలా అనేక ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై మరింత భారం పెరిగింది. భవన నిర్మాణ కార్మికులకు.. ఇంటి నిర్మాణ సామగ్రితోపాటు భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు సైతం పెరిగాయి. గతంలో 400 గజాల స్లాబ్ను మేసీ్త్రలు రూ.1.65 లక్షలకు నిర్మించి ఇచ్చేవారు. అదే ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం రూ.2.65 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నిర్మిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇలా అనేక సామగ్రితోపాటు కూలీల ధరలకు రెక్కలు వచ్చాయని చెబుతున్నారు. గతంలో మేసీ్త్రకి కూలి రూ.800 ఉంటే ఇప్పుడు రూ.వెయ్యికిపైగా తీసు కుంటున్నారు. 10 వేల ఇటుకల లారీ లోడ్ రూ.71 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.92 వేలకు చేరుకుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఇంటి సామగ్రి ధరలు తగ్గించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
కౌన్సిలర్ భర్తపై మాజీ కౌన్సిలర్ దాడి
● ప్రజాపాలన కార్యక్రమంలో చెలరేగిన వివాదం ● బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు గద్వాల క్రైం: రెండు పార్టీల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఓ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్.. ప్రస్తు త మహిళ కౌన్సిలర్ భర్త చెంపను చెల్లుమన్పించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ ద్వాల మున్సిపాలిటీలోని 36వ వార్డులో శుక్రవారం ఉదయం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా పెన్షన్కు అర్హులైన లబ్ధిదారుల బయోమెట్రిక్ వివరాలు సేకరణ వార్డు అధికారి సమక్షంలో చేపట్టారు. అయితే ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిల్ సభ్యురాలు (బీఆర్ఎస్ పార్టీ) కమ్మరి సునీతతోపాటు భర్త రాము సైతం హాజరయ్యారు. ఈ క్రమంలో ఇదే వార్డుకు సంబంధించిన మాజీ కౌన్సిలర్ నర్సింహులు, అనుచర వర్గం కార్యక్రమ వివరాలు తెలిజేయకుండా ఏర్పాటు చేశారని ఆరోపించగా.. కౌన్సిలర్, ఆమె భర్త ప్రతి ఒక్కరికి తెలియజేశామని వివరించారు. దీంతో మాటమాట పెరగడంతో క్షణికావేశంలో మహిళా కౌన్సిలర్ భర్త రామును మాజీ కౌన్సిలర్ (బీజేపీ) నర్సింహులు ఒక్కసారిగా చెంప చెల్లుమన్పించాడు. దీంతో వాతవరణం గందరగోళంగా మారి.. ఇరువురు దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో స్థానికులు కట్టడి చేశారు. రెండు పార్టీల మధ్య వైరం.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వ్యక్తులు కావడంతో దాడి ఘటన ఉద్రిక్తతకు దారీ తీసింది. ఇరు కుటుంబాలకు ముందు నుంచి వైరం ఉండటంతో స్థానికంగా హాట్టాపిక్గా మారింది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో బాధితుడు రామును అప్పటి మహిళా కౌన్సిలర్ (రజక నర్సింహులు భార్య) సైతం దాడి చేయడం కొసమెరుపు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుత మహిళా కౌన్సిల్ సభ్యురాలు భర్త జీవించి ఉండగానే వితంతువు పెన్షన్ పొందుతుందని ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసుస్టేషన్లో కేసు సైతం కేసు నమోదైంది. పాత కక్షలు మనస్సులో పెట్టుకుని ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. దాడి ఘటనపై పట్టణ పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. -
డీసీసీబీలో యూపీఐ సేవలు
● ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సులభంగా లావాదేవీలు ● నగదు రహిత చెల్లింపులకు ముందడుగు మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) డిజిటల్ బ్యాంకింగ్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1920 సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంక్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22 బ్రాంచ్లతో సేవలందిస్తున్న డీసీసీబీ.. తాజాగా తన ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త సేవలతో ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్పే వంటి ప్రముఖ డిజిటల్ యాప్ల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకుని నగదు రహిత లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు. డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, చిన్న వ్యాపార లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడం వంటి సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. 3 లక్షలకుపైగా ఖాతాదారులు డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ బ్యాంక్ సేవలను వినియోగి స్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో వీరికి బ్యాంక్ శాఖలకు వెళ్లే అవకాశం తగ్గి.. ఇంటి వద్ద నుంచే వేగవంతమైన డిజిటల్ సేవలు పొందే అవకాశం ఏర్పడింది. 24 గంటల పాటు.. ఖాతాదారులు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని యూపీఐ యాప్లో నమోదు చేసుకుంటే సేవలు వెంటనే యాక్టివేట్ అవుతాయి. రోజులో 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీలు పూర్తవుతాయని పేర్కొన్నారు. చెల్లింపులపై అవగాహన.. సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో డీసీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రజల్లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి డీసీసీబీ రూ.2,500 కోట్ల టర్నోవర్ను అధిగమించడం బ్యాంక్ ప్రగతికి నిదర్శనంగా భావిస్తున్నారు. సహకార రంగంలో విశ్వసనీయ సేవలతోపాటు ఆధునిక సాంకేతిక సేవలను అందిస్తూ డీసీసీబీ ముందుకు సాగుతుండటంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మన బ్యాంక్తో స్మార్ట్ బ్యాంకింగ్ను ఆస్వాదించండి’ అనే నినాదంతో యూపీఐ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని బ్యాంక్ యాజమాన్యం ఖాతాదారులను కోరుతుంది. -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
● పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక ● జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కందనూలు: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ఇంటర్ విద్య ఎంతో కీలకం. దీంతో చాలామంది విద్యార్థు లు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ అభ్యసించడానికి పట్టణ, నగర ప్రాంతాలకు వెళ్తుంటా రు. అయితే కార్పొరేట్ విద్య నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది. ఈ నేపథ్యంలో సర్కా రు బడుల్లో పదో తరగతి చదివి ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదివేందుకు సహకారం కల్పిస్తోంది. కార్పొరేట్ విద్యా పథకం కింద ఎంపికై న ఒక్కో విద్యార్థికి రూ.35 వేలు, పాకెట్ మనీగా రూ.3వేలు చెల్లిస్తుంది. దీని కోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ పరిగణలోకి తీసుకొని 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ కళాశాలకు ఎంపిక చేయనుంది. దరఖాస్తు గడువు జూన్ 5వ తేది వరకు ఉంది. ఇవీ అర్హతలు.. జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్, కేజీబీవీలు, నవోదయ, మోడల్ స్కూల్స్, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు మించకూడదు. దరఖాస్తుకు మీసేవ కేంద్రాల నుంచి పొందిన కుల, ఆదాయ, ధ్రువపత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువపత్రాలను జతపరచాలి. పదో తరగతిలో 400కిపైగా మార్కులు సాధించిన వారిని ప్రవేశాలకు అధికారులు ఎంపిక చేస్తారు. అలాగే మీసేవ కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్లో telanganaepass.cgg.gov.in దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని కార్పొరేట్ విద్యా పథకం ద్వారా పేద విద్యార్థులకు అవకాశం కల్పించింది. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్ కళాశాలనైనా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఉమాపతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, నాగర్కర్నూల్ -
రైతుల పాలిట శాపంగా భారత్మాల జాతీయ రహదారి
● జిల్లాలో శరవేగంగా 6 వరుసల రోడ్డు పనులు ● పంట పొలాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆందోళనలు ● ఆరు మండలాల గుండా సుమారు 53 కి.మీ., నిర్మాణం ● 775 ఎకరాలు కోల్పోయిన రైతులు ప్రభుత్వం చేపట్టిన ఆరు వరుసల హైవే రోడ్డు నిర్మా ణం రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు పొలాలకు వెళ్లేందుకు ఎద్దు ల బండ్ల రస్తా మూసుకుపోయింది. దీంతో రైతులు తమ పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడెక్కడ పంట పొలాలకు దారులు ఉన్నాయో ఆయా ప్రదేశాల్లో హైలెవల్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసి, కింద పంట పొలాలకు దారి వదలాలి. – రాఘవేంద్రగౌడ్, అయిజ ఆరు వరుసల హైవే నిర్మా ణంలో రైతులు పంట పొలలకు ఏర్పాటు చేసుకున్న రోడ్లు మూసుకుపోతున్నా యి. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా హై లెవల్ బ్రిడ్జి నిర్మించి హైవే నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారులను కోరుతూ.. వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదు. – నాగిరెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షుడు, అయిజ భారత్మాల రోడ్డు నిర్మాణంలో రైతుల పంట పొ లాలకు వెళ్లే దారులు మూ సుకుపోయాయి. భారత్మాల హైవేలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన దారిలోనే రైతులు వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం రెండు, మూడు కి.మీ., ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో చాలామంది రైతులం దిక్కుతోచని స్థితిలో పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నాం. – యువతేజేశ్వర్రెడ్డి, గుడుదొడ్డి అయిజ: ‘చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగేసిన’ చందంగా తయారైంది.. భారత్మాల రోడ్డు పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆరు వరుసల హైవే రోడ్డు రైతుల పంట పొలాలకు ఏర్పాటు చేసుకున్న మట్టి దారులు, గ్రామాల మధ్య రాకపోకలు సాగించే చిన్నపాటి రోడ్లను మూసివేసింది. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న ఎద్దుల బండ్ల రస్తాలు (బాటలు) సైతం రోడ్డు నిర్మాణంలో మూసుకుపోయాయి. మరోవైపు రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే హైవే రోడ్డు నిర్మాణం పనులను రైతులు అనేకసార్లు అడ్డుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్లోనూ వినతిపత్రాలు అందజేసినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు ఆరు మండలాల మీదుగా.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆరు మండలాల్లో భారత్మాల రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయిజ, మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, వడ్డేపల్లి, రాజోళి మండలాల మీదుగా 53 కి.మీ., దూరం హైవే రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వం నుంచి 35 ఎకరాల భూమి, రైతుల నుంచి 775 ఎకరాల పంట పొలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్మాల రోడ్డు నిర్మాణానికి గతంలోనే డిజైన్ చేశారు. రోడ్డు నిర్మాణం వలన వ్యవసాయ భూముల రోడ్లు మూసుకుపోయాయని గతంలో రైతులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తే.. రైతులు ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పీడీఎన్హెచ్ఐకు లేఖ రాశారు. ఇటీవల గట్టు మండలంలోని పాత ఆలూరు రోడ్డు సమస్య నా దృష్టికి వచ్చింది. రైతుల సమస్యలను కలెక్టర్కు తెలియజేస్తాను. – శ్రీనివాసరావు, ఆర్డీఓ -
మక్తల్ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా
మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో అసంపూర్తి భవనాలను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 19 బీటీరోడ్లను 65 కి.మీ. మేర నిర్మించేందుకు రూ. 68కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కొల్పూర్ – కుర్తికొండ వద్ద జూరాల ప్రాజెక్టు తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. హిందూపూర్ వద్ద ఽథర్మల్ పవర్ స్టేషన్కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మక్తల్లో డిగ్రీ కళాశాల, రిజిస్ట్రర్ కార్యాలయం, కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్తల్ మండలంలోని గొల్లపల్లి –మంతన్గోడ్ బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 1.50కోట్లు, చిట్యాల – గుర్రందొడ్డి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 20కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్లో నిర్మిసు న్న 150 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, టౌల్ హాల్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజీవ్గాంధీ ఆశయసాధనకు కృషి.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్బంగా మక్తల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత శక్తిపై అపారమైన విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ.. 18 ఏళ్ల వయసు నుంచే ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో యువశక్తి ప్రాధాన్యం పెంచారన్నారు. రాజీవ్గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రబుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో యువత అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, నాయకులు వాకిటి హన్మంతు, కట్ట సురేశ్, ఫయాజ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, కావాలి తయాప్ప, రవికుమార్, మందుల నరేందర్, ఆనంద్గౌడ్, నర్సింహులు, గణేశ్, ఓబులేషు, వెంకటేశ్, లక్ష్మణ్, శ్యామ్, రవి పాల్గొన్నారు. -
ప్రమాద ఘడియలు
● జిల్లా ఆస్పత్రిలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు ● వైద్యులు, రోగులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక వార్త సంచలనంగా మారుతుంది. ఫ్రీజర్లు పనిచేయడం లేదనే సాకుతో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆరుబయటే వేయడంపై రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఈ ఘటన మరవక ముందే మరో ప్రమాదకర సంఘటన చోటుచేసుకోవడం, దీనిని కూడా అధికారులు గోప్యంగా ఉంచడం విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం రోగులకు ఓపీ సేవలు అందించేందుకు 9వ నంబర్ విభాగంలో సర్జికల్ వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ప్రమాద సమయం భోజన విరామం కావడంతో వైద్యులు, రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పై కప్పు పెచ్చులు వైద్యులు కూర్చునే కుర్చీలు, టేబుల్పై పడటంతో ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే భారీ శబ్దం రావడంతో సమీపంలో ఉన్న సిబ్బంది, ఓపీ సేవల కోసం వచ్చిన రోగులు బయటకు పరుగులు తీశారు. అయితే పై కప్పు పెచ్చులు ఊడిపడిన విషయాన్ని వైద్య సిబ్బంది గోప్యంగా ఉంచడం గమనార్హం. – ఈ విషయమై ఆర్ఎం హేమలతను ‘సాక్షి’ సంప్రదించగా నాలుగు రోజుల క్రితం పై కప్పు పెచ్చులు ఊడిపడిన విషయం వాస్తవమేనన్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదన్నారు. త్వరలో మరమ్మతు చేపడుతామని వివరించారు. మరోవైపు జిల్లా ఆస్పత్రి నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా చేపట్టినట్లు కొంత మంది సిబ్బంది ఆరోపించారు. జిల్లా ఆస్పత్రిలో వరుస సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో సిబ్బంది, రోగులు భయాందోళన చెందుతున్నారు. -
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
వనపర్తి/వనపర్తి రూరల్: క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో క్రికెట్ టోర్నీ నిర్వహించగా.. పోలీసు, రెవెన్యూ, ప్రెస్ మీడియా, ఉపాధ్యాయ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పోలీసు జట్టు విజేతగా నిలవగా.. ఉపాధ్యాయుల జట్టు రన్నరప్గా నిలిచింది. రెవెన్యూ జట్టు తరఫున కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వయంగా ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అదనపు ఎస్పీ రాజేశ్ మీనా పోలీసు జట్టుకు నాయకత్వం వహించి అర్ధశతకం సాధించారు. టోర్నీ విజేత, రన్నరప్ జట్లకు చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి చేతులమీదుగా ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. శారీరక దారుఢ్యం క్రీడలతోనే సాధ్యమని.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● పెబ్బేరు పట్టణంలోని ఖేలో ఇండియా ఫుట్బాల్ మైదానంలో కలెక్టర్ ప్రత్యేక నిధులు రూ. 10లక్షలతో ఏర్పాటుచేసిన నూతన ఫ్లడ్లైట్లను ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రారంభించారు. ఇదే మైదానంలో ఎమ్మెల్యే నిధులు రూ. 10లక్షలతో నిర్మించనున్న డ్రెసింగ్ రూమ్, జిమ్, టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఫుట్బాల్ పోటీలను వారు ప్రారంభించగా.. వనపర్తి, గోపాల్పేట, పెబ్బేరు, ఆత్మకూర్ జట్లు ఫుట్బాల్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. కార్యక్రమంలో పెబ్బేరు ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, కౌన్సిలర్ శివసాయి తదితరులు పాల్గొన్నారు. -
పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాలి
జడ్చర్ల: శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిల్లలమర్రి మ్యూజియం సహాయ సంచాలకులు నాగలక్ష్మి పేర్కొన్నారు. ఆల్వాన్పల్లి గ్రామశివారులో గొల్లత్తగుడి ఆవరణలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గొల్లత్తగుడి వైభవాన్ని ఈ సందర్భంగా అక్కడి వారికి వివరించారు. క్రీ.శ. 7–8వ శతాబ్దానికి సంబంధించి జైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిందన్నారు. జైన దేవాలయ అవశేషాలు, ఇటుకలతో నిర్మాణశైలి, తవ్వకాలలో లభించిన జైన శిల్పాలు చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. వారసత్వ సంపద పరిరక్షణ, పురాతన కట్టడాలను పరిరక్షించకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో వారసత్వ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడం ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలోసర్పంచ్ దాసుయాదవ్ పాల్గొన్నారు. -
కూలీలకు ఇబ్బందులు లేకుండా ‘ఉపాధి’
ఎర్రవల్లి: పని కావాలని అడిగే ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని డీఆర్డీఓ ముసాయిదాబేగం అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండలం కొండేరులో ఉపాధిహామీ పనులను ఆమె పరిశీలించి.. పనుల నాణ్యత, మాస్టర్ రోల్స్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం డీఆర్డీఓ మా ట్లాడుతూ.. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు ఉదయాన్నే పనులకు వచ్చి మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తగి నంత నీరు తాగడం, అలసట అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రతి కూలీ సరైన కొలతల ప్రకారం పని చేస్తేనే ప్రభుత్వం ప్రకటించిన కూలి వస్తుందన్నారు. వేసవి దృష్ట్యా కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీటితో పాటు అవసరమైన అన్ని వసతులను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఉపాధిహామీ పనుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ మహేశ్, టెక్నికల్ అసిస్టెంట్ లావణ్య, పంచాయతీ కార్యదర్శి రాజు, ఎఫ్ఏ షాలన్న ఉన్నారు. -
భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచండి
గద్వాల: జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇందుకు సాగునీటిపారుదల, రెవెన్యూ, భూసేకరణశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియ లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ.. నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు మొదలై 20ఏళ్లు అవుతున్నా ఇంకా పనులు పెండింగ్లోనే ఉన్నాయన్నారు. కొన్ని ప్యాకేజీల్లో భూసేకరణ పెండింగ్లో ఉందన్నారు. 99వ ప్యాకేజీ పనులు త్వరగా పూర్తిచేసి.. పూర్తి ఆయకట్టుకు సాగునీటిని అందించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్ఈ రహీముద్దీన్ ఉన్నారు. ● ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఉపాధిహామి పథకం, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎన్ఎఫ్బీఎస్ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధిహామీ కూలీలు ఉదయాన్నే తమకు నిర్ధేశించిన పని ప్రదేశాలకు వెళ్లి పనిచేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగు దొడ్లు, మహిళా సంఘాల భవన నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా జల్ సంచాయి జన్ భగీరథి పురస్కారా లు జిల్లాకు దక్కేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రామీణ అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిధ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి.. రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఆర్డీవో ముషాయిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్, పీఆర్ ఈఈ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
కేటీదొడ్డి: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే జిల్లా, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కుచినెర్లలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన భవనాన్ని మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయు డు, సర్పంచులు కృష్ణ, నారాయణ, నాయకులు వెంకటేశ్ నాయుడు, ఉరుకుందు, నర్సింహులు, హరిప్రసాద్, యుగంధర్ పాల్గొన్నారు. -
ఆధిపత్యం కోసమే అమెరికా యుద్ధతంత్రం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసమే అమెరికా యుద్ధతంత్రం రచిస్తోందని ఆప్సో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.అరుణ్కుమార్ విమర్శించారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రోగ్రెసివ్ థింకర్స్ ఫోరం ఆధ్వర్యంలో ‘అమెరికా సామ్రాజ్య యుద్ధోన్మాదం.. పర్యవసానాలు’పై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నిన్న వెనుజుల, నేడు ఇరాన్, రేపు క్యూబా.. ఇలా తన వాణిజ్యానికి సహకరించని దేశాలపై అమెరికా దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. యుద్ధాలపై ఖర్చులను తగ్గించి అమెరికా అభివృద్ధికి పాటుపడతానని శాంతిమంత్రం పఠించి అధికారం చేజిక్కించుకున్న ట్రంప్.. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్లో క్యూబాను హస్తగతం చేసుకుంటాననే అమెరికా ప్రకటనను అందరూ ముక్తకంఠంతో నిరసించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ థింకర్స్ ఫోరం అధ్యక్షుడు విక్రమ్ జనార్దన్, కార్యదర్శి డా.మధుసూదన్రెడ్డి, కన్వీనర్ డా. రాంమోహన్రావు, ఆప్సో జిల్లా ప్రతినిధులు ఒబేదుల్లా కొత్వాల్, లక్ష్మణ్గౌడ్, జగపతిరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు కిష్టయ్య, సురేష్, రవీందర్గౌడ్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు కోసం జిల్లాలోని బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సృజనాత్మక ఆవిష్కరణలు, సామాజిక సేవ, పాండిత్యం, కవితలు, కథలు, క్రీడలు, కళలు, సాంస్కృతిక కళలు వంటి వాటిలో ప్రావీణ్యం కలిగి.. 5 నుంచి 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన వారు జూలై 31వ తేదిలోగా http://award.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. -
పీఆర్సీని సత్వరం అమలు చేయాలి
గద్వాలన్యూటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే అమలుచేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ, డీఏలు ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం.. ఇంతవరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పీఆర్సీ సమయం 2023 జూలై 1తో ముగిసి మూడేళ్లు అవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఆరోపించారు. జనగణన చేపడుతున్న ఎన్యూమరేటర్లు ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారని.. ఒక్కో ఎన్యూమరేటర్కు 150 ఇళ్లు మాత్రమే కేటాయించాలని కోరారు. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను క్లియర్ చేయాలన్నారు. జీపీఎఫ్ పార్టు ఫైనల్స్, సరెండర్ లీవ్స్, సీపీఎఫ్ ఉద్యోగుల ఏరియర్స్, టీఎస్ జీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ తదితర బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ శాస్త్రి, హరిబాబు, హనుమంతు పాల్గొన్నారు. -
అన్నదాత.. గుండెకోత
జోగుళాంబ గద్వాల తాలు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ వయోపరిమితి పెంపు లాభమే ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయో పరిమితిని పదేళ్లు పెంచడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎండా కాలం సా గుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతురన్నాయి. సీజన్ ముగిసే దశకు చేరుకున్నా.. నిర్దేశిత లక్ష్యంలో కనీసం 30 శాతం చేరుకోలేదు. హమాలీలు, లారీల కొరతతోపాటు మిల్లుల్లో స్థలాభావం వంటి కారణాలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది చాలదన్నట్లు రోజుల తరబడి నిరీక్షణతో కష్టనష్టాలకు ఓర్చి సర్కారు సెంటర్లలోనే అమ్ముకుందామనుకున్న రైతులకూ భంగపాటు తప్పడం లేదు. మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు తాలు పేరిట నిలువు దోపిడీకి తెగబడడంతో వారు గుండెలు బాదుకుంటున్నారు. పాలక పక్షంలో కొరవడిన చిత్తశుద్ధి, అధికారుల తూతూమంత్రపు పర్యవేక్షణతోనే ఈ దుస్థితి నెలకొనగా.. అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కేవలం 2,89 లక్షల మెట్రిక్ టన్నులే.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇందులో 900 వరకు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే 19వ తేదీ వరకు ఆయా ప్రభుత్వ కేంద్రాలకు సుమారు 3,42,939 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 2,89,135 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 66,082 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సరిపోను హమాలీలు లేకపోవడం, లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 33,416 మెట్రిక్ టన్నులను ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉండగా.. బస్తాల వద్ద రైతులు రోజుల తరబడి కాపలా కాస్తున్నారు. లారీకి 30 బస్తాల చొప్పున హాంఫట్.. ప్రభుత్వ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం తాలు, బస్తా బరువు పేరిట కిలోన్నర వరకు తరుగు తీస్తున్నారు. కొన్ని చోట్ల రెండు కిలోల చొప్పున కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 41.150 కిలోగ్రాముల చొప్పున బస్తా ధాన్యం తూకం వేసి.. రైతులకు రసీదు ఇస్తున్నారు. ఆ తర్వాత వాటిని లారీలు తదితర వాహనాల్లో కేటాయించిన మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లదే హవా నడుస్తుండగా.. రైతుల నడ్డి విరుస్తున్నారు. సెంటర్లలో తూకం వేసినప్పటికీ.. తూకం తక్కువగా వచ్చిందంటూ బస్తాకు అదనంగా కిలోన్నర నుంచి రెండు కిలోల కోత పెడుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. లారీకి సుమారు 30 బస్తాల చొప్పున (దాదాపు రూ.29 వేలు) కోత పెడుతూ అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మిల్లులన్నింటిలోనూ ఈ తరహా దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుమ్మక్కుతో దందా.. సెంటర్లలో తూకం వేసిన రసీదు ఉంది.. నేరుగా మిల్లులకు వచ్చిన తర్వాత తూకం ఎలా తక్కువ వస్తుందని ప్రశ్నిస్తే తేమ ఎక్కువగా ఉంది.. ఒప్పుకోకుంటే తీసుకెళ్లండి అంటూ మిల్లుల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా రైతులకు సమాచారం ఇవ్వకుండానే మిల్లర్లు బస్తాల సంఖ్యను కుదించి.. ఆ మేరకు బిల్లులు చేస్తున్నట్లు సమాచారం. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క దందా నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర వస్తుందనే ఆశతో రోజుల తరబడి పడిగాపులు కాచినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. చివరకు నష్టపోక తప్పడం లేదని ‘సాక్షి’ బృందం పరిశీలన సందర్భంగా పలువురు రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. క్వింటాల్కు 3 నుంచి 5 కిలోల వరకు మాయాజాలం రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండానే వ్యవహారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందితో కుమ్మక్కు లారీ డ్రైవర్ల పేరు చెబుతూ పొంతనలేని సమాధానాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా నత్తనడకనే క్రయవిక్రయాలు తూతూమంత్రపు పరిశీలనలకే అధికారుల పరిమితం జిల్లాల వారీగా ధాన్యం కొనుగోళ్ల వివరాలు (మె.టన్నుల్లో).. రాత్రింబవళ్లు కష్టపడితే 514 క్వింటాళ్ల ధాన్యం పండింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్లో కొను గోలు చేసిన తర్వాత ధా న్యాన్ని గాయత్రి మిల్లుకు తీసుకెళ్లాం. అక్కడ మిల్లు నిర్వాహకులు తాలు పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. క్వింటాల్కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తేనే అన్లోడ్ చేస్తామని మొండికేశారు. నిబంధనల ప్రకారం క్వింటాల్కు కిలో కంటే ఎక్కువ తరుగు తీయొద్దు. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. వాహన అద్దె భారం మోయలేక.. చేసేదేమీ లేక వారి దోపిడీకి తలవంచాల్సి వచ్చింది. దాదాపు 25 క్వింటాళ్ల పైగా ధాన్యాన్ని ఉచితంగా మిల్లర్ల పాలైంది. మా ఆవేదన ప్రభుత్వానికి వినబడడం లేదు. – రాజు, అజ్జకొల్లు, మదనాపురం, వనపర్తి నేను ఎకరా పొలంలో వరిసాగు చేయగా.. 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. 5 రోజుల క్రితం ధాన్యం బస్తాలను మల్దకల్లోని కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా.. నేటికీ కొనుగోలు చేయలేదు. నాతో పాటు మరో 20 మంది రైతుల ధాన్యం ఇక్కడే నిల్వ ఉంది. ధాన్యం కొనాలని రైతులు అడిగితే తేమశాతం ఎక్కువగా ఉందని.. హమాలీలు లేరని కాలయాపన చేస్తున్నారు. ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వర్షం వస్తే మా పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. – రంగన్న, రైతు, ఎల్కూరు, మల్దకల్ మండలం ఈ ఫొటోలో ఉంది పెద్ద దర్పల్లిలోని సప్తగిరి పారా బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు ఇచ్చిన ట్రక్ షీట్. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం వింజమూరు ప్రభుత్వ సెంటర్లో భీమయ్యయాదవ్తో పాటు మరో ఏడుగురు రైతుల నుంచి 856 బస్తాల (342 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్ మిల్లుకు తరలించారు. అక్కడ తూకం తక్కువగా వచ్చిందంటూ మిల్లర్లు 825 బస్తాలకే లెక్కగట్టారు. ఆ తర్వాత మరో మూడు బస్తాలు కలిపి 331 క్వింటాళ్లకు డబ్బులు చెల్లిస్తామని ఫైనల్ చేశారు. అంటే 31 బస్తాలు (11 క్వింటాళ్లు) తక్కువ చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు రైతులు మిల్లు నిర్వాహకులను నిలదీశారు. తమకు చెప్పకుండానే ఎలా చేస్తారని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వాహకులకు చెప్పామని మిల్లరు తెలపగా.. అక్కడికి వెళ్లారు. వారు లారీ డ్రైవర్కు చెప్పామని చేతులు దులుపుకోవడంతో మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరో లారీకి సంబంధించి మోసపూరితంగా ఇలానే 30 బస్తాల కోత పెట్టారని.. సెంటర్లలో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయాలనే స్పృహ అధికారుల్లో కొరవడిందని రైతు భీమయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
గద్వాల: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధా న్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసిన ట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. బుధ వారం గద్వాల మండలం చెనుగోనిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల్లో నింపిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రతి కేంద్రానికి నిర్ధిష్టంగా సమీపంలోని మిల్లులను కేటాయించి.. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో తరలించాలని అధికారులకు సూచించారు. కేంద్రాల వారీగా అవసరం మేరకు గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, మిల్లులకు రవాణా, ఫోన్నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రోజువారీగా కేంద్రంలో ధాన్యం నిల్వలు, తేమశాతం వచ్చిన పరిణామం, పంపిన లోడ్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారిక వాట్సప్ గ్రూప్ల ద్వారా తెలియజేసి సంబంధిత ఉన్నతాధికారుతో తక్షణ పరిష్కారం పొందాలని కేంద్రాల ఇన్చార్జీలు, అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు తడవకుండా టార్ఫాలిన్లతో భద్రపర్చాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ డీఎస్ఓ స్వామికుమార్, ఏఈఓ ఉషశ్రీ తదితరులు ఉన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
గద్వాలన్యూటౌన్: నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్ సూచించారు. గద్వాల మున్సిపాలీటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఎస్సీ కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మద్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీ టూ వీలర్ (గూడ్స్), ఈవీ త్రీ వీలర్ (ప్యాసింజర్), గేదెలు తదితర యూనిట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను వివిధ బ్యాంకుల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. యూనిట్ల ద్వారా వారు నిర్వహించుకునే వ్యాపారాలు, వచ్చే ఆదాయం తదితర వివరాలను తెలుసుకున్నారు. మొత్తం 96 దరఖాస్తులు చేసుకోగా.. 62 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది వెంకటేశ్వర్లు, తిమ్మన్న, నిజాముద్దీన్, మహాలక్ష్మి పాల్గొన్నారు. -
ఆముదాలు క్వింటా రూ.6,111
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు 6 క్వింటాళ్ల ఆముదా లు అమ్మకానికి రాగా..గరిష్టంగా రూ. 6,111, కనిష్టంగా రూ. 5,826, సరాసరి రూ. 5,826 ధరలు వచ్చాయి. అదే విధంగా 3 క్వింటాళ్ల వేరుశనగ రాగా..రూ. 6,869 ధర పలికింది. 295 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా..గరిష్టంగా రూ.2,389, కనిష్టంగా రూ. 1.890, సరాసరి రూ. 2,100 ధరలు లభించాయి. పడిపోయిన ఉల్లి ధర దేవరకద్ర: ఉల్లి ధరలు పడిపోయాయి. బుధవారం దేవరకద్ర మార్కెట్కు దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా అందులో సగం మంది రైతులు నేరుగా విక్రయించారు. మిగతా ఉల్లిని వేలం ద్వారా వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో క్వింటా గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.800 వరకు పలికింది. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.400 వరకు విక్రయించారు. బయట వ్యాపారులు రూ.650 నుంచి రూ.700 వరకు అమ్మకాలు సాగించారు. -
నేడు ఇంటర్వ్యూ
గద్వాలన్యూటౌన్: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పుర కమిషనర్ జానకీరాం సాగర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈవీ టూ వీలర్ (గూడ్స్), ఈవీ త్రీ వీలర్ (ప్యాసింజర్), గేదెలు తదితర యూనిట్ల కో సం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సంయుక్త క్యాంపు (ఇంటర్వ్యూ) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంకు, టీజీబీ, ఎస్బీఐ, కెనరా, యూబీఐ, డీసీసీబీ, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కమిషనర్ సూచించారు. వేరుశనగ క్వింటా రూ.7,371 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 35 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,371, కనిష్టంగా రూ. 6,769, సరాసరి రూ. 6,869 ధరలు లభించాయి. 9 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,109, కనిష్టంగా రూ. 6,011, సరాసరి రూ. 6,049 ధరలు పలికాయి. 372 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,436, కనిష్టంగా రూ. 1,870, సరాసరి రూ. 2,289 ధరలు లభించాయి. జాతీయ అథ్లెటిక్స్ రెఫరీగా హైదర్ పాషా ఎర్రవల్లి: బీచుపల్లి పదవ పటాలంలోని సాయిధ చైతన్య పాఠశాలలో వ్యా యామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సయ్యద్ హైద ర్ పాషా జాతీయ అథ్లెటిక్స్ రెఫరీ, రేస్వాక్ జడ్జి గా ఎంపికయ్యారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో జరిగే 29వ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ క్రీడలకు రిఫరీ, రేస్వాక్ జడ్జిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ సభ్యు లు, వ్యాయామ ఉపాద్యాయులు, సాయుధ చైతన్య పాఠశాల ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
ఉత్సాహంగా క్రికెట్ ప్రాబబుల్స్ ఎంపికలు
గద్వాలన్యూటౌన్: జిల్లాకేంద్రంలోని స్టేడియంలో గద్వాల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్రికెట్ కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఔత్సాహిక క్రీడాకారుల వయసు, ప్రతిభ ఆధారంగా మంగళవారం పలు విభాగాల్లో ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. అండర్–12, 14, 16 కేటగిరీల నుంచి ఒక్కొక్క వి భాగంలో 25 మందిని ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు శరత్కుమార్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు విడివిడిగా మ్యాచ్లు నిర్వహించి.. ఒక్కొక్క విభాగం నుంచి 18 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వీరిలో అత్యుత్తమ క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రతి కీడాకారుడికి మెళకువలు నేర్పించి.. ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, కోచ్లు రిషి, ఖయ్యూం, సీనియర్ క్రీడాకారులు ఖలీం, రామకృష్ణ, హరినాథ్రెడ్డి పాల్గొన్నారు. -
నిప్పుల కుంపటి
● ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ ● వారం రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు ● కనీసం 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు ● బయటకు వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరులో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో 42.7, గద్వాల జిల్లాకేంద్రంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పుల ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింత వేడిని రగిల్చనుంది. కనీసం వారం రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు సూచించింది. ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదైన టాప్ 10 గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఐదు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గద్వాల, అయిజ, ధరూరు, కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, చారకొండ, లింగాల, తెలకపల్లి మండలాలు, మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండలో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా శిశువులు, చిన్నారులు, వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో వేడిగాలుల వల్ల వెంటనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అన్ని వయస్సుల వారికి ఎండదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం ప్రధానంగా దినసరి కూలీలు, రైతులు, వీధివ్యాపారులు, ఆరుబయట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీ రు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి తీసు కోవాలని చెబుతున్నారు. అలాగే రక్షణ కోసం గొడుగు, టోపీ ధరించాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. ఎండలో తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ వినియోగించాలి. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలి. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ -
సజావుగా మొక్కజొన్న కొనుగోళ్లు
● జిల్లాలో ఇప్పటివరకు 70శాతం ధాన్యం సేకరణ ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తూ.. కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 70శాతం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన మక్కల సేకరణను రానున్న మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశంలో ఉంచిన మొక్కజొన్నను ముందుగా తూకం వేయాలని సిబ్బందికి సూచించారు. లారీల కొరతను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ గోదాములు సరిపోనందున ప్రైవేటు గోదాముల్లోనూ మొక్కజొన్న ధాన్యం నిల్వ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, మార్కెఫెడ్ డీఎం చంద్రమౌళి, డీఏఓ వీరప్ప, డీపీఓ శ్రీకాంత్, సివిల్ సప్లయ్ మేనేజర్ విమల ఉన్నారు. యువత నైపుణ్యాలను పెంచుకోవాలి.. యువత అన్ని రంగాల్లో రాణించేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏటీసీలో విద్యార్థులకు కెరీర్, స్కిల్ డెవ్లప్మెంట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏటీసీలో అత్యాధునిక పరికరాలతో వివిధ కోర్సుల్లో అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఇన్నోవేటివ్గా ఆలోచించేందుకు సహకరిస్తాయన్నారు. యువత పీఎం ఈజీపీ, ముద్ర, విశ్వకర్మ వంటి అనేక పథకాలను వినియోగించుకొని బ్యాంకుల ద్వారా రుణాలను పొందవచ్చన్నారు. యువత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటే స్టేజ్ ఫియర్ ఉండదన్నారు. ఇంటర్వ్యూలలోనూ ధైర్యంగా మాట్లాడవచ్చన్నారు. సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు రావాలని ఖాళీగా ఉండకుండా.. ఎక్కడికెళ్లినా ఆయా రంగాల్లో రాణించేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు. క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధితో తమ కెరీర్ను గొప్పగా మలచుకోవాలన్నారు. అనంతరం అలంపూర్లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన బోచర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అదే విధంగా ఏటీసీలోని యంత్ర పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీవైఎస్ఓ రామలింగేశ్వర్గౌడ్, పర్యాటకశాఖ ఏడీ నాగలక్ష్మి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి చరణ్దీప్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించండి
గద్వాల:స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ కోరారు. మంగళవారం ఐడీఓసీలోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్ల ధ్రువీకరణ వివరాల సవరణ, పోర్టల్లో అప్లోడ్ ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమయపాలనతో చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి.. బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులను అదనపు కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం బూత్ లెవెల్ ఏజెంట్ల నియామక ఫార్మట్లు పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. సమావేశంలో తహసీల్దార్ హరికృష్ణ, ఎన్నికల సూపరింటెండెంట్ మంజుల ఉన్నారు. -
సాగునీరు పారేలా!
అమరచింత: ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కాల్వల్లో నీటిసరఫరా నిలిచిపోవడంతో రోజు ఉపాధి కూలీలతో పూడికతీతతో పాటు ముళ్లపొదల తొలగింపు పనులు కొనసాగుతోంది. యాసంగిలో ప్రధాన ఎడమకాల్వ ద్వారా కేవలం రామన్పాడు రిజర్వాయర్ వరకు 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించడంతో మిగిలిన ఆయకట్టు కాల్వలు నీటి ప్రవా హం లేక ఎండుముఖం పట్టాయి. ఈసారి వేసవిలో కాల్వల మరమ్మతులకు ప్రతిపాదనలు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన పీజేపీ అధికారులు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ఆయా మండలాల్లోని నీటిపారుదలశాఖ ఏఈలు ఎంపీడీఓలను సంప్రదించి కాల్వల్లో ఉపాధి పనులు చేపట్టాలని కోరడంతో సమీప గ్రామాల కూలీలతో పనులు చేపడుతున్నారు. వచ్చే వర్షాకాలంలో సాగునీరు సాఫీగా ముందుకు పారే విధంగా ప్రధాన, పిల్ల కాల్వల్లో సైతం పూడిక తొలగించి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారు. 85వేల ఎకరాల ఆయకట్టు.. జూరాల ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు విస్తరించి ఉంది. మొత్తం 85 వేల ఎకరాల ఆయ కట్టుకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గో పాల్దిన్నె రిజర్వాయర్కు సైతం ఇదే కాల్వ ద్వారా నీరు సరఫరా అవుతుండటంతో అత్యధికంగా జిల్లా ప్రజలకే లబ్ధి చేకూరుతుంది. ఎనిమిదేళ్లుగా కేవలం వానాకాలంలోనే ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందిస్తున్న అధికారులు, యాసంగిలో మాత్రం వారబందీ విధానంలో ఆయకట్టు కుదించి నీటిని వదులుతున్నారు. ప్రతిసారి వేసవిలో మరమ్మతుల కారణంగా కాల్వలో పూడికతీత పనులు ముందుకు సాగకపోయేవి. ప్రస్తుత వేసవిలో కాల్వ మరమ్మతు లేకపోవడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. జూరాల ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత నీటిపారుదలశాఖ సిఫార్సులతో ఉపాధిహామీ పథకంలో.. ఎంపీడీఓల పర్యవేక్షణలో ఊపందుకున్న పనులు వేసవిలో మరమ్మతులు లేకపోవడంతోనే.. -
మృతదేహం.. భద్రపర్చలేం!
జిల్లా ఆస్పత్రి మార్చురీలో పనిచేయని బాడీ ఫ్రీజర్లు ● వారం రోజులుగా గాలికొదిలేసిన వైనం ● గుర్తుతెలియని మృతదేహం వస్తే తప్పని సమస్య ● తాజాగా 3 గంటలపాటు ఆరుబయటే ఓ వృద్ధుడి మృతదేహం ● జిల్లాలో హాట్టాఫిక్గా మారిన ఘటన గద్వాల క్రైం: గుర్తుతెలియని మృతదేహాల వివరాలను సేకరించేందుకు పోలీసులకు కొంత సమయం పడుతోంది. అప్పటిలోగా మృతదేహాన్ని భద్రపరిచేందుకు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీనే దిక్కు. అలాంటి మార్చురీలో బాడీ ఫ్రీజర్లు వారం రోజులుగా పనిచేయకపోవడం.. గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు తీసుకొస్తే వైద్యసిబ్బంది గంటల తరబడి ఆరుబయటే ఉంచడం జిల్లాలో హాట్టాఫిక్గా మారింది. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీ శివారులో ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచేందుకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడే పోలీసులకు విచిత్రమైన ఇక్కట్లు ఎదురయ్యాయి. మార్చురీలో బాడీ ఫ్రీజర్లు మరమ్మతుకు గురయ్యాయని.. మృతదేహాన్ని భద్రపర్చలేమని పోలీసులతో వైద్యులు చెప్పడం గందరగోళం సృష్టించింది. ఈ క్రమంలోనే 3 గంటల సమయం ముగిసింది. బాడీ దుర్వాసన రావడం మొదలుకావడం.. మీడియా రంగప్రవేశం చేయడంతో ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ ఝాన్సీలక్ష్మి దిద్దుబాటు చర్యలు చేపట్టడం విస్మయానికి గురిచేస్తోంది. మీరే భద్రపర్చుకోవాలంటూ.. జిల్లా ఆస్పత్రి మార్చురీలో వారం రోజులుగా బాడీ ఫ్రీజర్స్ పనిచేయడం లేదని అధికారులకు తెలిసినప్పటికీ.. మరమ్మతు చేయించడాన్ని పట్టించుకోలేదని తాజా ఘటనతో స్పష్టమవుతోంది. అనుకోని ప్రమాదాల ధాటికి ఎవరైనా మరణిస్తే పోలీసులు మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచి.. పూర్తి వివరాల సేకరణ, కేసు నమోదు, పోస్టుమార్టం తర్వాతే కుటుంబీకులకు అప్పగిస్తారు. అయితే తాజా ఘటనలో పోలీసులతో వైద్యసిబ్బంది వ్యవహరించిన తీరు అవమానీయంగా మారింది. మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చాలని వైద్యులను పోలీసులు కోరితే.. ‘‘మార్చురీలో భద్రపర్చలేం.. బాడీ ఫ్రీజర్స్ మరమ్మతుకు గురయ్యాయి.. మీరే మృతదేహాన్ని భద్రపర్చండి.. మా చేతుల్లో ఏం లేదు’’ అని సమాధానం రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మరోవైపు ఇన్చార్జి సూపరింటెండెంట్ అనుమతి వస్తే తప్ప.. మార్చురీలోకి అనుమతి లేదని నిర్లక్ష్యధోరణితో సమాధానం చెప్పడం గమనార్హం. జిల్లా ఆస్పత్రి నిర్వహణను అధికారులు గాలికొదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు మార్చురీ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. రోగులకు మెరుగైన సేవలు అందించడంలో సిబ్బంది అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై ఇటీవల కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా సైతం చురకలు అంటించారు. అయినప్పటికీ సిబ్బందిలో మార్పు రావడం లేదు. కొందరు సమయపాలన పాటించకపోవడంతో పాటు ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఆస్పత్రికి మెడికల్ కళాశాల అనుబంధంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న ప్రమాదానికి గురై ఆస్పత్రికి వస్తే రెఫర్ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికై నా జిల్లా ఆస్పత్రి నిర్వహణపై పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. -
శాఖాపరమైన చర్యలు..
మార్చురీలో మృతదేహాల ను భద్రపరచేందుకు బా డీ ఫ్రీజర్స్ తప్పనిసరిగా ఉంటుంది. సోమవారం జరిగిన సంఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాం. మరమ్మత్తులు ఉంటే నిర్వహణ అధికారులు సబంధిత టెక్నీషియన్స్తో మరమ్మత్తులు చేయించాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించినట్లు తెలితే శాఖ పరమైన చర్యలు ఉంటాయి. పలువురిపై ఇప్పటికే నిఘా ఉంచాం. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు గురి కాకుండా తగు చర్యలు తీసుకుంటాం. త్వరలో నివేధికాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్ ● -
దొంగ దొరికేశాడు..
● మక్తల్, మరికల్లో 10 చోట్ల చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ ● ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడి.. నారాయణపేట: మక్తల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఓ దొంగ అదే ఊరిలో అందరితో కలిసి మెలిసి తిరుగుతూ ఉండేవాడని తెలిసి స్థానికులు షాక్కు గురయ్యారు. కర్రెం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ తిప్పి, సూర్య సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ ఉదయం వేళ పట్టణంలో తిరుగుతూ రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతుండేవాడు. ఒకే తరహాలో వరుస చోరీలు జరగడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినా నిందితుడిని గుర్తించలేకపోయాయి. పట్టణంలోని రెండు, మరికల్లో ఒక బంగారు దుకాణం, మక్తల్లో మూడు మద్యం దుకాణాలు, ఓ ఇల్లు, ద్విచక్ర వాహనాల షోరూం, మొబైల్, కిరాణ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ జరిగిన ప్రతిచోటా ఒకే తరహా ఆనవాళ్లు కనిపించడంతో ఇది ఒకే ముఠా పనని పోలీసులు అనుమానించారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. మక్తల్ ఎస్ఐ వై.భాగ్యలక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు నారాయణపేట క్రాస్రోడ్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి బైక్ను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్ఐ, సిబ్బంది వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి పేరు కర్రెం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ తిప్పి, సూర్య అని.. అంబేడ్కర్నగర్ కాలనీ, మక్తల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా మంకీ క్యాప్, దొంగతనాలకు వినియోగించే సామగ్రి, చోరీ చేసిన ఆస్తికి సంబంధించిన వివరాలు లభించాయి. మక్తల్, మరికల్ పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మక్తల్ పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి.. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడిన నిందితుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సరదాగా ప్రారంభమైన ఆనన్లైన్ బెట్టింగ్ వ్యసనంగా మారి డబ్బులు నష్టపోయి చివరకు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని బంగారం, నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి వాటిని విక్రయించి వచ్చిన డబ్బులను తిరిగి బెట్టింగ్లకే వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఏడాది కాలంగా పగటి వేళలో రెక్కీ నిర్వహించి మక్తల్ ప్రాంతంలోని దుకాణాలు, తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిళ్లు మంకీ క్యాప్, గ్లౌజులు ధరించి ఎలక్ట్రిక్ కట్టర్, భారీ సుత్తి, కటింగ్ ప్లేయర్స్, స్క్రూడ్రైవర్లు తదితర సామగ్రితో షట్టర్ల తాళాలు, తలుపులు పగులగొట్టి చోరీ చేసేవాడని పోలీసులు వివరించారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 10 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీటిలో 9 కేసులు మక్తల్ పోలీస్స్టేషన్ పరిధిలో కాగా.. ఒక కేసు మరికల్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైంది. -
మరమత్తులోనే..!
● నడిగడ్డ సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యపు నీడలు ● వానాకాలం ముంచుకొస్తున్నా జూరాల గేట్లకు పూర్తికాని మరమ్మతు ● యాసంగిలో 26వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ● ర్యాలంపాడు జలాశయం 2 టీఎంసీలకే పరిమితం ● నత్తనడకన ఆర్డీఎస్ పనులు గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. దో హబ్గా పిలువబడే కృష్ణా, తుంగభద్ర నదులు నడిగడ్డలో పారుతున్నప్పటికీ.. సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటంతో పంట పొ లాలకు సాగునీరు పారడం గగనంగా మారుతోంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు పారి కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు కాస్త బీళ్లుగా మారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. తుగభద్ర నది పరిధిలోని రాజోళిబండ డైవర్షన్ పథకం కింద రెండేళ్లుగా యాసంగిలో పూర్తిగా పంటలకు క్రాప్హాలిడే ప్రకటించారు. అదే విధంగా కృష్ణానది పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ర్యాలంపాడు జలాశయానికి పలుచోట్ల లీకేజీలు ఏర్పడటంతో ఆయకట్టుకు యాసంగిలో పూర్తిగా క్రాప్హాలిడే ఇస్తున్నారు. అదే విధంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్ల ఇనుప రోపులు తెగిపోగా.. మరమ్మతు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరమ్మతులను పూర్తిచేయడంలో పాలకులు, అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మొ త్తం 62 క్రస్ట్ గేట్లు ఉండగా.. అందులో 12 గేట్లకు సంబంధించి ఇనుప రోపులు పూర్తిగా తెగిపోయా యి. దీంతో ఈ ఏడాది వరద సమయంలో ప్రాజెక్టు భద్రతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు జూరాల ప్రాజెక్టును సందర్శించి.. అంతా బాగుందంటూ ప్రకటనలు చేసి వెళ్లారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ఇంకా అసంపూర్తిగానే మిగిలింది. ఫలితంగా యాసంగిలో కేవలం 26వేల ఎకరాలకే సాగునీటిని అందిస్తున్నారు. ● నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాల్లో, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా జలాశయం ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 4 టీఎంసీల సామర్థ్యాన్ని కాస్త 2 టీఎంసీలకు కుదించి.. నాలుగేళ్లుగా ఏటా వానాకాలం పంటకే నీరందిస్తున్నారు. ● రాజోళిబండ డైవర్షన్ పథకం హెడ్వర్క్స్, గేట్లు, ప్రధాన కాల్వల మరమ్మతు 2007లో మొదలుపెట్టగా..నేటికీ టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఆర్డీఎస్ కింద యాసంగిలో క్రాప్హాలిడే ప్రకటించడం ఆనవాయితీగా మారింది. జూరాల ప్రాజెక్టు గేట్లు రిపేరు చేయాలనే పేరుతో క్రాప్హాలిడే ప్రకటించి భూములను బీడుగా మార్చడం అన్యాయం. అధికారులు ఇలా చేయడం అలవాటుగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరగా మరమ్మతు పూర్తిచేసి, పూర్తిస్థాయిలో నీటిని అందించాలి. – సూరి, రైతు, కోయిల్దిన్నె, శాంతినగర్ ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడి నాలుగేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు వాటికి రిపేరు చేసింది లేదు. అధికారులు కేవలం సర్వేచేసి తిరిగి వెళ్తున్నారు. నాలుగేళ్లుగా రిజర్వాయర్ కింద యాసంగిలో నీటిని నిలిపివేశారు. దీంతో ఒక్క పంటనే వేసుకుంటున్నాం. ఇప్పటికై నా మరమ్మతులు పూర్తిచేసి రెండు పంటలకు నీటిని విడుదల చేయాలి. – వెంకట్రామిరెడ్డి, రైతు, ర్యాలంపాడు తుంగభద్ర డ్యాం గేట్లకు మరమ్మతు చేయాల్సి ఉండటంతో ఆర్డీఎస్ పరిధిలో క్రాప్హాలిడే ప్రకటించడం జరిగింది. అదే విధంగా ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు సంబంధించి నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు కొనసాగుతోంది. ఈ ఏడాది నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ కృష్ణానది పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద 1,09,296 ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1,42,000 ఎకరాలు, తుంగభద్ర నది పరిధిలో ఆర్డీఎస్ కింద 83,998 ఎకరాలతో కలిపి మొత్తం 3,35,294 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఏటా వానాకాలంలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు పారుతోంది. యాసంగిలో మాత్రం కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు పరిమితమవుతోంది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. -
వేరుశనగ క్వింటా రూ.8,541
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సోమవారం 76 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 8,541, కనిష్టంగా రూ. 4,419, స రాసరి రూ. 7,441 ధర పలికింది. 73 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,109, కనిష్టంగా రూ. 5,719, సరాసరి రూ. 6,039 ధర లు లభించాయి. 839 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,429, కనిష్టంగా రూ. 1,861, సరాసరి రూ. 2,179 ధర పలికింది. అంతరాలు లేని సమాజ స్థాపనే లక్ష్యం నాగర్కర్నూల్ రూరల్: అంతరాలు లేని సమసమాజ స్థాపనే తెలంగాణ ప్రజా నాట్యమండలి లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా నాట్యమండలి జల్లా నాలుగో మహాసభలకు వారు హాజరై మాట్లాడారు. 1943లో పురుడు పోసుకున్న ప్రజా నాట్యమండలి.. దేశ స్వాంతంత్రోద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందన్నారు. మూఢ నమ్మకాలు, వివక్షత, మతోన్మాదం, కులమతాలకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, గోపాల్, ప్రేమ్కుమార్, సలేశ్వరం, చందు, యాదగిరి, రామస్వామి, లింగేశ్వర్, శ్రీనివాస్, సురేశ్, కుర్మయ్య పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని పాటిద్దాం కందనూలు: హిందూ సమాజం సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రాంనూతల శశిధర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఈదమ్మగుడి బస్తీలో ఏర్పాటుచేసిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతున్న సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాల వారికి తెలియజేయడం అందరి బాధ్యతని అన్నారు. హిందూ సమాజంపై గౌరవభావం, ఏకాత్మకతా భావన, స్వధర్మంపై అంకితభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఓం భారత్ శక్తిపీఠం వ్యవస్థాపకులు భారతనంద మహారాజ్, ఉత్సవ సమితి అధ్యక్షుడు భానుప్రకాశ్, కార్యదర్శి రమేశ్, కౌన్సిలర్లు పాండు, కొత్త గంగాధర్ పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యం వద్దు
● బాధితులకు త్వరగా పరిహారం అందేలా చూడాలి ● నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి గద్వాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి.. బాధితులకు అన్నివిధాలా అండగా నిలువాలని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులకు సంబంధించి 2024 సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 239 అట్రాసిటీ కేసులు నమోదు కాగా.. 51 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వివిధ రకాల కారణాలతో కేసులను పరిష్కరించకపోవడం.. బాధితులకు పరిహారాన్ని అందజేయడంలో జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఈ కేసులకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చొరవతో పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అట్రాసిటీ కేసుల బాధితులకు రూ. 50.25లక్షల పరిహారం అందించినట్లు వివరించారు. బడ్జెట్ మంజూరైనప్పటికీ వివిధ కారణాలతో బాధితులకు రూ. 40లక్షల పరిహారం పెండింగ్లో ఉందన్నారు. కమిటీ సభ్యుల సహకారంతో అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి.. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఎస్పీ మొగులయ్య, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత, కమిటీ సభ్యులు కుర్మన్న, నర్సింహ, సురేశ్, మల్లిఖార్జున్, శైలజ ఉన్నారు. -
‘డిండి పేరుతో సాగునీరు తరలించొద్దు’
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి ‘డిండి’ పేరుతో నల్లగొండ జిల్లాకు సాగునీరు తరలించొద్దని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనికి ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్–గొట్టిముక్కుల ఎత్తిపోతల ద్వారా ప్రతిపాదిత ప్రాజెక్టుకు అవసరమైన నీటిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి.రాజేందర్రెడ్డి, రాఘవాచారి, బెక్కం జనార్దన్, చెన్నకిష్టన్న, టి.జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణ కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి
జడ్చర్ల టౌన్: భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుడి కుటుంబానికి చెల్లించే ఎక్స్గ్రేషియా రూ.20 లక్షలకు పెంచాలని బీసీ జాగృతి సేన కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ అన్నారు. సోమవారం మండల విద్యా వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన బీసీ జాగృతి సేన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గాయపడిన కార్మికులకు పూర్తిగా నయం అయ్యే వరకు ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని, కార్మికుని కూతురు పెళ్లి, కాన్పు కోసం చెల్లించే రూ.30 వేలకు బదులుగా పెళ్లికి రూ.లక్ష, కాన్పు ఖర్చు రూ.50 వేలకు పెంచాలన్నారు. ప్రతి పండగకు గుర్తింపు కార్డు కలిగిన కార్మికునికి రూ.2 వేలు నజరానా అందించాలన్నారు. పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల కాంట్రాక్టులను స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని కోరారు. పై అంశాలపై త్వరలోనే స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామన్నారు. సమావేశంలో బీసీజాగృతి సేన రాష్ట్ర కార్యదర్శి రఘునందనచారి, నాయకులు నర్సింహులు, వెంకటేశ్, శేఖర్, మురళి, నాగేష్, శ్రీశైలం, ఫకీర్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ అందుబాటులో ఉంటా
గద్వాలన్యూటౌన్: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత అన్నారు. ఇటీవల టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి వద్ద కాంగ్రేస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. మార్గమధ్యలో జమ్మిచేడు వద్ద జములమ్మ అమ్మవారిని సరిత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా.. ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సరిత మాట్లాడారు. గద్వాల ప్రజలు చూపిస్తున్న అభిమానం తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తోందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి, బాధ్యతను అప్పగించిన సీఎం రేవంత్రెడ్డికి, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష
అలంపూర్: ప్రకృతి విపత్తులు, విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష అని అదనపు కలెక్టర్ (రెవెన్యూ మధుమోహన్ అన్నారు. కేంద్ర పర్యావరణ, విపత్తుల నిర్వహణ సంస్థ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ సహకారంతో సోమవారం అలంపూర్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ఆధ్వర్యంలో వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రథమ చికిత్స కేంద్రం, అత్యవసర సహాయక కేంద్రాల నమూనాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. మున్సిపాలిటీలోని కట్టలపేట కాలనీలో గాయపడిన బాధితులను అంబులెన్స్ ద్వారా చికిత్స కేంద్రాలకు ఎలా తరలించాలో మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. తుంగభద్రనది పుష్కర ఘాట్ వద్ద ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, వైద్యశాఖల సిబ్బంది వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో రక్షించే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. రెస్క్యూ చర్యలు చేపట్టిన అనంతరం బాధితులను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించడం.. వైద్యం అందించడాన్ని ప్రదర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం తదితర అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వరదలు, విపత్కర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తద్వారా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయరాముడు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి అశోక్, తహసీల్దార్ ప్రభాకర్ పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులను అదేశించారు. అలంపూర్ చౌరస్తా మార్కెట్యార్డులోని మొక్క జొన్న కొనుగోలు కేంద్రంతో పాటు గోదాంలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్కు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. -
ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న మట్టి మాఫియా
● అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు ● నిత్యం భారీ యంత్రాలతో తవ్వకాలు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్శాఖ అధికారులు ● ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే స్పందిస్తున్న పోలీసులు ● ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి గద్వాల క్రైం: నడిగడ్డలో ప్రకృతి వనరులను మట్టి మేతగాళ్లు కొల్లగొడుతున్నారు. ‘ఎక్కడైనా తవ్వుకోండి.. ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకోండి.. ఎవ రూ అడ్డుకోరు.. ఎవరైనా ఆపితే అండగా ఉంటాం.’’ అని అధికార పార్టీ ముఖ్య నేతలు అభయం ఇ స్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గు ట్టలు, చెరువుల్లో నిరాటంకంగా భారీ యంత్రాలతో మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు చోద్యం చూస్తుండగా.. ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే పోలీసులు స్పందించి కేసులు నమోదు చేస్తున్నారు. మాటలకే పరిమితం.. మట్టి అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు తమకేందుకు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని నెలలుగా స్థబుగా ఉన్న మట్టి మాఫియా.. 20 రోజుల నుంచి మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తోంది. ఒక ట్రాక్టర్ మట్టికి రూ.1,600, టిప్పర్కు రూ.6వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఎటు చూసినా నూతన నిర్మాణాలు చేపడుతుండటంతో మట్టి వ్యాపారులు సిండికేట్గా మారి తమకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం వరకే అధికారులు పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో.. మట్టి వ్యాపారులు గతంలో ఒకరిపై మరొకరు అధికారులకు సమాచారం అందించి కేసులు నమోదు చేయించే వారు. అయితే ప్రస్తుతం రూట్ మార్చారు. ఉప్పు, నీరుగా ఉండే వ్యాపారులు ఒక్కటయ్యారు. తవ్వుకో.. దోచుకో.. తినుకో అనే సూత్రంతో అధికార పార్టీ నాయకులు వ్యవహారం నడిపిస్తున్నారు. అనుమతులు ఉన్నా.. లేకున్నా అన్నీ తామై చూసుకుంటామని చెబుతూ.. శత్రు శేషం లేకుండా చక్రం తిప్పడంతో పాటు తాము ప్రకటించిన ధరలకే మట్టి విక్రయాలు జరిగేలా చూస్తున్నారు. అయితే రెవెన్యూ, మైనింగ్, పోలీసుశాఖల అధికారులు నాయకుల కనుసన్నుల్లో ఉండటంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా మైనింగ్శాఖ ఏడీని ‘సాక్షి’ వివరణ కోరేందుకు సంప్రదించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
జాతీయ హోదా కల్పించాలి
అలంపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హో దా కల్పించడానికి తమ వంతుగా కృషి చేయాలని మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కోరారు. కర్నూలులోని క్యాంప్ కార్యాలయంలో ఆది వారం ఎమ్మెల్యే విజయుడిని మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగ ప్రయోజనాల కోసం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు తక్షణమే పూర్తి చేసే విధంగా తమ వంతుగా కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. పాలమూరు జిల్లా రైతులకు నష్టం జరిగే విధంగా దిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వలి, కన్వీనర్ వెంకట్రామయ్యశెట్టి, మున్సిపల్ చైర్మన్ జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్గౌడ్, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
మల్దకల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలం అమరవాయిలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడా రు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గద్వాల నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే తన లక్ష్యమన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, పటేల్ ప్రభాకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వీరన్న, పెద్ద గోపాల్రెడ్డి, తిమ్మారెడ్డి, రాజారెడ్డి, రంగన్న, మహేశ్, నాగన్న పాల్గొన్నారు. -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ ● సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ● ఉమ్మడి జిల్లా రైతుల కోసం 9,200 క్వింటాళ్లు ● ఇప్పటికే నారాయణపేట, పాలమూరు జిల్లాలకు సరఫరా ● పంట విత్తనాలకు రాయితీ లేనట్టే.. వనపర్తి: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూ సారాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తోంది. కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యర్థనల మేరకు పాలమూరు జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లతో పాటు వివిధ కేంద్రాల్లో విక్రయిస్తోంది. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ఏటా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాల వారీగా వ్యవసాయశా ఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం వనపర్తి లోని తెలంగాణ రాష్ట్ర విత్తనశుద్ధి కేంద్రంలో 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు పీఏసీఎస్ కేంద్రాలకు వీటిని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ●గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీ ని ఎత్తివేసింది. కొంతకాలంగా రైతులకు పెట్టుబడి సాయం సక్రమంగా అందడం లేదు. విత్తనాలపై రాయితీ లేక, పెట్టుబడి సాయం సకాలంలో అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50 శాతం రాయితీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ● పచ్చిరొట్ట ఎరువుల్లో జీలుగ, జనుము, పిల్లిపెసర ఉండగా.. పాలమూరు రైతులు కేవలం జీలుగ, జనుముకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రంలో ఆయా విత్తనాలను ప్రాసెసింగ్ చేసి సిద్ధం చేసి ఉంచారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా అందుబాటులో ఉండగా.. పూర్తి ధర రూ.4,905. యాభై శాతం రాయితీతో రైతులు పొందవచ్చు. అలాగే జనుము విత్తనాలు 40 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర రూ.6,220 కాగా.. యాభై శాతం రాయితీతో రూ.3,110కే రైతులకు సరఫరా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జీలుగ విత్తనాలు 8,500 క్వింటాళ్లు.. జనుము విత్తనాలు 700 క్వింటాళ్లు సిద్ధం చేసి ఉంచారు. వనపర్తిలోని విత్తనశుద్ధి కర్మాగారంలో సిద్ధంగా ఉన్న విత్తనాలు జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగుచేసే వరి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు, పత్తి, మిరప తదితర ఆహార ధాన్యాల విత్తనాలపై ప్రభుత్వం కొంతకాలంగా రాయితీని ఎత్తివేసింది. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరి (సన్నా, దొడ్డురకం) విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసి ఉంచింది. మరో 15 రోజుల తర్వాత పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా వరి, కంది విత్తనాలు రైతులకు విక్రయిస్తారు. వరి 25 కిలోల బస్తాలు, కంది 4 కిలోల బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. రెండు పర్యాయాలు వానాకాలంలో మెట్ట పంటల సాగు తగ్గిపోవటంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి విత్తనశుద్ధి కర్మాగారంలో కేవలం వరి, కంది విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తోంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం. – ఆదినారాయణరెడ్డి, రీజియన్ మేనేజర్, విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్నగర్ -
టీఎంయూఎన్ ప్రోగ్రాంలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
ధరూరు: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ (టీఎంయూఎన్) ప్రోగ్రాంలో జిల్లా నుంచి పాల్గొన్న విద్యార్థులు అత్యంత ప్రతిభకనబరిచారు. విద్యార్థులు రవిచంద్ర (పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, అయిజ), మిస్బా (జెడ్పీహెచ్ఎస్, ధరూరు), షర్మిల (జెడ్పీహెచ్ఎస్, మల్దకల్), రెహానా ఫర్విన్ (జెడ్పీహెచ్ఎస్, తక్కశిల), సంజీవ్ (టీసీఆర్ఎస్, బీచుపల్లి)లు యూఎన్ఓ కమిటీ ‘డీఐఎస్ఈకే’ అంశంపై ‘వ్యూహాత్మక సముద్ర మార్గాల సైనికీకరణ ద్వారా తలెత్తే ముప్పులను పరిష్కరించడం – ముఖ్యంగా హార్మూజ్ జలసంధిపై ప్రత్యేక దృష్టి సారించడం’.. ఇతర అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి రాష్ట్రస్థాయిలో 2, 3, 4వ స్థా నంలో నిలిచినట్లు జిల్లా రీసోర్స్పర్సన్ పి.విజయభాస్కర్రెడ్డి, గైడ్ టీచర్లు ముద్దమ్మ, శ్రీహరి, రాణి తెలిపారు. వీరికి సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటం అమరచింత: భవన నిర్మాణరంగ కార్మి కుల సమస్యల పరిష్కారానికి రాజీలే ని పోరాటం కొనసాగిస్తున్నామని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణరంగ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాంబశివుడు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్స్ భవనంలో జరిగిన సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని భవన నిర్మాణరంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులకు పింఛన్ సౌకర్యం, ప్రైవేట్ ఏజెన్సీల రద్దు, సహజ మరణానికి రూ.5 లక్షల పరిహారం పెంపునకు ప్రభుత్వాలతో పోరాడుతున్నామన్నారు. 60 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.9 వేల పింఛన్ ఇవ్వాలని, సంక్షేమ పథకాల అమలుకు ఇచ్చిన ప్రైవేట్ ఏజెన్సీల పునరుద్ధరణను నిలిపి వేయా లని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ అమలు చేయాలని, పెళ్లికానుక, ప్రసవాల నగదును రూ. లక్షకు పెంచాలన్నారు. పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరించాలని, నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కోరారు. లేబర్ అడ్డాల్లో షెల్టర్లు, తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నా రు. ఈ నెల 25 న చేపట్టే చలో హైదరాబాద్కు భవ న నిర్మాణరంగ కార్మికులు అధి కసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రంగన్న, జిల్లా ప్రధానకార్య దర్శి రాజు, టీయూసీఐ జిల్లా సహా య కార్యదర్శి గణేష్, మస్తామని, రమేష్, చెన్నయ్య, వెంకటేష్, శేఖర్, రవి, రాంచందర్ పాల్గొన్నారు. -
మొక్కజొన్న బస్తాల తరలింపునకు చర్యలు
అయిజ: రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న బస్తాలను గోదాంలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. శనివారం అయిజ మార్కెట్యార్డులో మొక్కజొన్న బస్తాలను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. మార్కెట్యార్డులో ఉన్న 70వేల మొక్కజొన్న బస్తాలను తరలించేందుకు మూడు రోజులుగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. జిన్నింగ్ మిల్లుల గోదాంల్లో మొక్కజొన్న బస్తాల నిల్వ చేయడంపై యజమానులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. రవాణాకు సంబంధించి లారీల యజమానులు ముందుకు రాకపోతే.. ట్రాక్టర్ల ద్వారా గోదాంలకు తరలించాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాలకు బస్తాలు తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో సింగిల్విండో చైర్మన్ పోతుల మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ జ్యోతి తదితరులు ఉన్నారు. ధాన్యం సేకరణలో అలసత్వం తగదు ధరూరు: రైతుల నుంచి వరిధాన్యం సేకరణలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం ధరూరు మండలం రేవులపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి.. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేసి, మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. రైతులకు సకాలంలో డబ్బులు కూడా అందడం లేదన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో వరిధాన్యాన్ని త్వరగా సేకరించి.. మిల్లులకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, హన్మంతరాయ, నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిలీ పత్రాల వ్యవహారంలో ఐదుగురికి రిమాండ్ అయిజ: పట్టణంలో ఇటీవల వెలుగుచూసిన నకిలీ ధ్రువపత్రాల తయారీ వ్యవహారంలో శనివారం పోలీసులు ఐదుగురిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ మల్లేష్ వివరాల మేరకు.. అయిజ పట్టణంలోని నర్సింహ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 1న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తెలంగాణతో పాటు ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా వచ్చి నకిలీ పత్రాలు పొందుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ పత్రాలు తయారుచేస్తున్న అయిజ గొల్ల నర్సింహ, మునిస్వామితో పాటు గట్టు మండలానికి చెందిన పోతురాజు ఆంజనేయులు, నర్సింహులుగౌడ్, సిద్దప్పను అరెస్టుచేసి, అలంపూర్ కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
అలంపూర్/గట్టు/అయిజ: జిల్లాలోని అలంపూర్, అయిజ, గట్టు తదితర మండలాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి వరి, మొక్కజొన్న ధాన్యం తడిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్యార్డులలో మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. టార్ఫాలిన్లు కప్పినా ధాన్యంలోకి నీరు చేరాయి. భారీ వర్షం కురిస్తే రైతులకు నష్టం వాటిల్లేదని పలువురు ఆందోళన చెందారు. మొక్కజొన్న బస్తాలను త్వరగా గోదాంలకు తరలించాలని కోరారు. అదే విధంగా గట్టు మండలంలోని ఆరగిద్ద, తప్పెట్లమొర్సు, గొర్లఖాన్దొడ్డి, మాచర్ల, బల్గెర గ్రామాల్లో అకాల వర్షానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం తడిసిపోకుండా కాపాడుకున్నారు. కాగా, వేసవి తాపంతో సతమతమవుతున్న వారికి వర్షం కాస్త ఊరటనిచ్చింది. -
త్వరగా పూర్తిచేయండి..
సాగునీటి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. ఈ ప్రాంత రైతులు ఇప్పటికీ బోర్లతోనే పంటలు పండిచుకుంటున్నారు. వర్షాలు వస్తేనే బోర్లలో నీరు పుష్కలంగా ఉంటుంది. వర్షాలు లేకపోతే బోర్లు ఎండిపోతాయి. ప్రభుత్వం గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – గోలానాయక్, రైతు, మల్లాపురం తండా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం ఆగిపోయిన గట్టు ఎత్తిపోతల పథకం పనులను మళ్లీ ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలి. ఎత్తిపోతల పథకంతో సాగునీటిని ఇక్కడి బీడు భూములకు పారించాలి. ఆ పనులు ఎప్పుడు పూర్తిచేస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. – కావలి నర్సింహులు, రైతు రాయాపురం కేబినెట్ ఆమోదించాల్సి ఉంది.. గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచాల ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అంచనాలను తయారుచేసి పంపడం జరిగింది. ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచాలని రూపొందించిన డీపీఆర్ రాష్ట్ర కేబినేట్ ముందు ఉంది. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం. – రహిమొద్దీన్, ఇరిగేషన్శాఖ ఎస్ఈ ● -
పల్లెల్లో పబ్లిక్ స్కూల్స్
● ఉమ్మడి జిల్లాలో 13 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు ● అంతర్జాతీయ ప్రమాణాలతో టీపీఎస్ల నిర్మాణానికి చర్యలు ● ఒకే చోట నర్సరీ టు ఇంటర్ విద్య ● వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం అచ్చంపేట: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 13 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. ఆయా హంగులన్నీ సమకూర్చడంతో టీపీఎస్కు మంచి స్పందన వచ్చింది. డేటా ఆధారిత ఎంపిక.. పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా.. డేటా ఆధారంగా చేపట్టారు. యూడైస్ ఆధారంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలపై బేరీజు వేశారు. మండలస్థాయి నుంచి పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి.. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ఎంపిక చేపట్టారు. ఒక్కో టీపీఎస్కు రూ.15 కోట్లు.. వచ్చే ఏడాది నుంచే ఎంపికచేసిన పాఠశాలల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఒక్కో టీపీఎస్కు సమారు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే చోట విద్య అందుబాటులోకి రానుంది. ప్రైవేటు స్కూళ్లకు ఽధీటుగా డిజిటల్ క్లాస్రూమ్లు, ల్యాబ్లు, లైబ్రరీలు, క్రీడా సామగ్రి, కొరత లేకుండా టీచర్లు, పూర్తిస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం తదితర అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. దూర ప్రాంతాల పాఠశాలలను విలీనం చేస్తే.. విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూల్ బస్సు ఏర్పాటు చేయనున్నారు. టీపీఎస్ల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్రులు.. ఇప్పడు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆదర్శంగా వంగూరు టీపీఎస్.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న వంగూరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించడం ద్వారా నూతన టీపీఎస్లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం అమలు, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉన్నాయి. అదే విధానాన్ని ఉమ్మడి జిల్లాలో అమలుచేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. సెమీ రెసిడెన్షియల్స్గా.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేయనున్నాయి. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల ఉన్న బడులు, జూనియర్ కళాశాలలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. విద్యార్థులు నర్సరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది. -
కలవరం.. కలకలం
● యువతి హత్యతో ఉలిక్కిపడిన జడ్చర్ల ● అపస్మారక స్థితిలో ప్రేమోన్మాది జడ్చర్ల: జడ్చర్లలో నడిరోడ్డుపై ఓ ఉన్మాది.. యువతిని దారుణహత్య చేసిన సంఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరు.. ఎక్కడా.. అంటూ జనం ఆరా తీశారు. బాదేపల్లిలోని నిమ్మబాయిగడ్డ నుంచి ఎర్రసత్యం కాలనీలో ఉంటున్న తన ఇంటికి వెళుతున్న యువతి వైష్ణవి(23)ను గుట్టుగా వెంటాడుతు వచ్చిన ఓ యువకుడు(30) కత్తితో విచక్షణ రహితంగా దాడి చయడంతో.. సీసీ రోడ్డుపై ఆ యువతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రక్తం మడుగులో విలవిలలాడుతూ ప్రాణాలు వదలింది.రక్తం మరకలతో పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంటాడి పట్టుకొని తాళ్లతో చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. కొందరు రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ● వైష్ణవి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో నిందితుడితో పరిచయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి వారితో సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా యువతి దారుణహత్యను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. కాగా.. వైష్ణవి హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, తదితరులు బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం
పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇటీవల కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా ఈ సెలవుల్లో కుటుంబసమేతంగా ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక కథనం.. – స్టేషన్ మహబూబ్నగర్ – వివరాలు 8లో.. -
ప్రేమే కారణమా..?
యువతి హత్యకు ప్రేమనే కారణమని పలువురు భావిస్తున్నారు. యువతిని కత్తితో పొడిచి పారిపోతున్న సమయంలో స్థానికులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది. దీంతో ప్రేమ వ్యవహారమే యువతి హత్యకు కారణమయ్యిందా.. అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా దాడికి పాల్పడ్డానని పేర్కొన సదరు యువకుడు యువతి వైష్ణవికి పెళ్లి కుదరడం, మరో రెండు నెలల్లో పెళ్లి అయిపోతుందన్న సమాచారం ఉండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. అయితే వైష్ణవి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులు కొట్టి పారేస్తున్నారు. అయితే నిందితుడు ఆపస్మారక స్థితి నుంచి బయటపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు
గద్వాల: గ్రంథాయలంలోని పత్రికలు, పుస్తకాలను పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నా రు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షె డ్యూల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందు గా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలెక్టర్ గ్రంథాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి విద్యార్థులకు, నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రూప్స్, బ్యాంకింగ్, టీచర్ తదితర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు పక్కా ప్రణాళికతో లక్ష్యాలకు అనుగుణంగా చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని తెలిపారు. ఒకే నోటిఫికేషన్ కోసం కాకుండా నిరుద్యోగులు తాము చదివిన కోర్సులకు అనుబంధంగా ఉండే ఇతర ఉద్యోగాల కోసం కూడా సాధన చేస్తే ప్ర యోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రంథాల య భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతంనిర్వ హిస్తున్న గ్రంథాలయాన్ని సమీపంలో ఉన్న పాతకోర్టు భవనంలోకి మార్చడానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నూతన భవ న నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న నిధులతో పాటు ఎంపీ, తన నిధులు కేటాయిస్తానన్నారు.కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు,డీఈఓ విజయలక్ష్మి,లైబ్రేరియన్ రామాంజనేయులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ నిధులతో చేపట్టిన ఆయా పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. రూసా, నాబార్డ్, నేషనల్ హెల్త్ మిషన్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తదితర నిధు లతో చేపట్టాల్సిన పనులు పెండింగ్లో ఉంచకుండా, టెండర్స్ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజీ భవనం, ఇతర నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. కేజీబీవీలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు ప్రతిపాదనలు చేసి పంపాలన్నారు. పీఎం శ్రీ నిధు లతో ఆయా పాఠశాల్లో చేపట్టాల్సిన లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, మరుగుదొడ్ల నిర్మాణ పనులు నిర్ధేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
గద్వాల క్రైం: నేరస్తుల విషయంలో పోలీస్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లాలోని శాంతిభద్రతల విషయాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని ప్రార్థన మందిరాల వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి, అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టాలన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి స్వీయ జాగ్రత్తలపై సూచనలు చేయాలన్నారు. చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచి ప్రతి గూడ్స్ వాహనాలు, కంటెనర్లను తనిఖీ చేయాలని, పశువులను అక్రమంగా తరలించిన వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సమస్యలపై వచ్చే పోలీస్స్టేషన్ను సంప్రదించే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీట్ దాఖాలు చేసి, నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్కుమార్, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, నాగశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ధరలు తగ్గించాలి
ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతార ని సీపీఎంతో సహా ఇతర పార్టీలు ముందుగానే చెప్పాయి. అయితే దీనిని ప్రతిపక్షాల ఆరోపణలు అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఖండించారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి బేషరత్గా ప్రజలకు క్షమాపణ చెప్పి రేట్లు తగ్గించాలి. – వెంకటస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని మోదీ నిత్యవసరాలు మొదలుకుని పెట్రోలు, డీజిల్ ధరల వరకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే గ్యాస్, ఇంధనాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా వాటిపై ధరలు పెంచి మరో బాంబు వేశారు. ప్రజలపై భారం పడకుండా తక్షణమే రేట్లు తగ్గించాలి. లేదంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. – ఆంజనేయులు సీపీఐ జిల్లా కార్యదర్శి పశ్చిమ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలతో అన్ని రంగాల్లో నష్టాలు వాటిల్లి వాటి ప్రభావం ప్రజలపై పడుతుంది. తాజాగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ప్రజలపై పడుతున్న దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. – కోళ్ల హుస్సేన్, గద్వాల -
నెరవేరుతున్న పేదల సొంతింటి కల
ధరూరు: ఏళ్లుగా సాకారం కాని పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇంటితో నెరవేరుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పారుచర్లలో సావిత్రి, సుజాత ఇందిరమ్మ ఇళ్లను ఆయన స్థానిక నాయకుడు సురేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం పేద వర్గాల్లో ఆనందం నింపిందన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, నాయకులు జంబు రామన్గౌడ్, సురేందర్రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్ అమరచింత: మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ పగలడంతో ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట, మదనాపురం మండలాల్లోని 30 గ్రా మాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మదనాపురం మండలంలోని గోపాన్పేట వద్ద ఓ రైతు తన పొలం దుక్కి దున్నుతుండగా పైప్లైన్ పగిలి తాగునీరు వృథాగా పారింది. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ఈఈ అంజద్పాషా, డీఈ విజయ్కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనసాగుతున్న మరమ్మ తు పనులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూ డాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన పైప్ లైన్ పగలడంతో అమరచింత, ఆత్మకూర్ పురపాలికలతో ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల, బాలకిష్టాపూర్, మూలమల్ల, మదనాపు రం మండలంలో మదనాపురంతో పాటు కొత్తపల్లి, దుప్పల్లి, గోపన్పేట, కర్వెన, భగత్సింగ్తండా, అమరచింత మండలంలోని సింగంపేట, మస్తీపురం, చంద్రప్పతండా, పాంరెడ్డిపల్లి తండా, కొంకన్వానిపల్లి, చిన్నచింతకుంట మండలంలోని అల్లీపురం, కురుమూర్తి, అ మ్మాపురం, గూడూరు, తిరుమలాపురం, దాస రపల్లి, అప్పంపల్లి, ముచ్చింతల, చిన్నచింతకుంట, మద్దూరు, ఎదులాపురం గ్రామాల్లో శుక్రవారం నీటి సరఫరా నిలిచింది. అసలే వేస వి కాలం అందులోనూ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరమ్మతులు పూర్తిచేసి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. -
లక్కీడిప్ ద్వారా ప్రవేశాలు
గద్వాల: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశాలను పారదర్శకంగా లక్కీడిప్ నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తెలిపారు. శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశాల కోసం లక్కీడిప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మూడో తరగతిలో 3 సీట్లు, 5వ తరగతిలో 2 సీట్లు, ఎనిమిదో తరగతిలో 1 సీటు కలిపి మొత్తం 6 సీట్ల భర్తీకి లక్కీడిప్ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పూర్తి పారదర్శకతతో డ్రా తీశామన్నారు. ఎంపికై న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజశేఖర్, పవన్కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
విస్తృత తనిఖీలు
మూగజీవాల అక్రమ రవాణాకు చెక్ గద్వాలక్రైం:కబేళాలకు తరలుతున్న పశువుల (మూ గ జీవాల) అక్రమ రవాణాకు చెక్ పెట్టేలా పోలీసు లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల వద్ద ఇప్పటికే జిల్లా పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించి అనుమతి లేకుండా తరలిస్తున్న పశువులను గుర్తించి, వాటిని గోశాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడు రోజుల క్రితం ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, సిబ్బంది అలంపూర్ టోల్ప్లాజా వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలోని పూల్లూరు, బల్గెర, కేటీదొడ్డి అంతరాష్ట్రాల సరిహద్దులలో నిత్యం కంటైనర్లు, డీసీఎంలను నిలిపి సోదాలు చేస్తున్నారు. అక్రమార్కులు తమదైన వ్యూహాలతో పోలీసుల కళ్లు గప్పి గుట్టుగా రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు వ్యూహాత్మంగా నిఘా పెంచారు. మరోవైపు డీ జీపీ సీవీ ఆనంద్ సైతం తాజాగా బుధవారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా పలు మార్గదర్శకాలు చేశా రు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వివరాలను సైతం డీజీపీ ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. తరలింపుపై నిఘా.. బక్రీద్ పండుగా సందర్భంగా పలువురు వ్యాపారులు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి మూగజీవాలను ప్రైవేట్ వాహనాలలో గుట్టుగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నాలుగు రోజుల నుంచి సరిహద్దు ప్రాంతాల వద్ద నిఘా ముమ్మరం చేశారు. వ్యాపారులు మూగ జీవాలను సంతల్లో కొనుగోలు చేస్తుండడంతో పాటు రోడ్లపై సంచరిస్తున్న వాటిని సైతం దొంగతనంగా తరలించేందుకు సిద్ధమయ్యారు. అక్రమార్కులు వాహన సామర్థ్యానికి మించి మూగ జీవాలను అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో బల్గెర, నందిన్నె, ఇర్కిచేడ్, సుంకేసుల డ్యాం, బైరాపురం, పుల్లూరు టోల్ప్లాజా, ఎర్రవల్లి ఎక్స్రోడ్డు వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. కంటెన ర్లు, లారీలు, గూడ్స్ వాహనాలు, అనుమానస్పద వాహనాలపై నిఘా ఉంచి పోలీసులు సోదా లు చేపట్టారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే ఫిర్యా దులు సైతం స్వీకరించి, మూగ జీవాల రక్షణకు చర్యలు చేపట్టారు. గతేడాదిలో జరిగిన హింసాత్మక ఘటనలు, అల్లర్ల కేసులపై ఆరా తీస్తున్నారు. ముస్లిం మత పెద్దలతో శాంతియుత సమావేశాలు నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పూల్లూరు, బల్గెర, కేటీదొడ్డి అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద హై అలర్ట్ అనుమతులు ఉంటేనే తరలింపు అవకాశం ఎస్పీ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం భారంగా అనుకునే రైతులు తమ ఎద్దులు, ఆవులను పోషించే స్థోమత లేకపోవడంతో వాటిని విక్రయిస్తున్నారు. వ్యాపారులు ఇదే అదనుగా భావించి వాటిని చౌక ధరలకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు ఎగుమతి లేదా కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తరలింపునకు ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుగా వ్యవహారం కొనసాగిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మూగ జీవాలను దగ్గరలోని గోశాలలకు తరలిస్తున్నారు. -
పాలమూరు కోసం పోరు..
గూడ్స్ వాహనాలు 5177 క్యాబ్లు 649 ఆటోరిక్షాలు 2527 ద్విచక్ర వాహనాలు 1,23,932 కార్లు 9221 ట్రాక్టర్లు 9296 ●సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఆ పార్టీ ముఖ్య నేతలైన మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు కసరత్తు మొదలుపెట్టారు. తొలి దశలో పాలమూరు ప్రాజెక్ట్తో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సాగించేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సంస్థాగత బలోపేతంలో భాగంగా సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై గళం వినిపించేలా సమాయత్తమవుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జూన్ మొదటి వారంలో... చివరి దశలో మిగిలిన ప్రతిష్టాత్మక పాలమూరు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే సంకల్పంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్లో ఇటీవల పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత పాలమూరు ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, చిట్టెం రాంమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్కుమార్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నేతలు మరోమారు సమావేశమై చర్చించిన అనంతరం వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వారి మాటలను బట్టి జూన్ మొదటి వారంలోపు లేదంటే రెండో వారం ప్రారంభంలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం తదితర రంగాల వారీగా సైతం.. పాదయాత్ర అనంతరం జిల్లాకేంద్రాలు, తదితర ముఖ్య ప్రాంతాల వారీగా వ్యవసాయం, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ నేతలు రోజు వారీగా పోరు కొనసాగించనున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా సైతం భేటీలు నిర్వహించి.. వారి సమస్యల పరిష్కారం దిశగా గళమెత్తేలా నేతలు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు చేకూరిన మేలు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల తీరుపై ఎండగట్టే కార్యాచరణతో గులాబీ దళం ప్రత్యేక కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర లు పెంచడంతో సామాన్య ప్ర జలకు ఆర్థిక కష్టాలు తప్పవు. ప్రజలు జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఆర్థిక విధా నాలు తీసుకురావాల్సిన కేంద్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించకుంటే గుణపాఠం తప్పదు. – వాల్మీకి, గద్వాల తొలి రోజు కేటీఆర్.. చివరి రోజు కేసీఆర్ పాదయాత్ర షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. యాత్ర ప్రారంభమయ్యే తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. పాదయాత్ర మధ్య మధ్యలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. రోజు వారీగా కిలోమీటర్ల వారీగా కొనసాగనున్న యాత్రకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో రైతులతో మాటామంతి, కార్నర్ మీటింగ్లు, బస చేసే ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించేలా నేతలు ప్రణాళిక తయారు చేస్తున్నారు. చివరి రోజు ప్రజలతో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండగా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నాయకులతో ముఖ్య నేతలు ముందస్తుగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతల ఉద్యమ కార్యాచరణ జూన్లో పాదయాత్రకు సన్నాహాలు నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు.. తొలి రోజు కేటీఆర్, మధ్యలో హరీశ్రావు హాజరు చివరి రోజు భారీ బహిరంగ సభ ‘గులాబీ’ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాక నార్లాపూర్ లేదంటే ఉదండాపూర్ నుంచి.. పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి తొలి దశలో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, వనపర్తి జిల్లాలో ఏదుల, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కర్వెన, జడ్చర్ల మండలంలో ఉదండాపూర్ రిజర్వయర్లను నిర్మిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్లో మొదటి పంప్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఉదండాపూర్లో యాత్ర ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదండాపూర్లోనే పాదయాత్ర ప్రారంభించి.. నార్లాపూర్లో ముగించే అవకాశం సైతం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
పూర్వవిద్యార్థులు యూనివర్సిటీలో భాగస్వాములు కావాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పూర్వవిద్యార్థులు యూనివర్సిటీలో భాగస్వాములుకావాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పీయూలో విద్యావారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీయూలో చదివి వివిధ స్థాయిల్లో విద్యార్థులు పనిచేయడం గొప్ప విషయమని, జీవితంలో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీతో అనుబంధం కొనసాగించాలని సూచించారు. పూర్వ విద్యార్థుల అనుభవాలు, విజయాలు ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మార్గదర్శనం కావాలన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు చదువు ఒక్కటే కాదని, దానితో పాటు స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలకు అవసరమైన విధంగా విద్యార్థులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కుమారస్వామి, అనురాధారెడ్డి, మాళవి, కరుణాకర్రెడ్డి, నూర్జహాన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి విద్యార్థికి చదువు, సంస్కారం ముఖ్యం
అమరచింత: ఆధునిక యుగంలోనూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం అందించడానికి వందేమాతరం ఫౌండేషన్ కృషి చేస్తోందని ఆ సంస్థ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మాధవరావు అన్నారు. పట్టణంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు సమాజంపై ప్రేమ ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే ఉద్దేశాలను వారిలో చిన్నతనం నుంచి అలవాటు చేయాలన్నారు. కేవలం పుస్తక పఠనంతోనే విద్యార్థి ఎదుగుతాడనే ఆలోచనను వీడి చదువుతో పాటు ఎదుటి వారిని గౌరవించే గుణం నేర్పించాలని సూచించారు. విద్యార్థులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించినపుడే ఎదుటి వారి పట్ల మర్యాదగా నడుచుకుంటారన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో 12 వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని.. 2,500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. అమరచింతలోని శిక్షణ శిబిరానికి వచ్చే విద్యార్థులకు ఉచితంగా భోజనం అందించేందుకు డీఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్ దేశాయి ప్రకాష్రెడ్డి ముందుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆచార్య రమేష్ గురుజీ, కో–ఆర్డినేటర్ బాలకృష్ణ పాల్గొన్నారు. -
సజావుగా ధ్యానం సేకరణ ప్రక్రియ
● యంగ్ ఇండియా పాఠశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కేటీదొడ్డి: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. కేటీదొడ్డి మండల కేంద్రంతో పాటు కొండాపురం, గువ్వలదిన్నె గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించడంతో పాటు ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు తేమశాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం చేసి, మిల్లులకు తరలించాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా రైతులకు సకాలంలో చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓపీఎంఎస్ కాకుంటే రైతులకు సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడతారన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ట్రక్ షీట్ వివరాల్లో తప్పిదాలు ఉంటే సరిచేసి పంపాలని సూచించారు. అనంతరం నందిన్నె అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును కలెక్టర్ తనిఖీ చేశారు. చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ విధానం, రిజిస్టర్ నిర్వహణ, వాహన పత్రాల పరిశీలన తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి మొక్కజొన్న, వరిధాన్యం రాకుండా చూడాలన్నారు. ● కేటీదొడ్డిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. భూమి చదును పూర్తయినందున అకాడమీ బ్లాక్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఒప్పందం ప్రకారం ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కలెక్టర్ వెంట పౌరసరఫరాల శాఖ మేనేజర్ విమల, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కరుణాకర్, ఏఓ రాజవర్దన్రెడ్డి, ఎంపీడీఓ రమణారావు, విద్యాశాఖ ఇంజినీర్ మోహన్రెడ్డి, ఏపీఎం చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్ఓ సంధ్యా కిరణ్మయి అన్నారు. గురువారం ఇటిక్యాల పీహెచ్సీలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. పీహెచ్సీలో కేవలం ఒక కాన్పు మాత్రమే చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓపీ, ప్రసవాల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్ధితులను మినహాయించి సాధారణ కాన్పులు చేయాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం నిర్వహించాలని.. జాతీయ ఆరోగ్య పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చూడాలన్నారు. డీఎంహెచ్ఓ వెంట జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్ శ్యామ్సుందర్ ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని పలు బెస్ట్ అవైలబుల్ స్కీంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 1, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి గల ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కులం, ఆదాయం, బోనఫైడ్ సర్టిఫికెట్లతో జూన్ 6వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 10వ తేదీన లాటరీ విధానంలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థికిప్రతిభా పురస్కారం వనపర్తి రూరల్: చిట్యాల, కడుకుంట్ల ఎంజేపీ బీసీ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థి విలాస్ వార్షిక పరీక్షల్లో 991 మార్కులు సాధించారు. గురువారం హైదరాబాద్లోని సేవాలాల్ బంజారా భవన్లో తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంజేపీ సొసైటీ నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో విలాస్కు రాష్ట్ర ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు ప్రతిభా పురస్కారం, రూ.10 వేలు, జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి, ప్రిన్స్పాల్ గురువయ్యగౌడ్, కళాశాల అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. -
రైస్మిల్లులకు ధాన్యం కేటాయింపులపై కలెక్టర్ నజర్
గద్వాల: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్రమార్కులకు అక్షయపాత్రగా మారింది. అధికారులకు ముడుపులిస్తే చాలు.. నిబంధనలకు పాతరేసి ధాన్యం కేటాయింపులు చేసేస్తున్నారు. దీనిపై పలుమార్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం యాసంగి వరిధాన్యం సేకరణ ప్రక్రియ, మిల్లులకు ధాన్యం కేటాయింపులపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే మిల్లులకు ధాన్యం కేటాయింపుల్లో వ్యత్యాసాన్ని గమనించారు. ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇష్టానుసారంగా ధాన్యాన్ని మిల్లులకు ఎలా కేటాయిస్తారని నిలదీయడంతో పాటు ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్కు సమాధానమిచ్చేందుకు తడబడుతూ.. నీళ్లు నమలడం అధిఽకారుల వంతైంది. జిల్లాలో ధాన్యం కేటాయింపుల వ్యవహారంపై కలెక్టర్ అంతర్గత విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ధాన్యం కేటాయింపులో చోటు చేసుకున్న అవినీతిలో తమ పాత్ర బయటపడుతుందనే గుబులు అధికారుల్లో మొదలైంది. రూ.కోట్ల ధాన్యాన్ని కొట్టేశారు.. మూడేళ్ల క్రితం శాంతినగర్, గద్వాల అయిజ మండలాల పరిధిలోని మిల్లర్లు ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యంలో సుమారు రూ. 50కోట్ల ధాన్యాన్ని విక్రయించుకుని ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఈ అవినీతి వ్యవహారాన్ని ‘సాక్షి’ ఽఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన అధికారులు.. సదరు అవినీతిపరులైన మిల్లర్లపై కేసులు నమోదుచేసి.. ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేశారు. ● గతేడాది కేటీదొడ్డి మండలంలో కమ్మిడిస్వామి రైస్మిల్లుకు సామర్థ్యానికి మించి రూ. కోట్ల విలువైన ధాన్యం కేటాయించారు. అయితే ధాన్యాన్ని అక్రమంగా రాత్రివేళలో విక్రయించేందుకు ప్రయత్నించగా నందిన్నె గ్రామస్తులు పట్టుకున్నారు. దీనిపై రగిలిన సదరు మిల్లు యజమాని, ఆయన కుమారుడు ఏకంగా ఓ వ్యక్తిని సుపారీ గ్యాంగ్తో హత్య చేయించడం సంచలనం రేపింది. సమగ్ర విచారణ.. మిల్లులకు ధాన్యం కేటాయింపులో చోటు చేసుకున్న వ్యత్యాసాలపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమగ్ర విచారణ చేపట్టారు. రెండేళ్లలో మిల్లులకు కేటాయించిన ధాన్యం వివరాలతో పాటు రైస్మిల్లర్లు ప్రభుత్వానికి అందించిన సీఎంఆర్ వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. కొన్ని మిల్లులకు అధిక కేటాయింపులు ఉండటం.. పొరుగు జిల్లాల నుంచి సైతం కేటాయింపులు ఉండటంపై విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాలో మిల్లులకు ధాన్యం కేటాయింపులు అసమగ్రంగా ఉండటంతో వివరాల కోసం అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం ధాన్యం సేకరణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐకేపీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయడం.. షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ధాన్యం కేటాయింపుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు: ఎస్పీ
గద్వాల క్రైం: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం గద్వాల మండలం జమ్మిచెడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్న ధాన్యాన్ని త్వరగా తూకం వేసి.. కేటాయించిన మిల్లులకు తరలించాలని సూచించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను పరిశీలించారు. అనంతరం కొండాపల్లి శివారులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ మొగిలయ్య, ఎస్ఐ శ్రీకాంత్ ఉన్నారు. -
కొనసాగుతున్న పిల్లర్ల పనులు
గద్వాల జిల్లా పరిధిలోని కొత్తపల్లి వైపు ముందుగా పిల్లర్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇదివరకే మూడు పిల్లర్ల పనులు చేపట్టాం. వరద నీరు వచ్చేలోగా కొత్తపల్లి వైపు నిర్మాణాలు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. జూరాల వైపు వరద వచ్చినా పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఏడాదిన్నరలోగా పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ, వనపర్తి ఆనందంగా ఉంది.. గద్వాల మండలం కొత్తపల్లి సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నాం. ప్రస్తుతం మా గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లనాటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి, గద్వాల ● -
ఆది నుంచి అదే తీరు..
సివిల్ సప్లయ్శాఖ అంటేనే జిల్లాలో ఆదినుంచి అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఽమిల్లర్లకు కేటాయింంచినఽ ధాన్యం వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ విచారణ జరిగింది. రెవెన్యూశాఖలో పనిచేసిన జిల్లాస్థాయి అధికారి, సివిల్సప్లయ్శాఖ డీఎస్ఓ, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్, పోలీసుశాఖలోని సీఐ, ఎస్ఐ స్థాయి అధికారుల పాత్ర ఉందని విచారణలో వెలుగుచూడటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా.. అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారిపై బదిలీ వేటు పడింది. మిగిలిన అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. చర్యలు తీసుకుంటాం.. ధాన్యం కేటాయింపు ప్రక్రియ గతంలో కొంత అస్తవ్యస్తంగా ఉంది. ఇటీవలే నేను కొత్త గా వచ్చాను కాబట్టి సమగ్రంగా తెలియ దు. ఇదే అంశంపై కలెక్టర్ సీరియస్గా ఉన్నా రు. మొత్తం వ్యవస్థను గాడినపెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్ర క్రియ సజావుగా జరిగేలా అవసరమైన చర్య లు తీసుకుంటున్నాం. మీరు చెబుతున్నట్లు గతంలో జరిగిన ధాన్యం కేటాయింపులపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు రుజువైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – మధుమోహన్, అదనపు కలెక్టర్ ● -
మెరుగైన విద్య అందించడమే లక్ష్యం
మల్దకల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించి.. వారి ఉజ్వల భవిష్యత్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీఐఈఓ హృదయరాజు అన్నారు. గురువారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీలతరెడ్డి అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ విద్య విద్యార్థులకు ఎంతో కీలకమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువును మధ్యలోనే మాన్పించి పనులకు తీసుకెళ్లొద్దని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మెరుగైన విద్య అందించడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని కోరారు. సమావేశంలో డా.నవీన్కుమార్, సర్పంచ్ చిట్టెమ్మ, పద్మ, అధ్యాపకులు రామాంజనేయులుగౌడ్, భాగ్యలక్ష్మి, రాఘవేంద్ర, రంగస్వామి, నీలవేణి ఉన్నారు. -
‘హైలెవల్’.. ముమ్మరం
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం కాబోతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వంతెన నిర్మాణంతో గద్వాల, ఆత్మకూర్ ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది. జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిలో భారీ పిల్లర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదివరకే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేడాది డిసెంబర్ 1న శంకుస్థాపన చేయగా.. వెంటనే తాత్కాలిక రహదారి నిర్మాణ చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు. వివాదాలు.. అడ్డంకులు... హైలెవల్ వంతెన పనులను ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు భద్రతలో భాగంగా వంతెన నిర్మాణం డ్యాం వద్ద చేపట్టాలని ఎంపీ డీకే అరుణ పట్టుబట్టారు. ఇరిగేషన్శాఖ సమీక్షలో సైతం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డ్యాం వద్దనే వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించడంతో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఎంపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇరిగేషన్ నిధులతో డ్యాం సేఫ్టీ వంతెన నిర్మించాలని, ఆర్అండ్బీ నిధులతో కొత్తపల్లి–జూరాల వంతెన నిర్మించాలని, అభివృద్ధిని అడ్డుకోవడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 18 నెలల్లో పూర్తి... జూరాల, కొత్తపల్లి మధ్యన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించింది. దీంతో ఆర్అండ్బీశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. ముఖ్యమంత్రి పనులను లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరితగతిన పూర్తిచేసే విధంగా కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. మొత్తం 18 పిల్లర్లతో ఏడాదిన్నరలోగా పనులు పూర్తిచేసే విధంగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు పేర్కొంటున్నారు. రూ.123 కోట్లతో వంతెన నిర్మాణం జూరాల– కొత్తపల్లి మధ్య కృష్ణానదిలో కొనసాగుతున్న పిల్లర్ల పనులు తాత్కాలిక రహదారిపై వాహనాల రాకపోకలు గద్వాల, ఆత్మకూర్ మధ్య తగ్గనున్న దూరం -
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి ప్రవేశానికి షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జూన్ 1 నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షలు మించరాదన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఎంపిక జూన్ 1న కలెక్టరేట్లో లక్కీడిప్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 94917 67689, 79814 88878 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్గా చంద్రశేఖర్ అలంపూర్: స్థానిక మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్గా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్గా పనిచేసిన శంకర్ ఇటీవల నారాయణపేట జిల్లాకు బదిలీ కావడంతో అయిజ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో అలంపూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. తిరిగి ఇదే మున్సిపాలిటీకి ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. ఐకేపీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు గద్వాల: మండలంలోని తెలుగోనిపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణను పట్టించుకోని ఐకేపీ ఉద్యోగులపై కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ సస్పెన్షన్ వేటు వేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగోనిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కేంద్రం నిర్వహణలో లోపాలను గుర్తించారు. దీంతో వీఏఓ అలివేలు, సీపీ రంగన్నలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని.. కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జూన్ 2 నాటికి పీఆర్సీ అమలుచేయాలి గద్వాలన్యూటౌన్: ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని జూన్ 2వ తేదీ నాటికి అమలుచేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు హెల్త్కార్డులు జూన్1 నాటికి పంపిణీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ. 6వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని.. ఈ మేరకు జీపీఎఫ్, లీవ్ ఎనాన్స్మెంట్, గ్రాట్యూటీలో విశ్రాంత ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం టోకెన్ ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయనను పలువురు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, అసోసియేట్ అధ్యక్షుడు బాలకిషన్రావు, బీసీరెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,511 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 42 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,511, కనిష్టంగా రూ. 6,066, సరాసరి రూ. 6,699 ధరలు లభించాయి. 52 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,049, కనిష్టంగా రూ. 3,119, సరాసరి రూ. 5,949 ధరలు పలికాయి. 566 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,339, కనిష్టంగా రూ. 1,651, సరాసరి రూ. 2,189 ధరలు లభించాయి. -
సకాలంలో వంతెన నిర్మాణం పూర్తి
ఆత్మకూర్: జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు సకాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక నాయకులతో వంతెన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందని, వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల–ఆత్మకూర్ మధ్య రాకపోకలకు సమయంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. వర్షాకాలంలోగా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఏడాదిలోగా వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచి వయా ఆత్మకూర్, గద్వాల, రాయచూరు మీదుగా మంత్రాలయం వెళ్లే వారికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, జిల్లా కార్యదర్శి తులసీరాజ్ యాదవ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, పార్టీ నాయకులు ఉన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ధరూరు/మల్దకల్: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం ధరూరు మండలం మార్లబీడు, మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డి, మద్దెలబండ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి.. లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి సొంతిల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, జంబు రామన్గౌడు, రాజారెడ్డి, విజయ్, సత్యారెడ్డి, సురేందర్రెడ్డి, పెద్దవీరన్న, నారాయణ, రామాంజనేయులు, వెంకటన్న, రంగన్న, శేఖర్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం
● రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గద్వాల మండలం తెలుగోనిపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ఇన్చార్జి గైర్హాజరు కావడం.. మహిళా సంఘాల సభ్యులు లేకపోవడం.. రైతులు ఎండలో గంటల తరబడి వేచి ఉండటాన్ని గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘాల స్థానంలో ఇతరులు వ్యవహారాలు నిర్వహించడాన్ని గమనించి తీవ్రంగా మందలించారు. మహిళా సంఘాల సభ్యులే కొనుగోలు కేంద్రం నిర్వహించాలని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని.. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద ట్యాబ్ ఎంట్రీలు, రిజిస్టర్ల నిర్వహణ లేకపోవడం, మిల్లులను కేటాయించకపోవడం వంటి సమస్యలతో ఓపీఎంఎస్లో తీవ్ర జాప్యం జరిగి, రైతులకు సకాలంలో డబ్బులు రావడం లేదన్నారు. కొన్ని మిల్లులకే అధిక కేటాయింపులు చేసి, మిగిలిన మిల్లులకు సరైన కేటాయింపులు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నప్పటికీ లోపాలను అధిగమించకపోతే ఎలా ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలోనూ అవకతవకలకు చోటు లేకుండా పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎస్డీసీ కృష్ణ, సివిల్ సప్లయ్ డీఎం స్వామికుమార్, మేనేజర్ విమల, డీఏఓ వీరప్ప ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో ఒకరోజు వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఎవరైనా బాల్యవివాహాలకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవనే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతులు చేయడమే కాకుండా మన ఊరు–మన బడిలో మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మెరుగైన పనితీరు కనబరిచే సర్పంచులకు ప్రతి మండలం నుంచి ఐదుగురు చొప్పున ఆగస్టు 15న అవార్డులు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో టాపర్స్గా నిలిచిన వివిధ పాఠశాలల విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, ఇన్చార్జి డీవైఎస్ఓ రామలింగేశ్వర్గౌడ్, డీపీఓ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పైసలిస్తేనే పని..
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ డబ్బులిస్తేనే పనులు ● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న వైనం ● ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు చిక్కిన వైనం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అవినీతిపై ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే దాడులు చేపడుతున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి. టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. – సీహెచ్ బాలకృష్ణ, డీఎస్పీ, ఏసీబీ, మహబూబ్నగర్ ●సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. చేయి తడిపితేనే పని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏసీబీ వలలో చిక్కి రెడ్హ్యాండెడ్గా పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 మంది పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో నాలుగు నెలల్లోనే ఇప్పటివరకు ఐదుగురు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ శాఖల్లో అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి మార్చి 20న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ ఇసుక ట్రాక్టర్కు మైనింగ్ అధికారులు రూ.60 వేలు ఫైన్ వేశారు. ట్రాక్టర్ను స్టేషన్ నుంచి విడిపించేందుకు ఎస్ఐ రూ.30 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు దాడి చేయగా ఎస్ఐ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అవినీతి అధికారి ఏసీబీకి చిక్కడంతో గ్రామస్తులు రోడ్డుపై టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ అధికారులకు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం కలిగించింది. బర్త్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏప్రిల్ 21న నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదుగురు వ్యక్తులకు చెందిన బర్త్ సర్టిఫికెట్లు జారీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ జారీకి సైతం లంచం తీసుకుంటూ ఏకంగా ఆర్డీఓ అధికారే పట్టుబడటం ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకుని ఉన్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది. -
ఇరవై రోజులుగా మంచి ధరలు..
బత్తాయి రైతులు మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు పొందలేదు. ఈఏడాదిలో మాత్రం వస్తున్న ధరలతో ఊరట చెందుతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి రైతులు కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏప్రిల్ మొదటి వారంలో టన్నుకు రూ. 18వేల నుంచి రూ. 20వేల ధర రాగా.. రెండో వారం నుంచి కాస్త పెరిగి, రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు ధర వచ్చింది. మూడు, నాలుగో వారంలో మరింత పెరిగాయి. ఆ తర్వాత రూ. 25వేల నుంచి రూ. 35వేల వరకు చేరింది. ఈ నెలలో మార్కెట్లో మరోసారి ధరలు పెరిగాయి. ఈ నెలలో కాయసైజు, నాణ్యత బాగా ఉంటే టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 55వేల వరకు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ధరలు బత్తాయి రైతుకు ఊరటనిస్తున్నాయి. టన్నుకు కనీసం రూ. 30వేల నుంచి రూ. 35వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. ఇదిలా ఉంటే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున బత్తాయికి డిమాండ్ పెరిగి.. మంచి ధరలు వస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● లాభదాయక పంటల సాగుపైఅవగాహన కల్పించాలి ● కేంద్ర వ్యవసాయశాఖ నోడల్ అధికారి రఘు గద్వాల/ఎర్రవల్లి: ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంతో రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు అభివృద్ధి సాధించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర వ్యవసాయశాఖ (పీఎంఓ) నోడల్ అధికారి రఘు అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన కేవలం గణాంకాలు, లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా.. రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు, పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, నేల ఆరోగ్య సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్పామ్, పప్పుధాన్యాలు, ఉద్యాన, అంతర పంటల సాగువైపు దృష్టిసారించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, సహకార వ్యవస్థ ద్వారా మరింత రుణసౌకర్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, మొక్కలు, ఎరువులు, సూక్ష్మ నీటిపారుదల సదుపాయాలు, రుణాలు, సాంకేతిక సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ● ఎర్రవల్లి మండలం తిమ్మాపురం, కొండేరు, జింకలపల్లి గ్రామాల్లో కేంద్ర నోడల్ అధికారి రఘు పర్యటించి.. రైతుల చేపల చెరువులను పరిశీలించారు. బీచుపల్లిలో తెలంగాణ ఆయిల్పామ్ నర్సరీని సందర్శించి, జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం, రైతులకు లభిస్తున్న ఆదాయం వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా కొండేరు శివారులో సాగుచేసిన కూరగాయల తోటలను ఆయన పరిశీలించి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అమలవుతున్న పథకాలు, రుణ సదుపాయాలు, ఈ ప్రాంత మౌలిక వసతులు, తదితర విషయాలపై రైతులతో ఆరా తీశారు. కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. వైవిధ్యమైన పంటల సాగుతో రైతులు మెరుగైన ఆదాయం సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని అమలు చేస్తోందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీకాంత్, డీఏఓ వీరప్ప, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్, ఆయిల్ఫెడ్ ఏడీఏ శివనాగిరెడ్డి, డివిజినల్ ఉద్యానశాఖ అధికారులు రాజశేఖర్, ఇమ్రానా, ముసాయిదాబేగం, ఏఓ సురేశ్గౌడ్, ఏఈఓలు నరేశ్, ప్రవళిక, సర్పంచ్ పెద్ద మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
కదిలిన యంత్రాంగం..
రాజోళి: ‘‘రైతుల కడుపుకొట్టి వ్యాపారుల కడుపు నింపుతారా..? రైతు పేరుతో వచ్చి రైతుల నోటికాడి కూడు నేల పడేస్తారా.?’’ ఇవి సాక్ష్యాత్తు వ్యవసాయశాఖ, డీసీఎస్ కార్యాలయ అధికారుల మాటలు. ‘వ్యాపారులకే మద్దతు’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు కదిలారు. మంగళవారం శాంతినగర్ పీఏసీఎస్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారి రాధ, డీసీఎస్ కార్యాలయ ఆడిటర్ విశ్వకర్మ ఆచారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి రైతులకు వ్యవసాయశాఖ నుంచి జారీ చేసిన టోకెన్లు.. పీఏసీఎస్ నుంచి అందిన లోడింగ్ అనుమతులను పరిశీలించారు. రికార్డుల్లో చేర్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆన్లైన్లో పంటల నమోదును పరిశీలించారు. రాత్రి సమయంలో ముద్రలు వేసి, బస్తాలను అన్లోడు చేసిన రామాపురం గ్రామవాసులను వారు విచారించారు. తాము హైదరాబాద్లో ఉంటామని.. అందుకే ధాన్యం అమ్ముకోలేదని వారు తెలియజేశారు. అయినప్పటికీ రాత్రివేళ నిండు బస్తాలకు ముద్రలు వేయడం ఏంటని అధికారులు ఆరా తీశారు. అక్కడి నుంచి వారు చెబుతున్న పొలం వద్ద వెళ్లి, అక్కడ మొక్కజొన్న సాగు చేశారా? లేదా అనే విషయంపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఇంకా ఎవరైనా అక్రమంగా మొక్కజొన్నల వ్యాపారం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై విచారణ మొదలైందని.. నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారుల విచారణ ముగిసే వరకు మొక్కజొన్న లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అక్రమ దందా ఇలా.. కర్నూలు జిల్లా సుంకేసులకు చెందిన ఓ వ్యాపారి శాంతినగర్కు చెందిన కొందరితో సత్సంబంధాలు సాగిస్తున్నాడు. ఇదే అదునుగా ఏపీలో సేకరించిన మొక్కజొన్నలను శాంతినగర్కు పంపించగా.. ఇక్కడ వారు ఓ ధరకు కొనుగోలు చేయడం.. పట్టాదారు పాస్పుస్తకాల ఆధారంగా ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తూ వస్తున్నారు. కాగా, ఈ వ్యాపారంలో సహకరిస్తున్న కూలీలను ‘సాక్షి’ సంప్రదించగా.. సుంకేసులకు చెందిన ఒకరి పేరు, రామాపురం, శాంతిగనర్కు చెందిన కొందరి పేర్లను తెలిపారు. వారితో ‘సాక్షి’ మాట్లాడే ప్రయత్నం చేయగా.. సుంకేసులకు చెందిన వ్యాపారి శాంతినగర్కు చెందిన ఒక వ్యక్తితో డబ్బుల పని ఉండి వచ్చానని చెప్పాడు. ఆయన చెప్పిన వ్యక్తితో మాట్లాడగా.. సుంకేసులకు చెందిన వ్యాపారితో మొక్కజొన్నల వ్యాపారం చేస్తున్నానని.. కొనుగోలు కేంద్రాలు మొదలైనప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నామని.. లాభం వస్తే ఎక్కడైనా అమ్ముకుంటామని దర్జాగా చెప్పడం గమనార్హం. ఇలా దర్జాగా తమ వ్యాపారం చేసుకుంటున్నారంటే, వారి వెనక ఉన్న అధికారులు వారికి ఎంత అభయం ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా రాజకీయ నాయకులు ఎవరూ నోరు మెదపడం లేదనే వాదన ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. మొత్తానికి ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు.. బాధ్యులపై ఏ చర్యలు చేపడతారనే దానిపై వేచి చూడాలి. మొక్కజొన్న దందాపై విచారణ పీఏసీఎస్ రికార్డుల నుంచి రైతుల పొలందాక పరిశీలన లెక్క తేలే వరకు కదలని మొక్కజొన్న లారీలు సుంకేసులకు చెందిన వ్యాపారే కీలక సూత్రధారి? -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా: ఎస్పీ
అలంపూర్: ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై పోలీసు సిబ్బంది పటిష్ట నిఘా ఉంచాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన సరిహద్దు చెక్పోస్టుతో పాటు ఎర్రవల్లి చెక్పోస్టును సోమవారం అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. వాహనాల పత్రాలు, పశువుల రవాణాకు సంబంధించిన అనుమతులు, డ్రైవర్ల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాను నియంత్రించడానికి జిల్లా సరిహద్దుల్లోని బల్గేర, నందిన్నె, ఇర్కిచేడు, సుంకేసుల డ్యామ్, భైరాపురం, పుల్లూరు టోల్ప్లాజా, ఎర్రవల్లి చౌరస్తా వద్ద చెక్పోస్టులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎవరైనా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పశువుల రవాణాకు సంబంధించి తప్పనిసరిగా అనుమతి పత్రాలు, కొనుగోలు రశీదులు, వెటర్నరీ ధ్రువపత్రాలు ఉండాలని సూచించారు. రవాణాలో పశువులపై క్రూరత్వం ప్రదర్శించినా, నిబంధనలకు విరుద్ధంగా తరలించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జంతు సంరక్షణ చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవడం.. గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చెక్పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణను పకడ్బందీగా కొనసాగించాలని ఎస్పీ అదేశించారు. ఆయన వెంట డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్, ఎస్ఐ శేఖర్ ఉన్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో రాణించాలి
గద్వాలన్యూటౌన్/మల్దకల్: జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. ఈ నెల 10న హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో అండర్–18 విభాగంలో జిల్లా క్రీడాకారులు దినేష్, రాహుల్ అత్యుత్తమ ప్రతిభకనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. అదే విధంగా మల్దకల్ మండలకేంద్రంలో జములమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. స్థానిక గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీసన్న, ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, సంయుక్త కార్యదర్శి నాగేష్, కార్యదర్శి సతీష్కుమార్, సర్పంచ్ చిట్టెమ్మ, శ్రీధర్గౌడ్, రాజారెడ్డి, విక్రమ్సింహారెడ్డి, ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు పాల్గొన్నారు. -
బీచుపల్లిలో మార్మోగిన అంజన్న నామస్మరణ
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలో మంగళవారం అంజన్న నామస్మరణ మార్మోగింది. హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,299 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 15 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,299, కనిష్టంగా రూ. 7,071 ధర పలికింది. అదే విధంగా 70 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,429, సరాసరి రూ. 5,879 ధరలు లభించాయి. 976 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,294, కనిష్టంగా రూ. 1,889, సరాసరి రూ. 2,001 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,421, కనిష్టంగా రూ. 6,389 ధర పలికింది. స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా హౌస్ వైరింగ్, బైక్ మెకానిక్ రంగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 99633 69361, 98481 42489లను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం జడ్చర్ల: జడ్చర్లలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థలో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, హోం అప్లియెన్సెస్ కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సెట్విన్ కోఆర్డినేటర్ విజయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18– 35 ఏళ్లలోపు మైనార్టీ ముస్లిం యువతీ, యువకులు మాత్రమే ఆధార్, 10వ తరగతి సర్టిఫికెట్, రెండు ఫొటోలతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.94415 65895ను సంప్రదించాలని పేర్కొన్నారు. అధిక మోతాదులో యూరియా వాడొద్దు వనపర్తి రూరల్: అధిక మోతాదులో యూరియా వినియోగించడంతో నేల సారం తగ్గడంతో పాటు పంటల నాణ్యత దెబ్బతింటుందని ఆగ్రోనామి శాస్త్రవేత డా. నవత అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లి రైతువేదికలో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆమె హాజరై రసాయన ఎరువులపై రైతులకు అవగాహన కల్పించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ఉత్తమమని సూచించారు. ఎరువులు, పురుగు మందులు సరైన మోతాదులో, సరైన సమయంలో వాడాలని, ఇది పంటల నాణ్యతను పెంచడంతో పాటు సాగు ఖర్చు తగ్గిస్తుందన్నారు. ఏఓ షేక్ మున్నా మాట్లాడుతూ.. వివిధ రకాల పంటలు సాగు చేయడంతో రైతులకు ఆదాయం స్థిరంగా ఉంటుందని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలను ఎంపిక చేసుకోవడంతో మెరుగైన ధర వస్తుందని తెలిపారు. భూ సారం పెంపొందించేందుకు జీలుగ, జనుము సాగుచేసి పూత దశలో భూమిలో కలియ దున్నాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ రజిత, రైతులు రామచంద్రారెడ్డి, జగదీశ్వర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం సేకరణ
ఎర్రవల్లి: వరిధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండలం తిమ్మాపురంలోని ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. ధాన్యంలో తేమశాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్ఫాలిన్లు, గన్నీబ్యాగులపై ఆరా తీశారు. నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా వివరాలను తెలుసుకున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఐకేపీ డీపీఎం విమల, ఏఈఓ నరేశ్ ఉన్నారు. -
మంచి ధర వచ్చింది..
నాకు రెండున్నర ఎకరాల బత్తాయి తోట ఉంది. అధిక ఉష్ణోగ్రతలతో కాయ పెద్దగా ఊరలేదు. కొద్ది రోజుల క్రితం కాయలు విక్రయించాను. టన్నుకు రూ. 35వేల వరకు ధర వచ్చింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి ధరలు బాగా వస్తున్నాయి. – మనోహర్రెడ్డి, రైతు, షాబాద్, ఇటిక్యాల మండలం మార్కెట్లో డిమాండ్.. జిల్లాలో కొన్ని చోట్ల మినహాయిస్తే, చాలా చోట్ల బత్తాయి దిగుబడులు బాగా వచ్చాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి మార్కెట్లో మంచి ధరలు వస్తున్నాయి. ఈ నెలలో బత్తాయికి డిమాండ్ బాగా పెరగడం వల్ల ధరలు ఎక్కువగా వస్తున్నాయి. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
మండలాల వారీగా బత్తాయి సాగు ఇలా (ఎకరాల్లో)..
మూడేళ్ల తర్వాత మార్కెట్లో మంచి ధరలు ● అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన డిమాండ్ ● ఈసారి దిగుబడులు తగ్గినా రైతులకు ఊరట ● జిల్లావ్యాప్తంగా 8,481 ఎకరాల్లో బత్తాయి సాగుమల్దకల్ 3,276 అయిజ 608ధరూరు 1,364గద్వాల 798గట్టు 1,557 ఇటిక్యాల 262కేటీదొడ్డి 308రాజోళి 121వడ్డేపల్లి 68ఎర్రవల్లి 93అలంపూర్ 10మానవపాడు 3ఉండవల్లి 13గద్వాల వ్యవసాయం: బత్తాయి తోటల రైతులకు ఈసారి కాస్త కలిసొచ్చింది. జిల్లాలో కొంత వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గినా.. కొన్ని రోజులుగా వస్తున్న ధరలు ఊరటనిస్తున్నాయి. మూడేళ్లుగా బత్తాయి పండ్లకు పెద్దగా ధరలు రాలేదు. దీంతో కొంత నిరాశ నిస్పృహాల్లో ఉన్న రైతులకు ఇరవై రోజులుగా మంచి ధరలు వస్తుండటంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో ఇలా.. పండ్లతోటల సాగుకు నడిగడ్డలో నేలలు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు కూడా సాధారణంగా బాగుంటాయి. ఇక్కడి రైతులు 15ఏళ్లుగా బోర్లు, బావుల కింద పండ్లతోటలు సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 8,481 ఎకరాల్లో బత్తాయి తోటలు వేశారు. అందులో ఎక్కువగా జంబేరీ, రంగాపూర్ రకాలను సాగుచేశారు. ఈ తోటల సాగు కోసం ఎకరాకు రూ. 18వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు అవుతుంది. ఏటా రెండుసార్లు కాపు వస్తుంది. ఏప్రిల్, మే నెలలో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్లో రెండోసారి కాపు వస్తుంది. వాతావరణ పరిస్థితులు మంచిగా అనుకూలిస్తే, ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే మిగిలిన పండ్ల తోటలతో పోల్చితే బత్తాయి తోటలకు పెట్టుబడులు ఎక్కువే. అదే సమయంలో నిర్వహణ కూడా ఎక్కువగానే ఉంటుంది. -
వ్యాపారులకే మద్దతు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారుల అజమాయిషీ రాజోళి: ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి.. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. అయితే కొందరు అవినీతి అధికారుల మూలంగా ఆ ప్రయోజనాలు రైతులకు చెందకుండా.. వ్యాపారులకు ‘మద్దతు’ దక్కుతుందనే వాదనలు వెల్లువెత్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు రైతుల కోసం పెట్టినప్పటికీ.. అక్కడ నడిచే పెత్తనం అంతా ప్రైవేట్ వ్యాపారులదే కావడంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీ నుంచి వస్తున్న వ్యాపారస్తులే తమ ధాన్యాన్ని యథేచ్ఛగా అమ్ముకొని.. ప్రభుత్వ మద్దతు ధర పొందుతున్నారని, ఇక్కడి రైతులు మాత్రం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి దాపురిస్తోంది. అధికారికంగా అక్రమ లోడింగ్.. ఏపీ నుంచి మొక్కజొన్న ధాన్యం తీసుకువచ్చి శాంతిగనర్, మాన్దొడ్డి తదితర ప్రాంతాల్లో వారికి అనుకూలంగా ఉన్న కేంద్రాల్లోకి ధాన్యం తీసుకువస్తున్నారు. ఇలా తీసుకువచ్చేందుకు స్థానికంగా ఉన్న ఏజెంట్లు సహకరిస్తున్నారు. ఏజెంట్లు తమ పాసు పుస్తకాలతోపాటు తమకు తెలిసిన వారి పాసు పుస్తకాల పేరిట పీఏసీఎస్ల నుంచి టోకెన్లు తీసుకుంటున్నారు. వీటిని ఆసరాగా చేసుకుని ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలోని సుంకేసుల, కొత్తకోట తదిదర గ్రామాల నుంచి వ్యాపారుల ధాన్యాన్ని ఇక్కడికి తరలిస్తున్నారు. ఎవరైనా వాహనాలు ఆపుతారనే నెపంతో, దీని కోసం ప్రత్యేకంగా రైతులను తీసుకెళ్లి వారి పాసు పుస్తకాలను చూపుతూ వాహనాలను కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక్కడి అమా యక రైతులు మాత్రం తమ ధాన్యం సేకరించే వంతు ఇంకా రాలేదని, అక్కడే పడిగాపులు కాస్తున్నారు. తమ వెనుక వచ్చిన ధాన్యం కూడా లోడ్ అవుతుందని, తమకు మాత్రం ఇంకా టోకెన్ నంబర్ రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొత్త దారుల్లో రవాణా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సందర్భంలో ఏఎస్పీ శంకర్ చెక్పోస్టులను పరిశీలించి నిఘా పటిష్టం చేయాలని ఆదేశించారు. దీంతో అక్రమ వ్యాపారులకు తమ రవాణా ఆగుతుందని కొత్తదారులు వెతికారు. అలంపూర్ నియోజకవర్గంలో కొత్తగా వేస్తున్న ఆరు లైన్ల జాతీయ రహదారిపై దందా సాగిస్తున్నారు. ఇప్పటికే ఆ రహదారి పనులు దాదాపు పూర్తికావడంతోపాటు కొన్ని చోట్ల సర్వీస్ రోడ్డు, రైతుల పంటలకు వెళ్లేందుకు వేసిన రోడ్లు ఉండటంతో వాటిని ఆసరాగా చేసుకుని లారీలు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో ధాన్యం తీసుకువచ్చి జిల్లాలోని వివిధ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సైతం ఏపీ నుంచి తెచ్చిన ధాన్యాన్ని శాంతిగనర్ కొనుగోలు కేంద్రంలో అన్లోడ్ చేశారు. కానీ, లోడ్ ఎక్కడి నుంచి వస్తుందనే పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులే బాగుపడుతున్నారని, రైతులు నష్టపోతున్నారని, ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరినీ వదిలిపెట్టం.. అక్రమంగా వ్యాపారులు తీసుకువచ్చే ధాన్యం అమ్మి, రైతులను నష్టపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. టోకెన్ నంబర్లు కూడా మారుస్తున్నారని తెలుస్తుంది. దానిపై మాకు స్పష్టత రాగానే మా సిబ్బంది అని కూడా చూడకుండా ఎవరినీ వదిలిపెట్టం. శాంతిగనర్లో ఏపీ నుంచి ధాన్యం తెస్తున్న వ్యాపారులతో సిబ్బంది సంబంధాలపై ఆరా తీస్తున్నాం. – శ్రీనివాస్, డీసీఎస్, గద్వాల రాత్రి, పగలు తేడా లేకుండా లోడింగ్, అన్లోడింగ్ చెక్పోస్టుల కన్నుగప్పి కొత్తదారుల్లో ధాన్యం తరలింపు వరి, మొక్కజొన్న కొనుగోలులో చేతులు మారుతున్న కమీషన్లు స్థానిక రైతులకు మాత్రం తప్పని పడిగాపులు -
ధాన్యం బస్తాలను తక్షణమే తరలించాలి
అలంపూర్: కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న ధాన్యం బస్తాలను తక్షణమే తరలించాలని ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాల ముప్పు ఉందని తెలిసాన కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో రైతులు తెచ్చిన ధాన్యం తూకాలు వేసి కొనుగోళ్లు చేయడం లేదన్నారు. కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను తరలించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సీఎం రేవంత్రెడ్డి తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనీసం రైతుల బాధలు పట్టించుకోని దుస్థితి ఉందన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం కేంద్రాల్లోని ధాన్యం తరలించాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గజేందర్రెడ్డి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాకారం
ధరూరు: గ్రామీణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని లక్ష్మీనాగరాజు నూతన ఇందిరమ్మ ఇంటిని ఆయన సర్పంచు విజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ అనేవి కీలకమైనవన్నారు. దశాబ్దాల తరబడి సొంతిళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో శుభ పరిణామమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు చేయగా.. ఇప్పటికే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో జాబితా వస్తుందని, ఇందులో ఇళ్లు వచ్చిన వారు కూడా ఇల్లు త్వరగా నిర్మించుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, సర్పంచు విజయ్కుమార్, మాజీ సర్పంచు శ్రీనివాస్రెడ్డి, నాయకులు సంజీవ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మబంధువులు
● నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం ● ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో కీలక విధుల నిర్వహణ ఆస్పత్రుల్లో అభాగ్యులకు అండగా నిలుస్తున్న నర్సులు ● పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్లో 59, సెకండియర్లో 58, థర్డ్ ఇయర్లో 57, ఫోర్త్ ఇయర్లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్ఎమ్లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్హెచ్ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. ● నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం
గద్వాల: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యా వారోత్సవాలను కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులతోపాటు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ● జనగణన–2027లో భాగంగా గద్వాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఇళ్ల నమోదు (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఎన్యూమరేటర్ తమకు కేటాయించిన సరిహద్దులోని ఇళ్లను కవర్ చేస్తూ మూడు రోజుల్లో మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్లో ఇంటి నంబర్లు స్పష్టంగా నమోదు చేయాలని రోజుకు కనీసం 20 ఇళ్లను సందర్శించాలని చెప్పారు. ● ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా మండల స్ధాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్బాష షేక్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్తో కలిసి మొత్తం 69 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అర్జీలు స్వీకరించిన ఎస్పీ గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 13 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వారి సమస్యలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే సివిల్ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సకాలంలో ధాన్యం డబ్బుల చెల్లింపు చేపట్టాలి ఎర్రవల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లింపులు చేయాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి స్వామికుమార్ అన్నారు. సోమవారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంత మంది రైతులతో ఎంత ధాన్యం సేకరించారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని చూసి సెంటర్లో తేమ శాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్పాలిన్లు, గన్నీ సంచుల వివరాలపై ఆరాతీశారు. రైతుల సాగు ధ్రువీకరణకు సంబంధించి కేంద్రం పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇచ్చే టోకెన్లు పరిశీలించారు. నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేశాక వివరాలను యాప్లో ఎప్పటికప్పుడూ నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఐకేపీ డీపీఎం విమల, తహసీల్దార్ నరేష్, ఏఈఓ నరేష్ తదితరులున్నారు. విద్యతోపాటు నైపుణ్యాలు పెంచుకోవాలి గద్వాల న్యూటౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు చదువుతోపాటు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని ప్రిన్సిపాల్ మీనాక్షి అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం స్థానిక ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్య వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ ట్రైనింగ్, నైపుణ్యాభివృద్ధిపై మ్యాజిక్ ఫౌండేషన్తో కళాశాల ఎంఓయూ కుదుర్చుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మ్యాజిక్ ఫౌండేషన్తో కుదిరిన ఒప్పందం ద్వారా విద్యార్థినులకు ప్రత్యేక జాబ్ శిక్షణ, నైపుణ్యాభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మ్యాజిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ఆఫీసర్ ఎండీ ఫయాజ్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్, అధ్యాపకులు సురేష్బాబు, దేవుజా, జగన్మోహన్, సమత పాల్గొన్నారు. -
ఒక ప్రమాదం.. 2 కుటుంబాల్లో విషాదం
మహబూబ్నగర్ క్రైం: పాలకొండ బైపాస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్ రైడర్ అతివేగంతో నగరంలోని రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. న్యూ ప్రేమ్నగర్కు చెందిన మహ్మద్ బాసిద్ భార్య సారాబేగం ఇద్దరు పిల్లలతోపాటు రబియా మజీద్ ఏరియాకు చెందిన సారాబేగం తల్లి గౌసి యాబేగం ఆమె కోడలు రేష్మా ఖాతూమ్, ఇద్దరు మనవలతో కలిసి యూబీ గార్డెన్లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ రెండు కుటుంబాలు శుభకార్యం పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్ర మంలో బైకర్ రూపంలో వచ్చిన ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ప్రేమ్నగర్తో పాటు రబియా మజీద్ ఏరియా (మర్లు)లో విషాదచాయలు అలుముకున్నాయి. అటు మహ్మద్ బాసిద్ కుటుంబంలో బాసిత్తో పాటు అతని ఏడేళ్ల కొడుకు మహ్మద్ జైద్ గాయపడ్డారు. భార్య సారా బేగం(30), కొడుకు హుజేఫా(9) మృతి చెందారు. ఇటు గౌషియా బేగం, ఆమె కొడలు రేష్మా ఖాతూ మ్, నాలుగేళ్ల మనవడు మహ్మద్ జమాద్ద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. మరో రెండేళ్ల మనవడు మహ్మద్ హమ్మర్ మృతి చెందాడు. ఇటీవల దుబాయ్ వెళ్లిన హమ్మర్ తండ్రి మహ్మద్ ఇమ్రాన్ వెంటనే ఇండియాకు బయల్దేరాడు. ప్రమాద విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు సోమవారం జనరల్ ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. ఇద్దరూ స్నేహితులే.. ఈ ఘటనలో మృతి చెందిన బైకర్లు హైదరాబాద్లోని చార్మినార్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఒవైజ్(30), మెహదీపట్నంకు చెందిన ఎండీ యాకూబ్ అబ్జల్(26) ఇద్దరూ స్నేహితులే. ఆదివారం రాత్రి మహబూబ్నగర్లోని మెట్రో ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి మరికొంతమంది స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి స్పోర్ట్స్ బైక్లపై మహబూబ్నగర్కు వచ్చారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుంటే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బైక్ రిజిస్ట్రేషన్ మాత్రం హర్యాన పాసింగ్ ఉండటం విశేషం. వీరితో పాటు వచ్చిన ఇతర బైకర్లు ఎవరు? ప్రమాదం జరిగిన తర్వాత వారు ఎటూ వెళ్లారు అనేది మహబూబ్నగర్ పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మృతదేహలను జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగిన తీరుతో పాటు ఇతర అంశాలను అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీసీఎస్ సీఐ కృష్ణ, రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ పర్యవేక్షించి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పాలమూరు బైపాస్పై ప్రమాదం..ఐదుగురి దుర్మరణం మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ప్రేమ్నగర్, రబియా మజీద్ ఏరియాలో విషాదం -
మక్క రైతుల అరిగోస
అయిజ: రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరపున అయిజలో కొనుగోలు కేంద్రం గతనెల 9న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెలరోజులు గడిచినా ఇప్పటి వరకు రైతులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ముందుగా గన్నీ బ్యాగుల కొరత ఏర్పడటంతో రైతులే గన్నీ బ్యాగులను తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పడు హమాలీల కొరత మరో సమస్యగా మారింది. దీంతో మొ క్కజొన్న కొనుగోలు కేంద్రంకు తరలించి 15 రోజు లు గడిచినా కాంటా వేసిన మొక్కజొన్న బస్తాలను ఇప్పటి వరకు గోదాంకు తరలించకపోవడంతో రైతు లు బస్తాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు అయిజ– గద్వాల రోడ్డుపై ధర్నా చేసినా వారిలో చలనం రావడం లేదు. రైతులే తెచ్చుకోవాలి.. రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రైతులే గన్నీ బ్యాగులను తెచ్చుకోవాలని మార్క్ఫెడ్ అధికారులు సూచించారు. అప్పటి నుంచి రైతులు సొంత డబ్బుతో గన్నీ బ్యాగులను ఒక్కొక్కటి రూ.25 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చేది మాత్రం ఒక్కొక్క బ్యాగ్కు రూ.15 మాత్రమే. ఈ లెక్కన ఒక్కొక్క బ్యాగుపై రైతు రూ.10 చొప్పున నష్టపోతున్నాడు. హమాలీల కొరుత... ప్రతిరోజు కొనుగోలు కేంద్రానికి వందల క్వింటాళ్ల మొక్కజొన్న బస్తాలను రైతులు తరలిస్తున్నారు. అయితే హమాలీల కొరత వలన వచ్చిన దాంట్లో సగం కూడా గోదాంలకు తరలించడం లేదు. బస్తాల్లో నింపి, కాంటా వేసి, లోడింగ్ చేసేందుకు రైతు హమాలీలకు 50 కిలోల బస్తాకు రూ.30 చొప్పున చెల్లిస్తున్నాడు. అయితే గోదాంల వద్ద అన్లోడ్ చేసేందుకు ప్రభుత్వం ఒక్కొక్క బస్తాకు రూ.6.50 మాత్రమే చెల్లిస్తుండడంతో హమాలీలు బస్తాలను అన్లోడ్ చేయడానికి విముఖత చూపుతున్నారు. దీంతో ట్రాన్స్పోర్ట్ లారీలు గోదాంల వద్ద రెండు మూడు రోజులు ఆగాల్సి వస్తోంది. ఫలితంగా కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న సంచులు ఎక్కువగా నిల్వ ఉంటున్నాయి. రోడ్డెక్కి ఆందోళనలు.. మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర రూ.2,400 ప్రకటించగా బయటి మార్కెట్లో కేవలం రూ.1,700 మాత్రమే పలుకుతోంది. ఒక్కొక్క క్వింటాకు రూ.7,00 ధర వ్యత్యాసం ఉండడంతో రైతులందరూ కొనుగోలు కేంద్రానికే మొక్కజొన్న తరలిస్తున్నారు. మొక్కజొన్న బస్తాలు కొనుగోలు కేంద్రంకు రావడం ఎక్కువ, గోదాంలకు వెళ్లడం తక్కువ కావడం వలన బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. నెలరోజులైనా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డుపై ధర్నా చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూడెకరాలు మొక్కజొన్న సాగుచేశాను. 122 క్వింటాళ్ల దిగుబడి రాగా.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 23 రోజులవుతుంది. తోటి రైతులు కొనుగోలు కేంద్రంకు మొక్కజొన్న తెచ్చి 20 రోజులవుతున్నా కాంటా పట్టిన బస్తాలను గోదాంలకు తరలించకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలి. – కురువ నీలప్ప, రైతు, అయిజ కొనుగోలు కేంద్రంకు మొక్కజొన్నను తరలించి 20 రోజులవుతోంది. ఆరు ఎకరాలు మొక్కజొన్న పంటను సాగు చేస్తే మొత్తం 150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కాంటా వేశారు కానీ గోదాంకు తరలించలేదు. అన్ని పనులు మానుకొని మొక్కజొన్న బస్తాల వద్ద ప్రతిరోజు పడిగాపులు కాయాల్సి వస్తోంది. – చాకలి శ్రీను, రైతు, వెంకటాపురం మొక్కజొన్న పంటను మూడెకరాల్లో సాగు చేశాను. 105 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు కేంద్రంకు తీసుకొచ్చి 20 రోజులయ్యింది. గోనె సంచులను మేమే తెచ్చుకున్నాం. లోడింగ్ హమాలీ కూడా మేమే ఇస్తున్నాం. అయినా వెంట వెంటనే గోదాంలకు మొక్కజొన్న బస్తాలను తరలించడం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలి. – రియాజ్, రైతు, వేణిసోంపురం అన్లోడ్ చేసేందుకు హమాలీల కొరత ఎక్కువగా ఉంది. దీని వలన గోదాంల వద్ద మొక్కజొన్న లారీలు రెండు, మూడు రోజులు నిలపాల్సి వస్తోంది. అయిజలో రెండు గోదాంలు ఉన్నాయి. ఎలాగోలా వాహనాల్లో మొక్కజొన్న బస్తాలను తరలించైనా గోదాంల వద్ద అన్లోడింగ్ చేసేందుకు సరిపడా మంది హమాలీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలో నిల్వలు పేరుకుపోతున్నాయి. సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళి, మార్క్ఫెడ్ డీఎం గుదిబండగా మారిన గన్నీ బ్యాగుల సమస్య గోదాంలకు తరలింపులోనూ ఇక్కట్లు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వేలాది బస్తాలు -
అభివృద్ధి వైపు.. పీయూ
యూనివర్సిటీలో రూ.113 కోట్లతో కొనసాగుతున్న పనులు ● శరవేగంగా నూతన భవనాల నిర్మాణాలు ● ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ● సీవేజ్ వాటర్ ట్రీట్మెట్ ప్లాంట్, సింథటిక్ ట్రాక్ గ్యాలరీ ● ప్రారంభమైన లా, ఇంజినీరింగ్ కళాశాల భవనాలు ఎమ్మెల్యేను సన్మానిస్తున్న పీఏసీఎస్ అధ్యక్షుడు మద్దిలేటి పీయూలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో పలు కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి. పలు హాస్టళ్లు, లా, ఇంజినీరింగ్ కళాశాలల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎస్టీ పీ ప్లాంట్, సింథటిక్ ట్రాక్ గ్యాలరీ కూడా పూర్తయ్యాయి. పీయూను గొప్ప యూనిర్సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఇలా.. నిధులు (రూ.కోట్లలో..) నిర్మాణం పూర్తి చేసుకున్న పీయూ సింథటిక్ ట్రాక్ గ్యాలరీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. పలు అభివృద్ధి పనులకు అటు ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీ అంతర్గత నిధులు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతంగా ఏకంగా రూ.113.63 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో పలు నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా.. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండగా.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం వరకు పలు భవనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లా, ఇంజినీరింగ్ కళాశాలల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో పీయూ కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తుండటంతో విద్యార్థులకు వసతి సమస్య తీరనుంది. దక్షిణ తెలంగాణకు రీసెర్చ్ హబ్గా.. పీఎం ఉషా స్కీం ద్వారా రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని రూ.13.50 కోట్లతో నిర్మించారు. ఇది దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద రీసెర్చి హబ్గా అవతరించనుంది. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. దీని ద్వారా పీయూలోని అన్ని డిపార్ట్మెంట్లకు ఒక్కో రీసెర్చ్ ల్యాబ్ను కేటాయించనున్నారు. ముఖ్యంగా సైన్స్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉషా స్కీం నుంచి రూ.కోట్లు వెచ్చించి మైక్రోస్కోప్, స్పెక్రోస్కోప్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలుకు సైతం ఇప్పటికే టెండర్లు పిలిచారు. తీరనున్న హాస్టల్ సమస్యలు... యూనివర్సిటీలో మొత్తం 13 కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో సీట్లు సరిపోకపోవడంతో విద్యార్థి అడ్రస్ నుంచి ఉన్న దూరం ఆధారంగా సీట్ల కేటాయింపులు చేస్తున్నారు. వీటికి తోడు లా, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా కొత్తగా రావడంతో ఇక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న పాత బాలబాలికల హాస్టళ్లలోనే వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కళాశాలలకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుండటంతో పీయూలో ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తున్నారు. రెండు హాస్టళ్లు యూనివర్సిటీ ద్వారానే నిర్మిస్తుండగా ఒక బాలిక, ఒక బాలుర హాస్టల్స్ను ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు వీటితో సీట్లు రెట్టింపు కానున్నాయి. బాలుర హాస్టల్ 12.50 రీసెర్చి ఫెసిలిటీ భవనం 13.50ఎస్టీ బాలుర హాస్టల్ 10 బాలికల హాస్టల్ 12.50 ఎస్టీ బాలికల హాస్టల్ 10లా కళాశాల 10 సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5 ఇంజినీరింగ్ కళాశాల 35 సింథటిక్ ట్రాక్లో టైల్స్వర్స్ 0.53సింథటిక్ ట్రాక్ గ్యాలరీ 4.60 పీయూలో సాధారణ భవనాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీయూలో హాస్టళ్లు, ఆఫీస్ల నుంచి వృథాగా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో ఫిల్టర్ చేసి తిరిగి వినియోగించేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా నీటి వృథా అరికట్టడంతోపాటు నీటి ఎద్దడి, డ్రెయినేజీ సమస్య కూడా తీరనుంది. న్యాక్ గ్రేడింగ్లో కూడా దీనికి మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్న ఏకై క సింథటిక్ ట్రాక్ పీయూలో మాత్రమే అందుబాటులో ఉండగా దానికి గ్యాలరీ నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. దీని నిర్మాణం కోసం అధికారులు రూ.4.60 కోట్లు వెచ్చించారు. -
విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలి
అలంపూర్: విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలని విద్యాశాఖ అధికారులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడును నియోజకవర్గంలోని మండల విద్యా శాఖ అధికారులు ఆదివారం కలిసి విద్యా వారోత్సవాలకు ఆహ్వానం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి శనివారం వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీయడం, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. విద్యా వారోత్సవాల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేక అంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారులు అశోక్కుమార్, భగీరథరెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి పాన్గల్: పండుగలు శాంతియుతంగా జరుపుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆదివారం మండలంలోని మాందాపూర్లో వీరభద్రుడి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోజువారి పనులతో పాటు కొంత సమయం దైవ భక్తికి కేటాయించాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అంతకుముందు మంత్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పోటీలకు ఆర్థిక తోడ్పాటునందించిన మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు కృష్ణయ్యసాగర్, జయరాములుసాగర్, కమిటీ సభ్యులు కుపేందర్రెడ్డి, పరమేష్, మహేష్, నర్సింహరాజు, భగవంతు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని మంత్రి జూపల్లి లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో సర్పంచ్ సుగుణమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. కొత్త కోర్సుల్లో చేరండి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఇటీవలి తీసుకువచ్చిన కొత్త కోర్సుల్లో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి పేర్కొన్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలలో ఇటీవల బీకాంలో బీఎఫ్ఎస్ఐ, బీబీఏలో రీటైల్ ఆపరేషన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, హెల్త్కేర్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుందని, వివిధ కంపెనీల్లో పని చేయడం ద్వారా అనుభవంతో పాటు వేతనం కూడా పొందవచ్చని వివరించారు. ఎంవీఎస్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు, ఎన్ఎసీసీ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. వివిధ కోర్సులకు సంబంధించి దోస్తు అడ్మిషన్లలో మొదటి ఆప్షన్గా ఎంవీఎస్ కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, సత్యనారాయణ, మంజూల, సూర్యనారాయణ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
యువతరం.. సతమతం
తీవ్ర మానసిక ఒత్తిడిలో యువత, మధ్యవయస్కులు –8లో uప్రస్తుత సమయంలో చాలామందికి ఈ వ్యాధి లక్షణాలపై పెద్దగా అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని వైద్యులు చెబుతున్నారు. ఉన్నట్టుండి శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరగడం, కాళ్లు, చేతులు చచ్చుబడి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పని చేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయంపై ప్రభావం చూపుతున్న వ్యాధి పక్షవాతం. అప్పటి వరకు ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాలను అకస్మాత్తుగా కుప్ప కూల్చేస్తోంది. వారి బతుకులను ఉన్నట్లుండి అంధకారంలో నెట్టేస్తోంది. పక్షవాతానికి గురైన కొందరు దివ్యాంగులుగా మిగిలిపోయి.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహం, వ్యాధి లక్షణాలను గుర్తించక పోవడం ప్రధానంగా ఉన్నాయి. మద్యం, సిగరెట్లు తాగే వారికి పక్షవాతం సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గంటల తరబడి సెల్ఫోన్లు చూడటం, రీల్స్, గేమ్స్ అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం వంటి విషయాలపై ఉంటూ సమయానికి తినకపోవడం సమస్యగా ఉంది. గతంలో ఎక్కువగా వృద్ధులు ఈ వ్యాధి బారిన పడేవారు. ఇప్పుడు పాతికేళ్లలోపు వారూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. అలంపూర్గద్వాల క్రైం: మారిన జీవనశైలి కారణంగా సగటు మనిషి ప్రమాదంలో పడిపోతున్నాడు. ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడంలో నిర్లక్ష్యం, వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం, సరైన సమయంలో తగిన వైద్యం తీసుకోకపోవడంతో పలువురు పక్షవాతం బారిన పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 898 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అయితే ఇందులో 15 శాతం యువత సైతం ఈ వ్యాధి లక్షణాలతో సతమతం అవుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు 40 ఏళ్ల వారు గత కొన్ని నెలల క్రితం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. దీంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పక్షవాతం కేసులపై సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం, మద్యపానం, ధూమపానం, నిద్రలేమి వంటి సమస్యలతో మెదడు మొద్దుబారిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు తమవారి ఆరోగ్య సమస్యలపై భయాందోళన చెందుతున్నారు. నిత్యం అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవగాహన లోపంతో తీవ్రమవుతున్న ఇబ్బందులు భయాందోళనలో కుటుంబ సభ్యులు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రమాదం మండలానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా కుడిచేయి పని చేయలేదు. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు పక్షవాతం వచ్చినట్లు నిర్ధారించారు. అయితే సకాలంలో ఆస్పత్రికి వచ్చినందున పెను ప్రమాదం తప్పిందని.. అయినప్పటికీ నిత్యం మందులు వాడాలని సూచించారు. దీంతో సదరు వ్యక్తి వ్యాధిబారి నుంచి త్వరగా బయటపడాలని బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
జోగుళాంబ గద్వాల
త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం ● విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత ● నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు ● పోలీస్, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు ‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు ఉన్నతాధికారులు. ఐఏఎస్, ఐపీఎస్తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఉన్నత ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు... – సాక్షి, నాగర్కర్నూల్/ పాలమూరు/గద్వాల/ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) అమ్మకు సలాం..ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్లో కూడా రోజు హోంవర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది. నేడు మాతృదినోత్సవం ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్నగర్ టౌన్ ఎకై ్సజ్ ఎస్ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్, ఏడేళ్ల కొడుకు రోహన్ష్ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్వేర్ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు. -
పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను..
పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు – విజయలక్ష్మి, ఏఎస్ఐ, షీ టీం ఇన్చార్జి, నాగర్కర్నూల్ కూతురు మానస, కుమారుడు సాయిరాంతో ఏఎస్ఐ విజయలక్ష్మి -
రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు
అయిజ: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్నలను ప్రభుత్వం సకాలంలో కొనడం లేదని, కాంటా వేసిన బస్తాలను గోదాంలకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని శనివారం మండల కేంద్రంలోని గద్వాల రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లేష్ సంఘటనా స్థలానికి పోలీస్ బృందంతో చేరుకున్నారు. రోడ్డుపై నుంచి రైతులు వెళ్లిపోవాలని కోరినా వినిపించుకోలేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంకు రైతులు మొక్కజొన్నను తరలించినప్పటి నుంచి బస్తాలను గోదాంకు తరలించే వరకు సుమారు నెల రోజులు పడుతుందని, రైతులు అంతవరకు కాపలా కాయాల్సి వస్తుందని మండిపడ్డారు. ఒక్కరోజులోనే రైతుల మొక్కజొన్న బస్తాలను మొత్తం గోదాంకు తరలించేలా ఏర్పాటు చేస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు. -
కొల్పూర్ వద్ద బ్రిడ్జికమ్ బ్యారేజీ
మాగనూర్: మక్తల్ నియోజకవర్గ పరిధిలో మరో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మాగనూ ర్ మండలం కొల్పూర్, కర్ణాటక సరిహద్దులోని కొర్తికొండ వద్ద కృష్ణానదిపై రెండు రాష్ట్రాల సహకారంతో రూ. 750కోట్లతో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు శనివారం కర్ణాటక రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి బోసురాజుతో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొల్పూర్ వద్ద కృష్ణానదిపై 8 మీటర్ల ఎత్తులో రూ. 750 కోట్లు వ్యయంతో కృష్ణానదిపై అతి త్వరలో బ్రిడ్జికమ్ బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కర్ణాటక రూ.470 కోట్లు, తెలంగాణ రూ. 280కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. జూరాల ఎగువన కొల్పూర్ వద్ద ప్రాజెక్టు నిర్మించడంతో ఆ ప్రాంత రైతులకు రెండవ పంటకు సాగునీటి కష్టాలు దూరం కావడంతో పాటు మక్తల్ నియోజకవర్గవ్యాప్తంగా రెండు పంటలతో సస్యశ్యామలమయ్యేందుకు మార్గం సుగమవుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అతి త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభించి.. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. తెలంగాణ, కర్ణాటక సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయం రూ. 750కోట్లు అవసరమని అంచనా కర్ణాటక మంత్రితో భేటీ అయిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి -
దాహం.. దాహం
గద్వాల: వేసవికాలం మొదలు అయ్యిందంటే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు గుర్తుకు వచ్చేది తాగునీటి సమస్య. గతంతో కంటే ఈసారి వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా పనులపై జనాలు బయటకు వెళ్లాలంటే అల్లాడిపోతున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో తాగునీటి సమస్య మొదలైంది. గద్వాల మున్సిపాలిటీలో కృష్ణానది, జమ్ములమ్మ రిజర్వాయర్ నుంచి, అదేవిధంగా కొత్తహౌసింగ్బోర్డు, దౌదర్పల్లి వంటి శివారు కాలనీలలో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా చేస్తుండగా.. మిగిలిన అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా నాలుగు మున్సిపాలిటీలలోని శివారు కాలనీలలో తాగునీటి సమస్య అధికంగా కనిపిస్తుంది. ఈ కాలనీలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోచ్చు. ట్యాంకర్ల ద్వారా సరఫరా.. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులు ఉన్నాయి. పట్టణ జనాభా సుమారు 65 వేలు. పట్టణానికి కృష్ణానది, జమ్ములమ్మ రిజర్వాయర్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే పట్టణంలో శివారు కాలనీలైన బీసీ కాలనీ, రెండవ రైల్వేగేటు కాలనీ, పిల్లిగుంట్ల, దౌదర్పల్లి, హమాలీకాలనీ తదితర కాలనీలలో తాగునీటి సమస్య తలెత్తుతుంది. ఇటీవల కాలంలో పిల్లిగుంట్ల కాలనీలో తాగునీటి సమస్య ఉందని కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కాలనీలలో కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండగా.. ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రమవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తరుచుగా మరమ్మతు.. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులున్నాయి. మొత్తం జనాభా 13,267. ఈ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేస్తుండగా.. ప్రధానంగా 9వ వార్డులో కేవలం 30– 45 నిమిషాలు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తుండడంతో వార్డు ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ వార్డుకు సరఫరా చేసే తాగునీటి పైపులైన్ తరచూ మరమ్మతులకు గురవుతుండడం కూడా తాగునీటి సమస్యకు కారణంగా మారుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా.. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులుండగా మొత్తం జనాభా 12,654. ఈ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండగా ప్రధానంగా 5, 7, 8 వార్డులలో వేసవిలో తరచూ తాగునీటి సమస్య ఎదురవుతుంది. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కోసం జనాల అవస్థలు జిల్లాలోని మున్సిపాలిటీలలో శివారు కాలనీల్లో తాగునీటి కష్టాలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా సరిపోని వైనం గద్వాల మినహా మిగతా చోట్ల మిషన్ భగీరథ ద్వారా సరఫరా -
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు.. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకే అందిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవమాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. అమ్మ మన రేపటి భవిష్యత్కై నిరంతరం శ్రమించే గొప్ప శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్, మహబూబ్నగర్ -
వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు
ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, గద్వాల ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలతో రూ.లక్షల్లో ఆస్తినష్టం జరిగింది. సోషల్ మీడియా యుగంలో.. అమ్మ పాత్ర పెద్ద టాస్క్ –8లో uప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ -
మా అమ్మ వల్లే ఈ స్థాయిలో..
మాది మధ్య తరగతి కుటుంబం. నా జీవితం ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఎంతో ఉంది. మా నాన్న సాయిబాబ, అమ్మ వెంటకసుబ్బమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో సంతానం. మిగిలిన ఇద్దరిలో ఒకరు టీచర్ కాగా.. మరో సోదరుడు మున్సిపల్ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ముందు నుంచి మా అమ్మ మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే నేను గ్రూప్–1 సాధించాను. ఆ తర్వాత 2013లో ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే. – టి.శ్రీనివాసరావు, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
ఉదయం 6 గంటలకే దినచర్య మొదలు..
మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్ చూసుకోవడం పెద్ద టాస్క్గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. – డాక్టర్ శిరీష, ఆర్ఎంఓ జనరల్ ఆస్పత్రి పిల్లలతో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష -
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
ఇటిక్యాల: బీచుపల్లి పుణ్యక్షేత్రం శనివారం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. నెలరోజులపాటు జరిగే జాతర ఉత్సవాలలో భాగంగా రెండోవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా బీచుపల్లికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. భక్తులు దాసంగాలతో మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి ఆంజనేయస్వామికి సమర్పించారు. అనంతరం ద్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శివాలయంలోనూ భక్తులు పూజలు చేశారు. -
అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
గద్వాల: అదనపు కలెక్టర్గా (రెవెన్యూ) మధుమోహన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన జిల్లాకు వచ్చారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కేటీదొడ్డి: ఎరువులు, విత్తన డీలర్లు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప హెచ్చరించారు. శుక్రవారం కేటీదొడ్డి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్ వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని స్పష్టంచేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించమని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ రాజవర్ధన్రెడ్డి ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,071 గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు శుక్రవారం 67 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,071, కనిష్టంగా రూ. 3,699, సరాసరి రూ. 6,489 ధరలు లభించాయి. అదే విధంగా 63 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,069, కనిష్టంగా రూ. 6,001 ధర పలికింది. 1,823 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,276, కనిష్టంగా రూ. 1,621, సరాసరి రూ. 2,092 ధరలు లభించాయి. -
జనగణన.. దేశాభివృద్ధికి పునాది
● స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జనగణన దేశాభివృద్ధికి పునాది వంటిదని.. పౌరుల ఉజ్వల భవిష్యత్కు ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలుకు ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగణన–2027పై శుక్రవారం కలెక్టరేట్ నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించగా.. వివిధ శాఖల అధికారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటగా ఇళ్ల గణన చేపడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 26 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు స్వీయగణనకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు స్వీయ గణనలో భాగస్వాములై జిల్లాను రాష్ట్రంలోనే ముందుండేలా సహకరించాలని కోరారు. అనంతరం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా వ్యాధి లక్షణాలు, చికిత్స తదితర అంశాలపై ప్రోగ్రాం అధికారి రాజు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, సీపీఓ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో మత్స్యకారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్యశాఖ కూడ ప్రధానమైనదన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో నాణ్యమైన చేపపిల్లలను సకాలంలో వదిలేందుకు రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్తో మాట్లాడతానని తెలిపారు. చెరువుల్లోకి ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు చేరకుండా మత్స్యకారులు అసవరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే రెన్యువల్ చేస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి, సీ్త్రనిధి, ప్రధానమంత్రి మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ వంటి రుణాలతో కులవృత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చన్నారు. పీఎండీడీకేవైకు జిల్లా ఎంపిక కావడం ద్వారా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఆశించిన పురోగతి సాధించడానికి అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన వంటి పథకాలను అర్హులైన మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి షకీలాభాను, ఇరిగేషన్శాఖ ఈఈ శ్రీనివాస్, ఎల్డీఎం శ్రీనివాసరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరయ్యాయని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించి.. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయాలన్నారు. బడిబాటతో పాటు ఇతర కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మి, డీఐఈఓ హృదయరాజు ఉన్నారు. -
నెరవేరని టార్గెట్..
ఆర్థిక సంవత్సరం బ్యాంకులకు నిర్దేశించిన పంటరుణ పరిమితి మేరకు రైతులకు రుణాలు అందిస్తాయి. అందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు రుణ లక్ష్యాన్ని లీడ్ బ్యాంక్ అధికారులు నిర్దేశించారు. ఈ మేరకు ఆయా బ్యాంకుల వారీగా లక్ష్యాన్ని విభజించారు. అయితే ఇచ్చిన లక్ష్యంలో కేవలం 68.92 శాతం మాత్రమే బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు అందించారు. అర్హులందరికీ రుణాలు.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పంట పెట్టుబడుల కోసం అర్హత కలిగి, రుణం కోరిన రైతులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాం. రుణ లక్ష్యం నెరవేరేలా బ్యాంకర్లతో సమీక్షలు నిర్వహించాం. అర్హులైన ప్రతి రైతుకు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. – శ్రీనివాసరావు, ఎల్డీఎం ● -
లక్ష్యం.. నిర్లక్ష్యం!
గద్వాలన్యూటౌన్: నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా బోరుబావులను కూడా ఇక్కడి రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిద రకాల పంటలు పండిస్తున్నారు. ఇంకా పండ్లతోటలు, కూరగాయల సాగు చేపడుతున్నారు. ప్రతి ఏటా 60 – 70 శాతమే.. నడిగడ్డలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జిల్లావ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రైతుభరోసా, పీఎం కిసాన్ సమ్మాన్నిధి వంటి పంట పెట్టుబడుల పథకాలు రైతుల పూర్తి అవసరాలు తీర్చడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలనే పంట పెట్టుబడులకు వినియోగిస్తూ.. సేద్యం చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా పంటరుణ లక్ష్యం నెరవేరడం లేదు. నిర్దేశించిన లక్ష్యంలో 60 నుంచి 70శాతం మాత్రమే బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, రెన్యువల్ చేసుకుంటే అర్హత కలిగిన ప్రతి రైతుకు పంట రుణాలు అందిస్తామని బ్యాంకర్లు అంటున్నారు. అయితే రెన్యువల్ చేసుకునే విషయంలో రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. దీంతో చాలా మంది రైతులు అధిక వడ్డీకి ప్రైవేటు వ్యాపారులతో అప్పులు చేస్తున్నారు. బ్యాంకు రుణాలు రెన్యువల్ చేసుకునే విధానాలపై వ్యవసాయ, బ్యాంకర్లు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదరగొడుతున్నారు పాలమూరు స్టేడియంలో నిర్వహిస్తున్న హ్యాండ్బాల్ శిక్షణ శిబిరంలో క్రీడాకారులు మెళకువలు నేర్చుకుంటున్నారు. –8లో uజిల్లాలో 68.92శాతం మాత్రమే పంట రుణాలు సాగు పెట్టుబడులకు తప్పని ప్రైవేటు అప్పులు బ్యాంకు రుణాల రెన్యువల్పై కొరవడిన అవగాహన బ్యాంకర్ల తీరుతో రైతులకు చేకూరని లబ్ధి -
తపాలాశాఖలో సీబీఐ కలకలం
● తోటి ఉద్యోగుల నుంచి లంచం ఆశించిన పోస్టల్ ఇన్స్పెక్టర్ ● సుదీర్ఘ విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న అధికారులు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పనిచేస్తున్న గోపీనాథ్ తోటి ఉద్యోగుల నుంచి లంచం తీసుకుంటున్నట్లు పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 7 వరకు అదుపులోకి తీసుకొని విచారించారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న స్థానాల్లో బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవక్లకు అదనపు విధులు కేటాయిస్తారు. ఇందుకుగాను అదనంగా డబ్బులు చెల్లిస్తారు. 2023 నుంచి 2026 వరకు అదనపు విధుల బిల్లులు పెండింగ్లో ఉండటంతో మంజూరుకు పోస్టల్ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరికి వచ్చే డబ్బుల నుంచి కొంత శాతం తనకు చెల్లించాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో కొందరు బీపీఎం, ఏబీపీఎం, డాక్సేవక్లు చెల్లించగా.. ఒకరిద్దరు సీబీఐ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి కార్యాలయానికి సీబీఐ అధికారులు చేరుకోగా.. విషయం తెలుసుకున్న గోపీనాథ్ పరారయ్యారు. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సెల్ఫోన్ ట్రేసింగ్ ద్వారా గుర్తించిన సీబీఐ అధికారులు పట్టుకొని పోస్టల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, కార్యాలయ ట్రెజరీలో కొంత నగదుకు సంబంధించి లెక్కలు చూపడంలో విఫలం కావడంతో గురువారం రాత్రంతా అక్కడే ఉంచారు. విధులు ముగించుకొని ఇంటికెళ్లిన మిగతా ఉద్యోగులను రాత్రి 10.30 గంటలకు కార్యాలయానికి పిలిపించి బీపీఎంలకు సంబంధించి బిల్లుల చెల్లింపులో జాప్యం, కార్యాలయ ట్రెజరీలో అదనంగా నిల్వ ఉన్న డబ్బులపై ఆరా తీసినట్లు తెలిసింది. అన్ని వివరాలను లిఖితపూర్వకంగా ధ్రువీకరించుకొని నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 7 వరకు కార్యాలయంలోనే ఉండి సుదీర్ఘ విచారణ అనంతరం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి వనపర్తి ప్రధాన పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న అంగీకరించారు. -
ర్యాష్ డ్రైవింగ్.. త్రిబుల్ రైడింగ్
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మైనర్లు, చిన్నారులకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే వాహనాలు నడిపేందుకు అర్హులు. కానీ, ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పదేళ్లు దాటిన వారికి సైతం తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. నియంత్రణ లేని పిల్లలు రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనెల్ హోంకు తరలిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తునా తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన క్రమంలో వారందరూ ఇళ్ల దగ్గర ఉంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న వారిలో చాలామంది చిన్నారులు ఇంట్లో ఉండే తల్లిదండ్రుల బైక్లు, స్కూటీలు తీసుకొని గల్లీలతోపాటు ప్రధాన రోడ్లపై త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్లతో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గాయపడుతున్న ఘటనలు అనేకం. ఇక కొన్ని సందర్భాల్లో ప్రధాన రోడ్లపై మేజర్ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాల కట్టడికి మొదటి అడుగు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. బైపాస్ రోడ్డుపై రేస్.. నగరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ బైపాస్పై రాత్రివేళలో టీనేజర్స్ రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చించోళి బైపాస్ రోడ్డుపై కూడా సాయంత్రం వేళ కొంతమంది యువకులు బైక్లతో అక్కడికి చేరుకుని పోటీలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక వర్గానికి చెందిన టీనేజర్స్ మరింత రెచ్చిపోయి బైక్లు రాష్గా.. వేగంగా నడుపుతూ గట్టిగా హారన్స్ కొడుతూ.. సైలెన్సర్ల నుంచి మంటలు వచ్చేలా నడుపుతున్నారు. కొందరు అయితే బైక్ స్టాండ్స్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోగణనీయంగా పెరిగిన మైనర్ల డ్రైవింగ్ వేసవి సెలవులనేపథ్యంలో బైక్లపై టీనేజర్ల చక్కర్లు పాలమూరు బైపాస్ రోడ్లపై రేస్ల నిర్వహణ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టని పోలీస్ శాఖ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రాని వైనం -
రైతులకు ఇబ్బందులు రానివ్వం
మానవపాడు: ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని డీఈలు రామ్పతి, నాగరాజు అన్నారు. శుక్రవారం మానవపాడు సమీపంలోని ఆర్డీఎస్–30 కెనాల్లో ఉపాధిహామీ పథకం కూలీలతో చేపట్టిన కంపచెట్లు, ముళ్లపొదల తొలగింపు పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులతో పాటు ఆయకట్టు రైతులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాల్వలో పూడికతీతతోనే సాగునీరు సాఫీగా పారుతుందని.. పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. ఈ విషయంపై వారు స్పందిస్తూ.. ఆయకట్టు రైతులు, రైతు సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పూడిక తీసుకునేందుకు అనుమతులు ఇస్తామన్నారు. లేనిచో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనప్పుడు పూడికతీత చేపడుతామని స్పష్టంచేశారు. ఉపాధి హామీ పథకంలో పూడికతీత పనులు చేపడితే.. మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేందుకు రెండు, మూడేళ్ల సమయం పడుతుందని రైతులకు వివరించారు. కాల్వలో పూడికతీత కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో తీర్మానంచేసి సమర్పించాలని సూచించారు. వారి వెంట సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. -
నీలినీడలు..!
● ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా ప్రోత్సాహం కరువు ● నెరవేరని ఉచిత చేపవిత్తనాల పంపిణీ లక్ష్యం ● మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం ఉమ్మడి జిల్లాలో అవసరమయ్యే చేపపిల్లలు.. జిల్లా చెరువులు జలాశయాలుచేపపిల్లలు (కోట్లలో) మహబూబ్నగర్ 1092 1 1.98 నాగర్కర్నూల్ 715 6 2.41 నారాయణపేట 506 3 1.37 వనపర్తి 653 5 2.02 జో. గద్వాల 140 6 1.46 మహబూబ్నగర్ న్యూటౌన్: మత్స్యశాఖ నిర్లక్ష్యధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా.. చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చేపపిల్లల పంపిణీ కోసం టెండర్లు పిలిస్తే ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో పాటు పెంపకానికి ప్రభుత్వం సహకారం అందిస్తున్నా.. ఆసక్తి కనిపించడంలేదు. ఫలితంగా మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ అబాసుపాలవుతోంది. నీటితో కళకళలాడుతున్న చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో ఉచితంగా చేపపిల్లలు వదిలి మత్స్యకారులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన పథకం ఆశించినస్థాయిలో అమలుకాకపోవడం అసంతృప్తికి గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది దాదాపు 9కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉండగా.. చేపపిల్లల కొరతతో 50 శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోకపోవడం గమనార్హం. ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి టెండర్లలో పాల్గొంటున్నారు. తెలంగాణలో చేపపిల్లలను ఉత్పత్తి చేసే టెండరుదారులు మాత్రం ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉచిత చేపపిల్లల పంపిణీ నామమాత్రంగా ఉండటంతో వృత్తిని నమ్ముకొని బతుకుతున్న మత్స్యకారుల్లో నైరాశ్యం నెలకొంది. ప్రోత్సాహం కరువు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూరాలప్రాజెక్టు, కోయిల్సాగర్, సరళాసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు వివిధ జలాశయాల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయి. అయితే ఆసక్తి ఉన్న మత్స్యకారులను ప్రోత్సహిస్తే ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశముంది. మత్స్యరంగాన్ని బలోపేతం చేయాల్సిన మత్స్యశాఖ అధికారులు.. ప్రైవేటు కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇస్తుండటం పలు అనుమానాలకు తానిస్తోంది. ప్రతి సంవత్సరం ఉమ్మడి జిల్లాలో అవసరమున్న 9 కోట్ల చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం రూ.16.50 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. అదే ఇక్కడి మత్స్యకారులే ఉత్పత్తిదారులుగా తయారైతే ఆర్థికంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కొత్త దరఖాస్తులు రావడం లేదు.. మహబూబ్నగర్ జిల్లాలో రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అందులో పిల్లలమర్రి ఉత్పత్తి కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి జరగడం లేదు. కోయిల్సాగర్ లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో సగం మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. ఈ కేంద్రంలో మరమ్మతు చేపట్టి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో అస్యూర్డ్ వాటర్ లేనందున కొత్త దరఖాస్తులు ఏమి రావడం లేదు. – రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి మహబూబ్నగర్ పిల్లలమర్రి వద్ద నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ప్రభుత్వ ఉత్పత్తి కేంద్రాలిలా.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో దాదాపు 20 ఎకరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అచ్చంపేట మండలం చంద్రసాగర్లో 14 లక్షల చేపపిల్లల సామర్థ్యం కలిగిన పెంపకం కేంద్రం నిరుపయోగంగా మారింది. ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం 12 ఏళ్ల క్రితం మూతపడింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ వద్ద చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని పెబ్బేరు మత్స్యకళాశాల విద్యార్థుల అవగాహన కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో దా దాపు 20వేల చేపపిల్లలను పెంచుతున్నారు. గద్వాల జిల్లా జములమ్మ రిజర్వాయర్ వద్ద నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని తొలగించి, ఆలయ అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టారు. దేవరకద్ర మండలం కోయిల్సాగర్ వద్ద కోటి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఉన్నా ప్రస్తుతం 60 లక్షలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తికి మరమ్మతు చేపట్టాల్సి ఉంది. పిల్లలమర్రిలో ఉన్న ఉత్పత్తి కేంద్రం నిరుపయోగంగా మారింది. -
నత్తనడకన..
అయిజలో ముందుకుసాగని 30 పడకల ఆస్పత్రి నిర్మాణం ● 2017లో రూ.1.10 కోట్లు మంజూరు ● రూ. 80లక్షల పనులకు మాత్రమే టెండర్ ● నిధులలేమితో అసంపూర్తిగా పనులు ● పీహెచ్సీలో మెరుగైన వసతులు లేక రోగుల అవస్థలు –8లో uఅయిజ: జిల్లాలోనే అయిజ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. ఇక్కడ రోజూ 250 పైగా ఓపీ నమోదవుతోంది. మరో 10 మంది ఇన్ పేషెంట్లు ఉంటారు. కాన్పుల సంఖ్య కూడా అధికమే. అయిజ మండలంతో పాటు మల్దకల్, గట్టు, వడ్డేపల్లి మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో పీహెచ్సీ భవనం ఏమాత్రం సరిపోవడం లేదు. శిథిలావస్థకు చేరిన పీహెచ్సీలో రోగులు మౌలిక వసతులకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో 30 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి 2017లో అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2021లో నిర్మాణానికి శ్రీకారం.. మాతా శిశు సంరక్షణ కేంద్రం (30 పడకల ఆస్పత్రి) నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.10 కోట్లు మంజూరు చేయగా.. 2021 సెప్టెంబర్ 30న అప్పటి ఎమ్మెల్యే అబ్రహాం శంకుస్థాపన చేశారు. అయితే కరోనా విపత్తు సమయంలో అత్యవసర పనుల కోసం అప్పటి కలెక్టర్ రూ. 30లక్షల నిధులను ఖర్చుచేశారు. మిగిలిన రూ. 80లక్షల పనులకు మాత్రమే టెండరు ప్రక్రియ పూర్తిచేసి, పనులు చేపట్టారు. ఐదేళ్లుగా అసంపూర్తిగానే.. 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధుల కొరత కారణంగా ఐదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయింది. ఆస్పత్రిలో వైద్యుల గదితో పాటు స్టాఫ్ నర్సు గది నిర్మించాలి. వాటితో పాటు 12 పడకల గదులు రెండు, ఆరు పడకల గది ఒకటి, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడానికి మరో రూ. 50లక్షలు అవసరమవుతాయని సంబంధిత అధికారులు నిర్ధారణకు వచ్చారు. నిధుల కోసం 2024లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. నేటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి 30 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి.. అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
సేవలు మరింత విస్తృతం..
ఇండియన్ రెడ్క్రాస్తో అందిస్తున్న సేవలను మ రింత విస్తృతం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సహకారంతో రూ.5 కోట్లతో మల్టీ సూపర్స్పెషాలిటీ డయాగ్నొస్టిక్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతం ఎస్డీపీ మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఒక యూనిట్కు రూ.10, 500 ఖర్చు చేస్తున్నాం. ప్రైవేటులో అయితే రూ.18 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మూడు అంబులెన్స్లు, ఒక మినీవ్యాన్ అందుబాటులో ఉంది. – నటరాజ్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ -
అవస్థలు పడుతున్నాం..
30 పడకల ఆస్పత్రి నిర్మా ణం ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా పను లు పూర్తికావడం లేదు. దీంతో అనేక అవస్థలు పడుతున్నాం. రోజు పీహెచ్సీకి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా నిలిచిన 30 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేస్తే బాగుంటుంది. – నాగరాజు, అయిజ పీహెచ్సీ భవనం పక్కన నిర్మిస్తున్న 30 పడకల ఆస్ప త్రి పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు, పాలకులు ప ట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గు రవుతున్నారు. అధికారులు చూసి వెళ్తున్నారు తప్ప..పనులను మాత్రం పూర్తి చేయించడం లే దు.ఇప్పటికై నా స్పందించి త్వరగా పూర్తిచేయాలి. – నజీర్, అయిజ అయిజ పీహెచ్సీకి ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఎక్కువ కాన్పులు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. నూతనంగా చేపట్టిన 30 పడకల ఆస్పత్రి భవనం అసంపూర్తిగా ఉంది. నిర్మాణ పనుల పూర్తికి అవసరమైన నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భవనాన్ని ప్రత్యేక వార్డుగా వినియోగిస్తాం. – సంధ్యా కిరణ్మయి, డీఎంహెచ్ఓ ● -
రెడ్క్రాస్.. సేవల్లో టాప్
పాలమూరు: అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన వారికి ఓవైపు రక్తం సమకూర్చడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ముందుంటోంది. కొన్నేళ్లుగా పాలమూరు జిల్లాలో ఆరోగ్యం, అత్యవసర సహాయం, రక్తదానం వంటి సేవల్లో మేటిగా నిలుస్తోంది. ప్రకృతి విపత్తుల సమయంలో నిస్సహాయులకు చేయూత అందించడంతో పాటు గర్భిణులు, చిన్నారుల పోషణ వంటి వాటిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థు ల్లో సేవాభావం, ఆరోగ్య అవగాహన పెంపు కోసం జూనియర్ రెడ్క్రాస్ వలంటీర్లను తయారు చేయడంతో.. జిల్లాలో జరిగే కురుమూర్తి, మన్యంకొండ ఇతర ముఖ్యమైన ఉత్సవాల్లో వలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. 6,130 యూనిట్ల రక్తసేకరణ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏడాది కాలంలోనే 114 రక్తదాన శిబిరాలు నిర్వహించి.. 6,130 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్లో ఏర్పాటుచేసిన కోల్డ్ స్టోరేజ్లో అన్ని రకాల రక్త నిల్వలు అందుబాటులో ఉంటాయి. సర్జరీలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో పాటు తలసేమియా బాధితులకు సైతం రక్తం అందిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు.. పాలమూరులో గతేడాది కాలంలో 20 కంటి వైద్యశిబిరాలు నిర్వహించడంతో పాటు 156 మంది కళ్లు సేకరించారు. 23 మృతదేహాలను మెడికల్ కళాశాలకు వితరణ చేశారు.30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను 258 మంది లబ్ధిదారులకు అందజేశారు. 17 ప్రాంతాల్లో సీపీఆర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2005లో మహబూబ్నగర్ ఏనుగొండలో అనాథ శరణాలయం ఏర్పాటు చేయగా.. 1వ తరగతి నుంచి ఇంటర్ వ రకు చదివే విద్యార్థులు 74 మంది ఉన్నారు. అదే విధంగా 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే వారు 14మంది ఉండగా.. ముగ్గురు డిగ్రీ, ఒకరు ఇంజినీరింగ్, ఇద్దరు పాలిటెక్నిక్, ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి యో గా పోటీల్లో రెడ్క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు. 2018లో శాంతివనం.. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మరో అరుదైన సేవా కా ర్యక్రమం శాంతివనం పేరుతో మానసిక వికలాంగుల ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో 25మంది వరకు ఉండగా.. ప్రత్యేక శిక్షణ పొందిన ముగ్గురు ఉపాధ్యాయులతో నిత్యం పాఠాలు భోదిస్తుంటారు. ఈ పాఠశాలలో చదువుతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఐదుగురికి విద్యానిధి.. ఎంబీబీఎస్ చదువుతున్న ఐదుగురు నిరుపేద విద్యార్థులను రెడ్క్రాస్ సొసైటీ దత్తత తీసుకొని వారి చదువుకయ్యే ఖర్చు భరిస్తోంది. ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు వారికి సంబంధించిన అన్ని రకాల బాగోగులను చూస్తోంది. విద్యార్థిని గోపిక గాంధీ మెడికల్ కళాశాల, హరిత కాకతీయ మెడికల్ కళాశాల, ఊర్మిళ ఎస్వీఎస్, ఆకాంక్ష నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ముడావత్ లోకేష్ ఈఎస్ఐ మెడికల్ కళాశాల ముంబైలో చదువుతున్నాడు. ప్రతి ఒక్కరికీ కళాశాల ఫీజు, పుస్తకాలు, దుస్తులు, హాస్టల్ సౌకర్యాలకు అయ్యే ఖర్చు భరిస్తున్నారు. పేదలకు అండగా నిలుస్తున్న సొసైటీ అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా శిబిరాల నిర్వహణ ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దత్తత అనాథ శరణాలయాల్లో 100మంది వరకు ఆశ్రయం నేడు ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం -
మరో రెండు కార్పొరేషన్ పదవులు
● సరిత, గట్టు తిమ్మప్పకు దక్కిన ‘చైర్మన్ గిరి’ గద్వాల: ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాకు మరో రెండు కార్పొరేషన్ పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. కొల్లె సరిత తిరుపతయ్యను తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (టీజీఎస్జీడీసీఎఫ్ఎల్) చైర్పర్సన్గా, గట్టు తిమ్మప్పను వాల్మీకి బోయ కో–ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి కే శాట్ చైర్మన్గా శివసేనారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఒబేదుల్లా కొత్వాల్ కొనసాగుతున్నారు. ● కొల్లె సరిత బీఆర్ఎస్ హయాంలో గద్వాల జెడ్పీ చైర్పర్సన్గా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2023లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సరిత కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ● గట్టు తిమ్మప్ప గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సోదరుడు. టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మ డి పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్గా పదవి నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓసారి గట్టు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్గా కూడా పనిచేశారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి..
కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు ఆపాలి. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా 2021 వేతన సవరణ, 30శాతం ఫిట్మెంట్ అమలు, మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన నిధులు, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేతపై చర్యలు చేపట్టాలి. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే ఆశాభావంతో ఉన్నాం. – రాంనాథ్, ఆర్టీసీ కార్మికుడు, గద్వాల సమస్యలను అధిగమిస్తాం.. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సిబ్బందికి సైతం పనిభారం పెరిగిన మాట వాస్తవమే. ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం అమలు తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళా ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బస్సు సర్వీసుల కొరత ఉంది. త్వరలో నూతన బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తాం. డిపో పరిఽధిలోని కార్మికుల సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. – సునీత, ఆర్టీసీ డీఎం, గద్వాల ● -
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
గద్వాలవ్యవసాయం: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాలు అమలుచేస్తోందని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, వైస్చైర్మన్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో వారు పాల్గొని మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. ఈనామ్ ద్వారా రైతులు తమ పంటను ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనామ్ విధానంతో గద్వాల యార్డులో చాలా మంది రైతుల పంట ఉత్పత్తులను మంచి ధరలకు కొనుగోలు చేసినట్లు వివరించారు. మార్కెట్యార్డు అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి సబిత, మార్కెట్ కార్యదర్శి నర్సింహ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,599 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 98 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,599, కనిష్టంగా రూ. 4,769, సరాసరి రూ. 6,506 ధరలు లభించాయి. అదే విధంగా 51 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,011, కనిష్టంగా రూ. 5,519, సరాసరి రూ. 5,829 ధరలు పలికాయి. 1,944 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,256, కనిష్టంగా రూ. 1,686, సరాసరి రూ. 2,039 ధరలు లభించాయి. ఆదిశిలా క్షేత్రంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ మల్దకల్: ఆదిశిలా క్షేత్రాన్ని బుధవారం జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వరగౌడ్ సందర్శించి.. స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి ఆయనకు తీర్థప్రసాదాలను అందజేసి.. ఆదిశిలా క్షేత్రం విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు పూలమాల, శేషవస్త్రంతో రామలింగేశ్వరగౌడ్ను సత్కరించి మెమోంటో అందజేశారు. -
‘రామన్పాడ్’ తగ్గుముఖం
● రిజర్వాయర్లో ఏడు మీటర్లుతగ్గిన నీటిమట్టం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్ భగీరథ అధికారులు ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్పాడు రిజర్వాయర్లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే పాలమూరులోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్పాడు రిజర్వాయర్ను నిర్మించారు. రిజర్వాయర్లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది. తాగునీటి పథకాలు.. శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్డీ తాగునీటి పథకం ద్వారా వనపర్తి జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్పేట 10 ఎంఎల్డీ పథకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్గల్ 5 ఎంఎల్డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్యసాయి 2 ఎంఎల్డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్డీ పథకం ద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. సాగునీటి సరఫరా బంద్.. ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు. -
ఆర్టీసీలో పనిభారం!
గద్వాల క్రైం: నిత్యం వేలాది ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ఆర్టీసీ సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడం.. ఆర్టీసీ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. జిల్లాకేంద్రమైన గద్వాల జిల్లా నుంచి హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, కర్ణాటక తదితర దూర ప్రాంతాలకు గతంలో రోజు 70వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో లక్ష మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇక పాఠశాలలు, కళాశాలలు కొనసాగే సమయంలో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుండటంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నిత్యం అనేక సమస్యలతో విధుల నిర్వహణ భారంగా మారుతోందని వాపోతున్నారు. సామర్థ్యానికి మించి.. గద్వాల ఆర్టీసీ డిపోలో 103 బస్సులు ఉండగా.. అందులో ఆర్టీసీకి చెందినవి 56, అద్దె బస్సులు 47 ఉన్నాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 50 – 60 మంది వరకు ప్రయాణింవచ్చు. గతంలో 10 నుంచి 20 మంది అదనంగా ప్రయాణించే వారు. ప్రస్తుతం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 80 నుంచి 100 మంది ప్రయాణిస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వయసు పైబడిన వారు, చిన్నారులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ సిబ్బంది సైతం సతమతమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడం.. కాలం చెల్లిన బస్సులతో డ్రైవర్లు, కండక్టర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పని ఒత్తిడితో పొరపాట్లు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఏ బస్సులో చూసినా మహిళలే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. సీట్ల కోసం మాటల యుద్దాలు, పిడిగుద్దుల వరకు వెళ్తున్నారు. ఈ పరిస్థితులు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ప్రయాణికుల రద్దీతో బస్సు ఆలస్యం కావడం.. కేఎంపీఎల్ రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. మరోవైపు కండక్టర్లు సైతం టికెట్లు ఇచ్చే సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. జీరో టికెట్ ఇచ్చే క్రమంలో తప్పిందాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. అధికారుల టార్గెట్.. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. ప్రస్తుతం పని గంటల్లో ఎలాంటి నిబంధన లేదు. దూర ప్రాంతాలకు వెళ్లిన క్రమంలో రాను, పోను 400 కి.మీ. డ్యూటీ చేయాల్సిందే. మరోవైపు అధికారుల టార్గెట్తో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. డ్రైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ ఇవ్వడం.. కేఎంపీఎల్ ఎందుకు రాలేదని అధికారుల ప్రశ్నలతో సతమతమవుతున్నారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కార్మిక యూనియన్లు లేకపోవడంతో సిబ్బందికి ఇష్టానుసారంగా డ్యూటీలు వేయడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీతోఉద్యోగుల సతమతం మహాలక్ష్మి పథకంతో పెరిగిన ఒత్తిడి నానాటికీ భారంగా మారుతున్న విధుల నిర్వహణ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు లేక అవస్థలు -
తక్షణ చర్యలు చేపట్టాలి..
మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్పాడు రిజర్వాయర్ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి. – రాజు, సీపీఎం నాయకుడు, ఆత్మకూర్ తాగునీటి కష్టాలు రానివ్వం.. వనపర్తి జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం. – అంజద్పాషా, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి ● -
వాణిజ్య పంటలతో లాభాలు బాగు
వనపర్తిటౌన్: రైతులు వరి మాత్రమే కాకుండా ఆయిల్పాం, పప్పుగింజలు, కూరగాయల సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పాం సాగు చేయాలన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో సరిపడా పామాయిల్, పప్పు దినుసుల నిల్వలు లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఆయిల్పాం సాగుచేస్తే 30 ఏళ్ల పాటు దిగుబడి పొందవచ్చని కోరారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లో సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు అర్హత సాధిస్తారని వెల్లడించారు. ఆయిల్పాం సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులను ప్రత్యేక బస్సులో సాగు చేస్తున్న రైతుల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి, ప్రత్యేక నోడల్ అధికారి ప్రసాదరావు, వ్యవసాయశాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ కృపాకర్రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి, వీణా, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం సరికాదని.. తూకం చేసిన వెంటనే రైస్మిల్లులకు తరలించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును పార్టీ నాయకుల బృందంతో కలిసి సందర్శించారు. ఐకేపీ, సింగిల్విండో ద్వారా కొనసాగుతున్న కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా తూకం చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వెంటనే పూర్తిచేసి తరలించాలని కోరారు. లారీల కొరతతో తూకం చేసిన ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందన్నారు. మిల్లు యజమానులు ధాన్యం దించుకునే సమయంలో సమస్యలు సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని.. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్రెడ్డి, జీఎస్ గోపి, మండ్ల రాజు, జిల్లా కమిటీ సభ్యులు బాల్యానాయక్, ఆంజనేయులు, ఆసీఫ్, కార్యదర్శి ఉమా తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
వైద్యశాఖలో అలజడి
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో గందరగోళం సృష్టించిన ఉద్యోగుల నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో కాంట్రాక్టు ఉద్యోగాలు పొందారంటూ తరుచూ కలెక్టరేట్ ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో కొన్ని నెలలుగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేశారని, విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డి మీడియాకు వెల్లడించారు. కష్టపడి చదివి తెచ్చుకున్న విద్యార్హతను నకిలీగా చిత్రీకరించి ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారంటూ వారిలో ఒకరైన శిరీష డీఎంహెచ్ఓపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల వనపర్తి కోర్టు ఈ దావాను స్వీకరించినట్లు తెలిసింది. 2026, జూన్ 12న కోర్టుకు హాజరుకావాలని తెలిపినట్లు సమాచారం. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొంది ఉంటే తీసుకున్న వేతన రికవరీకి ఎందుకు ఉపక్రమించలేదని, యూనివర్సిటీ డిక్లరేషన్ కాపీ ఎందుకు బయటపెట్టడం లేదనే అంశాలు వైద్య, ఆరోగ్యశాఖలో సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ డా. సాయినాథ్రెడ్డి వద్ద ప్రస్తావించగా.. అదంతా గడిచిపోయిన విషయమని, చట్టప్రకారం వెళ్తున్నామని, ఎక్కువగా మాట్లాడటం సరికాదని బదులిచ్చారు. జిల్లా వైద్యాధికారిపై పరువునష్టం దావా -
పారదర్శకంగా రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు
గద్వాల: జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ పారదర్శకంగా చేపట్టాలని.. ఎక్కడైనా నగదు స్వీకరణ జరిగితే వెంటనే రెడ్క్రాస్ సొసైటీ ఖాతాలో జమ చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 1200 మంది రెడ్క్రాస్ సభ్యులు ఉండగా.. మరికొంత మంది నమోదు ప్రక్రియలో ఉన్నారన్నారు. ఈ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులు విద్యాసంస్థలు, స్వచ్చంద సంస్థలు, యువత ముందుకురావాలని కోరారు. జీవితకాలం సభ్యత్వం రూ.వెయ్యి మాత్రమే ఉండటం వల్ల ప్రజలు సులభంగా సభ్యత్వం పొందవచ్చన్నారు. సభ్యత్వ నమోదు కోసం కలెక్టరేట్లోని ప్రజాపాలన విభాగంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేసి.. అక్కడే నేరుగా రిజిస్ట్రేషన్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అందుకు అవసరమైన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలన్నారు. వార్షిక ఆడిట్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆర్థిక వ్యవహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, రెడ్క్రాస్ నోడల్ అధికారి వేణుగోపాల్, మంజుల, అజారుద్దీన్ తదితరులు ఉన్నారు. ఈవీఎంల గోదాం పరిశీలన.. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మంజుల ఉన్నారు. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
ఇటిక్యాల: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ జగ్గూనాయక్, అలంపూర్ ఏడీఏ సక్రియానాయక్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బీచుపల్లి ఆయిల్ మిల్లులో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పంటల స్టాల్స్ ఏర్పాటుచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలు పెరగడంతో రైతులు వరి, మొక్కజొన్న, పత్తి వంటి సంప్రదాయ పంటలను అధికంగా సాగుచేస్తున్నారని.. వాటితో పోలిస్తే ఆయిల్పాం సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఒకసారి మొక్కలు నాటితే 25 నుంచి 30 ఏళ్ల వరకు రైతుకు స్ధిరమైన దిగుబడి వస్తుందన్నారు. ఈ పంటకు చీడపీడల సమస్య తక్కువగా ఉండటంతో పాటు అకాల వర్షాల ప్రభావం ఉండదన్నారు. మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. రైతులు ఆయిల్పాం సాగును విస్తృతంగా చేపట్టి అధిక లాభాలు పొందాలని సూచించారు. పంటమార్పిడితో నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విజితా బీసీరెడ్డి, ఆయిల్ఫెడ్ నర్సరీ ఇన్చార్జి శివనాగిరెడ్డి, ఫ్యాక్టరీ ఇన్చార్జి బాలకృష్ణ, ఉద్యానశాఖ అధికారులు ఇమ్రానా, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
● సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం గద్వాల మండలం చెనుగోనుపల్లి, అనంతపురం–1, బసల్చెర్వు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉండటం, లారీలు తక్కువగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రానికి రోజు కనీసం నాలుగు లారీలు పంపించాలని తెలిపారు. రైతులు ఎండలో ఎక్కువసేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం ఎక్కువగా వచ్చిన కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చి.. సమీప మిల్లులకు పంపడం ద్వారా సమయం వృథా కాదన్నారు. అదే విధంగా గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. కేంద్రంలో ఉన్న ధాన్యం నిల్వలు, తేమశాతం, పంపిన లోడ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఎం అరుణ, ఏఈఓ ఉషశ్రీ, రవి ఉన్నారు. ● రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల 31వ తేదీ వరకు సభ్యత్వ నమోదును సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను కలెక్టరేట్లో ప్రత్యేక డాటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు అదనపు కలెక్టర్ నర్సింగ్రావును ఉపాధ్యక్షుడిగా, ప్రత్యేక అధికారిగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి వేణుగోపాల్, జిల్లా ఉపాధి కల్పన అధికారి చరణ్ దీప్ను నోడల్ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. సభ్యత్వ రుసుం పేట్రన్ రూ. 25వేలు, వైస్ పేట్రన్ రూ. 12వేలు, లైఫ్ సభ్యత్వం రూ.1,000, సంస్థాగత సభ్యత్వం సంవత్సరానికి రూ. 5వేలు ఉంటుందన్నారు. రెడ్క్రాస్కు ఇచ్చే విరాళాలకు 80జీ కింద పన్ను మినహాయింపు ఉంటుందన్నా రు. ఈ మానవతా సేవలో భాగంగా ప్రజలు విరా ళాలు ఇవ్వడం, సభ్యత్వం పొందడం లేదా స్వచ్ఛంద సేవలకులుగా పాల్గొనవచ్చని తెలిపారు. సేవాభావాన్ని అలవర్చుకోవాలి బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన తర్వాత సేవాభావం, సహానుభూతి, మానత్వంతో కూడిన సేవలను ప్రజలకు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో నిర్వహించిన నర్సింగ్ కాలేజీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. నర్సింగ్ కాలజీ మొదటి బ్యాచ్కు చెందిన 87 మంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకుని వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. అందరూ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతమ్మ, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, ఏఓ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’కి ఊతం!
గద్వాలన్యూటౌన్: ఈ నెలలో వ్యవసాయ పనులు ఉండవు. గ్రామీణ కూలీలకు ఉపాధిహామీ పనులే దిక్కు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ద్వారా ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 200 మంది కూలీలకు పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపికచేసిన కొన్ని పనులకు ప్రాధాన్యత ఇస్తూ.. అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. వలసలు వెళ్లకుండా.. సాధారణంగా మే ప్రారంభం నుంచి జూన్ మొదటి వారం వరకు వ్యవసాయ పనులు ఉండవు. దీంతో వేలాది మంది కూలీలు ఇతర పనులకు వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో స్థానికంగా పనులు దొరక్కపోతే.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఎందుకంటే కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బుతోనే వారి కుటుంబ పోషణ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించాలని స్పష్టంగా ఆదేశించింది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం ఒక్కో జీపీలో సరాసరి 70 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం 200 మంది కూలీలకు పనులు కల్పించడం ద్వారా వలసలను నివారించడంతో పాటు కూలీలు ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా ఉంటారని.. వారి కుటుంబ పోషణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు బావిస్తున్నారు. కొన్ని పనులకు ప్రాధాన్యత.. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రధానంగా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్ పిట్లు, నాడేక్ కంపోస్ట్ పిట్లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, కోళ్ల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు చేపడతారు. అయితే జూన్లో వర్షాకాలం ప్రారంభవుతుంది. చెరువులు, ఊటకుంటలు, కాల్వల్లో పనులు చేయడం ఇబ్బంది. ఇదే సమయంలో పొలాలకు ఒండ్రుమట్టి అవసరం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కాల్వల్లో షిల్ట్ తొలగింపు, చెరువులు, ఊటకుంటల్లో ఒండ్రుమట్టి పూడికతీత, ఇంకా పశువులకు నీటి ఎద్దడి లేకుండా నీటితొట్ల నిర్మాణం, గొర్రెలు, పశువులకు పాకాలు తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి జీపీలో 200 మందికి పనులు కల్పించేలా ప్రణాళిక జూన్ మొదటి వారం వరకు వ్యవసాయ పనులు కరువు గ్రామీణ కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధి కల్పన వేసవిలో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం -
మొక్కజొన్న రైతుకు తప్పని తిప్పలు
రాజోళి: మొక్కజొన్న రైతులకు క్షణక్షణం గండంగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉన్నా తమవంతు వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాలకు బలికాక తప్పని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్నలు తీసుకొస్తే.. కనీసం కుప్పగా పోసుకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని.. ఇదే క్రమంలో ఎక్కడో చోట పోసుకున్న ధాన్యానికి రక్షణ లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. తమ దుస్థితి ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదని వాపోతున్నారు. ● రాజోళి, వడ్డేపల్లి తదితర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. గత వారంలో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోగా.. ఎండలు ఉన్న కారణంగా ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో రైతులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. చోరీకి గురవుతున్న ధాన్యం.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా గుర్తుతెలియని దుండగులు ధాన్యాన్ని చోరీ చేస్తున్నారు. ఇటీవల వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన రైతు 3 క్వింటాళ్ల ధాన్యం చోరీకి గురైంది. దీంతో రైతు పడిన బాధ వర్ణనాతీతం. అయితే మరికొందరి ధాన్యం కిలోల లెక్కన చోరీకి గురవుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రాల వద్ద ధాన్యాన్ని రక్షించుకునేందుకు రాత్రి, పగలు పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు.. వడ్డేపల్లి కొనుగోలు కేంద్రం వద్ద వారం రోజులు గా మొక్కజొన్న అమ్మేందుకు పడిగాపులు కాస్తు న్నా. ఈ క్రమంలో ధా న్యం కుప్పలో 3 క్వింటాళ్ల మేర చోరీకి గురైంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం దొంగలపాలైంది. అధికారులు త్వరగా కొనుగోలు చేయాలి. – ఎద్దుల తిమ్మప్ప, రైతు, తనగల వర్షాల భయం వెంటాడుతుంది మొక్కజొన్న అమ్మకాల్లో ఆలస్యం జరిగినా ఓపిగ్గా ఉంటున్నాం. కానీ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయకుండా ఎదురుచూడాలంటే ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే అన్ని ఖర్చులు రైతులే భరిస్తున్నారు. ఈ సమయంలో వర్షాల భయం వెంటాడుతుంది. అమ్మకాల ప్రక్రియలో వేగం పెంచాలి. – సునీల్, రైతు, వడ్డేపల్లి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు అకాల వర్షాలతో ఆందోళన -
‘నేతన్నకు పొదుపు’ జాడేది?
అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్డి–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్డి–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్ ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లకుగాను రూ.2.64 కోట్లు మాత్రమే జమ -
అదనపు కలెక్టర్గా సీహెచ్ మధుమోహన్
గద్వాల: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్గా మధుమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ రెవెన్యూ అదనపు కలెక్టర్గా పనిచేసిన వి.లక్ష్మీనారాయణ గతనెల 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో కామారెడ్డి డీఆర్వోగా పనిచేస్తున్న సీహెచ్.మధుమోహన్ను ప్రభుత్వం నియమించింది. నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత ధరూరు: మండలంలోని రేవులపల్లి వద్ద ఉన్న మిషన్ భగీరథ నీటిశుద్ధి కర్మాగారాన్ని శుభ్రపరిచేందుకు గాను బుధవారం తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవిచంద్రకుమార్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం నీటి సరఫరా ఉండదని.. ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. గురువారం నుంచి నీటి సరఫరా యథావిధిగా ఉంటుందని తెలిపారు. జోగుళాంబ సన్నిధిలో దివ్యమైన అనుభూతి అలంపూర్ రూరల్: అష్టదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన శ్రీజోగుళాంబదేవి అమ్మవారి సన్నిధిలోనే దివ్యమైన అనుభూతి కలుగుతుందని హైదరాబాద్ పురాణపీఠం అనంతసాహితీ ఆశ్రమం గురువు శ్రీఅనంతానంద భారతి స్వామిజీ అన్నారు. మంగళవారం అలంపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. హిందూ సమాజంపై గౌరవభావం, స్వధర్మంపై అంకితభావం వికసింపజేయాల్సిన అవసరముందన్నారు. హిందువులంతా జాగృతమై సమాజ సంరక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ కట్ట ప్రభాకర్, కార్యదర్శి కావలి శ్రీనివాసులు, నాగమద్దిలేటి, నాగమల్లయ్య, నరేశ్, సర్పంచ్ ఈశ్వరయ్య, రంగస్వామి, జగదీశ్ పాల్గొన్నారు. రేపు బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి అండర్–19, అండర్–22 బాలబాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బొంబాయి నర్సింహులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు 10 వెయిట్ కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని, 7వ తేదీ(గురువారం) ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు. యువతకు ఉపాధి రంగాల్లో శిక్షణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7, 8 తేదీల్లో నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కెరీర్ గోల్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇంటర్నెట్ అవగాహన, ఫైనాన్సియల్ లిటరసీ, ఇండస్ట్రీయల్ అవగాహన, ప్రాబ్లం సాల్వింగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్ను సంప్రదించాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.7,392 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వద్దు
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులపై పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో 74 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలన్నారు. అలాగే మండలాల్లో అధికారులు ప్రజావాణిని సక్రమంగా నిర్వహిస్తే చిన్నపాటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జనాభా గణనలో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతి పంచాయతీ నుంచి కనీసం వందమంది పాల్గొనేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాకు 11 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇందుకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు మొక్కలు పెంచడానికి తమ పరిధిలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో గుర్తించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఎఫ్ఓ ఆశీస్సింగ్, ఎస్డీసీ కృష్ణ, ఏఓ భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన వరిధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజిలెన్స్ అధికారులు తమ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలన్నారు. రైతులతో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసి సకాలంలో వారికి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. -
వరి.. వర్షార్పణం
రాజోళి: ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ’ చందంగా మారింది రైతుల పరిస్థితి. పంటను పండించే వరకు నానా కష్టాలు పడి కాపాడుకుంటే.. కోత కోసి అమ్ముకుందామనేలోగా ప్రకృతి వైపరీత్యాలతో పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ఏడాది కూడా రైతుకు పూర్తిస్థాయిలో నష్టమే జరిగినట్లుగా అధికారుల అంచనాలు తెలుస్తున్నాయి. జిల్లాలో గత నెలలో కురిసిన అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న అరటి, మినుము, మామిడి పంటలతోపాటు.. అత్యధికంగా సాగవుతున్న వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో పైసా చేతికి రాలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లా పరిధిలో ఇలా.. గత నెలలో ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం కారణంగా పలుచోట్ల పంటలపై ప్రభావం తీవ్రంగా పడింది. రాజోళి మండలంలోని మాన్దొడ్డితోపాటు చుట్టు పక్కల గ్రామాలు, అయిజ మండలంలో తీవ్రంగా చూపడంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. గంటల వ్యవధిలోనే జిల్లా ఉన్నతాధికారులు గ్రామాలకు చేరుకుని పంటలను పరిశీలించారంటే నష్టం ఎంత మొత్తంలో ఉంటుందో ఊహించవచ్చు. అధికారుల అంచనా వేసిన దాని ప్రకారం 33 శాతంపైగా పంట దెబ్బతిందని గుర్తించారంటే ఆ పంటలు అసలు పనికి రావని నిర్ధారణ అయినట్లే. అలాంటి జాబితాలో ప్రస్తుతం పంటల వివరాలు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు 1,800 ఎకరాలకుపైగా (80 శాతం) పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరి కంకి మొత్తం రాలిపోయి.. పైరు అడ్డం పడిపోయి, నేలరాలిన గింజ దేనికి పనికి రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి బలైన రైతు అధికారుల అంచనాల్లోనే 1,800 ఎకరాలకుపైగా పంట నష్టం జిల్లాలో సింహభాగం నష్టపోయింది వరి రైతులే.. 85 శాతం మేర పూర్తిగా నష్టపోయినట్లు గుర్తింపు పరిహారంపైనే రైతుల ఆశలు -
10 ఎకరాలు పోయింది..
సొంత భూమితోపాటు కౌలు తీసుకున్న దానితో కలిపి మొత్తం 10 ఎకరాలు వరి పంట సాగు చేశాను. ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం రాలిపోయింది. చేనులోనే రాలిపోయిన గింజలను చూస్తే ప్రాణం తరుక్కుపోతుంది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాను. – పాపన్న, రైతు, మాన్దొడ్డిఉన్నతాధికారులకు పంపాం.. అకాల వర్షానికి జిల్లాలో ఎక్కువగా రాజోళి మండలంలోని మాన్దొడ్డి పరిసర గ్రామాలు, అయిజ మండలంలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా వరి పంట చేతికి రాని విధంగా తయారైంది. పంటలో జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాం. – వీరప్ప, డీఏఓ ● -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
ఎర్రవల్లి: విద్యార్థులు విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పదో పటాలం కమాండెంట్ జయరాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో నిర్వహించిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్లో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం మోపకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి విద్యను అభ్యసిస్తూ తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధిరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నర్సింహారెడ్డి, శ్రీనివాసులు, రాజేశం, పాఠశాల హెచ్ఎం షేక్షావలి, ఉపాధ్యాయులు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం బస్తాలు తరలించండి అలంపూర్: కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న ధాన్యం బస్తాలు తరలించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో సోమవారం ఆర్డీఓ శ్రీనివాస్రావుకు తెలంగాణ రైతు సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు చేసి మార్క్ఫెడ్ సంస్థ వాటిని తరలించడంలో చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుండటంతో ఇక్కడే తమ ధాన్యం విక్రయించారని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని గోదాంలకు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా కొనుగో లు కేంద్రాల్లో 50 వేల క్వింటాళ్ల ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కేంద్రాల్లో నిలిచిన ధాన్యం బస్తాలను తరలించడానికి చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. అధికారులు ధాన్యం బస్తాల తరలింపులో స్పందించకపోతే జాతీయ రహదారి–44పై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైతు సంఘం నాయకులు మద్దిలేటి, రైతులు వెంకటేశ్వర్లు, నర్సింహరాజు, చాంద్బాష తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకపోతే పోరాటం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇవ్వాలని టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో 900మందికి 60–75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్బెడ్రూం ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పేదలకు మోసం మండిపడ్డారు. అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేస్తూ నిరుపేదలను క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ గూడు వింటారని ఆశతో ఏడాది నుంచి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే కలుస్తూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటం తప్పదని హె చ్చరించారు. అనంతరం ఆర్డీఓ నవీన్కు వినతిపత్రం అందజేశారు. -
టెండర్ ప్రక్రియ పూర్తి..
జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరమ్మతు పూర్తి చేస్తాం.. జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ● -
ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపర్చాలి
అలంపూర్: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని డీసీహెచ్ఎస్ రమేష్చంద్ర అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆస్పత్రిలో పీహెచ్సీ వైద్యాధికారులు, పీఓ ఎంసీహెచ్ సర్వీసెస్, ఏరియా ఆస్పత్రి సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా ఆస్పత్రిలో మదర్ అండ్ చైల్డ్ కేర్ సర్వీసెస్ మరింత మెరుగుపర్చాలన్నారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. చికిత్స కోసం వచ్చే వారికి డైట్ సర్వీసెస్ అందించడం జరుగుతుందన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహ ణ మెరుగుపర్చాలన్నారు. జనరల్ సర్జరీలు, ఆప్త మాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ సేవలను ఆస్ప త్రిలో అందిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యశ్రీలో జనరల్ సర్జరీలో అప్రెంటిక్స్ ఫిస్టులా శరీరంలో కంతులు రొమ్ములో కంతులు థైరాయిడ్ సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్ బాష, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసన్న, డాక్టర్లు నిఖిల, సుహానా, ఆనస్తీషియా గిరిభాస్కర్, వైద్య సిబ్బంది సుబ్బలక్ష్మి, త్రివేణి పాల్గొన్నారు. -
సరిహద్దులు దాటిన లింకులు
● ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ నకిలీ ధ్రువపత్రాల దందా ● కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా సబ్ రిజిస్ట్రార్ ముద్రలు గుర్తింపు ● పోలీస్, రెవెన్యూ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..గట్టు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ కేంద్రంగా సాగిన నకిలీ ధ్రువపత్రాల తయారీ దందా వ్యవహారం ఏకంగా మూడు రాష్ట్రాలకు విస్తరించింది. ఇటీవల అయిజలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ను రెవెన్యూ అధికారులు తనిఖీ చేయగా నకిలీ ధ్రువపత్రాల ముద్రింపు దందా వెలుగు చూసిన విష యం తెలిసిందే. అయితే అయిజ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల సృష్టిలో గట్టు మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పైరవీకారుల ప్రమే యం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అయిజ టు గట్టు’ కథనం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ పత్రాల దందాలో పాత్రదారులు, సూత్రదారులను గుర్తించి.. శిక్షిస్తారా.. లేక ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తారా.. అన్న సందేహాలను ఇక్కడి వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, రైతుబీమా, భూ భారతి పోర్టల్కు సంబంధించి నకిలీ పత్రాలతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నకిలీ దందాలో భాగస్వాములుగా ఉన్న వారిలో ఇప్పటికే టెన్షన్ నెలకొంది. ఎక్కడ తమ పేర్లు బయట పడతాయోనని ఆందోళన చెందుతున్నారు. నకిలీ దందా నుంచి బయట పడేందుకు మార్గాలనే వెతుక్కుంటున్నారు. ఇప్పటికే ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ను రెవెన్యూ, పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకుని గుట్టు విప్పే పనిలో ఉన్నట్లు సమాచారం. దిమ్మతిరిగే వాస్తవాలు.. కంప్యూటర్ లోగుట్టును విప్పుతున్న క్రమంలో అధికారులు దిమ్మతిరిగే వాస్తవాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ నకిలీ దందా వ్యవహారం కేవలం అయిజ, గట్టు మండలాలకే కాకుండా.. ఏకంగా అంతర్ రాష్ట్ర స్థాయికి చేరుకున్నట్లు తెలిసింది. కర్ణాటకతోపాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన స్టాంపులు, ఆధార్ కార్డులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. కర్ణాటకలోని గుల్బర్గా సబ్ రిజిస్ట్రార్ స్టాంపు, సంతకం ఉన్న స్టాంపు, ఆంధ్రప్రదేశ్లోని పత్తికొండ ప్రాంతానికి చెందిన అధికారుల ముద్రలు, సంతకాలు ఉన్న స్టాంపులను గుర్తించినట్లు సమాచారం. ఇక గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ల సంతకాలకు సంబంధించిన స్టాంపు (ముద్ర)లను సైతం అధికారులు గుర్తించారు. వీటితోపాటు డిగ్రీ, ఎస్సెస్సీ సర్టిఫికెట్లు, ఆయా బ్యాంకులకు సంబందించిన నో డ్యూలు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. అయిజ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా కొనసాగిన నకిలీదందా వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
పంట కోసి 15 రోజులు..
వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి దాదాపు 15 రోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఒక్కరోజు మాత్రమే దొడ్డు వడ్లను కొనుగోలు చేసి మధ్యలోనే ఆపేశారు. వడగండ్ల వానలు పడుతుండటంతో చేతికొచ్చిన పంట ఆగమవుతుందని పానం గుబులవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వడ్ల కుప్పలకు టార్పాలిన్ కవర్లను కప్పుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలి. – బోయ పరశురాముడు, రైతు, కొండేరు గ్రామం, ఇటిక్యాల● -
సన్నాలకే మొగ్గు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. -
కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. -
మత్తు.. భవితకు చేటు
గద్వాల క్రైం: గంజాయి, డ్రగ్స్, పొగాకు వంటి మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది. చెడు వ్యవసనాలపై ఉక్కుపాదం మోపుతూ, చట్టాలపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – పల్లె ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ప్రధాన అంశమైన పిల్లల రక్షణ, మత్తు పదార్థాల రహిత నవ సమాజ నిర్మాణ కార్యాక్రమాన్ని వారం రోజల పాటు వారోత్సవాల కార్యచరణ చేపట్టింది. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. విక్రేతలపై కేసులు నమోదు చేసి, బహిరంగ మార్కెట్లో వాటి సరఫరాకు అడ్డుకట్ట వేసింది. తాజాగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అధికారులు ప్రజల వద్దకు చేరుకుని చట్టాలపై ప్రజలను చైతన్యం పరుస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల, రైల్వేస్టేషన్, బస్టాండ్, అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెడు వ్యసనాలకు ఆకర్శితులై.. ప్రభుత్వం మత్తు పదార్థాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో చేరడం లేదనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు అధికారులు నిరంతరం నిఘా పెట్టినా చెడ్డు వ్యవసనాలకు ఆకర్శితులైన కొందరు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువతపై పోలీసు శాఖ నిఘా ఉంచి, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న దాడులు, చిన్నారులపై జరుగుతున్న వికృత చేష్టలపై (బ్యాడ్ టచ్, గుడ్ టచ్) విషయాలు తెలియజేస్తున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే సమస్యలు, లైగింక దాడులు, పోక్సో కేసుల తీవ్రత, లింగ సమానత్వం, పౌష్టికాహారం వినియోగంతో పాటు విద్య, వైద్య సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్య అంటే కేవలం ఉద్యోగం, డబ్బు సంపాదించడం కాదనే విషయాన్ని యువత గుర్తించాలని, జీవనశైలి అలవరుస్తుందన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు, భరోసా సెంటర్ నిర్వాహకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలతో మమేకమై మత్తు పదార్థాల నిర్మూలనపై పోరాడాలని సూచిస్తున్నారు. గంజాయి తాగినా, అమ్మినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలనే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రత్యేక నిఘా.. గ్రామాల్లో 15 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువకుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. వేసవి సెలువుల నేపథ్యంలో వారిని స్కిల్ డెవలప్మెంట్ వైపు మళ్లించేలా చూస్తున్నారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునే సమయంలో యువత తీసుకునే మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం వంటి వాటిపై మఫ్టీ పోలీసులు నిరంతరం కూపీలాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలన వారోత్సవాలు ప్రజాపాలన–పల్లె ప్రగతి కార్యక్రమంలో కసరత్తు మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం అన్ని శాఖల సమన్వయంతోకార్యక్రమాలు చట్టాలపై అవగాహన అవసరం -
ప్రశాంతంగా నీట్
● 911మంది అభ్యర్థులు హాజరు బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద అభ్యర్థులు, వారి కుటుంబీకుల సందడి గద్వాల: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు.. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో మొత్తం 930 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 911మంది అభ్యర్థులు హాజరైనట్లు పరీక్షల కో–ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష కొనసాగగా.. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ శంకర్ పర్యవేక్షించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు కో–ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి తెలిపారు. -
ప్రగతి వైపు పయనించాలి
జిల్లావ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తు, యువతను ప్రగతి వైపునకు తీసుకురావాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గద్వాలను గంజాయి రహిత జిల్లాగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వారం రోజులపాటు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాల్య వివాహాల వల్లన జరిగే సమస్యలు, మహిళలపై వేధింపులు, దాడులకు విధించే శిక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరుస్తున్నాం. – టి శ్రీనివాసరావు, ఎస్పీ ● -
నేడు ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి : కలెక్టర్
అలంపూర్: క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్యార్డు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే ప్రజావాణిలో అన్ని శాఖల డివిజన్స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు డిప్యూటీ తహసీల్దార్లు వేణుగోపాల్రెడ్డి, వెంకటరమణలను పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదులను సీజీజీ ప్రజావాణి పోర్టల్లో నమోదుచేసి.. అంగీకార పత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు. ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్లో పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాటా దక్కడం లేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వంనుంచి మనకు ప్రత్యేకంగా ఒరిగిందేమి లేదని అసహనం వ్యక్తం చేశారు.అయిజ టు గట్టు ● నకిలీ పత్రాల తయారీ దందాలో గట్టుకు లింకులు ● కూపీ లాగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు – వివరాలు 8లో.. -
మళ్లీ మొదటికొచ్చింది
ప్రయాణానికి ప్రతికూలంగా అంతర్రాష్ట్ర రహదారి అయిజ: అంతర్రాష్ట్ర రహదారి కర్నూలు– రాయచూరు రోడ్డుపై అయిజ సమీపంలో పెద్దవాగుపై సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలమైంది. రక్షణ గోడల రాళ్లు ఊడిపడ్డాయి. శిథిలమైన రోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే శిథిలమైన కాజ్వేను తొలగించి.. అదే ప్రదేశంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్ల అంచనాతో ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. 2024– 25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నుంచి ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అధికారులు ప్రతిపాదనలు పంపిన అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం, వాటికి నిధుల మంజూరు, సకాలంలో విడుదల చేయడం వంటివి చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం సమయం ముగియకముందే ప్రక్రియ మొత్తం పూర్తవ్వాల్సి ఉంటుంది. శిథిలావస్థలో నాలుగు కల్వర్టులు.. మండలంలోని వెంకటాపురం నుంచి అయిజ పట్టణం వరకు గతంలో నిర్మించిన కల్వర్టులు శిథిలమయ్యాయి. బీటీ రోడ్డుపై అనేక చోట్ల మోకాలులోతు గోతులు ఏర్పడ్డాయి. వాటిని తొలగించి నూతనంగా కల్వర్టులు నిర్మించేందుకు గతేడాది రూ.3 కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెక్నికల్ డ్రాయింగ్ అప్రూవల్ కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చుట్టపు చూపుగా వెళ్లి పరామర్శించడం, మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం చేస్తున్నారే గాని సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు వెళ్లలేని దుస్థితి నిధులున్నా ప్రారంభించని కల్వర్టు పనులు ఇప్పటికీ పూర్తికాని డ్రాయింగ్ అప్రూవల్ కొత్తగా ప్రతిపాదనలు పంపాలంటున్న ప్రభుత్వం -
ప్రతిపాదనలు బుట్టదాఖలు..
అయిజ సమీపంలోని పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్ల అంచనాతో ఆర్అండ్బీ ఈఈ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, ఇంత వరకు నిధులు మంజూరు కాలేదు. అదేవిధంగా నాలుగు కల్వర్టులు పునర్ నిర్మించేందుకు 2024లో రూ.3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. – నజీర్, అయిజ మరమ్మతు చేపట్టాలి.. క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు ఎక్కువగా అంబులెన్స్లు గద్వాల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు కర్నూలుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ, ఇక్కడి కాజ్వే పూర్తిగా దెబ్బతినడంతో రోడ్డుపై వేగంగా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాల మీదకు వస్తుంది. హైలెవల్ బ్రిడ్జి నిర్మించి, కల్వర్టులలకు మరమ్మతు చేస్తే బాగుంటుంది. – తిరుమలేష్, 108 సిబ్బంది ప్రతిపాదనలు పంపించాం.. అయిజ పెద్దవాగుపై శిథిలమైన కాజ్వేను తొలగించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఆర్థిక సంవత్సరం ముగియడంతో మళ్లీ ఈసారి కొత్తగా పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియ పూర్తయి నిధులు విడుదలైతేనే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభిస్తాం. అలాగే నాలుగు కల్వర్టులు నిర్మించేందుకు 2024లో రూ.3 కోట్లు మంజూరయ్యాయి. టెక్నికల్ డ్రాయింగ్ అప్రూవల్కు పంపాం. – అల్తాఫ్, ఆర్అండ్బీ ఏఈ ● -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
గద్వాల: అబద్ధపు హామీలతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ క్రమంలోనే బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే జనాగ్రహ సభకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆమె స్థానిక బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారం కోసం అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనాగ్రహసభ నిర్వహిస్తున్నామని, ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలించి రాష్ట్రాన్ని అప్పులకుప్పుగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను నమ్మి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. గతంలో వాజ్పేయి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ అని, అనంతరం మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది కూడా అదే పార్టీ అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోనూ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి ఎన్నికై న నరెంద్రమోదీ తొలిసారిగా ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవరావు, రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, వెంకట్రాములు, రవికుమార్, శివారెడ్డి, రాజగోపాల్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
గద్వాల: విద్యార్థులు చదువుతోపాటు వివిధ రకాల కళల్లోనూ రాణించాలని, ఇందుకోసం బాలభవన్లో వివిధ అంశాలపై ఇచ్చే వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శనివారం గద్వాల బాల భవన్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే పాగ పుల్లారెడ్డి 107వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో పిల్లలు సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ సమయాన్ని వృథా చేయకుండా బాలభవన్లో నేర్పించే శాసీ్త్రయ, జానపద నృత్యం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ పొందితే గొప్ప కళాకారులుగా రాణించే అవకాశం ఉందన్నారు. ఒకే అంశంలో కాకుండా విభిన్న రంగాల్లో శిక్షణ పొంది బహుముఖ ప్రజ్ఞశాలురుగా పేరు తెచ్చుకోవాలన్నారు. విద్యార్థులు తాము నేర్చుకునే నృత్యం, సంగీతం, వేదికలపై స్టేజీఫియర్ లేకుండా ధైర్యంగా ప్రదర్శించాలన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా త్వరలో విద్యా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒకరోజు బాలభవన్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కలెక్టర్ బాలభవన్ విద్యార్థులతో నేర్చుకునే వివిధ అంశాల గురించి వారి భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడారు. అంతకు ముందు బాలభవన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి పూర్వ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చూపిన ప్రతిభ సాధించిన అవార్డులు అక్కడ ఇస్తున్న శిక్షణ గురించి క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, డాక్టర్ అనంతలక్ష్మి, విద్యాశాఖ అధికారులు శ్రీనివాసులు, మైఖేల్, సత్యం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అడవి ‘బయటికి’ బిడ్డలు
●జీవనోపాధి కావాలి.. ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలని అంటున్నారు. ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్ చేపట్టాలి. పునరావాసంతోపాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్ బైల్, అమ్రాబాద్ మండలం పరిహారం ఇస్తేనే వెళ్తాం.. అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య,తాటిగుండాలపెంట సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు. సంఘర్షణ నిర్మూలన కోసం.. అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. స్పష్టత కరువు నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వా రికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బా చారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీల ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది. పరిహారం అందితేనే రీలొకేషన్కు.. నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. నల్లమలలో చెంచుపెంటల తరలింపు ప్రక్రియ వేగవంతం మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు బలవంతం లేదు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. రీలొకేషన్ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్చంద్ర, ఐఎఫ్ఎస్ అధికారి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్


