breaking news
Jogulamba District Latest News
-
పెండింగ్ బిల్లులు, పీఆర్సీ సాధనకు ఉద్యమించాలి
గద్వాలటౌన్: ఐక్య పోరాటాల ద్వారానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ సాధనకు ఉద్యమించాలని ఎస్టీయూ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పర్వతరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు కలిసి పోరాడాలని సూచించారు. అప్పుడే ఎంఈఓ, జేఎల్, డిప్యూటి డీఈఓల పదోన్నతులకు మార్గం ఏర్పడుతుందన్నారు. పెండింగ్లో ఉన్న అయిదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపయోగపడని శిక్షణలతో ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. హెల్త్ కార్డు ఉత్తర్వులను విడుదల చేయాలని కోరారు. జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేసి, స్వంత జిల్లాకు పంపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా పులిపాటి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా యూనుస్పాషా, ఆర్థిక కార్యదర్శిగా విజయభాస్కర్, అడిషినల్ జనరల్ కార్యదర్శులుగా శ్రీహరి, ఇస్మాయిల్, అసోసియేట్ అధ్యక్షులుగా కృష్ణయ్య, అమరేష్బాబు తదితరులను ఎన్నికయ్యారు. -
నేడు ఎస్ఎల్ బీసీకి సీఎం రాక
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమ వారం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అవుట్ లెట్ టన్నెల్ను సందర్శించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ అవుట్ లెట్కు చేరుకొని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి హెలీకాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను పరిశీలిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాల్లో భాగంగా గత ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్లెట్ వద్ద సొరంగం కుంగి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీబీఎం ద్వారా టన్నెల్ తవ్వకాలకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేపట్టి టన్నెల్ మార్గంలో సుమారు వెయ్యి మీటర్ల వరకు లోతు వరకు ఉన్న షీర్జోన్, జియోఫిజికల్ పరిస్థితులను అంచనా వేయనున్నారు. ఆ తర్వాత టన్నెల్ తవ్వకాలపై నిర్ణయం తీసుకుంటారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణుల ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. 5న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని 5వ తేదీన బుధవారం ఉద యం 10.30 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ముందుగా రూ.1516 చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని, ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న భక్తులకు పూజా సామగ్రిని అందిచనున్నట్లు తెలిపారు. వ్రతానికి వచ్చే భక్తులు తమ వెంట దీపాలు, గంట, హారతి తీసుకురావాలని ఆయన సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడి లింగాల: రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా పంట దిగుబడి అధికంగా వస్తుందని పాలమూరు యూనివర్సిటీ విద్యార్ధులు అన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటను ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని అవగాహన కల్పించారు. పాలమూరు యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థులు మండలంలోని అప్పాయపల్లిలో ఆదివారం రూరల్ క్యాంప్ నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజల జీవన విధానంపై సర్వే చేశారు. మొక్కజొన్న, వరి, వేరుశనగ, మినుములు, ఆయిల్ఫాం, డ్రాగన్ ఫ్రూట్లలో ఉపయోగించే మందుల గురించి ఆరా తీశారు. గ్రామంలో పంటకు రసాయనిక మందుల వాడకం ఎక్కువగా ఉందని గమనించి, వర్మీ కంపోస్టు ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. పలు అంశాలపై కళా ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు డాక్టర్ బి.పర్వతాలు, డాక్టర్ గాలెన్న, విద్యార్థులు మశ్చేందర్, రాజేష్, శంకర్, ప్రశాంత్, గోపాల్, రాజేష్, బుగ్గప్ప, స్వప్న, విజయ, ఆశమ్మ, స్వాతి, మహేశ్వరి, అనూష్ తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,0 21 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 832 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటిని నిలిపివేశారని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూ సెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
కృత్రిమ పాదాల ఉచిత శిబిరం అభినందనీయం
స్టేషన్ మహబూబ్నగర్: దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ కోసం శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని ఇండోర్ హాల్లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్రెడ్డి, గుడిగోపురం మట్టారెడ్డి కుటుంబాల ఆర్థిక సహాయంతో ఆదివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ చేయడానికి నిర్వహించిన ఎంపిక శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ భావన పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం అన్నారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు పంపిణీ చేయడానికి నిర్వాహకులు కొలతలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, నాయకులు సుధాకర్రెడ్డి, ప్రశాంత్, సంపత్, ప్రమోద్కుమార్, సాంబశివరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
రహదారులపై దృష్టి..
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటి వరకు జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణ పనులకు ప్రధానంగా భూ సేకరణే అడ్డంకిగా మారడంతో.. ఈ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పెండింగ్లో ఉన్న భూ సేకరణను వేగవంతం చేయడం, నిర్వాసితులకు చట్టపరంగా పరిహారం చెల్లింపు పూర్తి చేయడంపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు అవుతుండటంతో భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి రాగానే విస్తరణ పనుల్లో వేగం పెరగనుంది. టెండర్ల దశలో బ్రిడ్జి నిర్మాణం.. కల్వకుర్తి– నంద్యాల జాతీయ రహదారి పనులు పూర్తికావొస్తున్నా.. కీలకమైన సోమశిల బ్రిడ్జి నిర్మాణం మాత్రం టెండర్ల దశలోనే ఉంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితేనే ఈ రహదారి ఏపీలోని నంద్యాల వరకు అనుసంధానం కానుంది. మరో రెండేళ్లలోపు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా.. టెండర్ల ప్రక్రియలోనే జాప్యం కొనసాగుతోంది. కాగా.. ఈ నెల 5న బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు. పూర్తికావొచ్చిన కల్వకుర్తి– నంద్యాల మహబూబ్నగర్– గుడేబల్లూరు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారి–167కే విస్తరణకు కేంద్రం ఇటీవల నిధులు మంజూరుచేసింది. మహబూబ్నగర్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గుడేబల్లూరు వరకు రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.2,278.38 కోట్లను వెచ్చించి 80.01 కి.మీ., మేర రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ మీదుగా ఏపీలోని మంత్రాలయం, రాయచూరు, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం మరింత సౌలభ్యంగా మారనుంది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్– దేవరకద్ర– మరికల్– జక్లేర్– మక్తల్ మీదుగా ప్రయాణించే వారికి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లావాసులకు ప్రయోజనం కలగనుంది. శ్రీశైలం దారిలో.. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మండలం కొట్ర మీదుగా శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రెండు వరుసలుగా ఉన్న ఈ దారిని ప్రయాణానికి సౌలభ్యంగా విస్తరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దారిలో అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఈగలపెంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సుమారు రూ.7,700 కోట్ల అంచనాతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండు నుంచి నాలుగు వరుసలుగా.. ఉమ్మడి జిల్లాలో రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి– మల్లేపల్లి– హాలియా– అలీనగర్– మిర్యాలగూడ మీదుగా వెళ్లే ఎన్హెచ్–167 జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిలో ట్రాఫిక్ పెరిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డును 219 కి.మీ., మేర నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. అలాగే జాతీయ రహదారి–167ఎన్ పరిధిలో మహబూబ్నగర్ బైపాస్ నిర్మాణానికి సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. మహబూబ్నగర్ శివారులోని అప్పన్నపల్లి గ్రామం వద్దనున్న రైల్వే ఓవర్బ్రిడ్జి(ఆర్వోబీ) నుంచి హన్వాడ మండలం చిన్నదర్పల్లి మీదుగా చించోలి రహదారి వరకు అనుసంధానం చేసేలా బైపాస్ నిర్మించనున్నారు. సుమారు 11 కి.మీ., మేర ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు ఆటంకం ప్రధాన అడ్డంకిగా మారిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశం హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు ప్రతిపాదనలు మహబూబ్నగర్– మరికల్ ఎన్హెచ్–167 పనులకు నిధులు మంజూరు కల్వకుర్తి నుంచి నాగర్కర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు చేపట్టిన జాతీయ రహదారి–167కే పనులు చివరి దశకు చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ రహదారి పనులు చాలా వరకు పూర్తి కాగా.. బైపాస్, సర్కిళ్లు, బ్రిడ్జిల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. కల్వకుర్తి నుంచి తాడూరు మండల కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు పూర్తవగా.. తాడూరు నుంచి నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం వరకు పనులు పెండింగ్లో ఉన్నాయి. నాగర్కర్నూల్లోని కొల్లాపూర్ చౌరస్తా నుంచి పెద్దకొత్తపల్లి మీదుగా కొల్లాపూర్ వరకు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల వద్ద పేవ్మెంట్, సైడ్వేల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం చౌరస్తా నుంచి కృష్ణా తీరంలోని సోమశిల వరకు కొనసాగుతున్న పనుల్లో వేగం పెరిగింది. సోమశిల వద్ద కృష్ణానదిపై చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో రాకపోకలకు ప్రారంభం కానున్నాయి. -
‘ఉపాధి’కి కసరత్తు
● గ్రామసభల్లో చర్చ.. తీర్మానాలు ● నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత 2026 –27లో చేపట్టాల్సిన పనులు క్షేత్ర స్థాయిలో గుర్తింపు ప్రతి కూలీకి పని కల్పిస్తున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. వచ్చే ఆర్థిక సంవత్సంలో చేపట్టాల్సిన పనులు గుర్తింపు జిల్లాలో కొనసాగుతోంది. నీటి సంరక్షణ ఇతర శాశ్వత పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పారదర్శకంగా పనులను గుర్తించి తీర్మానాలు చేస్తున్నాము. – నర్సింగరావ్, అడిషనల్ కలెక్టర్ గద్వాల న్యూటౌన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రానున్న (2026–27) ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనుల గుర్తింపు ప్రారంభం అయ్యింది. గడిచిన వారం రోజుల నుంచి సిబ్బంది చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించిన పనుల వివరాలను గ్రామసభల్లో చర్చిచడంతో పాటు తీర్మానాలు చేస్తున్నారు. నీటి సంరక్షణ పనులకు ఎక్కువ ప్రాదాన్యత ఇస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నిరోధించేలా పనిదినాలను నిర్ణయిస్తున్నారు. శాశ్వత పనులకు ప్రాధాన్యం ఉపాధిహామీ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బంది చేత ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. గడిచిన అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలో ఆరంభం అయ్యింది. నవంబర్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. నిర్దేశించిన తేదీల్లో ఆయా గ్రామాల్లో ఒక రోజు ముందు ఉపాధి హమీ పథకం కింద ఏఏ పనులు చేపట్టాల్సి ఉన్నాయో తెలియజేయాలని రైతులు, కూలీలు, ప్రజలకు సూచిస్తున్నారు. వారు సూచించిన స్థలాలను ఉపాధి సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు. దాదాపు ఒక్కో గ్రామంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు పనుల గుర్తింపు, పరిశీలనకు సమయం తీసుకుంటున్నారు. గుర్తించిన అనంతరం గ్రామాల వారీగా ప్రణాళికను తయారు చేస్తున్నారు. శాశ్వత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంబంధిత అధికారులు అంటున్నారు. ప్రధానంగా నీటి సంరక్షణ పనులు (ఫాంపాండ్స్, వాలుకట్టలు) ప్రాధాన్యత కల్పించారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్ పిట్లు, నాడేక్ కంపోస్ట్ పిట్లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, గొర్రెల షెడ్లు, కోళ్ల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు ఉండనున్నాయి. పనులకు వస్తున్న కూలీల సంఖ్య: 1,49,187 -
వసతి గృహంలో కొనసాగిన వైద్య శిబిరం
ఎర్రవల్లి: మండలంలోని ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో జరిగిన ఫుడ్ పాయిజన్ నేపఽథ్యంలో వైద్య శిబిరాన్ని రెండవ రోజైన ఆదివారం సైతం కొనసాగించారు. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం వైద్యులు ఇందిర, అమూల్య వసతి గృహంలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ విద్యార్థులు సరైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. ఆరోగ్యకరమైన సమతూల్య ఆహారం తీసుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థతి అంతా నిలకడగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్మసిస్ట్ మస్రత్, సాఫియా, ఏఎన్ఎం భారతమ్మ, పద్మ, ఆశాలు ఉన్నారు. ఇదిలాఉండగా, ధర్మవరం వసతి గృహ ంలో గత నెల 31న రాత్రి భోజనం చేశాక దాదాపు 55 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురి కాగా.. చికిత్స నిమిత్తం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
అమరుల ఆశయ సాధనకు పనిచేద్దాం
వీపనగండ్ల: పేద ప్రజల బాగు కోసం అహర్నిశలు పనిచేసి మరణించిన అమరుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. ఉపసర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకుడు పెద్ద రాములు ఇటీవల మృతిచెందగా.. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సంస్మరణ సభకు హాజరై మాట్లాడారు. పేదరికంలో ఉన్న పలువురికి కామ్రేడ్ పెద్ద రాములు అండగా నిలిచారని కొనియాడారు. భూ స్వాములు, నక్సలైట్లు దాడి చేసి గాయపర్చినా పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజి కార్యదర్శి గోపాల్, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు ఎండీ జబ్బార్, యూటీఎఫ్ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు రవిప్రసాద్గౌడ్, కృష్ణయ్య, మండల కార్యదర్శి బాల్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాబి, మహబూబ్పాషా, జితేందర్గౌడ్, ఆశన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
గద్వాలటౌన్: పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలలో రాణించాలని జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి (డీవైఎస్ఓ) కృష్ణయ్య పేర్కొన్నారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో కబడ్డీ శిక్షణ ఉత్సాహంగా సాగుతుంది. ఆదివారం కబడ్డీ శిక్షణ శిబిరాన్ని డీవైఎస్ఓ కృష్ణయ్య సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, తగు సూచనలు చేశారు. అనంతరం క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని, జాతీయ స్థాయిలను లక్ష్యంగా చేసుకుని రాణించాలన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నర్సింహా, సంయుక్త కార్యదర్శి జగదీష్, మహేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ పాయిజన్ కలకలం
రెండు రోజుల క్రితం బీసీ బాలుర హాస్టల్లో 55 మంది విద్యార్థుల అస్వస్థత ● తాజాగా ఎర్రవల్లి గురుకులంలో మరికొందరు.. ● హాస్టల్స్, గురుకులాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ ● వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన 32 మంది డిశ్చార్చ్.. 22 మంది ఆస్పత్రిలోనే గత నెల 31వ తేదీ ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ బాలుర హాస్టల్లో విద్యార్థులు రాత్రి భోజనం చేసి పడుకోగా.. కొంత సమయానికి ఒక్కొక్కరు మొత్తం 55మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని 5 అంబులెన్స్లలో గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ హాస్టల్లో మొత్తం 140 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం రాత్రి సంఘటన జరిగే సమయానికి హాస్టల్లో 110 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందిన వారిలో 32 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్చ్ చేశారు. దీంతో వారు ఆస్పత్రి నుంచి హాస్టల్కు చేరుకున్నారు. మరో 22 మంది విద్యార్థులు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలాఉండగా, ఈ హాస్టల్ విద్యార్థులు అందరూ ఒకే హాల్లో ఉంటున్నారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరగా.. నెల రోజుల క్రితం కలెక్టర్ హాస్టల్ను పరిశీలించారు. మరో భవనంలోకి మార్పు చేయాలని చెప్పగా.. హాస్టల్కు పక్కనే పాఠశాలకు చెందిన పైభాగంలోని హాల్లో మార్చారు. దీంతో విద్యార్థులంతా ఒకే హాల్లో ఉంటున్నారు. అలంపూర్/ఎర్రవల్లి: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు.. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. నాణ్యతలేని ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతుండడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో భోజనం చేసిన విద్యార్థులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 55 మంది జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం ఉదయం ఎర్రవల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థుల్లో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం.. విద్యార్థులు ఆస్పత్రుల పాలవడం.. అధికారులు పర్యవేక్షణ ఏమేరకు ఉందనే ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. అధికారుల పర్యవేక్షణ ఏది..? ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల వ్యవధిలో రెండు వసతి గృహాల్లో అది ఒకే మండలానికి చెందినవి కావడంతో విస్మయం వ్యక్తం అవుతుంది. వసతి గృహాలపై పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లోపంగా ఉన్న ఆహారంతోనే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం అవుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అధికారులు సైతం చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారని.. ఇదే అదునుగా సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలోనూ.. ఎర్రవల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ నెల 1వ తేదీన మరో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో మొత్తం 540 మందికిగాను శనివారం 502 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరూ ఉదయం అల్పాహారం తీసుకున్నారు. అతర్వాత గంట వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థులు వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది అంబులెన్స్లో విద్యార్థులను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో మరికొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ఇటిక్యాల పీహెచ్సీ బృందం నేరుగా గురుకులా పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు వైద్య పరీక్షలు అందించారు. ఇక్కడ 67 మంది అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అక్కడే చికిత్స అందిస్తు పర్యవేక్షించారు. -
విద్యార్థులకు మెరుగైన వైద్యం
● కాలీఫ్లవర్, క్యాబేజి కూరగాయ తినడంతోనే అస్వస్థత ● కలెక్టర్ బీఎం సంతోష్ ● హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు గద్వాల: ఎర్రవల్లి మండలం ధర్మవరం సాంఘిక సంక్షేమ వసతిగృహ విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. జిల్లా ఆస్పత్రిలో వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి హాస్టల్లో భోజనంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీతో కూడిన కూరగాయను చేశారని ఈ కూరగాయను భుజించిన విద్యార్థులలో 54మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వారిని వెంటనే అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈక్రమంలోనే 32మంది విద్యార్థులు కోలుకున్నారని వారిని శనివారం ఉదయం డిశ్చార్జి చేసి పంపినట్లు తెలిపారు. మిగిలిన 22మందికి వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించడంతో వారు కూడా డిశ్చార్జి అయినట్లు తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన కూరగాయ శాంపిల్ను ఫుడ్ఇన్స్పెక్టర్కు పంపించి పరీక్షలు చేయిస్తామన్నారు. అదేవిధంగా బాయిల్డ్ ఎగ్ కూడా శాంపిల్కు పంపిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతిగృహాలను తహసీల్దార్, ఎంపీడీవోలు ఇక నుంచి వారానికోసారి సందర్శించేలా ఆదేశాలు జారీచేస్తామన్నారు. వార్డెన్పై సస్పెన్షన్ వేటు హాస్టల్లో విద్యార్థులకు రాత్రి భోజనం పెట్టే సమయంలో వార్డెన్ జయరాం గైర్హాజరు అయినట్లు ఇందుకుగాను ఆయనను సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఎవరైన అధికారులు అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డాక్టర్ ఇందిరా, తహసీల్దార్ మల్లీఖార్జున్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు పరామర్శ ధర్మవరం హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బీజేపీ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి విద్యార్థులను పరామర్శించారు. -
ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్రావు, ఆలయ సిబ్బంది ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,310 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 847 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5310, కనిష్టం రూ.2119, సరాసరి రూ.4120 ధరలు లభించాయి. అలాగే, 102 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5949 కనిష్టం రూ. 3319, సరాసరి రూ. 5949 ధరలు పలికాయి. వీటితోపాటు 30 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2017, కనిష్టం రూ. 1887, సరాసరి ధరలు రూ. 1887 వచ్చాయి. ఇసుక క్వారీలు, చిన్న తరహా ఖనిజాలపై నివేదిక గద్వాల: జిల్లాలో చిన్న తరహా ఖనిజాలు, ఇసుక క్వారీలపై పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు ఆయన ప్రకటనలో విడుదల చేశారు. జిల్లాలో సాంకేతిక, నీటిపారుదల, భూగర్భజల, గనులు మరియు భూగర్భ శాఖలకు చెందిన అధికారులు తమ శాఖల పరిధిలోని వివరాలను నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. ఈనివేదికను ప్రజల సమాచార నిమిత్తం జిల్లా వెబ్సైట్ https.gadwal.telangana.gov.in లో పొందుపరుచనున్నట్లు తెలిపారు. ఈ నివేదికపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను అభ్యంతరాలు స్వీరించి ఈనెల 2వ తేదీ నుంచి 21వ తేదీలోపు పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడికి మెమో గద్వాల: గద్వాల మండలం వీరాపురం సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న థామస్ అనే విద్యార్థిని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈమేరకు శనివారం సదరు ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసినట్లు ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈఘటనపై సమగ్ర నివేదిక కోరుతూ పాఠశాల ప్రిన్సిపల్ను ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మృత్యువులోనూ.. మరో ఇద్దరికి చూపు గద్వాల క్రైం: తాను మరణించినా.. మరో ఇద్దరు అంధులకు కంటిచూపు ప్రసాదించాడు. మండలంలోని శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన మెదరి ఈదన్న(46) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై కర్నూలు లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే శుక్రవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. చికిత్స పొందుతున్న క్రమంలో వైద్యులు నేత్రాదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో తాను మృతి చెందిన మరో ఇద్దరికి చూపు అందిస్తామని గ్రహించి నేత్రాదానం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు ఈదన్న నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
ఎర్రవల్లి: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలను, వాటి తరగతి గదులు, వంటశాల, స్టోర్రూం, సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు. వంటకు తాజా కూరగాయలు, ఆకుకూరలను మాత్రమే వినియోగించాలని, శుద్ధమైన తాగునీటిని మాత్రమే అందించాలని, వంట చేసేటప్పటి నుంచి ఆహారం వడ్డించే వరకు పరిశుభ్రతను తప్పకుండా పాటించాలని సూచించారు. అనంతరం సమీపంలోని బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు బసచేస్తున్న పాఠశాల హాల్ను పరిశీలించి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హెచ్ఎంను ఆదేశించారు. ఆలయాల్లో వివాదాలపై విచారణ అలంపూర్ : అలంపూర్ క్షేత్ర ఆలయాల్లోని అధికారిపై ఉన్నతాధికారులు శనివారం విచారణ చేపట్టారు. శ్రీ జోగుళాంబ బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో టెండర్లకు సంబంధించి కొన్ని రోజులుగా వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ హైదరబాద్ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకష్ణా రావు, జాయింట్ కమిషనర్ వినోద్ రెడ్డిలు విచారణ జరిపారు. ఆలయ ఈఓ దీప్తిని కలిసి వివరాలను అడిగి తెలుసుకొని ఆలయాల రికార్డులను తనిఖీ చేసినట్లు సమాచారం. అలాగే టెండర్ దారును కలిసి వివరాలు సేకరించారు. అయితే అలంపూర్ రైతు సంఘం కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు సైతం విచారణ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. నివేదికను ఉన్నత అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. -
శత శాతమే లక్ష్యం..!
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ● ఇంటింటికీ తిరిగి విద్యార్థులను బడికి పంపాలని అవగాహన ● వారంలో ఒక పాఠశాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశం ● జనవరిలోగా సిలబస్ పూర్తి చేసేలా ప్రణాళిక ● మెరుగైన ఫలితాలకు విద్యాశాఖ కసరత్తు విభాగాల వారీగా విభజన పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై రెండు దశలుగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. సంక్రాంతి సెలవులకు ముందు మొదటి దశ ప్లాన్, సెలవుల తరువాత రెండో దశ ప్లాన్ను అమలు చేయాడానికి కసరత్తు చేశారు. ప్రతి రోజు స్లిప్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను ఏబీసీ విభాగాలుగా విభజించనున్నారు. సీ విభాగ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా.. వారు నైపుణ్యాలు పెంపొందించుకునేలా తర్పీదు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. గద్వాలటౌన్: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈమేరకు వచ్చే జనవరిలోగా సిలబస్ను పూర్తి చేయాలని నిర్ణయించారు. నిర్దిష్ట గడువులోగా సిలబస్ పూర్తి చేస్తే విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయొచ్చని విద్యాశాఖ భావిస్తుంది. ఆ దిశగా పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో ఎదురైన అనుభవాలతో సరికొత్త ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించగలమని ఉపాధ్యాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హాజరుపై దృష్టి విద్యార్థుల హాజరుశాతం ఉత్తీర్ణతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోధన సమయంలో విద్యార్థులు గైర్హాజర్ గురవుతున్నారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొదటి నుంచి బడికి రాని విద్యార్థులపై ఉపాధ్యాయులు దృష్టి సారించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆరా తీయడంతో పాటు తల్లిదండ్రులకు బడికి పంపించాలని అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు విద్యార్థులను పంపిస్తున్నారనే విషయం గుర్తించి ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లి బడికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చేయడంలో దాదాపు అందరు ఉపాధ్యాయులు సఫలీకృతులవుతున్నారు. పదో తరగతి విద్యార్థులు 5,594 త్వరలో ప్రత్యేక తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి చర్యలు చేపట్టాం. గత ఏడాది మంచి ఫలితాలు సాధించాం. ప్రస్తుతం అంతకంటే మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతాం. ఉత్తమ బోధన చేస్తు మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం. – విజయలక్ష్మి, డీఈఓ కేజీబీవీలు 12 -
బెస్ట్ ‘అన్’ అవైలబుల్
●కలెక్టర్కు ఫిర్యాదు చేశాం.. బీఏఎస్ స్కీంలో విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలకు రానివ్వకపోతే కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి సమస్యను కలెక్టర్ వివరించాం. ఆమె ఆదేశాల మేరకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. చాలా పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేదని కారణంతో తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, షూ, హాస్టల్ తదితర అవసరాల కోసం డబ్బులు వసూలు చేశారు. వాటిపై జిల్లా అధికారులు కమిటీ వేసి వాటిని పేద విద్యార్థులకు తిరిగి ఇప్పించాలి. – కమలాకర్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ పుస్తకాలు ఇవ్వలేదు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో బీఏఎస్ స్కీంలో మా పాప చదువుతుంది. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కచ్చితంగా పుస్తకాలకు డబ్బులు కడితేనే ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో సొంతంగా డబ్బులు కట్టాల్సి వచ్చింది. జిల్లా అధికారులు స్పందించి డబ్బులు వెనక్కి ఇప్పించాలి. – రమేష్, విద్యార్థి తండ్రి మా దృష్టికి వస్తే పరిష్కరిస్తాం.. రెండు వారాల క్రితం బీఏఎస్ స్కీంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ దృష్టికి రావడంతో వెంటనే పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాం. తప్పిస్తే మా దృస్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. తల్లిదండ్రులు ిసమస్యను మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. – సునీత, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి, మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన ప్రైవేటు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం బెస్టు అవైలబుల్ స్కీం (బీఏఎస్) ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తూ.. 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తుంది. రెసిడెన్షియల్ పద్ధతి లేదా డే స్కాలర్ విధానంలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో మొత్తం 50 పాఠశాలల్లో మొత్తం 3,380 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.46 వేల వరకు ఖర్చు చేస్తుంది. 1 నుంచి 5 తరగతుల వరకు చదివే డే స్కాలర్స్కు పాఠశాల చదువుతో పాటు పుస్తకాలు, షూ, నోటుబుక్స్ ఇవ్వాలి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే గడిచిన మూడేళ్లుగా వీటికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టగా.. బకాయిల్లో 25 శాతం నిధులు విడుదల చేసింది. అవగాహన లేకపోవడంతో.. బీఏఎస్ ద్వారా ఎన్నికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో యాజమాన్యాలు ఎలా చెబితే అలా ఫీజులు చెల్లిస్తున్నారు. నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, హాస్టల్, పాఠశాల, షూ, అడ్మిషన్ ఫీజు ఇలా అన్నీ ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ, నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదన్న సాకు చూపి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేశారు. ముఖ్యంగా చాలా వాటిలో కేవలం పాఠశాలలను నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఉండగా, వాటిలోనే హాస్టల్స్ సైతం కొనసాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు మూడు పూటలా పెట్టాల్సిన భోజనంలోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిని ఏమాత్రం పట్టించుకోని సంక్షేమ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా బీఏఎస్ ఎస్సీ ఎస్టీ పాఠశాలలు విద్యార్థులు విద్యార్థులు మహబూబ్నగర్ 12 806 356 వనపర్తి 8 532 84 నాగర్కర్నూల్ 18 1,062 208 నారాయణపేట 1 120 30 గద్వాల 11 442 240 జిల్లాల వారీగా బీఏఎస్ పాఠశాలలు, విద్యార్థులు ఇలా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నామమాత్రంగానే ప్రైవేటు విద్య వసతి తల్లిదండ్రుల నుంచే పుస్తకాలు,హాస్టల్స్కు డబ్బులు వసూలు అయినప్పటికీ అరకొర వసతులు, నాణ్యత లేని భోజనం వడ్డింపు మూడేళ్లుగా నిధులు ఇవ్వనిప్రభుత్వం.. పట్టించుకోని అధికారులు -
దళారులదే రాజ్యం
● ఉండవెల్లి పత్తి కొనుగోలు కేంద్రంలో వారిదే పైచేయి ● పత్తి నల్లబారిందని, తేమశాతం పెరిగిందంటూ రైతులను వెనక్కి .. ● మూడు రోజులు సెలవు.. దళారుల పత్తి మాత్రం యథేచ్ఛగా కొనుగోలు ఉండవెల్లి: జిల్లాలోని ఒకే ఒక్క పత్తి కొనుగోలు కేంద్రమైన ఉండవెల్లి సీసీఐ కేంద్రంలో దళారులదే పైచేయిగా మారింది. దళారులు తీసుకొచ్చిన పత్తిని ఎలాంటి తేమ శాతం చూడకుండానే కొందరు అధికారులు కేంద్రంలోకి అనుమతిస్తుండగా.. మిగతా రైతుల పత్తి మాత్రం నల్లబారిందని, తేమ శాతం పెరిగిందంటూ కొర్రీలు పెడుతూ తిప్పి పంపుతున్నారు. లేదా రోజుల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారు. దీంతో రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతుకు.. పంట విక్రయించేందుకు సైతం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. దీనికితోడు జాతీయ రహదారిపై పత్తి లోడు వాహనాలతో ప్రమాదకరంగా ఎదురుచూడా ల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు బంద్ ప్రకటన.. అటు కొనుగోళ్లు అక్టోబర్ 29, 30, 31వ తేదీల్లో మోంథా తుపాన్ కారణంగా జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ ప్రకటన విడుదల చేశారు. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు వాటిని క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ, సీసీఐ అధికారి మాత్రం ఆ ప్రకటనలో మాకు సంబంధం లేదంటూ పత్తి కొనుగోలు కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించారు. రైతులు పత్తి విక్రయానికి రాకపోయినా.. అయిజ, వడ్డేపల్లి మండలాలకు చెందిన దళారులు మాత్రం తమకు సంబంధించిన వారి స్లాట్లు బుక్ చేసుకొని యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు రైతులు కేంద్రానికి చేరుకొని ఆరా తీశారు. తమ పత్తిని కొనుగోలు చేయకుండా దళారులు తీసుకొచ్చే పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమంటూ ఆందోళన చేశారు. పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఇబ్బందులు తీర్చాలని కోరారు. కొర్రీలు పెడుతున్నారు రూ.లక్షలు పెట్టుబడి పత్తి పంట సాగు చేశాం. కానీ, పత్తిని విక్రయించడానికి సీసీఐ కేంద్రానికి వస్తే తేమ శాతం ఎక్కువుందని తిప్పి పంపుతున్నారు. ప్రత్యేకంగా కూలీలతో పత్తి తీయించి వాహనాన్ని అద్దెకు తీసుకొని కేంద్రానికి వెళ్తే ఇలా కొర్రీలు పెడుతున్నారు. మరోవైపు తీసిన పత్తిని వర్షంలో తడవకుండా కాపాడడం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేసేలా చూడాలి. – గిద్దలమ్మ, రైతు, కలుకుంట్ల, మానవపాడు ఇబ్బందులు లేకుండా చూస్తాం తుపాన్ కారణంగా ఈ నెల 28న బంద్ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చాం. రైతులు వర్షంలో ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందస్తు ప్రకటన చేశాం. చాలామంది రైతులు స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ సీసీఐ అధికారి కేంద్రాన్ని బంద్ చేయలేదు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారనే విషయం తెలిసింది. ఆరా తీస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – ఎల్లస్వామి, మార్కెటింగ్ కార్యదర్శి, అలంపూర్ -
దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి
గద్వాల క్రైం: దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు పని చేయాల్సిందిగా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. దేశంలో భిన్నమతాలు, జాతులు, వివిధ భాషాలు, సంస్కృతి, సంప్రాదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తూ ఐక్యమత్యంగా జీవిస్తున్నామన్నారు. భారత యూనియన్లో కలిసేందుకు సర్దార్ వల్లభాయి పటేల్ కృషి చేశారన్నారు. అనంతరం ఎమ్యెల్యే కృష్ణమోహన్రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మనిషి జీవితంలో ఎదగాలంటే ధృఢ సంకల్పాన్ని అలవర్చుకోవాలన్నారు. సమగ్రత దిశగా ముందుకు వెళ్దామన్నారు. అనంతరం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పట్టణ పుర వీధులలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారయణ, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐ, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా, ఎస్పీ కార్యాలయంలో వ్యాసరచన, ఫొటోగ్రఫీ తదితర విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎస్పీ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. -
మూగరోదన..!
● జీవాలకు అందని నట్టల నివారణ మందులు ● రెండున్నరేళ్లుగా నిలిచిన సరఫరా ● పెంపకందారులపై ఆర్థికభారం మేకలు: 65,000 జిల్లాలో గొర్రెల సంఖ్య: 5,40,000 గద్వాల వ్యవసాయం: జిల్లాలో మూగజీవాలకు సరైన వైద్యం అందడంలేదు. కనీసం జీవాల్లో నట్టల నివారణకు కూడా మందులు లేని దయనీయ పరిస్థితి నెలకొంది. గడిచిన రెండున్నరేళ్లుగా నట్టల నివారణ మందులు పశుసంవర్ధకశాఖకు సరఫరా కావడం లేదు. దీంతో చేసేది లేక గొర్రెల, మేకల పెంపకందారులు ప్రైవేట్గా మందులు కొని జీవాలకు తాపిస్తున్నారు. చలి, వర్షాకాలంలో తీవ్ర ప్రభావం బాహ్య, అంతర్ పరాన్నజీవులుగా నట్టలు రెండు రకాలుగా ఉంటాయి. బాహ్య పరాన్నజీవులు (టిక్స్, ఫ్లైస్, మైక్స్) మూడు రకాలుగా ఉంటాయి. ఇవి మేకలు, గొర్రెల శరీరంపై బాగాన అంటే చెవులు, గొంతు కింద, పొదుగు వద్ద ఏర్పడతాయి. ఇక అంతర్ పరాన్న జీవులు నులిపురుగులు, పొట్టజలగలు, బద్దెపురుగులుగా మూడు రకాలుగా ఉంటాయి. ఇవి శరీరం లోపల కాలేయం, పేగులు తదితర వాటిలో ఏర్పడతాయి. ఇలా అంతర్, బాహ్య పరాన్న జీవులను నట్టలు అని పిలుస్తారు. నట్టలు ప్రధానంగా వర్షాకాలం, చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఈ వ్యాదిగ్రస్థ జీవాలు ఆరుబయట మేతపైన కాని, తాగునీటిపైన కానీ మల విసర్జనచేస్తే... ఆమేతను తిన్న, ఆనీటిని తాగిన ఇతర ఆరోగ్యకరమైన జీవాల్లో కూడా నట్టలు ఏర్పడతాయి. నట్టలు ఏర్పడితే జీవాలు మేత తినక బలహీనంగా మారుతాయి. ఆ తర్వాత రక్తహీనత, తీవ్ర అనారోగ్యానికి గురవుతాయి. బరువు తగ్గి కొన్ని సందర్బాల్లో మృతి చెందుతాయి. బడ్జెట్ కేటాయింపు ఏది..? జీవాల్లో నట్టల నివారణకు మందుల కోసం పశుసంవర్ధకశాఖకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేది. ఈ బడ్జెట్తో ప్రతి ఏటా రెండు నుంచి మూడు విడతలుగా (జనవరి నుంచి ఫిబ్రవరి, జూన్ నుంచి జూలై, అక్టోబర్ నుంచి నవంబర్) ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆల్బెండజోల్, ఫిల్మెండజోల్ మందులను జీవాలకు తాపించేవారు. ఇందుకోసం పశుసంవర్ధకశాఖ సిబ్బంది ఆయా మండలాల్లో బృందాలుగా ఏర్పడి, పెంపకందారులకు ముందస్తు సమాచారం అందించి మందులు వేసేవారు. అయితే గడిచిన రెండున్నరేళ్లుగా బడ్జెట్ కేటాయింపు లేకపోవడం వల్ల మందులు రావడం లేదు. జీవాలను పెంచుతున్న పెంపకందారులు చేసేది లేక రూ.వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్గా మందులను తెచ్చుకుంటున్నారు. జీవాల్లో ప్రతి సీజన్లో నట్టలు ఏర్పడతాయి. ఈ మందులు తాపించకపోతే నట్టలు ఎక్కువ అవుతాయి. జీవాల బాహ్య, అంతర్ శరీర భాగాల్లో నట్టల తీవ్రత ఎక్కువై అవి మృతి చెందే ప్రమాదం ఉంటుంది. దీంతో పెంపకందారులు జీవాలకు తప్పక మందులు తాపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా కాకపోవడం వల్ల వారికి ఆర్థికంగా భారంగా ఉన్నప్పటికీ మందులు వేయాల్సిన పరిస్థితి. -
భూభారతి సమస్యలు త్వరగా పరిష్కరించాలి
ఇటిక్యాల: భూభారతితోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని ట్రైయినీ కలెక్టర్ మనోజ్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. భూ భారతిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కొనసాగుతున్న ఎస్ఎ పరీక్షతోపాటు తరగతి గదులు, వంట రూం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. తహసీల్దార్ వీర భద్రప్ప, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి
గద్వాల: రూ.33.02 కోట్ట నిధులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల, వసతి గృహ భవనాల మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్పరెన్స్ హల్లో నర్సింగ్ కళాశాలతో పాటు మెడికల్ కళాశాల విద్యార్ధుల వసతిగృహ ఏర్పాట్లు పనులు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా నర్సింగ్ కళాశాల వసతి గృహ భవనాల ప్రారంభోత్సవంతో పాటు రూ.130 కోట్ల నిధుల అంచనాతో మెడికల్ కళాశాల వసతిగృహ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థినులు ఉండే వసతి గృహంలో అవసరమైన మౌలిక వసతులు ఏమైనా ఉంటే వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. మెడికల్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీర్ వేణుగోపాల్, శ్రీనివాసులు, రహీం, తదిలరులు ఉన్నారు. -
రైతన్నకు కన్నీరే దిక్కు..!
● ముంచిన ‘మోంథా’ ఉమ్మడి జిల్లాలో 36,970 ఎకరాల్లో పంట నష్టం ● కోత దశలో వరద నీటిలో నేలవాలిన వరి ● ఏరే దశలో చేన్లలోనే తడిసి ముద్దయిన పత్తి ● నాగర్కర్నూల్ జిల్లాలో అధిక ప్రభావం ● ఆ తర్వాత వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో.. ● నష్ట పరిహారం ఇవ్వాలని అన్నదాతల వేడుకోలు జిల్లాల వారీగా ఇలా.. నాగర్కర్నూల్ జిల్లాలో వరితోపాటు పత్తికి భారీ నష్టం వాటిల్లింది. కల్వకుర్తి మండలంలో 4,430 ఎకరాల్లో పత్తి, 2699 ఎకరాల్లో వరి.. ఉప్పునుంతల మండలంలో 3,500 ఎకరాల్లో పత్తి, 2500 ఎకరాల్లో వరి, వంగూరు మండలంలో 1180 ఎకరాల్లో పత్తి, 1,080 ఎకరాల్లో వరి.. చారకొండలో 3,149, వెల్దండలో 1,376, అచ్చంపేటలో 2,100, అమ్రాబాద్లో 1076, పదర మండలంలో 1012 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ● వనపర్తి జిల్లాలో గోపాల్పేట మండలంలో 475, వీపనగండ్ల మండలంలో 443, పెద్దమందడిలో 217, రేవల్లిలో 120 ఎకరాల్లో వరి, చిన్నంబావి మండలంలో 750 ఎకరాల్లో ఉల్లిగడ్డ, వీపనగండ్ల మండలంలో 43 ఎకరాల్లో కంది పంట దెబ్బతింది. ● మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా జడ్చర్ల మండలంలో 217, మిడ్జిల్ మండలంలో 180, రాజాపూర్లో 105, అడ్డాకుల, బాలానగర్ మండలాల్లో 100 ఎకరాల చొప్పున వరి నీటిపాలైంది. వారం, పది రోజుల్లో కోతకు రెడీగా ఉన్న పంట నీటిపాలుకావడంతో అన్నదాతలు గుండెలివిసేలా రోదిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మోంథా తుపాను రైతులను నట్టేట ముంచింది. సుమారు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు నీటిపాలయ్యాయి. ప్రధానంగా కోత దశలో ఉన్న వరి.. ఏరే దశలో ఉన్న పత్తికి భారీ నష్టం వాటిల్లింది. వీటితో పాటు వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, ఉల్లిగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తగా పంట చేలల్లో ఇసుక మేటలు వేయడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో అధికం.. ● ఉమ్మడి పాలమూరులోని నాగర్కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,388 మంది రైతులకు సంబంధించి 33,559 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో 1,336 మంది రైతులకు చెందిన 2,270 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్నగర్ జిల్లాలో 1,013 మంది రైతులకు సంబంధించి మొత్తం 1,141 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పరిహారం ఇవ్వాలని వేడుకోలు.. ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులకు నష్టం వాటిల్లుతూ వస్తోంది. గతేడాది వానాకాలం సీజన్తో దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత కాత, పూత దశలో దంచికొట్టిన వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈసారి సైతం అధిక వర్షా లు రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా వరి, పత్తి రైతులకు పెట్టు బడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. -
కేజీబీవీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
ఉండవెల్లి: మండలంలోని కలుగోట్ల కేజీబీవీని అలంపూర్ జడ్జి మిథున్ తేజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం కస్తూర్బా పాఠశాల మూత్రశాలలను, గదులు, వంట గదిని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని, సామాజిక విలువలపై అవగాహన పెంపొందించాలని ప్రిన్సిపల్ పరిమళ, ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, ఇతరులను అనుమతించే సమయంలో తప్పనిసరిగా వారి ఐడీ కార్డులను పరిశీలించాలని, విద్యార్థినుల భద్రతే ప్రదానమన్నారు. కార్యక్రమంలో సీవిల్ కోర్టు న్యాయవాదులు, సిబ్బంది, పోలీసులు, ఉపాద్యాయులు పాల్గోన్నారు. -
ప్రైవేట్లో కొంటున్నాం
నాకు 500 గొర్రెల మంద ఉంది. మూడేళ్ల క్రితం వరకు పశువైద్య సిబ్బంది వచ్చి జీవాలకు నట్టలు రాకుండా మందులు తాపించేవారు. ఇప్పుడు వేస్తలేరు. మందులు రావడం లేదంటున్నారు. చేసేది లేక ప్రైవేట్గా మందులు కొనుగోలు చేసి జీవాలకు తాపిస్తున్నా. ఈ ఖర్చు భారంగా ఉంది. – నరేష్, పెంపకందారుడు, చిన్నిపాడు, మానవపాడు మండలం మందులు వచ్చాయి బడ్జెట్ కొరత కారణంగా నట్టల నివారణ మందులు తెప్పించలేదు. అయితే ఇటీవల నట్టల నివాణ మందులు జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి వచ్చాయి. వీటిని ఆయా మండల్లాలోని పశువైద్యశాలలకు పంపిస్తున్నాం. అవసరమైన చోట వినియోగించమని పశువైద్యాధికారులకు తగిన సూచనలు చేశాం. – వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్థకశాఖాధికారి -
రూ.7.74 కోట్ల ‘ఉపాధి’ పనులపై సోషల్ ఆడిట్
ధరూరు: జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం కింద మండలంలో రెండేళ్లలో జరిగిన పనులపై సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) నిర్వహించారు. 2024, 2025లో జరిగిన రూ.5.74 కోట్ల వేజ్ పనులు, అలాగే రూ.1.26 కోట్ల విలువగల మెటీరియల్ పనులు మొత్తం రూ.7.74 కోట్ల విలువ గల పనులపై గత రెండు నెలల క్రితం సోషల్ ఆడిట్ అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టారు. వాస్తవానికి నెల రోజుల క్రితమే పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం జరగాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. గురువారం ఉదయం 10.40గంటలకు ధరూరులోని ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్లో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 28 గ్రామ పంచాయతీలకుగాను రాత్రి 9 గంటల వరకు 20 గ్రామ పంచాయతీల వివరాలను, నివేదికలను సోషల్ ఆడిట్ డీఆర్పీలు చదివి వినిపించారు. ఏపీడీ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డీఆర్డీఓ నర్సింగరావు ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా జరిగిన పనులు, అజరిగిన అవకతవకలపై డీఆర్పీలు నివేదికలను సభలో చదివి వినిపించారు. ఏ గ్రామంలో ఎంత మేర పనులు జరిగాయి.. ఎంత వరకు అక్రమాలు జరిగాయనేది సమావేశం పూర్తయ్యాకే నివేదిక ఇవ్వనున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కార్యక్రమం కొనసాగింది. మొత్తంగా రూ.5,77,447 రికవరీకి అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అశోక్, ఎస్ఆర్పీ బద్రు నాయక్, డిస్టిక్ అంబుడ్స్మెన్ జమ్మన్న, ఎంపీడీఓ క్రిష్ణమోహన్, పీఆర్ ఏఈ నాగరాజు, ఏపీఓ శరత్ బాబు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, డీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. రూ.5.77 లక్షలు రికవరీకి అధికారుల ఆదేశం -
బీచుపల్లి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని గురువారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సందర్శించారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈఓ రామన్గౌడ్ శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం గద్వాల: లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని కృష్ణమ్మ వరదలతో ముంపునకు గురైన రేకులపల్లి గ్రామం సమీపంలొని జెన్ కో దగ్గర 67 ఎకరాల భూములు కోల్పోయిన రైతులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. 25 మంది లబ్ధిదారులకు రూ.1.36 కోట్లు నష్ట పరిహారం ప్రభుత్వం తరఫున లబ్ధిదారులకు చెక్కులు మంజూరు కాగా వారికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి డైరెక్టర్ సుభాన్. మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ప్రతాప్ గౌడు పాల్గొన్నారు. నూతన మెనూ ప్రకారం భోజనం అందించాలి ఉండవెల్లి: ప్రతి పాఠశాలలలో కొత్త మెనూ తప్పక పాటించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని డీఈఓ విజయలక్ష్మి, ఎంఈఓకు, హెచ్ఎంలకు సూచించారు. గురువారం మండల కేంద్రం, బొంకూరు పాఠశాలలను డీఈఓ పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డులను, కొనసాగుతున్న పరీక్షలను, గదులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బొంకూరులోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ శివప్రసాద్, ప్రధానోపాద్యాయులు హేమలత, మద్దిలేటి తదితర్లు పాల్గోన్నారు. నేటి ‘రన్ ఫర్ యూనిటీ’ని జయప్రదం చేయాలి గద్వాల: కేంద్ర యువజన శాఖ పిలుపు మేరకు శుక్రవారం గద్వాల పట్టణంలోని ఎంఎల్డీ కాలేజ్ నుంచి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కాలేజీ నుంచి ప్రారంభమయ్యే దానికి యువతీ, యువకులు అన్ని వర్గాల ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బండల వెంకట్రాములు, రవికుమార్, అక్కల రమాసాయి, వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు. రేపు ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు గద్వాలటౌన్: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నవంబరు 1వ తేదీన జిల్లాస్థాయి అండర్–17 బాల, బాలికల కబడ్డీ పోటీలతో పాటు సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ కృష్ణయ్య తెలిపారు. రాయచూరు రోడ్డులోని రింగ్రోడ్డు చౌరస్తాలో ఉన్న ఆర్యన్స్ విశ్వసూర్య స్కూల్లో పోటీలు ఉంటాయని, పోటీలకు హాజరయ్యే విద్యార్థులు బోనోఫైడ్, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తమ వెంట తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నం.9440232894కు సంప్రదించాలని తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.5,306 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 144 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5306, కనిష్టం రూ.3016, సరాసరి రూ.4010 ధరలు లభించాయి. అలాగే, 38 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5890 ధర పలికింది. -
రూ.22.59 లక్షలుపలికిన టెంకాయల వేలం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం 11గంటలకు ఆలయ ఆవరణలో ఈఓ సత్యచంద్రారెడ్డి సమక్షంలో టెంకాయల వేలం నిర్వహించారు. వేలంలో 20 మంది పాల్గొనగా వారిలో మల్దకల్కి చెందిన నర్సింహులు రూ.22.59 లక్షలకు వేలం పాడి దక్కించుకున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు. అలాగే తలనీలాల వేలాన్ని మహబూబ్నగర్కు చెందిన రామన్గౌడ్ రూ.3.17లక్షలకు దక్కించుకున్నారు. టెంకాయల వేలంలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది రూ.47వేలు అధిక ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో బీచుపల్లి ఆలయ ఈఓ రామన్గౌడ్, ఆలయ నిర్వాహకుడు అరవింద రావు, చంద్రశేఖర్ రావు, ఆలయ సిబ్బంది బ్రహ్మయ్య, రంగనాథ్, శ్రీను, కృష్ణ, ఉరుకుందు, చక్రి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలనుసద్వినియోగం చేసుకోండి రాజోళి: చేనేత కార్మికులకు వారికి వర్తించే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ సిల్క్ బోర్డు ఽ(ధర్మవరం శాఖ) అధికారులు అన్నారు. బుధవారం రాజోళిలోని రైతు వేదికలో చేనేత కార్మికులకు పలు పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ దీపక్, టెక్నికల్ అసిస్టెంట్ అశోక్ దేశాయ్ మాట్లాడుతూ చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకుని చేనేత కార్మికులు వృత్తిలో రాణించవచ్చని అన్నారు. రంగులు అద్దటం, మగ్గం నేయడం, సిల్క్ను వాడటంలో మెళకువలను తెలిపారు. వాటాదారుడు 25 శాతం పెట్టుబడి పెడితే, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, కేంద్ర ప్రభుత్వం 50 శాతంతో కార్మికులకు రుణాలు అందే విధంగా పథకాలు ఉన్నాయని అన్నారు. రూ.11 వేల నుంచి రూ.కోటి వరకు రుణం తీసుకోవచ్చని, ఆసక్తి గల కార్మికులు దరఖాస్తు చేసుకుంటే పథకాలు అందించేలా చూస్తామన్నారు. ఆలయ ప్రతిష్టను కాపాడండి అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాల ప్రతిష్టను కాపాడాలని కోరుతూ హైదరాబాద్లోని దేవదాయ ధర్మాదాయ కార్యాలయాల్లో ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ రామయ్యర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణిని కలిసి అలంపూర్ ఆలయాల మాజీ ధర్మకర్త నాగశిరోమణి, ఆర్టీఏ కమిటీ సభ్యుడు పల్లి సతీష్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహేష్గౌడ్ బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రాష్ట్రంలో ఏకై క శక్తిపీఠంగా పేరుగాంచిన జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి, నవబ్రహ్మ ఆలయాలు అలంపూర్ నియోజకవర్గానికి ఆధ్యాత్మి క శోభను, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్నాయన్నారు. ఇటీవల ఆలయ పరిపాలన, టెండర్ల నిర్వహణలో కూరగాయల సరఫరా టెండర్ అంశంలో చోటుచేసుకున్న పరిణామాలు విచారకరమని పేర్కొన్నారు. వివాదాన్ని పరిష్కరించాల్సిన అధికారి ఒక వర్గంతో కలిసి ఆలయ ఆవరణలో మీడియా సమావేశాలు నిర్వహించడం బాధాకరమన్నారు. టెండర్లపై పక్షపాత లేఖలు తీసు కోవడం, ఉద్యోగులు సైతం ఉద్యోగ నియ మావళికి విరుద్ధంగా నిరసనలు చేయడం వంటి ఫొటోలను సామజిక మధ్యమాలో పోస్ట్ చే యడం ఆలయాల పవిత్రతకి, రాష్ట్ర దేవాదా యశాఖ ప్రతిష్ఠకు భంగం వాటిల్లితున్నట్లు వినతిలో పేర్కొన్నారు. ఆలయ గౌరవాన్ని కాపాడే విధంగా వివాదాలకు ముగింపు పలకడానికి ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవాలన్నారు. వేరుశనగ క్వింటా రూ.4,629 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 88 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 4629, కనిష్టం రూ. 2839 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టం రూ. 5900 ధరలు పలికాయి. -
నష్టపరిహారం అందించాలి..
ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్ కట్ట ఎక్కడికక్కడ కోతకు గురైంది. పలు చోట్ల కట్ట లీకవుతుండడంతోపాటు కట్ట కోతకు గురై వరద మా పంట పొలాలను ముంచెత్తింది. మట్టి మేటలు వేయడంతో నేను నాలుగు ఎకరాల్లో వేసిన వరి దెబ్బతింది. రిజర్వాయర్ కాంట్రాక్టర్లతో మాకు నష్టపరిహారం ఇప్పించాలి. – వెంకటేష్, కిష్టారం, జడ్చర్ల, మహబూబ్నగర్ వరి చేనును మట్టి కమ్మేసింది ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట తెగిపోవడంతో వరద నీరు మా పొలంలోకి వచ్చింది. ఎకర పొలంలో సాగు చేసిన వరి చేనుపై మట్టి దిబ్బలు పేరుకుపోయి మాకు తీవ్ర నష్టం జరిగింది. సంబంధిత అధికారులను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కట్ట తెగిన ప్రతిసారి మా పొలాల్లోకి మట్టి కొట్టుకు వస్తుంది. పంటలు నష్టపోతున్నాం. మాకు జరిగిన పంట నష్టానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – గడ్డల రమేష్, రైతు, కిష్టారం -
కేటీదొడ్డి స్టేషన్లోకలకలం రేపిన అక్రమ వసూళ్ల వ్యవహారం
గద్వాల క్రైం: జాతర నేపథ్యంలో చిరు వ్యాపారుల నుంచి.. సరిహద్దు వద్ద నిషేధిత పదార్థాలు, ఇసుక, ధాన్యం తదితరవి తరలించే వారి నుంచి కొందరు పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా కేటీదొడ్డి మండలంలోని పాగుంట లక్ష్మీవేంకటేశ ్వర స్వామి జాతర నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలు ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జాతరలో చిరు వ్యాపారులు, ఆట వస్తువులు ఏర్పాటుచేసుకొనే వారి నుంచి చేసిన వసూళ్ల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో కేటీదొడ్డి పోలీసు స్టేషన్ అధికారుల వ్యవహారం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. దీంతో ఎస్పీ శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ రజినిబాబుపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటూ జిల్లా సాయుధ బలగాల కార్యాలయానికి ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడితో సమస్య సమసిపోయింది అనుకునేలోపే సదరు కానిస్టేబుల్ మరో బాంబు పేల్చాడు. ఉన్నతాధికారుల సూచనల మేరకే జాతరలో వసూళ్లు చేశానని, చేయని తప్పుకు తనని బాధ్యుడిని చేశారని, స్థానిక ఎస్ఐ పేరు వెల్లడించి సూసైడ్ చేసుకుంటానని పోలీస్ వాట్సాప్ గ్రూపులో వరుస పోస్టులు చేయడం గమనార్హం. ఈ పోస్టులు పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో జిల్లా పోలీసుశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేటీదొడ్డి ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులును జిల్లా సాయుధ బలగాల కార్యాలయానికి అటాచ్ చేస్తు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సరిహద్దు అడ్డాగా.. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కేటీదొడ్డి పోలీసు స్టేషన్ సిబ్బంది విషయంలో జిల్లా పోలీసు శాఖ నిత్యం విమర్శలు ఎదుర్కొంటుంది. వివిధ మార్గాల్లో అక్రమార్కులు అనుమతి లేని వస్తువులు, ముడి సరుకులు, నిషేధిత మత్తు పదార్థాలను ఈ మార్గంలో రవాణా చేస్తుంటారు. వీటిని కట్టడి చేయాలంటే పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ ఆయా శాఖలు సంయుక్తంగా విధులు నిర్వహిస్తుంటారు. అయినప్పటికి కొందరు అక్రమార్కులు ఆయా శాఖల అధికారులతో నెల నెల కొంత డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు మట్టి, ఇసుక, రేషన్ బియ్యం మాఫియా సైతం వీరికి వెన్నుదన్నుగా ఉన్నారని సమాచారం. ఈక్రమలో కేటీదొడ్డి ఎస్ఐగా బిజ్జ శ్రీనివాసులు గత ఏడాది సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి అనుమతులు లేకుండా వ్యాపారం చేసే ఇసుక, మట్టి, రేషన్ బియ్యం మాఫియాతో మామూళ్ల ప్రక్రియకు తెర తీశాడనే విమర్శలు ఉన్నాయి. కర్ణాటక నుంచి రాష్ట్ర సరిహద్దులోకి వచ్చే అనుమతి లేని వాహనాల యాజమానులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎస్ఐ తీరుపై డీజీపీ, ఎస్పీకి సైతం కొందరు ఫిర్యాదులు చేశారు. ఊట్కూర్లో విధుల్లో అలసత్వం వహించిన నేపథ్యంలో పోలీసుశాఖ అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకుంది. ఈ విషయం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇదిలాఉండగా, ఎస్ఐ, కానిస్టేబుల్పై పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయా లేక వీఆర్కు అటాచ్ చేసి చేతులు దులుపుకొంటారా అనేది త్వరలో తేలనుంది. జాతర, ఇతర వ్యాపారులతో వసూళ్లకు పాల్పడిన సిబ్బంది డబ్బు పంపకాల్లో రాజుకున్న వివాదం.. ఉన్నతాధికారులకు సమాచారం ఎస్ఐ, కానిస్టేబుల్ను వీఆర్కు అటాచ్ చేయని తప్పుకు బాధ్యుడిని చేశారని.. సూసైడ్ చేసుకుంటానంటూ కానిస్టేబుల్ పోస్టు వైరల్ -
ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం
గద్వాలటౌన్: మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతికపై అవగాహన పెంచుకుని, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పాఠ్యాంశాలను బోధించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం స్థానిక బాలభవన్లో విద్యాశాఖకు సంబంధించిన పలు యాప్లు, వివిధ పోర్టర్ల గురించి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఏఐతో పాటు ఇతర టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దెందుకు ఉపాధ్యాయులు ప్రయోగపూర్వకంగా అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. ఈ ఏడాది పది పరీక్షలలో మన జిల్లా మెరుగైన స్థానాన్ని సాధించాలని సూచించారు. ఇప్పటికే తాను అనేక విద్యా సంస్థలను పరిశీలించానని, చాలామంది విద్యార్థుల నైపుణ్యాలు ఆశించిన స్థాయిలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో పరిశీలించేందుకు ప్రతి జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి త్వరలోనే విదేశాలకు పంపుతున్నట్లు వివరించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా వివిధ విద్యా శాఖ కార్యక్రమాలలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే ఉపాధ్యాయులను ఉపేక్షించేది లేదని, శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జీహెచ్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన హెచ్ఎంల పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారులు శాంతిరాజు, హంపయ్య, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
వందలాది ఎకరాల్లో నష్టం..
ప్రస్తుతం కట్ట వెలుపలి భాగంలో రిజర్వాయర్ చుట్టూ రైతులు వేలాది ఎకరాల్లో మక్కలు, పత్తి, వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. వర్షాలకు కట్ట కోతకు గురై మట్టి మొత్తం పొలాల్లోకి చేరడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పత్తి వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం పత్తి ఏరేదశలో ఉండగా.. నీళ్లు, మట్టి చేరడంతో దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. ఈ మేరకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చే స్తున్నారు. దీంతోపాటు రిజర్వాయర్ కట్ట పనుల్లో నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఇప్పటికే సర్వం కోల్పోయామని.. ఇంకా పరిహా రం అందనే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నీటి లీకేజీ, మట్టి, ఇసుక మేటలతో నష్టం వాటిల్లుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. కాగా రిజర్వాయర్ కట్టకు కోత, నీటి లీకేజీపై పీఆర్ఎల్ఐ అధికారులను ఫోన్లో సంప్రదించేందుందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఎవరూ అందుబాటులోకి రాలేదు. -
ఉదండాపూర్ లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు.12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తాగు నీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కట్ట కోతకు గురై పగుళ్లు ఏర్పడి.. పలు చోట్ల నీరు లీకవుతోంది. ఈ మేరకు ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితం కాగా.. అధికారులు ఇటీవల మరమ్మతులు చేయించారు. తాజాగా కురిసిన వర్షంతో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పొలాల్లోకి నీటి ఊటలు రావడం.. కట్ట మట్టి కొట్టుకువచ్చి మేటలు వేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు వట్టెం పంప్హౌస్ నీట మునగడం.. తాజాగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కాకముందే డొల్లతనం బయటపడడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 20 ఫీట్ల మేర గోతులు.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద 15.91 టీఎంసీల సామర్థ్యంతో 9.36 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఈ రిజర్వాయర్కు శ్రీకారం చుట్టారు. ఇంతటి భారీ కట్ట నిర్మాణం నాసిరకంగా కొనసాగినట్లు ఇటీవల వర్షాలు నిరూపిస్తున్నాయి. కట్టపై ఒక్కో చోట దాదాపు 20 ఫీట్ల మేర గోతులు ఏర్పడ్డాయి. నిర్మాణంలో నాణ్యత పాటించకుండా నాసిరకం మట్టిని వాడడం.. అందులో ఉన్న రాళ్లను తీయకుండా రోలింగ్ చేయడంతో వానలకు కట్ట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రివిట్మెంట్ పనుల్లో సైతం నాణ్యత కొరవడింది. అందుకే రివిట్మెంట్లలో రాళ్లు చిందరవందరగా పడి ఉన్నాయని.. నీళ్లు లీకవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు గురైన రిజర్వాయర్ కట్ట మరమ్మతులు చేసినా అదే పరిస్థితి పలు చోట్ల పొలాల్లోకి చేరుతున్న మట్టి, బురద నీరు రివిట్మెంట్ పనులు, నిర్మాణంలో నాణ్యత లేమి ? నాసిరకం మట్టి వాడకం, సరిగ్గా రోలింగ్ చేయకపోవడమే కారణం పనులు పూర్తికాకముందే బయటపడిన డొల్లతనం పొలాల్లోకి నీటి ఊటలు.. ఆందోళనలో రైతులు -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
మానవపాడు: ప్రతి ఒక్కరికీ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జూనియర్ సివిల్జడ్జి ఆర్వీఎస్ మిథున్ తేజ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దపోతులపాడులో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. యువత సన్మార్గంలో పయనిస్తూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడొద్దని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసులు, న్యాయవాదులు టి.నారాయణరెడ్డి, కేవీ తిమ్మారెడ్డి, గజేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అనుమానాస్పద కేసుల విచారణ వేగంగా చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలన్నారు. పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి.. నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు కళ్యాణ్ కుమార్, శేఖర్, రాజునాయక్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ తదితరులు ఉన్నారు. -
ఉద్దాలోత్సవం
నయనానందం ● బ్రహ్మాండనాయకుడి ప్రధాన వేడుకకు తరలివచ్చిన భక్తజనం ● గ్రామగ్రామాన మంగళ హారతులతో స్వాగతం ● జనసంద్రంగా మారిన ఊకచెట్టువాగు, జాతర మైదానం ● గోవింద నామస్మరణతో మార్మోగిన కురుమూర్తి గిరులు చిన్నచింతకుంట: పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా వేలాది మంది భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు. చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వడ్డెమాన్లోని ఉద్దాల మండపంతోపాటు జాతర మైదానం జనం హోరెత్తింది. భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కురుమూర్తి సప్తగిరులు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి నామస్మరణతో మార్మోగాయి. వడ్డెమాన్ నుంచి తరలింపు.. పల్లమర్రి గ్రామంలో భక్తిశ్రద్ధలతో తయారు చేసిన చాటకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చాటను ట్రాక్టర్పై వడ్డెమాన్లోని ఉద్దాల మండపానికి తీసుకువచ్చారు. ఉపవాస దీక్ష, నియమ, నిష్టలతో తయారు చేసిన పాదుకలను దర్శించుకునేందుకు భక్తులు మండపం వద్ద బారులుదీరారు. అప్పంపల్లి నెల్లి వంశస్తులు పాదుకలకు పూజలు చేసేందుకు మేళతాళాలతో మండపానికి చేరుకున్నారు. పాదుకలకు బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతమ్మ, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత, ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్దాలను కురుమూర్తి గిరులకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య.. పోలీసుల భారీ బందోబస్తు మధ్య దళితులు ఉద్దాలను కురుమూర్తిగిరులకు తరలించారు. ఊకచెట్టు వాగులో ఉద్దాల చాట కింద భక్తులు దూరి తన్మయత్వం చెందారు. దీంతో రెండు గంటలపాటు ఊకచెట్టు వాగులో తిరునాళ్లు జరిగాయి. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చి తరించారు. శివసత్తుల పూనకాలు, భక్తుల ఆటపాటలతో గోవింద నామస్మరణ మా రుమోగింది. అక్కడి నుంచి తిర్మలాపురం గ్రామ ఆంజనేయస్వామి ఆలయానికి చేర్చగా.. గ్రామస్తులు పూజలు నిర్వహించిన తర్వాత ట్రాక్టర్పై కురుమూర్తికి తీసుకువచ్చారు. దేవుడి చెరువు కట్ట మీద ఉద్దాలను దర్శించుకునేందుకు వేలాది భక్తులు బారులుదీరారు. జాతర మైదానంలోని ఉ ద్దాల గుండు వద్ద భక్తులకు దర్శనం కల్పించి కాంచన గుహలో కొలువుదీరిన కురు మూర్తిస్వామి చెంతకు ఉద్దాలను తీసుకెళ్లి అనంతరం ఉద్దాల మండపంలో పెట్టారు. దారులన్నీ కురుమూర్తి వైపే.. కురుమూర్తి జాతరకు మధ్యాహ్నం నుంచి భక్తులు భారీస్థాయిలో తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, బైకులు, ఎద్దుల బండ్లపై భక్తులు జాతరకు చేరుకున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దేవరకద్ర, మక్తల్, అమరచింత, కొత్తకోట, చిన్నచింతకుంట దారుల గుండా వేలాది వాహనాలు వచ్చాయి. -
జాతీయ వాలీబాల్ టోర్నీకి జిల్లా క్రీడాకారుడు
గద్వాలటౌన్: మధ్యప్రదేశ్లో వచ్చేనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల గురుకుల పాఠశాల విద్యార్థి రాత్లావత్ సిద్దు రాథోడ్ ఎంపికయ్యారు. గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్దు.. ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన ఎస్జీఎఫ్–19 రాష్ట్రస్థాయి బాలుర వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో సిద్దు రాథోడ్ను ప్రిన్సిపాల్ రాజు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తడి.. పొడి ఊసేది?
గద్వాల పురపాలికలో గాడితప్పిన చెత్త నిర్వహణ ● కానరాని తడి, పొడి వేరుచేసే ప్రక్రియ ● చొరవ చూపని మున్సిపల్ అధికారులు ● నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ప్లాస్టిక్ డబ్బాలు అందజేయాలి.. తడి, పొడి చెత్త వేరు చేయడానికి నాలుగేళ్ల క్రితం ఇంటింటికీ రెండు ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు. ప్రస్తుతం అవి చాలా వరకు పాడయ్యాయి. చాలా ఇళ్లలో ప్లాస్టిక్ డబ్బాలు లేకపోవడం వల్ల తడి, పొడి చెత్త కలిపే ఇస్తున్నారు. దీంతో లక్ష్యం నెరవేరడం లేదు. తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వడానికి ఇంటింటికీ ప్లాస్టిక్ డబ్బాలు పంపిణీ చేయాలి. – శ్రీధర్, గద్వాల అవగాహన కల్పిస్తాం.. కాలనీల్లో తడి, పొడి చెత్త సేకరణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మహిళా సంఘాల సభ్యులు కృషి చేస్తున్నారు. పట్టణంలో పేరుకుపోయిన చెత్త, ఇతర వ్యర్థాలను ట్రాక్టర్లలో డంపింగ్యార్డుకు తరలిస్తున్నాం. డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. – జానకీరామ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: ప్రతి మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి, రీసైక్లింగ్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఘనత వహించిన గద్వాల మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన గద్వాలలో చెత్త నిర్వహణ నానాటికీ గాడి తప్పుతోంది. ముఖ్యంగా తడి, పొడి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది. పట్టణ ప్రజల్లో అవగాహన లేమి, అధికారుల ప్రచార లోపం, పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. అటకెక్కిన పారిశుద్ధ్య నిర్వహణ.. రోజు నివాసగృహాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసాహార దుకాణాలు, వ్యాపార సముదాయాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై గతంలో విస్తృతంగా అవగాహన కల్పించేవారు. తడి, పొడి చెత్త వేరు చేయడానికి ఇంటింటికీ చెత్త డబ్బాలు కూడా పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ చెత్త డబ్బాలు చాలా వరకు ఇళ్లలో కనిపించడం లేదు. కొంతమంది ఇతర అవసరాలకు వినియోగిస్తుండగా.. మరికొన్ని ఇళ్లలో పాడయ్యాయి. దీనికి తోడు కొంతకాలంగా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకోకపోవడం.. ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి చూపకుండా అన్నిరకాల చెత్తను కలిపి ఇస్తుడటం సమస్యగా మారింది. ఇలా సేకరించిన చెత్తను మున్సిపల్ సిబ్బంది డంపింగ్యార్డులో గుట్టలు గుట్టలుగా వేస్తున్నారు. -
తుపాన్తో నష్టం వాటిల్లకుండా చూడాలి
గద్వాల: మోంథా తుపాన్ కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తుఫాన్ ప్రభావం గురించి రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న మూడు రోజులపాటు అవసరమైతే వరికోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వరిధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్ల నేపథ్యంలో వర్షానికి ధాన్యం తడిసి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ● ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్రూం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంల గోదాంను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా స్ట్రాంగ్రూంలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్ ఉన్నారు. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
అయిజ: ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎండీ అక్బర్ అన్నారు. తెలంగాణ ఆయిల్ఫెడ్ సౌజన్యంతో అయిజ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైతువేదికలో ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా రైతులు ఎలాంటి పంటలు సాగుచేసినా అధిక పెట్టుబడులు, తక్కువ దిగుబడులతో నష్టపోతున్నారని అన్నారు. రైతులకు వ్యవసాయం గుదిబండగా మారిన నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్పాం సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఆయిల్పాం తోటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. మరోవైపు క్రిమిసంహారక మందుల వాడకం తగ్గి.. భూ సారం పెరుగుతుందన్నారు. రైతులు లాభదాయక పంటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, సింగిల్విండో అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఆయిల్ఫెడ్ జిల్లా మేనేజర్ శివనాగిరెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్లు మహేశ్, రాజశేఖర్, ఏఓ జనార్దన్, ఫీల్డ్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, మంజునాథ్, మేఘారెడ్డి, శివకుమార్, శశిధర్, సింగిల్విండో కార్యదర్శి మల్లేశ్ పాల్గొన్నారు. -
మార్గదర్శక సూచనలు పాటించాలి
● ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పొరపాట్లకు తావివ్వొద్దు ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ఖచ్చితత్వంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ధేశించిన మార్గదర్శక సూచనలు పాటించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఐడీవోసీ సమావేశ హాలులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా మార్గదర్శక సూచనలు ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2002 ఎన్నికల జాబితాను ప్రామాణికంగా తీసుకుని 2025 ఎన్నికల జాబితాతో నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేశారన్నారు. ఓటర్ల వర్గీకరణ ప్రకారం 2002 జాబితాలో ఉన్నవారిని ఏ, లేనివారిని బి, 22–37 సంవత్సరాల వయసున్న వారిని సీ, 18–21 వయసున్న వారిని డి కేటగిరిలుగా విభజించినట్లు వివరించారు. మొదటగా కేటగిరి ఏలో ఓటర్ల వివరాలను బీఎల్వో యాప్ ద్వారా ధ్రువీకరించాలని, అది పూర్తయిన తరువాత స్టేటస్యాప్లో బ్లూకలర్ నుంచి గ్రీన్కలర్కి మారుతుందని ఈ ధ్రువీకరణ అనంతరం కేటగిరి సీ మరియు డీ ఓటర్లను బీఎల్వో యాప్ద్వారా సంబంధిత కుటుంబాలకు లింక్ చేయాలని సూచించారు. ఈప్రక్రియను ఈఆర్ఓ పర్యవేక్షణలో బీఎల్వో సూపర్వైజర్లు మరియు బీఎల్వోల సమన్వయంతో శనివారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 16 అర్జీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 16 అర్జీలు వచ్చాయి. ఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 16 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఎస్పీ బాధితులకు సూచించారు. ‘పాగుంట’ హుండీ ఆదాయం రూ.11.26 లక్షలు కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో వెలసిన శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీని సోమవారం ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో లెక్చించారు. 11 నెలలకుగాను రూ.10.25 లక్షలు నోట్ల రూపంలో, నాణెములు ద్వారా రూ.1.01.. మొత్తం హుండీ ఆదాయం రూ.11.26 లక్షలు వచ్చింది. గతేడాది ఆదాయంతో పోల్చితే ప్రస్తుత సంవత్సరం రూ.1,47,070 ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ పర్యవేక్షణఽ అధికారి వెంకటేశ్వరమ్మ, పురేందర్, భక్తులు తదితరులు ఉన్నారు. నాలుగు టెండర్లు ఆమోదం అలంపూర్: అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాలకు సంబంధించిన నాలుగు టెండర్లను ఆమోదించిట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. ఆలయాలకు సంబంధించి 10 టెండర్లకు సీల్డ్ కవర్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా.. వీటిని సోమవారం తెరిచారు. అందులో నాలుగు టెండర్లు ఆమోదించగా మరో ఆరు టెండర్లు వాయిదా వేశారు. ఆలయాల్లో ఫొటో, వీడియోలు తీయడానికి అలంపూర్కు చెందిన హరిబాబు, లైటింగ్ డెకరేషన్ చేయుటకు కర్నూల్కు చెందిన రవి డిజిటల్, ఫ్లెక్సీ ప్రింటింగ్కు కర్నూలు ప్రింట్ వరల్డ్, సీసీ టీవీల ఏర్పాటు, నిర్వహణకు హైదరాబాద్కు చెందిన జై దుర్గా భవనీ వారు టెండర్ దక్కించుకున్నట్లు తెలిపారు. నాలుగు టెండర్లకు సరైన కొటేషన్లు సమర్పించలేదని, మరో రెండు టెండర్లకు ఎవరూ కొటేషన్ సమర్పించలేదని పేర్కొన్నారు. దీంతో ఈ ఆరు టెండర్లను వాయిదా వేసినట్లు ఈఓ తెలిపారు. వెబ్సైట్లో అర్హుల జాబితా కందనూలు: కేజీబీవీ, యూఆర్ఎస్ పాఠశాలలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి అర్హుల జాబితాను htt p://doenagarkurnool.wee by.com వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని డీఈఓ రమేష్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మంగళవారం సాయంత్రం 3 గంటలలోగా తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
పత్తి వాహనాల బారులు
జాతీయ రహదారిపై నిలిచిన పత్తి వాహనాలు ఉండవెల్లి శివారులోని పత్తి కొనుగోలు కేంద్రం వద్ద నిలిచిన వాహనాలు పత్తి కొనుగోళ్లు ప్రారంభమవడంతో రైతులు సీసీఐ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉండవెల్లి మండలంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న వరసిద్ది వినాయక పత్తి కొనుగోలు కేంద్రానికి(సీసీఐ) సోమవారం భారీ సంఖ్యలో రైతులు పత్తిని వాహనాల్లో తీసుకువచ్చారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు గంటల తరబడి క్యూ కట్టాయి. మార్కెటింగ్ అధికారులు పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. అసలే జాతీయ రహదారి కావడం.. వాహనాల రద్దీ నేపథ్యంలో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తగు భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. ఇదిలాఉండగా, సోమవారం 1300 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ కార్యదర్శి ఎల్లస్వామి తెలిపారు. – ఉండవెల్లి -
కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోండి
శాంతినగర్: రైతుల అభ్యున్నతి కొరకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వివిధ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. వడ్డేపల్లి వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై వచ్చిన పప్పుశనగ, రాగులు, జొన్నల విత్తనాలను సోమవారం రైతులకు అందజేశారు. సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన క్రింద ఏడాదికి రూ.6 వేలు, ధన్ ధాన్య కృషి యోజన పథకం క్రింద రైతుల అభ్యున్నతికి సబ్సిడీపై యంత్రపరికరాలు అందజేస్తున్నారన్నారు. దేశంలో 100 జిల్లాలను కేటాయించగా తెలంగాణలో మూడు జిల్లాలకు పథకాలు వర్తింపజేశరన్నారు. జోగుళాంబగద్వాల, నాగర్కర్నూల్, అచ్చంపేట జిల్లాలను ఎంపికచేశారన్నారు. జిల్లాల ఎంపికలో బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ కృషి ఎంతోవుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాజశేఖర్ శర్మ, శ్యామ్, మధుసూదన్గౌడ్, వెంకటేశ్వర్లు, శశికుమార్, నరసింహ, పరశురాముడు, పాల్గొన్నారు. -
లక్కీడిప్ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
జిల్లాలో 34 మద్యం దుకాణాలు.. 774 దరఖాస్తులు గద్వాల: మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యింది. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ బీఎం సంతోష్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను లక్కీడిప్ ద్వారా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 34 మద్యం దుకాణాలుండగా, 774దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కోషాపు వారిగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ లక్కీడ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీడ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్నవారినే లక్కీడిప్ ప్రక్రియలోకి అనుమతించారు. జిల్లా ఎకై ్సజ్ అఽధికారి విజయ్కుమార్రెడ్డి ఇతర ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడ్రా ప్రశాంతంగా కొనసాగింది. -
తొలి జీఓ ప్రకారమే నిర్మించాలి..
కొత్తపల్లి–జూరాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమల్లకు వెళ్లాలంటే మేము 30 కి.మీలు చుట్టి రావాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ మాదిరిగాా గేట్లు వేసి రాకపోకలు నిలిపివేస్తే.. మా వ్యాపారాలు జరగవు. రేవులపల్లి–నందిమల్ల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మా పొలాలకు కాస్త రేట్లు వస్తాయి. చిన్నాచితక వ్యాపారాలతో జీవనోపాధి పొందొచ్చనేది మా ఆశ. తొలి జీఓ ప్రకారమే బ్రిడ్జి నిర్మించాలి. అంతవరకూ పోరాటం తప్పదు. – రాజు, రేవులపల్లి, ధరూర్, జోగులాంబ గద్వాల ఎవరూ అడ్డుకోవద్దు.. ఆత్మకూరు మండలంలోని జూరాల పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రయోజనకరం. ఆత్మకూరు నుంచి గద్వాలకి వెళ్లాలంటే ప్రస్తుతం 33 కి.మీలు ప్రయాణం చేయాలి. ఈ బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 12 కి.మీ.లకే గద్వాల వెళ్లొచ్చు. 1979లోనే ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో కొత్తపల్లి – జారాల మధ్య నిర్మాణం కానుంది. ఎవరూ అడ్డుకోవద్దని.. అటుఇటు అయితే మేమూ పోరాటానికి సిద్ధం. – రహమతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మకూర్, వనపర్తి ● -
రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యం
ఎర్రవల్లి: రైతులు ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగించుకోవాలని, వైవిద్యమైన పంటలు సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంభించి మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని కేంద్ర మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ, పీఎండీడీకేవై జిల్లా నోడల్ అధికారిని పౌసుమిబసు అన్నారు. సోమవారం మండలంలోని బీచుపల్లి ఆయిల్ఫామ్ నర్సరీ, కొండేరు సమీపంలో రైతులు సాగు చేసిన వివిధ కూరగాయల పంటలను ఆమె పరిశీలించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిద శాఖల్లో అమలవుతున్న పథకాలు, రుణ సదుపాయాలు, ఈ ప్రాంత మౌళిక వసతులు, తదితర విషయాలపై శాఖల వారీగా నోడల్ అధికారిని సంబంధిత అధికారులు మరియు రైతులతో ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉద్యాన, పశు, మత్స్య, తదితర రంగాలకు చెందిన లబ్ధిదారులు సైతం తమ వృత్తుల్లో గణనీయమైన అబివృద్ధిని సాధించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. దీనిద్వారా రైతులు గ్రూపులుగా కలిసి వ్యవసాయాన్ని చేసి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభసాటిగా మార్చుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ నర్సరీ సాగు వివరాలు, మార్కెటింగ్, తదితర విషయాలను రైతులు, సంభందిత అదికారులను అడిగి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అదికారి అక్బర్, పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర్గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి జగ్గునాయక్, ఏఓలు సురేష్గౌడ్, రవికుమార్, సంభందిత శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
యాసంగికి సంసిద్ధం
జిల్లాలో 1,95,516 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశంగద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఈ ఏడాది (2025–26) యాసంగి సాగుకు రైతులు సిద్ధం అయ్యారు. 1,95,516 ఎకరాల్లో సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టాలపాలు అయ్యారు. జరిగిన నష్టాన్ని దిగమింగుకొని యాసంగి సీజన్ అయినా గట్టెక్కిస్తుందన్న గంపెడు ఆశతో పంటలు వేయడానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల దుక్కులు దున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు సైతం వేశారు. కన్నీరు మిగిల్చిన వానాకాలం గడిచిన ఏడాది 2024–25 వానాకాలం (ఖరీఫ్), యాసంగి సీజన్లు రైతులకు కలిసొచ్చాయి. వానాకాలంలో సమయానుకూలంగా వర్షాలు కురిశాయి. బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలం కావడంతో ఆ ఏడాది వానాకాలం సీజన్, యాసంగి సీజన్ సాగు సాఫీగా సాగింది. పత్తి, కంది, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల దిగుబడులు బాగానే వచ్చాయి. అయితే 2025 వానాకాలం సీజన్ (ఖరీఫ్) రైతులకు కన్నీరు తెప్పించింది. ఆరంభంలో వర్షాలు కురవలేదు. ఆ తర్వాత ప్రధానంగా జులై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంటలపై పడింది. పలుచచోట్ల నీరు నిల్వ అయి మొక్కల ఎదుగదలపై ప్రభావం పడింది. ఆ తర్వాత సెప్టెంబర్లోనూ కురిసిన వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్ళు, వైరస్లు, రకరకాల పురుగులు ఆశించాయి. ఎక్కువగా సాగు చేసిన పత్తి పంట దిగుబడులు సగానికి పడిపోయాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి తడిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా వానాకాలం సీజన్లో సాగు చేసిన అన్ని పంటల దిగుబడులు తగ్గి, రైతులను ఆర్థికంగా నష్టాల పాలు చేసింది. కంది 1320 కొర్ర 372 పెసర 150 ఇతర పంటలు 181 యాసంగిపైనే ఆశలన్నీ.. అంచనా మేరకు సాగు యాసంగి సీజన్ జిల్లాలో ఇప్పటికే ఆరంభించారు. బోర్లు, బావుల కింద సాగు బాగా జరుగుతుందని భావిస్తున్నాం. వరి, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ పంటలు ఎక్కువగా వేయనున్నారు. అంచనా మేరకు పంటలు సాగు అయ్యే అవకాశం ఉంది. – జగ్గు నాయక్, ఇన్చార్జ్ డీఏఓ ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసిన రైతులు అతివృష్టితో కలిసిరాని వానాకాలం సీజన్ గంపెడాశలతో విత్తనాలు వేసిన అన్నదాతలు వానాకాలం సీజన్ నిరాశ కల్గించినప్పట్టికి ఆభాదను దిగమింగుకొని 2025–26 యాసంగి సీజన్ సాగుకు జిల్లాలో రైతులు సిద్ధమయ్యారు. వరి, పప్పుశనగ, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఈసీజన్లో ప్రధానంగా వేయనున్నారు. 1,95,516 ఎకరాల్లో వివిధరకాల పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వానాకాలంలో కురిసిన విస్థారమైన వర్షాల వల్ల బోర్లు, బావులు రీజార్జ్ అయ్యాయి. దీంతో వీటి కింద రైతులు ఇప్పటికే సాగుకు సిద్ధంఅయ్యారు. జిల్లాలోని పలు చోట్ల దుక్కులు దున్నుతున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు వేశారు. చాలా చోట్ల వచ్చే నెల మొదటి, రెండో వారం నుంచి విత్తనాలు వేయనున్నారు. వానాకాలంలో వేసిన వరి పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నందు వల్ల, ఇది పూర్తి అయ్యాక నారు పోయనున్నారు. అయితే కొన్ని చోట్ల నారుమడులు సిద్దం చేస్తున్నారు. ఈసారి యాసంగిలో అధికంగా వరి పంట వేయనున్నారు. దీని తర్వాత మొక్కజొన్న వేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 50వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయ్యే అవకాశం ఉంది. నల్లరేగడి భూముల్లో మొక్కజొన్న, పప్పుశనగ ఎక్కువగా సాగు చేస్తారని అధికారుల అంచనాగా ఉంది. వీటితో పాటు కూరగాయల సాగుకు కూడా రైతులు సమాయత్తమయ్యారు. కొన్నిచోట్ల నారునాటతున్నారు. ఇదిలా ఉంటే యాసంగి సీజన్లో పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
లక్కు.. దక్కేదెవరికో!
● ఉమ్మడి జిల్లాలో 227 మద్యం దుకాణాలకు 5,536 దరఖాస్తులు ● నేడు కలెక్టరేట్లలో లక్కీడిప్ ద్వారా కేటాయింపు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు నూతన లైసెన్స్దారులుగా ఎంపిక కానున్న అదృష్టవంతులు ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. మొత్తం 227 దుకాణాలకు కలిపి 5,536 మంది టెండర్లు దాఖలు చేయగా.. వీరిలో 227 మందిని లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. మిగిలిన 5,309 మంది నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ శాఖ అధికారులు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేశారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన మద్యం దుకాణాలకు మహబూబ్నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో లక్కీడిప్ నిర్వహించనున్నారు. కలెక్టర్ విజయేందిర మొత్తం 90 దుకాణాలకు లక్కీడిప్ ద్వారా నంబర్ కలిగిన ప్లాస్టిక్ కాయిన్ తీయగా సదరు కాయిన్పై ఉన్న నంబర్ దరఖాస్తుదారుడికి దుకాణం కేటాయిస్తారు. లక్కీడిప్నకు వచ్చే వారికి సెల్ఫోన్ అనుమతి ఇవ్వలేదు. తప్పక ఎంట్రీపాస్తో లోపలికి రావాల్సి ఉంటుంది. ఒక్కో దుకాణానికి ఒక్కరికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం కల్పించారు. జిల్లా దుకాణాలు టెండర్లు మహబూబ్నగర్ 54 1,634 నాగర్కర్నూల్ 67 1,518 నారాయణపేట 36 853 గద్వాల 34 774 వనపర్తి 36 757 జిల్లాల వారీగా వచ్చిన టెండర్లు ఇలా.. -
ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి
గద్వాలటౌన్: గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి (డీవైఎస్ఓ) కృష్ణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి అండర్–14, 17 బాలురు, బాలికల క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలను వారు ప్రారంభించారు. క్రీడాకారుల పరిచయం అనంతరం వారు మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలలో రాణించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఈటీలు హైమావతి, శ్రీనివాసులు, నగేష్బాబు, బషీర్, బీసన్న, స్రవంతి, జగదీష్, సతీష్, సుహాసిని, దేవేందర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పాగుంట ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో వెలసిన శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆదివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హజరై ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెను సన్మానించి తీర్ధప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు బండల వెంకట్రాములు, రామచంద్రరెడ్డి, రాజేష్, వెంకటేశ్వర్ రెడ్డి, కిష్టన్న, శ్రీపాదరెడ్డి, ఎర్రబీంరెడ్డి, తదితరులు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు సదస్సు గద్వాల: బీసీ రిజర్వేషన్ల సాధనకై నవంబర్ 9వ జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని టీజేఎస్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, బీసీలపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరిత విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 9వ తేదీన గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈసదస్సుకు బీసీలు అధిక సంఖ్యలో హాజరై జయపద్రం చేయాలని కోరారు. దేశావ్యాప్తంగా 56శాతం ఉన్నబీసీలకు శాసీ్త్రయ కోణంలో కులగణన నిర్వహించి జనాభా ప్రాతిపదిక నిధులు కేటాయించి వారిని అభివృద్ధి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సబ్బండ జాతులు ఏకం కావాలని కోరారు. బీసీల వ్యతిరేక పార్టీ బీసీల ద్రోహి బీజేపీ చేస్తున్న దొంగనాటకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రిజర్వేషన్లను ముందు నుంచి కూడ వ్యతిరేకిస్తున్న బీజేపీ మనువాద విధానాల అమలులో భాగంగా బీసీలను రిజర్వేషన్లకు దూరం చేసేవిధానాలను చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకోవాలని దూరం చేయడంలో మొదటి ద్రోహి బీజేపీయో అని అన్నారు. అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం ఆఘమేఘాల మీద చట్టాలను సవరించిన కేంద్రప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మోసపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుబాబు, వెంకటస్వామి, అతికూర్ రహమాన్, ప్రభాకర్, సుభాన్, కుర్వపల్లయ్య, ఉప్పేరు నర్సింహా, వినోద్, గోపాల్యాదవ్, చిన్న, టవర్ మక్బుల్, దామోదర్, కృష్ణ, రాకేష్, లివింగ్స్టన్, లక్ష్మన్న పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యలపరిష్కారానికి పోరాటం అలంపూర్: రిటైర్డు ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని రిటైర్డు ఉద్యోగుల సంఘం నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు మద్దిలేటి, కార్యదర్శి సదానందమూర్తి అన్నారు. అలంపూర్ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్ల సమస్యలు తమ దృష్టికి తీసుకరావాలన్నారు. ఎస్టిఓ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రిటైర్డు ఉద్యోగుల పెన్షన్ మధ్యలో నిలిచిన, పూర్తిగా రాకపోయిన తమను సంప్రదించాల్సిందిగా తెలిపారు. పెన్షన్ దారులను ఎస్టీఓ కార్యాలయంలో ఇబ్బందులకు గురిచేసే వారిని సహించేది లేదన్నారు. జిల్లాలోని 2500 వందల మంది పెన్షన్ దారులు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన డబ్లులు వారి ఖాతాల్లో జమ కావడం లేదన్నారు. దీంతో రిటైర్డు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి వారి డబ్బులను ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ డబ్బులు సకాలంలో రాకపోవడంతో కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని అందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన డీఏలను పెన్షన్దారులకు ఇవ్వాలన్నారు. నియోజకవర్గ రిటైర్డు ఉద్యోగుల నూతన కార్యకవర్గం ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఎన్నిక తేదిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం
ఆర్అండ్ఆర్ సెంటర్లో వసతులు కల్పిస్తాం ధరూరు: అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్వాసితుల కొరకు నూతనంగా ఏర్పాటవుతున్న ర్యాలంపాడు ఆర్అండ్ఆర్ సెంటర్లో రూ.30లక్షల వ్యయంతో నిర్మించి తలపెట్టిన మిషన్ భగీరథ ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆదివారం ఆయన మండల పరిరిఇలోరని ఓబులోనిపల్లి గ్రామ శివారులో కేటాయించిన ఆర్అండ్ఆర్ సెంటర్ను సందర్శించిన అనంతరం మాట్లాడారు. ముంపు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 90వేల లీటర్ల సామర్థ్యంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నామన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 4టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్లో సర్వం కోల్పోయిన బాధితుల త్యాగం మరువలేనిదన్నారు. అక్కడి రైతుల రుణం ఎంతిచ్చినా తీర్చకోలేమన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సుదర్శన్రెడ్డి, హనుమంతు, రాజశేఖర్, శ్రీనివాస్రెడ్డి, శ్రీరాములు, విజయ్రెడ్డి, పురుశోత్తంరెడ్డి, నాగన్న, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. గద్వాల వ్యవసాయం: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రం సమీపంలోని సంగాల రిజర్వాయర్ వద్ద ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, ఇతర నాయకులతో కలిసి రిజర్వాయర్లో చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వందశాతం రాయితీపై మత్స్యకారులకు చేపపిల్లలను సరఫరా చేసిందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని కుల వృత్తులను కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో నదుల శాతం తక్కువగా ఉన్నప్పట్టికి, ఉన్న నీటివనరులను సద్వినియోగం చేసుకొని చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అన్ని చెరువులను అభివృద్ది చేసి చేపపిల్లలను పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిదని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రోత్సాహన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్యార్డ్ చైర్మన్ కురువ హనుమంతు, రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీచైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాభానో, జమలమ్మ ఆలయ కమీటీ చైర్మన్ వెంకట్రాములు, మాజీ ఎంపీపీ ప్రతాప్గౌడ్, మాజీ జడ్పీటీసీ రాజశేఖర్, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ బాబర్ మత్స్యకారులు పాల్గొన్నారు. -
సామూహిక వివాహాలతో.. ఆదర్శ సమాజానికి బాటలు
బల్మూర్: ఆదివాసీల సామూహిక వివాహాలు ఆదర్శ సమాజానికి బాటలు వేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో 111 చెంచు గిరిజన జంటలకు సామూహిక వివాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి మాధవిలత హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలోని ఆదివాసీల జీవన విధానం భిన్నమైనదని.. ఆర్థికంగా, సామాజికంగా వెనకబాటుకు గురైన చెంచు గిరిజనులకు వివాహ బంధం విశిష్టతను ఇలాంటి కార్యక్రమాలతో తెలుసుకొని అభివృద్ధి దిశగా నడిచేందుకు దోహదం చేస్తాయన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నల్లమలలోని చెంచు గిరిజనుల సామూహిక వివాహ మహోత్సవం కనులపండువగా జరిగిందని, వారిని ఆశీర్వదించడానికి రాష్ట్ర గవర్నర్ రావడం శుభసూచికమని అన్నారు. నూతన జంటలు కలకాలం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. హైకోర్టు న్యాయమూర్తి మాధవిలత మాట్లాడుతూ తాను నల్లమల ప్రాంతంలోని పదర మండలం ఉడిమిళ్లకు చెందిన కోడలినని.. ఆదివాసీల జీవితాలు, వారి జీవన విధానాల మెరుగుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్ వారు చెంచు గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, శ్రీఆదిత్య పరాశ్రీ స్వామీజీ, రేఖానాగర్ వనవాసీ కల్యాణ ఆశ్రమం భారత కార్యకారిణి సభ్యులు ఇండోర్, తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కాట్రాజు వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు ఉడుతనూరి లింగయ్య, మహిళా ప్రముఖ్ గుర్రం శంకులత, జిల్లా ప్రముఖ్ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
కృష్ణమ్మ ఒడిలో.. జలవిహారం
సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు ● వరదలతో రెండు నెలలుగావాయిదా పడిన వైనం ● తాజాగా తగ్గుముఖం పట్టడంతో ప్రారంభించేందుకు కసరత్తు ● పర్యాటకులకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు ● బ్యాక్వాటర్లో ఆకట్టుకుంటున్నచిన్నబోట్ల షికారు సరిహద్దు సమస్యతో.. కృష్ణానదిలో లాంచీ ప్రయాణాలకు రాష్ట్రాల సరిహద్దు సమస్య కొంత ఇబ్బందిగా మారింది. సోమశిల నుంచి శ్రీశైలానికి తిప్పే లాంచీని మొదట్లో పాతాళగంగ వద్ద ఆపేవారు. ఏపీ అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఈగలపెంట వద్ద ఆపుతున్నారు. అక్కడి నుంచి పర్యాటకులు బస్సులు, ఇతర వాహనాల్లో శ్రీశైలానికి వెళ్లి వస్తున్నారు. ఇందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. పాతాళగంగ వద్ద లాంచీని ఆపితే ప్రయాణికులకు సమయం ఆదా కావడంతోపాటు అలసట కూడా ఉండదనే విషయాన్ని పలువురు పర్యాటక శాఖ అధికారులతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశం మంత్రి పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో మార్పులు సోమశిల నుంచి శ్రీశైలానికి నడిపే ఏసీ లాంచీలో గతేడాది కొన్ని రకాల మార్పులు చేశారు. గతంలో 60 నుంచి 70 మంది ప్రయాణికులు బుకింగ్ చేసుకుంటేనే లాంచీ ప్రయాణం చేపట్టేవారు. అయితే ఒకేసారి అంతమంది బుకింగ్ చేసుకోవడం సమస్యగా మారింది. దీంతో ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా ఈ లాంచీ ప్రయాణం కొనసాగేది కాదు. గతేడాది ప్రతి శని, ఆది వారం ప్రయాణికులు ఉన్నా.. లేకున్నా.. లాంచీని తిప్పాలని టూరిజం శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకులు ఆయా రోజుల్లో లాంచీ ప్రయాణాలకు మొగ్గుచూపడంతో ఇదే పద్ధతిని కొనసాగించాలని భావిస్తున్నారు. టికెట్ల ధరలు, వసతుల కల్పనలోనూ ఈ ఏడాది నుంచి మార్పులు చేపట్టాలని నిర్ణయించారు. మరిన్ని కొత్త బోట్లు.. సోమశిల నుంచి శ్రీశైలానికి తిప్పేందుకు 30 నుంచి 40 మంది వరకు ప్రయాణించేందుకు వీలుగా మరో కొత్త ఏసీ లాంచీని ఏర్పాటు చేసే యోచనలో పర్యాటక శాఖ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఏసీ లాంచీ నిర్వహణకు భారీగా ఖర్చవుతోంది. ప్రయాణికుల సంఖ్య 50లోపే ఉంటుండడంతో నిర్వహణ భారం తగ్గాలంటే మరో చిన్న లాంచీని ఏర్పాటు చేయడమే మేలని భావిస్తున్నారు. సోమశిలలో వీఐపీ ఘాట్ వద్ద పరిసర ప్రాంతాల్లో విహరించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్వాన్ బోట్, పెడల్ బోట్, కయాక్ బోట్, వాటర్ సింప్లీ సోర్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో జెట్స్కీ బోట్, బైక్ బోట్, ఫనియాక్ బోట్లు ఏర్పాటు చేశారు. వీటిలో షికారు చేసేందుకు ప్రయాణికులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్థానికంగా విహారానికి మరికొన్ని చిన్న బోట్లను ఏర్పాటు చేసేందుకు కూడా పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. పెద్దలకు పిల్లలకు సోమశిల నుంచి శ్రీశైలం 2,000 2,000 వన్ వే ప్రయాణం సోమశిలలో తిరిగేందుకు 100 50 మినీ లాంచీకికయాకి బోట్ (ఒక వ్యక్తికి) 150 స్పీడ్ బోట్ (నలుగురు వ్యక్తులకు) 400 పెడల్ బోట్ (ఒక వ్యక్తికి) 100 వసతులు కల్పిస్తున్నాం.. వరదల కారణంగా సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తాం. తక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తే పెద్ద లాంచీలో నది ప్రయాణం చేయడం వల్ల నిర్వహణ భారం పెరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు చిన్న లాంచీ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరాం. సోమశిల పరిసర ప్రాంతాల్లో షికారు చేసేందుకు మరికొన్ని చిన్న బోట్లు కూడా తేవాలనుకుంటున్నాం. మంత్రి ఆదేశానుసారం పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. – నర్సింహ, జిల్లా పర్యాటక శాఖ అధికారి అందుబాటులో రెండు లాంచీలు నల్లమల కొండల మధ్యలో ప్రవహించే కృష్ణానది అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టూరిజం అధికారులు పదేళ్ల క్రితం సోమశిలలో 30 మంది వరకు ప్రయాణించేందుకు వీలుగా నాన్ ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. లాంచీ ప్రయాణానికి పర్యాటకులు ఆసక్తి చూపడంతో 2019లో స్వదేశీ దర్శన్ నిధులు రూ.2.50 కోట్లు వెచ్చించి.. 120 మంది ప్రయాణించేందుకు వీలుగా ఏసీ లాంచీని సైతం ఏర్పాటు చేశారు. మినీ లాంచీని సోమశిల పరిసరాల్లో మాత్రమే తిప్పుతూ.. ఏసీ లాంచీని శ్రీశైలం వరకు నడిపిస్తున్నారు. -
పత్తి కొనుగోళ్లను సరళీకృతం చేయాలి
గద్వాల వ్యవసాయం: పత్తి కొనుగోళ్లకు ప్రవేశపెట్టిన కపాస్ యాప్ విధానాన్ని రద్దు చేసి, గతంలో మాదిరి కొనుగోళ్లను సరళీకృతం చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని రైతుల్లో ఇంకా సాంకేతికత పెరగలేదని, కపాస్ కిసాన్ యాప్ ప్రక్రియ రైతులకు ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొచ్చే రైతులు ఈ యాప్లో ఆన్లైన్ చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి పాత విధానాన్ని అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. పత్తి కొనుగోళ్లు కూడా ఈసారి చాలా ఆలస్యంగా ప్రారంభించారని, 8–12తేమ శాతం ఉంటేనే కొంటామనడం సరికాదన్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అంత తక్కువ తేమ శాతం ఉండదని, ప్రభుత్వాలు ఏపని తలపెట్టిన రైతులకు మేలు చేసే విదంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్యార్డ్ చైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్కుమార్, ప్రతాప్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరగా పూర్తి చేయాలి
గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి. సాగు నీటి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. బోర్ల ద్వారానే పంటలు పండిచుకుంటున్నాం. వర్షాలు వస్తేనే బోర్లలో నీరు పుష్కలంగా ఉంటాయి. వర్షాలు లేక పోతే బోర్లు ఎండిపోతాయి. ప్రభుత్వం గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – జగదీష్, రైతు, రాయాపురం అంచనాలు రూపొందిస్తున్నాం గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయి. రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఏ మేరకు పెంచాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకే అంచనాలను రూపొందిస్తున్నాం. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గట్టు ఎత్తిపోతల పథకం అంచనా తయారీలో నిమగ్నమయ్యాం. – రహీముద్దీన్, ఎస్ఈ, గద్వాల ● -
ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మల్దకల్: ఉపాధిహామీ సామాజిక తనిఖీల్లో వచ్చే ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విజిలెన్స్ అధికారి ఉమారాణి అన్నారు. శనివారం మల్దకల్ ఎంపీడీఓ కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై జరుగుతున్న సామాజిక తనిఖీలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహించవద్దని, తనిఖీలు నిర్వహిస్తున్న గ్రామాల నుంచి ఫిర్యాదులు అందడం అధికారుల నిర్లక్ష్యమేనని, సామాజిక తనిఖీలకు అధికారులు మండలాలకు రాకముందే రికార్డులను సరిచేసుకోవాలన్నారు. అదే విధంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులకు రికార్డులు తప్పనిసరిగా అందజేయాలని పేర్కొన్నారు. వీసీలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ రాజశేఖర్, ఏపీఓ సుజాత, టెక్నీకల్ అసిస్టెంట్లు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎస్జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
గద్వాల: ఈనెల 26వ తేదీన ఆదివారం 69వ ఎస్జీఎఫ్ అండర్–14, అండర్–17 బాలుర, బాలికల జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక చేస్తామని ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ టి.శ్రీనివాసులు ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎంపిక నిర్వహిస్తామని అండర్–14లో 01.01 2012 సంవత్సరంలో జన్మించిన వారు అర్హులని, అండర్–17కి 01.01.2009 సంవత్సరంలో జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనబోయే ప్రతివిద్యార్థి తప్పకుండా సంబంధిత పాఠశాల బోనఫైడ్, ఆధార్కార్డుని తీసుకురావాలని తెలిపారు. ప్రతిస్కూల్ నుంచి అండర్–14,17 విభాగాల్లో ముగ్గురు లేక, నలుగురు బాల,బాలికలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక అనంతరం రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ నవంబర్ 3వ తేదీన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల జోనల్ టోర్నమెంట్స్ ఉన్నందున ఈ ఎంపిక ప్రక్రియను అత్యవసరంగా నిర్వహిస్తున్నట్లు అందరు పీఈటీలు, పీడీలు సహకరించాలని ఆయన కోరారు. ఆదిశిలా క్షేత్రంలోప్రత్యేక పూజలు మల్దకల్ : ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అరవిందరావు, బాబురావు, చంద్రశేఖర్రావు, ఆలయ సిబ్బంది రంగనాథ్, శ్రీను, చక్రి, రాములు, కృష్ణ, శివమ్మ, వాల్మీకీ పూజారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, సద్దలోనిపల్లి కృష్ణస్వామి, అమరవాయి వీరభద్రస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప, శేషంపల్లి శివసీతారామస్వామి ఆలయాల్లో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలుగును ధ్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి గట్టు: మండలంలోని పెంచికలపాడు గ్రామ శివారులోని పల్లెవాని చెరువు అలుగును కొందరు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు పల్లెవాని చెరువు నిండి అలుగు పారుతున్నట్లు తెలిపారు. అయితే చెరువు పైభాగంలో ఉన్న కొంత మంది రైతులు తమ పంట పొలాలు నీట మునుగుతాయనే ఉద్దేశంతో చెరువు అలుగును ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేసినట్లు గ్రామానికి చెందిన మరికొంత మంది రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ధ్వంసం చేసిన చెరువు అలుగు కారణంగా చెరువులోని చాలా వరకు నీరు వృథాగా కిందకు పారుతోందని, ఉద్దేశ పూర్వకంగానే జేసీబీ సహాయంతో చెరువు అలుగును ధ్వంసం చేసినట్లు పెంచికలపాడు గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించి, బాద్యులపై చర్యలు తీసుకోవాలని పెంచికలపాడు గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
వైద్యులను నియమించండి
అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. హైదరాబాద్లో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ను ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే శనివారం కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే వారికి వసతులు కల్పించాలని, వైద్యాధికారులను నియమించాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చే వారికి వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రజల అవసరాలను గుర్తించి మౌళిక వసతులు కల్పించాలని వినతిలో కోరారు. అదేవిధంగా సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీ వేముల శ్రీనివాస్, విపత్తుల నిర్వహణ అధికారులను కలిసి బాధితులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలం భూంపురం, రాజోలి మండలం ముండ్లదీన్నేతోపాటు ఆయా గ్రామాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందినట్లు వినతిలో పేర్కొన్నారు. పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. వీరితోపాటు నాయకులు తదితరులు ఉన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
గద్వాల/ఇటిక్యాల: జిల్లాలో వరిధాన్యం కొనుగో లు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీఓసీ కా ర్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వానాకాలం వరిధాన్యం సేకరణ కోసం 84 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో చేస్తున్నట్లు గన్నీబ్యాగు లు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీన ర్లు, తేమ నిర్ధారణ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అదే విఽ దంగా పత్తి కొనుగోళ్లకు సంబంధించి కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్పై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వే సమయంలో రైతులు ఇచ్చిన ఫోన్ నంబర్లు మారితే కొత్త నంబర్లను అప్డేట్ చేసుకునేలా చూడాలన్నారు. జిల్లావ్యాప్తంగా 2.24లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రానుందని.. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీఎస్ఓ స్వామికుమార్, డీఎం విమల, డీఏఓ జగ్గునాయక్, మార్కెటింగ్ అధికారిణి పుష్పమ్మ, కోఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, డీఎస్పీ మొగిలయ్య, ఏడీఏ సంగీతలక్ష్మి ఉన్నారు. ● ధ్యానం నిల్వ వ్యవస్ధ పక్కాగా నిర్వహించి.. ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇటిక్యాలలోని స్టేట్ వేరోస్ కార్పొరేషన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ బఫర్ గోదాంను ఆయన పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. గోదాంలో నాణ్యతమైన ధాన్యాన్ని మాత్రమే నిల్వ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరిశీలించాలని సూచించారు. ఓపీఎంఎస్లో వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలో దాదాపు 40వేల టన్నుల ధాన్యం గోదాముల్లో నిల్వ ఉన్నందున.. ఇతర జిల్లాలకు తరలించనున్నట్లు తెలిపారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఇటిక్యాల పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నెలనెలా అన్ని పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులు అందించాలన్నారు. పీహెచ్సీలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్ విమల, టెక్నికల్ అధికారి సుబ్బన్న, గోదాం మేనేజర్ నాగరాజు, తహసీల్దార్ వీరభద్రప్ప, డా.అనిరుధ్, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ ఉన్నారు. -
ధాన్యం.. దోపిడీ
గద్వాల: రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో కొనుగోలు చేస్తున్న ధాన్యం ప్రక్రియ జిల్లాలో కొందరు రైస్మిల్లర్లు, అవినీతి అధికారులకు వరంగా మారింది. చేతనైనంతా దాచుకో.. దోచుకున్న దాంట్లో పంచిపెట్టు అన్న తరహాలో వీరి దోపిడీ సాగుతుంది. ఇందుకు నిదర్శనమే మొన్నటి కేటీదొడ్డిలోని కమ్మిడిస్వామి రైస్మిల్లులో రూ.7.80 కోట్ల ధాన్యం స్వాహా కాగా, తాజాగా గద్వాల పట్టణంలోని శ్రీరామ రైస్మిల్లులో రూ.2.23 కోట్ల విలువ గల ధాన్యం మాయమైన ఘటన వెలుగు చూసింది. ఈ రెండు రైస్మిల్లులో జరిగిన అక్రమాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులలో వెలుగుచూడడంతో జిల్లా సివిల్ సప్లైశాఖ అధికారుల పనితీరుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని కోట్ల ప్రభుత్వ ధనం అవినీతిపరులు దోచుకుంటుంటే జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అవినీతిపరులకు అక్షయపాత్రగా.. రైతులకు మద్దతు ధర కల్పించాలని సంకల్పంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో అవినీతిపరులకు అక్షయపాత్రగా మారింది. ఇందుకు నిదర్శనమే ప్రభుత్వం వద్ద తీసుకున్న రూ.10.03 కోట్ల ధాన్యాన్ని దోచేిసిన ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలు స్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో 11, 12వ తేదీలలో విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కెటి.దొడ్డిలోని కమ్మిడిస్వామి రైస్ మిల్లులో సోదా లు చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో రూ.7.80కోట్ల విలువ కలిగిన ధాన్యాన్ని ఆ రైస్ మిల్లు యజమాని నందిన్నె వీరన్న స్వాహా చేసినట్లు లెక్కలు తేల్చారు. దీంతో సదరు రైస్ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతోపాటు, ఆర్ఆర్ యాక్టును కూడా అమలు చేశారు. సరిగ్గా రెండు నెలలు గడవక ముందే శనివారం (18వ తేదీ) గద్వాల పట్టణం సమీపంలోని డ్యాంరోడ్డులో ఉన్న శ్రీరామ రైస్మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో సో దాలు నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో రూ.2.23 కోట్ల విలువ గల ధాన్యాన్ని సదరు రైస్మిల్లు యజమాని రవీందర్రెడ్డి స్వాహా చేసినట్లు లెక్కలు తేల్చారు. ఈ మిల్లుకు ప్రభుత్వం 2022–23లో 1423 మెట్రిక్టన్నుల ధాన్యం కేటా యించగా.. ఇందులో 912మెట్రిక్ టన్నులు మాయం చేసినట్లు, అదేవిధంగా 2024–25 ఖరీఫ్ సీజన్లో 1570 మెట్రిక్టన్నులకుగాను 12మెట్రిక్ టన్నులు, రబీ సీజన్లో 1074 మెట్రిక్ టన్నులకు 125మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా అయినట్లు తనిఖీలో వెలుగు చూసినట్లు విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తంగా రెండు నెలల వ్యవధిలో రూ.10 కోట్ల ధాన్యం పక్కదారి పట్టించడంజిల్లాలో కలకలం సృష్టిస్తుంది. అలంపూర్లో సైతం.. గద్వాల నియోజకవర్గంలోనే కాకుండా అలంపూర్ నియోజకవర్గంలో కూడా అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న రైస్మిల్లులో సైతం సుమారు రూ. 5కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. అవినీతి అధికారులకు చేతులు తడపడంతో అక్రమాలు వెలుగులోకి రాలేదనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.సివిల్ సప్లైశాఖ అధికారులు, రైస్మిల్లర్ల అవినీతి బాగోతం మొన్న కేటీదొడ్డి రైస్మిల్లులో రూ.7.80 కోట్ల ధ్యానం స్వాహా తాజాగా శ్రీరామ రైస్మిల్లులో రూ.2.25 కోట్ల వడ్లు మాయం విజిలెన్స్ దాడుల్లో అవినీతి వెలుగులోకి.. అధికారుల పనితీరుపై విమర్శలు -
అమరవీరుల త్యాగం మరువలేనిది
గద్వాల క్రైం: పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసుల విధులు, ఆయుధాల పనితీరు, బాంబ్ స్క్వాడ్, జాగీలాలు, మరణాయుధాలను గుర్తించే పరికరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తోందన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేస్తున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున స్వామివారి సన్నిధిలో మహా పూర్ణాహుతి, శ్రీచక్రస్నానం, ధ్వజా అవరోహణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి గద్వాలటౌన్: చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బుర్థపేట ప్రభుత్వ పాఠశాలతో పాటు మండలంలోని శెట్టి ఆత్మకూర్ జెడ్పీహెచ్ఎస్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ప్రణాళికా బద్ధంగా చదువుకొని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్తో పాటు పాఠశాల ఆవరణలో కూరగాయల సాగును పరిశీలించారు. పాఠశాలలోని వంటగది, తాగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలో సరుకులు, పరిసరాలను చూశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. డీఈఓ వెంట జిల్లా సమన్వయ అధికారి హంపయ్య, హెచ్ఎంలు నర్సింహారెడ్డి, సునీత, చాంద్పాషా ఉన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.5,801 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు గురువారం 273 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్కు గరిష్టంగా రూ. 5,801, కనిష్టంగా రూ. 2,229, సరాసరి రూ. 4100 ధరలు లభించాయి. అదే విధంగా 112 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 5,921 కనిష్టంగా రూ. 4,119, సరాసరి రూ. 5,829 ధరలు వచ్చాయి. 21 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) విక్రయానికి రాగా.. రూ. 1,903 ధర పలికింది. -
అక్రమార్కులకు సహకారం..
ఆది నుంచి జిల్లా సివిల్సప్లైశాఖ అధికారులకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వరంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన పలువురు అధికారులు రూ.కోట్ల విలువైన ధాన్యం స్వాహాలో ప్రత్యక్ష ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొందరిపై ఏకంగా విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో అవినీతి రుజువు కావడంతో కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా సివిల్సప్లైశాఖలో కీలకంగా పనిచేసే ఓ జిల్లాస్థాయి అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి రెండేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా కార్యాలయంలోని తన కుర్చీవైపు తొంగి చూడలేదనే అపవాదు ఉంది. దీనిపై గతంలో ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ సదరు అధికారి తీరులో మార్పులేదు. చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యానికి సంబంధించి మిల్లర్లు సీఎమ్మార్ బియ్యం పెట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఆర్ఆర్ యాక్టు ద్వారా సొమ్మును రికవరీ చేస్తాం. టెండర్ ధాన్యం నిల్వలపై నివేదిక తెప్పించుకుని అవసరమైన చర్యలు తీసుకుంటాం. – వి.లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ ● -
కిక్కు తగ్గింది..!
● ముగిసిన మద్యం దుకాణాల టెండర్లుమహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఈసారి జరిగిన మద్యం టెండర్ల ప్రక్రియలో జోష్ తగ్గింది. వ్యాపారులు దుకాణాల కోసం తీవ్రంగా పోటీ పడిన పరిస్థితి కనిపించలేదు. రెండుసార్లు గడువు పెంచినా కూడా వ్యాపారుల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. గత రెండేళ్ల కిందట జరిగిన దరఖాస్తుల స్వీకరణతో పోల్చితే ఈసారి చాలా వరకు తగ్గాయి. ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాలకు 5,536 టెండర్లు రావడం జరిగింది. చివరి రోజు గురువారం మొత్తం 251 దరఖాస్తులు రా గా ఇందులో మహబూబ్నగర్లో 69, వనపర్తిలో 75, నారాయణపేటలో 43, నా గర్కర్నూల్లో 81, గద్వాలలో 46 దర ఖాస్తులు ఉన్నాయి. ఇక ఉమ్మడి జిల్లా నుంచి టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.166.08 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. ఈ నెల 27న ఆయా జిల్లాల కలెక్టరేట్లలో లక్కీడిప్ ద్వారా దుకాణాలు కేటాయించనున్నారు. 2023తో పోలిస్తే ఈసారి 3,038 టెండర్లు తక్కువగా వచ్చాయి. -
అమరుల త్యాగం అజరామరం
గద్వాల క్రైం: పోలీసు అమరవీరుల త్యాగం అజరామరమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎస్పీ పాల్గొని మా ట్లాడారు. పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా బీచుపల్లి పదో బెటాలియన్, పోలీసు శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న పోలీసుల సేవలు త్యాగనిరతికి తార్కాణమని, విధుల్లో అమరులైన పోలీసు సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ నవ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు చేయూత ఇవ్వాలన్నారు. ఏ సమస్య వచ్చినా ముందుగా పోలీసు ఉన్నాడనే ధైర్యంతో ప్రజ లు నమ్మకంగా ఉన్నారని, విపత్కర సమ యాల్లో బాధితులకు మనోధైర్యం ఇచ్చేది పోలీసులే అని అన్నారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతామనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ జయరాజు, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవి, ఎస్ఐలు కళ్యాణ్కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
అలంపూర్: హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించడంతోపాటు.. భోజనం, శుభ్రత, భద్రతా చర్యలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. లక్ష్యం ఎంచుకొని కష్టపడి చదవాలని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సూచించారు. వీరితోపాటు బార్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాదులు తిమ్మారెడ్డి, సురేష్ కుమార్, న్యాయవాదులు వెంకటేష్, భీమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ టెండర్లపై రగడ అలంపూర్: అలంపూర్ జోగుళాంబ ఆలయాల టెండర్లపై రగడ కొనసాగుతుంది. ఆలయాలకు సంబంధించి గతంలో పలు టెండర్లను నిర్వహించగా.. వివిధ కారణాలతో అందులో కొన్నింటిని దేవాదాయ శాఖ అధికారులు రద్దు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఓ దళిత మహిళకు టెండర్ దక్కడంతో.. ఈమేరకు రద్దు చేసినట్లు దళిత సంఘాలు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. పనిలో పనిగా ఉత్సవాల పేరిట భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఆలయ ఈఓను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అయితే, ఈ అంశంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి మల్దకల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి హృదయరాజు సూచించారు. బుధవారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు అన్నిరంగాలలో రాణించి కళాశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రతి విద్యార్థికి ఇంటర్విద్య చాలా కీలకమైనదని, భవిష్యత్కు పునాది లాంటిదని, బాగా చదివి ప్రతిభ కనబర్చిన వారికి స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్ కృష్ణ, అధ్యాపకులు నర్సింహులు, రామాంజనేయులుగౌడ్, గోవర్దన్ శెట్టి, భాగ్యలక్ష్మి, మాధురి, రాఘవేంద్ర, శ్రీకాంత్, రంగస్వామి, నీలవేణి పాల్గొన్నారు. మిగిలింది 24 గంటలే మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణకు కేవలం 24గంటల సమయం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు మరోసారి అవకాశం కల్పించినా వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బుధవారం ఉమ్మడి జిల్లాలో 42 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. గతంలో వచ్చిన టెండర్ల కంటే ఈ సారి పెంచాలని ఎకై ్సజ్ అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ–4 దుకాణాలకు 5,230 దరఖాస్తులు వచ్చాయి. గురువారం చివరి రోజు కావడంతో మరో 500 నుంచి 1000 టెండర్లు దాఖలు కావొచ్చని ఎకై ్సజ్ అధికారులు ఆశిస్తున్నారు. -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోసం ఏర్పాటు చేసిన జోగుళాంబ గద్వాల జిల్లా జల్లాపురం ఆర్టీఏ చెక్పోస్టు, కర్ణాటక కోసం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం దగ్గర ఏర్పాటు చేసిన రెండు చెక్పోస్టులను ఎత్తేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల సరిహద్దుల్లో వస్తువుల తనిఖీ, పన్ను వసూళ్ల అవసరం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చెక్పోస్టులను తొలగించాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ● జిల్లాలోని ఆర్టీఏ చెక్పోస్టులు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయని తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు నేరుగా ముడుపులు తీసుకోకుండా ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని మరీ లారీ డ్రైవర్ల ముక్కు పిండి వసూలు చేసినట్లు తనిఖీల్లో బహిర్గతమైంది. ఇటీవల కృష్ణా చెక్పోస్టులో ఏసీబీ బృందం దాడులు నిర్వహిస్తుండగానే మరోవైపు లారీ డ్రైవర్లు వచ్చి టేబుల్పై డబ్బులు పెట్టడాన్ని చూసి తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ముడుపుల వ్యవహారానికి తెరపడినట్లే. ఉమ్మడి జిల్లాలో అలంపూర్, కృష్ణా వద్ద చెక్పోస్టులు బుధవారం సాయంత్రం నుంచే మూసివేసినట్లు డీటీసీ ప్రకటన అధికారులు, సిబ్బందిని ఆర్టీఏ కార్యాలయాల్లో సర్దుబాటు -
వేరుశనగ క్వింటా రూ.5,320
పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 450 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5320, కనిష్టం రూ. 2820, సరాసరి రూ. 4399 ధరలు లభించాయి. అలాగే, 141 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5960 కనిష్టం రూ. 4920, సరాసరి రూ. 5940 ధరలు పలికాయి. నిఘా అవసరం చెక్పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో అక్రమ గోవుల తరలింపు, గంజాయి, మద్యం, కలప, ఇసుక ధాన్యాలు వంటి అక్రమ వ్యాపారాలకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తోంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి దళారులు జిల్లాకు వడ్లను తీసుకొచ్చి విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా తీవ్రతరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. -
రోడ్ల అభివృద్ధికి రూ.316 కోట్లు మంజూరు
గద్వాల: గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిషలు కృషి చేస్తానని ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న పంచాయతీరాజ్, ఆర్అండ్ఆర్ శాఖలకు చెందిన రహదారుల మరమ్మతుకు రూ.316కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎరగిర–అయిజ–అలంపూర్ రహదారికి రూ.9.61కోట్లు, గద్వాల – రంగాపూర్రోడ్డుకి రూ.39.84కోట్లు, గద్వాల–రాయచూరు రహదారికి రూ.74.29కోట్లు, గద్వాల–అయిజరోడ్డుకు రూ.24.32కోట్లు, బలిగెర మాచెర్ల రోడ్డుకు రూ.12.80కోట్లు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా గద్వాల నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్లకు రూ.154 కోట్లు నిధులు మంజూరీ అయినట్లు వివరించారు. దీంతోపాటు నర్సింగ్కాలేజీ నిర్మాణం పూర్తి అయ్యిందని, నవంబర్ 25వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే, రూ.80 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ఆయలకమిటీ చైర్మన్ వెంకట్రాములు, ప్రభాకర్రెడ్డి, ప్రతాప్గౌడ్, విజయ్కుమార్, బాబర్, మురళి, విక్రమ్సింహారెడ్డి, నాగులు, చంద్రశేఖర్, రిజ్వాన్, కురుమన్న, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్యతో బంగారు భవిష్యత్
ఇటిక్యాల: పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందిస్తే వారి బంగారు భవిష్యత్కు దారులు వేసినట్లేనని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయ ణ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దదిన్నె ప్రాథమికోన్నత పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ సంస్థ మేనేజర్ వెంకటేశ్వర్లు సహకారంతో రూ.1.50 లక్షలతో కమ్యూనిటీ ప్యూరిఫై వాటర్ ప్లాంట్, గ్రామానికి చెందిన తిరుమల్రెడ్డి కుటుంబ సహకారంతో రూ.1,50 లక్షల విలువ గల కంప్యూటర్ ల్యాబ్, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి కంప్యూటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతి విద్యార్ధి క్రమశిక్షణ కలిగి విద్యను అభ్యసించాలని, క్రమశిక్షణ లేని విద్య వ్యర్థమని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీర భద్రప్ప, ఎంఈఓ వెంకటేశ్వర్లు, కాంప్లెక్స్ జిహెచ్ఎం పాగుంటన్న, హెచ్ఎం కరేంద్రనాధ్ పాల్గొన్నారు. -
వైభవంగా పాగుంటస్వామి బ్రహ్మోత్సవాలు
కేటీదొడ్డి: వమండలంలోని వెంకటాపురంలో వెలసిన శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ప్రత్యేక పూజలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. సంప్రదాయ బద్ధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా జరిపారు. సాయంత్రం ప్రత్యేక అలంకరణల మధ్య ప్రభోత్సవం నిర్వహించారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి దాసంగాలతో పాటు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, శ్రీధర్, రాజశేఖర్, రామకృష్ణనాయుడు, ఉరుకుందు, వెంకన్గౌడు, గోపి, నవీన్ పాల్గొన్నారు. -
ధర్మస్థాపనకు నడుం బిగించాలి
గద్వాలటౌన్: సమాజాన్ని జాగృతం చేయడానికి, హిందువుల్లో సంఘటిత శక్తిని పెంపొందించేందుకు ప్రతి స్వయం సేవకుడు నిరంతరం కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో పద సంచాలన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు స్వయం సేవకులనుద్దేశించి మాట్లాడారు. దేశ హితం కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని.. ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడమే లక్ష్యమన్నారు. ధర్మస్థాపనకు ప్రతి హిందువు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. స్వయం సేవకులు ఎంతో మంది అంకితభావంతో పనిచేసి ఆత్మబలిదానాలు చేసుకున్నారని.. వారి విజయగాదలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం హిందుత్వాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. మారుమూల గ్రామాలు, వార్డుల్లోనూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. రాబోవు రోజుల్లో హిందూ జనజాగరణ, హిందూ సమ్మేళనాలు కొనసాగుతాయని తెలిపారు. అంతకుముందు పట్టణ పురవీధుల్లో ఆర్ఎస్ఎస్ కవాతు (పద సంచాలన్) నిర్వహించారు. ఈ సందర్భంగా నమస్తే సదావత్సలే మాతృభూమే, జై శ్రీరామ్.. భారత్ మాతకీ జై అంటూ స్వయం సేవకులు నినాదాలతో మార్మోగించారు. పద సంచాలన్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు బీజేపీ, హిందూ ధార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలి
భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గట్టు తహసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించడంతో పాటు భూ భారతి దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల సక్సేషన్, పెండింగ్ ముటేషన్, మిస్సింగ్ సర్వే నంబర్లు, పీఓపీ, డీఎస్ వంటి దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా ఆలూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. పంచాయతీల కార్యదర్శులు ఇందిరమ్మ ఇళ్ల కమిటీల సమన్వయంతో ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ చెన్నయ్య, తహసీల్దార్ విజయ్కుమార్ తదితరులు ఉన్నారు. గట్టు: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికా బద్ధంగా చదవాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. మంగళవారం గట్టులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు కంప్యూటర్ ల్యాబ్, వంట గది, విద్యార్థినుల హాజరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థినులకు పాఠాలు బోధించారు. మానవ అభివృద్ధి సూచిక, స్థూల జాతీయోత్పత్తి, రాజ్యాంగం ప్రస్తావన, పరిశ్రమలు, వ్యవసాయం, సేవారంగాలు, ఆదాయం, సమానత్వం వంటి సాంఘిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. పలు సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థినులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకుసాగాలని తెలిపారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ● ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ సంతోష్ వైద్యాధికారులను ఆదేశించారు. గట్టు పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి.. ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ట్యూబర్ క్లోసిస్, మధుమేహం, రక్తపోటు స్క్రీనింగ్ వందశాతం పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. గట్టు కేజీబీవీలో పాఠాలు బోధించిన కలెక్టర్ సంతోష్ -
ఇంటింటా వెలుగుల దీపావళి
గద్వాలటౌన్: జిల్లావ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. సోమ, మంగళవారం భక్తిశ్రద్ధలతో లక్ష్మీపూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా వాణిజ్య, వ్యాపార దుకాణాలతో పాటు నివాసగృహాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇంటిల్లిపాది వివిధ ఆకృతుల్లో దీపాలను వెలగించి పూలతో అందంగా అలంకరించి.. లక్ష్మీదేవి పూజలు చేశారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే ఈ పండుగను కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా నిర్వహించుకున్నారు. వ్యాపారవేత్తలు పాత ఖాతాలు మూసేసి, కొత్త పుస్తకాలు తెరిచారు. వ్యాపార దుకాణాల్లో కుటుంబ సమేతంగా లక్ష్మీపూజలు చేశారు. కొత్తగా కొనుగోలుచేసిన వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సారి రెండు రోజులపాటు దీపావళి సంబరాలను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు టపాసుల మోతలతో విధులన్నీ మార్మోగాయి. ఇటీవల మరింత ఆధునికతతో రూపొందించిన బాణసంచా కాల్చుతూ చిన్నా, పెద్ద సంబరాలు చేసుకున్నారు. స్థానిక తేరు మైదానంలో ఏర్పాటుచేసిన టపాసుల దుకాణాల్లో కొనుగోలుదారుల కనిపించింది. మార్కెట్లో బంతిపూలకు డిమాండ్ ఉండటంతో కొన్నిచోట్ల రెట్టింపు ధరకు విక్రయించారు. -
శాంతియుత సమాజమే లక్ష్యం
గద్వాల క్రైం: శాంతియుత సమాజమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని.. విధి నిర్వహణలో ఎంతో మంది అమరులవుతున్నారని.. వారి త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, విజయుడు అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో అమరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విపత్తులపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. నవసమాజ స్థాపనలో ముందున్నారన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటూ ఎందరో పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని.. వారి తాగ్యాలు, సేవలు మరవలేనివన్నారు. ఇటీవల నిజామాబాద్లో రౌడీ షీటర్ చేతిలో కానిస్టేబుల్ హత్యకు గురికావడంపై సంతాపం వ్యక్తంచేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన ఓపెన్ హౌస్ స్టాల్స్, రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్రావు, సీఐలు టంగుటూరి శ్రీను, టాటబాబు, రవిబాబు, రవి, నాగేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..
అన్ని పంటలతో పోలిస్తే మిర్చికి పెట్టుబడి ఎక్కువ. కాలం కలిసొస్తే ఇబ్బందులు తీరుతాయనే ఆశతో నష్టం, లాభం చూడకుండా ప్రతి ఏటా మిర్చి సాగు చేస్తున్నా. పోయిన ఏడాది అనావృష్టితో దిగుబడి సరిగా రాలేదు. ధర కూడా లేకపోవడంతో చాలా నష్టపోయా. ఈ ఏడాదైనా కలిసిరాకపోతుందా అని 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చింది. పంట పూతకు వచ్చే సమయంలో వర్షాలు తగ్గకపోవడంతో పంట పూర్తిగా నాశనమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజశేఖర్, అయ్యవారిపల్లి, చిన్నంబావి, వనపర్తి అధిక వర్షాలతో తెగుళ్లు పెరిగాయి.. ఈసారి కురిసిన అధిక వర్షాలకు మిర్చి పంటలో మొదలు కుళ్లు (కాలర్ రాట్), విల్ట్ తెగులు వచ్చింది. ఎండు తెగులు(విల్ట్ తెగులు) నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో వేరు దగ్గర మందు నీళ్లు పోయాలి. ఈ సమయంలో బూడిద తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తోంది. బూడిద తెగులు నివారణ కోసం అమిస్టార్ ఫంగిసైడ్ను లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున లేదా సాఫ్ ఫంగిసైడ్ను లీటర్కు 2 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. – ఆదిశంకర్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం ● -
ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు
మహబూబ్నగర్ క్రైం: ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఏ చెక్పోస్టులో తనిఖీలు చేస్తుంటే.. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్పై పెట్టి వెళ్తున్నారు.. ఈ దృశ్యాలన్నింటిని ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేయగా నారాయణపేట జిల్లా కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది బృందం కలిసి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించారు. ఇటీవల ప్రభుత్వం జీఓ 58 ప్రకారం ఆర్టీఏ చెక్పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో మూడు నెలలపాటు చెక్పోస్టుల దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చేయకుండా ఆన్లైన్లో చలాన్స్ చెల్లించడం ఇతర అంశాలపై లారీ డ్రైవర్లతోపాటు అన్ని రకాల డ్రైవర్లకు అవగాహన కలిగించడంతోపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, కృష్ణా చెక్పోస్టులో అలాంటి అంశాలు కాకుండా లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. చెక్పోస్టులో సరైన లైటింగ్ లేకపోవడం, ఉన్న రెండు సీసీ కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ప్రధానంగా వసూళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ బృందం తనిఖీలు చేస్తున్న సమయంలో చెక్పోస్టులో ఏఎంవీఐ ప్రవీణ్కుమార్ విధుల్లో ఉన్నారు. చెక్పోస్టులో ఎలాంటి రశీదులు లేకుండా అనధికారమైన డబ్బులు రూ.30,450 గుర్తించారు. నివేదిక అందిస్తాం.. కృష్ణా చెక్పోస్టులో చేసిన తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ సాక్షికి వివరాలు వెల్లడించారు. ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించామని, ఈ చెక్పోస్టుపై డీటీవోతోపాటు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గుర్తించామని వీటన్నింటిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి డీజీకి అందజేస్తామని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ పేర్కొన్నారు. కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో రూ.30 వేల అనధికార డబ్బు గుర్తింపు ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బు వసూలు తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తాం : ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఒక్కో లారీకి ప్రత్యేక రేటు కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టు దగ్గర సరిహద్దు దాటే లారీలకు స్థానిక అధికారులు ఒక్కో లారీకి ప్రత్యేక రేట్లు నిర్ణయించారు. 14 టైర్ల లారీ, బొగ్గు లారీ, బూడిద లారీ, ఇసుక, బియ్యం ఇలా ఒక్కో దానికి నిర్ణయించిన ధరల ప్రకారం చెక్పోస్టు దగ్గరకు లారీ వచ్చిన తర్వాత పక్కనే నిలిపి వచ్చి ముందే నిర్ణయించిన ధరల ప్రకారం డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్లాలి. ఇలా రోజువారి కలెక్షన్ రూ.వేలల్లో ఉంటుంది. ఇక సరైన డాక్యుమెంట్స్, ఓవర్ లోడ్ ఇతర వాటికి అధిక మొత్తంలో రేట్లు నిర్ణయించారు. -
కోటి వెలుగుల దీపావళి
గద్వాలటౌన్: దీపాన్ని జ్ఞానానికి, సంతోషానికి, నిర్మలత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. అలాంటి దీపం ప్రాముఖ్యత తెలిపే విధంగా ఏర్పాటు చేసిందే ఈ దీపావళి పర్వదినం. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి వస్తుంది. సోమవారం జిల్లాలో ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించుకోనున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. వెలిగించిన దీపాలు స్వర్గానికి దారి చూపిస్తాయని విశ్వసిస్తారు. దీపావళి రోజు దీపాలు వెలిగిస్తే దేవతలు కరుణిస్తారని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి ఇంట్లో దీపాల వరుసలు కనిపిస్తూ శుభసంకేతాలు ప్రసరిస్తాయి. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడు, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఈ పండుగ నిర్వహిస్తారు. దీపపు ప్రమిదలు ప్రత్యేకం.. అమావాస్య చీకటిని సైతం లెక్కచేయకుండా కాంతులీనడానికి ఇంటింటా సమాహారమయ్యే దీపపు కుందెలు, ప్రమిదలు దీపావళి పండగలో ముఖ్య భూమికను పోషిస్తుంటాయి. శుభానికి చిరునామాగా పసుపు, పారాణి అలంకరణతో ముస్తాబైన ఇంటి గడప, ప్రహరి, ప్రాంగణం, వాకిళ్లలో ఒక్కొక్కటిగా జతయ్యి... పసిడికాంతుల్ని నింపుతూ భారతీయ సాంప్రదాయాన్ని ఆవిష్కరించే ప్రమిదల కొలువు దీపావళి వేడుకల్లో చూసి తీరాల్సిందే. ఈ ప్రత్యేకతను పురస్కరించుకొని స్థానికంగా కొంత మంది వ్యాపారులు వివిధ రూపాల్లో రూపొందించిన ప్రమిదలను హైదరాబాద్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి మట్టి, సిరామిక్ దీపాలను గద్వాలకు తీసుకవచ్చి విక్రయిస్తున్నారు. డిజైన్ను బట్టి జత రూ.30 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రమిదలు కొలువుదీరాయి. మార్కెట్లు కిటకిట దీపావళి పండుగ సందర్భంగా అన్ని మార్కెట్లు సందడిగా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారులతో వస్త్ర దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. బంతిపూలు, లక్ష్మీదేవి చిత్రపటాలు, గౌరీనోముల దండలు, చాటల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీపావళి సందర్బంగా స్మార్ట్ఫోన్లు, ఫ్రిజ్లు, టీవీలు, ఇతర గృహావసరాల వస్తువులు వివిధ ఆఫర్లతో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీపాలు వెలిగిస్తే శుభం దీపావళి పండగకు దీప తోరణాలు వెలిగించే ఆచారం ఉంది. ఆరోజు శ్రీ మహాలక్ష్మిదేవి భూలోకానికి వచ్చి ఇంటింటికీ తిరుగుతుందని నమ్మకం. అందుకే ప్రజలు లక్ష్మిదేవికి నీరాజనాలు పలుకుతూ తమ ఇంట్లో, బయట దీపాలు వెలిగిస్తారు. దీపాల వరుసను వృత్తాకారంలో, స్వస్తిక్ ఆకారంలోనూ పేర్చి వెలిగిస్తే మరింత మంచిది. – రేణుక, గద్వాల చెడుపై గెలిచిన మంచికి ప్రతీకగా సంబరాలు వైవిధ్య రూపాల్లో ఆకట్టుకుంటున్న ప్రమిదలు బాణసంచా దుకాణాల్లో రద్దీ.. పెరిగిన ధరలతో కొంత అసహనం నేడు జిల్లావ్యాప్తంగా వేడుకలు -
వీరులారా.. వందనం
ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు ● సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం ● బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు ● రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఇక్కడి నుంచే ప్రకటన శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మహబూబ్నగర్ క్రైం/ కొల్లాపూర్: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో అమరవీరుల స్తూపం -
227 దుకాణాలు.. 5,179 టెండర్లు
మహబూబ్నగర్ క్రైం: సాధారణంగా మద్యం వ్యాపారం చేయాలన్నా కోరిక చాలా మందిలో ఉంటుంది.. దీంతో వైన్స్ దుకాణాలకు టెండర్లు వేయడంలో విపరీతమైన పోటీ నెలకొంటుంది. వేసిన టెండర్లలో వారి అదృష్టం పరీక్షించుకొని దుకాణాలు దక్కించుకోవాలనుకుంటారు. కానీ, ఈసారి జరిగిన టెండర్ల ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని వచ్చిన లెక్కలు చెబుతున్నాయి. ప్రతి జిల్లాలో ఊహించని విధంగా టెండర్లు తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి 23 రోజుల వ్యవధి ఇచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కొందరు దూరంగా ఉండటం ఒక కారణమైతే.. టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడం కూడా ప్రభావం చూపింది. అర్ధరాత్రి 12 గంటల వరకు.. ఉమ్మడి జిల్లాలోని 227 దుకాణాలకు గాను మొత్తం 5,179 టెండర్లు దాఖలు అయ్యాయి. ఇందులో శనివారం ఒక్కరోజే 2,428 దరఖాస్తులు రావడం విశేషం. చివరిరోజు కావడంతో దరఖాస్తులు తీసుకోవడానికి అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఇవ్వడం వల్ల ఎకై ్సజ్ అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.155.37 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం వచ్చిన టెండర్లలో మహబూబ్నగర్ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. ● జాతీయ రహదారిపై ఉన్న దుకాణాలతోపాటు ఆంధ్ర, రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవాటికి సైతం ఈసారి టెండర్లు భారీగా తగ్గాయి. గతంలో జాతీయ రహదారి వెంట ఉన్న దుకాణాలకు చాలా వరకు డిమాండ్ ఉండేది. ఒక్కో దుకాణానికి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేవి. కానీ, ఈసారి పరిస్థితి చాలా వరకు తారుమారైంది. దీంతో గతంలో బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు సైతం టెండర్లు తగ్గాయి. జిల్లా చివరిరోజు 2025 2023 టెండర్లు టెండర్లు టెండర్లు మహబూబ్నగర్ 671 1,554 2,540 నాగర్కర్నూల్ 750 1,423 2,524 నారాయణపేట 372 806 1,035 జోగుళాంబ గద్వాల 256 723 1,179 వనపర్తి 379 673 1,341 మొత్తం 2,428 5,179 8,619 మహబూబ్నగర్ 46.62 నాగర్కర్నూల్ 42.69 నారాయణపేట 24.18 జోగుళాంబ గద్వాల 21.69 వనపర్తి 20.19 మద్యం లైసెన్స్ల కోసం వ్యాపారుల్లో కనిపించని జోష్ ఉమ్మడి జిల్లాలో గతంలోకంటే భారీగా తగ్గిన టెండర్లు అత్యధికంగా కోయిలకొండలో 50, కృష్ణాలో 42 దాఖలు జాతీయ రహదారి, సరిహద్దు ప్రాంతాల్లోనూ అంతంతే.. చివరి రోజు 2,428 దరఖాస్తుల స్వీకరణ టెండర్ల ద్వారా రూ.155.37 కోట్ల ఆదాయం -
బీసీ బంద్ సంపూర్ణం
గద్వాలటౌన్: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ చేపట్టిన బంద్ జిల్లాలో సంపూర్ణమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు వేరువేరుగా మోటార్బైక్లపై తిరుగుతూ షాపులను బంద్ చేయించారు. వాణిజ్య దుకాణాలు, సినిమాహాళ్లు, విద్యా సంస్థలు, పెట్రోలు బంకులు స్వచ్ఛంద బంద్ను పాటించాయి. అన్ని వర్గాల ప్రజలు బంద్ పాటించి బీసీ రిజర్వేషన్ల ఆకాంక్షను చాటి చెప్పారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను నడపాలని పోలీసులు చేసిన ప్రయత్నాలను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్టాండ్ ప్రాంగణంతో పాటు ప్రధాన చౌరస్తాలలో నిరసన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. అయిజ, శాంతినగర్, ఎర్రవల్లి చౌరస్తా, అలంపూర్ చౌరస్తాలతో పాటు మండల కేంద్రాలలో బంద్ సంపూర్ణంగా ముగిసింది. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా ప్రాంతాల జేఏసీ నాయకులు బంద్లో భాగస్వాములు అయ్యారు. గద్వాలలో బీజేపీ నాయకులు బంద్కు దూరంగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే వరకు బీసీలు చేసే పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపిస్తే.. చట్టబద్ధత కల్పించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. జేఏసీ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూధన్బాబులు మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు బీసీల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకుడు హనుమంతునాయుడు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్రంలో మద్దతు ఇస్తూ.. కేంద్రంలో అడ్డుకుంటూ దోబూచులాట ఆడుతోందని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గద్వాలలో బస్సులు నడపాలని పోలీసుల యత్నం అడ్డుకున్న జేఏసీ నాయకులు.. ఇరువురి మధ్య వాగ్వాదం వాణిజ్య దుకాణాలు, విద్యా సంస్థలు, పెట్రోలు బంకులు స్వచ్ఛంద బంద్ -
పంటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు
అలంపూర్ రూరల్: అలంపూర్ మండలం క్యాతూర్ శివారులోని మొక్కజొన్న పంటను శనివారం పాలెం శాస్త్రవేత్తలు శశిభూషణ్, శంకర్, ఈశ్వర్రెడ్డి పరిశీలించారు. మొక్కజొన్న పంటలో ఎక్కువ కంకులు రావడం గురించి రైతులు ఫిర్యాదు చేయడంతో శాస్త్రవేత్తల బృందం ఇక్కడికి వచ్చినట్లు ఏఓ నాగార్జున్రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అక్కడి రైతులు అందించిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా, మండలంలోని బుక్కాపూరంలోని ఉల్లి, వరి, శనగ, మినుము పంటలను పరిశీలించారు. వరిలో కాండం తొలిచే పురుగు, పొట్టకుల్లు తెగులు నివారణ చర్యల్లో భాగంగా కారటప్ హైడ్రోక్లోరైడ్ 500 గ్రాములు ప్రొపికనోజోల్ 250 మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. -
నీటి మునిగిన ముచ్చోనిపల్లె రోడ్డు
● రిజర్వాయర్ అలుగు వద్ద నిలిచిన నీరు ● రాకపోకలకు ఇబ్బందులు గట్టు: ముచ్చోనిపల్లె రోడ్డు నీట మునిగింది. గొర్లఖాన్దొడ్డి–అయిజ రోడ్డు నుంచి కర్నూలు–రాయచూర్ రోడ్డుకు లింకు కలుపుతూ కొత్తగా ముచ్చోనిపల్లె రిజర్వాయర్ కట్ట కింద భాగంలో కొత్తగా తారురోడ్డును వేశారు. ప్రస్తుతం రిజర్వాయర్ అలుగు పారే చోట వర్షపు నీరు వచ్చి చేరింది. వాహనాలు పూర్తిగా నీట మునిగేటంత నీరు వచ్చి చేరడంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగా వేసిన తారు రోడ్డు అంతా బాగానే ఉన్నా, ముచ్చోనిపల్లె రిజర్వాయర్ అలుగు పారే చోట భూమి లెవల్ కంటే కాస్త లోతుగా మట్టిని తీసి, బ్రిడ్జి నిర్మించారు. అలుగు ద్వారా పారే నీరు బ్రిడ్జి కింద నుంచి బయటకు వెళ్లడానికి పెద్ద పెద్ద పైపులు ఏర్పాటు చేశారు. అయితే రిజర్వాయర్ నిండిన తర్వాత అలుగు ద్వారా పారే నీరు బయటకు వెళ్లడానికి కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, భూ సేకరణ సమస్య కారణంగా కాల్వ నిర్మాణ పనులు అగిపోయాయి. అయితే వర్షాకాలంలో కురిసిన వర్షాల కారణంగా అలుగు కోసం మట్టిని తీసి, బ్రిడ్జి నిర్మించిన చోట భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో అలుగు నీరు పారే చోట ఏర్పాటు చేసిన బ్రిడ్జి నీట మునిగింది. ఎంతలా అంటే వాహనాలు తారు రోడ్డు వెంట నేరుగా వెళితే నీట మునిగిపోయే విధంగా నీరు వచ్చి చేరాయి. తారు రోడ్డు ఉంది కదాని నేరుగా తెలియక ఈ దారి గుండా వెళ్లేవారు నీటిని చూసి భయపడుతున్నారు. నీరు నిల్వ ఉన్న చోటపై భాగంలో పొలం గట్టు వెంట ఉన్న మట్టిదారి గుండా అటు వైపునకు అతి కష్టం మీద వెళుతున్నారు. అధికారులు స్పందించి ముచ్చోనిపల్లె కొత్తరోడ్డుపై రాకపోకలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
ప్రజా కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్లకు శిక్ష తప్పదు
నాగర్కర్నూల్: బీసీ రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్లకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి.. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ధర్నానుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంత బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి బీసీ బిల్లుకు చట్టబద్దత కల్పించేలా కృషి చేయకుండా.. ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 120 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని న్యాయపరమైన బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. బీజేపీ అనుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం గంటలో తేలిపోతుందని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కు బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కులగణన చేసి ఉంటే ఈ పాటికి చట్టబద్ధత వచ్చేదని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ అడుగడుగునా మద్దతు ఇచ్చిందని.. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం మద్దతిచ్చిన బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఎప్పుడో చట్టబద్ధత వచ్చేదన్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాయని విమర్శించారు. -
పత్తి కొనుగోళ్లలో కొత్త విధానం
ఉండవెల్లి: పత్తి కొనుగోలు, అమ్మకాల్లో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్ కపాస్ కిసాన్ను తీసుకొచ్చిందని, దీని ద్వారానే సీసీఐ కొనుగోళ్లు చేపట్టనుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఉండవెల్లి రైతువేదికలో వీసీ నిర్వహించారు. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు వీసీ నిర్వహించగా.. అలంపూర్ డివిజన్ స్థాయి అధికారులు, ఉండవెల్లి, మానవపాడు, రాజోళి, అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు. పత్తి కొనుగోలుకు ప్రత్యేక యాప్ ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకుని అమ్మకాలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నారని, పంట నమోదును త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి
అలంపూర్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని తహసీల్దార్ మంజుల అన్నారు. అలంపూర్ పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ పద్మావతి, ఎంఈఓ అశోక్ కుమార్ హాజరయ్యారు. అండర్–14 విభాగంగలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని 13 మండలాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక మానసిక వికాసం వృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు పోటీపడ్డాయి. ఖోఖో ఫైనల్స్లో బాలికల విభాగంలో ఎర్రవల్లి–వడ్డేపల్లి మండలాల జట్లు తలపడగా ఎర్రవల్లి జట్టు విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ఇటిక్యాల–అయిజ జట్లు పోటీ పడగా.. అయిజ జట్టు విజేతగా నిలవగా ఇటిక్యాల జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో యువజన క్రీడా జిల్లా అధికారి కృష్ణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఖోఖో జిల్లా కన్వీనర్ భరత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు మాధవి, అమరేందర్ రెడ్డి, బాలజీ కృష్ణకుమార్ పీఈటీలు పార్వతమ్మ, అరుణతార, శైలజ, శ్రీనివాసులు, దేవేందర్ నాయుడు, రాజు, నాగరాజు, తిరుపతి, నరస్మింహ రాజు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
గద్వాల న్యూటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బహుజన రాజ్య సమితి, ప్రజా సంఘాల నాయకులు కోరారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నాగర్దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్బాబు, వెంకటస్వామి, ఆంజనేయులు, ప్రభాకర్, పల్లయ్య, వాల్మీకీలు మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రేస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పారు. రిజర్వేషన్ గ్యారెంటీగా అమలు చేయడానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. 50శాతం ఉన్న బీసీల సమస్యపై గవర్నర్ తగిన చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే బీసీజనాభా లెక్కలను ప్రభుత్వం చేపట్టి, వారి శాతాన్ని తేల్చిందన్నారు. పార్లమెంట్లో చట్ట సవరణ చేసి రిజర్వేషన్ల శాతాన్ని ఆయా వర్గాల జనాభా మేరకు పెంచడానికి బీజేపీ చొరవ తీసుకొని, చిత్తశుద్ది నిరూపించుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు హన్మిరెడ్డి, కిరణ్కుమార్, సుభాన్, దామోదర్, గంజిపేట రాజు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
గట్టు: మండలంలోని ఆలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు తాగు నీటి సమస్యపై రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. గట్టు–గద్వాల రోడ్డుపై ఆలూరు బస్టాండ్ దగ్గర విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని తాగు నీటి సమస్యను తీర్చాలని ఆందోళన నిర్వహించారు. నీటి సరఫరా సక్రమంగా లేదని, మధ్యాహ్న భోజన సమయంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అనేక పర్యాయాలు ఉపాధ్యాయులు, గ్రామ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చెన్నయ్య, ఇన్చార్జ్ ఎంఈఓ వెంకటేశ్వర్లు మిషన్ భగీరథ అధికారులతో కలిసి ఆలూరు ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో తాగునీటి సమస్యపై ఆరా తీశారు. అయితే కేవలం స్కావెంజర్ నిర్లక్ష్యంగా కారణంగానే నీటి సమస్య నెలకొందని, పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ ద్వారా, బోరు ద్వారా నీటి సరఫరా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. -
సంక్షేమ హాస్టళ్లలో నూతన మెనూ
గద్వాల: 2025–26 విద్యా సంత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో కొత్త మెనూ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కొత్త మెనూ పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో 2025–26 విద్యా సంవత్సరానికి కొత్త, పోషకాహార మెనూ అమలులోకి వచ్చిందన్నారు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి విద్య ఈ మూడు ఒకదానికొకటి విడదీయరాని అంశాలని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య లక్ష్యమని ఆయన అన్నారు. ప్రతివిద్యార్థి శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రతినిత్యం ఆహారంలో పోషక పదార్థాలు ఉండేలా కొత్త మెనూను రూపొందించమని తెలిపారు. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని వంటశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో వండేప్రతి భోజనం తాజా పదార్థాలతో సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు భోజనం సమయానికి అందించాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వంటగదులు పరిశుభ్రంగా ఉండేలా పర్యావేక్షించాలన్నారు. నీటివనరులు, నిల్వ ప్రదేశాలు శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యావేక్షణ కొనసాగించాలని ఇక్కడ నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈకార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్పాష, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ నుషిత, హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ప్రతి ఉపాధి కూలీకి పని కల్పించాలి
మానవపాడు: ప్రతి ఉపాధి కూలీకి తప్పక పని కల్పించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సూచించారు. గురువారం మండలంలోని కలుకుంట్ల, చెన్నిపాడు, మానవపాడు గ్రామాలలో గ్రామ పంచాయతీ ఉపాధికూలీల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సక్రమంగా రికార్డులను నిర్వహించాలని, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రసహాయకులు, కొలతలు తీసి ఎంబీలు సరిగా చేయని సాంకేతిక సహాయకులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ఇంకుడుగుంతలను, నర్సరీలలలోని మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, పంచాయతీ కార్యదర్శి సంధ్యరాణి సిబ్బంది పాల్గొన్నారు. అలంపూర్ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని, ఈమేరకు ప్రొసీడింగ్ వచ్చినట్లు కమిషనర్ శంకర్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గురువారం విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీలోని 10 వార్డులలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు, ఆర్చీగేట్, రోడ్డు విస్తరణ, మరమ్మతుల కోసం ఈ నిధులు వచ్చినట్లు తెలిపారు.అక్బర్ పేటలో కాలనీలో సమస్య పరిష్కారానికి రూ.4.50 లక్షలతో కలెక్టర్కు నివేదికలు పంపినట్లు తెలిపారు. పందులను శివార్లకు తరలించాలి ఇదిలాఉండగా, కార్యాలయంలో పందుల పెంపకందార్లతో కమిషనర్ సమావేశమయ్యారు. పందులను ఊరికి బయట ఉంచుకోవాలని సూచించినట్లు తెలిపారు. పందులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పందుల పోషణకు స్థలాలు కేటాయించారని కానీ అక్కడ విద్యుత్ సదుపాయం లేదని పందుల పెంపకందార్లు కమిషనర్కు తెలిపారు. విద్యుత్ సరఫరా తీసుకోవడానికి సరైన పత్రాలు లేవని తెలిపారు. స్థలానికి సంబందించిన పత్రాలు ఇచ్చి విద్యుత్ సదుపాయం కల్పిస్తే ఊరి బయట వాటి పోషణకు ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.4,950 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 207 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4950, కనిష్టం రూ.2670, సరాసరి రూ.4386 ధరలు లభించాయి. అలాగే, 113 క్వింటాళ్ళ ఆముదాలు రాగా గరిష్టం రూ. 5940 కనిష్టం రూ. 5710, సరాసరి రూ. 5932 ధరలు పలికాయి. మొక్కజొన్న క్వింటా రూ.2,075 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వివిధ ప్రాంతాల నుంచి 2,812 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.2,075, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.5,709, కనిష్టంగా రూ.5,629గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.1,789గా ఒకే ధర పలికింది. 19న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలో వచ్చేనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్కార్డుతో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం సీనియర్ క్రీడాకారుడు రాజు (9985022847) నంబర్ను సంప్రదించాలని సూచించారు. యోగాసన క్రీడాజట్ల ఎంపికలు ఉమ్మడి జిల్లా యోగాసన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల బాల, బాలికల జట్ల ఎంపికలను ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8–10, 10–12, 12–14, 14–16, 16–18 ఏళ్లలోపు క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఒరిజనల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440292044 నంబర్కు సంప్రదించాలని వారు సూచించారు. -
బకాయిలు విడుదల చేయాలి
అలంపూర్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు రూ.180 కోట్ల బకాయి పెండింగ్లో ఉందని, దీంతో ఈ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న దాదాపు 30 వేల మంది దళిత గిరిజన విద్యార్థులు రోడ్డున పడ్డారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, ప్రధాన కార్యదర్శి రాజులు ఎమ్మెల్యే విజయుడును కోరారు. కర్నూల్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడును బుధవారం కలిసి పెండింగ్ నిధులు తక్షణమే చెల్లించాలని, విద్యార్థులు రోడ్డున పడుతున్నారనివినతి పత్రం అందజేశారు. ప్రభుత్వంతో, ఇంచార్జీ మంత్రితో మాట్లాడి బకాయి నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని విజయ్, వెంకటస్వామి, ప్రభాకర్ కోరారు. -
మీ త్యాగం మరువలేనిది
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి విలువైన భూములు, ఇండ్లను త్యాగం చేసిన ర్యాలంపాడు గ్రామస్తుల త్యాగం మరువలేనిదని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బుధవారం వారు ర్యాలంపాడు పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్ర లే అవుట్, మ్యాప్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పునరావస కేంద్రంలో అన్ని వసతులతో కూడిన వసతులు కల్పించేందకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాలంపాడు గ్రామస్తులందరూ ఇక్కడే ఇళ్లు నిర్మంచుకొని జీవనం కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధిలో కీలక పాత్ర పోశించిన ర్యాలంపాడు గ్రామస్తుల త్యాగం ఎనలేనిదన్నారు. అతి తక్కువ ధరకే భూములు, ఇండ్లు ఇచ్చారన్నారు. అదే ప్రాంతంలోనే ప్రాజెక్టు రిజర్వాయర్, పంప్హౌస్, కాల్వలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుంది కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో లక్షా 80వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పూర్తి బాధ్యతతో అండగా ఉంటుందన్నారు. ర్యాలంపాడులో 4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించడం జరిగిందన్నారు. ఈ జలాలతోనే జిల్లా సస్య శ్యామలం అయ్యిందన్నారు. అన్ని వసతులతో కూడిన పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి గాను పునరావాస సెంటర్లో రోడ్లు, మురుగు కాల్వలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనం, దేవాలయాలు, చర్చిలు వంటి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బాధితులకు అందాల్సిన ఫిట్టింగ్ చార్జెస్ను కూడా త్వరలోనే అందే విధంగా చూస్తామన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా 250 ఇళ్లను ఇక్కడ మంజూరయ్యాయని, లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే, కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మిరాయణ, ఆర్డీఓ అలివేలు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాసులు, నాయకులు రాజశేఖర్, విజయ్ కుమార్, పురుషోత్తంరెడ్డి, దైలన్న, హంపన్న పాల్గొన్నారు. గద్వాలటౌన్: విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం స్థానిక బుర్దపేట ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల చేత ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. బాగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిని, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్ను పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. పాఠశాలలోని వంటగది, త్రాగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలోని సరుకులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. ఆహార పదార్థాలు, కూరగాయాలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. వంట పాత్రలతోపాటు వంటగది ఎల్లప్పుడు శుభ్రంగా ఉండాలన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ర్యాలంపాడు పునరావాస కేంద్రం సందర్శన వసతుల కల్పన.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ -
తేలని ఇసుక పంచాయితీ
కాంట్రాక్టర్ తో ‘అధికార’ సన్నిహితుల బేరసారాలు ఎవరి పట్టు వారిదే.. తుమ్మిళ్ల నుంచి ఇసుక బయటకు రావాలంటే ఒక్కో ట్రిప్పర్కు రూ. 6 వేల చొప్పున ఎట్టిపరిస్థితుల్లోనైనా చెల్లించాల్సిందేనని అధికార నేత పట్టుబట్టినట్టు సమాచారం. దీనిపై మంగళవారం సైతం అధికార నేతకు చెందిన సన్నిహితులు.. కాంట్రాక్టర్తో చర్చలు జరిపినట్లు సమాచారం. బేరసారాలు జరిగినా సఫలం కానట్లు తెలిసింది. సదరు నేతకు కప్పం చెల్లించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ ఒప్పుకోనట్టు తెలుస్తోంది. ఒక్క రూపాయి ఇచ్చేది లేదంటూ ఆయన భీష్మించుకొని కూర్చున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇసుక రవాణాకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల మౌనంపై విమర్శలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం తుంగభద్ర నుంచి ఇసుక తవ్వకాలను ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా.. ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనం వీడకపోవడం.. సకాలంలో ఇసుక అందేలా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా కోసం ‘మన ఇసుక వాహనం’ ద్వారా చేపట్టిన కార్యక్రమానికి అడ్డంకులు తొలగడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మిళల్లో తుంగభద్ర నది నుంచి ఇసుకను సేకరించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవల తవ్వకాలను ప్రారంభించారు. అయితే అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోగా.. దుమారం చెలరేగింది. ఇసుక రవాణా కొనసాగాలంటే సంబంధిత కాంట్రాక్టర్ ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున కప్పం చెల్లించాలని హుకుం జారీ చేయగా.. కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇసుక రవాణా నిలిచిపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు అధికార పార్టీకి చెందిన సన్నిహితులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. కప్పం కట్టేందుకు అంగీకరించని కాంట్రాక్టర్ మౌనం వీడని అధికారులు ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అసహనం -
మద్దతు ధరకు పత్తి కొనుగోలు
● తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ను రూపొందిస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పాల్గొనాలని సూచించారు. గద్వాల: రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో కనీస మద్దతు ధరల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పత్తిని విక్రయించే ముందు కాపస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 2025–26 సీజన్లో బీబీ మోడ్ పత్తి రకానికి రూ. 8,110, బీబీ ఎస్పీఎల్ రకానికి రూ. 8,060, మెక్ రకానికి రూ. 8,010 మద్దతు ధరలు కల్పిస్తున్నట్లు వివరించారు. కాపస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ సందర్భంగా వచ్చే ఓటీపీ కోసం ఆధార్ లింక్ ఉన్న మొబైల్ వినియోగించాలని తెలిపారు. బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయించుకోవాలన్నారు. అదే విధంగా పత్తిలో తేమ 8–12శాతం మించరాదన్నారు. జిల్లాలో పత్తి సేకరణ కోసం హరిత కాటన్ మిల్లు, బాలాజీ కాటన్ జిన్నింగ్ మిల్లు, శ్రీవరసిద్ది వినాయక కాటన్ మిల్లులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. పూర్తి సమాచారం కోసం టోల్ఫ్రీ నంబర్ 18005995779 లేదా 88972 81111 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, కార్యదర్శి నర్సింహ, ఎల్లస్వామి పాల్గొన్నారు. ● బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు ఉన్నారు. -
ఆటలకు అందలం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీడల్లో మక్కువ ఉండి పీయూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇక్కడ ఉండే క్రీడా వసతులతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతి సంవత్సరం సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్తో స్పోర్ట్స్ కోటా సైతం లభించనుంది. దీంతో చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరంగా వసతులు.. హైదరాబాద్ తర్వాత సింథటిక్ ట్రాక్ ఉన్న ఏకై క జిల్లాగా పాలమూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్తో పాటు 100 నుంచి 1500 మీటర్ల వరకు వివిధ స్థాయి క్రీడలు నిర్వహించవచ్చు. ఫీల్డ్ ఈవెంట్స్లో హైజంప్, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షార్ట్పుట్, డిస్కస్త్రో, పోల్వాల్ట్తో పాటు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నిర్మించారు. సుమారు 2 వేల మంది జనాలు కూర్చొని క్రీడలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్తోపాటు జిమ్ కూడా అందులో అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థుల ఫిట్నెస్ కోసం ఎంతో ఉపయోగపడనుంది. పీయూలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న అధికారులు సింథటిక్ నిర్మాణంతో అథ్లెటిక్స్కు అనేక అవకాశాలు ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోట్ నిర్మాణంతో ప్రయోజనం ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికలు సౌత్జోన్లో 1,050, ఆలిండియా పోటీల్లో పాల్గొన్న 350 మంది విద్యార్థులు జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం.. పీయూ నుంచి ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయి పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. హారికాదేవి 2018లో ఆలిండియా స్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్లలో మూడో స్థానంలో నిలిచింది. 2019లో మహేశ్వరి స్టెపుల్ చేజ్తో ఆలిండియా రెండో స్థానం సాధించింది. 2020లో హారికాదేవి ఆలిండియా అథ్లెటిక్స్ 200 మీటర్లలో 2వ స్థానం, ఆలిండియా 100 మీటర్లలో 2వ స్థానంలో నిలిచింది. 2020లో మహేశ్వరి ఖేలో ఇండియాలో 3000 మీటర్ల స్టెపుల్ చేజ్లో 2వ స్థానం, 2020లో హారికాదేవి ఖేలో ఇండియాలో 100 మీటర్ల అథ్లెటిక్స్లో 4వ స్థానంలో నిలిచారు. విష్ణువర్ధన్ గత నాలుగు సంవత్సరాలు జాతీయ స్థాయి ఆర్చరీలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. డేవిడ్ కృపాల్రే గత నాలుగేళ్లు ఎస్జీఎఫ్ఐ క్రికెట్లో జాతీయ స్థాయిలో ప్రతిభచాటారు. 2024లో భరత్ ఆర్చరీలో ఆలిండియా స్థాయిలో సత్తాచాటారు. మొత్తంగా ఇప్పటి వరకు పీయూ తరపున సౌత్జోన్ పోటీల్లో 1,050, ఆలిండియా పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. పీయూలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం వంటివి ఉండటం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి ఎంతో ప్రయోజనకరం. పోటీల్లో పాల్గొనే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతిభచాటిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. పీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు సౌత్జోన్, ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఎంపికయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో రిజర్వేషన్ సైతం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్, పీయూ -
కమనీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. భక్తులు సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించి తన్మయం పొందారు. అనంతరం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు. -
కేసుల నమోదులో జాప్యం వద్దు : ఎస్పీ
గద్వాల క్రైం: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం డీఎస్పీ మొగిలయ్యతో కలిసి ఆయన పట్టణ పోలీస్స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదులపై వేగంగా విచారణ చేపట్టి.. పోలీసుశాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. కేసుల నమోదులో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయొద్దన్నారు. చోరీలను అరికట్టేందుకు నిత్యం కాలనీల్లో గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సైబర్ క్రైం, మహిళల వేధింపులు, లైంగిక దాడులు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం వాహనాల తనిఖీతో పాటు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం
వంగూరు: మితిమీరిన అవినీతికి పాల్పడుతూ రైతులను, విద్యుత్ వినియోగదారులను పీల్చి పిప్పి చేస్తున్న విద్యుత్ శాఖ లైన్మన్ నాగేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ కావాలని నాలుగు నెలల క్రితం నాలుగు డీడీలకు డబ్బులు చెల్లించాడు. అయితే ట్రాన్స్ఫార్మర్ బిగించడంలో లైన్మన్ నాగేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నిత్యం ట్రాన్స్ఫార్మర్ కోసం లైన్మన్ను కలవగా నాలుగు డీడీలకు రూ.20 వేలు అయినప్పటికీ అదనంగా రూ.10 వేలు తీసుకున్న లైన్మన్ సకాలంలో ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకుండా మరో రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వంగూరు గ్రామ శివారులోని మద్యం దుకాణం ఎదుట రైతు రూ.15 వేల నగదునాగేందర్కు ఇస్తుండగా సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి తరలించారు. నాగేందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, జిలానీ తదితరులు పాల్గొన్నారు. చదువుతోపాటు క్రీడలు ముఖ్యం గద్వాలటౌన్: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని ఇన్చార్జి డీవైఎస్ఓ కృష్ణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని అన్నారు. క్రీడలతో పట్టుదల, శ్రద్ధ అలవడుతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జోనల్, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయా మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ● ఏసీబీకి చిక్కిన లైన్మన్ నాగేందర్ ● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత -
భవిష్యత్కు భరోసా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మొదలుకొని.. డిగ్రీ తర్వాత పీజీ స్థాయి కోర్సులు చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో చేరి జీవితంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సాధారణంగా యూనివర్సిటీలో స్టడీ సర్కిల్ ద్వారా తరగతులు బోధించేందుకు అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కేవలం యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధం.. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, అవసరమైన పుస్తకాలు ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అధికారులు ప్రత్యేక స్టడీ సర్కిల్ సైతం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల తరగతులు లేని సమయంలో స్టడీ సర్కిల్ కొనసాగించారు. దీంతో గతేడాది వెలువడిన పలు పోటీ పరీక్షల ఫలితాల్లో చాలామంది పీయూ విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించారు. 2018– 19 విద్యా సంవత్సరంలో 160 మంది స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందితే 35 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2019– 20లో 143 మంది శిక్షణ పొందగా... 21 మంది ఉద్యోగాలు పొందారు. 2020– 21లో కోవిడ్ కారణంగా శిక్షణ జరగలేదు. ఇక 2021– 22లో 135 మంది శిక్షణ తీసుకుంటే 25 మంది, 2022– 23లో 197 మంది శిక్షణ తీసుకుంటే 107 మంది విద్యార్థులు కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్–4 వంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం. అలాగే పలు ప్రైవేట్ సంస్థలు, విదేశాల్లోనూ కొందరు ఉద్యోగాలు పొందారు. మరో 3 రోజులు. పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు ప్రైవేట్తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు -
ప్రజా సమస్యలపై పాలకులను ప్రశ్నించాలి
అలంపూర్: ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులను ప్రశ్నిద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. అలంపూర్ మున్సిపాలిటీలోని సమస్యలపై కేవీపీఎస్ అధ్వర్యంలో సోమవారం సర్వే నిర్వహించారు. అక్బర్పేట, సంతమార్కెట్, పెద్ద దర్గా కాలనీల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేవీపీఎస్ నాయకులు ఆరా తీశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంత మార్కెట్ పక్కన కందకం పూడ్చాలన్నారు. కందకంలో కంపచెట్లు, మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని, ముళ్లపొదలతో విష సర్పాలు సంచరిస్తున్నాయన్నారు. మున్సిపల్ అధికారులు కందకంలోని నీటిని మోటర్ల ద్వార తొలగించాలన్నారు. మురుగు నిల్వ ఉండకుండా కల్వర్టుల ఎత్తు పెంచాలని, సంత మార్కెట్ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన కూరగాయల షెడ్డు వినియోగంలోకి తేవాలన్నారు. అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. అక్బర్ పేటలో వర్షం నీరు ప్రధాన రోడ్లపైనే నిలుస్తుందని, ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించాలన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 16వ తేదీన మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు వెంకటస్వామి, విశ్వం, నరసింహ్మా, అయ్యప్ప, జయన్న, రఫీ, సుకుమార్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు. -
జోగుళాంబ గద్వాల
‘మాటల’ మంటలు.. ..రైతులకు వరం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరం అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025–10లో uఅన్నీ మహబూబ్నగర్ వాళ్లకేనంటూ.. మహబూబ్నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల కీలక నేతల మధ్య తొలి నుంచీ అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ చైర్మన్, ముడా చైర్మన్ పదవులు మహబూబ్నగర్ నియోజకవర్గానికి దక్కాయి. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ పదవి సైతం ఈ సెగ్మెంట్కు చెందిన ఒబేదుల్లా కొత్వాల్కు కేటాయించారు. ఈ క్రమంలో అన్ని పదవులు మహబూబ్నగర్ నియోజకవర్గ నేతలే తన్నుకుపోతున్నారనే అభిప్రాయం జడ్చర్ల నాయకుల్లో ఉంది. దేవరకద్రకు చెందిన సీతాదయాకర్రెడ్డి తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా నియామకమైనప్పటికీ.. మహబూబ్నగర్కే పెద్దపీట వేస్తున్నారనే అభ్రిపాయం ఈ సెగ్మెంట్ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. మా సెగ్మెంట్లోనూ పెత్తనం చెలాయిస్తున్నారని.. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి జిల్లాకేంద్రంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఇక్కడి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గంలోనూ ఆయన పెత్తనం సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అనుచరుల్లో నెలకొంది. దీనిపై యెన్నం ఎక్కడా స్పందించకున్నా.. డీసీసీ అధ్యక్షుడు జీఎమ్మార్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరుకాకపోవడం, అంటీముట్టనట్లుగా వ్యవహరించడంపై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. అధికార వార్..! ‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, సర్పంచ్ పోస్టుల్లో నిలబడాలని అనుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. వివిధ హోదాల్లో ఉన్న కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. తాము ఇంట్లో కూర్చుని ఉన్నా.. బీఫాంలు వస్తాయని పగటి కలలు కంటున్నారు. మేం చెబితే బీఫాంలు వస్తాయని ఎవరైతే చెబుతున్నారో.. వారి ఆటలు కొనసాగనివ్వం. డీసీసీ అధ్యక్షుడిగా నేనే బీఫాంలు ఇచ్చేదని గ్రహించాలి.’’ – జి.మధుసూదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే (ఓట్ చోరీ కార్యక్రమంలో) ‘‘ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్నూ చంపొచ్చు. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నాలు చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ ఒప్పుకోరు. – అనిరుధ్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే (విలేకరుల సమావేశంలో) ..మహబూబ్నగర్ జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్లో మాటలు మంటలు రేపుతున్నాయనే దానికి ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. బీసీల్లో బలమైన సామాజిక వర్గ నాయకుడు కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇటీవల తెరపైకి రావడం.. డీసీసీ అధ్యక్ష పదవికి ఏఐసీసీ పరిశీలకులు కసరత్తు చేపట్టిన క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో లుకలుకలు వెలుగుచూస్తున్నాయి. కీలకనేతల మధ్య అంతర్గత విభేదాలతో పోరు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో సైతం ‘హస్తం’ నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుండగా.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కాంగ్రెస్లో అంతర్గత పోరు డీసీసీ అధ్యక్ష పదవికి చేపట్టిన కసరత్తులో అనిరుధ్రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్రెడ్డి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బీసీల నుంచి సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వినోద్కుమార్, మైనార్టీల నుంచి సిరాజ్ఖాద్రీ, జహీర్ అక్తర్ పోటీపడుతున్నారు. అయితే డీసీసీ పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏదైనా సామాజిక వర్గానికి చెందిన సమర్థవంతమైన నాయకుడితో భర్తీ చేస్తే బాగుంటుందని అనిరుధ్రెడ్డి కోరడం చర్చనీయాంశమైంది. ఒకవేళ రెడ్డి వర్గానికి కేటాయించిన పక్షంలో తన సోదరుడు దుష్యంత్రెడ్డి కూడా పోటీలో ఉంటారని ఆయన చెప్పకనే చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీసీసీ పదవికి దుష్యంత్రెడ్డి దరఖాస్తు చేసుకోలేదని ఆయన చెబుతున్నా.. కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం భిన్నవాదనలు విన్పిస్తున్నాయి. దీంతో పాటు బీసీల్లో బలమైన సామాజిక వర్గ నాయకుడు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెరపైకి వచ్చిన క్రమంలో అనిరుధ్రెడ్డి సోమవారం జడ్చర్లలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అలాగే ఇటీవల డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఓట్ చోరీ సంతకాల సేకరణలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకాని వారికి ఇదో హెచ్చరిక అంటూ బీఫాంలపై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. గద్వాల, వనపర్తిలోనూ లుకలుకలు వనపర్తి జిల్లాలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అనుచరుడు లక్కాకుల సతీష్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గానికి చెందిన కిరణ్కుమార్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు శాట్ చైర్మన్ శివసేనారెడ్డి సైతం డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయా నేతల వర్గాల మధ్య వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. ఆయా వర్గాలకు చెందిన నేతలు డీసీసీ పదవికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏఐసీసీ నాయకుడు సంపత్కుమార్ మద్దతు కీలకం కాగా.. చివరి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. మహబూబ్నగర్ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు తమ మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని.. పార్టీ విధానాల ప్రకారం సమష్టి నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. కానీ వారివారి ముఖ్య అనుచరులతో పాటు పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ‘ఢీ’ సీసీ.. అటు ‘చేరిక’పంచాయితీ మాటల తూటాలను పేలుస్తున్న నేతలు మహబూబ్నగర్లో తారాస్థాయికి విభేదాలు ? గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ కుతకుత -
సీపీఆర్పై అవగాహన కలిగి ఉండాలి
ప్రజావాణికి 72 ఫిర్యాదులు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుకు ప్రాధాన్యతినిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఐడీవోసీ కార్యాలయంలో ప్రజలు 72 ఫిర్యాదులు ఇచ్చారని వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులు పంపి పరిష్కరించాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. పరిష్కారం కాని యెడల అందుకు సంబంధించి కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్నాలెడ్జ్మెంట్ పంపాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. గద్వాల: ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ అందిస్తే వారి ప్రాణాలు రక్షించవచ్చని, సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒత్తిడితో కూడిన ప్రజాజీవితంలో ఆకస్మాత్తుగా గుండెపోటు సంభవించడం పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు గుండెపోటుకు గురైన వ్యక్తికి పూర్తిస్థాయి వైద్యసాయం అందేలోపు చాతిని 30సార్లు నొక్కి రెండు శ్వాసలు ఇవ్వడం ద్వారా గుండె తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. కార్డియక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలోనూ ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వారంరోజుల పాటు సీపీఆర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈవిధానంపై గ్రామాల నుంచి పట్టణాల వరకు అందరిలోనూ అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాని వైద్యధికారులను ఆదేశించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ డాక్టర్ రాజు, డాక్టర్ మధు ప్రయోగకపూర్వంగా సీపీఆర్ను ఎలా చేయాలో క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, వైద్యధికారి డాక్టర్ సిద్దప్ప, డాక్టర్లు సంధ్య, కిరణ్మయి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
మల్దకల్: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్య నేరమని డీఈఓ విజయలక్ష్మీ, డీడబ్ల్యూఓ సునంద అన్నారు. సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్దకల్ కస్తూర్బా పాఠశాలలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహాలు చేయాలని, బాల్యవివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలను వివరించారు. అలాగే బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస వంటి అంశాలను వివరించారు. బాలికలు చదువుకున్నప్పుడే పురుషులతో సమానంగా రాణించగలుగుతారని సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ హేమలత, డీసీపీఓ నరసింహ, జీసీడీఓ హంపయ్య, ఎంఈఓ సురేష్, ఎస్ఓ విజయలక్ష్మీ, ఏఎస్ఐ ఈశ్వరయ్య ,సురేష్, ప్రకాష్, శివ, పద్మమ్మ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.4,859 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 280 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.4859, కనిష్టం రూ.2905, సరాసరి రూ. 4091 ధరలు లభించాయి. అలాగే, 156 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5901 కనిష్టం రూ. 5429, సరాసరి రూ. 5901 ధరలు పలికాయి. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల/అయిజ:: మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ పార్టీ కార్యాలయంలో మహాసభల పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 14,15వ తేదీలలో రంగారెడ్డి జిల్లా తుర్కియాంజిల్లో రెండురోజుల పాటు రాష్ట్ర మహాసభలు జరుగనున్నట్లు తెలిపారు. జిల్లా మహాసభలను.. అదేవిధంగా, ఈనెల 17న అలంపూర్ చౌరస్తాలో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని వెంకటస్వామి కోరారు. సోమవారం అయిజలో తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 2019 మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, ఆటోల అడ్డాలకు స్థలాలు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.12వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వివి నరసింహ, కార్మికులు మురళి, మల్దకల్, రవి, బీసన్న, శివ, కర్రెప్ప, నాగరాజు, చిన్న, శ్రీను, దావీదు, ఆనందం, సులోమన్ తదితరులు పాల్గొన్నారు. -
అందరి ప్రోత్సాహంతో..
ఫిజిక్స్ విభాగంలో వాటర్సాలబుల్ రీఏజెంట్స్ పై పరిశోధన పూర్తి చేశాం. దానికి పేటెంట్ కూడా వచ్చింది. పరిశోధన పూర్తి చేయడానికి మా గైడ్ చంద్రకిరణ్తో పాటు అధికారులు అందరు ఎంతో సహకరించారు. పరిశోధన పూర్తి అయిన వెంటనే కాన్వకేషన్ నిర్వహించి డాక్టరేట్లు అందించడం చాలా సంతోషంగా ఉంది. – స్వాతి, పీహెచ్డీ గ్రహీత సంతోషంగా ఉంది పండ్ల తొక్కలు డీగ్రేషన్ చేయడం, పొల్యూషన్ ఉండకుండా ఉండే విధంగా, ఫ్రూట్జ్యూస్ కు సంబందించి క్లాసిఫికేషన్ పై పరిశోధన చేశాం. అందుకోసం గైడ్ టీచర్ మధుసూదన్రెడ్డి ఇతర అధికారులు ఎంతో సహకరించారు. అందుకు ప్రతి ఫలంగా కాన్వకేషన్లో డాక్టరేట్ అందుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తు పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తాం. – ఏ.చేతన, పీహెచ్డీ గ్రహీత పరిశోధనలకు పేటెంట్ వచ్చింది ప్రస్తుతం కాన్వకేషన్లో ఇద్దరు మా స్కాలర్స్ డాక్టరేట్ తీసుకుంటున్నారు. సమాజ హితం కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి వచ్చే అంశాలపై పరిశోధనలు చేశాం. అందుకోసం పేటెంట్లు సైతం వచ్చాయి. భవిష్యత్ ప్రయోగాలు కూడా ప్రజలకు ఉపయోగ పడే విధంగా నిర్వహిస్తాం. – ఎన్.చంద్రకిరణ్, అధ్యాపకుడు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సమాజహితం కోసమే.. పీయూలో ఇటీవల వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఎక్కువ సంఖ్యలో రీసెర్చి స్కాలర్స్ రావడం గొప్ప విషయం. ఇద్దరు స్కాలర్స్ మా ఆధ్వర్యంలో రీసెర్చి పూర్తి చేశారు. వారి పరిశోధనలు పూర్తిగా సమాజం, ప్రజల అవసరాలను తీర్చే విధంగా జరిగాయి. వారికి కాన్వకేషన్లో డాక్టరేట్లను ప్రదానం చేయడం గొప్ప విషయం. – మధుసూదన్రెడ్డి, అధ్యాపకుడు మైక్రోబయాలజీ -
బంతి సోయగం..!
మల్దకల్లో సాగు చేసిన బంతిపూల తోట మల్దకల్ సమీపంలో బంతి పూల సోయగాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. రోడ్డుకు ఇరువైపులా పూల అందాలు ఆకర్శిస్తున్నాయి. దీపావళి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బంతిపూలకు ఏటా డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా రైతులు సైతం ఈ సీజన్లో బంతిపూల సాగు చేపడతారు. మల్దకల్ పెట్రోల్ బంకు సమీపంలో రైతు లక్ష్మన్న తన రెండెకరాల వ్యవసాయ పొలంలో బంతిపూలను సాగు చేయగా.. పసుపు కాంతులీనుతున్న పూల మొక్కలు అటుగా వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాలను ఆదివారం ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – మల్దకల్ -
స్నాతకోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: స్నాతకోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనంలో వివిధ కమిటీల చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిథులు, అధికారులు వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని, భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మెడల్స్ స్పాన్సర్ కోసం అన్ని వసతులు కల్పించాలన్నారు. మీడియా వారికి అనుగుణంగా కార్యక్రమం నిర్వహించే హాల్తోపాటు పలు ప్రదేశాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, హాస్పిటాలిటీ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, మీడియా కమిటీ చైర్మన్ కుమారస్వామి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, అధ్యాపకులు మాలవి, అర్జున్కుమార్, భూమయ్య, శ్రీధర్రెడ్డి, జిమ్మీకార్టన్, రవికుమార్ పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు
గట్టు: సంఘ విద్రోహులు, శాంతిభద్రతలకు భంగం కల్గించే వారిపై కఠినంగా వ్యవహరించాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య సిబ్బందికి సూచించారు. మండలంలోని గొర్లఖాన్దొడ్డి గ్రామంలో గతంలో నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసుకు సంబందించి ఆదివారం గొర్లఖాన్దొడ్డి గ్రామంలో ఆయన విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులతోపాటు చుట్టు పక్కల వారి నుంచి కేసుకు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గట్టు పోలీస్ స్టేషన్కు చేరుకొని పలు కేసులకు సంబందించిన వివరాలపై ఎస్ఐ మల్లేష్తో ఆరా తీశారు. గ్రామాల్లో గస్తీని పెంచాలని, ప్రజలతో మంచి సంబంధాలను కల్గి ఉండాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వెంట ఎస్ఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ధర్మరక్షణకు కంకణ బద్ధులు కావాలి
మల్దకల్: దేశం, ధర్మం కోసం కంకణ బద్దులై పనిచేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలనే భావనను అందరిలో కలిగించాలని ఆర్ఎస్ఎస్ వక్త, విభాగ్ శారీరక ప్రముఖ్ భోగరాజు రాము అన్నారు. మల్దకల్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఆదివారం కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. ఈమేరకు పదా సంచలన్ కార్యక్రమం, మార్చ్ నిర్వహించారు. భోగరాజు రాము మాట్లాడుతూ.. శతాబ్ది పంచ పరివర్తన విషయాలైన సామాజిక సామరస్యత, ప్రమోదం, పర్యావరణ స్వదేశ స్వాభిమానం, పౌరవిధుల ఆధారంగా సేవకులు సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సంయోజక్ జగదీశ్వర్రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగోవిందు, మల్దకల్, రెడ్డప్ప, తిరుపతిరెడ్డి, తిమ్మన్న, దామ నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అసలు వస్తదో.. రాదో..
మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే.. రావడానికి నెల రోజులు పట్టింది. దీంతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. తుమ్మిళ్ల రీచ్ పక్కనే ఉన్నా.. చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏవేవో సాకులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో దశలో ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అసలు వస్తదో.. రాదో, వస్తే.. ఎప్పుడొస్తదో.. తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. – సోమేష్, రాజోళి -
పరిశోధనలకు పట్టం
●పీయూ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో యూజీ, పీజీ విద్యార్థులతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్కు కూడా డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా మైక్రోబయోలజీ విభాగంలో 5, కెమిస్ట్రీ విభాగంలో 5, కామర్స్ విభాగంలో 1, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఒకరు ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎక్కువ మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో ఎక్కువ రీసెర్చి పేపర్లు వెలువడ్డాయి. దీంతో స్కాలర్స్కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ‘మన్నెశ్రీకు గౌరవ డాక్టరేట్.. పీయూలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు స్నాతకోత్సవం నిర్వహించగా.. నాలుగోసారి జరిగే కార్యక్రమంలో మొట్టమొదటిసారి గౌవర డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓ రంగంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఈ డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డికి మొదటిసారి గౌవర డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన పాలమూరు జిల్లా వాసి కావడం, రాష్ట్రంలో పలు ఫార్మతోపాటు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్ డాక్టరేట్.. మన్నె సత్యనారాయణరెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. పీహెచ్డీ పట్టా పొందనున్న వారి వివరాలిలా.. పలు అంశాలపై పరిశోధనలు చేసిన పీయూ రీసెర్చ్ స్కాలర్స్ స్నాతకోత్సవంలో 12 మందికి డాక్టరేట్లు పీయూ చరిత్రలో మొట్టమొదటిసారి మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ గవర్నర్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు స్కాలర్: రాజశ్రీనాథ్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: స్టడీ ఆన్ మైక్రోబియాల్ లిపస్ అండ్ ప్రొటెస్ కల్టివబుల్ అండ్ మెటాజినీవబుల్ అప్రొచ్ స్కాలర్: శ్రీనివాసరావు మేకల (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: అల్లివేషన్ ఆఫ్ డ్రోట్ స్ట్రెస్ ఇన్ క్యాప్సియం అనం ఎల్.అండ్ సౌఫోసిస్ టెట్రాగోనాలోబా బై యూసింగ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా స్కాలర్: విజయ్కుమార్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం : బయోరిమేడేషన్ స్టడీస్ ఆన్ ఫిజికో–కెమికల్ ఆన్ మైక్రోబయాలాజికల్ అలాలసిస్ ఆఫ్ వాటర్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ పెద్ద చెరువు, మహబూబ్నగర్ స్కాలర్: చేతన (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: ప్రొడెక్షన్ ఆఫ్ పెక్టెనసిస్ ఫ్రం ఆస్పర్ గిల్లాస్ నిజర్ ఫర్ ప్రూట్ జ్యూస్ క్లారిఫికేషన్ రైపింగ్ అండ్ పీలింగ్ డీగ్రేడేషన్ స్కాలర్: సంజీవ్కుమార్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం : ఫార్మలేషన్ ఆండ్ ఎలివేషన్ ఆఫ్ పాలీబయోన్యూక్లోప్లాంట్ అన్ సెలెక్టెడ్ క్రాప్ ప్లాంట్స్ స్కాలర్: కె.సంధ్య (కెమిస్ట్రీ) పరిశోధన అంశం : ఎన్విరార్మెంటల్లీ బిగిన్స్ బయోసింథసిస్ ఆన్ పెల్లాడియం నానోపార్టికల్స్ ఆన్ ఇట్స్ యూస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ రెమిడేషన్ ఆన్ బయోమెడికల్ అప్లికేషన్ స్కాలర్: డి.వెంకటేష్ (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ిసంధసిస్ క్యారెక్టరైజేషన్ ఫొటో క్యాటలిటిక్ ఆరండ్ ఫోరోమెటిక్ సెన్సింగ్ స్టడీస్ ఆప్ జి–సీ3ఎన్4 సపోర్టెడ్ మెటల్ ఆకై ్సడ్ నానోపార్టికల్స్ స్కాలర్: రుకియాభాను (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: గ్రీన్ సింధసిస్ ఆఫ్ గోల్డ్ పెల్లాడియం ఆన్ సిల్వర్ నానోపార్టికల్స్ యూజింగ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ క్యారెక్టరైజేషన్ అండ్ అప్లికేషన్ స్కాలర్: టి.స్వాతి (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ప్రిపరేషన్ స్ట్రక్చరల్ క్యారెక్టరైజేషన్ అండ్ అప్లికేషన్ ఆప్ ట్రాన్సినిట్ స్పీసెస్ ఆఫ్ డీమ్యాప్ ఆండ్ సింధసిస్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ స్కాఫోల్డ్స్ బై ఎంప్లయింగ్ ఆక్వోయిస్ ఫేస్ క్నొవేంగిల్ కండేంషేషన్ అండ్ మాల్టీకాంపోనెంట్ రియాక్షన్ స్కాలర్: జి.విజయలక్ష్మీ (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ఆక్వియాస్ ఫేస్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంప్లయింగ్ లివేస్ బేస్ అడెక్ట్ ఆప్ డీమ్యాప్ యాజ్ న్యూగ్రీన్ రీఏజెంట్స్ ఆన్ స్టీరియో స్పెసిఫిక్ సింధసిస్ ఆఫ్ మెడిసినల్లీ యాక్టిక్ 1,8–న్యాప్తిరిడైన్ డిప్రివేటివ్ స్కాలర్: ఎంఆర్.సంధ్యారాణి (బిజినెస్ మేనేజ్మెంట్) పరిశోధన అంశం: ఏ స్టడీ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ మోటివేషన్ ఆన్ ఎంప్లయిస్ రీటెన్షన్ విత్ రిఫరెన్స్ టూ సెలెక్ట్ ఇట్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ స్కాలర్: రితిక బజాజ్ (కామర్స్) పరిశోధన అంశం: పర్ఫామెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఏ స్టడీ ఆఫ్ సెలెక్ట్ బస్ డిపోట్స్ ఇన్ హైదరాబాద్ -
‘చేయి’ తడపాల్సిందే..!
ఇసుక కాంట్రాక్టర్కు ‘అధికార’ పార్టీ నేత హుకుం ● ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున డిమాండ్ ● పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ అడ్డంకులు ● తుమ్మిళ్లలో 2 రోజులుగా నిలిచిన ఇసుక రవాణా ● ఆందోళనలో లబ్ధిదారులు..సీఎం పేషీకి చేరిన ‘పంచాయితీ’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక కొరత గుదిబండగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన సర్కారు తొలుత జోగుళాంబ గద్వాల, ఆ తర్వాత ఉమ్మడి పాలమూరులోని మిగతా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లకు తుమ్మిళ్ల నుంచి ఉచితంగా ఇసుక అందజేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫలితం కానరావడం లేదు. నదిలో నీటి ప్రవాహం బాగా ఉంది.. అందుకే అధికారిక రీచ్లోనూ ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోతున్నారని అనుకుంటే పొరపాటే. తొలుత వర్షాలతో.. తాజాగా ‘చేయి’ తడపాల్సిందేనంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హుకుంతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా అడ్డంకులు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని రాజోళి మండలం తుమ్మిళ్లలో తుంగభద్ర నది నుంచి ఫ్లెడ్జింగ్ పద్ధతిన ఇసుక తోడి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నదిలో నీరు ఉన్న సమయంలోనూ కార్గో శాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిన ఇసుక తవ్వేలా ఈ ఏడాది జూన్లో టెండర్లు నిర్వహించింది. మూడు పాయింట్ల ద్వారా వచ్చే ఏడాది జూన్ 21 వరకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకొని జూలై 3న తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు.. అధికారులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం తుమ్మిళ్ల నుంచే టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే తొలి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు 7 వేల ఇళ్లకు ఇసుక అందించాల్సి ఉంది. 45 రోజుల క్రితం సరఫరా మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు 650 ఇళ్లకు మాత్రమే అందజేశారు. వర్షాలతో సరఫరాకు అడ్డంకులు ఏర్పడగా.. దాన్ని అధిగమించేలోపు మరోసారి బ్రేక్ పడింది. డ్రైవర్ల ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు.. నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత డిమాండ్కు అంగీకరించని సదరు కాంట్రాక్టర్ నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం పేషీకి పంచాయితీ చేరగా.. సీఎంఓ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు జిల్లా అధికారులతో ఫోన్లో సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనిపై జిల్లా అధికారులెవరూ నోరు విప్పడం లేదు. ఇసుక లోడ్తో వాహనాలు నిలిచిపోగా టైర్లు దెబ్బతింటున్నాయని.. రెండు రోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ డ్రైవర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు రీచ్ వద్దకు చేరుకుని గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇసుకను కొల్లగొట్టారని ఉదహరించారు. అప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారని.. అప్పుడు దెబ్బతిన్న రోడ్లు ఇప్పటిదాకా వేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందిస్తే మంచిదేనని.. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. అనుమతులు ఉన్నా.. అధికార పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం అడ్డుకుంటూ గ్రామం పేరు చెడగొడుతున్నారంటూ వాహనాలను పంపించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్గా మారగా.. ‘అధికార’ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. -
రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి
గద్వాల: ప్రధానమంత్రి ధన కృషి యోజన ద్వారా అన్నదాతలు ఆర్ధికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి ధాన్య కృషి యోజనలో జిల్లా ఎంపికకవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి జిల్లా కేంద్రంలోని అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్సరెన్స్ తిలకించి మాట్లాడారు. నేల సారవంతతను బట్టి రైతులు విభిన్న పంటలు వేసేలా ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచడం అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకర్లు ముందుండాలని వ్యవసాయ రంగంలో జిల్లా ప్రగతి సాధించేందుకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఇన్చార్జ్ డిఏఓ జగ్గు నాయక్, ఏడీఓ సంగీత లక్ష్మీ, తదితరులు ఉన్నారు. -
డీసీసీ అధ్యక్షులపై కసరత్తు
● వనపర్తి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. లక్కాకుల సతీష్, రాజేంద్రప్రసాద్, డి.కిరణ్ కుమార్ డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దుతో ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇదే క్రమంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం.. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న డీసీసీ అధ్యక్ష పీఠాల భర్తీకి కసరత్తు ప్రారంభించడంతో పార్టీలో మళ్లీ సందడి మొదలైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులైన వారు జిల్లాల బాట పట్టారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి శనివారం పాలమూరుకు చేరుకున్నారు. ముందుగా నారాయణపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మహబూబ్నగర్కు చేరుకుని స్థానిక నేతలతో ముచ్చటించారు. ఆదివారం నుంచి ఈ రెండు జిల్లాల్లో అభిప్రాయాల సేకరణతో పాటు డీసీసీ అధ్యక్షుల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా మరో పరిశీలకుడు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆదివారం నాగర్కర్నూల్, 14న వనపర్తి, 16న జోగుళాంబ గద్వాలలో పర్యటించనున్నారు. ● నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరికల్ మండలం తీలేరుకు చెందిన ఆయనతో పాటు మక్తల్ మండలానికి చెందిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ధన్వాడ మండలంలోని గోటూరు నాగేశ్వర్రెడ్డి పోటీలో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలానికి చెందిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, కోస్గి మండలం పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి సైతం డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా పోటాపోటీ ఇలా.. ● మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి డీసీసీ చీఫ్గా ఉన్నారు. ఆయనతో పాటు ఈ పదవి కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకుడు ఎన్పీ వెంకటేష్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ ప్రధానకార్యదర్శి సిరాజ్ఖాద్రి పోటీపడుతున్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు వర్గాల మధ్య డీసీసీ పదవికి పోటీ నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గంలోని గద్వాలకు చెందిన గడ్డం కృష్ణారెడ్డి, మల్దకల్ మండలానికి చెందిన పటేల్ ప్రభాకర్రెడ్డి.. జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత భర్త తిరుపతయ్య, మల్దకల్కు చెందిన నల్లారెడ్డి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ నాయకుడు సంపత్కుమార్.. సరిత వర్గంలోని నల్లారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ● నాగర్కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు హబీబ్, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్కుమార్ రెడ్డి, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. నవంబర్లో ఖరారయ్యే అవకాశాలు ఏఐసీసీ పరిశీలకులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. అదేవిధంగా అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతల నుంచి ఈ నెల 18వ తేదీ దాకా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వడబోత తర్వాత ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ఈ నెల 22వ తేదీ నాటికి అటు ఏఐసీసీ, ఇటు పీసీసీకి అందజేయనున్నారు. అనంతరం సీఎం ఇతర ముఖ్య నేతలు జిల్లా ఇన్చార్జిలు, ఇన్చార్జి మంత్రులు, ఆయా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో సంప్రదింపులు జరిపి సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్, మహిళ) వారీగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కేటాయించనున్నారు. మొత్తానికి వచ్చే నెల తొలివారంలో డీసీసీ అధ్యక్షులు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆశావహులు తాము చేసిన దరఖాస్తుల్లో పార్టీకి అందించిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొంటూ బయోడేటా ఇవ్వాలని పరిశీలకులు సూచిస్తున్నారు. జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకులు పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 18 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ప్రతిపాదన 5 జిల్లాల్లోనూ పలువురి మధ్య పోటాపోటీ -
చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూర్: చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కృష్ణవేణి చెరుకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం స్థానిక మార్కెట్యార్డులో ఉమ్మడి జిల్లా చెరుకు రైతుల సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.8,150 నిర్ణయించిందని.. అలాగే చెరుకు పంటకు టన్నుకు రూ.6 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతుకు టన్నుకు రూ.వెయ్యి బోనస్ చెల్లించాలని, నిర్ణయించిన ధరకే కోతలు చేపట్టాలని, రవాణా విషయంలో ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రాయితీలు కొనసాగించాలని, పంట విక్రయించిన 14 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, సీడీసీ నిధులతో గ్రామాల్లో రహదారుల మరమ్మతు చేపట్టాలన్నారు. కోతల సమయంలో కార్మికుల కొరత లేకుండా చూడాలని, అధిక దిగుబడుల కోసం రైతులకు అవగాహన కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయాలని, పంటను నష్టపరుస్తున్న తెగుళ్లు, వేరుపురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు మాసూం, వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, సంజీవరెడ్డి, రవి, నారాయణ, రాజశేఖర్రెడ్డి, శివుడు, చంద్రసేనారెడ్డి, తిరుపతయ్య, లింగన్న, రంగారెడ్డి, రాజు, నాగేంద్రం, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
అన్నను కాపాడబోయి తమ్ముడు..
● చెక్డ్యాంలో మునిగి ఇద్దరు సోదరుల మృతి ● చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ● తల్లి ఏడాది దినకర్మ చేయడానికి వచ్చి మృత్యువాత ● వనపర్తి జిల్లా బలీదుపల్లిలో విషాదం అడ్డాకుల: తల్లి చనిపోయి ఏడాది కావడంతో దినకర్మ చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు పట్నం నుంచి ఊరికి వచ్చారు.. కార్యం పూర్తిచేసిన మరుసటి రోజు సరదాగా చేపలు పట్టేందుకు చెక్డ్యాం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నీటి సుడిలో మునిగిపోతున్న అన్నను కాపాడబోయి తమ్ముడు కూడా మృతిచెందిన విషాదకర సంఘటన వనపర్తి జిల్లా బలీదుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. బలీదుపల్లి గ్రామానికి చెందిన మంద యాదయ్య, మణెమ్మ దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. అందరూ హైదరాబాద్లో ఉంటూ ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే గతేడాది మణెమ్మ చనిపోవడంతో ఏడాది దినకర్మ చేయడానికి నలుగురు కుమారులు కుటుంబాలతో కలిసి రెండు రోజుల కిందట బలీదుపల్లికి వచ్చారు. శుక్రవారం మణెమ్మ ఏడాది దినకర్మ పూర్తి చేశారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో పెద్ద కుమారుడు మంద సుధాకర్ (32), చిన్న కుమారుడు మంద సాయి(25) మరో తమ్ముడు మంద కుమార్తో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి రెండు ఆటోల్లో గ్రామానికి సమీపంలో ఉన్న పెద్దవాగు చెక్డ్యాం వద్దకు వెళ్లారు. దుస్తులు శుభ్రం చేసుకుని కొద్దిసేపు సరదాగా గడిపొద్దామని అక్కడికి చేరుకున్నారు. అయితే చెక్డ్యాం దిగువన చేపలు కనిపించడంతో వెంటనే సుధాకర్ చేపలు పడతానంటూ నీళ్లలోకి దిగాడు. చెక్డ్యాం దిగువన నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీటి సుడి వద్దకు వెళ్లిన సుధాకర్ అందులో చిక్కుకుని మునిపోతూ కనిపించాడు. వెంటనే గుర్తించిన తమ్ముడు మంద సాయి నీళ్లలోకి దిగి అన్నను కాపాడే ప్రయత్నం చేయగా.. ఇద్దరూ నీటి సుడిలో చిక్కుకున్నాడు. ఇద్దరు అందులో కొట్టుమిట్టాడుతుండగా.. కొద్దిదూరంలో ఉన్న మరో తమ్ముడు మంద కుమార్ నీటిలోకి దిగి ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. ప్రాణాలకు తెగించి కుటుంబసభ్యుల సాయంతో ఇద్దరిని ఒడ్డుకు చేర్చగా.. పెద్ద కుమారుడు మంద సుధాకర్ అప్పటికే మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న చిన్న కుమారుడు సాయిని అంబులెన్స్లో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు. సుధాకర్కు భార్య మమత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయికి ఇంకా పెళ్లి కాలేదు. కాగా ఇద్దరు సోదరులు ఒకేరోజు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తుల చేత కంటతడి పెట్టించాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను జనరల్ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లి దినకర్మకు వచ్చిన కుమారులను మృత్యువు కబలించడంతో బంధువులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు. మంద సుధాకర్ (ఫైల్) మంద సాయి (ఫైల్) -
ఆధునిక హంగులు
పీయూలో కొత్త పుంతలు తొక్కుతున్న పరిపాలన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఆటుపోట్లను దాటుకుంటూ.. ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పీయూలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమర్థ్ స్కీం పోర్టల్ ద్వారా సిబ్బందికి ఆన్లైన్ అటెండెన్స్, వర్క్లోడ్, పే స్లిప్ల వంటివి అందిస్తున్నారు. వీటితోపాటు పీయూలో వినియోగిస్తున్న నీటి పునర్వినియోగం కోసం నూతనంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ను ఆదా చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యం అవుతున్నారు. సమర్థ్ పోర్టల్తో సేవలు.. పీయూలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి సెలవుల మంజూరు, వేతనాల పే స్లిప్లు, విద్యార్థి అడ్మిషన్, అటెండెన్స్, స్కిల్స్ తదితర అంశాలను పొందుపర్చుకోవడం, వివిధ కార్యక్రమాలు, హాస్పిటల్స్ తదితర అంశాలను మ్యానువల్ పద్ధతిలో జరిగేవి. దీనిని ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చి సమగ్రంగా యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పీఎం ఉషా స్కీం నిధులను అందిస్తున్న ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థకు కేంద్రం సమర్థ్ పోర్టల్ను ఉచితంగా అందిస్తుంది. ఈ స్కీంలో భాగంగా యూనివర్సిటీ సిబ్బందికి ప్రత్యేకంగా సమర్థ్ యాప్ ద్వారా ప్రత్యేక సేవలను అందించేందుకు అధికారులు ఇటీవల ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో రెగ్యులర్ అధ్యాపకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగా.. కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలను ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థులనూ ఇందులో చేర్చనున్నారు. తద్వారా పీయూకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఈ–పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫైలింగ్ నిర్వహించి.. ఫైల్ స్టేటస్ ఎక్కడ.. ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. టాప్లో నిలబెడతాం.. పీయూనూ తెలంగాణలో టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. ఫైల్స్, సిబ్బంది అటెండెన్స్, విద్యార్థుల తదితర వివరాలు అన్ని సమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోకి తీసుకొస్తున్నాం. డ్రెయినేజీ నీరు వృథా పోకుండా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి.. నీటి పుర్వినియోగం, బయో ఫర్టిలైజర్స్ వినియోగంలోకి తీసుకువస్తాం. సోలార్ ప్యా నెల్స్ ద్వారా కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. – జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ పేపర్ లెస్ సేవలు.. యూనివర్సిటీలో పేపర్ లెస్ సేవలు నిర్వహించేందుకు సమర్థ్ పోర్టల్ను వినియోగిస్తున్నాం. దీని ద్వారా టీచింగ్, నాన్టీచింగ్, స్టూడెంట్స్ అందరికీ కూడా సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. వీలైనంత త్వరగా దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తాం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్తో యూనివర్సిటీలో నీటి కొరత తీరడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ ఆన్లైన్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల వివరాలు విద్యుదుత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ బిగింపు రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు నీటి పునర్వినియోగం, వ్యర్థాలతో బయో ఫర్టిలైజర్స్ తయారీ -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
గట్టు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఎం నిరంతరం పోరాటం చేస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ.. మండలంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతవుతున్నారన్నారు. అక్షరాస్యతలో అత్యంత వెనుకడిన ప్రాంతమని, ఈ ప్రాంత విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయులు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీర్చాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సరైన రవాణా సౌకర్యం లేక గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి బీడు భూములకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిని సారించాలని పేర్కొన్నారు. వీవీ నర్సింహ, నర్మద, మండల కార్యదర్శి గట్టు తిమ్మప్ప, నాయకులు ఆంజనేయులు, రెడ్డెప్ప, నర్సింహులు, శాంతిరాజు, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెల మేతగా ఉల్లి పంట..
ఉండవెల్లి శివారులో గొర్రెలు మేస్తున్న ఉల్లి పంట వరుణుడి రూపంలో రైతును కష్టాలు వెంటాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంట ఎన్నో చోట్ల నీటిపాలైంది. ఉండవెల్లిలోని జాతీయ రహదారి సమీపంలో రైతు రాజు తన 4 ఎకరాల్లో ఉల్లి పంట వేశాడు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టాడు. వానాకాలం ప్రారంభంలో విస్తారంగా వర్షాలు కురవడంతో దిగుబడి బాగా వస్తుందని, చేసిన అప్పులు తీరతాయని ఆశపడ్డాడు. కానీ, పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలతో ఉల్లి పంట మొత్తం భూమిలోనే మురిగిపోయింది. దాదాపు రూ.4 లక్షల వరకు నష్టం వాటిళ్లడంతో దిక్కుతోచని పడ్డాడు. చేసేది లేక శుక్రవారం 4 ఎకరాల్లోని ఉల్లి పంటను ఇలా గొర్రెలకు మేతగా వదిలాడు. – ఉండవెల్లి -
సమాలోచనలు..!
గద్వాల క్రైం: మద్యం దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చి దాదాపు రెండు వారాలు కావస్తున్నా.. జిల్లాలో తూతూ మంత్రంగా టెండర్లు దాఖలు కావడం గమనార్హం. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు డిపాజిట్ ధర పెంచడం.. షాపు లైసెన్స్ ఫీజు సైతం 50 శాతం పెంపు.. చివరగా లక్కీ డ్రాలో అదృష్టం వరిస్తుందో లేదోనన్న బెంగ.. దీంతో కొందరు వ్యాపారులు సమాలోచనలు చేస్తున్నారు. జిల్లాలోని గద్వాల– అలంపూర్ సెగ్మెంట్లోని 34 వైన్ షాపుల కోసం వ్యాపారుల నుంచి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టింది. ఇందులో జనరల్ 23, గౌడ కులస్తులకు 5, ఎస్సీ కులస్తులకు 6 షాపులు కేటాయించింది. దరఖాస్తు ఫీజును పెంచిన నేపథ్యంలో వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా గడ్డు పరిస్థితిలో ఉంది. దీంతో సదరు వ్యాపారులు మద్యం వ్యాపారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు మద్యం వ్యాపారం చేసేందుకు వెసులుబాటు ఉండడంతో అందరం కలిసి సిండికేట్గా వ్యాపారం చేద్దామని వ్యాపారులు సన్నద్ధమయ్యారని సమాచారం. ఇదిలాఉండగా 2023లో 36 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 1,171 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.23.42 కోట్ల ఆదాయం సమకూకురింది. ప్రస్తుతానికి వచ్చేసరికి 34 మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. ఇక టెండర్ల విషయానికి వస్తే.. ఈ నెల 8వ తేదీన ఒక టెండర్, 9న 11, 10వ తేదీన 5 టెండర్లు దాఖలయ్యాయి. జిల్లాలోని మద్యం దుకాణాల కోసం నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఒక్క టెండర్ దాఖలు కాలేదు. అయితే ఇక్కడి వ్యాపారులు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని సమాచారం. ఫలానా తేదీన టెండర్ వేస్తే ఖచ్చితంగా లక్కీ డ్రాలో అదృష్టం తమనే వరిస్తుందని జ్యోతిష్యులు చెప్పడంతో ఆ దిశగా ఆలోచిస్తున్నారని తెలిసింది. ఎలాగూ స్థానిక ఎన్నికల నేపథ్యంలో మద్యం వ్యాపారం భారీ స్థాయిలో ఉంటుంది. దీంతో జనరల్, వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలో ఆయా కేటగిరిలోని వారికి మద్యం వ్యాపారంపై ఆసక్తి, ఆర్థిక స్థోమత లేకపోవడంతో లిక్కర్ సామ్రాజ్యంలో చక్రం తిప్పే కొందరు వ్యాపారులు బినామీలుగా మరికొందరితో టెండర్లు వేయించే పనిలో పడ్డారు. గతంలో నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్లలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఈసారి కూడా మద్యం దుకాణాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం టెండర్లు లేకపోవడం, ధరలు అధికంగా ఉండడంతో ఊహించని విధంగా అలంపూర్ సెగ్మెంట్లో మద్యం వ్యాపారం కొనసాగింది. ఈసారి అక్కడి రాష్ట్రంలో మద్యం టెండర్లు నిర్వహించింది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం లేకపోవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. పెరిగిన డిపాజిట్ నేపథ్యంలో సిండికేట్పైనే వ్యాపారుల ఆసక్తి మొత్తం 17 టెండర్లు దాఖలు -
సాగులో నూతన పద్ధతులు అవలంబించాలి
గద్వాల వ్యవసాయం: నూతన పద్ధతులతో వ్యవసాయం చేయాలని పాలెం వ్యవసాయ శాస్త్రవేత్తలు శశిభూషణ్, శంకర్, ఈశ్వర్రెడ్డి శ్రీరామ్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లి, అనంతాపురం గ్రామాల్లో సాగు చేసిన వరి, మినుము పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో నూతన పద్ధతులను వివరించారు. వీటిని అవలంభించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చునని చెప్పారు. వరి పంటలో చీడపీడల నివారణకు సమగ్ర సస్య రక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతుల గురించి, వాతావరణ పరిస్థితులను బట్టి పంటలో వచ్చు తెగుళ్ల గురించి రైతులకు వివరించారు. వరిలో వచ్చే సుడిదోమ, దోమపోటు నివారణకు లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 2.2మి.లీ. లేదా ఇథోఫెన్ఫ్రాక్స్ 2మి.లీ పిచికారి చేయాలన్నారు. ఉల్లకోడు, దుపరోగం నివారణకు నారుమడిలో మొలకెత్తిన 10 నుంచి 15రోజుల లోపు ఒక సెంటుకు 160గ్రా. కార్బోప్యూరన్ 3కేజీల గుళికలు లేదా 50గ్రా. ఫోరెట్ గుళికలను చల్లాలని చెప్పారు. అలాగే కంరినల్లి నివారణకు ఫ్రోఫిన్ఫాస్ 2 మి.లీ. లేదా డైకోఫాట్ 5.మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్ 1మి.లీ. ఫ్రోఫికోనజోల్ కలిపి ఒకసారి ఆ తర్వాత 15రోజులకు మరోసారి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ హరీష్, రైతులు లక్ష్మీభూపాల్రెడ్డి, క్రిష్ణ, వెంకట్రాములు తదితరులు ఉన్నారు. -
స.హ.చట్టంతో పారదర్శకత
గద్వాల: సమాచార హక్కు చట్టం.. ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని ఈచట్టంపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ నెల 5వతేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్టీఐ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌరులకు సమాచారహక్కు చట్టం–2005 ప్రకారం అడిగిన సమాచారాన్ని నిబంధనల మేరకు దరఖాస్తుదారునికి సమాధానం ఇవ్వడం అధికారుల బాధ్యత అన్నారు. ప్రభుత్వంలో అన్ని శాఖల నుంచి తమకు కావాల్సిన సమాచారాన్ని పొందడం పౌరుల హక్కుగా చెప్పారు. ఈచట్టం ప్రకారం ప్రజలు అడిగిన సమాచారాన్ని నిర్ధేశిత సమయంలో ఇవ్వకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వారోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతీలు, మండలాలు, డివిజన్, జిల్లా స్థాయిలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా స.హ.చట్టం ద్వారా ఎలాంటి సమాచారాన్ని కోరవద్దో విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజలు అడిగిన దానిప్రకారం ఆయా శాఖలలో ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం అధికారుల బాధ్యతగా పేర్కొన్నారు. అనంతరం ఆయన స.హ.చట్టంపై ప్రతిజ్ణ చేయించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సిం గ్ రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఆశలపై నీళ్లు
హైకోర్టు తీర్పుతో ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసిన ఈసీ ● గ్రామాల్లో ఆశావాహుల్లో తీవ్ర నిరాశ ● ఉదయం సందడి.. సాయంత్రం నిశ్శబ్ద వాతావరణం ● ఆరు వారాల తరువాతే ‘స్థానిక’ ఎన్నికలపై స్పష్టత ● ఉమ్మడి జిల్లాలో ఒక జెడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు దాఖలు రిజర్వేషన్లు తేలే వరకు.. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల కేడర్, ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలకవర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ఎన్నికలకు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీ వర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్ల కేటాయింపుతో ఆయా స్థానాల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుండటం ఆశావహులు, ప్రధాన పార్టీల కేడర్లో నైరాశ్యం నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలే వరకు వేచి చూస్తారా.. లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా.. అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ కొనసాగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు తీర్పుతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పోటీకి సిద్ధమైన ఆశావహుల్లో అయోమయం, నైరాశ్యం నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఆశావహులు ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎన్నికలకు ఈసీ గత నెల 29న షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే గురువారం నుంచి తొలివిడత ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం సైతం మొదలైంది. అయితే బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై కోర్టులో పెండింగ్లో ఉండటంతో మొదటిరోజు నామినేషన్లకు అభ్యర్థు లు ఆసక్తి చూపలేదు. తొలిరోజున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 13 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ తరపున చందులాల్ నామినేషన్ వేశారు. ఈ ఒక్క నామినేషన్ మినహా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ రాలేదు. అలాగే నాగర్కర్నూల్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు రాగా, ఇందులో కాంగ్రెస్ తరఫున ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరొకరు నామినేషన్ సమర్పించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో కాంగ్రెస్ తరపున రెండు నామినేషన్లు, గోపాల్పేట మండలంలో ఇండిపెండెంట్గా ఒకరు నామినేషన్ వేశారు. నారాయణపేట జిల్లాలో ఐదు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ ఎంపీటీసీ స్థానానికి బీజేపీ తరపున ఒక నామినేషన్ దాఖలైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండలం తాటికుంట ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరపున ఒక నామినేషన్ దాఖలైంది. ఉదయం సందడిగా కనిపించిన గ్రామాలు కోర్టు స్టే రావడంతో సాయంత్రానికి చతికిలపడ్డాయి.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాఖలైన నామినేషన్లు ఇలా.. కరువైన స్పందన.. -
పరిశోధనలకు పునాది
కీలక మైలురాయి.. పీయూలో రూ.11 కోట్లతో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం నిర్మిస్తున్నాం. దీనిలో ఎక్విప్మెంట్ కోసం రూ.13 కోట్లు పీఎం ఉషా స్కీం ద్వారా కేటాయించాం. ఈ భవన నిర్మాణం చివరిదశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రీసెర్చి స్కాలర్స్, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేటు ఫార్మ కంపెనీలు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంక్యూబేషన్ సెంటర్లో స్టార్టప్ల ఎంటర్ ప్రెన్యూరర్స్ ప్రొటోటైప్ ప్రయోగాల ద్వారా కొత్త అంశాలపై దృష్టి సారించవచ్చు. – జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ ఎంతో ఉపయోగం.. రీసెర్చి ఫెసిలిటీ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. అందులో రీసెర్చి చేసే వారికి అన్ని రకాల వసతులు కల్పించనున్నాం. దీంతో ఇక్కడ ప్రయోగాలు చేసుకునే ప్రైవేటు వారు కొద్ది మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంక్యూబేషన్ సెంటర్ ద్వారా కొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం లభిస్తుంది. ఉమ్మడి పాలమూరుతోపాటు చుట్టు పక్కల జిల్లాల వారికి ఇది ఎంతో ఉపకరించనుంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ త్వరలో పరిశోధనలకు అడ్డాగా నిలవనుంది. విద్యార్థులు, రీసెర్చి స్కాలర్స్, అధ్యాపకులను పరిశోధనల పరంగా ప్రోత్సహించేందుకు పీయూలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2008లో ప్రారంభం అయినప్పుడు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితమైన పీయూ.. ప్రస్తుతం రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణంతో ప్రయోగాలకు నిలయంగా మారనుంది. తెలంగాణలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితం భవనం పనులు ప్రారంభమవగా.. దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ భవన నిర్మాణం, వసతుల కల్పన కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సైతం విడుదల చేయడంతో దీని నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ. 25 కోట్ల వ్యయం... రీసెర్చి ఫెసిలిటీ భవనాన్ని నిర్మించేందుకు రూ.11 కోట్లను గతంలో కేటాయించి నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 5 ల్యాబ్లు, రెండు సెమినార్ హాళ్లు, కంప్యూటర్ ల్యాబ్, ఇంక్యూబేషన్ సెంటర్ వంటివి నిర్మించనున్నారు. ఈ భవనం మరో రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో ఇందులో ఏర్పాటు చేసే వసతుల కోసం నిధులను సైతం ప్రభుత్వం సమకూర్చడం గమనార్హం. ఇందులో పీఎం ఉషా స్కీం ద్వారా గత విద్యా సంవత్సరం రూ.100 కోట్లను కేటాయించగా.. ఈ నిధుల్లోంచి రూ.14 కోట్లు కేవలం రీసెర్చి ఫెసిలిటీ సెంటర్ కోసం మాత్రమే కేటాయించింది. ప్రభుత్వం ఒక్కో మైక్రోస్కోప్, ఇతర ఎక్విప్మెంట్ రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు వెచ్చించనుంది. ఫిజిక్స్, మైక్రోబయోలజీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి వారికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడనుంది. పీయూలో నిర్మితమవుతున్న రీసెర్చ్ ఫెసిలిటీ భవనం రూ.11 కోట్లతో భవనం, ఉమ్మడి జిల్లాలో రీసెర్చి ఊతం రూ.14 కోట్లతో పరికరాల కొనుగోలుకు అనుమతి ఇతరత్రా వసతుల కల్పనకు సైతం నిధులు విడుదల ఇంక్యూబేషన్ సెంటర్తో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం -
అర్హతకు మించి వైద్యం చేస్తే చర్యలు
అలంపూర్: అర్హత లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వైద్యం చేస్తే తగిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సిద్ధప్ప అన్నారు. అలంపూర్లో క్లీనిక్ల పేరుతో ఆర్ఎంపీలు నడుపుతున్న ఆస్పత్రులు, ల్యాబ్లను తనిఖీలు చేశారు. అక్కడి వసతులు, పరికరాలు, మందులను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కొంత మంది ఆర్ఎంపీలు ప్రైవేటు ఆస్పత్రులను నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని, అందుకే ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశామన్నారు. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం అందిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. తొలిసారి కావడంతో అందరికి హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. వ్యవహర శైలిలో మార్పు లేకుండా ప్రజలకు స్థాయికి మించి వైద్యం అందిస్తే చర్యలు చేపడతామన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ అలంపూర్ మండలంలోని క్యాతూర్ పీహెచ్సీని, అక్కడి రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీకి వచ్చిన మందులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు వీరితోపాటు పీఓ ప్రసూనరాణి, మండల వైద్య అధికారి భరత్, ఎంపీహెచ్ఈఓ సత్యనారయణ, హెచ్ఎస్ ఉలిగమ్మ, ఫార్మాసిస్టు రవికుమార్, హెచ్ఏ బాలిశ్వరయ్య శేట్టి, నాగశేషయ్య, ఈఓ మధుసుధన్ రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు
గట్టు: శాంతిభద్రతలకు భంగం కల్గించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ మొగిలయ్య హెచ్చరించారు. గురువారం ఆలూరు, గట్టు గ్రామాల్లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయనతోపాటు గట్టు ఎస్ఐ మల్లేష్ సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాలకు జనాలు 100 మీటర్ల దూరం ఉండాలని, అభ్యర్థితో పాటుగా ఇద్దరికి మాత్రమే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని, మోబైల్పోన్లు, వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. -
రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ
అయిజ: నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం ద్వారా రైతులకు వందశాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు అందకపోవడంపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఊరించి.. ఉసూరుమనిపించారు’ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. రైతులకు సత్వరమే వందశాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక వ్యవసాయశాఖ అధికారులు అయిజలోని రైతు సంఘం గోదాం వద్ద రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుమారు 400 మంది రైతులకు 60 కిలోల చొప్పున విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఓ జనార్దన్, రైతు ఉత్పత్తిదారుల సంఘం మండల అధ్యక్షుడు సుధాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ మేరకు ఈ నెల 9నుంచి 11వ తేదీ వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసినట్లు వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ తదితర అంశాలను తెలియజేశారు. వీసీలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారా యణ, నర్సింగ్రావు, డీపీఓ నాగేంద్రం, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్కుమార్రెడ్డి, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ లక్కీ డ్రాకు విశేష స్పందన
● రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ లక్కీడ్రాకు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన లభించిందని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. గత నెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) ప్రయాణించే వారికి లక్కీడ్రా నిర్వహించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీఓ రఘుకుమార్ చేతుల మీదుగా లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. ప్రథమ శివశంకర్, ద్వితీయ బిందు, తృతీయ మోక్షజ్ఞలు నిలవగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్గా నిలుస్తున్నదన్నారు. దసరా పండుగ రోజుల్లో ఉమ్మడి జిల్లా ప్రయాణికులు ఆర్టీసీని ఎంతో ఆదరించారని తెలిపారు. మహబూబ్నగర్ రీజియన్లోని ప్రధాన బస్టాండ్లలో ఏర్పాటు చేసిన 17 బాక్సుల్లో లక్కీడ్రా తీసినట్లు చెప్పారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) లక్ష్మిధర్మ, డిపో మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం..
నెట్టెంపాడు ఎత్తిపోతల నుంచి పంట పొలాలకు సాగునీరు వస్తుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. పంటపొలాల్లో కాల్వలు తవ్వి అసంపూర్తిగా వదిలేశారు. ముచ్చోనిపల్లి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా లాభం లేకుండా పోయింది. కాల్వలు తవ్వకుండా ఉన్నా ఆ స్థలంలో పంటలు పండించుకునే వాళ్లం. – బజారి, రైతు, తూంకుంట పంట పొలాల్లో కాల్వలు పోయిన రైతులతో పాటు చుట్టుపక్కల పంట పొలాలు ఉన్న రైతులు డీజిల్ ఇంజిన్లతో పైరుకు నీరు కడుతున్నారు. కాల్వలకు దూరంగా పంట పొలాలు ఉన్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికై నా కాల్వల పనులు పూర్తిచేసి సాగునీటిని విడుదల చేయాలి. – దేవేంద్ర, రైతు, ఎక్లాస్పురం కాల్వ పనులు పూర్తిచేసేందుకు కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. భూ సేకరణకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. చిన్న కాల్వలు తవ్వేందుకు కొందరు రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. కొంతమంది రైతుల నుంచి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఆయా సమస్యలను పరిష్కరించి కాల్వల పనులు పూర్తిచేసేందుకు కృషిచేస్తాం. – నవీన, నెట్టెంపాడు లిఫ్ట్ 109వ ప్యాకేజీ డీఈఈ ● -
మూడు రోజులే గడువు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీనిపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా తీర్పు గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రానికి రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో గురువారం ఉదయం 10.30 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న అయోమయం ఆశావహుల్లో నెలకొంది. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే పార్టీలు అభ్యర్థిత్వాలను పెండింగ్లో ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో గురువారం నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలవుతున్నా ప్రధాన రాజకీయ పార్టీల తరపున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. మొత్తం రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించనుండగా.. గురువారం నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలుకానుంది. శనివారం తుది గడువు ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహణ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగానే గురువారం నుంచి తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలు కానుండగా ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ అధికారిగా జిల్లాస్థాయి అధికారి, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరించనున్నారు. నామినేషన్నామినేషన్తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 11 వరకే తుది గడువు ఉంది. గురువారం నుంచే నామినేషన్లను అధికారులు స్వీకరించనుండగా ఆయా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు మంచిరోజు, ముహూర్తాలను బట్టి నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు గురువారమే బీసీ రిజర్వేష్లన్ల అంశంపై హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో శుక్ర, శనివారాల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది. -
జోగుళాంబ గద్వాల
వీడని సందిగ్ధం.. గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ ఈ నెల 11 వరకు తుది గడువు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 39 జెడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ -
శిక్షకులు లేక.. క్రీడలు దూరం
గద్వాలటౌన్: క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నాం.. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నాం.. అంటూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అవి అమలుకాకపోవడంతో కళాశాలల విద్యార్థులు క్రీడా నైపుణ్యాలకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను దేశం గర్వించే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలంటే ప్రాథమిక స్థాయి నుంచే పునాది పడాలి. విద్యార్థులను ఆటగాళ్లుగా తీర్చిదిద్దే బాధ్యతను విద్యాసంస్థలు స్వీకరించాలి. పాఠశాల మొదలుకొని కళాశాల వరకు క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. కానీ, వాస్తవానికి వచ్చే సరికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో క్రీడా ప్రమాణాలు అడుగంటి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నా.. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో మాత్రం వ్యాయామ అధ్యాపకుల నియామకాలపై దృష్టి సారించడం లేదు.ఒక్క వ్యాయామ అధ్యాపకుడూ లేడు..ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల నియామక ప్రక్రియ ఆగిపోవడంతో పీడీలు లేని కళాశాలల సంఖ్య రోజు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మల్దకల్, మానవపాడు, అలంపూర్, ధరూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మాత్రమే వ్యాయామ అధ్యాపకుల పోస్టులు మంజూరయ్యాయి. గతంలో ఆయా కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు ఉన్నా.. క్రమంగా బదిలీలు, ఉద్యోగ విరమణతో ప్రస్తుతం ఒక్కరూ కూడా లేరు. ప్రభుత్వం ఖాళీలను సైతం భర్తీ చేయలేదు. తరువాత క్రమంలో గద్వాలలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల, అయిజ, గట్టు ప్రభుత్వ కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు పోస్టులు మంజూరయ్యాయి. పోస్టులు మంజూరైనప్పటి నుంచి ఈ కళాశాలలో పీడీల నియామకం జరగలేదు. ప్రస్తుతం జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకుండానే బోధన జరుగుతోంది. ప్రతిసారి కళాశాల స్థాయిలో పోటీల నిర్వహణపై జరగుతున్న సమావేశాలలో మన జిల్లా తరపున ఒక్కరూ కూడా పాల్గొనడం లేదు. దీంతో జిల్లాలో నిర్వహించే కళాశాలల స్థాయి పోటీలు నిర్వహణ కలగా మారుతోందని, పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు.డిగ్రీ కళాశాలల్లోనూ అంతే..ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ వ్యాయామ అధ్యాపక ఖాళీలు కొన్నేళ్ల నుంచి భర్తీ కావడం లేదు. జిల్లాలో ప్రభుత్వ పీజీ కళాశాలతో పాటు 3 ప్రభుత్వ డిగ్రీ, కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎంఏఎల్డీ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో మాత్రమే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ పోస్టు మంజూరైంది. కానీ, పదేళ్లుగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. వందల సంఖ్యలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికి తర్ఫీదు ఇచ్చే పీడీ లేకుండా పోయారు. గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల, శాంతినగర్లోని ప్రభుత్వ డిగ్రీ కలశాలలో వ్యాయామ అధ్యాపకుల కొరత ఉంది. డిగ్రీ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులను నియమించి క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తప్పక వ్యాయామ అధ్యాపకులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. లేనిపక్షంలో కళాశాల ప్రారంభానికి అనుమతి ఇవ్వొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినప్పటికి ప్రైవేటు కళాశాలల వారు వ్యాయామ అధ్యాపకులను నియమించలేదు.మరుగున పడుతున్న నైపుణ్యంక్రీడల ప్రోత్సాహానికి పాఠశాల స్థాయిలోనే పునాది పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులను తరుచూ భర్తీ చేస్తున్నా రు. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోంది. ఏటా రాష్ట్ర, జాతీయ స్థాయలో క్రీడోత్సవాలను నిర్వహిస్తుండటంతో చాలామంది క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. అండర్–14, అండర్–17 విభాగంలో ఏటా పాఠశాలల్లో క్రీడలు జరుగుతాయి. మన జిల్లా నుంచి యేటా ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఈ విద్యార్థులు అండర్–19 వి భాగంలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నా, వారికి శిక్షణ ఇవ్వడానికి వ్యాయా మ అధ్యాపకులు లేరు. దీంతో పాఠశాల స్థాయి పోటీలతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలల నుంచి జూనియర్ కళాశాలల్లో చేరిన వారికి అక్కడ శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో నిరాశే ఎదురవుతోంది. -
సమష్టి కృషితోనే..
అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు సమష్టి కృషి అంకితభావంతో పనిచేయడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోలో 104 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. దసరా పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీ పట్ల ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్ ● -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి
● గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వచ్చే వరిధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్హాలులో ధాన్యం సేకరణకు సంబంధించి నిర్వాహకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంటకు సంబంధించి నవంబర్ మొదటి వారం నుంచి రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈక్రమంలో ఈనెల 8వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 84 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తూకాలు, తేమను నిర్ధారించే యంత్రాలు, గన్నీబ్యాగుల కొరతలేకుండా చూడాలన్నారు. గత సీజన్లో కొన్ని చోట్ల గన్నీసంచుల కొరత ఇతర ఇబ్బందులు వలన చాలా మంది రైతులు 15రోజులకు పైగా తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చిన రైతులు వేచిఉన్నారని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాలలో ధాన్యం సేకరణ అనంతరం వెంటనే వాటిని మిల్లులకు తరలించేలా వాహనాలు, హమాలీ వంటివి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రప్రభుత్వం ఈసారి క్వింటాల్కు రూ.69లు పెంచిన నేపథ్యంలో సన్నరకానికి క్వింటాల్కు రూ.2389లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈసీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.97లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని, ఇందుకనుగుణంగా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, సివిల్సప్లై డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఆర్డీఏపీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన గద్వాల మున్సిపాలిటీలోని 14వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణ పనుల ఫొటోలు ఎప్పటికప్పుడు తీసి అందుకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జానకిరామ్, సిబ్బంది పాల్గొన్నారు. వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం రామాయణ గ్రంథాన్ని లోకానికి పరిచయం చేసిన గొప్ప మహనీయుడు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్కుమార్రెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
గద్వాల: భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి అమలుతీరుపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అలివేలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తిపై దాడి దురదృష్టకరం అలంపూర్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం దురదృష్టకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు అన్నారు. అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బీఆర్ గవాయ్పై ఈ నెల 6వ తేదీన దాడి ప్రయత్నానికి నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఈ దాడిని న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాల్సి వస్తోందన్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. దాడి ప్రయత్నానికి నిరసనగా రెండు రోజులపాటు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ్మా, సీనియర్ న్యాయవాదులు నారయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఈదుర్ బాష, గజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీకి ‘పండుగే’!
దసరా నేపథ్యంలో మహబూబ్నగర్ రీజియన్కు రూ.33.64 కోట్ల ఆదాయం ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లిన వేలాది కుటుంబాలు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకొని తిరిగి వెళ్లిపోయారు.ఈక్రమంలో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక అదనపు సర్వీసులు నడిపింది. ఉత్తమ సర్వీసులతో ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు.. రూ.కోట్లలో ఆదాయం ఆర్జించింది మహబూబ్నగర్ రీజియన్. ఆక్యుపెన్సీ రేషియోలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. – స్టేషన్ మహబూబ్నగర్ దసరా పండుగ రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రూ.33కోట్ల 64లక్షల 90వేల ఆదాయం సమకూరింది. 53,07,651 కిలోమీటర్లు బస్సులు తిరగగా 63,19,755 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గతేడాది కంటే ఈ ఏడాది బస్సులు 8 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరిగి రూ.4 కోట్ల అధిక ఆదాయాన్ని పొందింది. ఆయా రోజుల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 104 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల రాఖీ పండుగ రోజుల్లో కూడా మహబూబ్నగర్ రీజియన్లో ఓఆర్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్రంలోనే మొదటిస్థానం పండుగ రోజుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక అదనపు సర్వీసులు 63 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన వైనం -
అలా.. అయితే ఇలా!
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయా?.. నిబంధనలకు విరుద్ధమంటూ రద్దు చేస్తారా?..ఒకవేళ రద్దు చేసిన పక్షంలో పాతవే కొనసాగుతాయా?.. అవే కొనసాగితే గత రిజర్వేషన్ల స్థానాలు మారుతాయా?.. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పరంగా అమలు చేస్తుందా?.. మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయి? ..ఇలా స్థానిక ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా.. ఆశావహులు ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగిపోయారు. ఎన్నికలకు కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన పక్షంలో అనుకూల రిజర్వేషన్లు వచ్చిన వారు పోరు సన్నాహాలు మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతుండగా.. అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వారు మారుతాయనే ఆశతో ఉన్నారు. ఏదేమైనా ఆయా వర్గాలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు పరిస్థితులకు అనుగుణంగా రెండు రకాల ప్రణాళికలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం హాట్టాపిక్గా మారింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్పార్టీల పరంగానైనా 40శాతం అవకాశం..మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ప్రధానంగా కారు, కాంగ్రెస్ మధ్యనే పోరు కొనసాగగా.. బీజేపీ అంతంత మాత్రంగానే ప్రభావం చూపించింది. అయితే ఈసారి మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని పార్టీలు బీసీ నినాదామే ఎజెండాగా ముందుకెళ్తున్న క్రమంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన పక్షంలో 42 శాతం బీసీలకు టికెట్లు దక్కనున్నాయి. లేనిపక్షంలో పార్టీల పరంగా అమలు చేస్తే వెనుకబడిన వర్గాలకు 40 శాతమైనా ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉన్నట్లు బీసీ మేధావులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలిచారని.. మొత్తంగా సర్పంచ్ ఎన్నికల్లో 38 శాతం, ఎంపీటీసీ ఎన్నికల్లో 43 శాతం వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారని ఉదహరిస్తున్నారు. అయితే ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు తగిన అవకాశం దక్కలేదని వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 71 జెడ్పీటీసీ స్థానాల్లో 20 బీసీలకు రిజర్వ్ కాగా.. మరో ఆరు జనరల్ స్థానాల్లోనూ గెలుపొందారని చెబుతున్నారు. ఈ లెక్కన 26 మంది బీసీలు జెడ్పీటీసీలుగా ఎన్నిక కాగా.. 42 శాతం రిజర్వేషన్లు అమలైతే 32 స్థానాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సుప్రీంకోర్టు సీజేఐపై దాడి హేయమైన చర్య
గద్వాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై సోమవారం కోర్టుహాలులో జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రజాసంఘాలు, దళిత, ఉపాధ్యాయ, బహుజన సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కేసు విచారణలో జరుగుతున్న వాదనల క్రమంలో ఓ మతాన్ని వంటపట్టించుకున్న ఓ మతోన్మాది అయిన న్యాయవాది దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం క్షమించరానిదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, హనుమంతు, ప్రభాకర్, నాగర్దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. దాడి చేసిన వారిని శిక్షించాలి సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్పై సోమవారం కోర్టుహాలులో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, దాడిచేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, దేశఅత్యున్నత ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేదంటే అణగారిన వర్గాలపై వివక్ష, దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయో అర్థమవుతుందన్నారు. బీజేపీ పాలిత పాలిత రాష్ట్రాలలో మతోన్మాదులు దళితులపై అనేక రకాలుగా అఘాయిత్యాలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్రం స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తిని న్యాయవాద వృత్తి నుంచి శాశ్వతంగా తొలగించాలన్నారు. -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
అలంపూర్: పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలోని ఆయా వార్డులో చెత్తను తొలగించే పనులను మున్సిపల్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆయా వార్డుల్లో ఉన్న చెత్తాచెదారం తొలగించే పనులు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నివాస గృహాలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని సూచించారు. అయితే మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో చెత్త తరలించే బండ్లు రావడం లేదని, ఒకవేళ వచ్చినా ఉదయం అందరూ పనులకు వెళ్లిన తర్వాత వస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
గద్వాల క్రైం: ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా నుంచి వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.5,009 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 238 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5009, కనిష్టం రూ. 2729, సరాసరి రూ. 4809 ధరలు లభించాయి. అలాగే, 377 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5802, కనిష్టం రూ. 5661, సరాసరి రూ. 5720 ధరలు పలికాయి. టన్ను చెరుకుకు రూ.6 వేల ధర ఇవ్వాలి అమరచింత: కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7వేల మద్దతు ధర ఇచ్చినట్లుగానే టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర ప్రకటించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ సంవత్సరం చెరుకు రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ ఇస్తున్న సబ్సిడీలను వచ్చే ఏడాది కూడా వర్తింపచేయాలని కోరారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతులతో కలిసి ఫ్యాక్టరీ జీఎం వీపీ రామరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం వినతి మేరకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు పంటలపై సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను 2026–2027 సీజన్లో కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేల మద్దతు ధరను ఇవ్వాలన్నారు. చెరుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను ముందస్తుగా రప్పించి, పంట కోతలు పూర్తి చేసి వెంటనే డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, సబ్సిడీలను వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ జీఎం హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభం ఘనం.. సేవలు శూన్యం
రూ.17 కోట్లతో జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ● రెండేళ్లు కావస్తున్నా అందుబాటులోకి రాని వైనం ● షాపులకు డిపాజిట్లు సరిగ్గా లేకపోవడంతో ఆగిన ప్రక్రియ అందుబాటులోకి ఎప్పుడో? నిర్మాణం పూర్తి అయి, ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ ఈమార్కెట్ దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అప్పటి అడిషనల్ కలెక్టర్ అధికారులతో కలిసి మార్కెట్ను సందర్శించారు. అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు కూరగాయల, ఫ్రూట్ ,మటన్, చికెన్, ఫిష్ వ్యాపారుల అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. మార్కెట్లో ఉన్న సౌకర్యాలను చూపించారు. వ్యాపారులు, వీధి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. తరువాత షాపులకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేశారు. అయితే షాపుల కేటాయింపులో అవలంభించిన రిజర్వేషన్లు, అదేవిధంగా షాపులకు సంబంధించి వచ్చిన డిపాజిట్లు కూడా అనుకున్నంతమేర రాలేదు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి తీసుకరావడానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కూరగాయలు, నిత్యవసర సరుకులు, మటన్, ఫిష్, చికెన్ ఇలా అన్ని ఒకే చోట వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ మార్కెట్ అందుబాటులోకి వస్తేనే సాధ్యపడతాయి. ఇప్పటికై నా అధికారులు త్వరతితగిన నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి రూ.కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాల్సి ఆవశ్యకత ఉంది. గద్వాల: రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా.. నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లా కేంద్రం గద్వాల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ (సమీకృత) మార్కెట్ ఇక్కడి ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. ఈమార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యవసాయ మార్కెట్యార్డు ఖాళీ స్థలంలో 2.30 ఎకరాల్లో అధునాతనంగా దాదాపు రూ.17 కోట్లతో మార్కెట్ నిర్మించారు కానీ, అందుబాటులోకి తీసుకరావడంలో ఇక్కడి అధికారులు విఫలమవుతున్నారు. అన్ని ఒకేచోట గద్వాల పట్టణం జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల కోసం చాలా మంది పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. పట్టణం నలువైపులా విస్తరిస్తోంది. ఈక్రమంలో ప్రజలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై పాలకులు, అధికారులు దృష్టి సారించారు. పట్టణంలో ఉన్న మటన్, ఫిష్ మార్కెట్లు చిన్నవిగా ఉన్నాయి. కూరగాయల మార్కెట్ పెద్దదిగా ఉన్న అది కూడా ఒక్కటే ఉన్నది. అన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మార్కెట్యార్డు ఆవరణలో 2.30 ఎకరాల స్థలంలో స్టేట్ డెవలెప్మెంట్ ఫండ్ దాదాపు రూ.17 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు. 2021 సెప్టెంబర్ 14న శంకుస్థాపన అయిన మార్కెట్ను గడిచిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ప్రారంభించారు. -
అధునాతన హంగులతో..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అధునాతనంగా నిర్మించారు. విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు బ్లాక్ వైస్గా వెజ్, నాన్వెజ్, సూపర్మార్కెట్, కమర్షియల్ దుకాణాలను వేరువేరుగా నిర్మాణం చేశారు. అడ్మిన్ కార్యాలయం సైతం ఏర్పాటు చేశారు. వెజ్ బ్లాక్లోని దుకాణాల్లో కూరగాయల గంపలు పెట్టడానికి స్టెప్ వైజ్గా కట్టారు. ఇక నాన్వెజ్కు సంబందించి మటన్, ఫిష్, చికెన్ దుకాణాల్లో ప్రతి దుకాణంలో నాన్వెజ్ను శుభ్రం చేసేందుకు నీటి సౌకర్యంతో సింక్ను, తగిలించేందుకు ప్రత్యేకంగా స్టీల్ రాడ్లను ఏర్పాటు చేశారు. నాన్వెజ్ బ్లాక్లో దుకాణాలు -
ఇప్పటికే ఆలస్యమైంది..
విత్తనాలు విత్తేందుకు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. సబ్సిడీపై విత్తనాలు ఇస్తారనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే అధికారులు కాలయాపన చేస్తున్నారు. వెంటనే విత్తనాలు ఇస్తే విత్తుకుంటాం. – గోవిందు, రైతు, రాజాపురం పదును పోతుంది ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంట సాగు కోసం పొలాన్ని సిద్ధం చేసుకున్నాం. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా విత్తనాలు ఇవ్వలేదు. వెంటనే విత్తనాలు పంపిణీ చేయాలి. – కాశిమన్న, రైతు, ఎక్లాస్పురం ● -
అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం
అలంపూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. అలంపూర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కై వలం చేసుకుంటుందన్నారు. బీజేపీ నుంచి పోటీదారులు అధికంగా ఉన్నారని, ఒక్కో స్థానానికి కనీసం ఐదుగురు పోటీదారులు ఉండటం సంతోషమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని, వారి పథకాలను చూసి ప్రస్తుతం ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కుటుంబ అవినీతి తప్ప ప్రజలకు మేలు చేయలేదన్నారు. అందుకే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులకే ఓటు వేస్తారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు కావాల్సిన వస్తు సేవలు దసరా కానుకగా పూర్తిగా తగ్గించిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చినవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగమల్లయ్య, నాగేశ్వర్ రెడ్డి, రాజగోపాల్, వినీత్ కుమార్, రంగస్వామి, సుధాకర్, రవికుమార్, లక్ష్మన్ నాయుడు, సాయిబాబ, దానారెడ్డి, రాఘవేంద్ర, జగన్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
తప్పుల తడక..
● మృతిచెందిన, ఉద్యోగ విరమణ చేసిన వారికి డ్యూటీలు ● ఎన్నికల విధుల్లో బయటపడిన అధికార యంత్రాంగ డొల్లతనం గద్వాలటౌన్: ఎన్నికల నిర్వహణకు ముందే అధికార యంత్రాంగం డొల్లతనం బయటపడుతోంది. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ తయారు చేసిన జాబితాలు తప్పుల తడకగా మారాయి. చనిపోయిన వారికి, ఉద్యోగ విరమణ పొందిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి, నెల రోజుల వ్యవధిలో పదవీ విరమణ పొందుతున్న వారికి చోటు కల్పించారు. ఇలా ఇష్టారాజ్యంగా, నిర్లక్ష్యంగా జాబితాలు రూపొందంచడంపై విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఆర్ఓలు, పీఆర్ఓలుగా ఉపాధ్యాయులను నియమించిన అధికారులు వారికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు హాజరు కావాలని జాబితా విడుదల చేశారు. సోమవారం ప్రిసైడింగ్ అధికారులకు ఆయా మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణకు హాజరైన క్రమంలో ఉపాధ్యాయులు జాబితాలో ఉన్న తప్పులను గుర్తించారు. జాబితాలో తప్పులు దొర్లడం, సీనియర్లకు బదులు జూనియర్లకు పైస్థాయి హోదా కలిగిన బాధ్యతలు అప్పగించడం మరింత చర్చనీయాంశంగా మారుతోంది. జాబితాలో దొర్లిన తప్పులపై పలువురు ఉపాధ్యాయులు ఎంపీడీఓలతో వాదనకు దిగడంతో సరిచేస్తామని హామీఇచ్చారు. మచ్చుకు కొన్ని... ● కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న హుస్సేని రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు కేటీదొడ్డి మండలంలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఉత్తర్వులు జారీ కావడంపై ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● గద్వాల మండలం గోనుపాడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం శేషయ్య గత నెల పదవీ విరమణ పొందారు. ఆయనకు పీఓగా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా పదవీ విరమణ చెందిన మరికొందరికి ఎన్నికల విధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● కేటీదొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అలాగే, గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల జీహెచ్ఎం వెంకటనర్సయ్య డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆరు నెలల లోపు పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయినా వారికి ఎన్నికల విధులు కేటాయించారు. జిల్లాలో చాలా చోట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎంకు పీఓగా నియమిస్తే.. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఆయన కంటే పైస్థాయి ఆర్ఓ బాధ్యతలు అప్పగించారు. ఇలా జాబితాలో చోటు చేసుకున్న తప్పులపై ఉపాధ్యాయులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. తప్పులను సరిదిద్దే పనిలో ఎంపీడీఓలు ఉన్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించారు!
● వేరుశనగ విత్తనాలు ఉచితంగా ఇస్తామని హామీ ● జిల్లాలో ప్రారంభంకాని సబ్సిడీ విత్తనాల పంపిణీ ● సాంకేతిక సమస్యలతో అడ్డంకులు ● సాగుకు ఆలస్యం అవుతుందని రైతుల ఆందోళన అయిజ: దేశ వ్యాప్తంగా ‘నేషనల్ మిషన్ ఎన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్ఎంఈఓ– ఓఎస్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో వేరుశనగ విత్తనాలపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లాలోని అయిజ, ఇటిక్యాల, గట్టు మండలాల రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీఓ), వ్యవసాయ అధికారులు కలిసి ఉచితంగా వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తామని ప్రకటించినా సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఏఈఓలకు శిక్షణ ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. సాగుకు ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎదురుచూపులు.. అయిజలో సెప్టెంబర్ 27న ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా వేరుశనుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. సెప్టెంబర్ 30న రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 29న రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఎఫ్పీఓ) కార్యాలయం వద్ద టోకెన్లు తీసుకునేందుకు రైతులు వెళ్లగా ఇవ్వలేదు. సెప్టెంబర్ 30న టోకెన్లు, విత్తనాలు ఒకేసారి ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆ మరుసటి రోజు ఎఫ్పీఓ కార్యాలయంవద్ద టోకెన్లు రాయించుకొని, రైతు వేదిక భవనం వద్దకు వెళ్లారు. అయితే ఏఈఓలకు యాప్ డౌన్లోడ్ కావడం లేదని, ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వలేదని తెలిపారు. వారంరోజుల అనంతరం విత్తనాలు ఇస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందారు. ఇటీవల సరైన వర్షాలు కురిసాయని, ఆలస్యం అయితే పదును ఆరిపోతుందని, పొలంలో గడ్డి మెలుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన వేరుశనగ విత్తనాల వివరాలిలా.. మండలం రకం క్వింటాళ్లు అయిజ జీజేజీ–32 587.20 ’’ ’’ గిరినార్ – 5 150 ఇటిక్యాల జీజేజీ –32 582 ’’ ’’ గిరినార్ – 5 150 గట్టు జీజేజీ – 32 587 ’’ ’’ గిరినార్ – 5 150 సాంకేతిక సమస్యలతోనే.. విత్తనాలు ఇవ్వలేకపోవడానికి సాంకేతిక కారణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏఈఓల ఫోన్లలో యాప్లు డౌన్లోడ్ కావడంలేదు. శిక్షణ ఇవ్వనిదే ఏఈఓలు ప్రక్రియను పూర్తి చేయలేమంటున్నారు. పూర్తి స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకొని విత్తనాలు పంపిణీ చేస్తాం. – జనార్ధన్, ఏఓ త్వరలో పంపిణీ చేస్తాం జిల్లాలోని మూడు మండలాల్లో రైతులకు ఉచితంగా వేరుశనుగ విత్తనాల పంపిణీ చేయాల్సి ఉంది. త్వరగా పంపిణీ చేయాలని ఏఓలకు ఇంతవరకే సూచించాను. పంపిణీ చేయలేదనే విషయం నాకు తెలియదు. త్వరగా పంపిణీ చేసేలా ఆదేశిస్తా. – సక్రియానాయక్, డీఏఓ -
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతధికారుల సూచనలను ప్రజలు గుర్తించాలి. సులువుగా డబ్బు లు వస్తున్నాయంటేనే మోసం చేయడానికి అవతలి వారు వేస్తున్న వల అని నమ్మాలి. ఇప్పటి వరకు నమోదైన సైబర్ కేసుల విషయంలో విచారణ జరుగుతుంది. సైబర్ మోసాలపై ప్రజలకు అవగహన సదస్సులు నిర్వహించి వారిని చైతన్యం దిశగా తీసుకువస్తున్నాం. అనధికారిక యాప్లు, ప్లాట్ఫాంలలో పెట్టుబడి పెట్టొద్దు. టెలిగ్రామ్, వాట్సాప్ ఇతర సామాజిక మాద్యమాల్లో వచ్చే సందేశాలు లేదా లింక్లను ఓపెన్ చేయరాదు. – శ్రీనివాసరావు, ఎస్పీ -
న్యాయఫలాలు అందరికీ అందాలి
● వనపర్తిలో రూ.81 కోట్లతో న్యాయస్థానాల సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన ● వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్కుమార్సింగ్ వనపర్తి టౌన్: న్యాయసేవలు సామాన్యుల దరి చేరేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్సింగ్ అన్నారు. ఆదివారం వనపర్తిలోని వైద్యకళాశాల సమీపంలో రూ.81 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో కోర్టు సముదాయం నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి, జస్టిస్ అనిల్ జూకంటి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయవాదులు కక్షిదారులకు న్యాయ ఫలాలు చేరువ చేసేందుకు తగిన చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై బలమైన విశ్వాసం ఉందని.. దానిని పదిలపర్చడంలో న్యాయవాదులు ముందుండాలన్నారు. మెరుగైన వసతులతో కూడిన న్యాయస్థానాల ద్వారా అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ అనిల్కుమార్ జూకంటిి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడానికి మౌలిక వసతుల ఏర్పాటు అవసరమన్నారు. జస్టిస్ మాధవి మాట్లాడుతూ తాను ఉమ్మడి పాలమూరు జిల్లా ఆడబిడ్డనే అని చెబుతూ, వనపర్తిలో సంస్థానాధీశుల కాలం నుంచే న్యాయస్థానాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలు అందించే వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. అంతకు ముందు జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు ఆర్అండ్బీ అతిథిగృహంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ పూలమొక్కలు అందజేసి సాధారంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి, తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున, వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీపీ కిరణ్కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఆకుతోటపల్లి వరకు ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆకుతోటపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం జరిగితే హైదరాబాద్– శ్రీశైలం మధ్య సుమారు 40 కి.మీ., దూరం తగ్గుతుంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలు
వనపర్తి రూరల్: కమ్యూనిస్టు ఉద్యమాలను నిర్మించడంలో, వాటిని కొనసాగించడంలో, భావితరాలకు ఉద్యమాల బాట వేయడంలో పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలుగా తయారయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాలలో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అధ్యక్షతన పుట్టా వరలక్ష్మి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పలువురు రాష్ట్ర ,కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ వరలక్ష్మి విద్యార్థి దశ నుంచే ఉద్యమ బాటపట్టి విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న పుట్టా ఆంజనేయులుకు తోడునీడగా ఉండేందుకు నిర్ణయించుకొని జీవిత సహచరి కావడం గొప్ప విషయమన్నారు. వందలాది మంది మహిళలు లక్ష్మీదేవమ్మ, వరలక్ష్మిలుగా తయారు కావాలని ఆకాంక్షించారు. -
సేవా దృక్పథం అలవర్చుకోవాలి
గద్వాలటౌన్ : విద్యార్థులకు చదువుతో పాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరన్న పేర్కొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1, 2 ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని గుంటిపల్లి, కొత్తపల్లి గ్రామాలలో స్పెషల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండే సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలను పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలపై చైతన్యం కలిగించాలన్నారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు పవన్కుమార్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.యువతి మృతికి కారకుడిని అరెస్టు చేయాలిగద్వాల: ప్రేమపేరుతో మోసం చేసి యువతి మృతికి కారకులైన చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్గౌడ్ను వెంటనే అరెస్టు చేయాలని దళిత, ప్రజాల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్మృతివనంలో విలేకరులతో మాట్లాడారు. గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్గౌడ్, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంకను ప్రేమిస్తున్నా అని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరువాత మోసం చేశాడని, దీనిపై గతంలోనే ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఈమేరకు చీటింగ్ కేసు నమోదు కాగా రఘునాథ్గౌడ్ జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రియాంక రఘునాథ్గౌడ్ ఇంట్లోనే నివసిస్తుందన్నారు. ఇదిలా ఉండగా పెళ్లికి నిరాకరిచండంతో రెండు రోజుల కిందట పురుగు మందు తాగి ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. ఈకేసులో నిందితుడిని గతంలోనే కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంక ఆత్మహత్య చేసుకుని ఉండేది కాదన్నారు. ఇప్పటికై న పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, రాజు, సునందం, ప్రవీణ్, వేమన్న సాదతుల్లా పాల్గొన్నారు.కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిరాజోళి: కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే హవా అని బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాజోళిలో మండల అధ్యక్షుడు శశికుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెజార్టీ స్థానాల్లో బీజేపి గెలుపు తథ్యమని, మిగతా రెండు పార్టీలు కలిసినా బీజేపి మెజార్టీకి దరిదాపులకు రాలేవని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కారు చేత కాని పాలనలో ప్రజలు, గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలకు చరమ గీతం పాడిన ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే దైర్యం కూడా చేయలేదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలలను మోసం చేసిన గత పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని, వీటిని ప్రజలకు వివరించాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ రెడ్డి,నర్సింహులు,ఈసీ అంజనేయులు,రాజేష్, కొంకతి రాము,దస్తగిరి, బీమన్న,మధు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టంమదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికిపైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. అలాగే జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 757 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు.


