75% మున్సిపాలిటీలు గెల్చుకుంటాం
కొల్లాపూర్: రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొల్లాపూర్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆ మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీని క్లీన్స్వీప్ చేస్తామన్నారు. గత పాలకుల అవినీతికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కాంగ్రెస్దే పై చేయిగా నిలుస్తుందన్నారు.


